WTC Final
-
కోహ్లి ‘కీ’లకం!
జట్టుకు దూకుడు నేర్పిన సారథి... విదేశీ పిచ్లపై సైతం అలవోకగా పరుగులు చేయగల నేర్పరి... టెక్నిక్, టెంపర్మెంట్లో అతడికెవరూ రారు సాటి! కంగారూ గడ్డపై పరుగులు చేసేందుకు సహచరలంతా తీవ్రంగా తడబడుతుంటే... ఆసీస్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో నిరూపించిన అసలు సిసలు నాయకుడు అతడు. అందుకే ప్రస్తుతం అతడు పెద్దగా ఫామ్లో లేకపోయినా... కీలక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్కు ముందు ఎవరినోట విన్నా అతడి గురించే చర్చ. ‘బాడీలైన్’ బౌలింగ్తో ఇబ్బంది పట్టాలని ఒకరు... రెచ్చగొట్టకుండా వదిలేయాలని మరొకరు... ఇలా ఆ్రస్టేలియా మాజీ ఆటగాళ్లంతా తీవ్రంగా చర్చిస్తున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు... టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ కు గురైన టీమిండియా... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకోవాలంటే అతడు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది! సుదీర్ఘ ఫార్మాట్ను అమితంగా ఇష్టపడే విరాట్ కోహ్లికి ఆ్రస్టేలియాపై మెరుగైన రికార్డు ఉంది. క్రీజులో కుదురుకుంటే మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టే విరాట్... ఆసీస్లో ఆసీస్పై అదరగొట్టాడు. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడిన కోహ్లి 1352 పరుగులు చేశాడు. 54.08 సగటు నమోదు చేసిన విరాట్... 6 సెంచరీలు, 4 అర్ధశతకాలు కొట్టాడు. పేస్కు అనుకూలించే పిచ్లపై యాభైకి పైగా సగటుతో పరుగులు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. సుదీర్ఘ కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా సాగుతున్న విరాట్ తన కెరీర్లో దాదాపు చివరి ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్లో అందరి దృష్టి కోహ్లిపైనే నిలవనుంది. వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం... మరో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ గాయంతో జట్టుకు దూరమవడం... గత పర్యటనలో అదరగొట్టిన సీనియర్ ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇప్పుడు జట్టులోనే లేకపోవడం... ఇవన్నీ వెరసి విరాట్ కోహ్లీ విలువను మరింత పెంచాయి. పెద్దగా అనుభవం లేని యశస్వి జైస్వాల్, ఇప్పటి వరకు అరంగేట్రమే చేయని అభిమన్యు ఈశ్వరన్, నిలకడ లోపించిన కేఎల్ రాహుల్, తొలిసారి ఆసీస్లో పర్యటిస్తున్న ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ వంటి వాళ్లతో కూడిన బ్యాటింగ్ లైనప్లో కోహ్లీ ఒక్కడే శిఖరంలా కనిపిస్తున్నాడు. పరీక్ష పెట్టే పేస్ పిచ్లు, సవాలు విసిరే బౌన్సీ వికెట్లు స్వాగతం పలుకుతున్న సమయంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాలంటే బ్యాటింగ్ దళాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కోహ్లిదే. ఫామ్ అందుకుంటాడా... గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ను ఒడిసి పట్టింది. ముచ్చటగా మూడోసారి అదే జోరు కొనసాగాలంటే బ్యాటింగ్ బలగం రాణించాల్సిన అవసరముంది. అయితే సహనానికి పరీక్ష పెట్టే ఆసీస్ పిచ్లపై మెరుగైన ప్రదర్శన చేయాలంటే మొక్కవోని దీక్ష ముఖ్యం. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన కోహ్లి... మూడు మ్యాచ్ల్లో కలిపి 100 పరుగులు కూడా చేయలేదు. మరి ఇలాంటి స్థితిలో పెద్దగా అనుభవం లేని బ్యాటింగ్ ఆర్డర్తో భారత జట్టు ప్రతిష్టాత్మక ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే కోహ్లి సత్తా చాటాల్సిన అవసరముంది. భారత జట్టు వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించాలంటే టీమిండియా ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా... 4–0తో ట్రోఫీ చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇది సాధ్యపడాలంటే కోహ్లి తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టి లేపాల్సిన అవసరముంది. గతంతో ఫార్మాట్తో సంబంధం లేకుండా చెలరేగిపోయిన కోహ్లీ... కొంతకాలంగా నెమ్మదించాడు. మునుపటి మెరుపులు మెరిపించ లేకపోతున్నాడు. ఈ ఏడాది 6 టెస్టులు ఆడిన కోహ్లి... అందులో 22.72 సగటుతో కేవలం 250 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తాడనే నమ్మకం సాధించిన కోహ్లి... ఆసీస్ పర్యటనలో అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లిని వదిలేయండి: వాట్సన్ కీలక సిరీస్కు ముందు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు... ఆ దేశ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ కీలక సూచన చేశాడు. మైదానంలో కోహ్లి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని తమ ప్లేయర్లకు చెప్పాడు. రెచ్చగొడితే కోహ్లిలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడని హితవు పలికాడు. ‘విరాట్ను దగ్గర నుంచి గమనించా. అతడిలో మెరుగైన ప్రదర్శన చేయాలనే కసి ఎక్కువ. అది లోలోపల ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. దాన్ని రెచ్చగొట్టి బయటకు తీయకపోవడమే మేలు. అందుకే ఆసీస్ ఆటగాళ్లు అతడిని వదిలేయాలి. లేకుంటే అతడు చాలా ప్రమాదకరం’ అని వాట్సన్ అన్నాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఆసీస్లో పర్యటించిన కోహ్లి... 2014–15 పర్యటనలో 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. ‘ఆసీస్లో అతడు ఎలాంటి ప్రదర్శన కనబర్చాడో అందరికీ తెలుసు. అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు అతడు ప్రతి బంతిని మెరుగ్గా అర్థం చేసుకుంటాడు. అది జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నా’ అని వాట్సన్ అన్నాడు. కోహ్లికి బాడీలైన్ బౌలింగ్ చేయాలి: హీలీ భారత ప్రధాన ఆటగాడు కోహ్లిని అడ్డుకోవాలంటే బాడీలైన్ బౌలింగ్తో ఇబ్బంది పెట్టాలని ఆసీస్ ఆటగాళ్లకు ఆ దేశ మాజీ ప్లేయర్ ఇయాన్ హీలీ సూచించాడు. పదే పదే ముందరి ప్యాడ్ను లక్ష్యంగా చేసుకొని బంతులేయడం ద్వారా అతడిని బ్యాక్ఫుట్కు పరిమితం చేసి త్వరగా అవుట్ చేయవచ్చని సూచించాడు. ‘తొలి టెస్టులో ఆ్రస్టేలియా పేసర్లు కోహ్లికి ఎలా బౌలింగ్ చేస్తారో చూసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. క్రీజులో కోహ్లీ మెరుగైన కాళ్ల కదలికలు కనబర్చితే అతడు త్వరగా కుదురుకుంటాడు. అందుకే ముందరి ప్యాడ్ లక్ష్యంగా ప్రయతి్నంచాలి. అప్పుడే అతడిని నియంత్రించవచ్చు. ఒకవేళ అది ఫలితాన్ని ఇవ్వకపోతే. బాడీలైన్ బౌలింగ్ చేయడం మంచిది’ అని హీలీ ఆసీస్ పేసర్లకు హితవు పలికాడు. విరాట్ ఒక చాంపియన్: లయన్ భారత సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై ఆ్రస్టేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ అసలు సిసలు చాంపియన్ అని అన్నాడు. గత 60 టెస్టు ఇన్నింగ్స్ల్లో కోహ్లి కేవలం 2 సెంచరీలు, 11 అర్ధశతకాలు మాత్రమే చేసినా... అతడిని తక్కువ అంచనా వేయడం లేదని లయన్ పేర్కొన్నాడు. ‘ఫామ్లో ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే... అతడి రికార్డులు నమ్మశక్యం కానివి. అతడి పట్ల నాకు గౌరవం ఉంది. అతడిని అవుట్ చేయాలని తప్పక ప్రయతి్నస్తా. కానీ అది ఎంత కష్టమో నాకు తెలుసు. చాన్నాళ్లుగా మా మధ్య రసవత్తర సమరం జరుగుతుంది. కోహ్లి, స్మిత్ అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు’ అని లయన్ అన్నాడు. -
'డబ్ల్యూటీసీ ఫైనల్పై ఆశలు వద్దు.. ఆసీస్ను భారత్ ఓడించలేదు'
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్కు గురైనటీమిండియా ఇప్పుడు మరో కఠిన పరీక్షకు సిద్దమవుతోంది. మరో వారం రోజుల్లో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆసీస్తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుత భారత జట్టు ప్రదర్శను చూస్తుంటే హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే భారత్కు బీజీటీ ట్రోఫీ ఎంతో కీలకం. ఈ సిరీస్లో 4-0 తేడాతో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆప వ్యాఖ్యలు చేశాడు."భారత్ డబ్యూటీసీ ఫైనల్కు చేరుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై టీమిండియా 4-0తో ఓడించలేదు. ఒకవేళ ఆసీస్ను భారత్ ఓడిస్తే మాత్రం నేను గాల్లో తేలుతాను. అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించే నేను మాట్లాడుకోవడం లేదు.ఇప్పుడు కేవలం ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుపైనే దృష్టిపెట్టిండి. 1-0, 2-0, 3-1, 2-1 తేడాతో సిరీస్ గెలిచినా పర్వాలేదు. సిరీస్ గెలవడం ముఖ్యం. ఎందుకంటే భారత క్రికెట్ అభిమానులందరూ ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారు. మీరు గెలిచి మళ్లీ ఫ్యాన్స్లో జోష్ నింపండి" అంటూ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.చదవండి: PAK Vs AUS 1st ODI: అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తేదీని ప్రకటించిన ఐసీసీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ ఫైనల్ తేదీ మరియు వేదికను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించింది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11-15 మధ్యలో లండన్లోని లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డేను (జూన్ 16) కూడా ప్రకటించారు నిర్వహకులు. లార్డ్స్లో మొట్టమొదటిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. తొలి ఎడిషన్ అయిన 2021లో సౌథాంప్టన్, రెండో ఎడిషన్ అయిన 2023లో ఓవర్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఎడిషన్లలో టీమిండియా ఫైనల్స్కు చేరుకోగా.. తొలి ఎడిషన్లో న్యూజిలాండ్ చేతిలో, రెండో ఎడిషన్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ప్రస్తుతం భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా అతి సమీపంలో రెండో స్థానంలో ఉంది. అన్నీ ఊహించినట్లుగా జరిగితే ఈ ఎడిషన్ ఫైనల్లోనూ భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడే అవకాశం ఉంది. -
కోహ్లిని దాటేసిన రోహిత్
-
పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారత ఆటగాడిగా!
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా అద్బుతంగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ మరోసారి అద్బుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 23 ఓవర్లు ముగిసే సరికి తొలి వికెట్కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ(88 బంతుల్లో 61 నాటౌట్), యశస్వీ జైశ్వాల్(50) పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో 2000 పరుగుల మార్క్ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 25 మ్యాచ్లు (40) ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ 2017 పరుగులు చేశాడు. రోహిత్ తర్వాత స్ధానంలో భారత్ నుంచి విరాట్ కోహ్లి(1942) ఉన్నాడు. కాగా ఇది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ ఉన్న విషయం తెలిసిందే. తొలి ఎడిషన్ విజేతగా న్యూజిలాండ్ నిలవగా.. రెండో ఎడిషన్లో ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలిచింది. విండీస్తో రెండో టెస్టుకు భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్ చదవండి: IND vs WI: ఒకప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నాడు.. కట్ చేస్తే ఇప్పుడు టీమిండియా క్రికెటర్! -
డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే..
Rohit Sharma Captaincy: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ మద్దతుగా నిలిచాడు. కేవలం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఓడినంత మాత్రాన అతడిని తొలగించాలనే డిమాండ్లు సరికావంటూ హిట్మ్యాన్ను సమర్థించాడు. కాగా డబ్ల్యూటీసీ సైకిల్ 2019-21లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్లో జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టగా 2021-23 సీజన్లోనూ ఫైనల్కు అర్హత సాధించింది. కానీ ఈసారి కూడా గతం మాదిరే చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. దారుణ ఓటమి ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్లో రోహిత్ సేన ఏకంగా 209 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఆసీస్ సంప్రదాయ క్రికెట్లోనూ చాంపియన్గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించగా.. టీమిండియా రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. టాస్ విషయంలో, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడంపై మాజీలు సైతం పెదవి విరిచారు. ఈ క్రమంలో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. నాకు నమ్మకం ఉంది ఈ విషయంపై స్పందించిన మైకేల్ క్లార్క్ రోహిత్కు అండగా నిలిచాడు. ‘‘రోహిత్పై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను గొప్ప కెప్టెన్. అతడి దూకుడైన ఆట తీరు, కెప్టెన్సీ నాకు నచ్చుతాయి. ఎల్లవేళలా అతడు సానుకూల దృక్పథంతోనే కనిపిస్తాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ రికార్డు అమోఘం. నాయకుడిగా తను విజయవంతమయ్యాడు. ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవలేదన్న ఒకే ఒక్క కారణంగా రోహిత్ కెప్టెన్గా పనికిరాడనడం సరికాదు. నిజానికి ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టీమిండియా వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది. టెస్టు క్రికెట్లో వారి రికార్డు బాగుంది. టీమిండియా నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఇక వన్డే వరల్డ్కప్ ఈవెంట్లో వారు ఎలా ఆడతారో చూడాల్సి ఉంది’’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. రోహిత్ను కెప్టెన్గా కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్గా.. ఒక్కడే కాదు! ‘మొదటి బంతి’కే రూట్ అలా! పంత్ను లాగిన ఫ్యాన్స్.. వీడియో వైరల్ -
ఇప్పుడలా లేదు.. ఎవరూ ఎవరికి సాయం చేయరు: అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Ravichandran Ashwin Shocking Comments: ‘‘ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా మెలిగేవారు. కానీ.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కేవలం సహచర ఆటగాడిగానే పరిగణింపబడతాడు. అప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా ఉంది. డ్రెసింగ్రూం వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరు అనుక్షణం పక్క వాళ్లతో పోటీ పడుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. ‘‘హాయ్ బాస్.. ఏంటి సంగతులు?’’ అని పక్కవాళ్లతో సరదాగా మాట్లాడేందుకు ఎవరి దగ్గరా కాస్తైనా సమయం లేదు’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా కేవలం కొలీగ్స్ మాదిరే ఉంటున్నారని, మునుపటిలా ఫ్రెండ్స్లా కొనసాగే పరిస్థితి లేదన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సైకిల్ 2021-23లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఈ టీమిండియా బౌలర్కు ఫైనల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. అత్యుత్తమ బౌలర్కు మొండిచేయి ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్లో అశ్విన్కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక.. ఆసీస్తో ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించినప్పటికీ ట్రోఫీ గెలవలేక చతికిలపడింది. ఇదిలా ఉంటే.. అశ్విన్ తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రెసింగ్రూం వాతావరణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరికి వారే యమునా తీరే.. ఒంటరి ప్రయాణం జట్టులోని ఇతర సభ్యుల నుంచి సహకారం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లు ఉంటారని అశూ పేర్కొన్నాడు. ‘‘నిజానికి.. ఎంత ఎక్కువగా ఆట గురించి చర్చిస్తే అంత ఎక్కువగా టెక్నిక్ను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. ఒకరి అనుభవాలు మరొకరికి పాఠాలుగా పనికివస్తాయి. కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. మనకు ఏదైనా సాయం కావాలంటే ఎవరూ ముందుకురారు. పది మందితో కూడిన ఒంటరి ప్రయాణం లాంటిది ఇది’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే, క్రికెట్లో ఒకరు చెప్పే పాఠాల కంటే సొంతంగా నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుందంటూ ముక్తాయింపు ఇచ్చాడు. మేటి బౌలర్గా ఎదిగిన అశూ కాగా రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ అయిన ఈ తమిళనాడు బౌలర్.. తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 92 టెస్టులు, 113 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడాడు. మేటి బౌలర్గా ఎదిగిన అతడు టెస్టుల్లో 474, వన్డేల్లో 151, టీ20లలో 72 వికెట్లు పడగొట్టాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్గా.. ఒక్కడే కాదు! సచిన్, ధోని, కోహ్లి, రోహిత్.. రుతురాజ్ కూడా వీళ్ల బ్యాచ్లో చేరిపోయాడు..! -
రోహిత్ మంచి కెప్టెన్.. మేటి టెస్ట్ బ్యాటర్ కూడా! కానీ.. ఇకపై..
