Web counseling
-
యూజీ ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: యూజీ ఆయుష్ వైద్య విద్య సీట్ల భర్తీకి రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్ ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి– యోగా (బీఎన్వైసీ) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ నెల 16 ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 6గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసు కోవాలని, తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. అయితే అఖిల భారత కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్ వర్సిటీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్కు అనర్హులని పేర్కొంది. మరింత వివరాలకు www.knruhs.telangana.gov.in¯ను చూడాలని వెల్లడించింది. -
AP: గుడ్న్యూస్.. టీచర్ల బదిలీలకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ శనివారం ఈ మేరకు జీఓ–187ను విడుదల చేశారు. ఈనెల 12 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. వివిధ దశల అనంతరం 2023 జనవరి 12న టీచర్లకు బదిలీ ఉత్తర్వులు విడుదలవుతాయి. 2021–2022 విద్యా సంవత్సరం నాటికి ఒకే పాఠశాలలో ఐదేళ్ల సర్వీసును పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–2) ఎనిమిది విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. అలాగే విధివిధానాల్లోని ముఖ్యాంశాలు ఏమిటంటే.. – 2024 ఆగస్టు 31 లేదా అంతకు రెండేళ్లలోపు పదవీ విరమణ చేయబోయే వారిని వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. – బదిలీ దరఖాస్తుకు ఎలాంటి సర్వీసు నిబంధన లేదు. – 2022 ఆగస్టు 31 నాటికి 50 ఏళ్లలోపు వయసున్న బాలికల హైస్కూల్లోని పురుష హెచ్ఎం టీచర్లకు బదిలీ తప్పనిసరి. – బాలికల ఉన్నత పాఠశాలల్లో పనిచేయడానికి మహిళా ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–2), ఉపాధ్యాయులు అందుబాటులో లేకుంటే 50 ఏళ్లు దాటిన పురుష హెచ్ఎంలు, టీచర్లను పరిగణనలోకి తీసుకుంటారు. – విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. – దృష్టిలోపం ఉన్న ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. 80 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ టీచర్లకు కూడా బదిలీల నుండి మినహాయింపు ఉంది. అయితే, అటువంటి ఉపాధ్యాయులు బదిలీని కోరుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. – పేరెంట్ మేనేజ్మెంట్కి వెళ్లాలని కోరుకునే వారు ఆ మేనేజ్మెంట్లో అందుబాటులో ఉన్న ఖాళీలకు మాత్రమే బదిలీని ఎంచుకోవాలి. – ఏజెన్సీ మైదాన ప్రాంతాల వారికి బదిలీ అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భర్తీకాకపోతే ఇతర ప్రాంతంలోని జూనియర్ మోస్ట్ మిగులు టీచర్లను బదిలీ కౌన్సెలింగ్ తర్వాత తాత్కాలికంగా నియమిస్తారు. ఆన్లైన్లో బదిలీల కౌన్సెలింగ్ బదిలీలు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతాయి. గతంలో ఉన్న పాత జిల్లాలను జిల్లాగా పరిగణించాలి. ప్రతి జిల్లా, జోన్లో ఏర్పాటుచేసిన కమిటీల ఆమోదంతో విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులు జారీచేస్తుంది. హెచ్ఎం, టీచర్ల వెబ్అప్షన్ల ఆధారంగా బదిలీ పోస్టింగ్ ఆర్డర్లను జారీచేస్తారు. బదిలీల కోసం పాయింట్లను గణించేందుకు కమిటీ నివాసాల జాబితాను కొత్తగా ప్రకటిస్తుంది. మెరిట్, సర్వీసు, ప్రత్యేక పాయింట్ల కేటాయింపు, మినహాయింపు వంటి అంశాలను జీఓలో వివరంగా పొందుపరిచారు. అంతేకాక.. 2022 నవంబర్ 30 నాటికి అన్ని ఖాళీలను కౌన్సెలింగ్లోకి తీసుకుంటారు. నిర్బంధ బదిలీల కారణంగా ఏర్పడే అన్ని ఖాళీలు, కౌన్సెలింగ్ సమయంలో అయ్యే ఖాళీల్లోకి బదిలీలు ఉంటాయి. అడహక్ ప్రాతిపదికన పదోన్నతిపై కేటాయించిన హెచ్ఎంలు, టీచర్ల స్థానాలు ఖాళీగా చూపిస్తారు. ఏడాదికి పైగా అధికారికంగా లేదా అనధికారికంగా రాని వారి స్థానాలు ఖాళీలుగా పరిగణిస్తారు. ప్రసూతి సెలవులు, వైద్య సెలవులు లేదా సస్పెన్షన్లో ఉన్న వారి ఖాళీలను కౌన్సెలింగ్లో చూపించరు. నాలుగు వారాలకు మించి ఖాళీగా ఉంటే పని సర్దుబాటు ద్వారా వాటిని భర్తీచేయాలి. పూర్వపు జిల్లాల్లో మంజూరు పోస్టుల్లో భర్తీ అయినవి కాకుండా మిగిలిన పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ఖాళీలు, సీనియారిటీ జాబితాలను కౌన్సెలింగ్ వెబ్సైట్లో సంబంధిత జిల్లాల వెబ్సైట్లో కూడా పొందుపరుస్తారు. వెబ్ కౌన్సెలింగ్కు ఆన్లైన్లోనే దరఖాస్తులు.. – ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్దేశిత వెబ్సైట్ ద్వారా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇలా అందిన దరఖాస్తులను మాత్రమే బదిలీకి పరిగణిస్తారు. – ఆన్లైన్ సమర్పించాక దరఖాస్తుదారులు నిర్దిష్ట వెబ్సైట్ నుండి అప్లికేషన్ ప్రింట్ను తీసుకోవాలి. – వాటిపై సంతకంచేసి మండల విద్యాధికారి, హైస్కూల్ హెడ్మాస్టర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు అందజేయాలి. – దరఖాస్తుల స్వీకరణ తర్వాత, సంబంధిత అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాలను ప్రదర్శించాలి. – అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించాలి. అవి పరిష్కరించిన తర్వాత, అధికార వెబ్సైట్లో తుది సీనియారిటీని ఎన్టైటిల్మెంట్ పాయింట్లతో చూపించాలి. – తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు అన్ని అప్షన్లను ఎంచుకోవాలి. ఇలాంటి హెచ్ఎం, టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకపోతే 3, 4 కేటగిరీల్లోని పాఠశాలల్లో ఉన్న ఖాళీలకు బదిలీచేస్తారు. – దరఖాస్తు చేసి ఆపై వారికి సమర్పించకపోతే, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఆన్లైన్లో రూపొందించిన తుది జాబితాల ఆధారంగా సంబంధిత కమిటీల ఆమోదంతో బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు ఇక కమిటీ ఆమోదంతో బదిలీ ఉత్తర్వులు జారీచేసిన తర్వాత, కమిటీ కాంపిటెంట్ అథారిటీ ఆర్డర్లను సమీక్షించడం, సవరించడానికి వీల్లేదు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల ఫలితాలకు లోబడి ఉత్తర్వుల్లో షరతును చేర్చాలి. బదిలీ ఆర్డర్లు అందిన తర్వాత ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశం నుండి తక్షణమే రిలీవ్ అవుతారు. తదుపరి తేదీన వారు కొత్త పాఠశాల్లో చేరాలి. పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు (సబ్జెక్ట్ టీచర్లతో సహా) పనిచేస్తూ బదిలీని పొందినట్లయితే, ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయరాదు. అలాగే, ఇతర స్థానాల విషయంలో కూడా ప్రత్యామ్నాయం తర్వాతే రిలీవ్ చేస్తారు. తప్పుడు సమాచారమిచ్చి, మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్తో పాటు క్రమశిక్షణా చర్యలు తప్పవు. తప్పుడు సమాచారంపై సంతకం చేసిన హెచ్ఎం ఇతర అధికారులపైనా ఇవే చర్యలు ఉంటాయి. బదిలీ ఉత్తర్వులు అందిన అనంతరం ఎటువంటి ఆలస్యం లేకుండా పోస్టింగ్ స్థానంలో చేరాలి. అనధికారికంగా గైర్హాజరైతే మార్గదర్శకాల ప్రకారం క్రమశిక్షణా చర్యతో పాటు ‘నో వర్క్ నో పే’ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీల షెడ్యూల్ ఇలా.. – ఖాళీల వివరాలు వెబ్సైట్లో ప్రదర్శన : డిసెంబర్ 12, 13 – బదిలీలకు దరఖాస్తు : డిసెంబర్ 14 నుండి 17 వరకు – దరఖాస్తుల వెరిఫికేషన్ : డిసెంబర్ 18, 19 – సీనియారిటీ జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల అప్లోడ్ : డిసెంబర్ 20 నుండి 22 వరకు – అభ్యంతరాల పరిశీలన, ఫైనల్ చేయడం : డిసెంబర్ 23, 24 – ఫైనల్ సీనియారిటీ జాబితాల ప్రదర్శన : డిసెంబర్ 26 – వెబ్ఆప్షన్లు : డిసెంబర్ 27 నుండి జనవరి 1 వరకు – బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు : జనవరి 2 నుండి 10 వరకు – కేటాయింపులో తేడాలుంటే అభ్యంతరాలు : జనవరి 11 – బదిలీ ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకోవడం : జనవరి 12 -
పీజీ వైద్య విద్య సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజి హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు ఆదివారం రెండో విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉన్న యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీ ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ లో పొందుపరిచారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.inలో చూడా లని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో సూచించాయి. -
‘ప్రవేశ పరీక్ష రాయకున్నా పీజీ ప్రవేశాలు’
ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్సీపీజీఈటీ–2021 మూడు విడతల వెబ్ కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లను ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు భర్తీ చేసుకోవాలని కన్వీనియర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శనివారం పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు వివిధ పీజీ కోర్సుల సీట్లను భర్తీ చేసి 14న ఓయూలోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ప్రవేశ పరీక్షను రాయని అభ్యర్థులు, సీపీజీఈటీ–2021లో అర్హత సాధించని విద్యార్థులకు సైతం పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించవచ్చని తెలిపారు. -
550, 111 జీవోలకు సవరణ
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాసంస్థల్లోని సీట్ల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు 550, 111లను సవరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన జీవోల్లోని నిబంధనలపై స్పష్టత ఇస్తూ, ఎలాంటి సందేహాలకు తావులేకుండా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఆయా సీట్లను మెరిట్ ప్రకారం భర్తీ చేసేలా తాజాగా సవరణలు ఉత్తర్వులు జారీచేశారు. వీటి ప్రకారం... ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి స్లైడింగ్తో వేరే కాలేజీలో సీటు పొందితే ఖాళీ అయ్యే ఓపెన్ కేటగిరీ సీటును మెరిట్ ప్రకారం అదే రిజర్వుడ్ వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ చేస్తారు. ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి స్లైడింగ్ ద్వారా కేటాయింపు అయిన కాలేజీలోని సీటులో చేరని పక్షంలో ఖాళీ అయిన ఓపెన్ కేటగిరీ సీటును తిరిగి ఓపెన్ కేటగిరీగానే పరిగణిస్తారు. ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి ఖాళీచేసే సీటును పొందిన అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థి కూడా ఆ సీటులో జాయిన్ కాని పక్షంలో..అదే రిజర్వుడ్ వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ అయ్యేవరకు కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక వేర్వేరుగా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ఇలావుండగా కమిటీ చేసిన సిఫారసులతో మరికొన్ని ప్రతిపాదనలు కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అమల్లోకి తెస్తోంది. ► ఈసారి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్లు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీనికిముందు అన్నీ కలిపి చేయడం వల్ల ఒకింత గందరగోళానికి దారితీసేది. ► అభ్యర్థులు ప్రాధాన్యత ప్రకారం ఒకేసారి తమకు నచ్చినన్ని ఆప్షన్లు ఇచ్చుకొనేలా చేస్తున్నారు. తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఇవ్వరు. గతంలో ఆప్షన్లను పలుమార్లు మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ► ఈసారి ఒక కౌన్సెలింగ్లో సీటు వచ్చిన అభ్యర్థి దానిలో జాయినయినట్లు ఆన్లైన్ ద్వారా రిపోర్టు చేస్తేనే తదుపరి కౌన్సెలింగ్కు, స్లైడింగ్కు అనుమతిస్తారు. ► గతంలో ఒక కౌన్సెలింగ్లో కాలేజీలో సీటు వచ్చిన అభ్యర్థి అందులో జాయినయినట్లు ఆప్షన్ ఇవ్వకున్నా తదుపరి కౌన్సెలింగ్కు, స్లైడింగ్కు అవకాశముండేది అలా స్లైడింగ్లతో ఆప్షన్లు ఇస్తూ ఆ అభ్యర్థి చివరకు ఎక్కడా జాయిన్ కాకుంటే ఆ సీట్లు ఖాళీగా మేనేజ్మెంటుకు మిగిలేవి. చివరకు ఇదో పెద్ద అక్రమాల తంతుగా మారింది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ దీనికి కొంతవరకు అడ్డుకట్టవేసేలా జాయినింగ్ రిపోర్టును తప్పనిసరి చేస్తోంది. -
ఇంజనీరింగ్లో 45 రకాల కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్లో భాగంగా వెబ్ ఆప్షనకు ఆదివారం అర్ధరాత్రి నుంచే అవకాశం కలి్పంచేలా ఏర్పాట్లు చేసినా, సాంకేతిక కారణాలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల తరువాత మొదలైంది. ఈనెల 20తో సరి్టఫికెట్ల వెరిఫికేషన్, 22తో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసేలా, 24న సీట్ల కేటాయింపును ప్రకటించేలా అధికారులు ఇదివరకే షెడ్యూలు జారీ చేశారు. ఇక సోమవారం సాయంత్రం వరకు 57,530 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 51,880 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారు. వారిలో 10,032 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కోర్సుల వివరాల్లో పలు మార్పులు, చేర్పుల తరువాత కనీ్వనర్ కోటాలో 72,998 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఇంజనీరింగ్లో 69,116, ఫార్మసీలో 3,882 సీట్లున్నట్లు ప్రవేశాలు కమిటీ వెల్లడించింది. ఇంజనీరింగ్లో 45 రకాల కోర్సులను అనుమతించగా, ఫార్మసీలో రెండు కోర్సులను అనుమతించింది. కొత్త కోర్సులు, ప్రధాన బ్రాంచీల్లోని సీట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 126 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ 168, సీఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెరి్నంగ్) 5,310, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ 126, కంప్యూటర్ ఇంజనీరింగ్ 42, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 252, సీఎస్ఈ(సైబర్ సెక్యూరిటీ) 1,806, సీఎస్ఈ (డాటా సైన్స్) – 3,213, సీఎస్ఐటీ 336, సీఎస్ఈ (నెట్ వర్క్స్) 126, సీఎస్ఈ (ఐవోటీ) 1,281, కంప్యూటర్ ఇంజనీరింగ్ 210, సీఎస్ఈ 16,681, ఈసీఈ 13,397, సివిల్ 6,378, ఈఈఈ 6,907, ఐటీ 4,650, మెకానికల్ 5,980, మైనింగ్ 328 సీట్లు. -
టీచర్ల బదిలీలకు ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలను ఖరారుచేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేడ్–2 హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, తత్సమాన కేటగిరీల టీచర్లు ఈ బదిలీల పరిధిలోకి వస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జీవో–54 విడుదల చేశారు. దీంతోపాటు ఆయా పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు సంబంధించి కూడా ప్రభుత్వం జీవో–53ని జారీచేసింది. బదిలీలు ఆన్లైన్లో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేయనున్నారు. ఈ ఉత్తర్వులు రావడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బదిలీల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇతర యాజమాన్యాల స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆయా విభాగాలు షెడ్యూల్ ఇవ్వనున్నాయి. మార్గదర్శకాలు ఇలా.. – 2019–20 విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయిన టీచర్లకు, 5 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన గ్రేడ్–2 హెడ్మాస్టర్లకు బదిలీ తప్పనిసరి. ఏడాదిలో సగం రోజులు పూర్తి చేసినా పూర్తి ఏడాదిగానే పరిగణిస్తారు. – అక్టోబర్ ఒకటి నుంచి రెండేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి వారు కోరుకుంటే తప్ప బదిలీ ఉండదు. – బాలికోన్నత పాఠశాలల్లో పనిచేస్తూ అక్టోబర్ 1 నాటికి 50 ఏళ్లలోపు వయసున్న పురుష టీచర్లకు బదిలీ తప్పనిసరి. – అంధులైన టీచర్లను బదిలీల నుంచి మినహాయించారు. వారు కోరుకుంటే బదిలీ చేయవచ్చు. – టీచర్ల బదిలీలకు 85 ఎన్టైటిల్మెంట్ పాయింట్లను ఖరారు చేశారు. కామన్ పాయింట్ల కింద 55, స్పెషల్ పాయింట్ల కింద 25, రీ అపోర్షన్ పాయింట్ల కింద 5గా నిర్ణయించారు. – ప్రిఫరెన్షియల్ కేటగిరీల కింద దివ్యాంగులు, భర్త నుంచి విడిపోయిన వారు, భర్త చనిపోయిన వారికి ఎన్టైటిల్మెంటు పాయింట్లతో సంబంధం లేకుండా సీనియార్టీలో ప్రాధాన్యతనిస్తారు. – తప్పుడు ధ్రువపత్రాలిచ్చే వారిపై.. వాటిని పరిశీలించకుండా కౌంటర్ సంతకం చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. – ఉత్తర్వులు అందుకున్నాక ఎవరైనా అనధికారికంగా గైర్హాజరైతే వారికి నో వర్క్ నో పే అమలుచేస్తారు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఇలా.. టీచర్ల సర్దుబాటుకు సంబంధించి కేటగిరీల వారీగా పిల్లల సంఖ్యను అనుసరించి టీచర్ల సంఖ్యను నిర్ధారించారు. – ప్రాథమిక పాఠశాలల్లో 151–200 విద్యార్థులుంటే ఒక హెచ్ఎం, 5గురు ఎస్జీటీలు.. – 121–150 వరకు ఐదుగురు ఎస్జీటీలు.. – 91–120 వరకు నలుగురు ఎస్జీటీలు.. – 61–90 వరకు ముగ్గురు ఎస్జీటీలు.. – 60 వరకు అయితే ఇద్దరు ఎస్జీటీలు.. – 200పైన ప్రతి 40 మంది విద్యార్థులకు అదనంగా ఒక ఎస్జీటీని నియమిస్తారు. -
స్పెషలిస్టు వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్లో అసంతృప్తితో ఉన్న స్పెషలిస్టు వైద్యులకు ప్రత్యేకంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సెలింగ్ శుక్రవారమే మొదలైందని వైద్య విధాన పరిషత్ వర్గాలు తెలిపాయి. 3 నెలల కిందట 919 మంది స్పెషలిస్టు వైద్యులను వైద్య విధాన పరిషత్ నియమించింది. అయితే అందులో 500 మందికి మించి విధులకు రావ డం లేదన్న విమర్శలు వచ్చాయి. మిగిలిన వారిలో కొందరు విధులకు డుమ్మా కొడుతుండగా, 128 మంది దూరాభారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్న పరిస్థితి నెలకొంది. విధులకు వెళ్లకుండా అసంతృప్తితో ఉన్న వారిని మళ్లీ దారి లో పెట్టాలని సర్కారు వెబ్ కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేసింది. నచ్చిన చోట ఇవ్వలేదని: వైద్య విధాన పరిషత్లో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులను 31 జిల్లా ఆస్పత్రులు, 22 ఏరియా ఆస్పత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్లోని 14 ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో భర్తీ చేశారు. ఆన్లైన్ ద్వారా ఆర్థోపెడిక్, రేడియాలజీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పల్మనరీ, ఆప్తమాలజీ, సైకియాట్రిక్, ఎనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, జనరల్ సర్జన్స్, ఓబీజీ, పీడియాట్రిక్స్ పోస్టులను భర్తీ చేశారు. కొందరికి సుదూర ప్రాంతాలకు పోస్టింగ్లు ఇవ్వడంతో అసలు సమస్య మొదలైంది. సుదూర ప్రాంతాలకు భార్యాభర్తలను వేరు చేసేలా వేశారని కొందరు గగ్గోలు పెట్టారు. గతంలో ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల పరిధిలోని వైద్యుల భర్తీలోనూ ఇలాంటి సమస్యే ఏర్పడితే వాటిని మార్చేందుకు ప్రత్యేకంగా దరఖాస్తులను ఆహ్వానించారు. ఏకంగా 250 మంది వరకు తమకు ఇచ్చిన పోస్టింగ్లను మార్చాలని కోరారు. దీంతో వారికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లను ఖరారు చేశారు. అలాగే వైద్య విధాన పరిషత్లోనూ నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మంది వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. -
వైద్యుల నియామకం.. ఫలితం శూన్యం
సాక్షి, హైదరాబాద్: వైద్య విధాన పరిషత్లో స్పెషలిస్టు వైద్యుల భర్తీ మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది. మూడు నెలల కిందట 919 మందిని నియమిస్తే 500 మంది వరకు ఇప్పుడు విధులకు హాజరు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మిగిలిన వారిలో 128 మంది దూరా భారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్నారు. మరికొందరేమో విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో ఎంతో ఆశించి చేసిన స్పెషలిస్టుల భర్తీ ఆశాభంగం కలిగించింది. దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారితో పోస్టులు భర్తీ చేయాలనుకున్నా ఉన్నతస్థాయి నుంచి అనుమతి రాకపోవడంతో ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ నోటిఫికేషన్ జారీచేసిన తర్వాతే భర్తీ ప్రక్రియ జరుగుతుందని వైద్య విధాన పరిషత్ వర్గాలు చెబుతున్నాయి. ఇష్టమైన పోస్టింగ్ దక్కక.. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా వైద్య విధాన పరిషత్లో 919 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించిన సంగతి తెలిసిందే. 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్ నగరంలోని 14 ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో వైద్యులను భర్తీ చేశారు. ఆన్లైన్ ద్వారా ఆర్థోపెడిక్–47, రేడియాలజీ–50, డెర్మటాలజీ–20, ఫోరెన్సిక్–28, జనరల్ మెడిసిన్–68, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్–09, పల్మనరీ–39, ఆప్తమాలజీ–34, సైకియాట్రిక్–22, ఎనస్తీషియా–156, ఈఎన్టీ–17, పాథాలజీ–55, జనరల్ సర్జన్స్–78, ఓబీజీ–146, పీడియాట్రిక్స్–150 పోస్టులను భర్తీ చేశారు. వైద్యులకు వారి సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆసుపత్రుల్లోనే పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్లు ఇవ్వడంతో సమస్య మొదలైంది. అలాగే సుదూర ప్రాంతాలకు భార్యాభర్తలను వేరు చేసేలా వేశారని మరికొందరు గగ్గోలు పెట్టారు. ఇలా పోస్టింగులు ఇస్తే తమకు ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదని దాదాపు 128 మంది కొలువులను వదులుకోవడం ఉన్నతస్థాయిలో చర్చనీయాంశమైంది. వెబ్కౌన్సెలింగ్ కోసం విన్నపాలు.. కోర్టులో సమస్య ఉండటంతో ఆగమేఘాల మీద భర్తీ ప్రక్రియ జరిగింది. కాబట్టి అనేకమందికి అనుకున్నచోట ఉద్యోగం దక్కలేదు. ఇదే పరిస్థితి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల పరిధిలోని వైద్యుల భర్తీలోనూ జరిగితే వాటిని మార్చేందుకు ప్రత్యేకంగా దరఖాస్తులను ఆహ్వానించారు. ఏకంగా 250 మంది వరకు తమకు ఇచ్చిన పోస్టింగ్లను మార్చాలని కోరారు. వారికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లను ఖరారు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున వైద్యులకు ఉత్తర్వులు ఇవ్వలేదు. అలాగే వైద్య విధాన పరిషత్లోనూ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి వారిచ్చిన ఆప్షన్ల ప్రకారం స్పెషలిస్టు వైద్యుల పోస్టుల్లో మార్పులు చేయాలని పలువురు కోరుతున్నారు. దీనివల్ల పోస్టింగ్లలో వెసులుబాటు దొరికి విధులకు హాజరుకావడానికి వీలుంటుందని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. -
‘ఝలక్’ ఇచ్చిన ఉద్యోగులకు షాక్..!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులపై వేటు వేసేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేప ట్టింది. టీచర్ల వెబ్ కౌన్సెలింగ్లో జరిగిన పొరపాట్ల సర్దుబాటులో పలువురు టీచర్ల నుంచి విద్యా శాఖ అప్పీళ్లు స్వీకరించింది. ఈ అప్పీళ్లను పరిశీలించి కొన్నింటికి ఆమోదం తెలుపుతూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచా ర్య ఉత్తర్వులు జారీ చేశారు. దీని ఆధారంగా పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్కుమార్ బదిలీ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో కొందరు ఆర్జేడీ కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వం ఆమోదించిన అప్పీళ్లతోపాటు తిరస్కరించిన అప్పీళ్లనూ చొప్పి ంచారు. ఇలా దాదాపు 17 మంది టీచర్లకు అక్రమంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘ఉపాధ్యాయ బదిలీల్లో ఉన్నతాధికారులకు ఝలక్’అనే శీర్షికతో ఈ నెల 8న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేశారు. ముగ్గురికి నోటీసులు..: బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులకు ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఒక అసిస్టెంట్ డైరెక్టర్తోపాటు సెక్షన్ సూపరింటెండెంట్, క్లరికల్ ఉద్యోగి ఉన్నారు. వీరంతా వివరణ ఇవ్వాల్సిందిగా ఆమె ఆదేశించారు. ఈ క్రమ ంలో వారి నుంచి వివరణ తీసుకున్న అధికారులు ఆ ఫైలును పాఠశాల విద్యా శాఖ సంచాలకుల కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫైలు డైరెక్టర్ వద్ద పెండింగ్లో ఉంది. ఆయా ఉద్యోగులు ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తిరస్కరించిన అప్పీళ్లకు ప్రాంతీయ కార్యాలయంలో ఎలా ఆమోదించారనే అంశాన్నీ విద్యా శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. మొత్తంగా దసరా తర్వాత వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
నచ్చలేదని నొచ్చుకున్నారు..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్నే వదులుకోవడం వైద్య విధాన పరిషత్లో సంచలనం కలిగించింది. ఇష్టారాజ్యంగా పోస్టింగులు ఇవ్వడంతో తమకు ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదని దాదాపు 200 మంది కొలువులను వదులుకోవడం చర్చనీయాంశంమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వా లని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇష్టం వచ్చినట్లు ఎవరికి పోస్టింగులు ఇవ్వలేదని, గడువులోగా విధుల్లో చేరని వారం తా ఉద్యోగం కోల్పోయినట్లేనని వైద్య విధాన పరిషత్ స్పష్టం చేసింది. ఇటీవల తయారు చేసిన జాబితాలోని మిగిలిన వారితో ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు యోచిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కీలకమైన కంటి వెలుగు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు అధికారులకు ఇబ్బందికరంగా మారాయి. 700 మందే చేరిన వైనం.. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులను ఇటీవల నియమించారు. జూలై 6న ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి తర్వాత పోస్టింగ్లు ఇచ్చారు. పోస్టులు దక్కించుకున్న వారిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. కొందరి వైద్యులకు వారి సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆస్పత్రుల్లోనే పోస్టింగ్లు ఇచ్చారు. మరికొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్లు ఇవ్వడంతో సమస్య మొదలైంది. పైరవీలు చేయించుకున్న వారికి మంచి పోస్టింగులు దక్కాయని, మిగిలిన వారికి అన్యాయం జరిగిందని కొందరు విమర్శిస్తున్నారు. దీంతో తాము కావాలను కున్న చోటు దక్కలేదని 200 మంది స్పెషలిస్టు వైద్యు లు విధుల్లో చేరేందుకు నిరాకరించారు. జూలై 29నే ఉద్యోగంలో చేరే గడువు ముగిసింది. మరోవైపు చేరిన 700 మందిలో దాదాపు సగం మంది తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో విధులకు హాజరుకావడం లేదని సమాచారం. వైద్యులకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, ఆప్షన్లు ఇచ్చి పోస్టింగ్ కేటాయించి ఉంటే బాగుండేదన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.. ఇష్టారాజ్యంగా పోస్టింగ్లు ఇవ్వడంతో దాదాపు 200 మంది స్పెషలిస్టు వైద్యులు ఉద్యోగంలో చేరలేదు. వైద్యులకు నచ్చిన చోట పోస్టింగ్లు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగులు ఇవ్వాలి. – డాక్టర్ ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు జాబితాలోని ఇతరులకు ఇస్తాం.. చాలామంది స్పెషలిస్టు వైద్యులు విధుల్లో చేరలేదు. విధుల్లో చేరని వారంతా ఉద్యోగం కోల్పోయినట్లే. ప్రస్తుతం ఏం చేయాలన్న దాని పై ప్రభుత్వంతో చర్చిస్తాం. అవసరమైతే ఇటీవల తయారు చేసిన జాబితాలో మిగిలిన వారికి పోస్టింగ్ ఇస్తాం. – డాక్టర్ శివప్రసాద్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ -
ఎడిట్కు.. నోచాన్స్!