Rohit Sharma Captaincy: ‘‘రోహిత్ మంచి కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం గొప్ప నాయకుడే కాదు.. మంచి టెస్ట్ బ్యాటర్ కూడా! ఈ మాట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందా అంటే నేనైతే కచ్చితంగా చెప్పలేను. గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సైకిళ్లలో టీమిండియా ఫైనల్కు చేరింది. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సే అతడికి పెద్ద సమస్యగా మారనుంది. ఇది నమ్మకతప్పని వాస్తవం. రానున్న రెండేళ్లలో డబ్ల్యూటీసీ సైకిల్-2025 షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్లో కొనసాగాలని భావిస్తే తప్పకుండా ఆడతాడు. నిజానికి ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో దాదాపు ఆరు సిరీస్లు ఆడాల్సి ఉంటుంది. కానీ గత రెండేళ్లలో చాలా మంది క్రికెటర్లు(రోహిత్ శర్మ సహా) కీలక సిరీస్లు కూడా మిస్ చేశారు. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు ఒక్కోసారి విశ్రాంతి దొరక్కపోవచ్చు. అలాంటపుడు మూడు ఫార్మాట్లు ఆడే అవకాశం కొంతమందికే దక్కుతుంది. సెలక్టర్లు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే జట్టును ఎంపిక చేస్తారు. డబ్ల్యూటీసీ తదుపరి సైకిల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్తో మ్యాచ్లు ఉంటాయి. తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉండొచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్గా తనను తాను నిరూపించుకున్నాడు. కానీ.. రానున్న రెండేళ్ల కాలంలో కెప్టెన్గా అతడికి ప్రత్యామ్నాయం వెతక్కతప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఇకపై సారథిగా కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. వరుస వైఫల్యాలు కాగా రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో అంతంత మాత్రమే ఆడిన ‘హిట్మ్యాన్’.. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 15 పరుగులే చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 43 పరుగులు సాధించగలిగాడు. ఇక కీలక మ్యాచ్లో టాస్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను పక్కనపెట్టిన విషయంలో తీవ్ర విమర్శలపాలయ్యాడు రోహిత్. అతడిని కెప్టెన్గా తప్పించాల్సిందేనంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే? -
కెప్టెన్సీ మాకు వద్దు అంటూ ట్రోల్స్ రోహిత్ శర్మ ఏం చేసాడో చూడండి..!
-
WTC లో భారత్ ఓటమికీ అసలు కారణాలు ఇవే
-
ICC Test Rankings: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. 39 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు సత్తా చాటారు. తొలి మూడు స్ధానాలను ఆసీస్ బ్యాటర్లే దక్కించుకోవడం విశేషం. లబుషేన్ తొలి ర్యాంకులో కొనసాగుతుండగా.. స్టీవ్ స్మిత్ రెండో ర్యాంకులో ఉన్నాడు. అయితే టీమిండియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అదరగొట్టిన ట్రావిస్ హెడ్ మూడు స్ధానాలు ఎగబాకి మూడో ర్యాంక్ చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడిన హెడ్ 174 బంతుల్లోనే 163 పరుగులు చేశాడు. అతడితో పాటు స్మిత్ కూడా సెంచరీతో చెలరేగాడు. కాగా 39 ఏళ్ల తర్వాత ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్ 3 ర్యాంకింగ్స్లో ఉండడం ఇదే తొలి సారి. 1984లో వెస్టిండీస్ ఆటగాళ్లు గోర్డాన్ గ్రీనిడ్జ్ (810), క్లైవ్ లాయిడ్ (787), లారీ గోమ్స్ (773) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడకపోయనప్పటికీ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టకున్నాడు. మరోవైపు రీ ఎంట్రీలో అదరగొట్టిన అజింక్య రహానే 37వ స్థానానికి చేరుకోగా, శార్దూల్ ఠాకూర్ బ్యాటర్లలో 94వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టాప్ 10లో భారత్ తరపున డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే ఉన్నాడు. పంత్ 10 స్ధానంలో కొనసాగుతుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుసగా 13వ స్థానాల్లో ఉన్నారు. చదవండి: IND vs WIL వెస్టిండీస్తో టెస్టు సిరీస్.. హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ! -
రోహిత్ శర్మ పరువు తీసిన సునీల్ గవాస్కర్
-
#RAshwin: బాధ కలిగిన మాట నిజమే..
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమిండియా మరోసారి రన్నరప్కే పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా సగర్వంగా టైటిల్ను అందుకుంది. అయితే టెస్టుల్లో వరల్డ్ నెంబర్వన్ బౌలర్గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ను అదనపు పేసర్గా తీసుకొచ్చారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చినప్పటికి మ్యాచ్ ముగిసేవరకు అశ్విన్ స్పందించలేదు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం అశ్విన్ ఎట్టకేలకు నోరు విప్పాడు. ట్విటర్ ద్వారా స్పందించిన అశ్విన్ ముందుగా ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు తెలిపాడు. ''డబ్ల్యూటీసీ టైటిల్ సాధించిన పాట్ కమిన్స్ సేనకు కంగ్రాట్స్. ఈ విజయానికి వారు అర్హులు. నన్ను ఎంపిక చేయకపోవడంపై పెద్దగా బాధ లేదు. ఎంత కష్టపడినా జట్టులో 11 మందికి మాత్రమే చోటు ఉంటుంది. వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉండడంతో ఒక స్పిన్నర్ చాలనుకొని జడేజాను ఆడించారు. అయితే టీమిండియా ఓటమి బాధ కలిగించింది నిజమే. మన జట్టులో కొన్ని లోపాలున్నప్పటికి గెలవడానికి ప్రయత్నించిన పోరాటం బాగుంది. రెండేళ్లు కష్టపడితే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు వచ్చాం. ఇలా ఆఖరి మెట్టుపై బోల్తా పడడం బాధనే కలిగిస్తుంది కదా. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రెండేళ్లలో నాతో పాటు ఎన్నో టెస్టు మ్యాచ్లు ఆడిన సభ్యులకు.. ముఖ్యంగా కోచింగ్, సపోర్ట్ స్టాఫ్కు ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలోనే మీ ముందుకు వస్తా'' అంటూ తెలిపాడు. ఇక డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్లో టీమిండియా తరపున అశ్విన్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఈ సైకిల్లో అశ్విన్ మొత్తంగా 61 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అదే డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తంగా ఐదు వికెట్లు(తొలి ఇన్నింగ్స్లో ఒకటి, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు) పడగొట్టాడు. ఒకవేళ అశ్విన్ ఫైనల్ ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిమానులు భావిస్తున్నారు. Congratulations Australia on winning this #WTCFinal and closing out this cycle of test cricket. It is disappointing to end up on the wrong side of things, nevertheless it was a great effort over the last 2 years or so to get here in the first place. Amidst all the chaos and… — Ashwin 🇮🇳 (@ashwinravi99) June 11, 2023 చదవండి: అహ్మదాబాద్ స్టేడియం నిజంగా గొప్పదా!.. ఎందుకంత ప్రాముఖ్యత? -
పాపం గిల్... భారీ జరిమానా?
-
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు
-
ఐపీఎల్లో అలా అడగడం లేదు కదా.. రోహిత్ శర్మపై లెజెండ్ ఫైర్
ఐసీసీ ఈవెంట్లో టీమిండియా మరోసారి నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి చూసింది. 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే కుప్పకూలింది. కాగా డబ్ల్యూటీసీ విజేతను నిర్ణయించడానికి కేవలం ఒక్క మ్యాచ్ సరిపోదని, కనీసం మూడు మ్యాచ్ల సిరీస్నైనా ఆడించాలని రోహిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ వాదనతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విభేదించాడు. "డబ్ల్యూటీసీ ఫైనల్ ఎంతో కాలం క్రితమే నిర్ణయించబడి ఉంటుంది. ఫైనల్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంటుందని డబ్ల్యూటీసీ సైకిల్ మొదటి మ్యాచ్ మొదలకావడానికి ముందే మీకు తెలుసు. కాబట్టి అందకు తగ్గట్టు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. మీరు ఐపీఎల్కు ఎలా అయితే సిద్దమవుతున్నారో ఈ మ్యాచ్కు కూడా అలానే ప్రిపేర్ కావాలి. అక్కడ ఎవరూ మూడు మ్యాచులు పెట్టండి అని అడగడం లేదు కాదా. ఎవరికైనా కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్లాలన్న దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు విజేతను నిర్ణయించడానికి మూడు మ్యాచ్లు పెట్టమని అడుగుతున్నారు. అదే అప్పుడు కూడా ఓడిపోతే ఐదు మ్యాచ్లు పెట్టమని అడగరని గ్యారంటీ ఎంటీ" అని సన్నీ ప్రశ్నించాడు. చదవండి: WTC Final: కోహ్లికి ఏమైంది.. రోహిత్, ద్రవిడ్తో విభేదాలా? కారణం అదేనా -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత ఆస్ట్రేలియా
-
'ఇదొక గుణపాఠం.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ మా కొంపముంచింది'
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2021-23 టైటిల్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఓవల్ వేదికగా ఆసీస్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండో ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన టీమిండియా రన్నరప్కే పరిమితమైంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ''టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని వారిని(ఆస్ట్రేలియాను) కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్కి దించడంతో మేము బాగా ప్రారంభించామని అనుకున్నాను. అందుకు అనుగుణంగా మా బౌలర్లు ఆట తొలిరోజు మొదటి సెషన్లో బాగా బౌలింగ్ చేశారు. కానీ తర్వాతి సెషన్ నుంచి మా పతనం ఆరంభమైంది. ఆస్ట్రేలియన్ బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. పట్టు చిక్కిందనుకున్న సమయంలో ట్రెవిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ల భాగస్వామ్యం వారిని ముందంజలో ఉంచింది. ఒక రకంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో చేసిన పరుగులతోనే సగం విజయం సాధించింది. కానీ మేము గెలవడానికి ప్రయత్నించాం. రెండో ఇన్నింగ్స్లో వారిని తొందరగా ఔట్ చేయాలనుకున్నాం. అందులో దాదాపు సక్సెస్ అయ్యాం. కానీ తొలి ఇన్నింగ్స్లో లభించిన భారీ ఆధిక్యం వాళ్లకు కలిసొచ్చింది.. అదే మా కొంపముంచింది. మా బ్యాటింగ్ విభాగం బాగానే ఉందనుకుంటున్నా. కీలక సమయంలో ఆడడంలో విఫలమయ్యాం. నాలుగేళ్లలో రెండు ఫైనల్స్ ఆడామంటే మా ఆట బాగానే ఉందని అర్థం. ఈ ఫైనల్ కోసం రెండేళ్లు పాటు కష్టపడ్డాం. వరుసగా టెస్టు సిరీస్లు గెలిచి ఫైనల్ దాకా వచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడిపోయాం. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులు మాకు బాగా మద్దతిచ్చారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అంటూ ముగించాడు. -
WTC Final 2023: టీమిండియా ఘోర పరాజయం
-
ఆస్ట్రేలియా చరిత్ర.. అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా
డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్గా ఆస్ట్రేలియా అవతరించింది. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ 209 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 444 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీసం డ్రాకు కూడా ప్రయత్నించకుండానే 234 పరుగులకు ఆలౌట్ అయింది తొలి సెషన్లోపే ఆసీస్ బౌలర్ల ధాటికి తోక ముడిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గిల్ క్యాచ్ విషయంలో చేసిన పొరపాటు మినహా మిగతా అన్ని విషయాల్లో పక్కా ప్లాన్తో ఆడిన ఆస్ట్రేలియా పరిపూర్ణ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు క్రికెట్లో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే, టి20 వరల్డ్కప్స్తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలు నెగ్గిన ఆస్ట్రేలియా తాజాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. తాజా డబ్ల్యూటీసీ టైటిల్తో కలిసి ఇప్పటివరకు ఆసీస్ తొమ్మిది ఐసీసీ టైటిల్స్ నెగ్గడం విశేషం. అందులో వన్డే వరల్డ్కప్ను ఐదుసార్లు(1987, 1999, 2003, 2007, 2015), ఒక టి20 వరల్డ్కప్(2021), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండుసార్లు (2006, 2009)లో గెలుచుకున్న ఆస్ట్రేలియా తాజాగా 2023లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గి ఐసీసీ అన్ని మేజర్ టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ✅ICC ODI World Cup ✅ICC Champions Trophy ✅ICC T20 World Cup ✅ICC World Test Championship Australia becomes the first team to win all ICC trophies 👏 Their 9th ICC title🤯 pic.twitter.com/yQLXJFFtTu — CricTracker (@Cricketracker) June 11, 2023 చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
WTC Final: విజేత ఆసీస్.. భారత్పై 209 పరుగుల తేడాతో విజయం
టీమిండియా ఆలౌట్.. 209 పరుగుల తేడాతో ఆసీస్ విజయం డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ జట్టు 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 444 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదోరోజు లంచ్ సెషన్లోపే 234 పరుగులకే కుప్పకూలింది. 161/3 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు కోహ్లి రూపంలో కాసేపటికే షాక్ తగిలింది. ఆ వెంటనే జడేజా కూడా డకౌట్ కావడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది. అయితే రహానే, శార్దూల్లు తొలి ఇన్నింగ్స్లో లాగా ఏదైనా అద్బుతం చేసి డ్రా దిశగా నడిపిస్తారేమోనని ఆశించారు. కానీ ఆసీస్ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. రహానే, శార్దూల్లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో.. టెయిలెండర్డను ఔట్ చేయడం ఎంతో సేపు పట్టలేదు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, కమిన్స్ ఒక వికెట్ తీశాడు. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 469& 270/8 టీమిండియా: 296 ఆలౌట్& 234 ఆలౌట్ ఫలితం: 209 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్గా అవతరించింది. ఓటమికి రెండు వికెట్ల దూరంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి మరింత దగ్గరైంది. ప్రధాన బ్యాటర్లంతా ఇప్పటికే వెనుదిరగడంతో ఆసీస్ బౌలర్లు టెయిలెండర్ల వికెట్లు తీసే పనిలో పడ్డారు. మిచెల్ స్టార్క్ ఉమేశ్ యాదవ్ను ఔట్ చేయడం ద్వారా టీమిండియా 220 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ► తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శార్దూల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం డకౌట్గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో శార్దూల్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆసీస్ విజయం సాధించడం తథ్యం. రహానే(46) ఔట్.. ఆరో వికెట్ డౌన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ మాదిరి ఆదుకుంటాడనుకున్న రహానే(46) మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 212 పరుగుల వద్ద ఆరో వికెట్ నష్టపోయింది. మరో 232 పరుగులు చేయాల్సిన టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. జడేజా డకౌట్.. ఐదో వికెట్ డౌన్ ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. కోహ్లి ఔటైన రెండు బంతుల వ్యవధిలోనే జడేజా కూడా డకౌట్గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కోహ్లి(49)ఔట్.. టీమిండియా 179/4 భారీ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు కోహ్లి రూపంలో షాక్ తగిలింది. 49 పరుగులు చేసిన కోహ్లి స్కాట్ బోలాండ్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 179 పరుగులు వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. కాగా భారత్ విజయానికి ఇంకా 265 పరుగులు చేయాల్సి ఉంది. ఐదోరోజు మొదలైన ఆట.. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆట ఆఖరి రోజుకు చేరుకుంది. క్రితం రోజు స్కోరు ఆటను ఆరంభించిన టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కోహ్లి 46, రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. చేయాల్సినవి 280 పరుగులు.. చేతిలో ఉన్నవి ఏడు వికెట్లు. మరి టీమిండియా 444 పరుగుల టార్గెట్ను చేధించి చరిత్ర సృష్టిస్తుందా లేక డ్రాకు మొగ్గుచూపుతుందా అనేది చూడాలి. -
ఓవల్లో వాలిపోయిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక వైభవంగా జరిగింది. నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఇంగ్లాండ్లోని ఓవల్లో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఈ జంట మెరిసింది. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా ) ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు పరిణీతి, రాఘవ చద్దా ఓవల్లో వాలిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న త్వరలోనే వివాహాబంధంతో ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్లోని ఓ ప్యాలెస్లో జరగనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?) View this post on Instagram A post shared by 😍 PARINEETI ADDICTED 😍 (@parineetigalaxy) -
'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్లోనే ఉంది!'
క్రికెట్ను కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా శాసించిందన్న మాట అందరికి తెలిసిందే. 1990 దశకం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ను ఏకచత్రాధిపత్యంతో ఏలింది. ఈ రెండు దశాబ్దాల్లో కంగారూలు మూడు వన్డే వరల్డ్కప్లతో పాటు వన్డే, టెస్టుల్లో చాలాకాలం పాటు నెంబర్వన్గా కొనసాగారు. భయమంటే ఏంటో ఎరుగని జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియా కూడా దాసోమయ్యింది. 2003 వన్డే వరల్డ్కప్ ఫైనల్ అందుకు చక్కటి ఉదాహరణ. స్టీవా, రికీ పాంటింగ్, మార్క్ వా, ఆడమ్ గిల్క్రిస్ట్, మైకెల్ బెవాన్, గ్లెన్ మెక్గ్రాత్, షేన్ వార్న్, మైకెల్ క్లార్క్, జాసన్ గిలెస్పీ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. జట్టుగా ఎంత బలంగా ఉంటుందో.. ఆధిపత్యం ప్రదర్శించడంలోనూ అంతే పట్టుదలగా ఉండేది. ఒక దశలో కంగారూలతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు కంగారు పడే పరిస్థితి ఉండేది. అయితే ఇన్ని ఘనతలున్నా కంగారూలకు చీటింగ్ అనేది పర్యాయపదంగా ఉండిపోయింది. ఆస్ట్రేలియా ఎన్నో గొప్ప మ్యాచ్లు గెలిచినా కొన్నిసార్లు ఆ జట్టు చీటింగ్ చేసి గెలిచిన మ్యాచ్లే ఎక్కువగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా క్యాచ్ ఔట్ల విషయంలో ఆసీస్ ఆటగాళ్లు చేసిన చీటింగ్లు ఏ జట్టు చేయలేదని చెప్పొచ్చు. బాల్ టాంపరింగ్ నుంచి సాండ్ పేపర్ ఉదంతం వరకు అన్ని ఆస్ట్రేలియా ఖాతా నుంచి వచ్చినవే. అందుకే చీటింగ్ అనే పదం కంగారూల బ్లడ్లోనే ఉందంటారు క్రికెట్ అభిమానులు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా మరోసారి చీటింగ్ను బయటపెట్టింది. 444 పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు గిల్, రోహిత్లు శుభారంభం అందించారు. 41 పరుగులు జోడించిన అనంతరం స్కాట్ బోలాండ్ బౌలింగ్లో షాట్ ఆడే యత్నంలో శుబ్మన్ గిల్ స్లిప్లో ఉన్న గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్లో చెప్పి బిగ్ స్ర్కీన్పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయం రోహిత్, గిల్తో పాటు సగటు అభిమానిని ఆశ్చర్యపరిచింది. గతంలోనూ పాంటింగ్, స్టీవ్ స్మిత్, మైకెల్ క్కార్ల్ కెప్టెన్లుగా ఉన్నప్పుడు ఇలాంటి చీటింగ్లు చాలానే జరిగాయి. అంపైర్లు కూడా ఆసీస్కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఫలితాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి కూడా నాటౌట్ అని క్లియర్గా కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. అయితే సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ఉండి కూడా ఎందుకు ఉపయోగించడం లేదని అభిమానుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) Always winning with cheating #notout pic.twitter.com/H2m939vqCD — Milind Joshi (@MilindJ03022606) June 10, 2023 Cheating is in Australian cricket team DNA. pic.twitter.com/fqXsPxulBQ — SAVAGE (@Freakvillliers) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
చేధిస్తే చరిత్రే; టెస్టుల్లో అత్యధిక లక్ష్య చేధన ఎంతో తెలుసా?
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ తుది అంకానికి చేరుకుంది. నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టెస్టు క్రికెట్లో ఇంత భారీ టార్గెట్ను చేధించిన సందర్బాలు లేవు. ఒకవేళ టీమిండియా భారీ టార్గెట్ను అందుకుంటే మాత్రం కొత్త చరిత్రను తిరగరాసినట్లవుతుంది. టెస్టుల్లో అత్యధిక చేధన ఎంతో తెలుసా? ఇక టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇది మినహా ఇప్పటివరకు టీమిండియా 400 పరుగుల టార్గెట్ను మళ్లీ చేధించిన దాఖలాలు లేవు. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా విధించిన 444 పరుగుల టార్గెట్ను చేధిస్తే.. అత్యధిక పరుగుల టార్గెట్ను చేధించిన జట్టుగా టీమిండియా రికార్డులకెక్కనుంది. India will create history if they chase down 444. No team chased down more 418 in Test cricket! pic.twitter.com/Tkyd3khSpz — Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
WTC Final: గెలవకపోయినా పర్లేదు డ్రా చేసుకుంటే అదే గొప్ప!
ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాకు 137 ఓవర్లలో 444 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఆటకు ఒకటిన్నరోజు మిగిలి ఉంది. అంటే ఓవర్కు మూడు పరుగుల చొప్పున పరుగులు చేసినా గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే.. పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది. ముఖ్యంగా నాలుగు, ఐదు రోజుల్లో బౌలర్లకు వరంగా మారింది. ఈ లెక్కన చూస్తే టీమిండియా రిస్క్ చేయకపోవడం ఉత్తమం. మనోళ్లు బ్యాటింగ్ ఏంటో తొలి ఇన్నింగ్స్లోనే చూశాం. టాపార్డర్లో వచ్చిన నలుగురిలో ఏ ఒక్కరిలోనూ నిలకడ కనిపించలేదు. అటాకింగ్ గేమ్ ఆడుతారని ఊహించలేం. అటాకింగ్ గేమ్తో అన్ని కలిసి వచ్చి విజయం సాధిస్తే అది చరిత్రే అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అసాధ్యమని చెప్పొచ్చు. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోతే అసలుకే ఎసరు వస్తుంది. దీనివల్ల టీమిండియా ఓటమి పాలయ్యే చాన్స్ ఉంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మ్యాచ్ గెలవడం కంటే డ్రా దిశగా అడుగులు వేయడం ఉత్తమం. వేగంగా ఆడడం కంటే ఓపికతో ఆడుతూ వికెట్లు కాపాడుకుంటూ డ్రాకు ప్రయత్నించడం మేలు. అయితే రిస్క్ చేసి వేగంగా ఆడితే టీమిండియాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదంతా ఓపెనింగ్ జంట రోహిత్, శుబ్మన్ గిల్ ఆడడంపైనే ఉంటుంది. ఈ జంట వేగంగా ఆడి కనీసం 200 పరుగుల వరకు నిలబడితే టీమిండియాకు గెలిచే చాన్స్ ఉంటుంది.. లేని పక్షంలో కనీసం డ్రాకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ వద్దనుకుంటే డ్రాకు ప్రయత్నించడం ఉత్తమం అని చెప్పొచ్చు. కనీసం డ్రా చేసుకుంటే ఆస్ట్రేలియాతో కలిసి సంయుక్తంగా డబ్ల్యూటీసీ టైటిల్ను అందుకోవచ్చు. ఓడిపోతే మాత్రం టీమిండియా రెండోసారి కూడా రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ► ఇక టెస్టు క్రికెట్లో టీమిండియా 400కు పైగా లక్ష్యాన్ని ఒక సందర్భంలో మాత్రమే చేధించింది. 1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో 403 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 406 పరుగులు చేసి అందుకుంది. ► ఇక ఇదే ఓవల్లో టీమిండియా టెస్టుల్లో చేజ్ చేసిన దాఖలాలు లేవు. అయితే 1979లో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్లో 438 పరగులను చేధించే క్రమంలో 8 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసి కేవలం 9 పరుగుల వ్యవధిలో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఓవల్లో టీమిండియాకు ఫోర్త్ ఇన్నింగ్స్లో ఈ పరుగులే ఇప్పటివరకు అత్యధికం ► ఇంతకముందు ఆస్ట్రేలియా 1978లో ఒక టెస్టులో టీమిండియాకు 445 పరుగుల టార్గెట్ను విధించింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. -
ఉమేశ్ యాదవ్ వైల్డ్ రియాక్షన్ వెనుక కారణం అదేనా?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పోరాడుతోంది. ఆసీస్ ఇప్పటికే 330 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉండడంతో టీమిండియాకు ఓటమి ముప్పు పొంచే ఉంది. మరో గంటలో ముగిసే తొలి సెషన్లోపూ ఆసీస్ను ఆలౌట్ చేయకుంటే టీమిండియాకు పెను ప్రమాదం ఉంది. 400 పరుగులకు పైగా టార్గెట్ను నిర్దేశించే పనిలో ఉన్న ఆసీస్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గ్రీన్ 25, అలెక్స్ కేరీ 22 పరుగులతో ఆడుతున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. నాలుగోరోజు ఆట మొదలైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ బ్రేక్ ఇచ్చాడు. 41 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్నస్ లబుషేన్ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ఇన్సైడ్ ఎడ్జ్ అయిన బంతి లబుషేన్ బ్యాట్కు తగులుతూ నేరుగా పుజారా చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. అయితే లబుషేన్ ఔట్ చేసిన ఆనందంలో ఉమేశ్ యాదవ్ గట్టిగా అరుస్తూ కాస్త వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. అయితే ఉమేశ్ ఇలా చేయడం వెనుక ఒక కారణముందని అభిమానులు భావిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఉమేశ్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు.. పైగా దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఉమేశ్ ఇవేవి పట్టించుకోకుండా కేవలం తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో మాత్రం మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్న ఉమేశ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియారిటీ ఎప్పటికైనా పనికొచ్చేది కాని వ్యర్థం కాదు అని నిరూపించాడు. అందుకే లబుషేన్ వికెట్ తీయగానే అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 'గాయాన్ని సైతం లెక్క చేయని మీ పోరాటం అసమానం' -
WTC Final: చేతిలో ఏడు వికెట్లు.. భారత్ విజయానికి 280 పరుగులు
ముగిసిన ఆట.. చేతిలో ఏడు వికెట్లు; విజయానికి 280 పరుగుల దూరంలో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్లో 40 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 44, రహానే 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 444 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు చేతిలో ఏడు వికెట్లు ఉండగా.. చేయాల్సిన పరుగులు 280. చివరి రోజు మొత్తం నిలబడితే మాత్రం టీమిండియాకు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తే మాత్రం ఓటమి ముప్పు పొంచి ఉంది. ఏది ఏమైనా క్రీజులో కుదురుకున్న కోహ్లి, రహానేలు ఆదివారం తొలి సెషన్లో ఆడబోయే ఆటతో టీమిండియా కథ తేలిపోనుంది. పరిస్థితి ఏ మాత్రం ప్రతికూలంగా మారినా టీమిండియా మ్యాచ్ను డ్రా చేసుకోవడం మేలు. 444 పరుగుల టార్గెట్ను చేధించి చరిత్ర సృష్టిస్తుందా లేక వికెట్లు పోగొట్టుకొని డ్రా లేదా ఓటమిని మూగట్టకుంటుందా అనేది చూడాలి. నిలకడగా ఆడుతున్న కోహ్లి, రహానే.. టీమిండియా 136/3 444 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. 33 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కోహ్లి 30, రహానే 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. పూజారా(27) ఔట్.. మూడో వికెట్ డౌన్ రోహిత్ ఇలా ఔటయ్యాడో లేదు నేను కూడా అంటూ పుజారా పెవిలియన్ చేరాడు. ఒకే ఓవర్లో కమిన్స్ రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. 27 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 92 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయి కష్టాల్లో పడింది. ఇక బారం అంతా కోహ్లి, రహానేలపైనే ఉంది. రోహిత్ శర్మ(43)ఔట్.. రెండో వికెట్ డౌన్ రోహిత్ శర్మ(43) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ లియోన్ బౌలింగ్లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఇంకా 352 పరుగుల దూరంలో ఉంది. నిలకడగా ఆడుతున్న రోహిత్.. టీమిండియా 66/1 టీ విరామం అనంతరం చివరి సెషన్ ఆడుతున్న టీమిండియా 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 33 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. అతనికి పుజారా నుంచి చక్కని సహకారం అందుకుంది. టీమిండియా విజయానికి 378 పరుగులు అవసరం ఉంది. టీ విరామం.. తొలి వికెట్ పడింది.. గిల్(18) ఔట్ 444 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో కామెరాన్ గ్రీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే స్లిప్లో ఉన్న గ్రీన్ బంతి కింద పెట్టినట్లు అల్ట్రాఎడ్జ్లో కనిపించింది. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అంపైర్ ఔటిచ్చాడు. వికెట్ నష్టానికి 41 పరుగులతో టీమిండియా టీ విరామానికి వెళ్లింది. టార్గెట్ 444.. టీమిండియా 4 ఓవర్లలో 23/0 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 14, శుబ్మన్ గిల్ 9 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్.. టీమిండియా టార్గెట్ 444 డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు 137 ఓవర్లలో 444 పరుగుల టార్గెట్ను నిర్ధేశించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అలెక్స్ కేరీ 66 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లబుషేన్ 41, మిచెల్ స్టార్క్ 41 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 433 పరుగుల ఆధిక్యంలో మిచెల్ స్టార్క్(41) రూపంలో ఆస్ట్రేలియా 260 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 433 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. టీమిండియాకు 450 పరుగుల టార్గెట్ను నిర్దేశించే అవకాశం ఉంది. 400 దాటిన ఆసీస్ ఆధిక్యం లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్లో వేగం పెంచింది. ప్రస్తుతం 400 పరుగుల ఆధిక్యం దాటిన ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆడుతుంది. అలెక్స్ కేరీ 57 పరుగులు, మిచెల్ స్టార్క్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే టీమిండియా విజయం కన్నా డ్రా దిశగా ఆడడం మేలు. లంచ్ విరామం.. 374 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 70 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ 41, మిచెల్ స్టార్క్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 374 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. 400 పరుగుల టార్గెట్ను టీమిండియా ముందు ఉంచాలని ఆసీస్ భావిస్తుంది. తిప్పేసిన జడ్డూ.. ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 25 పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్ను జడేజా తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. లోటాస్గా వెళ్లిన బంతి గ్రీన్ బ్యాట్ హ్యాండిల్ను తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో ఆసీస్ 167 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. జడ్డూ స్పిన్ మాయాజాలానికి గ్రీన్ నోరెళ్లబెట్టాడు. ఇక ఆసీస్ 340 పరుగుల ఆధిక్యంలో ఉంది. 321 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ నాలుగో రోజు ఆటలో ఐదో వికెట్ త్వరగానే తీసినప్పటికి తర్వాతి వికెట్లు తీయడానికి టీమిండియా బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఇప్పటికే ఆసీస్ 321 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఆసీస్ 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. లబుషేన్ను ఔట్ చేసిన ఉమేశ్.. ఐదో వికెట్ డౌన్ నాలుగోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ 41 పరుగులు చేసిన లబుషేన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. 297 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట మొదలైంది. మూడోరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన కంగారూలు దానిని కొనసాగిస్తూ ఓవరాల్ ఆధిక్యాన్ని దాదాపు మూడొందలకు చేర్చారు. మిగిలిన 6 వికెట్లతో ఆ జట్టు శనివారం ఎన్ని పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం. పిచ్ నెమ్మదిస్తుండటంతో ప్రస్తుతానికి ఇంకా మ్యాచ్ ఆ్రస్టేలియాతో చేతిలోనే ఉన్నట్లు! -
'గబ్బా' రిపీట్ అయ్యేనా! ఫాలోఆన్ తప్పినా ఓటమి పొంచే ఉంది!
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడోరోజు ఆట ముగిసింది. తొలి రెండు రోజులు ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించగా.. మూడోరోజు ఆటలో మాత్రం టీమిండియా రెండు సెషన్లలో ఆసీస్పై చేయి సాధించింది. తొలి సెషన్లో అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్ అద్భుత పోరాటంతో టీమిండియా ఫాలోఆన్ గండం నుంచి బయటపడింది. మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే 5 పరుగులు చేసిన కేఎస్ భరత్ ఔట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అప్పటికి టీమిండియా స్కోరు 151 మాత్రమే. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే మరో 100 పరుగులు చేయాల్సిన దశలో రహానే, శార్దూల్ అద్బుతం చేశారు. ఈ ఇద్దరు ఏడో వికెట్కు 109 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు ఔటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలబడలేదు. దీంతో ఆసీస్కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయావకాశాలు ఎక్కువగా ఆసీస్కే ఉన్నట్లు తెలుస్తోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ కలుపుకొని ఇప్పటివరకు ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యం సాధించింది. ఒకవేళ నాలుగు రోజు ఆటలో లంచ్లోపే ఆసీస్ ఆలౌట్ చేయకపోతే వారి ఆధిక్యం 350 నుంచి 400 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఆటకు ఇంకా రెండు రోజులు ఉండడంతో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నాలుగు, ఐదు రోజుల్లో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఓటమి తప్పకపోవచ్చు. గబ్బా రిపీట్ అయ్యేనా? అయితే 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో రహానే నేతృత్వంలో గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇలాంటి పరిస్థితిలోనే చారిత్రక విజయాన్ని సాధించింది. ఆసీస్ విధించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి అందుకుంది. అప్పటి మ్యాచ్లో రిషబ్ పంత్ 89 నాటౌట్, శుబ్మన్ గిల్ 91 పరుగులు, పుజారా 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టును గెలిపించారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రస్తుతం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగు రోజు ఆటలో టీమిండియా బౌలర్లు విజృంభించి తొలి సెషన్లో తక్కువ వ్యవధిలో(అంటే మరో 40 పరుగులు) ఆసీస్ను ఆలౌట్ చేయగలిగితే టీమిండియా లక్ష్యం 330 నుంచి 340 మధ్య ఉంటుంది. ఆటకు రోజున్నర సమయం ఉండడంతో కాస్త నిలకడగా ఆడితే టీమిండియా విజయం అందుకోవడంతో పాటు టైటిల్ నెగ్గే అవకాశం ఉంది. మరి టీమిండియా ఆసీస్ను ఆలౌట్ చేసి చేధనలో టార్గెట్ను అందుకుంటుందా లేక మరోసారి రన్నరప్గా నిలుస్తుందా అనేది రేపటితో తేలిపోనుంది. చదవండి: #ShubmanGill: లవ్ ప్రపోజ్కు పడిపోయాడు.. రనౌట్ మిస్ చేశాడు! 512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే -
డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లండ్లోనే ఎందుకు?