సాక్షి, హైదరాబాద్: బదిలీల్లో కీలకమైన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తోంది. ఆప్షన్ల ఎంపిక సమయంలో పొరపాట్లు తలెత్తితే వాటిని సవరించే వీలు లేకుండా విద్యాశాఖ నిబంధనలు విధించింది. దీంతో ఒకసారి ఆప్షన్లు ఇస్తే అదే చివరి అవకాశం కానుంది. వెబ్ కౌన్సెలింగ్లో కఠిన నిబంధనలు పెట్టడం మంచిదైనప్పటికీ.. విద్యాశాఖ మాటిమాటికీ మార్పులు చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు గందరగోళానికి గురవుతున్నాయి. స్పౌజ్ పాయింట్లున్న టీచర్లకు తొలుత పూర్తిస్థాయిలో ఆప్షన్లు కనిపించకపోగా.. తాజాగా జియోట్యాగింగ్ మార్పులతో ఆప్షన్లు ఎక్కువ కనిపించేలా విద్యాశాఖ సాంకేతికంగా మార్పులు చేసింది. దీంతో తొలిరోజు ఆప్షన్లు పెట్టుకున్న తమకు తీవ్ర నష్టం కలిగిందని పలువురు వాపోతున్నారు. ఈ అంశంపై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ సంచాలకునికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీనియార్టీ జాబితాలో మార్పులు, ఇతర అంశాల్లో సవరణ చేసేలా జిల్లా విద్యాశాఖ అధికారికి అధికారాలు ఇచ్చినట్లు విద్యాశాఖ ప్రకటించినా.. ఆ మేరకు డీఈవోలకు వెబ్సైట్లో వెసులుబాటు లేదు. దీంతో డీఈవోలను సంప్రదించినా రిక్తహస్తమే ఎదురవుతోంది. వరుస తప్పితే అంతే సంగతి.. ప్రస్తుతం ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్)ల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికే గెజిటెడ్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఆప్షన్ల నమోదు ముగిసింది. బదిలీల కోసం రాష్ట్రవ్యాప్తంగా 33,061 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,210 మంది తప్పనిసరి బదిలీ కానున్నారు. మరో 21,851 మంది ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో సాధారణ బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు.వెబ్ కౌన్సెలింగ్లో తప్పనిసరి బదిలీ కానున్న టీచర్లు జాబితాలో ఉన్న ఖాళీలన్నీ ఎంపిక చేసుకోవాలి. దీంతో వందల సంఖ్యలో ఆప్షన్లను ప్రాధాన్యతాక్రమంలో ఇవ్వాలి. ఈ క్రమంలో తేడా వస్తే బదిలీ ప్రక్రియ తల్లకిందులు కానుంది. దీంతో జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలి. సాధారణ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు సైతం ఎక్కువ సంఖ్యలో స్కూళ్లను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. ఖాళీల ప్రదర్శనలో గోప్యత.. మరోవైపు ఎస్జీటీ ఖాళీల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత బదిలీ ప్రక్రియలో జిల్లాలో ఉన్న పూర్తి ఖాళీలను విద్యాశాఖ ప్రకటించాలి. కానీ చాలాచోట్ల పట్టణ ప్రాంతాల్లోని ఖాళీలను జాబితాలో ప్రకటించకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిన తెలుగు మీడియం స్కూళ్లను తాజా జాబితాలో చూపడం లేదని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సరోత్తంరెడ్డి, జి.చెన్నకేశవరెడ్డి మండిపడుతున్నారు. కేటగిరీల వారీగా ఉన్న ఖాళీలన్నీ వేకెన్సీ జాబితాలో చూపాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.భుజంగరావు, జి.సదానంద్గౌడ్ బుధవారం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలసి వినతిపత్రం అందజేశారు. ఆప్షన్ల ఎంపిక తర్వాత మార్పులు చేసుకునే వీలుంటే ఇబ్బందులుండవని టీఆర్టీఎఫ్ గౌరవాధ్యక్షుడు ప్రతాప్రెడ్డి సూచించారు. ఎడిట్ అధికారాన్ని డీఈవోలకైనా ఇవ్వాలని టీటీయూ అధ్యక్ష, కార్యదర్శులు మణిపాల్రెడ్డి, నరసింహస్వామి ప్రభుత్వాన్ని కోరారు. -
సంఘాల అంగీకారం తర్వాతే వెబ్కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల సమ్మతి తీసుకున్న తర్వాతే చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన టీచర్ల బదిలీల అంశంపై మీడియాతో మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడికీ అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ చేపట్టిందన్నా రు. ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలకు అంగీకరించిన తర్వాతే ఈ విధానాన్ని అమలు చేశామన్నారు. వెబ్ కౌన్సెలింగ్లో లోపాలున్నాయని, ఈ విధానం వద్దని కొద్దిరోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం కోర్టులో పెండింగ్లో ఉన్నందున పదో న్నతులు ఇవ్వడం లేదని చెప్పారు. మేనేజ్మెంట్లవారీగా బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేద్దామని చెబితే ఉపాధ్యాయ జేఏసీలు అంగీకరించిన తర్వాతే జూన్ 6న జీవో 16ను తీసుకొచ్చామన్నారు. సీనియార్టీ విషయంలో కొంతమంది తప్పుడు పత్రాలు పెట్టా రని తెలిసిన వెంటనే వాటిని సరిదిద్ది తుది జాబితా వెల్లడించామన్నారు. ఉపాధ్యాయ జేఏసీలు చెప్పినట్లుగానే వేర్వేరుగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ వద్దని కొన్ని సంఘాలు అంటుండటం సరికాదన్నారు. కొందరు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించవద్దని కోర్టుకు వెళ్తున్నారని, ఇతర కారణాలతోనూ కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టులో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 26కి రిజర్వ్ చేశారని, ఈలోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేశామని, వెబ్ కౌన్సెలింగ్లో బదిలీల నిర్వహణను ప్రధానోపాధ్యాయుల సంఘం హర్షించిందన్నారు. వెబ్ కౌన్సె లింగ్ వద్దంటూ తన వ్యక్తిగత ఫోన్కు వేల మెస్సేజ్ లు, వందల కాల్స్ చేయిస్తున్నారని, ఈ ఎస్సెమ్మెస్ లు ఎక్కడి నుంచి పెట్టిస్తున్నారో విచారణ చేయించి, తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ౖపై కొంతమంది యూనియన్ నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. పొరపాట్లు సరిదిద్దారు.. టీచర్ల బదిలీ షెడ్యూల్లో మార్పులు చేసిన విద్యాశాఖ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల ఆప్షన్ తేదీల గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల్లో పొరపాట్లను సరిదిద్దే చర్యలను విద్యాశాఖ వేగిరం చేసింది. ఇందులో భాగంగా కీలక దశలో ఉన్న వెబ్కౌన్సెలింగ్ గడువును పొడిగించి ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం ఇచ్చింది. ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం) వెబ్కౌన్సెలింగ్ ముగిసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల వెబ్కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ పరిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్కౌన్సెలింగ్ గడువును ఒకరోజు పెంచింది. ఈ నెల 26 వరకు స్కూల్ అసిస్టెంట్లు వెబ్ఆప్షన్లు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు) వెబ్ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్ మొరాయిస్తుండటంపై విద్యాశాఖకు ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలను అధిగమించే క్రమంలో ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వెబ్కౌన్సెలింగ్ ప్రక్రియలో వెబ్సైట్ మొరాయించడమే కీలక సమస్యగా మారింది. దీంతో ఓటీపీ రావడం, ఆప్షన్ల నమోదు ప్రక్రియ గంటల తరబడి జరుగుతోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సర్వర్ల ఏర్పాటుతో టీచర్లకు ఊరట లభించినట్లైంది. -
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్ : వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి పాత పద్ధతిలో (మాన్యువల్గా) బదిలీల కౌన్సెలింగ్ చే పట్టాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశా రు. జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదు ట పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణకుమార్, నల్ల రత్నాకర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు వెబ్ అప్షన్లు పెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అలాగే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు అప్షన్లు ఇచ్చుకునేందుకు అవస్థలు పడాల్సి ఉంటుందన్నారు.ప్రభుత్వం వెంటనే స్పం దించి మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీఈవోకు వినతపత్రం అందజేశారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇన్నారెడ్డి, మనోహర్, నిర్మల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణారావు, ఎ. నరేంద్రబాబు, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, ప్రకాశ్, నాయకులు రామకృష్ణ, సత్యనారాయణగౌడ్, అర్చన, అరుణ, మధుసూధన్, రాజన్న, జయరాం పాల్గొన్నారు. -
వెబ్ కౌన్సెలింగ్ అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన వెబ్ కౌన్సెలింగ్ తొలి రోజే గందరగోళానికి దారితీసింది. వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు, దానికి తోడు స్పౌజ్ పాయింట్లు ఉన్న టీచర్లకు అతి తక్కువ ఆప్షన్లు, ఒకే పోస్టును రెండుసార్లు చూపడం మొదలైనవి టీచర్లను తీవ్ర అయోమయానికి గురిచేశాయి. బదిలీ ప్రక్రియలో భాగంగా శనివారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం)కు విద్యా శాఖ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంలు శనివారం ఉదయం నుంచే కంప్యూటర్ల ముందుకు చేరారు. రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్ఎం కేటగిరీలో 2,209 మంది బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 541 మందికి తప్పనిసరి బదిలీ కానుండగా.. 1,668 మంది ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండటంతో బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. సతాయించిన సాంకేతిక సమస్యలు జీహెచ్ఎంల వెబ్ కౌన్సెలింగ్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తక్కువ మంది టీచర్లే ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ట్రెజరీ సంఖ్య, మొబైల్ నంబర్ను వెబ్సైట్లో నమోదు చేస్తే ఉద్యోగి మొబైల్కు ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఉద్యోగికి సంబంధించిన వెబ్ పేజీ తెరుచుకుంటుంది. కానీ వివరాలు నమోదు చేసిన వెంటనే ఓటీపీ రావడం లేదు. దీంతో పలుమార్లు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. ఓటీపీ నమోదు తర్వాత ఉద్యోగి ఖాళీలను ఆప్ట్ చేసుకుంటూ ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ తెరుచుకోవడం.. ఆప్షన్లు ఇస్తున్న సమయంలో పేజీ రీడింగ్లో తీవ్ర జాప్యంతో ఆప్షన్లు ఇవ్వడానికి రెండు గంటలపాటు వేచి చూడాల్సి వస్తోందని జీహెచ్ఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. లాగ్ అవుట్ కాకపోవడం, వెబ్ఆప్షన్లు సేవ్ కాకపోవడం లాంటి సమస్యలతో జీహెచ్ఎంలు ఇబ్బంది పడ్డారు. తప్పనిసరి అయితే అన్నీ ఎంచుకోవాలి.. ఒకేచోట ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన టీచర్లకు తప్పనిసరి బదిలీ కానుంది. తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న టీచర్లు వెబ్ కౌన్సెలింగ్లో చూపిన ఖాళీలన్నింటికి ఆప్షన్ ఇవ్వాలి. అలా అయితేనే వెబ్ కౌన్సెలింగ్ పేజీ పూర్తవుతుంది. కొన్నింటికే ఆప్షన్లు ఇస్తే.. సీనియార్టీ ఆధారంగా సదరు జీహెచ్ఎంకు అందులో పేర్కొన్న స్థానం దక్కకుంటే.. మిగతా ఖాళీ స్థానాన్ని సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా కేటాయిస్తుంది. దీంతో ప్రాధాన్యతా క్రమంలో ఉన్న ఖాళీలన్నీ చూపాలని విద్యాశాఖ ఇలా వెబ్సైట్ను అప్డేట్ చేసింది. ఈ ప్రక్రియతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇక స్పౌజ్ పాయింట్లున్న టీచర్ల పరిస్థితి విచిత్రంగా మారింది. స్పౌజ్ పని చేసే చోటు నుంచి జీహెచ్ఎం పనిచేస్తున్న చోటు మధ్య ఉన్న దూరాన్నే సాఫ్ట్వేర్ ప్రామాణికంగా తీసుకోవడంతో.. ఆ కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాళీలే వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. దీంతో వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. దూరం తక్కువగా ఉంటే తక్కువ ఖాళీలు చూపడంతో కొందరు టీచర్లకు నాలుగైదు స్థానాలకు మించి ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే వెబ్సైట్లో ఖాళీ స్థానాలు కొన్ని రెండేసిసార్లు చూపించడంతో టీచర్లు తికమకపడ్డారు. -
నేటి నుంచి రెండో దశ వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వైద్యవిద్య కాలేజీల్లోని ఏ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం రెండో దశ వెబ్ కౌన్సెలింగ్కు కాళోజీ ఆరోగ్య వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలిదశ కౌన్సెలింగ్ తర్వాత ఎంబీ బీఎస్లో 216, బీడీఎస్లో 219 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఆగస్టు 12 నుంచి ఆగస్టు 14 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఇక వైద్య సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు ఇటీవలి తీర్పు ప్రకారం.. తొలిదశ కౌన్సెలింగ్లో మైనారిటీ కాలేజీల్లోని బీ కేటగిరీ సీటు పొంది, అడ్మిషన్ తీసుకోకుండా ఖాళీగా ఉంటే.. ఆ సీట్లను తాజా కౌన్సెలింగ్లో ఏ కేటగిరీలోకి మార్చుతున్నట్లు తెలిపింది. -
5 నుంచి ఏపీ ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల ప్రవేశానికి గాను ఏపీ ఎంసెట్–2017 తుది విడత కౌన్సెలింగ్ను ఈ నెల 5 నుంచి నిర్వహించనున్నట్లు అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ జీఎస్ పండాదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని, 8న సీట్లు కేటాస్తా మన్నారు. ఇదివరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాలేని వారు కూడా ఈ రెండురోజుల వెబ్కౌన్సెలింగ్కు వచ్చి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. వర్సిటీ కాలేజీల్లో 483, ప్రైవేటు కాలేజీల్లో 31,362 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వివరాలను ఎంసెట్ కౌన్సెలింగ్ వెబ్సైట్లో (హెచ్టీటీపీఎస్: //ఏపీ ఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్) ఉంచినట్లు తెలిపారు. -
ఏపీ ఈసెట్ ప్రవేశాలకు నోటిఫికేషన్
- జూన్ 29 నుంచి ధ్రువపత్రాల పరిశీలన - 30 నుంచి ఆప్షన్ల నమోదు... జూలై 5న సీట్ల కేటాయింపు సాక్షి, అమరావతి: ఏపీ ఈసెట్లో అర్హత సాధించిన (డిప్లొమా, బీఎస్సీ మేథ్స్) అభ్యర్థులకు ఇంజనీరింగ్,, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరు వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు వీలుగా 18 హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీరు ఒరిజినల్ ధ్రువపత్రాలను ఆయా కేంద్రాల్లో జూన్ 29 నుంచి పరిశీలింపచేసుకోవాలి. ధ్రువపత్రాల జిరాక్స్ పత్రాలను మాత్రమే కాలేజీల్లో అందించాలని కన్వీనర్ పండాదాస్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ. 600, ఇతరులు రూ.1200 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలన్నారు. ఒకటవ ర్యాంకు నుంచి ఆరు వేల వరకు జూన్ 29న, 6,001 నుంచి 14 వేల వరకు జూన్ 30న, 14,001 నుంచి 22వేల వరకు జూలై ఒకటిన, 22,001 నుంచి చివరి ర్యాంకు వరకు జూలై 2న పరిశీలన చేస్తారు. దివ్యాంగులు ఇతర ప్రత్యేక కేటగిరీల వారు విజయవాడలోని బెంజ్సర్కిల్లో ఉన్న పాలిటెక్నిక్లోని కేంద్రంలో పరిశీనలకు రావాలి. అభ్యర్ధులు జూన్ 30 నుంచి జూలై 3న సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ‘హెచ్టీటీపీఎస్://ఏపీఈసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్లో ఆప్షన్లు ఇవ్వాలి. జూలై 5న సీట్ల కేటాయింపు వివరాలు వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. -
‘వైద్య’ అడ్మిషన్లపై గందరగోళం
హైకోర్టు తీర్పు ఇచ్చినా భర్తీపై అస్పష్టత ► స్టే ఎత్తివేతకు పిటిషన్ వేయాలని ప్రైవేటు మెడికల్ కాలేజీల నిర్ణయం ► ప్రభుత్వంతో ఒప్పందం జరగనందున భర్తీకి ఒప్పుకోబోమని స్పష్టీకరణ ► రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం.. ఆప్షన్లు ఇస్తున్న విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్ల అడ్మిషన్లపై గందరగోళం కొనసాగుతోంది. ఫీజులు పెంచుతూ తెలంగాణ సర్కారు విడుదల చేసిన జీవోలను హైకోర్టు నిలుపుదల చేయడం, ప్రవేశాలను యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో స్టే ఎత్తివేతకు ప్రైవేటు మెడికల్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేయాలని తాజాగా నిర్ణయించాయి. అలాగే అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి లేఖ రాశాయి. కన్వీనర్ కోటా సీట్లకు శుక్రవారం మొదలైన వెబ్ కౌన్సెలింగ్ను నిలిపివేయాలని కోరాయి. దీంతో ఆరోగ్య విశ్వవిద్యాలయం గందరగోళంలో పడింది. అడ్మిషన్ల ప్రక్రియపై ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం పీజీ వైద్య సీట్ల భర్తీ ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి కావాలి. ఇంకా 18 రోజులే గడువు ఉంది. దీంతో అడ్మిషన్లు పూర్తవుతాయా లేదా అనే సందేహాలతో వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెనక్కు తగ్గని మెడికల్ కాలేజీలు మొదటి నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు మొండిగానే వ్యవహరిస్తున్నాయి. ఫీజులు పెంచకుంటే పీజీ వైద్య సీట్లను తమ కాలేజీల నుంచి ఉపసంహరించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దీంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం.. అడిగినట్లుగా అన్ని రకాల ఫీజులను గణనీయంగా పెంచింది. క్లినికల్ ఎన్ఆర్ఐ కోటా సీటుకైతే మూడేళ్లకు ఏకంగా రూ.2.17 కోట్లు పెంచేసింది. దీంతో ఆందోళన చెందిన వైద్య విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో స్టే విధిస్తూ తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు వెలువడినా ప్రైవేటు కాలేజీలు వెనక్కు తగ్గడంలేదు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లి పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టంచేస్తున్నాయి. ఫీజులకు సంబంధించి మూడు నెలల కిందటే ఏఎఫ్ఆర్సీకి లేఖ రాశామని చెబుతున్నాయి. ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం జరగకుండానే వెబ్ కౌన్సెలింగ్కు ఎలా వెళ్లారంటూ ఆరోగ్య వర్సిటీని ప్రశ్నిస్తున్నాయి. ‘హైకోర్టు స్టే విధించాక మాకు ఎలాంటి నోటీసు రాలేదు. కాబట్టి వెబ్ కౌన్సెలింగ్ జరగకుండా చూడాలని వర్సిటీకి లేఖ ఇచ్చాం. అయినా ఎంవోయూ జరగకుండా ఎలా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు’అని ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు ప్రశ్నిస్తున్నారు. ‘ఫీజులు పెంచకుంటే మాకు గిట్టుబాటు కాదు. తక్కువ ఫీజులతో పీజీ కోర్సులను నడిపించడం సాధ్యంకాదు. అవసరమైతే కాలేజీలను బంద్ పెడతాం’అని ఆయన ‘సాక్షి’తో అన్నారు. హైకోర్టుకు వెళ్లాలా, సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే దానిపై సోమవారం నాటికి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వెబ్ కౌన్సెలింగ్పై ముందుకే ప్రైవేటు మెడికల్ కాలేజీలు కౌన్సెలింగ్ నిలిపివేయాలని కోరినా అది సాధ్యం కాదని ఆరోగ్య వర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. కొన్ని సీట్లల్లో విద్యార్థులు చేరిపోయారు. ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో మొదటి కౌన్సెలింగ్ తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు, అలాగే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు శుక్రవారం రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ మొదలైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కౌన్సెలింగ్ ముగుస్తుంది. ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్ రద్దు చేయమని కోరినా ఇప్పటికే ప్రారంభమైనందున వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను రద్దు చేయడం కుదరదని, కాబట్టి కొనసాగిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రైవేటు కాలేజీల్లోని 267 కన్వీనర్ కోటా సీట్లకు, మైనారిటీలోని 46 కన్వీనర్ కోటా సీట్లకు, కొత్తగా కేటాయించిన 100 సీట్లకు, అలాగే మొదటి కౌన్సెలింగ్లో మిగిలినపోయిన నిమ్స్లోని 51 సీట్లకు, ఓయూ, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో మిగిలిపోయిన 236 సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటిరోజు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని, అయితే ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటామని కరుణాకర్రెడ్డి వివరించారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. నెలాఖరుకు పూర్తి కావాల్సిన ప్రక్రియ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. హైకోర్టు స్టే ఇవ్వడం, ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్ను నిలుపుదల చేయాలని కోరుతుండటంతో అడ్మిషన్లపై గందరగోళం నెలకొనడంతో అడ్మిషన్ల ప్రక్రియ పూర్త య్యే పరిస్థితి కనిపించడం లేదు. పొడిగింపు కోరే అవకాశముంది. -
12, 13న ‘పీజీ మెడికల్’ కౌన్సెలింగ్
నోటిఫికేషన్ జారీచేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్, డిప్లొమా సీట్ల అడ్మిషన్ల కోసం ఈ నెల 12, 13 తేదీల్లో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ కరుణాకర్రెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13 సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ కౌన్సెలింగ్ నిమ్స్ సహా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని పీజీ మెడికల్ సీట్లకు మాత్రమే నిర్వహించారు. ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల సీట్ల ఫీజుల వ్యవహారం తేలక పోవడంతో మొదటి విడత కౌన్సెలింగ్ ప్రభుత్వ సీట్లకే పరిమితమైంది. మంగళవారం పీజీ సీట్ల ఫీజుల పెంపుపై జీవో జారీచేయడంతో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్లో ప్రభుత్వ సీట్లతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మైనారిటీ కోటా సీట్లకు మాత్రం మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కాగా, మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ దాదాపు 600 సీట్లకు నిర్వహించగా, విద్యార్థులు చేరకపోవడంతో 238 సీట్లు మిగిలిపోయాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి. తదుపరి కౌన్సెలింగ్లో నిమ్స్ తదితర ప్రముఖ కాలేజీల్లో సీటు వస్తుందన్న ఆశతోనే చాలా మంది చేరలేదని భావిస్తున్నారు. -
పీజీ వైద్య విద్య అడ్మిషన్లకు నోటిఫికేషన్
నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల అడ్మిషన్లకు సోమ వారం నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ పీజీ–2017, నీట్ ఎండీ ఎస్–2017 ప్రవేశ పరీక్షలో కటాఫ్ మార్కులు సాధించిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి మెరిట్ జాబితా తయారు చేసి మెడికల్ పీజీ, డిప్లమో, ఎండీఎస్ కోర్సుల్లో సీట్లు భర్తీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావు వెల్లడించారు. నిమ్స్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్య సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తులను మంగళవారం ఉదయం 11 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలను www.knruhs.in, http://tsp gmed.tsche.in, http://tsmds.tsche.inల్లో చూడవచ్చు. ఉమ్మడి కౌన్సెలింగ్.. ప్రభుత్వ సీట్లు, నాన్ మైనారిటీ, మైనారిటీల్లోని కన్వీనర్ కోటా పీజీ వైద్య సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామని తెలుపుతూ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం నోటిఫి కేషన్ జారీచేసింది. కాగా, ఏయే కాలేజీల్లో ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయో ప్రకటించాల్సి ఉంది. ► ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29% రిజర్వేషన్ అమలుచేస్తారు. ► 30% క్లినికల్ పీజీ సీట్లను, 50% ప్రీ, పారా క్లినికల్ సీట్లను ఇన్ సర్వీస్ కోటాలో ఇస్తారు. అందులోనూ రిజర్వేషన్లు ఉంటాయి. ► రెండేళ్లు ఆపై గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వైద్యులు, మూడేళ్లు ఆపైన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినవారు, ఆరేళ్లు, ఆపైన పట్టణాల్లో పనిచేసిన అభ్యర్థులు ఇన్సర్వీస్ కోటా రిజర్వేషన్లకు అర్హులు. దరఖాస్తులో ఆ వివరాలన్నీ నమోదు చేయాలి. పనిచేస్తున్నట్లు డీఎంఈ నుంచి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ►కాంట్రాక్లు, ఔట్ సోర్సింగ్ వైద్యులు ఇన్సర్వీస్ కోటాకు అనర్హులు. ►85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు స్థానికేతరులకు ఇస్తారు. వెబ్కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. వెబ్కౌన్సెలింగ్లో సీట్లు పొందిన వారి వివరాలను వెబ్సైట్లో ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను విశ్వవిద్యాలయా నికి ఇవ్వాల్సి ఉంటుంది. ∙ పీజీ కోర్సులో చేరిన వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి, కన్సల్టేషన్గా ఉండటానికి వీల్లేదు. -
పారా మెడికల్ డిగ్రీ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్
25 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీలో పారామెడికల్ (నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ) కోర్సుల్లో అడ్మిషన్లకు జరిగే వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ర్యాంకుల ప్రకారం ఏ హెల్ప్లైన్ కేంద్రాల్లోనైనా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావచ్చు. అన్ రిజర్వుడు 15 శాతం సీట్ల కోసం హాజరయ్యే తెలంగాణ అభ్యర్థులు మాత్రం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరుకావాలి. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న పీహెచ్ అభ్యర్థులు, పోస్టు బేసిక్ నర్సింగ్ (రెండేళ్ల) కోర్సుకు దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 28న విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరు కావాలి. మెరిట్ లిస్టు, ర్యాంకు కార్డులు, నోటిఫికేషన్ వివరాలు యూనివర్సిటీ ( హెచ్టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీఎన్టీఆర్యూహెచ్ఎస్.ఇన్, హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లలో పొందవచ్చు. అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైనప్పుడు వాడకంలో ఉన్న సొంత ఫోన్ నంబర్ను నమోదు చేయించుకోవాలి. -
నేటి నుంచి ‘మెడికల్’ తరగతులు