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలు క్రికెట్ ఆడుతున్న సభ్యదేశాల్లో ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటుంది. వన్డే వరల్డ్కప్, టి20 వరల్డ్కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా మెగాటోర్నీలు ఏవైనా ఏదో ఒక దేశం ఆతిథ్యం ఇవ్వడం కనబడుతుంది. అయితే తాజాగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు మాత్రం ఇంగ్లండ్ మాత్రమే ఎందుకు ఆతిథ్యమిస్తోంది అని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు. తొలిసారి 2021లో నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ వేదిక అయింది. ఈసారి ఓవల్ స్టేడియంలో రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తున్నారు. రెండు వేర్వేరు స్టేడియాల్లో రెండు ఫైనల్స్ జరిగితే ఇందులో కామన్గా ఉంది మాత్రం టీమిండియానే. వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న టీమిండియా ఈసారి కూడా మ్యాచ్ గెలస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. 2021లో కివీస్తో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో పరాజయం పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. మరి డబ్ల్యూటీసీ ఫైనల్స్ను ఐసీసీ ఇంగ్లండ్లోనే ఎందుకు నిర్వహిస్తుందనే ప్రశ్నకు ఒకటే సమాధానం వినిపిస్తుంది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లాంటి ఆసియా ఖండపు దేశాల్లో జూన్ నెలలో ఎలాంటి టెస్టు మ్యాచ్లు జరగవు. దానికి కారణం వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత్, శ్రీలంక ఇలా ఏది చూసుకున్నా ఉపఖండపు దేశాల్లో వాతావరణ పరిస్థితి ఒకలాగే ఉంటుంది. అందుకే జూన్ నుంచి ఆగస్టు వరకు ఉపఖండపు దేశాలు స్వదేశంలో టెస్టు మ్యాచ్లు ఎక్కువగా ఆడవు. మనం సరిగ్గా గమనిస్తే జూన్ నెలలో ఇంగ్లండ్ మినహా ఏ దేశంలోనూ ఎక్కువగా క్రికెట్ మ్యాచ్లు జరగవు. ఈ సమయంలో ఇంగ్లండ్ లాంటి యూరోప్ దేశంలోనే పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉంటాయి. అందుకే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ను ఇంగ్లండ్లో నిర్వహించడానికే మొగ్గు చూపుతుంది. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఇంగ్లండ్లోని లార్డ్స్లో నిర్వహించాలని ఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఉపఖండపు దేశాలకు ప్రతికూలంగా.. ఇంగ్లండ్లోని పరిస్థితులు ఉపఖండపు దేశాలకు ప్రతికూలంగా ఉంటాయి. ఇక్కడి పిచ్లన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు కాస్త అనుకూలంగా ఉంటాయి. ఇంగ్లండ్ పిచ్ల్లో ఎక్కువగా స్వింగ్ కనిపిస్తుంది. ఆసీస్ పిచ్లు ఎక్కువగా బౌన్సీ ట్రాక్లు ఉంటాయి. ఇక న్యూజిలాండ్లోనూ పరిస్థితులు అలానే ఉంటాయి. అందుకే ఇంగ్లండ్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్నప్పటికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ టీమిండియాకు ఇది కాస్త ప్రతికూలమని చెప్పొచ్చు. 2021లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా తడబడింది. స్వింగ్ పిచ్లపై బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన టీమిండియా బ్యాటర్లు వికెట్లుపారేసుకున్నారు. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపింది లేదు. ఈసారి కూడా పరిస్థితి అలానే కనిపిస్తోంది. ఓవల్ పిచ్ టీమిండియా కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువగా సహకరిస్తుందని తెలుస్తోంది. అలా అని పిచ్ను తప్పు బట్టడానికి లేదు. ఆసీస్ ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్లు ఎలాగైతే వికెట్లు తీశారో.. టీమిండియా ఇన్నింగ్స్లోనూ ఇప్పటివరకు పడిన ఆరు వికెట్లలో ఐదు పేసర్లే పడగొట్టారు. అయినా ఆసీస్ బ్యాటర్లు యదేచ్ఛగా బ్యాట్ ఝులిపించిన చోట టీమిండియా బ్యాటర్లు పరుగులు చేయలేక అల్లాడిపోతున్నారు. పరిస్థితి చూస్తుంటే టీమిండియా ఈసారి కూడా రన్నరప్గా నిలిచేలా కనిపిస్తోంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ను ఐసీసీ ఇంగ్లండ్లో నిర్వహిస్తున్నప్పటికి బీసీసీఐ పెద్దగా అడ్డుచెప్పడం లేదు. క్రికెట్ ప్రపంచాన్ని కనుసైగలతో శాసిస్తున్న బీసీసీఐ తలచుకుంటే డబ్ల్యూటీసీ వేదికను మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ టెస్టు ఛాంపియన్షిప్ విషయంలో బీసీసీఐ సీరియస్గా కనిపించడం లేదు. టెస్టు క్రికెట్లో పెద్దగా కాసుల వర్షం కురిసే అవకాశం లేకపోవడంతో బీసీసీఐ తన దృష్టంతా టి20లు, వన్డేలపైనే ఉంచింది. బీసీసీఐ ఆలోచనా ధోరణి మారాలని అభిమానులు భావిస్తున్నారు. ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్(FTP) పేరిట ఇప్పటికే రానున్న మూడేళ్లకు షెడ్యూల్ రూపొందించిన ఐసీసీ వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ను కూడా ఇంగ్లండ్లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇది మార్చడానికి అవకాశం లేకపోయినప్పటికి బీసీసీఐ చొరవ తీసుకొని ఐసీసీని ఒప్పించి 2027 టెస్టు ఛాంపియన్షిప్కు తటస్థ వేదికలో జరిగేలా చూడొచ్చు. అలా కాదని బీసీసీఐ పట్టించుకోకుండా ఉంటే మాత్రం టీమిండియా భవిష్యత్తులోనూ రన్నరప్గానే నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదవండి: WTC Final Day-3: రహానే ఫిఫ్టీ.. 200 మార్క్ దాటిన టీమిండియా -
మూడోరోజు ముగిసిన ఆట.. 296 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
మూడోరోజు ముగిసిన ఆట.. 296 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 44 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. లబుషేన్ 41, కామెరాన్ గ్రీన్ ఏడు పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్ 296 పరుగులు లీడ్లో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్లోపే ఆసీస్ను ఆలౌట్ చేయడానికి టీమిండియా ప్రయత్నించాలి. ఒకవేళ ఆసీస్ 350 కంటే ఎక్కువ ఆధిక్యం సాధిస్తే మాత్రం భారత్కు ఓటమి తప్పకపోవచ్చు. అందుకే నాలుగో రోజు ఆటలో టీమిండియాకు తొలి సెషన్ చాలా కీలకం. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రెవిస్ హెడ్(18)ఔట్.. రెండో వికెట్ ఖాతాలో వేసుకున్న జడ్డూ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో టీమిండియాకు చుక్కలు చూపించిన ట్రెవిస్ హెడ్కు రెండో ఇన్నింగ్స్లో జడ్డూ చెక్ పెట్టాడు. 18 పరుగులు చేసిన ట్రెవిస్ హెడ్ను జడ్డూ కాట్ అండ్ బౌల్డ్గా పెవిలియన్ చేర్చాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన ఇద్దరి(స్మిత్, హెడ్) వికెట్లను జడేజానే తీయడం విశేషం. ప్రస్తుతం ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఆసీస్ 285 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 104/3 తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్లో జడ్డూకు చిక్కాడు. 34 పరుగులు చేసిన స్మిత్ జడేజా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి శార్దూల్ ఠాకూర్కు క్యాచ్ ఇచ్చాడు. మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతున్న ఆసీస్ 277 పరుగుల ఆధిక్యంలో ఉంది. నిలకడగా ఆడుతున్న స్మిత్, లబుషేన్.. ఆసీస్ 83/2 తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిసిన స్మిత్తో పాటు లబుషేన్ నిలకడగా ఆడుతున్నారు. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 28 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. లబుషేన్ 34, స్మిత్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 256 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఎట్టకేలకు వికెట్ తీసిన ఉమేశ్ యాదవ్.. ఖవాజా(13) ఔట్ డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో వికెట్లెస్గా మిగిలపోయిన ఉమేశ్యాదవ్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం వికెట్ తీశాడు. 13 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజాను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. టీ విరామం.. ఆస్ట్రేలియా 23/1 టీ విరామ సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 13, లబుషేన్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వార్నర్ ఒక్క పరుగు చేసి సిరాజ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్.. తొలి వికెట్ డౌన్ టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్లో భాగంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో తొలి వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన డేవిడ్ వార్నర్ సిరాజ్ బౌలింగ్లో భరత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ వికెట్ నష్టానికి రెండు పరుగులు చేసింది. టీమిండియా 296 ఆలౌట్.. ఆసీస్కు 173 పరుగుల ఆధిక్యం ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అజింక్యా రహానే 89 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శార్దూల్ఠాకూర్ 51, జడేజా 48 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు, స్టార్క్, బోలాండ్, గ్రీన్ తలా రెండు వికెట్లు తీయగా.. లియోన్ ఒక వికెట్ పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ ఫిఫ్టీ.. టీమిండియా 292/8 డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. స్టార్ బ్యాటర్లంతా విఫలమైన చోట తాను మాత్రం అద్బుత ఇన్నింగ్స్ ఆడి 108 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ కెరీర్లో ఇది నాలుగో టెస్టు హాఫ్ సెంచరీ. ప్రస్తుతం టీమిండియా 68 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. రహానే(89) ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 261 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిది. లంచ్ విరామం అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కాసేపటికే 89 పరుగులు చేసిన రహానే కమిన్స్ బౌలింగ్లో గ్రీన్ స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఏడో వికెట్కు శార్దూల్-రహానేల 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. లంచ్ విరామం.. టీమిండియాను నిలబెట్టిన రహానే, శార్దూల్ లంచ్ విరామ సమయానికి టీమిండియా 60 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అజింక్యా రహానే 89 పరుగులు బ్యాటింగ్కు తోడుగా. శార్ధూల్ ఠాకూర్ 36 బ్యాటింగ్ క్రీజులో ఉన్నాడు. ఇద్దరి మధ్య ఏడో వికెట్కు 108 పరుగులు జోడించడంతో టీమిండియా కాస్త కోలుకుంది. అంతకముందు 151/5 క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో కేఎస్ భరత్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శార్దూల్.. రహానేతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ టీమిండియా ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీమిండియాను నిలబెడుతున్న రహానే, శార్దూల్ ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తన పోరాటం కొనసాగిస్తుంది. అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్లు టీమిండియా ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 59 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. రహానే 89, శార్దూల్ ఠాకూర్ 36 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులు వెనుకబడి ఉంది. అజింక్యా రహానే ఫిఫ్టీ.. 200 దాటిన టీమిండియా ఆసీస్తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో కష్టాల్లో ఉన్న టీమిండియాను అజింక్యా రహానే గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓపికగా బ్యాటింగ్ చేస్తున్న రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. శార్దూల్ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మూడోరోజు మొదలైన ఆట.. శ్రీకర్ భరత్ ఔట్ మూడోరోజు ఆట ప్రారంభమైన మొదటి ఓవర్లోనే టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. ఐదు పరుగులు చేసిన శ్రీకర్ భరత్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో 152 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ ఎదురీదుతోంది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (51 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... ప్రస్తుతం అజింక్య రహానే (71 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు), భరత్ (5 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. కంగారూ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి కట్టుదిట్టమైన బంతులతో భారత బ్యాటర్లను కట్టి పడేశారు. జడేజా, రహానే కీలక భాగస్వామ్యంతో ఆదుకోకపోయుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. సగం బ్యాటర్లు ఇప్పటికే పెవిలియన్ చేరగా, మరో 318 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ తొలి ఇన్నింగ్స్లో ఎంత వరకు పోరాడుతుందనే దానిపైనే టెస్టు ఫలితం ఆధారపడి ఉంది. -
టీమిండియాకు ఇదేమి కొత్తకాదు.. గెలిచే ఛాన్స్ ఉందా? కనీసం డ్రా అయినా
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత జట్టు విఫలమైంది. ముఖ్యంగా భారత టాపర్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ(15), విరాట్ కోహ్లి(14), పుజారా(14), గిల్(13) వంటి కీలక ఆటగాళ్లు నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు ఇదేమి కొత్తకాదు.. ఇక టెస్టు మ్యాచ్ల్లో టాపర్డర్ విఫలం కావడం భారత జట్టుకు ఇదేమి కొత్త కాదు. గత రెండేళ్లలో కొన్ని టెస్టుల్లో టాపర్డర్ విఫలమైనప్పటికీ.. లోయార్డర్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించి జట్టును అదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ త్రయం చాలా మ్యాచ్ల్లో లోయార్డర్లో అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు. అయితే ఈ త్రయంలో జడేజా ఇప్పటికే పెవిలియన్కు చేరగా.. పంత్, అయ్యర్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేరు. టీమిండియా విజేతగా నిలవాలంటే? భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా కంటే ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(29), కేఎస్ భరత్(5) ఉన్నారు. ఇప్పటికి ఇంకా టీమిండియా గెలుపు దారులు మూసుకుపోలేదు. కానీ భారత్ విజేతగా నిలవాలంటే అద్భుతాలు జరగాలి. అంతకంటే ముందు రోహిత్ సేన ఫాలో ఆన్ గండం తప్పంచుకోవాలి. భారత్ ఫాలో ఆన్కుండా ఉండాలంటే మరో 118 పరుగులు అవసరం. మూడో రోజు రహానే, కెఎస్ భరత్ ఎంత వరకు ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటురన్నదానిపై టీమిండియా భవిష్యత్తు ఆధానపడి ఉంది. రహానేకు విదేశీ పిచ్లపై మంచి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి.. అతడి సీనియారిటీని మరోసారి నిరూపించకోవాల్సిన సమయం అసన్నమైంది. మరోవైపు క్రీజులో ఉన్న శ్రీకర్ భరత్ కూడా పంత్లా చెలరేగి ఆడాలి. వీరిద్దరూ భారత స్కోర్ బోర్డును 300 పరుగులు వరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే.. అనంతరం శార్ధూల్ ఠాకూర్కు కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది కాబట్టి టీమిండియా మ్యాచ్లో నిలిచే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు భారత తమ తొలి ఇన్నింగ్స్లో 350 పరుగులకు ఆలౌటైతే.. ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 119 పరుగుల ఆధిక్యం లభిస్తోంది. ఈ క్రమంలో సెకెండ్ ఇన్నింగ్స్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఆసీస్ను తక్కువ పరుగులకే కట్టడిచేస్తే.. టార్గెట్ను టీమిండియా ఛేదించే ఛాన్స్ ఉంటుంది.కాగా ఈ మ్యాచ్లో విజయం కోసం కాకపోయినా కనీసం డ్రా కోసం టీమిండియా ప్రయత్నించాలి. మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఇరుజట్లను సంయుక్త విజేతలగా ప్రకటిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితులును చూస్తే ఆస్ట్రేలియానే ఫేవరేట్గా కన్పిస్తోంది. చదవండి: WTC Final: అదృష్టమంటే రహానేదే.. అవుటై కూడా బతికిపోయాడు! వీడియో వైరల్ -