* మొదటి విడత కౌన్సెలింగ్లో సీట్లు దక్కిన విద్యార్థులు హాజరు * నేడు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ తొలి ఏడాది తరగతులు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలివిడత కౌన్సెలింగ్లో ఎంపికైన వారికి కాలేజీల వారీగా సీట్లు కేటాయించిన అధికారులు తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కానున్న మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనూ తరగతులు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటులోని కన్వీనర్ కోటాలో ఉన్న 2,075 ఎంబీబీఎస్ సీట్లకు, అలాగే 12 డెంటల్ కాలేజీల్లోని 606 సీట్లను (స్పోర్ట్స్, ఎన్సీసీ, మిలటరీ కోటా మినహాయించి) విద్యార్థులకు కేటాయించారు. వీటిల్లో 70 ఎంబీబీఎస్, 200 బీడీఎస్ సీట్లల్లో విద్యార్థులు చేరనందున మిగిలాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాటికి రెండో విడత వెబ్కౌన్సెలింగ్ సోమవారం నిర్వహించి, 27న సీట్ల కేటాయింపు చేస్తామన్నారు. కాగా, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. వాటిల్లో అన్ని ఎంబీబీఎస్ సీట్లు భర్తీ కాగా.. 92 బీడీఎస్ సీట్లు మిగిలినట్లు కరుణాకర్రెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా వైద్య అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
మిగిలిన పీజీ వైద్యసీట్లకు 3న కౌన్సెలింగ్
- ఏపీలో 86, తెలంగాణలో 32 పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ - వెబ్ కౌన్సెలింగ్ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా నిర్ణయం - ఎస్ఎంఎస్కు స్పందించకపోతే తర్వాతి ర్యాంకర్కు సీటు సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మిగిలిన పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ), పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా సీట్లకు అక్టోబర్ 3 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, కాళోజీ నారాయణ హెల్త్ వర్సిటీ నిర్ణయించాయి. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత ఏపీలో 86 సీట్లు, తెలంగాణలో 32 సీట్లు మొత్తం 118 పీజీ వైద్య సీట్లు మిగిలిపోయాయి. ఈ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కొంతమంది విద్యార్థులు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 8న సుప్రీంకోర్టు 2 వారాల్లోగా ఈ సీట్లను భర్తీ చేయాలని ఎన్టీఆర్ హెల్త్, కాళోజీ హెల్త్ వర్సిటీలను ఆదేశించినా కోర్టు కాపీ ఆలస్యంగా వచ్చిందని స్పందించలేదు. దీంతో ఈ నెల 20న ‘పీజీ సీట్లు ఎప్పుడు భర్తీ చేస్తారు’ అన్న శీర్షికతో ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. దీనిపై ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్పందించి అక్టోబర్ 3న ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ జారీచేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోని మొత్తం 118 సీట్లను భర్తీ చేస్తారు. పీజీ సీట్లకు జరిగిన మొదటి, రెండో విడత కౌన్సెలింగ్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి, సీట్లు రాని వారు మాత్రమే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ సూచించారు. విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్లో ఇచ్చిన ఆప్షన్ల మేరకు మెరిట్ ఆధారంగా ఎస్ఎంఎస్లు వస్తాయని, ఈ ఎస్ఎంఎస్లకు స్పందించిన వారికి సీట్లు కేటాయిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి ఎస్ఎంఎస్కు స్పందించకపోతే ఆ సీటును తర్వాతి మెరిట్ విద్యార్థికి ఇస్తామని తెలిపారు. -
ఆ కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి
జేఎన్టీయూ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్ : తనిఖీల్లో బయటపడ్డ లోపాలను సరిదిద్దుకున్న కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్ రిజిస్ట్రార్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చకపోవడం, కొన్ని కోర్సులకు అఫిలియేషన్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారించారు. తనిఖీలు నిర్వహించిన వర్సిటీ వర్గాలు పలు లోపాలను ఎత్తిచూపాయని, దీనిపై అప్పీల్ దాఖలు చేశామని, లోపాలను సవరించుకున్న ఆధారాలను సమర్పించినా తమ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్లో చేర్చలేదని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. సదరు కాలేజీల్లో మరోసారి తనిఖీలు నిర్వహించి లోపాలను సవరించుకున్న కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీతో పాటు తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఏఐసీటీఈ తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
29 నుంచి ఓయూసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఓయూసెట్-2016 మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 29 నుంచి జూలై 3 వరకు కొనసాగుతుందని ఓయూ పీజీ అడ్మిషన్స్ జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ సోమవారం తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ విశ్వవిద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు తమ ర్యాంకుల ఆధారంగా కళాశాలలను ఎంపిక చేసుకొని ఆప్షన్స్ ఇచ్చుకోవాలన్నారు. సీట్లు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఓయూ క్యాంపస్లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరగనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. -
పారిన పారదర్శక పాచిక
ముందు ఆఫ్లైన్... తర్వాత వెబ్లైన్ ఆరోపణలున్న వారికి కీలక స్థానాలు పనిచేసిన వారికి ప్రాధాన్యం లేని ప్రాంతాలు పాలకపక్ష నేతల సిఫార్సులకే పెద్దపీట తహసీల్దార్లు, ఎక్సైజ్ శాఖ డీసీ బదిలీలపై వాడీవేడి చర్చ అనుకున్న పనులు సాగాలంటే... అనుకూలమైన అధికారులు ఉండాలి. అనుయాయుల హవా సాగాలంటే... చెప్పినట్టు వినే సిబ్బంది ఉండాలి. అలా అయితేనే ముందుకు వెళ్లగలరు. పారదర్శకత పేరుతో తాజా బదిలీల్లో ఇదే సూత్రం అమలు చేశారు. తొలుత ఆఫ్లైన్లో అన్నీ చేసేసి... ఆనక వెబ్లైన్లో మమ అనిపించేసి... రకరకాల విన్యాసాలు చేసి... చివరకు తమకు నచ్చినవారిని తెచ్చుకుని... నచ్చనివారిని తప్పించేలా చూసుకున్నారు. ఫలితంగా ఆరోపణలున్నవారికి కీలకస్థానాలు దక్కాయి... పనిచేయగల సమర్థులకు ప్రాధాన్యం లేని చోటు లభించింది. జిల్లాలో బదిలీలు పాలకుల భవిష్యత్తు ఆలోచనలను చెప్పకనే చెబుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం : పారదర్శకతకు కొత్త అర్థం చెప్పారు. కావలసిన అధికారుల్ని తెచ్చుకునేందుకు పాచికగా మలచుకున్నారు. భవిష్యత్తు అవసరాలకోసం ఉపయోగపడే వారిని నియమించుకునేందుకు బదిలీల అంశాన్ని అనుకూలంగా మలచుకున్నారు. పారదర్శకత... ఆన్లైన్... వెబ్కౌన్సెలింగ్... అంతా ఒట్టిదేనని తేలిపోయింది. వ్యూహాత్మకంగానే జరిగినట్టు అన్పిస్తోంది. కొన్ని శాఖల్లో ఆఫ్లైన్లో కానిచ్చేసి ఆ తర్వాత వైబ్లైన్లో ఓకే చేశారు. మరికొన్ని శాఖల్లో ఎవరెక్కడో నేతలే నిర్ణయించగా, వాటి ప్రకారం వెబ్లో ఆప్షన్ పెట్టి బదిలీలు చేశారు. రెవెన్యూలోనైతే పైరవీలకే పెద్ద పీట వేసినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. ముందస్తు ప్రణాళికలో భాగంగానే... ఎవరెక్కడికెళ్లాలో, ఎవరెక్కడికి రావాలో అధికార పార్టీ నేతలు ముందే నిర్దేశించారు. వాటి ఆధారంగానే అధికారులు పావులు కదిపారు. చెప్పి, ఒప్పించి బదిలీల తతంగాన్ని దాదాపు చేపట్టారు. నేతల ఒత్తిళ్లు ఉన్నాయని, వారి సూచనల మేరకు చేయక తప్పదని, వారికి ఇష్టం లేకుండా వేసినట్టయితే ఇబ్బందులొస్తాయని ముందే హితబోధ చేసేశారు. అందుకు తగ్గట్టుగా ముందుగానే ఆఫ్లైన్లో ప్రాంతాలను ఖరారు చేసుకుని, వాటి ఆధారంగా వెబ్లైన్లో ఆప్షన్లు పెట్టి బదిలీలను కానిచ్చేశారు. వెబ్లైన్ పేరుతో సిఫార్సులే జరిగాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. కలెక్టరేట్కు వచ్చి మరీ పైరవీలు రెవెన్యూ శాఖలో జరిగిన బదిలీల్లో తహసీల్దార్లను తమ ప్రాంతాలకు వేయించుకునేందుకు సాక్షాత్తూ ఎమ్మెల్యేలే కలెక్టరేట్కు వచ్చి పైరవీలు సాగించారన్న ప్రచారం సాగుతోంది. మరికొందరు ఎమ్మెల్యేలు, నాయకులు ఫోన్ ద్వారా తమకు అనుకూలురైన వారిని తహసీల్దార్లు, ఆర్ఐలుగా నియమించాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగానే మంగళవారం బదిలీలు జరిగిన సమయంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కలెక్టరేట్లో తిష్టవేశారు. ఊహించినట్టుగానే ఆ నియోజకవర్గ పరిధిలో ముగ్గురు తహసీల్దార్లకు బదిలీలు జరిగాయి. తనకు అనుకూలమైన వ్యక్తులకు పోస్టింగ్లు వేయించుకోగలిగారు. దీనిపై రెవెన్యూ వర్గాల్లో వాడీ వేడి చర్చ జరుగుతోంది. ఈ బదిలీల్లో పనితీరును ప్రామాణికంగా తీసుకోలేదని, సిఫార్సులకే పెద్ద పీట వేసారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. చెప్పినమాట విననివారిని అప్రాధాన్యస్థానానికి... జిల్లా ఉన్నతాధికారి ఒకరు ఈ మధ్య తమ చేతికి మట్టి అంటకుండా ప్రతీదీ మౌఖికంగా చెప్పి పని చేయించుకోవడం అలవాటుగా పెట్టుకున్నారు. భవిష్యత్లో ఇబ్బందులొస్తే కింది స్థాయి వాళ్లు పోవాలే తప్ప తమకెలాంటి సమస్య ఉత్పన్నం కాకూడదన్న ఉద్దేశంతోనే దీనిని అమలు చేస్తున్నారు. కొందరు సరే అంటూ చెప్పిన పని చేసేస్తుంటే... కొందరు అభ్యంతరం చెబుతున్నారు. సరే అన్నవారిని తనవారిగా... కాదన్నవారిని పరాయివారిగా భావిస్తున్నారు. ఆయన సతాయింపు భరించలేక కొందరు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో ఆయన్ను వ్యతిరేకించేవారిని ప్రాధాన్యం లేని స్థానాలకు పంపేసినట్టు బాహాటంగానే విమర్శలు వచ్చాయి. ఎక్సైజ్ డీసీ బదిలీపై ‘కుల’కలం ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి బదిలీ విషయం రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపం బయడపడింది. ఆదర్శ భావాలు గల ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాపు ఉద్యమానికి అంతర్గతంగా తన వంతు సహకారం అందిస్తున్నారని, తానొక వ్యవస్థను నడుపుతున్నారన్న అభిప్రాయంతో రాష్ట్రప్రభుత్వం ఆయన్ని ఆకస్మికంగా బదిలీ చేసినట్టు సమాచారం. ఒక అధికారిగా కాకుండా సామాజిక సేవలందిస్తున్న చైతన్య మురళిని ఎనిమిది నెలలు తిరక్కుండానే బదిలీ చేయడంపై ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీ సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఇదే ప్రభుత్వంలో ఇంతకుముందు సామాజిక కోణంలోనే చర్యలు తీసుకుందని, ఇప్పుడూ అదే పంథా సాగిస్తోందని ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నాయి. -
నిబంధనలు తూచ్
రాజకీయ సిఫార్సుల మేరకే ఉద్యోగుల బదిలీలు ఎమ్మెల్యేల మాటే నెగ్గింది వంత పాడిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వెబ్ కౌన్సెలింగ్.. నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీలు’ అంటూ సర్కారు పలికిన పలుకులు మాటల వరకే అని తేలిపోయింది. నిబంధనల్ని తోసిరాజనడం.. అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావడంతో ఉద్యోగుల బదిలీలన్నీ పక్క పక్క మండలాలకు, పక్క గ్రామాలకే పరిమితం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే బదిలీలు చేయాలని ఆదేశించారు. సాయంత్రానికి కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల మాట వినండని పరోక్షంగా హితబోధ చేయడంతో ఉద్యోగుల బదిలీలు ప్రహసనంగా జరిగిపోయాయి. ఆన్లైన్ ద్వారానే బదిలీలు ఉంటాయని ప్రకటించినా కొందరు ఉద్యోగులు కీలక ప్రాంతాల్లో పోస్టింగ్ల కోసం నేతల చెంతకు పరుగులు తీశారు. ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి తమకు అనుకూలంగా ఉండే వారి కోసం పైరవీలు చేశారు. ఇప్పటివరకు ఉపాధ్యాయులను మాత్రమే కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేస్తుండగా.. అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సెలింగ్ విధానం వల్ల ఎటువంటి అక్రమాలకు తావు ఉండదని అందరూ భావించారు. ఈ నిబంధనలతో ఉద్యోగుల్లో కొందరు తమకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో అని హడలిపోయారు. వెంటనే ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. దీంతో కథ మారిపోయింది. దీంతో వారు తమకు అనుకూలమైన వారిని తమ నియోజకవర్గంలోనే ఉండేలా చక్రం తిప్పారు. నిబంధనలు గాలికి.. వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పటివరకూ ఏజెన్సీలో పనిచేయని ఉద్యోగుల్ని గుర్తించి వారిని అక్కడకు పంపించాలి. ఏజెన్సీ ఏరియాలో పనిచేసిన వారిని అర్బన్ ప్రాంతాలకు తీసుకురావాల్సి ఉంది. జిల్లాలో ఈ నిబంధనలను కాదని బదిలీలు జరిగాయి. ఉద్యోగ సంఘాల్లో సభ్యులుగా ఉన్న కొందరు.. సంఘ కార్యవర్గ పదవిలో ఉన్నట్టు చెప్పుకుని వారు ప్రస్తుతం ఉంటున్న స్థానాల నుంచి కదల లేదు. దివ్యాంగులకు మొండిచేయి దివ్యాంగులకు బదిలీల నుంచి మినహాయించాలనే నిబంధన ఉన్నా దానిని కూడా పక్కనపెట్టి ఇష్టం వచ్చిన రీతిలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు. ఖజానా శాఖలో ఒక అంధ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడంపై తీవ్ర దుమారం రేగింది. సర్వే శాఖలోనూ ఒక అంధ ఉద్యోగిని బదిలీ చేయడంపై సాక్షాత్తు ఏలూరు ఎమ్మెల్యే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే పెద్దగా పలుకుబడి, ఆదాయం రాని విభాగాల్లో మాత్రం బదిలీలు యథాతథంగా జరిగిపోయాయి. రెవెన్యూ విభాగంలో ఆదాయం వచ్చే ప్రాంతాల్లో పోస్టింగ్ల కోసం భారీగా చెల్లింపులకు కూడా సిద్ధమైనట్టు ఆరోపణలు వచ్చాయి. వీఆర్వోలు, ఆర్ఐలు చక్రం తిప్పడంతో వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయకుండా అక్కడికక్కడే ఉద్యోగాలు కట్టబెట్టారు. దుగ్గిరాల వీఆర్వోను కిలోమీటరు దూరం కూడా లేని శనివారపుపేటలో నియమించారు. వట్లూరు వీఆర్వోను సైతం కిలోమీటరు దూరంలో ఉన్న సత్రంపాడులో నియమించారు. సాఫ్ట్వేర్ పనిచేయలేదు రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన బదిలీల సాఫ్ట్వేర్ పనిచేయలేదు. దీంతో వెబ్ కౌన్సెలింగ్ బదిలీలు కాస్తా సాధారణ బదిలీలుగా మారాయి. జిల్లాస్థాయిలో ప్రారంభించిన వెబ్ బదిలీల ప్రక్రియ కొంత ఫలితాన్నిచ్చినా చివరకు రాజకీయ బదిలీలుగా మారడంతో ఆ ప్రక్రియ వల్ల ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. -
పీజీ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
వెబ్కౌన్సెలింగ్ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన 11 నుంచి వెబ్ ఆప్షన్సు ఇచ్చుకునే అవకాశం షెడ్యూల్లో మార్పు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వెబ్కౌన్సెలింగ్ గురువారం ప్రారంభమైంది. డెరైక్టరేట్ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ ప్రక్రియ గురువారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. తొలిసారిగా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎస్వీయూ అధికారులు వెబ్ కౌన్సెలింగ్కు శ్రీకారం చుట్టారు. తొలిరోజు గురువారం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కెమిస్ట్రీలో ఒకటి నుంచి 1046 ర్యాంక్ వరకు, ఫిజిక్స్లో 1 నుంచి 608 వరకు, ఎలక్ట్రానిక్స్లో ఒకటి నుంచి 136వ ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. హాజరైన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వారికి స్క్రాచ్కార్డులు ఇచ్చారు. వారు శుక్రవారం నుంచి వెబ్సైట్లో లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఆధారంగా ఈనెల 16 లేదా 17 తేదీల్లో సీట్లను కేటాయిస్తారు. శుక్రవారం కామర్స్ విభాగంలో ఒకటినుంచి 1200వ ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ జరగనుంది. షెడ్యూల్లో మార్పు రువారం ప్రారంభం అయిన పీజీ కౌన్సెలింగ్కు అభ్యర్థుల తాకిడి ఎక్కువ కావడంతో రాత్రి 9 వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో షెడ్యూల్లో మార్పు చేశారు. కామర్స్ 1201 ర్యాంక్ నుంచి 1962 ర్యాంక్ వరకు, కంప్యూటర్ సైన్స్లో 1 నుంచి 562 ర్యాంక్ వరకు ఈనెల 14న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అలాగే ఇంగ్లీష్లో 1 నుంచి 239 ర్యాంక్ వరకు, ఎడ్యుకేషన్లో 1 నుంచి 156 వరకు, జనరల్ టెస్ట్ పరీక్షకు సంబంధించి 1 నుంచి 289 ర్యాంక్ వరకు ఈనెల 15న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వర్షంతో విద్యార్థులు ఇక్కట్లు ఎస్వీయూలో ప్రారంభం అయిన వెబ్కౌన్సెలింగ్ ప్రకియ సందర్భంగా గురువారం సాయంత్రం వర్షం పడడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. -
తుది తీర్పునకు లోబడే పీజీ మెడికల్ ప్రవేశాలు
తేల్చి చెప్పిన హైకోర్టు - వెబ్ కౌన్సెలింగ్ నిలుపుదలకు నిరాకరణ - కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్టీఆర్, కాళోజీ వర్సిటీలకు ఆదేశాలు - జూన్ 3కు విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్ నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. వెబ్ కౌన్సెలింగ్ యథాతథంగా కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. అయితే ఈ వెబ్ కౌన్సెలింగ్ ఆధారంగా జరిగే ప్రవేశాలన్నీ కూడా తమ ముందున్న వివిధ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది. ఈ లోపు ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్టీఆర్, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఎం.సీతారామమూర్తిలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఎంఎస్ల ద్వారా ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ డాక్టర్ ఎం.అపూర్వ తదితరులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అదే విధంగా ప్రతిభ ఆధారంగా ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ర్యాంకు ఆధారంగా కాకుండా వారి కులం ఆధారంగా రిజర్వేషన్ కింద సీటు కేటాయిస్తుండటాన్ని సవాలు చేస్తూ డాక్టర్ అభిషేక్ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.వి.సింహాద్రి వాదనలు వినిపి స్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఎస్ఎంఎస్ ఆప్షన్ల ఉత్తర్వుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు. అలాగే ప్రతిభతో ర్యాంకు సాధించిన అభ్యర్థులకు వారి కుల రిజర్వేషన్ ఆధారంగా సీటు ఇస్తున్నారని, దీనివల్ల రిజర్వేషన్లో సీటు పొందే అభ్యర్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్లో స్టేట్ వైడ్ కాలేజీలను చూపడం లేదని, దీని వల్ల తీరని నష్టం జరుగుతోందని వివరించారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని వెబ్ కౌన్సెలింగ్ను నిలుపుదల చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, ఇప్పటికే రెండు దశల వెబ్ కౌన్సెలింగ్ పూర్తయినందున ఈ దశలో కౌన్సెలింగ్ నిలుపుదల సాధ్యం కాదని చెప్పింది. ఇప్పటికే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరిగిన ప్రవేశాలు ఈ వ్యా జ్యాల్లో తాము వెలువరించబోయే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. -
సెప్టెంబర్ చివరి దాకా మెడికల్ అడ్మిషన్లు
‘సాక్షి’తో కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి - నీట్ నేపథ్యంలో ఎంసీఐ ఒక నెల గడువు పొడిగించింది - ఎంసెట్-2కు జూలై ఆఖరుకల్లా తొలి విడత కౌన్సెలింగ్ - ఆగస్టు నుంచే తొలి విడత బ్యాచ్ తరగతులు సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఆగస్టు 31వ తేదీ నాటికి పూర్తి కావాల్సిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ఈసారి సెప్టెంబర్ చివరి దాకా కొనసాగనుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి తెలిపారు. ఎంసెట్-2 షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎంసెట్ను జూలై 9వ తేదీ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎంసెట్-2ను విద్యార్థుల సంఖ్యను బట్టి దాదాపు 200 కేంద్రా ల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నీట్ ద్వారా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపడుతున్నందున ఆలస్యం కానుందని.. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ చివరి నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు ఎంసీఐకి అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆర్డినెన్స్ నేపథ్యం లో నిర్వహించే ఎంసెట్-2 పరీక్షలో ర్యాంకులు పొందిన వారికి జూలై ఆఖరి వారం నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతామన్నారు. విద్యార్థుల చేరికలు పూర్తయ్యాక... ఆగస్టులోనే తొలి బ్యాచ్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక రెండో విడత కౌన్సెలింగ్, అవసరమైతే మూడో విడత కూడా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. వెబ్ కౌన్సెలింగ్పై ఆలోచన ఆన్లైన్ కౌన్సెలింగ్ కాకుండా పీజీ వైద్య సీట్లకు నిర్వహించినట్లుగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కూడా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నామని కరుణాకర్రెడ్డి చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ వల్ల విద్యార్థులు కౌన్సెలింగ్ కేంద్రానికి రాకుండానే తమ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చన్నారు. దీనివల్ల వేగంగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈసారి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంతో కలిసే మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. రెండు రాష్ట్రాల్లో 15 శాతం అన్ రిజర్వ్డ్ సీట్లు ఉన్నందున కలిసే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంసెట్ ఫలితాలు ఇప్పటికే వచ్చినా రెండు రాష్ట్రాల కౌన్సెలింగ్ల మధ్య ఎక్కువ రోజు ల తేడా ఉండబోదన్నారు. తెలంగాణ సీట్లకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ అంతా హైదరాబాద్, వరంగల్లోనే జరుగుతుందన్నారు. వచ్చేనెల మొదటివారంలో నీట్-2 నోటిఫికేషన్! నీట్-2కు వచ్చేనెల మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కరుణాకర్రెడ్డి తెలిపారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తామన్నారు. నీట్ ర్యాంకులు ప్రకటించాక సీట్ల భర్తీ ప్రక్రియ ఎలా చేపట్టాలన్న అంశంపై మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. మార్గదర్శకాలు వచ్చాక సీట్ల భర్తీ ప్రక్రియపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. -
17నుంచి తెలంగాణలో రెండో విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): తెలంగాణలో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నాన్ సర్వీస్ అభ్యర్థులకు ఈనెల 17,18 తేదీల్లో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. అదేవిధంగా సర్వీస్ అభ్యర్థులకు ఈనెల 18న కౌన్సెలింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఈ మేరకు శనివారం హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్కు హాజరుకాని అభ్యర్థులు మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హెల్ప్లైన్ సెంటర్లకు హాజరుకావాలని పేర్కొన్నారు. మిగిలిన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ లేదా హెచ్టీటీపీ://టీఎస్పీజీఎంఈడీ.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్) వెబ్సైట్లలో సంప్రదించాలన్నారు. -
22 నుంచి పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్(డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 22 నుంచి 26వ తే దీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురాధ తెలిపారు. ఈ మేరకు శనివారం హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్కు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని కళాశాలలకు కౌన్సెలింగ్ జరుగుతుందని రిజిస్ట్రార్ అనురాధ తెలిపారు. ఫిబ్రవరి 28న నిర్వహించిన ఎన్టీఆర్యూహెచ్ఎస్పీజీమెట్-2016-17లో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హులు. మరిన్ని వివరాలు, కౌన్సెలింగ్ షెడ్యూల్కు హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ లేదా ఏపీకి చెందిన హెచ్టీటీపీ://ఏపీపీజీఎంఈడీ.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్ లేదా తెలంగాణకు చెందిన హెచ్టీటీపీ://టీఎస్పీజీఎంఈడీ.ఏపీఎస్సీహెచ్ఈ.ఏసీ.ఇన్ వెబ్సైట్లలో పొందవచ్చు. -
మెడికల్ పీజీ అడ్మిషన్లకు వెబ్ కౌన్సెలింగ్
♦ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు ♦ ఏయూలో షెడ్యూల్ విడుదల విశాఖ మెడికల్: ఈ ఏడాది నుంచి మెడికల్ పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో సీట్ల కేటాయింపునకు వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ టి.రవిరాజు చెప్పారు. శనివారం ఆంధ్రా వైద్య కళాశాలలో ఆయన 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలివిడత పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆన్లైన్ విధానంలో అభ్యర్థి ఎంపిక చేసుకొని వదిలేసిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ వరకూ ఎంపిక చేసుకొనే అవకాశం ఉండేది కాదని, వెబ్ కౌన్సెలింగ్ విధానంలో వాటిని ఎప్పటికప్పుడు ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు. కౌన్సెలింగ్ సమాచారం... సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఈ నెల 20 నుంచి 23 వరకు. కేంద్రాలు: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, విశాఖపట్నంలోని ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ , హైదరాబాద్ జేఎన్టీయూ. సీట్లు: 2,587, కన్వీనర్ కోటా: 1,905, మేనేజ్మెంట్ కోటా: 682. వెబ్ ఆప్షన్ల నమోదు: 21 నుంచి 25 వరకు. మొత్తం కాలేజీలు: 39, ప్రభుత్వ కాలేజీలు:13, ప్రైవేటు కాలేజీలు:26 మొత్తం సీట్లు: ఏయూ పరిధిలో ప్రభుత్వ కోటా సీట్లు: 396, ప్రైవేటు కాలేజీల్లో: 545, ఎస్వీ పరిధిలో 235, 236, ఉస్మానియా పరిధిలో 530, 484 సీట్లు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రభుత్వ కోటా సీట్లు: 61, వీటిలో స్థానికులకు 85 శాతం సీట్లు. ఈ నెల 27వ తేదీన సీట్లు కేటాయించి విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ పంపిస్తామని వీసీ రవిరాజు తెలిపారు. విద్యార్థులు వెబ్సైట్లో సీటు అలాట్మెంట్ వివరాలు చూసుకోవచ్చని చెప్పారు. రెండో విడత డెంటల్ పీజీ కౌన్సెలింగ్ను మే 31 తరువాత నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.కుమార్, సామాజిక వైద్య విభాగాధిపతి ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు. -
ఏప్రిల్లో పీజీ మెడికల్ కౌన్సెలింగ్..