టీమిండియాకు కొరకరాని కొయ్య.. ఔట్ చేయడం చాలా కష్టం
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు టీమిండియాతో మ్యాచ్ అంటే ఎంత ఇష్టమే మరోసారి రుచి చూపించాడు. ఇప్పటికే టీమిండియాతో టెస్టుల్లో మంచి ఇన్నింగ్స్లు ఆడిన స్మిత్ ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఔట్ చేయడం మహా కష్టం. టీమిండియాకు కొరకరాని కొయ్యగా తయారైన స్మిత్ తాజాగా మరో సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో టీమిండియాపై మంచి రికార్డు కలిగిన స్మిత్.. ఈసారి ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 229 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో సెంచరీ మార్క్ అందుకున్న స్మిత్కు టెస్టుల్లో ఇది 31వ సెంచరీ కాగా.. టీమిండియాపై తొమ్మిదవది. ఈ నేపథ్యంలో స్మిత్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రూట్తో కలిసి స్మిత్(9 సెంచరీలు) సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్, వివ్ రిచర్డ్స్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్లు ఎనిమిదేసి సెంచరీలతో ఉన్నారు. Steve Smith loves batting at The Oval 😍 Third century at the ground for the Aussie star ⭐ Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/jnZP7Z757F — ICC (@ICC) June 8, 2023 THE GOAT OF TEST CRICKET IN THIS GENERATION - Steve Smith. pic.twitter.com/bqjUhlhLBa — Johns. (@CricCrazyJohns) June 8, 2023 చదవండి: WTC Final: కామెరాన్ గ్రీన్(6) ఔట్.. ఐదో వికెట్ డౌన్ -
ముగిసిన రెండోరోజు ఆట.. టీమిండియా స్కోరు 151/5
ముగిసిన రెండోరోజు ఆట.. టీమిండియా స్కోరు 151/5 రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అజింక్యా రహానే 29, శ్రీకర్ భరత్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమిన్స్, బోలాండ్, లియోన్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 318 పరుగులు వెనుకబడి ఉంది. ► 31 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. జడేజా 31, రహానే 22 పరుగులతో ఆడుతున్నారు. కోహ్లి ఔట్.. నాలుగో వికెట్ డౌన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కోహ్లి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. పుజారా(14)ఔట్.. 50కే మూడు వికెట్లు డౌన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన చతేశ్వర్ పుజారా కామెరాన్ గ్రీన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు.. దీంతో టీమిండియా 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీ విరామం.. 37 పరుగులకే రెండు వికెట్లు డౌన్ టీ విరామ సమయానికి టీమిండియా 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. పుజారా 3, కోహ్లి 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(15), శుబ్మన్ గిల్(13) పరుగులు స్వల్ప వ్యవధి తేడాతో ఔటయ్యారు. రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరు వెనుదిరిగారు. పాట్ కమిన్స్ రోహిత్ను వెనక్కి పంపిస్తే.. స్కాట్ బోలాండ్ గిల్ 13 పరుగుల వద్ద పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. 4 ఓవర్లలో 23/0 ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ను టీమిండియా పాజిటివ్గా ఆరంభించింది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై రోహిత్, గిల్ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రోహిత్ 15, శుబ్మన్ గిల్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. నాలుగేసిన సిరాజ్.. ఆస్ట్రేలియా 469 ఆలౌట్ టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 182 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. ట్రెవిస్ హెడ్ 163 పరుగులు, స్మిత్ 121, అలెక్స్ కేరీ 48, డేవిడ్ వార్నర్ 43 పరుగులుతో రాణించారు. టీమిండియా బౌలర్లో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. షమీ, శార్దూల్లు రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా ఒక వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా ఆలౌట్కు మరొక్క వికెట్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో నాథన్ లయాన్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. ఎనిమిదో వికెట్ డౌన్.. అలెక్స్ కేరీ(48) రూపంలో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో కేరీ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది. 113 ఓవర్లలో ఆస్ట్రేలియా 443/7 డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో 113 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ 40, పాట్ కమిన్స్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. లంచ్ విరామం.. ఆస్ట్రేలియా 109 ఓవర్లలో 422/7 రెండోరోజు ఆటలో భాగంగా లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ 22, పాట్ కమిన్స్ రెండు పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్లో టీమిండియా బౌలర్లు నాలుగు వికెట్లు తీసి కాస్త ఆధిపత్యం ప్రదర్శించారు. అక్షర్ పటేల్ మెరుపు ఫీల్డింగ్.. మిచెల్ స్టార్క్ రనౌట్ టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ స్టన్నింగ్ రనౌట్తో మెరిశాడు. సిరాజ్ బౌలింగ్లో మిడాన్ దిశగా బంతిని పుష్ చేశాడు. సింగిల్ రిస్క్ అని తెలిసినప్పటికి క్రీజు దాటాడు. అయితే బంతిని అందుకున్న అక్షర్ పటేల్ బంతిని డైరెక్ట్ హిట్ చేశాడు. దీంతో స్టార్క్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 406 పరుగులు చేసింది. 400 పరుగుల మార్క్ దాటిన ఆసీస్ టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా 400 మార్క్ను దాటింది. 103 ఓవర్లలో 3.89 రన్రేట్తో 400 స్కోరును అందుకుంది. అలెక్స్ కేరీ 13, మిచెల్ స్టార్క్ 5 పరుగులతో ఆడుతున్నారు. శార్దూల్ బౌలింగ్లో స్మిత్ క్లీన్బౌల్డ్ టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 121 పరుగులు చేసిన స్మిత్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్(6) ఔట్.. ఐదో వికెట్ డౌన్ రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. తాజాగా ఆరు పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్ షమీ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన సిరాజ్.. నాలుగో వికెట్ డౌన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాకు సిరాజ్ బ్రేక్ అందించాడు. 285 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారిన స్మిత్, ట్రెవిస్ హెడ్ జంటను సిరాజ్ విడదీశాడు. రెండోరోజు ఆట మొదలైన కాసేపటికి సిరాజ్ బౌలింగ్లో హెడ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో 163 పరుగుల హెడ్ ఇన్నింగ్స్కు తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. రెండోరోజు మొదలైన ఆట.. స్టీవ్ స్మిత్ సెంచరీ డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో రోజు ఆట మొదలైంది. మూడు వికెట్ల నష్టానికి 327 పరుగుల క్రితం రోజు స్కోరుతో ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభించింది. స్టీవ్ స్మిత్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా స్మిత్ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. తొలిరోజు టీమిండియా బౌలర్లు తేలిపోవడంతో ఆస్ట్రేలియా పూర్తి ఆదిపత్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 146 పరుగులు బ్యాటింగ్ అజేయ సెంచరీ చేయగా.. స్టీవ్ స్మిత్ 95 పరుగులు బ్యాటింగ్ ఆడుతున్నారు. ఈ ఇద్దరు ఇప్పటికే నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు. వీలైనంత తొందరగా ఈ జోడిని విడదీయకపోతే టీమిండియాకు కష్టాలు తప్పేలా లేవు. -
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ (ఫొటోలు)
-
భారత్ జట్టును చూసి వారికీ భయం మొదలయింది అంటున్న కోహ్లీ
-
తొలిరోజు ఆసీస్దే.. పూర్తిగా తేలిపోయిన టీమిండియా బౌలర్లు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా తొలి రోజే 300 మార్క్ దాటి భారీ స్కోరుపై కన్నేసింది. ట్రెవిస్ హెడ్(146 పరుగులు బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(95 పరుగులు బ్యాటింగ్) టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. ఈ ఇద్దరు ఇప్పటికే నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు. తొలి సెషన్లో రెండు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు.. మలి రెండు సెషన్లు కలిపి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక రోజంతా కలిపి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసిన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఆస్ట్రేలియాకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన మంచి ఆరంభాన్ని ట్రెవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కొనసాగించారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా ట్రెవిస్ హెడ్ వన్డే తరహా బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. రోజు ముగిసే సరికి 150 పరుగులు చేసిన ట్రెవిస్ హెడ్ ఇదే దూకుడు కొనసాగిస్తే రెండోరోజు ఆటలో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు తన మార్క్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న స్మిత్ 95 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కే పనిలో ఉన్నాడు. రెండో రోజు ఆటలో స్మిత్ సెంచరీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: WTC Final: ట్రెవిస్ హెడ్ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా -
WTC Final: ట్రెవిస్ హెడ్ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా
ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. బుధవారం టీమిండియాతో ఆరంభమైన డబ్ల్యూటీసీ ఫైనల్లో హెడ్ (106 బంతుల్లో 100 బ్యాటింగ్) వన్డే తరహాలో ఆడి సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ ఫైనల్లో డెవాన్ కాన్వే చేసిన 54 పరుగులే అత్యధిక స్కోరుగా ఉంది. ఇప్పుడు హెడ్ ఆ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా ఏకంగా సెంచరీతో మెరిశాడు. ఇక ట్రెవిస్ హెడ్కు తన టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ కాగా.. టీమిండియాపై, విదేశాల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. History - Travis Head becomes first player to have scored Hundred in WTC Final. pic.twitter.com/PKsEQeFSsw — CricketMAN2 (@ImTanujSingh) June 7, 2023 -
టీమిండియా బౌలింగ్ క్యాంప్లో జేమ్స్ అండర్సన్!
హైదరాబాదీ కామెంటేటర్ హర్షాబోగ్లే క్రికెటర్లతో సమానంగా పాపులారిటీ సంపాదించిన వారిలో ముందు వరుసలో ఉంటాడు. తన వ్యాఖ్యానంతో ఆకట్టుకునే బోగ్లేకు బయట చాలా మంది అభిమానులున్నారు. తాజాగా ఓవల్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. కాగా 61 ఏళ్ల హర్షా బోగ్లే జేమ్స్ అండర్సన్ విషయంలో కన్ఫూజన్కు గురయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా బౌలింగ్ క్యాంప్లో జేమ్స్ అండర్సన్ ప్రత్యక్షమయ్యాడంటూ పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్లకు బౌలింగ్లో టిప్స్ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ రియాలిటీలో అతను జేమ్స్ అండర్సన్ కాదు.. సోహమ్ దేశాయ్. ప్రస్తుతం టీమిండియాకు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సైడ్ యాంగిల్లో సోహమ్ దేశాయ్ అచ్చం జేమ్స్ అండర్సన్ను తలపించాడు. అందుకే బోగ్లే అదేంటి అండర్సన్.. టీమిండియా క్యాంప్లో ఏం చేస్తున్నాడని కన్ఫూజన్కు గురయ్యాడు. అయితే కాసేపటి తర్వాత అసలు విషయం తెలియడంతో నాలుక చరుచుకున్న హర్షా బోగ్లే నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. HAHAHAHAHA! Poor Harsha Bhogle really believed Soham Desai to be Jimmy Anderson pola. Tells on air that Anderson came to help out the Indian team before the final 😂 pic.twitter.com/LuMvln3hTF — Mama | 360° Entertainment (@SriniMaama16) June 7, 2023 చదవండి: 'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?' -
అందుకే అశ్విన్ను పక్కనబెట్టాం: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తుది జట్టులో స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే పిచ్ కండీషన్స్, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే అశ్విన్ను బెంచ్కు పరిమితం చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో వివరించాడు. ఇక అశ్విన్ స్థానంలో జడేజా ఏకైక స్నిన్నర్గా ఉండగా.. షమీ, సిరాజ్, ఉమేశ్, శార్దూల్ ఠాకూర్ రూపంలో నలుగురు పేసర్లు బరిలోకి దిగారు. అశ్విన్ ను పక్కన పెట్టడాన్ని టాస్ సందర్భంగా నాసిర్ హుస్సేన్ ప్రస్తావించాడు. దీనికి రోహిత్ సమాధానమిస్తూ.. "ఇది ఎప్పుడైనా కఠిన నిర్ణయమే. అతడు చాలా ఏళ్లుగా మా మ్యాచ్ విన్నర్ గా ఉన్నాడు. అందుకే అతన్ని పక్కన పెట్టడం అన్నది కఠినమైన నిర్ణయమే. కానీ జట్టు అవసరాలకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అందుకే చివరికి ఆ కఠిన నిర్ణయం తీసుకున్నాం. నిజానికి టెస్టుల్లో ప్రస్తుతం అశ్విన్ 869 పాయింట్లతో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. ఇక ఓవల్లో ఉన్న కండిషన్స్ మేఘావృతమై ఉంది. పిచ్ పెద్దగా మారేలా కనిపించడం లేదు. నలుగురు పేసర్ల, ఒక స్పిన్నర్ ను తీసుకున్నాం. జడేజా స్పిన్నర్ గా ఉంటాడు" అని రోహిత్ చెప్పాడు. చదవండి: సిరాజ్ దెబ్బకు అల్లాడిపోయిన లబుషేన్ -
సిరాజ్ దెబ్బకు అల్లాడిపోయిన లబుషేన్
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అల్లాడిపోయాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అంతకముందు ఓవర్లోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్గా పెవిలియన్ చేర్చిన సిరాజ్ మంచి జోరు మీద ఉన్నాడు. ఖవాజా ఔట్ కాగానే క్రీజులోకి వచ్చిన లబుషేన్ కుదురుకునే ప్రయత్నం చేశాడు. కాగా 8వ ఓవర్ తొలి బంతిని సిరాజ్ 143 కిమీ వేగంతో విసిరాడు. బంతి నేరుగా వచ్చి లబుషేన్ ఎడమ బొటనవేలిని తాకుతూ వెళ్లింది. దీంతో బ్యాట్ను కిందపడేసిన లబుషేన్ నొప్పితో అల్లాడిపోయాడు. ఫిజియో వచ్చి పరిశీలించిన అనంతరం లబుషేన్ మళ్లీ బ్యాటింగ్కు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/Rc6A4QjtPg — Raju88 (@Raju88784482906) June 7, 2023 చదవండి: WTC Final: నల్ల రిబ్బన్లతో టీమిండియా, ఆసీస్ ఆటగాళ్లు? -
WTC Final: నల్ల రిబ్బన్లతో టీమిండియా, ఆసీస్ ఆటగాళ్లు?