వెబ్ కౌన్సెలింగ్కు సన్నాహాలు! విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్ (డిగ్రీ/ డిప్లొమా) కోర్సుల్లో 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లకు ఏప్రిల్ మూడో వారంలో తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైస్చాన్స్లర్ టి.రవిరాజు మంగళవారం తెలిపారు. పారా మెడికల్ కౌన్సెలింగ్ మాదిరిగా పీజీ మెడికల్కు ఈ ఏడాది వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులకు మే ఒకటో తేదీకి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం మే 30వ తేదీకి పూర్తి చేస్తామన్నారు. -
‘టెన్’షన్
శ్రీకాకుళం :ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రభుత్వ పాఠశాలల బోధనపై ప్రధాన ప్రభావం చూపింది. వేసవి సెలవుల్లో బదిలీలు చేపడతామని చెప్పిన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత ఆగస్టులో ప్రక్రియ చేపట్టింది. ఆన్లైన్ విధానం ద్వారానా, వెబ్ కౌన్సెలింగ్ విధానం ద్వారానా అనే విషయంపై తర్జన భర్జన పడింది. చివరికి సెప్టెంబర్ 30న వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేపట్టేందుకు ఉత్తర్వులు వెలువరించింది. ఇందులోనూ గందరగోళాన్ని సృష్టిస్తూ రెండు నెలలపాటు తాత్సారం చేసింది. నవంబర్ చివరి వారంలో ప్రక్రియను చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పోస్టులను సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంలో కూడా తర్జన భర్జన పడి చివరికి ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే రేషనలైజేషన్ చేపట్టింది. జనవరిలో పని సర్దుబాటు పేరిట రేషనలైజేషన్ చేపట్టి వివాదానికి తెరలేపింది. ప్రభుత్వం సెప్టెంబర్లో జీఓ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో 75 మంది పిల్లలుంటే ఆ పాఠశాలను పూర్తిస్థాయి ఇంగ్లీష్ మీడియంగా మార్చేయాలని ఆదేశించింది. అక్కడ ఉన్న తెలుగు మీడియం పిల్లలను సమీపంలోని పాఠశాలలకు తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కూడా వివాదమై ఆందోళన చేపట్టే దిశగా పయనించింది. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాలి. ఆగస్టు వరకు పాఠ్య పుస్తకాలు సరఫరా అవుతూనే ఉన్నాయి. ఇందులో పదవతరగతికి చెందినవి కూడా ఉన్నాయి. ఇది కూడా బోధనకు అవాంతరాలు ఏర్పడేలా చేసింది. సెప్టెంబర్ చివరి వారం నుంచి పదవతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఈ ఏడాది జనవరి రెండో వారం వరకు అటువంటి దాఖలాలే లేవు. ఇప్పుడిప్పుడే సామర్థ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి సత్ఫలితాలనిస్తే తప్ప ఉత్తీర్ణతా శాతం మెరుగుపడే అవకాశం ఉండదు. -జిల్లాలో 470 ప్రభుత్వ పాఠశాలలు, 32 కేజీబీవీలతోపాటు సాంఘిక, గిరిజన సంక్షేమ, నవోదయ, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. 50 ప్రైవేటు పాఠశాలలున్నాయి. మొత్తంగా 37,741 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరిగా లేకపోవడంతో ఆ ప్రభావం ఉత్తీర్ణతా శాతంపై పడేలా వుంది. ప్రత్యేక దృష్టి సారించాం ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు ఇస్తున్నా. బదిలీలు, కౌన్సిలింగ్ సందర్భాల్లో ఉపాధ్యాయులను పాఠశాల నుంచి వేరొక దగ్గరికి రప్పించలేదు. అందువల్ల బోధనకు ఆటంకం కలగలేదు. వెబ్ విధానం వలన ఉపాధ్యాయులకే నేరుగా సమాచారం అందింది. దీని వల్ల ఒక గంట కూడా ఉపాధ్యాయులు పాఠశాలకు దూరంగా లేరు. దేవానందరెడ్డి, డీఈవో -
15లోగా టీచర్ల సర్దుబాటు
504 మంది గుర్తింపు మిగులు ఉపాధ్యాయులు 804 మంది ఇది తాత్కాలికమే మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతుండడంతో ఉపాధ్యాయుల మిగులు అధికమవుతోంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఇటీవలే బదిలీలు నిర్వహించిన విద్యాశాఖ తాజాగా మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను తెరపైకి తెచ్చింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి టీచర్లు అధికంగా ఉన్న పోస్టులను గుర్తించి అవసరం ఉన్నచోట వారిని సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఈ నెల 15 నాటికి పూర్తిచేయాలని విద్యాశాఖ కమిషన్ జనవరి ఒకటో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది, ఉన్నత పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకు ఒక టీచరు చొప్పున నియమించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత సర్దుబాటు తాత్కాలికమేనన్నారు. సర్దుబాటు ఉపాధ్యాయులు 804 మంది... టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి మేరకు జిల్లాలో 804 మంది టీచర్లు మిగులు ఉన్నట్లు విద్యాశాఖాదికారులు గుర్తించారు. వారిలో 296 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 508 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. మిగులుగా ఉన్న 296 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లలో 141 మందిని ప్రాథమికోన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేసేం దుకు అవకాశం ఉన్నట్లు నిర్ధారించారు. స్కూల్ అసిస్టెంట్లు 508 మందిలో 33 మందిని యూపీ పాఠశాలల్లో, మరో 333 మందిని ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ నేతృత్వంలోనే... ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారాలు ఆయా డివిజన్లవారీగా కమిటీలు ఏర్పాటుచేసి వాటి పర్యవేక్షణలోనే చేయాలని నిర్ణయించారు. వీటిల్లో డీఈవో, డీవైఈవో, ఎంఈవో సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలోనే ఉపాధ్యాయుల సర్దుబాటు ఉండాలని, మరీ అవసరమైతే పక్క మండలాల నుంచి కూడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. గుర్రుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు... ఈ సర్దుబాటు వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుర్రుగా ఉన్నారు. నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాలనే నిబంధన ఉన్నా సర్దుబాటు కోసం ఇచ్చిన జీవోలో ఈ నిష్పత్తిని పెంచారని వారంటున్నారు. జనవరిలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తే వారు ఎంతమేర పాఠ్యాంశాలు బోధిస్తారని నేతలు ప్రశ్నిస్తున్నారు. రోజుకో ఉత్తర్వులు జారీ చేసి ఉపాధ్యాయులను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జాబితాలు సిద్ధం ఉపాధ్యాయుల సర్దుబాటును ఈ నెల 15లోగా పూర్తిచేస్తాం. ఉపాధ్యాయుల అవసరం ఎక్కడ ఉంది.. ఎక్కడెక్కడ ఉపాధ్యాయుల మిగులు ఉందనే అంశంపై జాబితాలు సిద్ధం చేశాం. మరోసారి వాటిని పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తాం. -ఎ.సుబ్బారెడ్డి, డీఈవో -
7న నర్సింగ్ సీట్లకు వెబ్కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ, తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ కోర్సుల్లో అడ్మిషన్లకు జనవరి 7న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎస్ బాబూలాల్ తెలిపారు. ఇంతకుముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకాని అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఏడో తేదీన విజయవాడలోని హెల్త్ వర్సిటీలో, హైదరాబాద్లోని జేఎన్టీయూలో వెబ్కౌన్సెలింగ్కుహాజరుకావాలన్నారు. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వికలాంగ అభ్యర్థులకు 7న ఉదయం 9 గంటలకు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇంతకుముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరైన అభ్యర్థులు నేరుగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని హెల్త్ వర్సిటీ తెలిపింది. జనవరి ఏడు, ఎనిమిది తేదీల్లో వెబ్లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో కలిపి బీఎస్సీ నర్సింగ్లో 4,104 సీట్లు భర్తీ కాగా, ఇంకా 2,332 సీట్లు, బీపీటీలో 852 సీట్లు భర్తీ కాగా, ఇంకా 222 సీట్లు, బీఎస్సీ ఎంఎల్టీలో 591 సీట్లు భర్తీ కాగా, ఇంకా 608 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ధ్రువపత్రాలతో హాజరుకావాలి. -
టీచర్లకు షోకాజ్
నిబంధనలకు విరుద్ధంగా పాయింట్ల కేటాయింపుపై 3,850 మందికి నోటీసులు 246 మంది హెచ్ఎంలు,ఎంఈవోలు, డీవైఈవోలకు సైతం మచిలీపట్నం : ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల వెబ్ కౌన్సెలింగ్లో పాయింట్ల కేటాయింపులో తప్పుడు సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం సాయంత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాయింట్లు ఎలా కేటాయించుకున్నారని ప్రశ్నిస్తూ.. దీనికి సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 3,850 మంది టీచర్లు, 246 మంది ప్రధానోపాధ్యాయులు, అన్ని మండలాల విద్యాశాఖాధికారులు, డీవైఈవోలకు ఈ షోకాజ్ నోటీసులను అందజేసినట్లు ఆయన చెప్పారు. పాయింట్ల కేటాయింపులో ఉపాధ్యాయులు తప్పులు చేస్తే హెచ్ఎంలు, ఎంఈవోలు, డీవైఈవోలు ఎలా కౌంటర్ సైన్ చేశారని, దీనికి సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నెల రోజుల పాటు వెబ్ కౌన్సెలింగ్ పేరుతో జాప్యం చేసిన ప్రభుత్వం కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయటంపై పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే ప్రభుత్వం లోపభూయిష్టంగా వ్యవహరించిందని, గత డీఈవోను ఈ కారణం చూపి సస్పెండ్ చేశారని ‘సాక్షి’తో అన్నారు. విద్యాశాఖ వైఖరిపై పోరుబాట పట్టనున్నట్లు ఆయన చెప్పారు. -
24, 25 తేదీల్లో టీచర్ల బదిలీలకు వెబ్ కౌన్సెలింగ్
షెడ్యూల్ ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్: టీచర్ల బదిలీలకు ఈ నెల 24, 25 తేదీల్లో వెబ్కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రేషనలైజేషన్, ఖాళీల ప్రకటనకు విద్యాశాఖ గతంలో తేదీల ను ప్రకటించింది. ఈ మేరకు 7వ తేదీలోగా రేషనలైజేషన్ను పూర్తిచేయనున్నారు. 9న పాఠశాలల వారీగా, సబ్జెక్టుల వారీగా ఖాళీలను ప్రకటిస్తారు. 10 నుంచి 12వ తేదీవరకు ఆన్లైన్లో బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించి, వాటి ప్రింటవుట్లను ఎంఈఓ, డిప్యుటీ డీఈవోలకు సమర్పించాలి. 11 నుంచి 13 వరకు ఈ దరఖాస్తులను డీఈవోలు స్వీకరిస్తారు.ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు సీనియార్టీ జాబితాలు రూ పొందిస్తారు. 14న పెర్ఫార్మెన్సు పాయింట్లు, ఎన్టైటిల్మెంటు పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియార్టీ జాబితాను ప్రకటిస్తారు. 15 నుంచి 17 వరకు ఈ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలుంటే సంబంధిత ఆధారాలతో వాటిని అప్లోడ్ చేయాలి. 19వ తేదీన ఈ అభ్యంతరాలపై పరిష్కారాలు, ఇతర సమాచారాలను జిల్లాల విద్యాశాఖాధికారులు వెబ్సైట్లో పోస్టు చేస్తారు. 20, 21 తేదీల్లో ఆయా టీచర్లు తమ బదిలీ దరఖాస్తుపై అంగీకారం తెలుపుతూ ఖరారు చేయాలి. 23న తుది విడత సీనియార్టీ జాబితా, పనితీరు, ఎన్టైటిల్మెంటు పాయింట్లతో సహా వెబ్సైట్లో పొందుపరుస్తారు. 24, 25 తేదీల్లో ఆయా ఖాళీలను అనుసరించి టీచర్లు, హెడ్మాస్టర్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవలి. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్సైట్లో బదిలీ ఉత్తర్వులను అధికారులు జారీచేస్తారు.అభ్యర్థులు ఇచ్చే వెబ్ ఆప్షన్ల ఆధారంగానే అలాట్మెంటు జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ సంధ్యారాణి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని అంశాలకు కటాఫ్ తేదీని ఆగస్టు 31గా పరిగణించనున్నారు. -
7 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారిగా వెబ్కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీల్లో మైనస్ పాయింట్లూ పరిగణనలోకి తీసుకోనున్నారు. బదిలీలకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ‘ఏపీ టీచర్స్ (రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) రూల్స్’ పేరుతో జీవో నెంబర్ 63 విడుదల చేశారు. పనితీరు కింద ప్లస్ పాయింట్లతో పాటు లోపాలుంటే మైనస్పాయింట్లను పరిగణిస్తామని పేర్కొన్నారు. బదిలీల కోసం విభాగాల వారీగా జిల్లా, జోన్ల కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. బదిలీ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రూపొందిస్తారు. అసెంబ్లీ సమావేశాలు, టీచర్స్డే కారణంగా సెప్టెంబర్ 7 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభ మవుతుందని అధికారవర్గాలు వివరించాయి. 2015 ఆగస్టు 1 నాటికి ఒకే స్కూల్లో 8 ఏళ్లు సర్వీసు పూర్తయిన టీచర్లు, అయిదేళ్లు సర్వీసు చేసిన హెడ్మాస్టర్లు (రెండేళ్లలో రిటైర్కానున్న వారికి దీన్నుంచి మినహాయింపు). బాలికల హైస్కూళ్లలోని 50 ఏళ్ల లోపు పురుష హెచ్ఎంలు, టీచర్లు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారు బదిలీ దరఖాస్తుకు అర్హులు. రేషనలైజేషన్లో వేరే స్కూలుకు మారే టీచర్లు సర్వీసుతో సంబంధం లేకుండా బదిలీ దరఖాస్తు చేయొచ్చు. స్కూళ్లున్న ప్రాంతాలను బట్టి కేటగిరీ 1కి 1, కేటగిరీ 2కు 2, కేటగిరీ 3కి 3, కేటగిరీ 4కి 5 పాయింట్లు. హెచ్ఆర్ఏ, రోడ్డు కనెక్టివిటీలను అనుసరించి ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ కేటగిరీలను నిర్ణయిస్తారు. -
బదిలీల్లో ఇదేం పాయింటు..
పనితీరు పాయింట్ల కేటాయింపుపై వ్యక్తమతున్న భిన్నాభిప్రాయాలు ఇలాగైతే నష్టపోతామంటున్న టీచర్ సంఘాల ప్రతినిధులు మురళీనగర్(విశాఖ): ఉపాధ్యాయుల బదిలీలలకు సంబంధించి విడుదలైన షెడ్యూలుపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేసినప్పటికి పనితీరుకు సంబంధించి పాయింట్ల కేటాయింపుపై వీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగుపై ఏకాభిప్రాయం కుదిరినా పాయింట్ల కేటాయింపులో పారదర్శకత, స్పష్టతపై సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సంఘ ప్రతినిధులు లేవనెత్తుతున్న అభ్యంతరాలివీ! దాతల సాయంతో పాఠశాల అభివృద్ధికి నిధుల సేకరణ చేసిన వారికి పాయిట్ల కేటాయింపు అనేది బోధనకు ప్రాధాన్యతనిచ్చే ఉపాధాయునికి చేతకాకపోవచ్చు ఇలాంట ప్పుడు ఆ ఉపాధ్యాయుడు పాయింటుల నష్టపోతాడు. గ్రామీణ ప్రాంతాల్లో నిధుల సమీకరణ సాధ్యం కాదు. హాజరు శాతంకు సంబంధించి మహిళా ఉపాధ్యాయులు ప్రసూతి సెలవులు, పురుష ఉపాధ్యాయులు పెటర్నటీ లీవ్, ఉన్నత విద్యార్హతల కోసం లాంగ్ లీవ్ వాడుకునే వారు నష్టపోవాల్సిందేనా?పదోతరగతిలో ఫలితాల ఆధారంగా పాయింట్లు కేటాయింపు అనేది తక్కువ విద్యార్థులున్న పాఠశాలలకే న్యాయం జరుగుతుంది. వందమందికి పైగా పదోతరగతి పరీక్షలు రాసిన పాఠశాలలో ఒక్కరు పరీక్ష తప్పినా ఎక్కువ శాతం పడిపోతుంది. ఒక సబ్జెక్టులో విద్యార్థి పరీక్ష తప్పితే అది ఇతర సబ్జెక్టు ఉపాధాయులపై ప్రభావం పడుతుంది. పదోతరగతి బోధించని ఉపాధ్యాల మాటేమిటి? అవార్డులు పొందిన వారికి పాయింట్లు కేటాయించడం వల్ల జూనియర్లకు అన్యాయం జరుగుతుంది. గతంలో జాతీయ పురస్కారానికి 15పాయింట్లు, రాష్ట్ర అవార్డుకు 10మార్కులు కేటాయించేవారు. ఇప్పుడు అన్నిటికి ఒకే విధంగా 5పాయింట్లు ఇస్తామంటున్నారు. పిల్లల నమోదుపెరుగుదలకు సంబంధించి పాఠశాల వయసుగల పిల్లలు తగ్గిపోతున్న ఆవాసప్రాంతాల పరిస్థితి ఏమిటి?గతేడాది 3,5,8తరగతుల్లో ఎ, ఎ-ప్లస్, శ్రేణుల్లో 80శాతం ఉత్తీర్ణత సాదించిన పిల్లలు ఉంటే రెండు పాయింట్లు కేటాయిస్తామంటున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఉత్తీర్ణత శాతం ఆధారపడి ఉంటుంది. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయకుండా పాయింట్లు నిర్ధారణ ఎలా చేస్తారనేది సందేహమే.ఉపాధాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే అదనంగా పాయింట్లు ఇస్తామంటున్నారు. ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాల స్థాయిలో అభ్యసించడానికి పిల్లలు లేనివారు నష్టపోతారు. పాఠశాలల్లో పీఈటీలు, క్రీడా మైదానాలు లేకుండా ఈ విభాగంలో పాయింట్లు కేటాయింపు విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉంది.పాయింట్ల కేటాయింపులో సవరణ లు చేసి మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టి మెజార్టీ ఉపాధ్యాయులకు న్యాయం జరిగే విధంగా చూడాలని వైఎస్సార్ టిఎఫ్, ఏపీటిఎఫ్(1938) సంఘాల జిల్లా అధ్యక్షులు చిరికి శ్రీనివాసరావు,ఎం.జే.సేవియర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై తాము విద్యాశాఖ కార్యదర్శికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు. -
ఇక టీచర్లకు వెబ్ కౌన్సెలింగ్
ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి వెబ్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో షెడ్యూల్ విడుదల కానుం ది. ఈలోగా ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయమని రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందినట్లు విద్యాశాఖ సిబ్బంది తెలిపారు. చిత్తూరు (గిరింపేట):జిల్లాలో 16వేల ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, సుమారు 4వేల మంది బదిలీ కౌన్సెలింగ్కు హాజరయ్యే అవకాశం ఉంది. రెండేళ్ల నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు స్థానచలనం పొందనున్నారు. బదిలీ కావాల్సిన వారు ఛిట్ఛ.్చఞ.జౌఠి.జీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రక్రియ ప్రారంభించే నాటికి ఉన్న ఖాళీలు, 8 ఏళ్ల సర్వీసు నిండిన ఖాళీల వివరాల క్రమబద్ధీకరణతో వచ్చిన ఖాళీల జాబితాను వెబ్సైట్లో విద్యాశాఖ పొందుపరచనుంది. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల గడువు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు ఇలా.. ఉపాధ్యాయులు తొలుత వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని సంబంధిత ఎంఈవోకు, ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలి. అవసరమైన ధ్రువీకరణపత్రాలు అందజేయాలి. ఎంఈవో, హెచ్ఎంలు దరఖాస్తును, సర్టిఫికెట్లను పరిశీలించి వాటిని ధ్రుువీకరిస్తూ డీఈవోకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. వీటిని డీఈవో పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయునికి ఎన్టైటిల్మెంట్ పాయింట్లను కేటాయిస్తారు. దరఖాస్తు గడువు ముగిసిన అనంతరం ఒక రోజులో పాయింట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. దీని ఆధారంగా ప్రాధాన్య క్రమాన్ని సూచిస్తూ జాబితా తయారుచేసి వెబ్సైట్లో పొందుపరుస్తారు. దీనిపై అభ్యంతరాలుంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలకు రెండు మూడు రోజుల సమయం కేటాయిస్తారు. అభ్యంతరాల పరిశీలన తరువాత తొలి జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తుదారులు తుది ప్రాధాన్యతను పరిశీలించి తమకు క్యాడర్లో ఎవరు దరఖాస్తు చేశారో.. ఏఏ పాఠశాలలకు అవకాశం ఉంటుందో చూసుకుని ధ్రువీకరించాలి. ఒకసారి ధ్రువీకరణ చేస్తే ఆ ఉపాధ్యాయుని స్థానం కూడా ఖాళీల జాబితాలోకి వెళ్తుంది. అయితే ఉన్న స్థానం పోతుందనే ఆందోళన చెందాల్సినవసరం లేదు. ధ్రువీకరణ చేయగానే ఉపాధ్యాయుడి ఫోన్కు ఎస్ఎంఎస్ ద్వారా పాస్వర్డ్ వస్తుంది. దీంతో వెబ్సైట్లోకి లాగిన్ అయితే క్యాడర్కు సంబంధించిన ఖాళీలు చూపుతుంది. ఖాళీల ప్రాధాన్య క్రమంలో ఉపాధ్యాయులు ఎంపికచేసుకోవాలి. తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు ప్రదర్శించిన ఖాళీల జాబితాలో ప్రాధాన్యం ఇవ్వాల్సిఉంటుంది. ఉదాహరణకు ఒక క్యాడర్లో 500 ఖాళీలుంటే అన్నింటికీ ఆప్షన్లు ఇవ్వాలి. రెండు నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి కాని ఉపాధ్యాయులు తమకు అవసరమైన పాఠశాలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గరిష్ట పరిమితి 199 ఆప్షన్లను కల్పిస్తారు. ఉపాధ్యాయులు ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా చివరి ఆప్షన్గా తాను పనిచేస్తున్న పాఠశాలను విధిగా చేర్చాలి. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన ఐదు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు ఆన్లైన్ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. బదిలీ అయిన ప్రాంత సమాచారం మొబైల్కు మెసేజ్ ద్వారా అందుతుంది. -
బదిలీల సందడి
ఎన్నాళ్ల నుంచో వేచిన సమయం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు కోరుకున్న స్థానానికి బదిలీపై వెళ్దామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఉద్యోగుల అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ మేరకు జిల్లాలోని ఉద్యోగుల్లో బదిలీ ఉత్సాహం ఉరకలెత్తుతోంది. టీచర్ల హేతుబద్ధీకరణ విజయనగరం అర్బన్: రెండేళ్లుగా బదిలీలుగాని, మూడేళ్లగా హేతుబద్ధీకరణగాని చేపట్టకపోవడం వల్ల బదిలీ కోసం ఎదురు చూసే టీచర్లు వేలసంఖ్యలో ఉన్నారు. అయితే వారి నిరీక్షణకు ఇక తెరపడనుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 25 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. వారిలో విద్యాశాఖ పరిధిలోనే 12,600 మందికి పైగా ఉపాధ్యాయులు ఉండడం విశేషం. వీరిలో ప్రస్తుతం సుమా రు 6,700 మంది వరకు బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియల్లో భాగస్వాములవుతారని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల అంచనా. దీంతో విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయుల్లో ప్రస్తుతం బదిలీల సందడి నెలకొంది. తొలుత బడులు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కిలోమీటర్ పరిధిలో ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాల విధానాన్ని అమలులోకి తెస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల జిల్లా వ్యాప్తంగా 194 పాఠశాలను విలీనం అవుతాయి. దీంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను ఆదర్శపాఠశాలకు పంపుతారు. కనీసం 100 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉండేవిధంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల 600 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు తప్పదు. వెబ్కౌన్సెలింగ్పైనే మొగ్గు ప్రభుత్వ నూతనంగా ప్రవేశపెడుతున్న వెబ్కౌన్సెలింగ్పైనే ఉపాధ్యాయులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఖాళీ పోస్టుల వివరాలు, టీచర్ల సీనియార్టీ జాబితా తదితర అంశాలను పారదర్శకంగా వెబ్సైట్లో పెట్టి పక్కాగా నిర్వహిస్తే అక్రమ బదిలీలను అడ్డుకోవచ్చని ఉపాధ్యాయ సంఘాలు మొగ్గు చూపుతున్నాయి. అయితే అలాంటి ప్రక్రియ జరిగితే అక్రమబదిలీల సిఫార్సులను చేయలేమని వెబ్కౌన్సెలింగ్ ఈ ఏడాదికి విరమించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందనే ఆరోపణలు కూడా వచ్చా యి. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో తాజాగా వెబ్కౌన్సెలింగ్ విధానాన్నే ఖరారు చేశారు. ఆరు స్థాయిల్లో బదిలీ ప్రక్రియ మొత్తం బదిలీల ప్రక్రియను ఆరు స్థాయిల్లో నిర్వహించనున్నారు. ముందుగా ఇప్పటికే ఉన్న ఖాళీలు, ఎనిమిదేళ్లు ఒకే చోట సర్వీసు కలిగిన ఖాళీలు, హేతుబద్ధీకరణ ద్వారా వచ్చిన ఖాళీలను ప్రదర్శిస్తారు. అనంతరం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మూడురోజులు సమయం ఇస్తారు. ఉపాధ్యాయుడు దరఖాస్తు చేసిన ప్రింట్ను తీసుకుని సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులకు సమర్పించి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వారు వాటిని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపుతారు. అనంతరం తాత్కాలిక సీనియారిటీ జాబితాను ఎన్టైటిల్మెంట్ పాయింట్లతో వెబ్సైట్లో ఉంచుతారు. దీనిపై దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సెల్ఫోన్లకు పాస్వర్డ్ వస్తుంది. అనంతరం తాము పనిచేయదలుచుకున్న, కోరుకుంటున్న పాఠశాలల వివరాలను ఆన్లైన్లోనే నమోదుచేయాల్సి ఉంటుంది. అవసరమైతే రెండుసార్లు వాటిని మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తారు. వెబ్కౌన్సెలింగ్ ద్వారా సీనియారిటీలో తమకిందనున్న వారు ఖాళీ చేసిన స్థానాలను సైతం ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించడం ఈసారి అరుదైన అవకాశంగా ఉపాధ్యాయులు భావిస్తున్నారు. వెబ్కౌన్సెలింగ్ ముగిసిన ఐదురోజుల్లో బదిలీ ఉత్తర్వులు పంపుతారు. ఉపాధ్యాయుల సెల్నంబర్లకు కూడా సంక్షిప్త సమా చారం పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 6,700 మంది వరకు బదిలీ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. జెడ్పీలో నేడు బదిలీలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు నేడు జరగనున్నాయి. ఇప్పటికే సిఫార్సులు, పైరవీలు పెద్ద ఎత్తున జరిగాయి. కౌన్సెలింగ్లో అవి ఎంతమేర ప్రభావం చూపుతాయో శుక్రవా రం స్పష్టం కానుంది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులంతా బదిలీకి అర్హులు. కానీ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో కాల వ్యవధితో పనిలేకుండా ఎవరినైనా బదిలీ చేసే వెసులుబాటు జిల్లా పరిషత్కు ఉంది. దా న్నే వజ్రాయుధంగా చేసుకోవాలని పాలకులు చూస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు జెడ్పీ సమావేశ భవనంలో బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయనున్నారు. ఐదేళ్ల కాల పరిమితి, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో బదిలీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికైతే ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ఎంపీడీఓలు ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు శ్రీధర్రాజా, మరొకరు పూసపాటిరేగ ఎంపీడీఓ లక్ష్మి. ఇందులో శ్రీధర్రాజా గంట్యాడ ఎంపీడీఓ హోదాలో ప్రస్తుతం జెడ్పీ డిప్యూటీ సీఈఓగా పనిచేస్తున్నారు. దీంతో శ్రీధర్ రాజా స్థానంలో గంట్యాడలో మరొకర్ని నియమించనున్నారు. అలాగే, పూసపాటిరేగ ఎంపీడీఓ తన సీటు ఖాళీ చేయాల్సి ఉంటోంది. ఇక, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో మరికొందర్ని బదిలీ చేయనున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తమకు నచ్చని ఎంపీడీఓను బదిలీ చేయాలని, తమకు కావల్సిన వారిని నియమించాలని కోరుతూ ఇప్పటికే సిఫార్సులు లేఖలు ఇచ్చారు. ఇదే క్రమంలో కొందరు పైరవీలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. కావాల్సిన పోస్టింగ్ ఇప్పించేందుకు లోపాయికారీ సంప్రదింపులు చేసుకు న్నారన్న వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, పంచాయతీరాజ్లో ఈఓపీఆర్డీ, సూపరింటెండెంట్లుగా పనిచేసి ఎంపీడీఓలగా పదోన్నతి పొందిన వారు పది మంది ఉన్నారు. వీరందరికీ పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన పాత వారిలో కొందర్ని కదిపే అవకాశం ఉంది. ఇక, ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టుల్ని కూడా కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయనున్నారు. అయితే, వీరి బదిలీపై కూడా సిఫార్సులు ఉన్నాయి. వివిధ హోదాల్లో ఉన్న పలువురు టీడీపీ నేతలు తమకు కావల్సిన వ్యక్తుల్ని వేసుకునేందుకు ఇప్పటికే సంప్రదింపులు చేసినట్టు తెలుస్తోంది. మరి బదిలీల విషయంలో విమర్శలకు తావిచ్చేలా వ్యవహరిస్తారో,పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారో చూడాల్సి ఉంది. -
16 నుంచి టీచర్ల బదిలీలు!
తొలిసారిగా బదిలీలకు వెబ్కౌన్సెలింగ్ విధానం హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 16వ తేదీనుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. బదిలీల్లో తొలిసారిగా వెబ్కౌన్సెలింగ్ను ప్రవేశపెడుతున్నందున దీనిపై టీచర్ల సంఘాలకు అవగాహన, అనుమానాల నివృత్తికి పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నమూనా ప్రక్రియను నిర్వహించింది. డెరైక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డెరైక్టర్ సంధ్యారాణి, జాయింట్ డెరైక్టర్ రమణకుమార్, అడిషనల్ డెరైక్టర్ గౌరీశంకర్, ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు, సంఘాల నేతలు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి, కత్తి నరసింహారెడ్డి, పాండురంగ వరప్రసాద్, కమలాకర్రావు, హృదయరాజు, వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. రేషన లైజేషన్ ఉత్తర్వులు శుక్రవారం విడుదల కావడంతో మరో రెండు రోజుల్లో బదిలీల షెడ్యూల్ ఉత్తర్వులు కూడా విడుదల చేయనున్నామని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను అనుసరించి 2013లో బదిలీ అయిన టీచర్లు వారు కోరుకున్న స్థానం ఖాళీగా ఉంటే ముందే రిలీవ్ చేస్తారు. లేనిపక్షంలో వెబ్కౌన్సెలింగ్లో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను జిల్లాల్లోని అన్ని మండలాలకు సమానంగా పంచాలని సంఘాల నేతలు కోరారు. వెబ్కౌన్సెలింగ్లో భార్యాభర్తల బదిలీకి సంబంధించి సాఫ్ట్వేర్ సమగ్రంగా లేదని సంఘాలు అభిప్రాయపడ్డాయి. భార్యాభర్తల ప్రాధాన్యం కింద బదిలీ కోరుకొనేవారు డివిజన్ యూనిట్గా ఖాళీలకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వివరించారు. -
టీచర్ల బదిలీల తకరారు
ఏలూరు సిటీ : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియపై స్పష్టత కొరవడింది. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని నూతనంగా అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తుండగా...ఈ విధానంతో టీచర్లు తమ స్వేచ్ఛను కోల్పోతారని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. బదిలీల కౌన్సెలింగ్కు ఇంకా సరైన విధి విధానాలు ఖరారు కాలేదని విద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటికే ఆదర్శ ప్రాథమిక పాఠశాలల పేరుతో కొన్ని ప్రైమరీ స్కూళ్లను మూసివేసేందుకు అధికారులు నివేదికలు సమర్పించారు. ఇవన్నీ పూర్తి చేసేందుకు విద్యాధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రమబద్ధీకరణ పేరుతో జిల్లాలో రెండు దశల్లో 189 ప్రాథమిక పాఠశాలలకు, మునిసిపల్ యాజమాన్యంలో 16 స్కూళ్లకు తాళాలు పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో పాఠశాలల మూసివేతపై ప్రజల నుంచి అభ్యంతరాలు రావటంతో ఈసారికి వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు మంచిదేనని అయితే స్కూళ్లను మూసివేయకుండా కేరళ తరహాలో అన్ని స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ వినవస్తోంది. వెబ్ కౌన్సెలింగ్ వద్దంటున్న టీచర్లు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాత విధానానికి బదులు కొత్తగా ఎంసెట్ తరహాలో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 7న డెమో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రాథమిక విద్య ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మాత్రం వెబ్ కౌన్సెలింగ్ వద్దంటున్నారు. ఒక్కో టీచర్ 99 ఆప్షన్లను పెట్టుకోవచ్చని, ఇంటి నుంచో, నెట్ సెంటర్ల నుంచో సులువుగా చేయవచ్చని విద్యాధికారులు చెబుతున్నారు. కానీ పాత విధానంలో అయితే ఖాళీలను చూసుకుంటూ తమ అవకాశం వచ్చినప్పుడు బదిలీ స్థానాన్ని ఎంపిక చేసుకోవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. పైగా భార్యాభర్త, ప్రత్యేక కేటగిరీల్లో ఇబ్బందులు వస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు నాలుగువేల మంది ఉపాధ్యాయులు బదిలీ కౌన్సెలింగ్లో ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. క్రమబద్ధీకరణతో పిల్లలకు కష్టాలే తొలుత ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ పూర్తి చేసి అనంతరం బదిలీలు చేపడతారు. దీనిలో భాగంగానే 20లోపు పిల్లలున్న పాఠశాలలు, అసలు పిల్లలు లేని స్కూళ్లను మూసివేసి అక్కడి ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేస్తారు. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేస్తుండటంతో మిగులు టీచర్లను క్రమబద్ధీకరిస్తే గానీ పూర్తిస్థాయిలో ఖాళీలు ప్రకటించే అవకాశం లేదు. జిల్లాలో మొదటి దశలో 364 స్కూళ్లను గుర్తించగా 281ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేశారు. వాటిలో 83 స్కూల్స్ విలీనం అవుతున్నాయి. రెండో దశలో 198 స్కూళ్లను గుర్తిస్తే 92 ఆదర్శ పాఠశాలలుగా ఏర్పాటు అవుతాయి. వీటిలో 106 పాఠశాలలు విలీనం అవుతున్నాయి. మొత్తానికి 189 పాఠశాలలు మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక మునిసిపల్ యాజమాన్యంలో 46 పాఠశాలలు గుర్తించగా 30 ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేస్తుండగా వీటిలో 16 స్కూళ్లు విలీనం అవుతున్నాయి. ఒకేసారి పిల్లలు లేని స్కూళ్లను మూసివేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో దశల వారీగా తాళాలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. -
నెలాఖరులోగా టీచర్ల బదిలీలు
ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి వెబ్కౌన్సెలింగ్పై సందేహాలు వ్యక్తం చేస్తున్నఉపాధ్యాయ సంఘాలు దీంతో ముందుగా నమూనా వెబ్కౌన్సెలింగ్ లోపాలు సరిదిద్దాక బదిలీల ప్రక్రియ హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని విద్యాశాఖ భావిస్తోంది. బదిలీల ప్రక్రియను ఆగస్టు 15 కల్లా పూర్తిచేయించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. రేషనలైజేషన్తో బదిలీ ప్రక్రియ ముడిపడి ఉన్నందున ఆ తేదీ నాటికి టీచర్ల బదిలీలు పూర్తి చేయలేమని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పాఠశాలలు, టీచర్ల రేషనలైజేషన్కు సీఎం ఆమోదం తెలిపినందున ఆ ప్రక్రియను ముందుగా పూర్తిచేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల వరకే రేషనలైజేషన్ను చేయాలని భావిస్తున్న తరుణంలో కిలోమీటర్ పరిధిలో ఉండే పాఠశాలలు విలీనం కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలు, జాతీయ రహదారులు, నదులు, వాగులు దాటాల్సి వచ్చే ప్రాంతాల ప్రాథమిక పాఠశాలలను ఇందులో నుంచి మినహాయించనున్నారు. పాఠశాలల జాబితా, ఖాళీల సంఖ్యపై తుది నిర్ణయానికి వచ్చాక వాటిని కౌన్సెలింగ్లో చేర్చనున్నారు. ఈసారి వెబ్ ఆధారితంగా చేయాలని నిర్ణయించారు. ఈ విధానంలో గందరగోళంగా మారుతుందని టీచర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాతపద్ధతిలో బదిలీపై వెళ్లే టీచర్ల ఖాళీ స్థానాలు ఎక్కడెక్కడున్నాయో కౌన్సెలింగ్ లో తెలుస్తుంది కనుక అర్హులకు అన్యాయం జరగదంటున్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల సందేహాలను నివృత్తి చేసిన అనంతరం షెడ్యూల్ను ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. తొలుత నమూనా వెబ్కౌన్సెలింగ్ను నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ‘సాక్షి’తో పేర్కొన్నారు. లోపాలు కనిపిస్తే వాటిని సరిచేయించి ఆ తరువాతనే షెడ్యూల్ ప్రకటించి ఈ నెలాఖరునాటికి బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తున్నామని చెప్పారు. -
టీఎస్ పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ విధివిధానాలు...
టీఎస్ పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీఈసెట్)ను తెలంగాణ రాష్ర్టంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంటెక్/ఎంఈ; ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు లేదా గేట్, జీప్యాట్ స్కోర్ల ఆధారంగా వెబ్కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లను కేటాయిస్తారు. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ తేదీలు విడుదలైన తరుణంలో ప్రత్యేక కథనం... పీజీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంటెక్/ఎంఈ కోర్సుల్లో ప్రవేశించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్/ఎంఈలో సీఎస్ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ తదితర బ్రాంచ్లకు సంబంధించిన 60కి పైగా స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (అర్హత: బి.ఫార్మసీ)లో 11 స్పెషలైజేషన్లు ఉన్నాయి. సీట్ల సంఖ్య: ఎంటెక్/ఎంఈలో 30 వేలకు పైగా సీట్లు, ఎం.ఫార్మసీలో దాదాపు 12 వేలు, ఫార్మ్-డిలో వెయ్యి సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో వెబ్ కౌన్సెలింగ్ ఆధారంగా భర్తీచేస్తారు. గేట్, జీప్యాట్కు ప్రాధాన్యం: జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్)లో ర్యాంకు సాధించిన వారికి ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు. దీనికోసం గేట్, జీప్యాట్ ఉత్తీర్ణులు ప్రత్యేకంగా తమ వివరాలను వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పీజీఈసెట్లో ఉత్తీర్ణులకు ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. వెబ్ కౌన్సెలింగ్ విధానం: పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డికు సంబంధించిన కన్వీనర్ కోటా సీట్ల భర్తీ వెబ్కౌన్సెలింగ్ విధానంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఆగస్టు 3న ప్రారంభం కానుంది. ఇది సర్టిఫికెట్ల వెరిఫికేషన్తో మొదలై, సీట్ అలాట్మెంట్తో ముగుస్తుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్: వెబ్ కౌన్సెలింగ్ విధానంలో ఇంటర్నెట్ ఆధారంగా కాలేజీ, కోర్సులకు సంబంధించి వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. దీనికోసం హెల్ప్లైన్ సెంటర్కు వెళ్లి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్టర్ చేయించుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాలు: గేట్/జీ ప్యాట్/పీజీఈసెట్ ర్యాంకు కార్డు, హాల్టికెట్ బీటెక్/బీఫార్మసీ సర్టిఫికెట్, మార్కుల మెమో పదో తరగతి సర్టిఫికెట్ పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు ప్రైవేట్ స్టడీ అయితే ఏడేళ్లకు సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికెట్ కుల ధ్రువీకరణ పత్రం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) 2015, జనవరి 1 తర్వాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణపత్రం ఆధార్ కార్డు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్లు: ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు తెలంగాణ రాష్ట్రంలో అయిదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవి.. జేఎన్టీయూ - హైదరాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, సైఫాబాద్ - హైదరాబాద్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ - సికింద్రాబాద్ ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ - హైదరాబాద్ కాకతీయ యూనివర్సిటీ - వరంగల్ స్పెషల్ కేటగిరీ (ఎన్సీసీ/సీఏపీ/ స్పోర్ట్స్/ పీహెచ్) అభ్యర్థులు సికింద్రాబాద్లోని యూనివర్సిటీ పీజీ కాలేజీ హెల్ప్లైన్ సెంటర్లో మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలి. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ: వెబ్కౌన్సెలింగ్ ప్రక్రియ తొలిదశలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న అభ్యర్థులు మలిదశలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని ఆగస్టు 7 నుంచి ఆగస్టు 16 వరకు ర్యాంకుల వారీగా ఇవ్వాలి. తొలుత అభ్యర్థులు వెబ్సైట్లో లాగిన్ ఐడీని రూపొందించుకోవాలి. దీనికోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్లు తప్పనిసరిగా ఉండాలి. లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్లీ వెబ్సైట్ ఓపెన్ చేసి, ఆప్షన్స్ ఎంట్రీకి సంబంధించిన కాలమ్పై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న కోర్సులు, కళాశాలల వివరాలు కనిపిస్తాయి. అభ్యర్థులు తమ ఆసక్తి, అర్హతల ఆధారంగా ప్రాధాన్యత సంఖ్యను పేర్కొనాలి. ఆప్షన్లు ఇవ్వడం పూర్తయ్యాక, సేవ్ బటన్పై క్లిక్చేసి లాగ్ అవుట్ అవ్వాలి. తర్వాత నిర్దేశించిన తేదీలో సీట్ అలాట్మెంట్ విండో ఓపెన్ అవుతుంది. దాని ఆధారంగా తమకు కేటాయించిన కళాశాల వివరాలను డౌన్లోడ్ చేసుకొని, ఆ కళాశాలలో గడువులోగా రిపోర్ట్ చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్-డి (పోస్ట్ బాక్యులరేట్) కోర్సులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అవకాశం అందుబాటులో ఉంది. కుటుంబ వార్షికాదాయం రూ.రెండు లక్షలలోపున్న ఎస్సీ/ఎస్టీ వర్గాల అభ్యర్థులు, రూ.లక్షలోపున్న బీసీ/ ఈబీసీ వర్గాల అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లభిస్తుంది. ఫీజులు ఆయా కళాశాలలకు ఇచ్చిన గ్రేడ్ల ఆధారంగా రూ. 48,500 నుంచి రూ.1.10 లక్షల వరకు ఉన్నాయి. అయితే రీయింబర్స్మెంట్ మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన మొత్తానికే లభిస్తుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో ఖరారు కానున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. గేట్, జీప్యాట్ ఉత్తీర్ణులకు యూజీసీ/ఏఐసీటీఈ స్కాలర్షిప్ లభిస్తుంది. గతంలో ఈ స్కాలర్షిప్ మొత్తం నెలకు రూ.8 వేలుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.12వేలకు పెంచారు. కౌన్సెలింగ్ షెడ్యూల్: సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు: గేట్/జీప్యాట్ ఉత్తీర్ణులు ఆగస్టు 3, 2015 పీజీఈసెట్ ర్యాంకర్లు ర్యాంకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు 1 - 300 ఆగస్టు 4 301 - 1000 ఆగస్టు 5 1001 - 1850 ఆగస్టు 6 1851 - 2850 ఆగస్టు 7 2851 - 3850 ఆగస్టు 8 3851 - 5000 ఆగస్టు 9 5001 - 7400 ఆగస్టు 11 7401 - లాస్ట్ ఆగస్టు 12 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు: ఆగస్టు 4,5 ఎంటెక్తో ఉన్నత భవిష్యత్తు ప్రస్తుత పోటీ వాతావరణంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉన్నత విద్య అవసరం బాగా పెరిగింది. ఈ ఏడాది ఎంటెక్ కోర్సులో చేరిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే సమయానికి ఎన్నో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఎంటెక్ కోర్సు ద్వారా అకడమిక్ నైపుణ్యాలు పెరుగుతాయి. ఇష్టమైన స్పెషలైజేషన్లో పరిశోధన దృక్పథం అలవడుతుంది. కోర్ స్పెషలైజేషన్లకు డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు. కాబట్టి విద్యార్థులు క్రేజ్ అనే కోణంలో ఆలోచించకుండా ఆసక్తికి ప్రాధాన్యమిచ్చి, ఆప్షన్స్ ఎంట్రీ ఇవ్వడం మేలు. - ప్రొఫెసర్ బి.చెన్నకేశవరావు, ప్రిన్సిపాల్, సీబీఐటీ. కోర్సులు, కళాశాలలపై అవగాహన అవసరం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ముందు విద్యార్థులు తాము పీజీఈసెట్ రాసిన బ్రాంచ్కు సంబంధించి స్పెషలైజేషన్లు అందిస్తున్న కళాశాలలు, ఆయా స్పెషలైజేషన్లపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడు ప్రాధాన్యత క్రమాన్ని మాన్యువల్గా రూపొందించుకోవాలి. ఆ తర్వాతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న కోర్సులు, కళాశాలల వివరాలను పీజీఈసెట్ వెబ్సైట్లో పొందుపరుస్తాం. ఈ లోపు రాష్ట్రంలోని యూనివర్సిటీల వెబ్సైట్ల ఆధారంగా అనుబంధ/ గుర్తింపు పొందిన కళాశాలలు, ఎంటెక్, ఎంఫార్మసీ స్పెషలైజేషన్ల గురించి సమచారం సేకరించుకొని, సిద్ధంగా ఉండాలి. - ప్రొఫెసర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి, కన్వీనర్, టీఎస్పీజీఈసెట్-2015. -
నేటి నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు
తవుకు ఏ కోర్సులు అక్కర్లేదని లేఖలు ఇచ్చిన 16 కాలేజీలు 60 కాలేజీల్లో రెండు, వుూడు బ్రాంచీలకు తనిఖీలు వద్దని లేఖలు హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు వెబ్ కౌన్సెలింగ్లో చేర్చిన ఇంజనీరింగ్ కాలేజీల్లో బుధవారం(22వ తేదీ) నుంచి తనిఖీలు చేపట్టాలని జేఎన్టీయుూహెచ్ నిర్ణరుుంచింది. ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడిన దాదాపు 25 బృందాలు ఈ తనిఖీలను చేపట్టనున్నారుు. ప్రతి కళాశాలను ముగ్గురు సభ్యుల బృందం తనిఖీ చేయనుంది. ఈ బృందంలో ఏఐసీటీఈకి చెందిన ఇద్దరు ప్రతినిధులు, జేఎన్టీయూహెచ్కు చెందిన ఒక ప్రతినిధి ఉంటారు. అఫిలియేషన్లు కోరుతూ, సీట్ల కోతను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో ఈ తనిఖీలు చేయనున్నారు. ప్రతి కాలేజీకి తనిఖీలకు వెళ్లే తేదీ వివరాలను 48 గంటల ముందుగానే తెలియజేసిమరీ ఈ బృందాలు తనిఖీలకు వెళ్లనున్నారుు. బుధవారం తనిఖీలు చేసే కాలేజీలకు ఇప్పటికే విషయాన్ని తెలియజేశాయి. కోర్టును ఆశ్రరుుంచిన 121 కాలేజీల్లో 60 కాలేజీలు రెండు, వుూడు కోర్సులకు తనిఖీలు వద్దని, ఒకటీ రెండు బ్రాంచీలకే తనిఖీలు చేయూలని కోరుతూ లేఖలను జేఎన్టీయుూహెచ్కు అందజేశారుు. అదనపు బ్రాంచీలు, అదనపు సీట్ల కోసం చూసుకొనిసంయుక్త తనిఖీలకు ఒప్పుకుంటే.. జేఎన్టీయూహెచ్ మొదట అనుబంధ గుర్తింపు ఇచ్చిన బ్రాంచీలు, సీట్లు కూడా లేకుండాపోయే ప్రవూదం ఉందన్న ఆందోళనతో కాలేజీలు ఈ నిర్ణయూనికి వచ్చారుు. వురో 16 కాలేజీలు తవుకు ఏ కోర్సులు వద్దని, తవు కాలేజీల్లో తనిఖీలు చేయూల్సిన అవసరం లేదని పేర్కొంటూ లేఖలను అందజేశారుు. దీంతో కొన్ని కోర్సులకే తనిఖీలు కావాలన్న కాలేజీలతోపాటు అసలు లేఖలే ఇవ్వని వురో 46 కాలేజీల్లో సంయుుక్త బృందాలు తనిఖీలు చేపట్టనున్నారుు. 28వ తేది నాటికి తనిఖీలను పూర్తి చేసి తనిఖీ నివేదికలను హైకోర్టుకు అందజేయునున్నారుు.. -
నేటి నుంచి ఓయూ పీజీ వెబ్ ఆప్షన్లు
* మొదట ఆప్షన్ల ఎంపిక.. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన * పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీలకు త్వరలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వర్సిటీ పరిధిలో తొలిసారిగా చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి 23వ తేదీ వరకు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో సబ్జెక్టుల కోసం ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. సబ్జెక్టుల వారీగా కళాశాలల జాబితా, సీట్ల సంఖ్యను వెబ్సైట్ (www.ouadmissions.com)లో అందుబాటులో ఉంచారు. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కంటే ముందుగా కళాశాలల జాబితాను సరిచూసుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు. వరుస క్రమంలో కళాశాలల ప్రాధాన్యంపై స్పష్టత వచ్చాకే ఆప్షన్ల ప్రక్రియలో పాల్గొనాలని చెబుతున్నారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత తాత్కాలిక సీట్ల కేటాయింపు జాబితా సిద్ధం చేస్తారు. ఈ విద్యార్థులకు చెందిన ధ్రువపత్రాల పరిశీలన ముగియడం, ఫీజు చెల్లింపులు పూర్తయ్యాక తుది సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు విడివిడిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీరికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ బ్యాచిలర్ డిగ్రీలో కొన్ని కోర్సులకు సంబంధించి ఫలితాలు వెల్లడి కాలేదు. అలాగే సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ రావడంతో ఓయూసెట్లో మరికొన్ని సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించలేదు. ఎంఈడీ, ఎంపీఈడీ, కన్నడ, మరాఠీ, పర్షియన్, సైకాలజీ, తమిళ్, థియేటర్ ఆర్ట్స్, ఎమ్మెస్సీ న్యూట్రిషన్ తోపాటు పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వకూడదని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వికలాంగ, స్పోర్ట్స్ తదితర ప్రత్యేక కోటా ద్వారా కళాశాలల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఇదే వర్తిస్తుంది. వీరికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పరీక్షలు నిర్వహించని సబ్జెక్టుల్లో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. -
8 నుంచి టీ ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్
హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 12వ తేదీన ఆప్షన్స్ను, 15 వ తేదీన సీట్లను కేటాయిస్తారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఈ నెల 16 నుంచి 21 తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ నెల 23 నుంచి 24 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో దశ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. 25న ఆప్షన్స్, 28న సీట్లను కేటాయిస్తారు. ఆగస్టు 1 నుంచి తరగతులు జరుగుతాయి. -
సర్టిఫికెట్ల పరిశీలనకు 1,231 మంది హాజరు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు వర్ష ప్రభావంతో ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని నాలుగు హెల్ప్లైన్ కేంద్రాల పరిధిలో బుధవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 1,231 మంది విద్యార్థులు హాజరయ్యారు. 152 మంది విద్యార్థులు కళాశాలల్లో సీట్ల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్నారు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 342, వెబ్ కౌన్సెలింగ్కు 55 మంది హాజరయ్యారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 289, వెబ్ కౌన్సెలింగ్కు 22 మంది, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 311, వెబ్ కౌన్సెలింగ్కు 45 మంది, ఏఎన్యూలో సర్టిఫికెట్ల పరిశీలనకు 289, వెబ్ కౌన్సెలింగ్కు 30 మంది హాజరయ్యారు. హెల్ప్లైన్ కేంద్రాల ఆవరణలో వర్షపునీరు చేరి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. నేటి కౌన్సెలింగ్ గురువారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 90,001 ర్యాంకు నుంచి 93,700 వరకు, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 93,701 ర్యాంకు నుంచి 97,500 వరకు, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 97,501 ర్యాంకు నుంచి 1,01,200 వరకు, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 1,01,201 ర్యాంకు నుంచి 1,05,000 వరకు హాజరుకావాలి. 60,001 నుంచి 90 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు కళాశాలల ఎంపికకు గురు, శుక్రవారాల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. -
వెబ్ కౌన్సెలింగ్- విధివిధానాలు...