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ బుధవారం ఓవల్ వేదికగా మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయాలపాన సందర్భంగా టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో కనిపించారు. ఇటీవలే ఒడిశాలోని బాలేశ్వర్లో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 275 మంది మృతి చెందినట్లు ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. కాగా వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళి అర్పిస్తూ టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్ల నల్ల రిబ్బన్లు ధరించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందని.. బీసీసీఐ కూడా ఒడిశా ప్రమాద బాధితులకు సహాయం చేసే పనిలో ఉందని పేర్కొన్నాడు. టీమిండియా, ఆసీస్ ఆటగాళ్ల చర్యను అభిమానులు స్వాగతించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలబడతామని టీమిండియా పేర్కొనడం సంతోషాన్ని ఇచ్చిందంటూ కామెంట్ చేశారు. The Indian Cricket Team will observe a moment of silence in memory of the victims of the Odisha train tragedy ahead of the start of play on Day 1 of the ICC World Test Championship final at The Oval. The team mourns the deaths and offers its deepest condolences to the families… pic.twitter.com/mS04eWz2Ym — BCCI (@BCCI) June 7, 2023 చదవండి: WTC Final Day-1: ఖవాజా డకౌట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ -
ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియాపై ఆసీస్ ఆధిపత్యం
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్(146 పరుగులు బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కగా.. స్టీవ్ స్మిత్ 95 పరుగులు బ్యాటింగ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. రోజంతా కష్టపడి బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. మొత్తం మీద తొలిరోజు ఆస్ట్రేలియా టీమిండియాపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. సెంచరీ దిశగా స్మిత్.. 300 దాటిన ఆసీస్ స్కోరు టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి రోజే స్పష్టమైన ఆధిక్యం చూపిస్తోంది. 82 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 129, స్టీవ్ స్మిత్ 91 పరుగులతో ఆడుతున్నారు. ట్రెవిస్ హెడ్ సెంచరీ.. పట్టు బిగిస్తోన్న ఆసీస్ టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిస్ హెడ్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన హెడ్ 106 బంతుల్లో శతకం మార్క్ అందుకోవడం విశేషం. అతని ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా ట్రెవిస్ హెడ్ చరిత్రకెక్కాడు. ఆట తొలిరోజే ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. ప్రస్తుతం ఆసీస్ 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. స్మిత్ 53 పరుగులతో హెడ్కు సహకరిస్తున్నాడు. సెంచరీ దిశగా ట్రెవిస్ హెడ్.. ఆసీస్ 60 ఓవర్లలో 221/3 ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రెవిస్ హెడ్ సెంచరీకి దగ్గరయ్యాడు. అతనికి తోడుగా స్మిత్ కూడా నిలకడగా ఆడుతుండడంతో ఆస్ట్రేలియా తొలిరోజే పట్టు బిగిస్తోంది. 60 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. హెడ్ 93, స్మిత్ 49 పరుగులతో ఆడుతున్నారు. టీ విరామం.. ట్రెవిస్ హెడ్ అర్థసెంచరీ.. ఆసీస్ 170/3 ట్రెవిస్ హెడ్ అర్థసెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నిలకడగా సాగుతుంది. టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 51 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 60, స్టీవ్ స్మిత్ 33 పరుగులతో ఆడుతున్నారు. 38 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 141/3 టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 38 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 37, స్మిత్ 28 పరుగులతో ఆడుతున్నారు. 32 ఓవర్లలో ఆసీస్ స్కోరు 116/3 32 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 29, స్టీవ్ స్మిత్ 13 పరుగులతో ఆడుతున్నారు. షమీ బౌలింగ్లో లబుషేన్ క్లీన్బౌల్డ్.. మూడో వికెట్ డౌన్ లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్ తొలి బంతికే లబుషేన్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులుగా ఉంది. లంచ్ విరామం.. ఆసీస్ 23 ఓవర్లలో 73/2 లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. లబుషేన్ 26, స్మిత్ రెండు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వార్నర్ 43 పరుగులు చేసి ఔటవ్వగా.. ఉస్మాన్ ఖవాజా డకౌట్గా వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్, శార్దూల్లు చెరొక వికెట్ పడగొట్టారు. డేవిడ్ వార్నర్(43) ఔట్.. రెండో వికెట్ డౌన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన వార్నర్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో శ్రీకర్ భరత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆసీస్ 22 ఓవరల్లో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. లబుషేన్ 26 పరుగులతో ఆడుతున్నాడు. 15 ఓవర్లలో ఆసీస్ స్కోరు 54/1 15 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. వార్నర్ 37, లబుషేన్ 16 పరుగులతో ఆడుతున్నారు. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వార్నర్ నాలుగు ఫోర్లు బాదడంతో ఆసీస్ స్కోరు 50 దాటింది. 10 ఓవర్లలో ఆసీస్ స్కోరు 22/1 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. వార్నర్ 13, లబుషేన్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఉస్మాన్ ఖవాజా సిరాజ్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఖవాజా డకౌట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ టీమిండియాతో ఆడుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సిరాజ్ బౌలింగ్లో కేఎస్ భరత్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఓవల్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్లో రన్నరప్గా నిలిచిన టీమిండియా ఈసారైనా విజేతగా నిలుస్తుందా.. లేదంటే తొలిసారి ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా టైటిల్ దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. తుది జట్లు.. ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్ టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ -
ఇండియా గెలవాలంటే ఆ ఇద్దరు ఆడాల్సిందే
-
సొంత కార్లో వచ్చిన పుజారా అవాక్కయిన జడేజా
-
WTC ఫైనల్ కు కౌంట్ డౌన్ షురూ
-
WTC Final: అంతా సిద్ధం.. ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్ల ఫోటోషూట్
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు అంతా సిద్ధమయింది. బుధవారం ఓవల్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా ఫైనల్ ఆడనున్నాయి. కాగా ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు ఫోటో సెషన్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కెప్టెన్స్ ఫోటో ఈవెంట్లో పాల్గొన్న రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్లు పలు అభిప్రాయాలు వెల్లడించారు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ మేస్(గద)తో ఆ ఇద్దరూ ఫోటో దిగారు. ఫైనల్ వరకు చేరేందుకు ఎంతో శ్రమించామని, ఇక మేస్ను అందుకోవడమే తమ లక్ష్యమని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ అన్నాడు. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని, ఎన్నో విజయాలను దక్కించుకోవాల్సి వచ్చిందని ఇంట్లోనే కాదు.. విదేశీ టూర్లనూ సక్సెస్ సాధించామని కమ్మిన్స్ తెలిపాడు. గత కొన్నాళ్ల నుంచి తమ బృందం బాగా ప్రదర్శిస్తోందన్నాడు. The Captains 👍The Championship Mace 👌The Big Battle 💪All In Readiness for the #WTC23#TeamIndia pic.twitter.com/Ep10vb2aj5— BCCI (@BCCI) June 6, 2023 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. గత కొన్నాళ్ల నుంచి తమ జట్టు నిలకడగా క్రికెట్ ఆడుతున్నట్లు చెప్పాడు. టోర్నమెంట్ చాలా టఫ్గా సాగిందని, గత రెండేళ్ల నుంచి నిలకడగా ఆడడం వల్లే ఈ దశకు చేరుకున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మూడు శాఖల్లోనూ బలంగా ఉన్నట్లు రోహిత్ చెప్పాడు. ఫైనల్ కోసం రోహిత్ సేన కఠోరంగా శ్రమిస్తోంది. ఇరు జట్లకు ఓవల్ తటస్థ వేదికే. రెండు జట్లకూ సొంత అభిమానుల సపోర్ట్ లేదు. అయినా ఎక్కడ ఆడినా తమకు కొంత సపోర్టు ఉంటుందని రోహిత్ అన్నాడు. న్యూట్రల్ వేదికలపై ఆడడం తమకు అలవాటే అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ గెలవలేదని.. ట్రోఫీ సొంతం చేసుకుంటామన్న నమ్మకం ఉందని కెప్టెన్ కమిన్స్ తెలిపాడు. చదవండి: WTC Final: రోహిత్ శర్మకు గాయం..? టీమిండియా అభిమానుల ఆందోళన -
WTC ఫైనల్ కోహీ VS గిల్
-
ఇండియాకి ఒక్క సెషన్ చాలు రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
-
డబ్ల్యూటీసీ ఫైనల్.. ప్రాక్టీస్లో టీమిండియా బీజీబీజీ (ఫోటోలు)
-
'ఎరుపు బంతి'.. ప్రాభవం కోల్పోతున్న దశ నుంచి శిఖరస్థాయికి
క్రికెట్ అంటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు టి20 క్రికెట్. అయితే ఇదే టి20 క్రికెట్, వన్డే క్రికెట్కు మూలం సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్ అని మరిచిపోవద్దు. మనకు తెలిసి క్రికెట్ ప్రారంభమైంది దాదాపు మూడు వందల ఏళ్ల కిందటి పైమాటే. తొలుత బ్రిటీష్ వాళ్లు క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. 17,18వ దశకంలో ఇంగ్లండ్లో క్రికెట్కు విపరీతమైన క్రేజ్ ఉండేది. కాలక్రమంలో ఇంగ్లండ్ దేశం క్రికెట్కు పుట్టినిల్లుగా తయారైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. 18వ దశకం చివరి నుంచి 19వ దశకం ఆరంభం వరకు ఎక్కువ మ్యాచ్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్యే జరిగేవి. అయితే మన దేశం బ్రిటీష్ వారి చేతుల్లో ఉండడంతో ఇక్కడ కూడా క్రికెట్పై ఆసక్తి బాగా ఉండేది. మన దేశం తరపున బ్రిటీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారు ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రికెట్పై ప్రజల్లో ఆసక్తి పెరగడం మొదలైంది. ఇక క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి టెస్టు క్రికెట్ ఫార్మాట్లోనే చాలాకాలం పాటు ఆట జరిగింది. 1975లో తొలి ప్రపంచకప్ జరిగే వరకు కూడా టెస్టు క్రికెట్ మాత్రమే ఎక్కువగా జరిగేది. మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికి 1980 తర్వాత హాకీ ప్రభావం కోల్పోవడం ప్రారంభమైంది. అదే సమయంలో క్రికెట్ మాత్రం వైభవం పెరుగుతూ వచ్చింది. 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కపిల్ డెవిల్స్ ప్రపంచకప్ విజేతగా నిలవడంతో క్రికెట్పై క్రేజ్ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. అక్కడి నుంచి టీమిండియా వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయ క్రీడ హాకీ నుంచి క్రికెట్ అనేలా మన ప్రాభవం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.1990వ దశకంలో క్రికెట్లో పెను మార్పులు వచ్చాయి. వన్డే మ్యాచ్లకు కలర్ జెర్సీలు వాడడం.. ఎర్రబంతుల స్థానంలో తెల్లబంతులు ఉపయోగించడం మొదలైంది. క్రమంగా వన్డే క్రికెట్కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. వన్డే క్రికెట్కు ఆదరణ వచ్చినా టెస్టులకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే టి20 క్రికెట్ వచ్చాకా మాత్రం టెస్టులపై ఆసక్తి సన్నగిల్లింది. వన్డేలు ఒక్కరోజులో ముగిసిపోతే.. టి20లు మాత్రం మూడున్నర గంటల్లోనే ముగిసి అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటి ఆటగాళ్లలో ఐదు రోజులు జరిగే టెస్టు క్రికెట్ కన్నా మూడు గంటల్లో ముగిసిపోయే టి 20 క్రికెట్ అంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడిందేమో అన్న సంకేతాలు వినిపించాయి. కానీ మనం ఒకటి అనుకుంటే ఐసీసీ మరోలా ఆలోచించింది. ప్రాభవం కోల్పోతున్న టెస్టు క్రికెట్కు డబ్ల్యూటీసీ ఫైనల్ పేరుతో కొత్త హంగులు తీసుకొచ్చింది. టెస్టు క్రికెట్ ఐదు రోజుల పాటు జరిగినప్పటికి అందులో ఉండే మజా వేరుగా ఉంటుంది. బ్యాటర్ల నుంచి కళాత్మక షాట్లు.. బౌలర్లు తీసే వికెట్లలో నైపుణ్యం కనిపిస్తుంటుంది. టి20ల్లో ఎంత వేగంగా ఆడినా.. బ్యాటింగ్లో నైపుణ్యం బయటపడేది టెస్టు క్రికెట్ ద్వారానే. ఇక స్పిన్నర్లు, పేసర్లు పోటీ పడి వికెట్లు తీస్తుంటే చూడముచ్చటగా ఉండేది. అయితే ఇప్పుడు టెస్టు మ్యాచ్లు కూడా దాదాపు మూడురోజుల్లోనే ముగిసిపోతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ మంచి టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరగడమే దీనికి కారణం. టీమిండియా ఓటమిపాలైనప్పటికి డబ్ల్యూటీసీకి మాత్రం మంచి ఆదరణ లభించింది. దీన్నిబట్టి చూస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ పేరుతో టెస్టు క్రికెట్ను నిలబెట్టేందుకు ఐసీసీ చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది. చదవండి: WTC Final: టెస్టుల్లో టీమిండియా తరపున సిక్సర్ల రారాజు ఎవరంటే? -
టీమ్ ఇండియా రబ్బరు బంతులతో ప్రాక్టీస్... ఎందుకంటే?
-
ఆ ఒక్కడిని అవుట్ చెయ్యకపోతే ఇండియా పని అంతే
-
WTC ఫైనల్ లో ఆస్ట్రేలియాకి కోలుకోలేని దెబ్బ స్టార్ పేసర్ అవుట్
-
WTC Final: టెస్టుల్లో టీమిండియా తరపున సిక్సర్ల రారాజు ఎవరంటే?
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా రన్నరప్గా నిలిచింది. మరి ఈ ఏడాదైనా టీమిండియా డబ్ల్యూటీసీ విజేతగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇక టెస్టు క్రికెట్లో సాధారణంగా సిక్సర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎక్కువగా బౌండరీలతోనే బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టడం చూస్తుంటాం. ఇన్నింగ్స్ మధ్యలోనూ సిక్సర్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా తరపున అత్యధిక సిక్సర్లు కొట్టింది ఎవరనేది పరిశీలిద్దాం. టెస్టు క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. మొత్తం 180 టెస్టుల్లో 91 సిక్సర్లు కొట్టి సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. రెండో స్థానంలో ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని 144 టెస్టు ఇన్నింగ్స్ల్లో మొత్తం 78 సిక్సర్లు బాదాడు. 329 టెస్టు ఇన్నింగ్స్ల్లో 69 సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 83 ఇన్నింగ్స్ల్లో 69 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 4వ స్థానంలో ఉన్నాడు. 184 టెస్టు ఇన్నింగ్స్ల్లో 61 సిక్సర్లు బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరొక్క సిక్సర్ బాదితే సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే అవకాశం ఉంటుంది. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీరాజ్, మహ్మద్ షమీరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రెవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషిన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెజర్ , స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్) , మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్. చదవండి: WTC Final: రోహిత్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు! -
WTC Final: కొత్త జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
ఆస్ట్రేలియా టీమ్ కి నిద్రలేని రాత్రులు ఎందుకంటే..!
-
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
WTC ఫైనల్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుకంటే..!
-
కోహ్లీని లైట్ తీసుకుంటే ఆసీస్ అవుట్..!
-
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
పుజారా మీదే ఆశలు..!
-
శుభమన్ గిల్, రవీంద్ర జడేజా వద్దు ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
-
WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్లో ఎవరెన్ని గెలిచారు..?
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో చాలా ఆసక్తికర గణాంకాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అలాంటి సమాచారమే మరొకటి, నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఐసీసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్ని ఫైనల్ మ్యాచ్లు (వన్డే వరల్డ్కప్ (12), టీ20 వరల్డ్కప్ (8), డబ్ల్యూటీసీ (1), ఛాంపియన్స్ ట్రోఫీ (8)) జరిగాయి.. అందులో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఎన్ని ఫైనల్స్ ఆడాయి (వేర్వేరుగా, కలిసి).. వాటిలో భారత్ ఎన్ని గెలిచింది, ఆస్ట్రేలియా ఎన్ని గెలిచింది అన్న సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 ఫైనల్ మ్యాచ్లు జరగ్గా, అందులో భారత్ 10 ఫైనల్స్లో పాల్గొనగా.. ఆస్ట్రేలియా 11 ఫైనల్ మ్యాచ్లు ఆడింది. భారత ఆడిన 10 ఫైనల్స్లో ఐదింట గెలుపొందగా.. ఆసీస్ ఆడిన 11 ఫైనల్స్లో ఎనిమిదింట విజయం సాధించింది. భారత్ ఆడిన ఐసీసీ ఫైనల్స్.. 1983 వన్డే వరల్డ్కప్: విండీస్పై భారత్ గెలుపు 2000 ఛాంపియన్స్ ట్రోఫీ: న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి 2002 ఛాంపియన్స్ ట్రోఫీ: శ్రీలంకతో పాటు సంయుక్త విజేత 2003 వన్డే వరల్డ్కప్: ఆస్ట్రేలియా చేతిలో ఓటమి 2007 టీ20 వరల్డ్కప్: పాకిస్తాన్పై గెలుపు 2011 వన్డే వరల్డ్కప్: శ్రీలంకపై గెలుపు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్పై గెలుపు 2014 టీ20 వరల్డ్కప్: శ్రీలంక చేతిలో ఓటమి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్తాన్ చేతిలో ఓటమి 2021 డబ్ల్యూటీసీ: న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఆస్ట్రేలియా ఆడిన ఐసీసీ ఫైనల్స్.. 1975 వన్డే వరల్డ్కప్: విండీస్ చేతిలో ఓటమి 1987 వన్డే వరల్డ్కప్: ఇంగ్లండ్పై గెలుపు 1996 వన్డే వరల్డ్కప్: శ్రీలంక చేతిలో ఓటమి 1999 వన్డే వరల్డ్కప్: పాకిస్తాన్పై గెలుపు 2003 వన్డే వరల్డ్కప్: భారత్పై గెలుపు 2006 ఛాంపియన్స్ ట్రోఫీ: వెస్టిండీస్పై గెలుపు 2007 వన్డే వరల్డ్కప్: శ్రీలంకపై గెలుపు 2009 ఛాంపియన్స్ ట్రోఫీ: న్యూజిలాండ్పై గెలుపు 2010 టీ20 వరల్డ్కప్: ఇంగ్లండ్ చేతిలో ఓటమి 2015 వన్డే వరల్డ్కప్: న్యూజిలాండ్పై గెలుపు 2021 టీ20 వరల్డ్కప్: న్యూజిలాండ్పై గెలుపు -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టార్ బౌలర్ ఔట్