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వీటికి సంబంధించి ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్ తేదీల ప్రకటన సైతం విడుదలైంది. తెలంగాణలో ఈ నెల 12వ తేదీన కౌన్సెలింగ్ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదలకానుంది. 18 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంసెట్ కౌన్సెలింగ్ రెండు దశలుగా ఉంటుంది. మొదటిది సర్టిఫికెట్ వెరిఫికేషన్. రెండోది వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. స్థూలంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ తర్వాత కాలేజీ అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవడం వరకు మొత్తం 9 దశల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. దశల వారీగా వివరాలు.. మొదటి దశ (స్టేజ్-1) రిజిస్ట్రేషన్ విద్యార్థులు ర్యాంకుల ప్రకారం నిర్దేశించిన తేదీల్లో, హెల్ప్లైన్ సెంటర్లకు హాజరై తమ ర్యాంకుకార్డ్ను సంబంధిత అధికారికి అందజేసి తమ పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత తమ ర్యాంకును పిలిచినప్పుడు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రశీదు తీసుకోవాలి. ఈ సమయంలో తప్పనిసరిగా విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ నెంబర్ను తెలియజేయాలి. (ఈ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా లాగిన్ ఐడీ పంపుతారు. దీని ద్వారానే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకోసం లాగిన్ అవాలి). తర్వాత రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ను తీసుకోవాలి. అందులో వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో క్షుణ్నంగా పరిశీలించి సంతకం చేయాలి. రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తమ పేరును పిలిచినప్పుడు వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలి. ఈ సమయంలో అభ్యర్థులు తమ ర్యాంకు కార్డ్, హాల్ టికెట్, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికెట్స్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ వంటివి అందజేయాలి. వీటిని పరిశీలించిన తర్వాత సదరు వెరిఫికేషన్ ఆఫీసర్ సర్టిఫికెట్స్ అందినట్లు ఒక రశీదు ఇస్తారు. వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించి సంతకం చేయాలి. ఇదే సమయంలో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి ముందస్తు కసరత్తు కోసం ఉద్దేశించిన మా న్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ను ఇస్తారు. దీన్ని కూడా తీసుకుంటే రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినట్లే. మూడో దశ ఆప్షన్స్ ఎంట్రీ కసరత్తు రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో విద్యార్థులకు మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ను ఇస్తారు. అభ్యర్థులు ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా అందుబాటులో ఉన్న కళాశాలలు, కోర్సులను పరిశీలించి తమ ఆసక్తి మేరకు ప్రాథమ్యాలను ముందుగా మ్యాన్యువల్గా పూర్తి చేసుకోవాలి. (ఎంసెట్ కౌన్సెలింగ్ కళాశాలలు కోర్సులు, కాలేజ్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్, కోర్స్ కోడ్ వంటివి అధికారిక వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ వెబ్సైట్: www.apeamcet.nic.in, తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్: www.tseamcet.in). నాలుగో దశ ఇంటర్నెట్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ప్రక్రియ ప్రారంభం ఈ దశలో విద్యార్థులు ఇంటర్నెట్ ఆధారంగా కౌన్సెలింగ్ వైబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆప్షన్స్ ఎంటర్ చేయాలి. (కోర్సు, కళాశాల ప్రాథమ్యాల సంఖ్య). అన్నీ పూర్తయ్యాక లాగ్ అవుట్ చేయాలి. ఇందుకోసం అనుసరించాల్సిన విధనాలు వరుస క్రమంలో..ముందుగా వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఇందుకోసం కచ్చితంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9.0 లేదా అంతకంటే అడ్వాన్స్డ్ వెర్షన్ను మాత్రమే వినియోగించాలి. గూగుల్ క్రోమ్, మొజిల్లా వంటి వాటి ద్వారా సాధ్యం కాదు. తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ 7 ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఉండాలి. పాస్వర్డ్ జనరేషన్ అభ్యర్థులు వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత హోంపేజీలో కనిపించే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అనే విండో ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ (సర్టిఫికెట్ వెరిఫికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చేది), ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, పుట్టిన తేదీ బాక్స్లో సంబంధిత వివరాలు పొందుపరచి జనరేట్ పాస్వర్డ్ బటన్పై క్లిక్ చేయాలి. జనరేట్ పాస్వర్డ్ బటన్పై క్లిక్ చేశాక అభ్యర్థుల వివరాలతోపాటు, ఎంటర్ యువర్ పాస్వర్డ్ కాలమ్స్ ఉండే స్క్రీ న్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంటర్ యువర్ పాస్వర్డ్ స్క్రీన్లో పాస్వర్డ్, రీ ఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలు పొందుపర్చాలి. గమనిక: పాస్వర్డ్ కనీసం 8క్యారెక్టర్లతో ఉండాలి. ఇందు లో ఒక క్యారెక్టర్ తప్పనిసరిగా స్పెషల్ క్యారెక్టర్ అయి ఉండాలి (ఉదా: ః, ు, చ వంటివి). పాస్వర్డ్ వివరాలు జనరేట్ చేశాక సేవ్ పాస్వర్డ్పై క్లిక్ చేస్తే పాస్వర్డ్ సేవ్ అవుతుంది. తర్వాత లాగ్ అవుట్ బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మళ్లీ వెబ్సైట్ హోంపేజీ కనిపిస్తుంది. తదుపరి దశ ఆప్షన్స్ ఎంట్రీ- లాగిన్ ఐడీ లాగ్ అవుట్ అవడం ద్వారా హోంపేజీకి వెళ్లాక ఆప్షన్స్ ఎంట్రీ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకోసం ముందుగా హోం పేజీలో కనిపించే క్యాండిడేట్స్ లాగిన్ బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చాలిన విండో కనిపిస్తుంది. లాగిన్ ఐడీని విద్యార్థులకు తాము తెలియజేసిన మొబైల్ ఫోన్ నెంబర్లకు సంక్షిప్త సందేశం ద్వారా పంపిస్తారు. దాన్ని మాత్రమే లాగిన్ ఐడీ కాలమ్లో పేర్కొనాలి. ఈ వివరాలు పూర్తి చేశాక సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేస్తే నమూనా ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దాన్ని పరిశీలించాలి. తర్వాత నిజమైన ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చేందుకు One Time Password (ైఖ్కీ) కాలమ్ పక్కన టిక్ చేస్తే విద్యార్థుల మొబైల్ నెంబర్కు వన్ టైం పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ను ఓటీపీ బాక్స్లో పొందుపర్చాలి. తర్వాత డిక్లరేషన్ ఫామ్ను చదివి దాని పక్కన ఉండే బాక్స్లో టిక్ చేసి ‘క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ’ బటన్పై క్లిక్ చేయాలి. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ బటన్పై క్లిక్ చేశాక రీజియన్లు, జిల్లాలు, కోర్సులతో కూడిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమకు సరిపడే బాక్స్ల పక్కన టిక్ చేసి డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్పై క్లిక్ చేయాలి. ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్పై క్లిక్ చేశాక అప్పుడు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న రీజియన్ల పరిధిలో, ఎంపిక చేసుకున్న జిల్లాల్లో ఉన్న కళాశాలల కోడ్లు, జిల్లా బ్రాంచ్లతో కూడిన ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్లో ముందుగా ఎంసెట్ హాల్టికెట్ కాలమ్లో ఎంసెట్ హాల్టికెట్ నెంబర్ను పొందుపర్చాలి. తర్వాత.. విద్యార్థులు తమకు నచ్చిన ప్రాథమ్యం ఆధారంగా ఆయా కాలేజీ కోడ్ల పక్కన, బ్రాంచ్ కోడ్ల కింద కనిపించే బాక్స్లలో ప్రాధాన్యత సంఖ్యను పొందుపర్చాలి. (ఉదాహరణకు: జేఎన్టీయూ - హైదరాబాద్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ను మొదటి ప్రాధాన్యంగా భావిస్తే ఆప్షన్స్ ఎంట్రీ విండోలోని ఒూఖీఏ కోడ్ పక్కన ఇఐగ బ్రాంచ్ కోడ్ బాక్స్లో 1వ అంకెను పొందుపర్చాలి. అదే విధంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈని రెండో ఆప్షన్గా భావిస్తే అ్ఖఇఉ కోడ్ పక్కన ఇఉ బ్రాంచ్ కోడ్ బాక్స్లో 2వ అంకెను పొందుపర్చాలి.) ఇలా.. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లనైనా పొందుపర్చుకోవచ్చు. ఆప్షన్ల ఎంట్రీలో ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. ఆప్షన్స్ ఎంట్రీ సమయంలో క్రమం తప్పకుండా ్చఠ్ఛి ైఞ్టజీౌట బటన్పై క్లిక్ చేస్తుండాలి.ఆప్షన్స్ ఎంట్రీ పూర్తయిన తర్వాత వ్యూ అండ్ ప్రింట్ బటన్పై క్లిక్ చేస్తే అప్పటి వరకు విద్యార్థులు ఎంటర్ చేసిన ఆప్షన్ల వివరాలతో కూడిన ఫైల్ కనిపిస్తుంది. దీన్ని ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. లాగ్ అవుట్ ఆప్షన్స్ ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తయిందని భావించిన తర్వాత ఔౌజ ైఠ్ట బటన్పై క్లిక్ చేస్తే .. Save and Logout, Confirm Logout, Cancel Logout అని మూడు బాక్స్లు కనిపిస్తాయి. విద్యార్థులు మరిన్ని ఆప్షన్లను ఇచ్చుకోవాలంటే Cancel Logout న్పై క్లిక్ చేయాలి. ్చఠ్ఛి ్చఛీ ఔౌజౌఠ్ట బటన్పై క్లిక్ చేస్తే విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల వివరాల విండో ఓపెన్ అవుతుంది. వీటిని సరిచూసుకున్నాక ఎలాంటి మార్పులు లేవనుకుంటే ఇౌజజీటఝ ఔౌజౌఠ్ట బటన్పై క్లిక్ చేయాలి. అయిదో దశ సీట్ అలాట్మెంట్ విద్యార్థులు ఆప్షన్స్ ఎంట్రీలో ఇచ్చిన ప్రాధాన్యత క్రమం, ర్యాంకును అనుసరించి వారికి కేటాయించిన కాలేజీ వివరాలు తెలిపే దశ ఇది. పూర్తిగా సాఫ్ట్వేర్ ఆధారితంగా సాగే ప్రక్రియ. ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ను తెలుసుకునేందుకు నిర్దేశిత తేదీల్లో వెబ్సైట్లో లాగిన్ అయి అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ఆరో దశ ఫీజు చెల్లింపు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీ ఆధారంగా నిర్దేశిత ఫీజును చెల్లించాలి. ఇందుకోసం గతేడాది ఎంసెట్ వెబ్సైట్ నుంచి చలాన ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని ఆంధ్రా బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ల్లో ఫీజు చెల్లించే విధానం ఉంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఈ విధానానికి స్వస్తి పలికి నేరుగా కళాశాలలోనే ఫీజు చెల్లించే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. అంటే ఒక అభ్యర్థి తొలి దశ సీట్ అలాట్మెంట్ జరిగిన కాలేజీలో చేరడం ఇష్టం లేకపోతే రిపోర్ట్ చేయనక్కర్లేదు. మలి దశ కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు. అదే విధంగా ఒక అభ్యర్థి తొలి దశ సీట్ అలాట్మెంట్ జరిగిన కాలేజీలో రిపోర్ట్ చేసి ఫీజు చెల్లించినా తర్వాత రెండో దశ కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు. రెండో దశ కౌన్సెలింగ్లో అలాట్మెంట్ అయిన కాలేజీలో చేరాలనుకుంటే తొలి దశలో అలాట్మెంట్ జరిగిన కాలేజ్లో చెల్లించిన ఫీజు ఆటోమేటిక్గా రెండో దశ కౌన్సెలింగ్ ద్వారా రిపోర్ట్ చేసిన కాలేజీకి బదిలీ అవుతుంది. ఏడో దశ కాలేజీలో రిపోర్టింగ్ అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు దాన్ని తీసుకుని తమకు కేటాయించిన కళాశాలలో నిర్దేశిత తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సీటు కేటాయింపు రద్దవుతుంది. ఎనిమిదో దశ కౌన్సెలింగ్ తదుపరి దశలకు హాజరవడం తొలి దశ కౌన్సెలింగ్లో పాల్గొనని విద్యార్థులు, తొలి దశలో పాల్గొన్నప్పటికీ సీటు లభించని విద్యార్థులు తదుపరి దశ కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు. ఈ క్రమంలో తొలిదశలో పాల్గొనని విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా మలి దశ కౌన్సెలింగ్కు నిర్దేశిత హెల్ప్లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. తొలి దశలో సీటు లభించినప్పటికీ సదరు కళాశాలలో చేరడం ఆసక్తి లేని విద్యార్థులు ఫీజు చెల్లించక్కర్లేదు. మలిదశ కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు వీరు కూడా అర్హులే. తొలి దశ కౌన్సెలింగ్లో సీటు లభించి, ఫీజు చెల్లించి, కాలేజ్లో రిపోర్ట్ చేసిన విద్యార్థులు కూడా మలి దశ కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు. మలి దశ కౌన్సెలింగ్లో లభించిన కాలేజ్లో చేరేందుకు మాత్రమే అర్హత ఉంటుంది. మలిదశలో లభించిన కాలేజ్ను వద్దనుకుని తొలిదశలో లభించిన కాలేజ్లో రిపోర్ట్ చేసే అవకాశం ఉండదు. తొమ్మిదో దశ సీటు రద్దు చేసుకునే ప్రక్రియఅన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయ్యాక తమ అలాట్మెంట్ను రద్దు చేసుకోవాలనుకునే విద్యార్థులు నిర్దేశిత కటాఫ్ తేదీలోపు రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కటాఫ్ తేదీలోపు రద్దు ఆలోచన ఉంటే కన్వీనర్ ద్వారా జరుగుతుంది. ఆ కటాఫ్ తేదీ తర్వాత రద్దు చేసుకోవాలనుకుంటే మాత్రం తమకు కేటాయించిన కళాశాల ప్రిన్సిపాల్ నిర్ణయంపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రతి ఆప్షన్ తొలి ప్రాధాన్యంగా భావించాలి విద్యార్థులకు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ విషయంలో ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. అయితే అభ్యర్థులు తాము ఇచ్చే మొదటి ప్రాధాన్యత, చివరి ప్రాధాన్యత కూడా తమ దృష్టిలో మంచిది అని భావించేలా ఉండాలి. అంటే ఇచ్చే ప్రతి ప్రాధాన్యం, కోర్సు, కళాశాల కూడా మంచిదిగా ఉండేలా ముందుగానే కసరత్తు చేయాలి. అప్పుడు ఎలాంటి ఆప్షన్లు ఇచ్చినా సాఫ్ట్వేర్ ఆధారంగా సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు సదరు కళాశాలలో చేరేందుకు మానసికంగా సంసిద్ధత లభిస్తుంది. కళాశాలలు, ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకునే ముందు ఆయా కళాశాలల విద్యార్థులను కలిసి సదరు కళాశాలలో సదుపాయాలపై ఆరా తీయాలి. ‘స్టూడెంట్స్ ఆర్ అంబాసిడర్స్ టు ఇన్స్టిట్యూట్స్’ అని గుర్తించాలి. వారి ద్వారా కళాశాలకు చెందిన వాస్తవాలు తెలుస్తాయి. - సాయిబాబు, ఏపీ ఎంసెట్ కన్వీనర్. -
ఎడ్సెట్ కౌన్సెలింగ్కు 1,331 మంది హాజరు
హైదరాబాద్: ఎడ్సెట్ మలివిడత వెబ్కౌన్సెలింగ్ శని, ఆదివారాల్లో జరిగింది. ఈ రెండురోజుల్లో గణితం, భౌతికశాస్త్రం, ఆంగ్లం, జీవశాస్త్రం మెథడాలజీలకు సంబంధించి ఒకటినుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలంచారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగిన ఈ పరిశీలనకు 1,331 మంది హాజరయ్యారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎడ్సెట్ తొలివిడత కౌన్సెలింగ్ పూర్తికావడంతో ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించిన విద్యార్థులకు ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు స్క్రాచ్కార్డులు, అకనాలెడ్జిమెంటు లెటర్లు అందించారు. ఆదివారం ఆయన వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఎడ్సెట్ ఆఫీసును సందర్శించి ఈ లెటర్లు ఇచ్చారు. ఎడ్సెట్ను ప్రశాంతంగా, ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేస్తున్నందుకు కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మవెంకటరావు, ఇతర అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. -
అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ తనిఖీలు
‘పీజీ’ కౌన్సెలింగ్పై హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వెల్లడి హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్లో స్థానం కల్పించిన 145 ఇంజనీరింగ్ పీజీ కాలేజీల్లోనూ తనిఖీలు నిర్వహించి, నిబంధనల మేర సౌకర్యాలు ఉన్నాయో లేదో తేలుస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దాంతోపాటు లోపాలున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలు తమ నోటీసులకు సమాధానమిచ్చాయని, ఆ సమాచారాన్ని క్రోడీకరించడంతో పాటు ఈ కాలేజీలను కూడా తనిఖీ చేస్తామని విన్నవిం చింది. అనంతరం ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదికలను కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇం దుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన కోర్టు విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ నిరాకరించిన కాలేజీల ను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ గత నెల 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జేఎన్టీయూహెచ్ ఈ ఉత్తర్వులను స వాలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనానికి అప్పీలు చేసింది. ఈ నేపథ్యంలో కాలేజీల వ్యాజ్యాలపై తుది విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి.. వాటిని గురువారం మరోసారి విచారించారు. పిటిషనర్లు, జేఎన్టీయూ తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ గుర్తించిన లోపాలను ఆయా కాలేజీలు సరిదిద్దుకున్నాయా? లేదా? అన్న అంశానికే కోర్టు తన విచారణను పరిమితం చేసేందు కు ఇరుపక్షాలూ అంగీకరించాయి. లోపాలున్న ట్లు చెబుతున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కా లేజీలతో పాటు వెబ్ కౌన్సెలింగ్లో స్థానం కల్పించిన 145 పీజీ కాలేజీల్లోనూ తనిఖీలు నిర్వహించి, నివేదిక సమర్పిస్తామని ఏజీ కోర్టుకు హామీ ఇచ్చారు. నాలుగు వారాల గడువుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఆప్షన్లు ఇచ్చింది సగం మందే
హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించిన పీజీఈసెట్లో అర్హత పొందిన వారిలో సగం మందే వెబ్ కౌన్సెలిం గ్ లో పాల్గొన్నారు. ప్రవేశపరీక్ష లో 97,640మంది అర్హత సా ధించగా, 50,030 మందే వెబ్ ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం. రెండురాష్ట్రాల్లో 58వేల సీ ట్లుండగా, వాటిలో చేరేందు కు అభ్యర్థులే కరువయ్యారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్న పీజీఈసెట్ అభ్యర్థులు.. తమ వెబ్ఆప్షన్లను మార్చుకునేందుకు మరొక అవకాశం కల్పిస్తున్నామని కన్వీనర్ వే ణుగోపాల్రెడ్డి శుక్రవారం తెలిపారు. వెబ్ఆప్షన్ల ప్రక్రియ రివైజ్డ్ షెడ్యూల్ను జ్ట్టిఞ://ఞజ్ఛఛ్ఛ్టి.్చఞటఛిజ్ఛి.్చఛి.జీ వెబ్సైట్లో ఉంచినట్టు కన్వీనర్ తెలిపారు. రివైజ్డ్ షెడ్యూల్ ఇలా.. తేదీ ర్యాంకులు 20 గేట్/జీప్యాట్(నమోదైన) ర్యాంకర్లు/ పీజీఈసెట్లో 1-1000 వరకు 21 1001-5000 వరకు 22 5001-1000 వరకు 23 10001 నుంచి చివరి వరకు -
ఐసెట్ - 2014 కౌన్సెలింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స టెస్ట్ (ఐసెట్) వెబ్ కౌన్సెలింగ్కు రంగం సిద్ధమైంది. ఐసెట్-2014లో అర్హత సాధించిన దాదాపు లక్ష మంది అభ్యర్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్ విధానాన్ని కొనసాగించనున్నారు. మొత్తం 520 ఎంసీఏ కళాశాలల్లో 38580 సీట్లు, 934 ఎంబీఏ కళాశాలల్లో లక్షకుపైగా సీట్లున్నాయి. ఈ క్రమంలో ముందుగా అభ్యర్థులు.. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం.. తమ ర్యాంకుకు కేటాయించిన తేదీలలో ఏదైనా హెల్ప్లైన్ సెంటర్లో హాజరై అన్ని ధ్రువపత్రాలు చూపితేనే.. తదుపరి దశ ఆప్షన్ల ఎంట్రీకి అనుమతి లభిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంబీఏ.. ఎంసీఏ.. కావాల్సిన లక్షణాలు.. ఉత్తమ కళాశాలను ఎంపిక చేసుకోవడం ఎలా? వంటి విషయాలపై విశ్లేషణ.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ ఎందుకు? మేనేజ్మెంట్ పీజీని లక్ష్యంగా ఎంచుకున్న ప్రతి విద్యార్థి తప్పనిసరిగా స్పష్టత పొందాల్సిన ప్రశ్న ఇది. లేకుంటే రెండేళ్ల శ్రమ, ఆ తర్వాత తీసుకునే సర్టిఫికెట్ రెండూ వృథాగానే మిగులుతాయి. ఇక.. ఎంబీఏ ఎందుకు? అనే ప్రశ్నకు రెండు కోణాల్లో సమాధానాన్ని తెలుసుకోవాలి. అవి పరిశ్రమలు; విద్యార్థులు. పరిశ్రమల కోణంలో ఆలోచిస్తే.. ► వ్యాపార నిర్వహణ మెళకువలు తెలిసిన అభ్యర్థులు లభిస్తారు. ► కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం ఉంటుంది. ► ఉత్పాదకతను పెంచే వ్యూహాల్లో మెళకువలు సాధిస్తారు. ► చివరికి సంస్థను లాభాల బాట పట్టిస్తారు. విద్యార్థుల కోణంలో.. ► సొంతగా పరిశ్రమలు/కంపెనీల ఏర్పాటులో నైపుణ్యం. ► ఇతర కోర్సులతో పోల్చితే కెరీర్లో వేగంగా పెకైదిగే అవకాశం. లభించే లక్షణాలు: సృజనాత్మక సంస్థలు నెలకొల్పి, తీర్చిదిద్దడం అనేది ఎంబీఏ ద్వారానే సాధ్యం. ఈ కోర్సు నిర్వహణ నైపుణ్యాలతోపాటు భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతుంది. ఈ క్రమంలో రెండేళ్ల కోర్సులో విద్యార్థులకు ఎనలిటికల్ స్కిల్స్; టెక్నికల్ నాలెడ్జ్; లీడర్షిప్ స్కిల్స్; బిజినెస్ స్కిల్స్; మేనేజ్మెంట్ స్కిల్స్; కమ్యూనికేషన్ స్కిల్స్; ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్; స్మార్ట్ థింకింగ్ స్కిల్స్; రిలేషన్షిప్ స్కిల్స్ అలవడతాయి. మొదటి ఏడాది ఇలా: సాధారణంగా ఎంబీఏ కరిక్యులంను పరిశీలిస్తే మొదటి ఏడాదిలో ఎంబీఏ విద్యార్థులకు కోర్ సబ్జెక్టులైన.. ప్రిన్సిపుల్స్ ఆఫ్ మేనేజ్మెంట్; మేనేజీరియల్ ఎకనామిక్స్; ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్; బిజినెస్ లా; బిజినెస్ కమ్యూనికేషన్, ఆపరేషన్స్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ వంటి అంశాల్లో శిక్షణనిస్తారు. కార్యనిర్వాహక నైపుణ్యాలే కాకుండా ఒక సంస్థ నిర్వహణలో భాగమైన ఆయా విభాగాల్లో పరిజ్ఞానం అందించడమే ఈ సబ్జెక్టుల లక్ష్యం. స్పెషలైజేషన్ సెకండియర్: మొదటి సంవత్సరం అంతా ఉమ్మడి సబ్జెక్టులతో సాగే ఎంబీఏ బోధన రెండో ఏడాది స్పెషలైజేషన్ సబ్జెక్టులపై ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి తనకు అనుకూలమైన స్పెషలైజేషన్ను ఎంచుకోవాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, రిటైల్, ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తయ్యాక: ప్రస్తుతం ఓ మోస్తరు కళాశాల నుంచి ఐఐఎంల వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్లు అంతర్భాగంగా మారుతున్నాయి. ఎంబీఏ చదివిన విద్యార్థులకు భవిష్యత్తుపై బెంగ అనవసరం. ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా మంచి కెరీర్ను సొంతం చేసుకోవచ్చు. ఈ స్పెషలైజేషన్ను ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్థులు వ్యక్తిగత ఆసక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఫైనాన్స్ మేజర్ స్పెషలైజేషన్గా తీసుకున్న అభ్యర్థులకు అవకాశాలు అన్ని పరిశ్రమల్లో లభిస్తాయి. బ్యాంకింగ్- ఫైనాన్స- ఇన్సూరెన్స రంగాల్లో మరిన్ని అవకాశాలుంటాయి. ► హెచ్ఆర్ స్పెషలైజేషన్ అభ్యర్థులకు పరిశ్రమలు, ఉత్పత్తి సంస్థల్లో మానవ వనరుల నిర్వహణలో ఉద్యోగాలు ఉంటాయి. ► మార్కెటింగ్ స్పెషలైజ్డ్ అభ్యర్థులకు అవకాశాలకు ఆకాశమే హద్దు. రిటైల్ రంగం నుంచి రియల్ ఎస్టేట్ వరకు ఎక్కడైనా వీరికి అవకాశాలు ఖాయం. రాణించాలంటే: కోర్సు, ఆ తర్వాత కెరీర్లో రాణించాలంటే విద్యార్థులు కేవలం అకడమిక్స్కే పరిమితం కాకుండా మరికొన్ని స్కిల్స్ పెంచుకోవాలి. బిహేవియరల్ స్కిల్స్; ఇంటర్పర్సనల్ స్కిల్స్; లీడర్షిప్ క్వాలిటీస్ కోసం మేనేజ్మెంట్ క్లబ్లు, గ్రూప్ డిస్కషన్స్లో పాల్పంచుకోవాలి. సెమినార్లు, మేనేజ్మెంట్ సమ్మిట్స్కు హాజరవ్వాలి. ఫలితంగా నిర్దేశిత రంగంలోని వాస్తవ పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా ఎనలిటికల్ థింకింగ్ దృక్పథం అలవర్చుకోవాలి. పాఠ్యాంశాలను చదువుతూ వాటికి సంబంధించి రియల్ కేస్ స్టడీస్ను పరిశీలిస్తే మంచి ఫలితముంటుంది. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ ఎందుకు? సాధారణంగా ఎంసీఏ అంటే ప్రోగామింగ్ లాంగ్వేజెస్ బోధించే కోర్సు అని అభిప్రాయం. అయితే ఎంసీఏలో విద్యార్థులకు మరెన్నో మెళకువలు లభిస్తాయి. అవి.. ► తాజా అప్లికేషన్ డెవలప్మెంట్ ► లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లభించే పలు సాఫ్ట్వేర్ టూల్స్ ఆధారంగా ఒక అప్లికేషన్ను వేగంగా, సమర్థంగా నిర్వహించే సత్తా ప్రతి ఎంసీఏ విద్యార్థికి లభించేలా చేయడమే కోర్సు ప్రధానోద్దేశం. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ జీవితంలో కూడా విధుల్ని వేగంగా నిర్వర్తించే లక్షణం అలవడుతుంది. రాణించాలంటే: ఎంసీఏలో రాణించాలంటే విద్యార్థులు ముందుగా స్వీయ లెర్నింగ్ లక్షణాన్ని అలవర్చుకోవాలి. క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ కూడా ఎంతో అవసరం. అంతేకాకుండా కేవలం బుక్ రీడింగ్కే పరిమితం కాకుండా ప్రాక్టికల్స్కు కూడా ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో నిత్యం ఏదో ఒక మార్పు చోటు చేసుకుంటూనే ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ టెక్నికల్ కోర్సులను ఒడిసిపట్టాలి. ఆన్లైన్లో కోర్సులు అందించే ఎడెక్స్, కోర్సెరా, మూక్స్, ఎన్పీటీఈఎల్ వంటి వెబ్సైట్స్లో కోర్సులు పూర్తిచేయాలి. ఇలా ఎంసీఏ చదువుతూనే.. ఏకకాలంలో కోర్సుకు అనుబంధంగా వ్యాల్యూ యాడెడ్ కోర్సులను కూడా అభ్యసించాలి. ఇలా చేస్తే ఎంసీఏ పూర్తయ్యే నాటికి ఇండస్ట్రీ రెడీగా మారేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. ఇక.. చివరి సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలి. లైవ్ ప్రాజెక్ట్స్కు అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా క్రేజ్ ఉన్న అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. అంతేకాకుండా నెట్వర్క్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, సి, సి++, జావా నేర్చుకోవాలి. ఇండస్ట్రీ రెడీగా మారాలంటే: ముఖ్యంగా ఇండస్ట్రీ రెడీగా మారాలనుకునే విద్యార్థికి స్వీయ ఆలోచనా పరిజ్ఞానం, సాఫ్ట్వేర్, హార్డ్వేర్లకు సంబంధించి సరైన దృక్పథం ఉండాలి. ఈ క్రమంలో విద్యార్థులు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఫండమెంటల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, అల్గారిథమ్స్పై పట్టు: వీటి వల్ల ఐటీ ప్రాబ్లం సాల్వింగ్లో క్రియేటివిటీకి ఆస్కారం లభిస్తుంది. ► తాజా ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్పై చక్కటి అవగాహన పొందాలి. రియల్ లైఫ్ టెక్నాలజీస్తో మమేకమైన ఒక పూర్తి ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ను పరిశీలించాలి. ► స్వీయ లెర్నింగ్ టెక్నిక్స్: దీనికి చక్కటి సాధనం ఇంటర్నెట్. ► కొత్త టెక్నాలజీలను ఆకళింపు చేసుకోవడం. ► క్రిటికల్, లాజికల్ థింకింగ్. ► రిపోర్ట్ రైటింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ స్కిల్స్. ఎలక్టివ్స్: ప్రస్తుతం కరిక్యులం ప్రకారం ఎంసీఏ మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్లో ఎలక్టివ్స్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ఎంతో కీలకం. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మొబైల్ కంప్యూటింగ్, రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్, నెట్వర్క్ సెక్యూరిటీ, వెబ్ 2.0., డేటా ఎనాలిసిస్, బిగ్ డేటా వంటి అంశాలు మంచి ఎలక్టివ్స్గా ఉంటున్నారుు. వీటికి సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని ఔపోసన పట్టాలి. లైబ్రరీ సదుపాయూన్ని వినియోగించుకోవాలి. జర్నల్స్, రీసె ర్చ్ పేపర్లను పరిశీలిస్తే విషయ పరిజ్ఞానం సొంతమవుతుంది. కోర్సు పూర్తయ్యాక: ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్లు అంతర్భాగమయ్యాయి. చక్కటి సబ్జెక్ట్ పరిజ్ఞానం పొంది కోర్సు పూర్తి చేస్తే నెట్వర్క్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు, కోడింగ్, టెస్టింగ్, ఈఆర్పీ సొల్యూషన్స్, వెబ్డిజైనింగ్, యానిమేషన్, ప్రోగ్రామింగ్ విభాగాల్లో టీమ్ మెంబర్గా అడుగుపెట్టొచ్చు. వివిధ విభాగాల్లో మరెన్నో అవకాశాలున్నాయి. ఎంబీఏ.. ఆ రెండు లక్షణాలు ముఖ్యం ఎంబీఏలో చేరాలనుకునే విద్యార్థులకు ఆవశ్యకమైన సహజ లక్షణాలు డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. భవిష్యత్తులో కెరీర్ పరంగా మేనేజీరియల్ హోదాల్లో పని చేసే సమయంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. కాబట్టి ఈ రెండు లక్షణాలు ఎంబీఏ ఔత్సాహిక విద్యార్థులకు తప్పనిసరి. కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్ కూడా ఉండాలి. కాలేజ్ ఎంపిక విషయంలో ముందస్తు కసరత్తు ఎంతో లాభిస్తుంది. సదరు కళాశాల చరిత్ర, పూర్వ విద్యార్థులు (అలుమ్ని), ప్లేస్మెంట్ రికార్డ్స్, ఫ్యాకల్టీ వంటి వాటిని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఒకసారి కోర్సులో అడుగు పెట్టాక అనుక్షణం తాము కోర్సులో చేరిన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ అకడమిక్గా రాణించేందుకు కృషి చేయాలి. ఎంబీఏ అంటే పుస్తకాల అధ్యయనంతో పూర్తి చేయొచ్చు అనే భావన సరికాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవాలి. ఇందుకోసం పలు కేస్ స్టడీల విశ్లేషణ, ఇండస్ట్రీ విజిట్స్ వంటి వాటికి ఉపక్రమించాలి. గ్రామీణ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడంపై దృష్టి సారించాలి. ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలల్లో సీటు పొందిన విద్యార్థులు ఫ్యాకల్టీపైనే ఆధారపడకుండా స్వీయ అధ్యయనాన్ని అలవర్చుకోవాలి. ఇంటర్నెట్ ఆధారంగా.. ఆయా మేనేజ్మెంట్ జర్నల్స్, కేస్ స్టడీస్ ఎనాలిసిస్లను ఔపోసన పట్టాలి. ఎంబీఏ స్పెషలైజేషన్ విషయంలోనూ ముందు నుంచే స్పష్టమైన అవగాహనతో కదలాలి. ప్రస్తుతం ఎన్నో కళాశాలలు డ్యూయల్ స్పెషలైజేషన్ అవకాశాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో ప్రథమ స్పెషలైజేషన్గా ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ను ఎంచుకోవాలి. కోర్సు స్వరూపం, స్పెషలైజేషన్ వంటి అంశాల్లో స్పష్టత లభించాక.. నిరంతరం ఈ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన ఏర్పరచుకోవాలి. నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటూ చదవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. - ప్రొఫెసర్ వి. శేఖర్,ప్రిన్సిపాల్, ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ టెక్నికల్, ఎనలిటికల్ స్కిల్స్ ఉంటే ఎంసీఏ మ్యాథమెటికల్, టెక్నికల్, ఎనలిటికల్, అప్లికేషన్ స్కిల్స్.. ఈ మూడు లక్షణాలు అవసరమైన కోర్సు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. విద్యార్థులకు ప్రాథమికంగా అప్లికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రతి అంశాన్ని.. దాని లక్ష్యం.. ప్రాక్టికల్గా ఎలా ఉపయోగ పడుతుంది.. అందుకు అందుబాటులో ఉన్న మార్గాల ను గుర్తించాలి. కంప్యూటర్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా కోర్సులో చక్కటి ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తాయి. ప్రస్తుతం చాలా మంది ఎంసీఏ విద్యార్థులు కోర్సు స్వరూపం దృష్టితోనే ఆలోచించి సాఫ్ట్వేర్ అప్లికేషన్ నైపుణ్యాలు పెంచుకునేందుకే పరిమితం అవుతున్నారు. ఇది సరికాదు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ అలవర్చుకునేందుకు కూడా కృషి చేయాలి. మూడేళ్ల కోర్సు ప్రాక్టికల్స్కు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి. ఐటీ రంగంలో సగటున ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో ఒక కొత్త ప్రోగ్రామ్ ఆవిష్కరణ జరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్పైనా అవగాహన పొందాలి. ఇందుకోసం ఇంటర్నెట్ను ముఖ్య సాధనంగా వినియోగించుకోవాలి. షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. దీంతో పాటు కోర్సు సమయంలో ఇంటర్న్షిప్స్, మినీ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ వర్క్ల విషయంలోనూ లైవ్ ప్రాజెక్ట్స్కు ప్రాధాన్యమివ్వాలి. ఫలితంగా సర్టిఫికెట్ లభించేనాటికి ఆల్ రౌండ్ స్కిల్స్ సొంతం చేసుకోగలుగుతారు. - ప్రొఫెసర్ అరుణ్ కె. పూజారి,డీన్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెన్సైస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. కళాశాల ఎంపిక ఎంబీఏ/ఎంసీఏ ఔత్సాహిక విద్యార్థులు కళాశాలను ఎంపిక చేసుకునే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవి.. కళాశాల ఏర్పాటు, ఫ్యాకల్టీ అర్హతలు.. అంటే కళాశాల ఏర్పాటు చేసి చాలా కాలమైందా.. లేదా ఇటీవలనే స్థాపించారా? ఫ్యాకల్టీ పీహెచ్డీ వంటి ఉన్నత విద్యనభ్య సించారా? లేదా? బోధనలో వారి ప్రతిభ ఏమిటో కూడా తెలుసుకోవాలి. ఎందు కంటే.. నేడు చాలా కళాశాలలు తక్కువ అర్హతలున్నవారితోనే తరగతులు నిర్వహి స్తున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ఎక్కువ శాతం ఇంజనీరింగ్ కళాశాలలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరైన కళాశాల ఎంపిక చాలా ముఖ్యం. ► అధునాతన లేబొరేటరీ సదుపాయాలు, కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, క్రీడా మైదా నం, విశాలమైన తరగతి గదులు అందు బాటులో ఉన్నాయో, లేదో పరిశీలించాలి. ► స్టార్టప్స్కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆయా కళాశాలల్లో వీటికున్న అవకాశాలు.. ఇంక్యుబేషన్ సెంటర్లు వివరా లు తెలుసుకోవాలి. ► ఆ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల్లో ఎవరైనా జాతీయస్థాయి పోటీ పరీక్షలైన క్యాట్/గేట్/సివిల్స్ వంటివాటిలో విజయం సాధించారా అనే విషయాన్ని ఆరా తీయాలి. ► పాఠ్యేతర కార్యక్రమాలకు(సెమినార్లు, క్రీడ లు, కాంపిటీటీవ్ ఎగ్జామ్స్ ఓరియెంటెడ్ క్లబ్బులు మొదలైనవి) పెద్దపీట వేస్తున్నా రా? లేదో కనుక్కోవాలి. ► గత ఐదేళ్లలో ఆ కళాశాల ప్లేస్మెంట్స్ వివరాలు (సంబంధిత కంపెనీల్లో ఎంత పర్సంటేజ్ మార్కులు సాధించిన విద్యార్థు లు ఎంపికయ్యారో తెలుసుకోవాలి) ► ఆ కళాశాలకు సంబంధిత సంస్థల (ఏఐసీటీఈ, ఎన్బీఏ, యూజీసీ వంటి) గుర్తింపు ఉందో, లేదో పరిశీలించాలి. ► సంబంధిత కళాశాలలు ఎంటర్ప్రెన్యూర్స, టెక్నాలజీ నిపుణులు, వివిధ రంగాల్లో నిష్ణాతులతో గెస్ట్ లెక్చర్స నిర్వహిస్తాయో, లేదో ఆరా తీయాలి. ► ఇప్పుడు చాలా కళాశాలలు బిజినెస్ ఇంక్యుబేషన్లు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నా యి. తద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు చేయూతనిస్తున్నాయి. ఇలాంటివాటిలో విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ► కొన్ని కళాశాలలు ఇంటర్నషిప్, ప్రాజెక్టు వర్కలను నామమాత్రంగా నిర్వహిస్తాయి. ఇలాంటి కళాశాలలను ఎంచుకోకూడదు. ► కొన్ని కళాశాలలు సీట్ల భర్తీ కోసం ఉచిత ఫీజు అని, ల్యాప్ట్యాప్లు ఇస్తామని బురిడీ కొట్టిస్తుంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్లను నియమించుకుంటాయి. వీరి మాటల వలలో పడకూడదు. ► యూనివర్సిటీల క్యాంపస్ కళాశాలలు, వేళ్ల సంఖ్యలో లెక్కపెట్టగల కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మంచి విద్యను అందిస్తు న్నాయి. అలాంటి కళాశాలల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మంచి కళాశాల ఏదో అవగతమవుతుంది. అదేవిధంగా సంబంధిత కళాశాల వెబ్సైట్ లో కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఆ కళాశాల పూర్వ విద్యార్థులతో నూ, ఫ్యాకల్టీతోనూ మాట్లాడి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సీట్ అలాట్మెంట్ తేదీ: 26.09.2014 వెబ్సైట్: https://icet.nic.in/ కావాల్సిన సర్టిఫికెట్లు ► ఐసెట్-2014 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ► డిగ్రీ మార్క్స్ మెమో/ప్రొవిజినల్ సర్టిఫికెట్ ► ఇంటర్మీడియెట్ మార్క్స్ మెమో ► టెన్త్ క్లాస్ మార్కుల సర్టిఫికెట్ ► తొమ్మిదో తరగతి నుంచి డి గ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ► జనవరి 1, 2014 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రాలు ► స్పెషల్ కేటగిరీ(వికలాంగ అభ్యర్థులు, సాయుధ దళాల ఉద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్) అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో వెరిఫికేషన్కు హాజరు కావాలి. వీరు హైదరాబాద్లోని మాసాబ్ట్యాంక్లో ఉన్న సాంకేతిక విద్యాభవన్కు తమకు నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలి. ► ఎస్టీ విద్యార్థులు వారికి నిర్దేశించిన హెల్ప్లైన్ సెంటర్లలో మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలి. ► సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలు.. రెండు సెట్లు -
షరతులు వర్తిస్తాయి!
269 ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కాలేజీలకు షరతులతో అఫిలియేషన్ పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులకు కళాశాలల లిస్టు లోపాలున్న కాలేజీలకు మళ్లీ నోటీసులిచ్చిన జేఎన్టీయూ రేపటిలోగా వివరాలివ్వాలి గేట్, జీప్యాట్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా హైదరాబాద్: పీజీ కళాశాలల అఫిలియేషన్ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. లోపాలను సరిదిద్దుకోని కళాశాలలనూ వెబ్ కౌన్సెలింగ్కు అనుమతించాలని జేఎన్టీయూహెచ్ను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తమ పరిధిలో ఉన్న 269 ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కళాశాలలకు వర్సిటీ అధికారులు షరతులతో కూడిన అఫిలియేషన్ మంజూరు చేశారు. అనంతరం సదరు జాబితాను బుధవారం పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులకు అందజేశారు. అయితే, మరికొన్ని గంటల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో అఫిలియేటెడ్ కళాశాలల జాబితా రావడంతో గేట్, జీప్యాట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6, 7 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకున్న గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు బుధ, గురువారాల్లో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లిన అభ్యర్థులకు వెబ్సైట్లో ఉన్న వాయిదా సమాచారం చూసి నిరాశగా వెనుతిరిగారు. వాయిదా పడిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో అధికారులు స్పష్టం చేయలేదు. కాగా, ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే పీజీఈ సెట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల షెడ్యూల్లో ఎలాంటీ మార్పూ లేదని అధికారులుపేర్కొన్నారు. ఆ కాలేజీలకు నోటీసులు... జేఎన్టీయూహెచ్ పరిధిలో పీజీ కోర్సులు నిర్వహిస్తున్న 272 ఇంజనీరింగ్ కళాశాలల్లో 145 కాలేజీలు మాత్రమే ప్రమాణాలు పాటిస్తున్నాయని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మిగిలినవాటిలో 124 కళాశాలలకు జేఎన్టీయూహెచ్ బుధవారం మరోసారి నోటీసులు జారీచేసింది. మౌలిక వసతులు, ఫ్యాకల్టీ నిష్పత్తి, బోధనేతర సిబ్బంది తదితర అంశాలపై తాజా సమాచారాన్ని అందజేయాలని అందులో ఆదేశించింది. మూడు కళాశాలల యాజమాన్యాలు మాత్రం తాము పీజీ కోర్సులు నిర్వహించేందుకు సుముఖంగా లేమని జేఎన్టీయూహెచ్కు స్పష్టంచేశాయి. కాగా, ఎంఫార్మసీ నిర్వహిస్తున్న 104 కళాశాలల్లో లోపాలున్నట్లుగా చెబుతున్న 54 కాలేజీలకు కూడా నోటీసులు జారీఅయ్యాయి. నోటీసులు అందుకున్న కాలేజీల యాజమాన్యాలు సదరు సమాచారాన్ని శుక్రవారంలోగా యూనివర్సిటీకి అందజేయాలని అధికారులు స్పష్టంచేశారు. తీర్పునకు లోబడే ప్రవేశాలు.. పీజీఈసెట్లో కొన్ని కళాశాలలకు షరతులతో కూడిన అనుమతి లభించినప్పటికీ, హైకోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడే అభ్యర్థులకు అడ్మిషన్లు ఉంటాయని కన్వీనర్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. -
పీజీ కాలేజీలపై తేలని లెక్కలు
* అఫిలియేషన్లపై జేఎన్టీయూహెచ్ స్టాండింగ్ కమిటీ తర్జనభర్జన * కాలేజీల యాజ మాన్యాల పడిగాపులు * ముంచుకొస్తున్న వెబ్ కౌన్సెలింగ్ గడువు సాక్షి, హైదరాబాద్ : మరో 48గంటల్లో పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, జేఎన్టీయూహెచ్ పరిధిలో కళాశాలల అఫిలియేషన్పై ఇంతవరకు స్పష్టత రాలేదు. లోపాలను సరిదిద్దుకునే విషయమై యాజమాన్యాల నుంచి హామీలు తీసుకొని, అన్ని కళాశాలలను పీజీ కౌన్సెలింగ్కు అనుమతించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు రెండురోజులు ఆయా కళాశాలల నుంచి లోటుపాట్లు సరిదిద్దిన నివేదిక (డీసీఆర్)లను జేఎన్టీయూహెచ్ అధికారులు స్వీకరించారు. నివేదికలను పరిశీలించిన యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ తుది నిర్ణయం వెలువరించడంలో తర్జనభర్జన పడుతోంది. వర్సిటీ పరిధిలోని ఎంటెక్, ఎంఫార్మసీ కళాశాలలకు అఫిలియేషన్ ఇచ్చే అంశంపై ఆది వారం మధ్యాహ్నం వైస్చాన్సలర్ నివాసంలో సమావేశమైన స్టాండింగ్ కమిటీ సభ్యులు తుది నిర్ణయాన్ని ఆయనకే వదిలేసినట్లు తెలిసింది. యాజమాన్యాలకు టెన్షన్ ఎంసెట్ కౌన్సెలింగ్కు అఫిలియేషన్ దక్కక తీవ్రంగా నష్టపోయిన తమ కళాశాలలకు పీజీఈసెట్ కౌన్సెలింగ్కైనా అవకాశం కల్పిస్తారో, లేదోన ని యాజమాన్యాలకు టెన్షన్ మొదలైంది. హైకోర్టు ఆదేశాలు యాజమాన్యాలకు సానుకూలంగా ఉన్నా, వాటిని అమలు చేయడంలో జేఎన్టీయూహెచ్ అధికారులు ఎలాంటి వైఖరిని అవలంభిస్తారోనన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. ఈనేపథ్యంలో.. పలు కళాశాలల యాజమాన్యాలు వర్సిటీ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు జేఎన్టీయూహెచ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. వీసీ, రిజిస్ట్రార్లు యూనివర్సిటీలో కనిపించకున్నా, వారి ఇళ్లవద్ద అర్ధరాత్రి వరకు పలువురు యాజమాన్య ప్రతినిధులు పడిగాపులు కాస్తున్నారు. శనివారం రాత్రి వీసీని కలిసేందుకు సెక్యూరిటీ అనుమతించకున్నా, గేటు తోసుకొని లోనికి వెళ్లిన యాజమాన్య ప్రతినిధులకు, వీసీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన ఆరోగ్యం బాగోలేనందున విసిగించవద్దని వీసీ చెప్పాగా, తాము వారం రోజులుగా టెన్షన్ భరించలేకపోతున్నామని యాజ మాన్యాలు వాపోయాయి. ఆదివారం వీసీ ఇంట్లో స్టాండింగ్ కమిటీ సమావేశం ఉందని తెలిసి మరికొందరు యాజమాన్య ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. అరుుతే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు. జేఎన్టీయూహెచ్ జాబితా రాలేదు.. జేఎన్టీయూహెచ్లో పరిస్థితి ఇలా ఉంటే..వర్సిటీ అఫిలియేటెడ్ కళాశాలల జాబితా కోసం పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 10నుంచి వెబ్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియ ఉన్నందున జాబితాను 24గంటల ముందు ఇస్తే తప్ప, కళాశాలల పేర్లను కౌన్సెలింగ్లో చేర్చలేమని కీలక అధికారి ఒకరు పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ నిమిత్తం జేఎన్టీయూకే నుంచి 202, జేఎన్టీయూఏ నుంచి 106, కాకతీయ యూనివర్సిటీ నుంచి 42, ఏఎన్యూ నుంచి 10, ఓయూ నుంచి 10 ఎంటెక్, ఎంఫార్మసీ కళాశాలల జాబితాలు అందినట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో అఫిలియేటెడ్ కళాశాలలు ఉన్న జేఎన్టీయూహెచ్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదని వెబ్ కౌన్సెలింగ్కు సంబంధించిన అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
అర్హులైన బోధకులుంటేనే కౌన్సెలింగ్ అవకాశం
విద్యార్థులకు రూ.2,500 కోట్ల మేర ఆర్థిక సాయం {పమాణాలు లేని కాలేజీలకు ప్రజాధనం ఎలా వెచ్చిస్తాం? సరైన తనిఖీలు లేకుండానే అఫిలియేషన్లు ఇచ్చిన ఏఐసీటీఈ హైకోర్టుకు నివేదించిన ఏజీ రామకృష్ణారెడ్డి నిర్ణయం వాయిదా వేసిన న్యాయమూర్తి హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్కౌన్సెలింగ్ నుంచి 174 కాలేజీల తొలగింపు, అఫిలియేషన్లరద్దు వ్యవహారంపై నిర్ణయం సోమవారానికి వాయిదా పడింది. ఈ మేరకు ఉభయపక్షాల వాదనలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శనివారం విన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ తమ కౌన్సెలింగ్ కాలేజీల జాబితా నుంచి తమను తొలగించి అఫిలియేషన్లను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాదాపు 150కి పైగా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా వాదనలు విన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదించారు. అఫిలియేషన్ల రద్దును, కౌన్సిలింగ్ నుంచి కాలేజీల తొలగింపును ఆయన సమర్థించారు. సౌకర్యాలు లేనప్పుడు ప్రమాణాలు ఎలా మెరుగవుతాయని, విద్యాప్రమాణాలు లేని కాలేజీల్లో చదువుకున్నవారు ఎలా ప్రయోజకులవుతారని ఆయన ప్రశ్నించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నిబంధనలకు అనుగుణంగా బోధనా సిబ్బందిని నియమించుకుంటే, వాటికి వెబ్కౌన్సెలింగ్ జాబితాలో స్థానం కల్పిం చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దాదాపు 141 కాలేజీలు శుక్రవారం జేఎన్టీయూహెచ్ వైస్ చాన్సలర్ను సంప్రదించి, లోపాలను సరిదిద్దుకుంటున్నామంటూ అఫిడవిట్లు ఇచ్చి, కౌన్సెలింగ్లో స్థానం కల్పించాలని కోరాయని వివరించారు. అర్హులైన బోధనా సిబ్బంది ఉండేలా చూడడమే తమ ఉద్దేశమన్నారు. బోధనా సిబ్బంది కోసం తాము ఒత్తిడి చేస్తుంటే, కాలేజీలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయో తమకు అర్థంకావడం లేదన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు రూ.2,500 కోట్ల మేర సాయంచేయనున్నామని, ఇదంతా ప్రజాధనమని, ప్రమాణాలు లేని, సౌకర్యాలు లేని కాలేజీల కోసం ఇంత ప్రజాధనాన్ని వృథా చేయలేమన్నారు. ఏఐసీటీఈ క్షేత్రస్థాయిలో కాలేజీలను సందర్శించకుండానే అఫిలియేషన్లు ఇచ్చిందని, అలాంటివాటికి ఎటువంటి విలువలేదని ఏజీ తేల్చి చెప్పారు. విశ్వవిద్యాలయాలపై ఏఐసీటీఈ పెత్తనం చెల్లదని, అది సలహా మండలి మాత్రమేనన్నారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి, మరికొందరు వాదిస్తూ, లోపాలను సరిదిద్దుకునే సమయం ఇవ్వకుండా ఒకేసారి 174 కాలేజీల తలరాతను జేఎన్టీయూహెచ్ మార్చివేసిందన్నారు. తాము యూనివర్సిటీ అధికారాలను ప్రశ్నించడం లేదని, అయితే చట్టం ప్రకారం నడచుకోలేదన్నదనే తమ అభ్యంతరమన్నారు. అఫిలియేషన్ రద్దుతో రెండు, మూడేళ్ల విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. లోపాలు దిద్దుకుంటున్నాం.. తమ కాలేజీల్లో లోపాల సవరించుకుంటున్నట్టు వివరిస్తూ తెలంగాణలోని 170 ఇంజనీరింగ్ కాలేజీలు డెఫిషియెన్సీ కాంప్లియన్స్ రిపోర్టులను అఫిడవిట్ల రూపంలో హైదరాబాద్ జేఎన్టీయూకు అందజేసినట్టు తెలిసింది. లోపాలను సరిదిద్దుతున్నామని, అఫిలియేషన్లు ఇవ్వాలని, కౌన్సెలింగ్లో అవకాశం కల్పించాలని అవి కోరినట్టు తెలిసింది. 174 కాలేజీలకు యూనివర్సిటీ అఫిలియేషన్లను నిరాకరించిన సంగతి తెలిసిందే. -
వెబ్ ఆప్షన్లకు రెడీ
నేటి నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు వెబ్ కౌన్సెలింగ్ జిల్లాలో మూడు హెల్ప్లైన్ సెంటర్లు ప్రతి కేంద్రంలో నాలుగు సిస్టమ్స్ ఏర్పాటు ఎంసెట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. విద్యార్థులు నచ్చిన కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం వచ్చింది. ఈ నెల 17 నుంచి ఇంటర్నెట్లో తమ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కంచరపాలెం పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో నాలుగు కంప్యూటర్ సిస్టమ్లను ఇందు కోసం ఏర్పాటు చేశారు. వెబ్ ఆప్షన్లపై ఇప్పటికే అధికారులు శిక్షణ తరగతులు నిర్వహించారు. అవకాశం ఉంటే ఇంటి వద్దే ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. - విశాఖపట్నం సైట్లోని ప్రవేశించండిలా.. ముందుగా hhttps://eamcet. nic.inవెబ్సైట్ అడ్రస్ను టైప్ చేయాలి. ఇది కేవలం ఇం టర్నెట్ ఎక్స్ప్లోరర్ విండోస్-7 ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 9.0లో మాత్రమే తెరుచుకుంటుంది. అడ్రస్ టైప్ చేయగానే హోమ్ పేజీ వస్తుంది. ఇందులో 8 రకాల వివరాలు ఉంటాయి. హెల్ లైన్ కేంద్రాల వివరాలు, కోర్సుల జాబితా, జిల్లాల వారీగా కళాశాలలు వివరాలు, 2013లో ఎంసెట్ కౌన్సెలింగ్లో కటాఫ్ ర్యాంకుల వివరాలు లభ్యమవుతాయి. వీటిని తెరిచి మనం సమాచారం పొందాలి. ప్రతి కళాశాల, జిల్లాకు ప్రత్యేక కోడ్ నంబర్ ఇంగ్లీషు షార్ట్ఫామ్లో ఉంటుంది. వీటిని మనం నోట్ చేసుకుంటే మాన్యువల్ ఆప్షన్ ఫారం నింపడానికి సులువవుతుంది. ఆప్షన్ల నమోదు హోమ్ పేజీకి వెళ్లి క్యాండిడేట్స్ లాగిన్ వద్ద క్లిక్ చేయగానే ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్యాండిడేట్కు కేటాయించిన లాగిన్ ఐడీ నంబరు, హాల్ టికెట్ నంబరు, పాస్వర్డు, పుట్టిన తేదీ టైప్చేసి సైన్ ఇన్ చేయాలి. వెంటనే మరో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. (లాగిన్ అవగానే మీకు ఓటీపీ (ఒన్టైమ్ పాస్వర్డు)నంబరు మీమొబైల్కు వస్తుంది.) మీరిప్పుడు టెక్ట్స్ బాక్స్లో ఓటీపీ నంబరు ఎంటర్ చేయాలి. దీన్ని కన్ఫ్ర్మ్ చేసి తర్వాత క్లిక్ హియర్ ‘ఆప్షన్ ఎంట్రీ ’వద్ద క్లిక్ చేయాలి. సెలెక్ట్ డిజైర్డ్ డిస్ట్రిక్ట్స్ అనే స్క్రీన్ వస్తుంది. ఇందులో రీజినల్ వెజ్ (ఏయూ, ఓయూ, ఎస్వీయూ) జిల్లాలు వస్తా యి. ఇప్పుడు మీకు నచ్చిన జిల్లాను సెలెక్ట్ చేసుకున్న వెంటనే అన్ని వివరాలు డిస్ప్లే అవుతాయి. అనంతరం ఆప్షన్ ఎంట్రీ ఫారం వద్ద క్లిక్ చేస్తే ఫారం వస్తుంది. ఇందులో అక్కడి కాలేజీలోని కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలి. మనం ఎంపిక చేసుకున్న ప్రతి కోర్సుకు ప్రాధాన్య క్రమంలో నంబరు ఇవ్వాలి. ఇందుకోసం ముందుగానే మాన్యువల్ ఆప్షనల్ ఫారం నింపి ఉంచుకుంటే పని సులువవుతుంది. ఆప్షన్లు ఇచ్చినప్పుడు అయిదు నిమిషాలకోసారి సేవ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసిన ప్రతిసారి ఎంసెట్ హాల్టికెట్ నంబరు అడుగుతుంది. దీన్ని టైప్ చేస్తేనే సేవ్ అవుతుంది. సరిచూసుకోండి మీరిచ్చిన ఆప్షన్లు సరిచూసుకోవడానికి వ్యూ అండ్ ప్రింట్ పై క్లిక్ చేయండి. అన్ని వివరాలు వస్తాయి. ఒకవేళ మార్చుకోవాలంటే వెనక్కి వెళ్లి మార్చుకోవాలి. ఇలాంటప్పుడు మార్చిన ప్రతిసారి సేవ్ చేసుకుంటూ పోవాలి. లేదంటే పాత ఆప్షన్లు ఉండిపోతాయి. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత సేవ్ అనంతరం కన్ఫర్మ్ చేసి లాగ్ అవుట్ చేయాలి. ఇక్కడితో ఐచ్ఛికాల ఎంపిక నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఒక్కసారి కన్ఫర్మ్ చేసి లాగవుట్ అయిన తర్వాత మళ్లీ మార్పులు చేసే వీలు ఉండదు. దీన్ని అందరూ గమనించాలి. లాగిన్ ఐడీ ప్రతి అభ్యర్థికి ఒక లాగి న్ ఐడీ కేటాయిస్తారు. ఇది చాలా ముఖ్యమైనది. మనం దీన్ని మర్చిపోకూడదు. పాస్ వర్డు సేవ్ అయిన వెంటనే మీకొక లాగిన్ ఐడీ మీ మొబైల్కు పంపిస్తారు. దీని ద్వారా మనం లాగిన్ అవ్వొచ్చు. సీట్ల కేటాయింపు సీట్ల కేటాయింపు వివరాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో చూసుకోవచ్చు. మీ మొబైల్కు కూడా వివరాలు వస్తాయి. క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ద్వారా సీటు కేటాయింపు ఆర్డరును డౌన్లోడ్ చేసుకుని ఫీజు ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకుల్లో చెల్లించుకోవచ్చు. మెరిట్ అభ్యర్థికి ఇచ్చిన ఆప్షన్ కేటాయింపు అనంతరం ఆ తర్వాతి ర్యాంకర్కు సీటు కేటాయిస్తారు. గమనిక ఆప్షన్లు ఇవ్వడానికి ముందుగా లాగిన్ ఐడీ రాకపోతే ఎంసెట్ స్పేస్ 01 స్పేస్ హాల్ టికెట్ నంబరు టైప్ చేసి మీ మొబైల్ ద్వారా 87904 99899కి మెసేజ్ పెడితే లాగిన్ ఐడీ పంపిస్తారు. ఒక వేళ పాస్వర్డ్ మర్చిపోతే లాగిన్ అయినప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ వద్ద క్లిక్ చేసి కొత్త పాస్వర్డు ఎంటర్ చేసుకోవచ్చు. మీ పాస్వర్డ్ ఎవ్వరికి తెలియనివ్వకూడదు. హెల్ప్లైన్ కేంద్రాలు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద ఇందుకోసం నాలుగు సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఇందుకోసం హెచ్ఎల్సీలు ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. వెబ్ ఆప్షన్లో సందేహాలు ఉన్నవారు ఈ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సంధ్యారాణి, కెమికల్ ఇంజిజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేముడు చెప్పారు. పాస్వర్డ్ క్రియేషన్ రెండో స్టెప్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది వెబ్ ఆప్షన్ ప్రక్రియలో అత్యంత కీలకమైనది. ఇందుకోసం హోమ్పేజీలోని అడ్రస్ బార్లో క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ వద్ద క్లిక్ చేస్తే స్లాట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో పొందిన రశీదులో ఉన్న రిజిస్ట్రేషన్ నంబరు, ఎంసెట్ హాల్టికెట్ నంబరు, ర్యాంకు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ‘జెనరేషన్ పాస్వర్డ్’ అనే సూచన వద్ద క్లిక్ చేయాలి. అప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్లో ఆంగ్ల అక్షరాలతో పాటు అంకెలు కూడా వాడాలి. కనీసం 8 క్యారక్టర్స్ ఉండాలి. మ్యాగ్జిమమ్ పది క్యారెక్టర్స్ ఉపయోగించాలి. దీన్ని మళ్లీ రీఎంటర్ పాస్వర్డ్లో నమోదు చేయాలి. మొబైల్ నంబరు తప్పనిసరి. ఇది కూడా వె రిఫికేషన్ సమయంలో ఇచ్చినదై ఉండాలి. ఈ-మెయిల్ ఉంటే నమోదు చేసి సేవ్పాస్వర్డ్ అనే కమాండ్ వద్ద క్లిక్ చేయాలి. ఇప్పుడు లాగవుట్ అవ్వాలి. తర్వాత హోమ్ పేజీకి వెళ్లాలి. -
నేడు కౌన్సెలింగ్కు సెలవు
కల్లూరు రూరల్: జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రెండు కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్కు 209 మంది విద్యార్థులు హాజరైనట్లు కో ఆర్డినేటర్ సంజీవరావ్ తెలిపారు. బి.తాండ్రపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 101 మంది, రాయలసీమ యూనివర్సిటీలో 108 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ వై.విజయభాస్కర్, సంజీవరావ్ పేర్కొన్నారు. శనివారం పాలిటెక్నిక్ కళాశాలలో 90001 నుంచి 97వేలు, ఆర్యూలో 97,001 నుంచి 1,05,000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌన్సెలింగ్కు 111 మంది హాజరు నూనెపల్లె: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్కు 111 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం 75,001 నుంచి 90వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా అభ్యర్థులకు సర్టిఫికెట్లను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు క్యాంప్ కన్వీనర్ ఎం.రామసుబ్బారెడ్డి తెలిపారు. 11 మంది ఎస్సీ, 100 మంది ఓసీ, బీసీ అభ్యర్థులు హాజరైనట్లు ఆయన చెప్పారు. శనివారం 90,001 నుంచి 1,05,000 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరు కావచ్చని తెలిపారు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్కు హాజరుకాని వారు కూడా రావచ్చన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం కౌన్సెలింగ్కు జరగదన్నారు. క్యాంపులో సిస్టమ్ అధికారులుగా మంజునాథ్, సుబ్బరాయుడు, అధ్యాపకులు రాజశేఖర్ రెడ్డి, లలిత, రఘునాథ్ రెడ్డి, చీఫ్ వెరిఫికేషన్ అధికారిగా కృష్ణమూర్తి, వెంకట్రావు వ్యవహరించారు. 17 నుంచి వెబ్ కౌన్సెలింగ్: ఎంసెట్ కౌన్సెలింగ్ లో పాల్గొన్న అభ్యర్థులకు ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు క్యాంప్ అధికారి తెలిపారు. వెబ్ ఆప్షన్ల తర్వాత 26, 27 తేదీల్లో సవరణ ఉంటుందని చెప్పారు. అయితే తెలంగాణాలో ఈనెల 19న సర్వే నేపథ్యంలో వెబ్ కౌన్సెలింగ్ ఉండదని ఆయన చెప్పారు. -
ఎట్టకేలకు..!
ఎచ్చెర్ల క్యాంపస్ :ఎంసెట్-2014 ఇంజినీరింగ్ స్ట్రీం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. దీనికి శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల వేదికైంది. ఒకటి నుంచి ఐదు వేలు మధ్య ర్యాంకులు సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. తొలి రోజు జిల్లా నుంచి 33 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. గతంలో 15,000 లోపు ర్యాంకు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఒకే రోజు చేసేవారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం రోజుకు ఐదు వేల ర్యాంకులు ప్రామాణికంగా తీసుకోవటంతో రద్దీ బాగా తగ్గింది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కేంద్రంలో అధికారులు అందుబాటులో ఉంటున్నారు. అయితే తొలిరోజు మధ్యాహ్నం రెండు గంటలకే ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయ్యింది. పస్తుతానికి ధ్రువీకరణపత్రా ల పరిశీలన తప్ప ఆప్షన్ ఎంట్రీలకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గతంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఆప్షన్ల వెబ్ కౌన్సెలింగ్కు ఒకేసారి ప్రకటన విడుదల చేసేవారు. అయితే రాష్ట్రం యూనిట్ గా వెబ్ కౌన్సెలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో ఇంకా ధ్రువీకరణ పత్రాల పరిశీ లన ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఆప్షన్ల ఎంపికలో నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ ఏడాది కొత్త విధానాన్ని సైతం ఉన్నత విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. పాలీసెట్, ఈ సెట్ పద్ధతిలో ధ్రువీకరణ పత్రాల పరిశీ లన సాగుతోంది. గతం లో ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలు సైతం తీసుకునే వారు. ప్రస్తు తం జిరాక్సు కాపీలను తీసుకొని ఒరిజనల్స్ ను పరిశీలించి అభ్యర్థులకు ఇచ్చేస్తున్నారు. గతం లో కౌన్సెలింగ్ డ్రాఫ్ అయ్యే విద్యార్థులు ధ్రువీ కరణ పత్రాల కోసం సహాయ కేంద్రం చుట్టూ తిరిగేవారు. లేదంటే ఒరి జనల్ ధ్రువీకరణ పత్రా లు కన్వీనర్ పాయింట్కు వెళ్లి పోయేవి. అక్కడి నుంచి విద్యార్థులు తీసుకోకపోతే సీటు ఎలాట్ అయిన కళాశాలలకు వెళ్లి పోయేవి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం కొత్త విధానం వల్ల సీటు వచ్చినప్పటికీ విద్యార్థులు కళాశాలలో చేరక పోయినా ఇబ్బంది ఉండదు. ఆదాయ ధ్రువీకరణ పత్రాల సమస్య కూడా గతంలో తలెత్తేది. ప్రస్తుతం ఆ సమస్య కూడా లేకపోవడంతో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సజావుగా సాగుతోంది. శుక్రవారం 5001 నుంచి 10 వేల మధ్య ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ దత్, అడ్మిషన్ల ఇన్చార్జి మేజర్ కె.శివకుమార్, విభాగాధిపతులు విజేయ్ కుమార్, తవిటినాయుడు, కె.శ్రీరామాచార్యులు, డి.మురళీ కృష్ణ, ఎం.ఎల్. కామేశ్వరి, బి.కృష్ణ పాల్గొన్నారు. -
ఎం‘సెట్’ అయ్యింది..!
ఎచ్చెర్ల క్యాంపస్: ఎన్నో అంతరాయాలు..వివాదాల నడుమ ఎట్టకేలకు ఎంసెట్-2014 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు మార్గం సుగమమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించాయి. వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాలిటెక్నిక్ పురుషుల కళాశాలలో కౌన్సెలింగ్ హెల్ప్లైన్ సెంటర్(సహాయ కేంద్రాన్ని) ప్రకటించారు. గురువారం నుంచి ధ్రువీకరణ పత్రాలను పరిశీలన ప్రారంభం కానుంది. తొలి రోజున 1 నుంచి 5 వేల ర్యాంకు వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరగనుంది. విద్యార్థులకు ఊరట ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్రెడ్డి గతంలో ప్రకటించిన షెడ్యూల్ మేరకే కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించడంతో..విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం యూనిట్గానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈనెల 23 నాటికి పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే చర్యలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. అంతా సజావుగా సాగితే..ఒకటి నుంచి తరగతులు సైతం ప్రారంభం కానున్నాయి. ఇక్కడ మరో సమస్య కూడా తోడవుతోంది. పాలీసెట్, ఈసెట్-2014 ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయి..నెలలు గడుస్తున్నా..ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్థానికతపై స్పష్టత లేకపోవడంతో..అలాట్ మెంట్లు ప్రకటించలేదు. ఈ కోర్సుకు సంబంధించి.. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారం భం కావాల్సి ఉన్నా..ఇంకా పరిష్కారం కావడం లేదు. -
పీజీ ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్లైన్: పీజీ ప్రవేశాలకు సైతం ఈ సారి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. గతంలో ప్రవేశాలను ఆంధ్రా యూనివర్సిటీలో నేరుగా కౌన్సెలింగ్ నిర్వహించేవారు. అయితే ఈసారి ఆసెట్-2014కు సంబంధించి (ఆంధ్రా యూనివ ర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ) పీజీ ప్రవేశాలకు మొదటి సారిగా వె బ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎంసెట్, ఎడ్ సెట్, ఐసెట్ మాదిరిగా విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన అనంతరం వర్సిటీ, ఏఫిలియేషన్ కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుం ది. ఈ విధానంతో జిల్లా విద్యార్థులు ఇకపై కౌన్సెలింగ్కు విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేదు. లభించిన సీటు ఆధారంగా అలాట్మెంట్ అయిన కళాశాలలకు వెళితే సరిపడుతుంది. ఇందులో భాగంగా ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడల్లో నాలుగు చోట్ల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ విభాగంలో సహాయ కేంద్రంను నిర్వహిస్తుంది. కాగా ఫిజికల్లీ చాలెంజడ్, స్ఫోర్ట్సు, ఎన్ఎస్ఎస్ కేటగిరికి చెందిన విద్యార్థులు మాత్రం కౌన్సెలింగ్కు విశాఖపట్నంలోని ఏయూ డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. మిగతా విద్యార్థులు ఏ సహాయ కేంద్రంలోనైనా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావచ్చు. ఈ నెల 9 నుంచి 12 వరకు ఈ వెబ్ కౌన్సెలింగ్ కొనసాగనుంది. 9నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 15వ తేదీన మొదటి విడత సీట్లు అలాట్ మెంట్ ఉంటుంది. 15 నుంచి 18 వరకు పేమెంట్ సీట్లు అలాట్మెంట్ అందుబాటులో ఉంచు తారు .మిగులు సీట్లకు 20, 21వ తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ను నాలుగు సహాయ కేంద్రాల్లో నిర్వహిస్తారు. 21 నుంచి 23 మధ్య వీరు ఆష్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. వీరికి 24న సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. 25 నుంచి 28 మధ్య పేమెంట్ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. జూలై రెండో వారంలో తరగతులు ప్రారంభమవుతాయి. కౌన్సిలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ఈనెల తొమ్మిది నుంచి ప్రారంభించ నున్న ఆసెట్-2014 వెబ్ కౌన్సె లింగ్ సజావుగా నిర్వహనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.ఉదయం తొ మ్మిది నుంచి సహాయ కేంద్రంలో దృవీకరణ పత్రాలు పరిశీలన సాగు తుంది.దృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తయిన విద్యార్థులు వెబ్ కౌ న్సెలింగ్లో ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. -ప్రిన్సిపాల్ గుంట తులసీరావు, బీఆర్ఏయూ -
9 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
తణుకు అర్బన్, న్యూస్లైన్ : 2014-15 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులై పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు ఈనెల సోమవారం నుంచి 16వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తణుకు ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ కౌన్సెలింగ్ కేంద్ర క్యాంప్ అధికారి యలమర్తి రాజేంద్రబాబు శనివారం తెలిపారు. జిల్లాలో తణుకు ముళ్లపూడి వెంకటరాయ మమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల, భీమవరం సీతా పాలిటెక్నిక్ కళాశాలలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఓసీ, బీసీలు రూ.300, ఎస్సీ, ఎస్టీలు రూ.150 రుసుం చెల్లించాలని చె ప్పారు. కళాశాలల ఎంపిక ప్రక్రియ 12వ తేదీ నుంచి 17 వరకు నిర్వహిస్తామని తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్కు తీసుకురావాల్సిన పత్రాలివే.. - పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ - పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ర్యాంకు కార్డు - పదో తరగతి మార్కుల మెమో - స్టడీ సర్టిఫికెట్లు (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) - కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ) - పదో తరగతి బదిలీ సర్టిఫికెట్ (టీసీ) - ఆదాయ ధ్రువీకరణ పత్రం (1.1.2014 తరువాత జారీ చేసింది) -
ఫార్మసీ కౌన్సెలింగ్కు 97 మంది
భీమవరం (టూటౌన్), న్యూస్లైన్ : ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం సోమవారం వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. బీఫార్మసీ, ఫార్మాడీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో చేరబోవు విద్యార్థులు భీమవరం బీవీ రాజు విద్యాసంస్థల్లోని సీతాపాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్కు హాజరయ్యారు. 24 మంది విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించినట్లు క్యాంప్ ఆఫీసర్ డీవీ సుబ్బారావు తెలిపారు. ఈనెల 22 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 17 నుంచి 22 వరకు కళాశాలల ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. తణుకులో.. తణుకు అర్బన్: తణుకు పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ వెబ్ కౌన్సెలింగ్కు 73 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ వై.రాజేంద్రబాబు తెలిపారు. ఎంసెట్లో 1 నుంచి 20 వేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్లో ఓసీ, బీసీ అభ్యర్థులు 70 మంది, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ముగ్గురు సర్టిఫికెట్లను పరిశీలించామన్నారు. మంగళవారం 20,001 నుంచి 33 వేల ర్యాంకులోపు అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నేటినుంచి ఏలూరులో.. ఏలూరు: స్థానిక సెయింట్ థెరిస్సా అటానమస్ కళాశాలలో మంగళవారం నుంచి ఎంసెట్-2013(బైపీసీ)లో ర్యాంకు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ తెలిపారు. మొదటిరోజు 1 నుంచి 20 వేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9493474281, 9441151156లో సంప్రదించాలని కోరారు. -
రేపే ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, బీ ఫార్మసీలో ప్రవేశానికి ఎంసెట్ (ఎంపీసీ స్ట్రీమ్) ర్యాంకర్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్కు ఆదివారం రాత్రితో గడువు ముగిసింది. ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం 1,30,289 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకాగా.. వీరిలో 1,28,716 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరంతా 41,26,650 ఆప్షన్లు ఇచ్చినట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో 47,723 మంది వెబ్ ఆప్షన్లు మార్చుకున్నారని ఆయన వెల్లడించారు. ఈనెల 17న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెలువడుతుందని, విద్యార్థులు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్లకు సమాచారం అందుతుందని తెలిపారు. ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్కు సగం మందే... ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికిగాను ఐసెట్-2013లో అర్హత సాధించి ర్యాంకు పొందిన వారు 1.21 లక్షల మంది ఉండగా.. కౌన్సెలింగ్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు కేవలం 55,781 మంది ర్యాంకర్లు మాత్రమే హాజరయ్యారు. ఆదివారంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దాదాపు 1.20 లక్షలు అందుబాటులో ఉన్నాయని ఐసెట్ అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ వెల్లడించారు. -
విద్యార్థులకు తాయిలాలు!
ఎచ్చెర్ల క్యాంపస్,న్యూస్లైన్:డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోని సహాయ కేంద్రలో ఐసెట్-2013 వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. ఈ నెల 15 నుంచి వెబ్ ఆప్షన్లు విద్యార్థులు ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఎంసీఏ, ఎంబీఏ అడ్మిషన్లు ఏటా తగ్గుతున్నాయి. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఆడ్మిషన్లు పెంచుకోవడం కోసం అక్రమార్గాలను సైతం తొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అమాయక విద్యార్థులకు డబ్బు ఎర వేస్తున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం అందజేసే స్క్రాచ్ కార్డు, రిజస్ట్రేషన్ కెం వెరిఫికేషన్ ఫారాలను విద్యార్థుల నుంచి తీసుకుంటున్నారు. ఇందుకు ప్రతిగా విద్యార్థికి రూ. 10 వేలు వరకు అందజేస్తున్నట్టు తెలిసింది. విద్యార్థులు ఇచ్చుకోవల్సిన అప్షన్లను కళాశాల యాజమాన్యాలే తమకు అనుకూలంగా ఇచ్చి వారికి తీరని ద్రోహం చేస్తున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ సమైక్యాంధ్ర సెగతో జరగటం లేదు. దీంతో అక్కడ నుంచి ఇక్కడ సహాయ కేంద్రానికి అధిఖ సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిని ప్రైవేటు యాజమాన్యాలు ట్రాఫ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మన జిల్లాతో పాటు విశాఖ ప్రాంతానికి చెందిన కళాశాలు కూడా అడ్మిషన్ల పైనే దృష్టి పెట్టాయి. ఎక్కువగా రీయింబర్స్మెంట్ వర్తించే విద్యార్థులనే ట్రాఫ్ చేసి స్క్రాచ్ కార్డు, ఆర్సీవి ఫారాను వారినుంచి తీసుకుంటున్నారు. ముందుగా రూ. 10 వేలు ఇస్తామని, కళాశాలలో చేరాక ఫీజు చెల్లించనవసరం లేదని, రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లతో చదువుకోవచ్చునని ప్రలోభ పెడుతున్నారు. అయితే వాస్తవంగా విద్యార్థులు ఓ విషయాన్ని ఇక్కడ గమనించాలి. అమాయకంగా చేరాక వసతిగృహం ఫీజులు, బిల్డింగ్ ఫండ్, కాలేజ్ డెవలఫ్మెంట్ ఫండ్ వంటివి బలవంతంగా వసూలు చేస్తారు. బదిలీ ధ్రువీకరణ పత్రం తీసుకొని మరో కళాశాలలో చేరటం సాధ్యం కాదు. మరోపక్క ఉపాధి అవకాశాలను కోల్పోవల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు అప్రమతంగా ఉండకపోతే విలువైన భవిష్యత్ను కోల్పోవడం ఖాయం. చాలామంది విద్యార్థులు కళాశాలలో చేరాక తమ ఇబ్బందులు వేరొకరకి చెప్పుకోలేని విధంగా ఇరుక్కుంటున్నారు. విద్యార్థులు స్క్రాచ్ కార్డు, రిజిస్ట్రేషన్ కెం వెరిఫికేషన్ ఫారాన్ని అందజేశాక అందులో పూర్తి సమాచారం ఉంటుంది. స్క్రాచ్ కార్డు రహస్య నంబర్ పాస్ వర్డుగా ఇస్తారు. మళ్లీ విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్లో ఆప్షన్లు మార్చుకోవటం కూడా సాధ్యం కాదు. స్క్రాచ్ కార్డులు పైవేటు వ్యక్తులు అక్రమంగా కొనేయటం, పాస్వర్డు రహస్య నంబర్ హ్యాకింగ్ అవ్వటం వంటి సమస్యల వల్ల వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి మళ్లీ ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావించింది. అందుకే మొబైల్ నంబర్తో మెసేజ్ అలర్టు అనుసంధానం చేసింది. దీంతో ఆప్షన్లను అక్రమంగా ఎవరైనా మార్చినా మెసేజ్ వస్తుంది. అయితే స్క్రాచ్ కార్డే వారి వద్ద లేక పోతే విద్యార్థులు మోసపోక తప్పదు. మా దృష్టికి తెస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా స్క్రాచ్కార్డు, రిజస్ట్రేషన్ కెం వెరిఫికేషన్ ఫారాలను ప్రైవేటు యాజమాన్యాలకు, బయట వ్యక్తులకు విద్యార్థులు ఇవ్వవద్దు. ప్రలోభాలకు లొంగితే ఉజ్వల భవిష్యత్తు కోల్పోతారు. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలను ఎంచుకోవాలి. ఎవరైనా బలవంతంగా ప్రలోభ పెట్టినా, స్క్రాచ్ కార్డు తీసుకున్నట్టు మా దృష్టికి తీసుకొస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా. - ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్,వీసీ, బీఆర్ఏయూ -
ఇంజినీరింగ్ కళాశాలల సీటు పాట్లు
ఎచ్చెర్ల క్యాంపస్,న్యూస్లైన్: ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు మంగళ, బుధవారాల్లో ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. దీంతో ప్రవేటు కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్లపై దృష్టి పెట్టాయి. ఇంజినీరింగ్ సీట్లు కనీసం 50 శాతం నిండినా కళాశాలలు సజావుగా నిర్వహించవచ్చు. లేకుంటే మాత్రం ఆర్థికంగా ఇక్కట్లు తప్పవు. 50 శాతం దాటి అడ్మిషన్లు గత ఏడాది మూడు కళాశాలల్లో మాత్రమే నమోదయ్యాయి. రెండు కళాశాలల్లో మూడేళ్ల నుంచి ఒక్క సీటు కూడా బోణీ కొట్టడం లేదు. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు అడ్మిషన్లపై దృష్టిపెట్టాయి. దీనికోసం ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించాయి. బోధకులు, ట్యూషన్ సెంటర్లు విద్యార్థులను చేర్చితే రూ.5 వేలు కూడా ఇస్తున్నారు. మరికొన్ని కళాశాలలు బిల్డింగ్, కాలేజ్ డెవలప్మెంట్ ఫీజుల్లో రాయతీలు కూడా ఇస్తున్నాయి. అయినప్పటికీ ప్రవేశాల జాడ కనిపించడం లేదు. ఇప్పటికే కొందరు పక్క రాష్ట్రాలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో చేరారు. ఇంజినీరింగ్కు ఉపాధి అవకాశాలు తగ్గడం, అవసరానికి మించి కళాశాలలు నెలకొనడంతో ప్రైవేటు యాజమాన్యాల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడాది జిల్లాలో 3628 కన్వీనర్ సీట్లు ఉండగా, 1605 మాత్రమే నిండాయి. 1272 మేనేజ్మెంట్ సీట్లలో సగభాగం కూడా నిండలేదు. జిల్లాలో ఏటా సుమారు 4500 మంది వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ రాస్తున్నా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మాత్రం అంతమంది హాజరుకావడం లేదు. 2009లో 2212, 2010లో 2909, 2011లో 2370, 2012లో 2375, 2013లో 3910 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో దాదాపు సగం మంది విజయనగరం, విశాఖపట్నంకు చెందిన విద్యార్థులే ఉన్నారు. జిల్లాకు చెందిన సగం మంది విద్యార్థులు బయిట జిల్లాల కళాశాలల్లో చేరి పోతున్నారు. అక్కడ నుంచి జిల్లాలోని కళాశాలలకు మాత్రం ఆ స్థాయిలో విద్యార్థులు రావడం లేదు. దీంతో ఏటా అడ్మిషన్లు తగ్గుతున్నాయి. పాత కళాశాలల్లోకూడా అడ్మిషన్ల పరిస్థితి ఆశాజనకంగా లేదు. అందుకే కళాశాలలు శ్రీకాకుళం పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో వెబ్ ఆప్షన్ హెల్ప్లైన్ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. చేరుతామని హామీ ఇచ్చిన విద్యార్థుల ఆప్షన్లు దగ్గరుండి నమోదు చేస్తున్నారు. సీట్లు నిండడానికి ఎవరి ప్రయత్నాలు చేస్తుండగా, రెండు కళాశాలలు మాత్రం చేతులెత్తేశాయి. -
సర్టిఫికెట్ల పరిశీలనకు 362మంది హాజరు
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్లైన్ : ఎంసెట్-2013 కౌన్సెలింగ్లో భాగంగా గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ కౌన్సెలింగ్ను ఉన్నత విద్యాశాఖ వాయిదా వేసింది. దీంతో ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్ వాయిదా పడిన విషయం తెలియక గురువారం హెల్ప్లైన్ కేంద్రాలకు వచ్చి నిరాశగా వెనుదిరిగారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 362మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 19న ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైన తరువాత అధ్యాపకుల సమ్మె కారణంగా పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపకపోవడంతో మూడు రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో కళాశాలల ఎంపికకు గురువారం నుంచి జరగాల్సిన వెబ్ కౌన్సెలింగ్ను తాత్కాలికంగా వాయిదా వేసిన ఉన్నత విద్యాశాఖ తాజా షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన.. ఎంసెట్-2013 కౌన్సెలింగ్లో భాగంగా శుక్రవారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు 60,001 నుంచి 80,000 ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 60,001 ర్యాంకు నుంచి 65,000, 75,001 నుంచి 80వేల ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 65,001 నుంచి 75,000 ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి. -
అనకాపల్లికి మరో వరం
అనకాపల్లి, న్యూస్లైన్: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రి ఇంజినీరింగ్ డిప్లొమో కళాశాలను ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పరిశోధన స్థానంలోని ఏడీఆర్ చాంబర్లో ఆయన అగ్రి ఇంజినీరింగ్ కళాశాల విధి విధానాలపై శాస్త్రవేత్తలతో చర్చించారు. విశ్వవిద్యాలయం బోర్డు మెంబర్లు కళాశాల ఏర్పాటుకు అనుమతిస్తూ తీర్మానం చేసినట్టు ఏడీఆర్ అంకయ్య మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా వెబ్ కౌన్సెలింగ్ జరిగే తీరును, అగ్రి ఇంజినీరింగ్ కళాశాల ప్రాధాన్యాన్ని, సీట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను మంత్రి తెలుసుకున్నారు. ఏడాదికి 30 సీట్లు భర్తీ అయ్యే అగ్రి ఇంజినీరింగ్ కళాశాలకు అవసరమైన భవనం, ఫర్నిచర్ కోసం కనీసం రెండుకోట్లు కావాలని మంత్రిని ఏడీఆర్ కోరారు. సిబ్బంది నియామకానికి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ సిబ్బంది ఎందరు అవసరమో, నిధులెన్ని కావాలో కచ్చితంగా చెబితే అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. కళాశాలను ప్రస్తుతానికి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలోని భవనాలలో నిర్వహిస్తామని, ఇద్దరు ప్రొఫెసర్లను తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోవచ్చని ఏడీఆర్ అంకయ్య తెలిపారు. కళాశాల గురించి ఏడీఆర్ అంకయ్యతో పాటు చెరకు ప్రధాన శాస్త్రవేత్త కె. ప్రసాదరావు, నైర కళాశాల ప్రొఫెసర్ పి. జగన్నాధరావు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఏడీఏ శ్రీదేవి, శాస్త్రవేత్తలు వీరభద్రరావు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల సూపరింటిండెంట్ రామకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, కాంగ్రెస్ నాయకులు దంతులూరి దిలీప్కుమార్, కడిమిశెట్టి రాంజీ, బాబి తదితరులు పాల్గొన్నారు. భవనాలను పరిశీలించిన గంటా ఏడీఆర్ ఛాంబర్లో అగ్రి ఇంజినీరింగ్ కళాశాల వ్యవహారంపై సమీక్ష జరిపిన తర్వాత, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను, అక్కడి సదుపాయాలను మంత్రి పర్యవేక్షించారు. తాత్కాలిక ప్రాతిపదికన సదుపాయాలు కల్పించుకుంటే తర్వాత నిధులు అందుబాటులోకి తేవడానికి, సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూడేళ్ల కాలపరిమితి గల కోర్సులు డిప్లమో ఇన్ అగ్రి ఇంజినీరింగ్ కళాశాలలో మూడు సంవత్సరాల కాలపరిమితితో కోర్సు ఉంటుంది. ఏడాదికి 30 సీట్లను భర్తీ చేస్తారు. గత ఏడాదే డిప్లమో ఇన్ అగ్రి ఇంజినీరింగ్ కళాశాలను రాజేంద్రనగర్లో ప్రారంభించగా, రెండోదానిని చిత్తూరు జిల్లాలోని కలికిరిలో ఏర్పాటు చేశారు. పదో తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. ఈ కోర్సు పూర్తి చేసినవారు బీటెక్ అగ్రి బ్రాంచ్లో రెండో సంవత్సరం నేరుగా ప్రవేశించే వెసులుబాటు ఉంది.