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ఫైనల్ మ్యాచ్కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా హాజిల్వుడ్ గాయం తిరగబెట్టిందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. అతని స్థానంలో 33 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ మైఖేల్ నెసర్ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం నెసర్ ఇంగ్లండ్లోనే ఉన్నాడని, కౌంటీ ఛాంపియన్షిప్లో అతను గ్లామోర్గన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని తెలిపింది. కౌంటీ ఛాంపియన్షిప్లో నెసర్ సూపర్ ఫామ్లో ఉన్నాడని, ఈ టోర్నీలో అతను 25.63 సగటున 19 వికెట్లు పడగొట్టాడని, దీన్ని పరిగణలోకి తీసుకునే అతన్ని ఎంపిక చేశామని సీఏ ప్రకటించింది. కాగా, హాజిల్వుడ్ ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 సందర్భంగా కూడా ఇలాగే గాయపడి లీగ్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇదివరకే ఐసీసీ టీ20, వన్డే టోర్నమెంట్లు (వరల్డ్కప్లు) గెలిచిన భారత్, ఆసీస్ జట్లు.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 గెలిచి, మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్టుగా రికార్డుల్లోకెక్కాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అస్ట్రేలియా: మార్కస్ హ్యారిస్, ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, మైఖేల్ నెసర్, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లయోన్ టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ -
WTC Final: టీమిండియా బహుపరాక్.. ఓవల్లో స్టీవ్ స్మిత్ను ఆపడం చాలా కష్టం..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ముందు టీమిండియాను ఓ విషయం బయపెడుతుంది. అదేంటంటే.. ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు మ్యాచ్ వేదిక అయిన ఓవల్లో అద్భుతమైన రికార్డు ఉండటం. ఈ ఆసీస్ స్టార్ ఓవల్ మైదానంలో ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో 97.75 సగటున 391 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు (138*, 143), ఓ హాఫ్ సెంచరీ (80) ఉన్నాయి. ఓవల్లో స్మిత్కు ఉన్న ఈ రికార్డే ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతుంది. స్మిత్కు కళ్లెం వేసే వ్యూహరచనలో భారత బౌలర్లు నిమగ్నమయ్యారు. అతన్ని ఎలాగైనా తొందరగా ఔట్ చేయాలని వారు భావిస్తున్నారు. స్మిత్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్మిత్ను తొందరగా పెవిలియన్కు పంపితే మంచిదని, అతను క్రీజ్లో కుదురుకుంటే చాలా ప్రమాదమని వారు వార్నింగ్ ఇస్తున్నారు. స్మిత్కు ఇంగ్లండ్లో వాతావరణ పరిస్థితులపై కూడా పూర్తి అవగాహణ ఉందని, అక్కడి పిచ్లపై అతను ఏకంగా 6 శతాకలు బాదాడని గుర్తు చేస్తున్నారు. మరోవైపు స్మిత్కు టీమిండియాపై కూడా ఘనమైన రికార్డు ఉన్న విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. స్మిత్ భారత్పై 35 ఇన్నింగ్స్లు ఆడి 65.07 సగటున 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాయంతో 1887 పరుగులు చేశాడన్న విషయాన్ని మరవకూడదని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా స్మిత్తో జాగ్రత్తగా ఉండాలని, లేదంటి అతను మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడని వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. -
WTC Final: టీమిండియాతో జాగ్రత్త.. ఒక్క సెషన్ చాలు..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ అని విశ్లేషకులంతా ముక్తకంఠంతో వాదిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్తో సరిసమానమైన విజయావకాశాలు టీమిండియాకు కూడా ఉన్నాయని ఆయన బలంగా వాదిస్తున్నాడు. అందరూ అనుకుంటున్నట్లుగా ఆసీస్ విజయం సాధించేందుకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతున్నది ఆస్ట్రేలియాలో కాదని, ఈ మ్యాచ్ జరుగుతున్నది ఇంగ్లండ్లో అన్న విషయాన్ని విశ్లేషకులు గమనించాలని గుర్తు చేశాడు. ఓవల్ లాంటి మైదానంలో టీమిండియాతో పోలిస్తే ఆసీసే ఎక్కువ జాగ్రత్త వహించాలని, అంచనాలు తప్పేందుకు ఒక్క సెషన్ ఆట చాలని హెచ్చరించాడు. టీమిండియాతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. గత పదేళ్ల కాలంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడంపై శాస్త్రి స్పందిస్తూ.. ఈ మధ్య కాలంలో టీమిండియా అద్భుతమైన క్రికెట్ ఆడిన్నప్పటికీ, చాలా సందర్భాల్లో లక్ కలిసి రాలేదని, ఐసీసీ ట్రోఫీ సాధించాలంటే మంచి క్రికెట్తో పాటు కాస్త లక్ కూడా ఉండాలని అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో ప్రస్తుత టీమిండియా చాలా పటిష్టమైందని, ఈ జట్టుకు ఐసీసీ ట్రోఫీ గెలిచే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. కాగా, రవిశాస్త్రి హెడ్ కోచ్గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ను న్యూజిలాండ్కు కోల్పోయింది. సౌథాంప్టన్ వేదికగా జరిగిన నాటి ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: 93 ఏళ్ల కిందటి బ్రాడ్మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ -
WTC Final: తెలుపులో నీలం రంగు.. మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే జెర్సీని ఇటీవలే (జూన్ 1) భారత జట్టు అఫీషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ ఆవిష్కరించింది. తాజాగా టెస్ట్ జెర్సీలో టీమిండియా ఆటగాళ్ల ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కొత్త టెస్ట్ కిట్ ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. King Kohli and captain Rohit Sharma in India's new Test and ODI jerseys. pic.twitter.com/G5QyQtykiZ — Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2023 తెలుపు, నీలం రంగుతో కూడిన ఈ జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు మెరిసిపోతున్నారు. భుజాలు, కాలర్పై నీలం రంగు బార్డర్ కలిగి, నీలం రంగులో ఇండియా అని రాసి ఉండి, ఎడమవైపు ఛాతిపై బీసీసీఐ ఎంబ్లమ్, కుడివైపు అడిడాస్ సింబల్తో కూడిన ఈ జెర్సీ చాలా కొత్తగా, అద్భుతంగా ఉందంటూ అభిమానులు కొనియాడుతున్నారు. Virat Kohli and Rohit Sharma in the new Indian Test jersey!😍 Rate this jersey out of 10 pic.twitter.com/MkeSXBtp2H — CricTracker (@Cricketracker) June 3, 2023 గతంలో టెస్ట్లకు పూర్తి తెలుపు రంగు కిట్ వాడేవారని, అది చూడటానికి అంత బాగుండేది కాదని, ప్రస్తుతమున్న కిట్ చాలా బాగుందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు వన్డే, టీ20 జెర్సీలు సైతం పర్వాలేదని మెచ్చుకుంటున్నారు. రోహిత్, కోహ్లి, హార్ధిక్, బుమ్రా, వుమెన్స్ క్రికెట్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధన కొత్త వన్డే, టీ20 జెర్సీలు ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. Rohit Sharma, Virat Kohli, and Hardik Pandya in new Indian jerseys 👕🇮🇳 Which kit did you like the most? 😍 📸: Adidas India#CricTracker #IndianCricket pic.twitter.com/OKOSxUuvXX — CricTracker (@Cricketracker) June 3, 2023 కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్ బ్లూ కలర్లో కాలర్తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్ కలర్ జెర్సీని టెస్ట్లకు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్నారు. కాగా, భారత జట్టు అఫీషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే (అడిడాస్) జెర్సీని కూడా తయారు చేయడం ఇదే మొదటిసారి. King Kohli is ready to roar in India's new jersey. pic.twitter.com/QtEDpWpHaH — Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2023 ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ జట్లు ప్రత్యేక జెర్సీలు ధరించనున్నారు. ఇరు జట్లు ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అభిమానలు అంచనా వేస్తున్నారు. pic.twitter.com/226XFwjTxC — CricTracker (@Cricketracker) June 3, 2023 Pat Cummins and Co. are ready for the WTC Final🤩 📸 : ICC #Australia #INDvsAUS #WTCFinal pic.twitter.com/xD62y9bpdP — CricTracker (@Cricketracker) June 3, 2023 -
WTC Final 2021-23: కోహ్లి వర్సెస్ గిల్..?
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో ఏ ఆటగాడు టాప్ స్కోరర్గా నిలుస్తాడన్న డిస్కషన్ ఇప్పటి నుంచే మొదలైంది. ఇరు జట్ల బ్యాటింగ్ బలాబలాలు సమతూకంగా ఉండటంతో ఎవరు అధిక పరుగులు చేస్తారని చెప్పడం కాస్త కష్టమైన పనే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్, పుజారాల పేర్లు చెబుతుంటే.. మరి కొందరు స్టీవ్ స్మిత్, లబూషేన్, ట్రవిస్ హెడ్లలో ఎవరో ఒకరు టాప్ స్కోరర్గా నిలుస్తారని అభిప్రాయపడుతున్నారు. అంచనాలు, అభిప్రాయాలు పక్కన పెట్టి, ఇరు జట్ల ఆటగాళ్ల తాజా ఫామ్ను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే.. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లిలలో ఎవరో ఒకరు టాప్ స్కోరర్గా నిలుస్తారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో వీరిద్దరు భీకర ఫామ్లో ఉండి పరుగులు వరద పారించారు. గిల్ 17 మ్యాచ్ల్లో 3 సెంచరీలు సాయంతో 890 పరుగులు చేయగా.. కోహ్లి 14 మ్యాచ్ల్లో 2 సెంచరీల సాయంతో 639 పరుగులు చేశాడు. వీరిద్దరు ఇదే ఫామ్ను డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ కొనసాగిస్తే, సెంచరీల మోత మోగి పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరే కాక టీమిండియాలోనే మరో ఇద్దరికి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ టాప్ స్కోరర్గా నిలిచే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పరిస్థితులకు అతికినట్లు సరిపోయే పుజారా, ఓవల్ మైదానంలో మంచి ట్రాక్ రికార్డు (గత మ్యాచ్లో సెంచరీ) కలిగిన రోహిత్ శర్మకు కూడా అధిక పరుగులు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆసీస్ బ్యాటర్ల అవకాశాలను కూడా తీసి పారేయడానికి వీలు లేదు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్లలో ఎవరో ఒకరు టాప్ స్కోరర్గా నిలువవచ్చు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరు రాణిస్తారో తేలాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: ఫైనల్లో టీమిండియా గెలిస్తే.. ప్రపంచ క్రికెట్లో సరికొత్త చరిత్ర! -
ఆ ఒక్కటి జరిగితే యశస్వి జైస్వాల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కే..!
-
WTC Final: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త
భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ వేదికగా జూన్ 7-12 మధ్యలో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ను డీడీ స్పోర్ట్స్ (డీడీ ఫ్రీ డిష్) ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని దూరదర్శన్ స్పోర్ట్స్ ఇవాళ ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ డీడీ స్పోర్ట్స్లో ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 𝐈𝐂𝐂 𝐖𝐨𝐫𝐥𝐝 𝐓𝐞𝐬𝐭 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩 𝐅𝐈𝐍𝐀𝐋 𝟐𝟎𝟐𝟑 🏏 𝐈𝐍𝐃𝐈𝐀 𝐯𝐬 𝐀𝐔𝐒𝐓𝐑𝐀𝐋𝐈𝐀 - 𝐓𝐡𝐞 𝐔𝐥𝐭𝐢𝐦𝐚𝐭𝐞 𝐓𝐞𝐬𝐭 🗓️ 𝟕 𝐭𝐨 𝟏𝟏 𝐉𝐮𝐧𝐞 🏟️ 𝐓𝐡𝐞 𝐎𝐯𝐚𝐥 𝐋𝐈𝐕𝐄 𝐨𝐧 𝐃𝐃 𝐒𝐩𝐨𝐫𝐭𝐬📺 (𝐃𝐃 𝐅𝐫𝐞𝐞 𝐃𝐢𝐬𝐡)#TeamIndia #INDvsAUS #WTC23 pic.twitter.com/vHc3kWkKQW — Doordarshan Sports (@ddsportschannel) June 2, 2023 కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇదివరకే మ్యాచ్ వేదిక అయిన ఓవల్ మైదానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలుపొందాలని ఇరు జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. బలాబలాల వరకు ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అస్ట్రేలియా: మార్కస్ హ్యారిస్, ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లయోన్ టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్లో లేరు.. అయినా ఫైనల్కు..! -
WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్లో లేరు.. అయినా ఫైనల్కు..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 చివరి అంకానికి చేరింది. జూన్ 7-11 మధ్యలో జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ సీజన్ ముగుస్తుంది. లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్కు ముందు ఈ సీజన్ అత్యుత్తమ గణాంకాలపై ఓ లుక్కేస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆసీస్తో పాటు ఫైనల్కు చేరిన టీమిండియా.. ఏ ఒక్క విభాగంలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చనప్పటికీ ఫైనల్కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్తో అత్యధిక పరుగుల విభాగంలో ఇంగ్లండ్ జో రూట్ (22 మ్యాచ్ల్లో 1915 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. అత్యధిక వికెట్ల జాబితాలో ఆసీస్ నాథన్ లయోన్ (19 మ్యాచ్ల్లో 83 వికెట్లు) టాప్లో ఉన్నాడు. ఈ సీజన్లో అత్యధిక డిస్మిసల్స్ రికార్డు (19 మ్యాచ్ల్లో 62 డిస్మిసల్స్) ఆసీస్ వికెట్కీపర్ ఆలెక్స్ క్యారీ పేరిట ఉండగా.. అత్యధిక స్కోర్ రికార్డు న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ (252) పేరిట నమోదై ఉంది. బౌలింగ్లో ఓ ఇన్నింగ్స్లో అత్యుత్తమ గణాంకాలు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ (10/119) పేరిట ఉండగా.. మ్యాచ్లోనూ అత్యుత్తమ గణాంకాల రికార్డు (14/225) అజాజ్ పేరిటే నమోదై ఉంది. అత్యధిక సగటు కివీస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (75.20), అత్యధిక టీమ్ టోటల్ ఇంగ్లండ్ (657), అత్యల్ప టీమ్ టోటల్ బంగ్లాదేశ్ (53) పేరిట నమోదై ఉన్నాయి. అత్యధిక పరుగుల ఛేదన రికార్డు (378/3) ఇంగ్లండ్ పేరిట ఉంది. ఇలా.. 2021-23 సీజన్లో ఏ విభాగంలో చూసినా.. ఇతర జట్లు, ఆటగాళ్లే ఉన్నారు తప్పించి, భారత జట్టు కానీ ఆటగాళ్ల జాడ కానీ కనిపించలేదు. అయినా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో (ఫైనల్కు ముందు) టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా ఆటగాళ్ల జాడ కోసం వెతికితే.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 19 (పుజారా), ఆతర్వాతి స్థానాల్లో.. అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో మూడో స్థానంలో (అశ్విన్ 61 వికెట్లు).. అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికటె్కీపర్ల జాబితాలో నాలుగో స్థానంలో (పంత్, 50 డిస్మిసల్స్) తారసపడ్డారు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా ఆటగాళ్లు.. 19. పుజారా (16 మ్యాచ్ల్లో 887 పరుగులు) 22. విరాట్ కోహ్లి (16 మ్యాచ్ల్లో 869) 23. పంత్ (12 మ్యాచ్ల్లో 868) 32. రోహిత్ శర్మ (10 మ్యాచ్ల్లో 700) 34. రవీంద్ర జడేజా (12 మ్యాచ్ల్లో 673) 35. శ్రేయస్ అయ్యర్ (10 మ్యాచ్ల్లో 666) 36. కేఎల్ రాహుల్ (11 మ్యాచ్ల్లో 636) 48. శుభ్మన్ గిల్ (7 మ్యాచ్ల్లో 476) -
WTC Final: టీమిండియా కొత్త జెర్సీల ఆవిష్కరణ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ఆరు రోజుల ముందు టీమిండియా కొత్త జెర్సీ విడుదలైంది. భారత జట్టు అఫిషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్గా కూడా వ్యవహరించింది. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే (అడిడాస్) జెర్సీని తయారు చేయడం ఇదే మొదటిసారి. మూడు ఫార్మట్లకు చెందిన భారత జట్టు జెర్సీలను అడిడాస్ సంస్థ ఇవాళ (జూన్ 1) సోషల్మీడియా ఖాతాల ద్వారా ఆవిష్కరించి, అభిమానులతో షేర్ చేసుకుంది. An iconic moment, An iconic stadiumIntroducing the new team India Jersey's #adidasIndia #adidasteamindiajersey#adidasXBCCI @bcci pic.twitter.com/CeaAf57hbd— Adidas India (@adidasindiaoffi) June 1, 2023 జెర్సీల ఆవిష్కరణకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక యానిమేటెడ్ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది. కొత్త జెర్సీలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. టీమిండియా కొత్త జెర్సీలు బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో పాత జెర్సీలకు కొత్త వాటికి తేడా లేదని పెదవి విరుస్తున్నారు. కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్ బ్లూ కలర్లో కాలర్తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్ కలర్ జెర్సీని టెస్ట్లకు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్నారు. ఇదిలా ఉంటే, జూన్ 7న ఆసీస్తో ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. పురుషుల క్రికెట్తో పాటు మహిళల క్రికెట్లోనూ భారత ఆటగాళ్లు ఇవే జెర్సీలు ధరించనున్నారు. బైజూస్ సంస్థ బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్ను (జెర్సీ స్పాన్సర్) అర్ధంతరంగా రద్దు చేసుకోవడంతో అడిడాస్ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో జెర్సీ స్పాన్సర్గా కూడా వ్యవహరించింది.ఔ చదవండి: WTC Final: ఆసీస్కు అక్కడ అంత సీన్ లేదు.. గెలుపు టీమిండియాదే..! -
WTC Final: ఆసీస్కు అక్కడ అంత సీన్ లేదు.. గెలుపు టీమిండియాదే..!
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు సౌత్ లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో పాటు ఇతర రికార్డుల విషయంలో ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ.. ఓ విషయం మాత్రం ఆసీస్ను తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. ఇంగ్లండ్లోని మొత్తం వేదికల్లో ఓవల్ మైదానంలోనే ఆస్ట్రేలియాకు అతి తక్కువ సక్సెస్రేట్ ఉండటం. 1880లో జరిగిన ఇనాగురల్ టెస్ట్ మ్యాచ్ నుంచి ఈ వేదికపై ఆసీస్ ఆడిన 38 మ్యాచ్ల్లో కేవలం ఏడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఆ జట్టు విన్నింగ్ రేటియో ఈ మైదానంలో 18.42గా ఉంది. ఇంగ్లండ్ మొత్తంలో ఆసీస్ ఈ మైదానంలోనే అతి స్వల్ప సక్సెస్ రేట్ కలిగి ఉంది. గడిచిన 50 ఏళ్లలో ఓవల్లో ఆస్ట్రేలియా కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఆసీస్కు ఇంగ్లండ్లో అత్యధికంగా లార్డ్స్లో అత్యధిక సక్సెస్ రేట్ (39.72) ఉంది. మరోవైపు టీమిండియాకు సైతం ఓవల్లో పెద్ద మెరుగైన రికార్డు ఏమీ లేదు. భారత జట్టు ఇక్కడ ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం రెండింటిలోనే మాత్రమే విజయం సాధించింది. భారత్.. చివరిసారిగా ఇక్కడ 2021లో గెలుపొందింది. నాటి మ్యాచ్లో భారత్.. 157 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. రికార్డుల విషయం పక్కన పెడితే.. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు భారత్, ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు ఇదివరకే లండన్కు చేరుకున్నారు. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలుపొందేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. గెలుపుపై ఇరు జట్లు ధీమాగా ఉన్నప్పటికీ.. ఆసీస్తో పోలిస్తే టీమిండియాకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. గిల్, కోహ్లి, షమీ సూపర్ ఫామ్లో ఉండటం టీమిండియా అదనంగా కలిసొచ్చే అంశం. చదవండి: ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్ బోర్డు.. జెర్సీ స్పాన్సర్ చేసే నాథుడే లేడా..? -
ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్ బోర్డు.. జెర్సీ స్పాన్సర్ చేసే నాథుడే లేడా..?
ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్ బోర్డుకు జెర్సీ స్పాన్సర్ చేసే నాథుడే కరువయ్యాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ టీమిండియా జెర్సీ స్పాన్సర్ను దొరకబట్టలేకపోయింది. ప్రపంచ క్రికెట్కు పెద్దన్నలా వ్యవహరించే బీసీసీఐకి ఇది ఘోరమైన అవమానంగా చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా జెర్సీ స్పాన్సర్గా బైజూస్ కంపెనీ వ్యవహరిస్తుంది. అయితే బైజూస్ కాంట్రాక్ట్ నుంచి అర్ధంతరంగా తప్పుకోవడంతో భారత క్రికెట్ బోర్డు కొత్త స్పాన్సర్ వేటలో పడింది. కొత్త స్పాన్సర్తో డీల్ కుదుర్చుకునేందుకు తగిన సమయం లేకపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ప్లేన్ జెర్సీతోనే (బీసీసీఐ, అడిడాస్ లోగో ఉంటాయి) బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా, బీసీసీఐ ఇటీవలే భారత టూల్ కిట్ స్పాన్సర్గా అడిడాస్తో డీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే ఓవల్ మైదానంలో కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్తో గిల్, కోహ్లి, షమీ లాంటి టీమిండియా క్రికెటర్లు ఉరకలేస్తున్నారు. మరోవైపు ఆసీస్ టీమ్ సైతం విజయంపై ధీమాగా ఉంది. చదవండి: తండ్రికి ఇచ్చిన మాట కోసం సచిన్ ఏం చేశాడంటే..? -
WTC: ఐపీఎల్-2023 సమయంలోనూ డ్యూక్ బాల్స్తో ప్రాక్టీస్ చేశాం.. ఎందుకంటే..
WTC Final 2021-23: ‘‘ఐపీఎల్ ఆడుతున్న సమయంలోనూ మేము రెడ్బాల్తో ఎలా బౌలింగ్ చేయాలన్న అంశంపై చర్చించాం. మా దగ్గర రెడ్బాల్స్ ఉండేవి. అప్పుడప్పుడు మేము వాటితో ప్రాక్టీస్ చేసేవాళ్లం. వీలు దొరికినప్పుడల్లా నెట్స్లో కసరత్తులు చేసేవాళ్లం. నిర్విరామంగా రెండేసి నెలల పాటు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి వెంటనే టెస్టు ఫార్మాట్కు మారడం అంటే కొంచెం కష్టమే. మానసికంగా సిద్ధపడితేనే ఒత్తిడి అధిగమించగలం’’ అని టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. బీజీటీ-2023లో గెలిచి ఐపీఎల్-2023 సమయం నుంచే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు సిద్ధమయ్యే పనిలో పడ్డామని వెల్లడించాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో ఆసీస్ను మట్టికరిపించిన భారత్.. కంగారూలతో పాటు తుదిమెట్టుపై అడుగుపెట్టింది. ఈ క్రమంలో జూన్ 7-11 మధ్య ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆసీస్ ఐసీసీ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ ఐసీసీతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ సందర్భంగా డ్యూక్ బాల్స్తో ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. డ్యూక్ బాల్స్తో ప్రాక్టీస్ ‘‘ఐపీఎల్ సమయంలో మేము డ్యూక్ బాల్స్ ఆర్డర్ చేశాం. వాటితో ప్రాక్టీస్ చేశాం. మ్యాచ్ జరిగేది ఇంగ్లండ్లో! కాబట్టి డ్యూక్ బంతులతో ఆడటం అలవాటు చేసుకోవాలని ఇలా చేశాం. నిజానికి వైట్ బాల్ నుంచి రెడ్ బాల్కు మారడం.. ఎస్జీ బాల్స్ నుంచి డ్యూక్ బాల్స్కు మారడం వంటిదే. అయితే, ఇలాంటి సమయాల్లోనే మన నైపుణ్యాలకు పదునుపెట్టాల్సి వస్తుంది. ప్రణాళికలు పక్కాగా అమలు చేయగలగాలి. ఎలాంటి బాల్ అయినా సరే.. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయగలగాలి. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్లో జరుగబోతోంది. భారత్తో పోల్చుకుంటే అక్కడ పిచ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి’’ అని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. PC: TOI కాగా భారత్ వేదికగా జరిగిన బీజీటీ-2023లో బంతి కంటే కూడా బ్యాట్తోనే అక్షర్ రాణించాడు. ఆసీస్తో ఈ టెస్టు సిరీస్లో 264 పరుగులు సాధించాడు. ఉస్మాన్ ఖవాజా(333), విరాట్ కోహ్లి (297) తర్వాతి స్థానంలో నిలిచాడు. డ్యూక్ బాల్స్.. 1760లో డ్యూక్ కుటుంబం క్రికెట్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీని ప్రారంభించింది. 1987లో ఈ కంపెనీని భారత వ్యాపారవేత్త దిలీప్ జజోడియా కొనుగోలు చేశారు. ఈ కంపెనీ తయారు చేసే బాల్స్ డ్యూక్ బాల్స్గా పేరొందాయి. వీటిని ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్లలో ఉపయోగిస్తారు. ఎస్జీ బాల్ను బారత్లో వాడతారు. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్.. రవీంద్ర జడేజాకు నో ఛాన్స్! కారణమిదే.. -
డబ్ల్యూటీసీ ఫైనల్.. రవీంద్ర జడేజాకు నో ఛాన్స్! కారణమిదే..
WTC Final 2023- Ind Vs Aus: ‘‘రోహిత్ శర్మ టాపార్డర్ బ్యాటర్. నా జట్టుకు సారథి కూడా అతడే! రోహిత్ కెప్టెన్సీ అంటే నాకెంతో ఇష్టం. ఇక రోహిత్కు జోడీగా.. నాకు శుబ్మన్ రూపంలో మంచి ఆప్షన్ ఉంది. అయితే, తనకు నా జట్టులో ఇప్పుడే చోటివ్వడం కాస్త తొందరపాటు చర్య అవుతుంది. కాబట్టి నేను నా కంబైన్డ్ జట్టులో మరో ఓపెనర్గా ఉస్మాన్ ఖవాజాను ఎంచుకున్నా. ఇక మూడు, నాలుగు, ఐదో స్థానాలకు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లిలను ఎంపిక చేసుకుంటా. ఒకవేళ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఇండియా లేదంటే ఉపఖండంలో జరిగితే ఆరో స్థానంలో రవీంద్ర జడేజాకు చోటిచ్చేవాడినేమో! కానీ ఇంగ్లండ్లో ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. కాబట్టి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్కే నా మొదటి ప్రాధాన్యం. నా జట్టులో అతడే ఆల్రౌండర్. ఇక స్పిన్ బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్కు ఎనిమిదో స్థానంలో చోటిస్తాను. లోయర్ ఆర్డర్లో అతడు చక్కగా బ్యాటింగ్ చేయగలడు. ఇక తొమ్మిదో ఆటగాడిగా ప్యాట్ కమిన్స్, పదో స్థానంలో మిచెల్ స్టార్క్, పదకొండో ఆటగాడిగా మహ్మద్ షమీకి నా జట్టులో చోటు కల్పిస్తా. జస్ప్రీత్ బుమ్రా లేడు కాబట్టి నేను షమీ వైపే మొగ్గు చూపుతా’’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ అన్నాడు. జడ్డూకు చోటు లేదు ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్-2023కి ముహూర్తం ఖారారైన విషయం తెలిసిందే. జూన్ 7-11 వరకు ఈ మెగా టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో నాసిర్ హుసేన్ భారత్- ఆసీస్ ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ లెవన్ను ఎంపిక చేసుకున్నాడు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో అద్భుతంగా రాణించిన టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు మాత్రం చోటివ్వలేదు. మ్యాచ్ ఇంగ్లండ్లో కాబట్టి.. జడ్డూకు బదులు మరో స్పిన్ ఆల్రౌండర్ అశ్విన్ వైపే మొగ్గుచూపాడు. కాగా భారత్లో జరిగిన బీజీటీ-2023లో స్పిన్నర్లు అశ్విన్, జడేజా కలిపి 47 వికెట్లు కూల్చగా.. ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్, యువ సంచలనం టాడ్ మర్ఫీ ఒక్కొక్కరు 36 వికెట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో విన్నింగ్ షాట్ ఆడిన జడేజా.. చెన్నై సూపర్కింగ్స్ను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఇక బీజీటీలో అశ్విన్తో కలిసి జడ్డూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న విషయం విదితమే. డబ్ల్యూటీసీ ఫైనల్-2023కి నాసిర్ హుసేన్ ఎంచుకున్న కంబైన్డ్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మహ్మద్ షమీ. చదవండి: ఆసీస్ అంటే పూనకాలే! వాళ్ల దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే: ఆస్ట్రేలియా దిగ్గజం ఫామ్లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
ఆసీస్ అంటే పూనకాలే! వాళ్ల దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే: ఆస్ట్రేలియా దిగ్గజం
WTC Final 2021-23- Ind Vs Aus: పొట్టి ఫార్మాట్ క్రికెట్ పండుగ ఐపీఎల్-2023 ముగిసింది. దాదాపు రెండు నెలల పాటు క్యాష్ రిచ్ లీగ్ ఫీవర్తో ఊగిపోయిన అభిమానులకు.. క్రికెట్లోని అసలైన మజా అందించేందుకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ రూపంలో మరో మెగా ఫైట్కు రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 7న మొదలుకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 11 వరకు నిర్వహించనున్న ఈ టెస్టు మ్యాచ్కు జూన్ 12 రిజర్వ్ డేగా నిర్ణయించారు. వారిద్దరే కీలకం ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా.. 15 మందితో కూడిన జట్లను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా, ఆసీస్ మాజీ క్రికెటర్లు తుది జట్లపై అంచనాలు వేస్తుండగా.. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా కీలకంగా మారనున్నారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే ఉంటుందని, వారిని త్వరగా పెవిలియన్కు పంపే వ్యూహాలతో ముందుకు వస్తుందని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ అంటే పూనకాలే కాగా టీమిండియా నయావాల్ పుజారాకు ఆస్ట్రేలియా మీద మెరుగైన రికార్డు ఉంది. ఆసీస్తో ఆడిన 24 టెస్టుల్లో ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ 2033 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు సెంచరీలు ఉండటం విశేషం. మరోవైపు.. రన్మెషీన్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంప్రదాయ క్రికెట్లో ఆసీస్తో 24 మ్యాచ్లలో కోహ్లి 1979 పరుగులు చేశాడు. ఆసీస్పై అతడి అత్యధిక స్కోరు 186. స్వదేశంలో ఇటీవల జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా కోహ్లి సెంచరీతో మెరిశాడు. విరాట్, పుజారాలను త్వరగా అవుట్ చేయాలని ఇక అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 75 సెంచరీలు నమెదు చేసిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్-2023లో వరుసగా రెండు శతకాలు బాది ఫుల్జోష్లో ఉన్నాడు. టీ20 క్రికెట్లో సత్తా చాటిన అతడు.. టెస్టుల్లోనూ రాణించేందుకు నెట్స్లో చెమటోడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా విరాట్ గురించే చర్చిస్తుంది. అతడిని ఎలా అవుట్ చేయాలన్న అంశంపై దృష్టి సారిస్తుందనడంలో సందేహం లేదు. అదే విధంగా పుజారా గురించి కూడా మాట్లాడుకుంటారు. ఈ ఇద్దరిని త్వరగా పెవిలియన్కు పంపాలనే యోచనలో ఉంటారు. ఆస్ట్రేలియా మీద పుజారాకు మంచి రికార్డు ఉంది. నిజానికి ఓవల్ పిచ్ కూడా ఆసీస్ పిచ్లలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తారు’’ అని పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్లు ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, హాజల్వుడ్, నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ఇంగ్లిస్. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. స్టాండ్ బై ప్లేయర్లు: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, ముకేశ్ కుమార్. చదవండి: #SKY: టీ20 మాస్టర్క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా! SL Vs AFG: లంకతో వన్డే సిరీస్.. అఫ్గనిస్తాన్కు ఊహించని షాక్! -
రోహిత్కు కలిసొచ్చిన ఓవల్.. మళ్లీ విజృంభించేనా?
మరో వారం రోజుల్లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య లండన్లోని ఓవల్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా కెప్టెన్గా రోహిత్ శర్మకు ఇది కీలకంగా మారింది. టీమిండియా తరపున డబ్ల్యూటీసీస టైటిల్ సాధించిన తొలి కెప్టెన్గా రోహిత్ నిలుస్తాడా లేదా అనేది ఒక వారంలో తేలుతుంది. గతంలో కోహ్లికి ఆ అవకాశం వచ్చినప్పటికి 2021 డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్లో కివీస్తో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. రోహిత్కు కలిసొచ్చిన ఓవల్.. అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్ గెలిచి గదను(డబ్ల్యూటీసీ టైటిల్) అందుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. టీమిండియా కూడా అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్లో పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే మ్యాచ్ జరగనున్న ఓవల్ మైదానం కెప్టెన్ రోహిత్కు అచ్చొచ్చింది. ఓవల్ వేదికగా 2021లో ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ శతకంతో మెరిశాడు. హిట్మ్యాన్కు విదేశాల్లో ఇదే తొలి శతకం కావడం విశేషం. మరి రోహిత్కు అచ్చొచ్చిన ఓవల్లో మరోసారి సెంచరీతో చెలరేగి టీమిండియాను గెలిపించి టైటిల్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక 2021లో ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 157 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌట్ కావడంతో వంద పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్లో రోహిత్(256 బంతుల్లో 127 పరుగులు) సెంచరీకి తోడుగా పుజారా 61, రిషబ్ పంత్ 50, శార్దూల్ ఠాకూర్ 60, కోహ్లి 44, రాహుల్ 46 పరుగులతో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌట్ అయింది. 365 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 210 పరుగులకే ఆలౌట్ అయింది. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. Oval was the ground that saw Rohit Sharma score his first-ever century outside India. Replicate it skipper! 🇮🇳 #WTCFinal2023 | @ImRo45 pic.twitter.com/Y3u5GH9L8Z — Vicky Singh (@VickyxCricket) June 1, 2023 చదవండి: #SKY: టీ20 మాస్టర్క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా! సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్ -
'ఓవల్లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది'
జూన్ ఏడు నుంచి ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. 2019-21 డబ్ల్యూటీసీ ఫైనల్లో రన్నరప్గా నిలిచిన టీమిండియా ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా కూడా అంతే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో రచించనున్న ప్రణాళికలపై చర్చించాడు.'' ఓవల్లోని పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా. వాస్తవానికి యూకేలోని బెస్ట్ బ్యాటింగ్ కండిషన్ పిచ్ అయిన ఓవల్ పేస్, బౌన్స్కు అనుకూలంగా ఉంటుందని అంటారు. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భారత్లో ఉండే పిచ్ కండీషన్లా ఉంటుందేమోనని చిన్నపాటి భయం కూడా ఉంది. నాకు తెలిసి టీమిండియా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు ఫ్రంట్లైన్ స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. వారిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఒక అంచనాకు వచ్చాం. డబ్యూటీసీ(వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్) అనేది మంచి ఆలోచన. ఎంత సంప్రదాయ క్రికెట్ అయినా ఒక పోటీ ఉంటేనే మజా ఉంటుంది. డబ్ల్యూటీసీ టైటిల్ అందుకోవాలన్న కాంక్షతో ప్రతీ జట్టు తమ శాయాశక్తులా మ్యాచ్లను గెలవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అటు టీమిండియా.. ఇటు మేము డబ్ల్యూటీసీ ఫైనల్కు క్వాలిఫై అయ్యాం. ఇక వచ్చే వారంలోపు టెస్టు ఛాంపియన్ ఎవరనేది తేలనుంది. ఇక మ్యాచ్కు వచ్చే అభిమానుల్లో ఆస్ట్రేలియన్ల కంటే టీమిండియా అభిమానులే ఎక్కువగా ఉంటారని అనుకుంటున్నా. మ్యాచ్ మాత్రం చాలా గొప్పగా ఉంటుందని అనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ఈ ఏడాది భారత్లో పర్యటించిన ఆస్ట్రేలియా 1-2 తేడాతో టెస్టు సిరీస్ను టీమిండియాకు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మూడు వన్డేల సిరీస్ను మాత్రం 2-1తో చేజెక్కించుకుంది. ఇక ఐపీఎల్లో పాల్గొనని స్టీవ్ స్మిత్ ఇటీవలే ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడాడు. కౌంటీల్లో ఆడడం ద్వారా మంచి ప్రాక్టీస్ దొరికిందని.. డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు యాషెస్ సిరీస్కు కూడా సన్నద్దమైనట్లు ఇటీవలే స్మిత్ ట్విటర్లో తెలిపాడు. చదవండి: త్రిపుర క్రికెట్లో ప్రొటీస్ మాజీ ఆల్రౌండర్కు కీలక పదవి