YSRCP Navaratnalu
-
టిడ్కో ఇళ్ల పథకాన్ని బాబు ప్రభుత్వం గాలికొదిలేసింది
-
నవరత్నాలు పథకాల్ని వివరిస్తూ.. డాక్యుమెంటరీ
-
నవరత్నాల అమలుకు రాష్ట్రస్థాయి కమిటీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నవరత్నాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చైర్మన్గా, మంత్రులు, అధికారులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ను వైఎస్ చైర్మన్గా నియమించారు. డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్ప శ్రీవాణి, ఆళ్లనాని, నారాయణస్వామి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, శ్రీరంగనాథరాజ్, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, అనిల్కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు. అలాగే 12 శాఖల ఉన్నతాధికారులను రాష్ట్ర స్థాయిలో సభ్యులుగా నియమించారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్ మంత్రుల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. నవరత్నాలను సమర్థవంతగా అమలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
నగర ప్రజలకు గృహ యోగం
సాక్షి, నగరంపాలెం(గుంటూరు) : నగర ప్రజల సొంతింటి కల త్వరలో నిజం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్లు పథకం తొలిదశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నగరపాలక సంస్థలో ఒక కొలిక్కి వచ్చింది. నగర ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువుగా ఉన్న దృష్ట్యా జీప్లస్ టూలో విశాలమైన గృహాలు నిర్మించి అందించనున్నారు. వార్డు వలంటీర్లను నియమించిన ఆగస్టు 15వ తేదీ నుంచి తొలి పనిగా డోర్ టూ డోర్ గృహాలు లేని నిరుపేదల గురించి సర్వే నిర్వహించారు. నగరంలోని 52 డివిజన్లతో పాటు, 10 విలీన గ్రామాల్లో వార్డు వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి హౌసింగ్ దరఖాస్తులను స్వీకరించారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీటిని క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి ప్రాథమికంగా అర్హుల జాబితాను తయారు చేశారు. నగరంలో 52 డివిజన్లు, 10 విలీన గ్రామాల్లో కలిపి మొత్తం 38,252 మందితో ప్రాథమిక అర్హుల జాబితాను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ విడుదల చేశారు. ప్రాథమిక అర్హుల జాబితాను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు, బృందావన్ గార్డెన్స్లోని సర్కిల్ కార్యాలయంలో ప్రదర్శించారు. అర్హుల జాబితాపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. డివిజన్ల వారీగా విడుదల చేసిన అర్హుల జాబితాలో ఎక్కువ మంది విలీన గ్రామాలకు సంబంధించి 56వ డివిజన్లో 3,428, 57వ డివిజన్లో 3,097, పశ్చిమ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో 2,252 మంది ఉన్నారు. అతి తక్కువ మంది 42వ డివిజన్లో 385 మంది మాత్రమే ఉన్నారు. అర్హుల జాబితాపై అభ్యంతరాలను డివిజన్ల వారీగా నిర్వహించనున్న వార్డు సభల్లో స్వీకరించనున్నారు. ప్రైవేటు స్థలాల కొనుగోలుకు చర్యలు : గృహాల నిర్మాణానికి స్థల సేకరణను రెవెన్యూ అధికారులతో కలసి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు వేగవంతం చేశారు. నగరంతో పాటు, విలీన గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లభ్యత లేకపోవటంతో ప్రైవేటు స్థలాలు కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విలీన గ్రామాల్లోను, శివారు కాలనీలోని ఇళ్ల మధ్యలో ఉన్న పొలాలను కొనుగోలు చేయటానికి ఇప్పటికే రెవెన్యూ అధికారుల సహాయంతో యజమానులను గుర్తించి చర్చలు ప్రారంభించారు. సుమారు 40 వేల ఇళ్లకు 60 నుంచి 100 ఎకరాలు అవసరం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా గుర్తించిన స్థలాల ప్రతిపాదనలు జిల్లా అధికారులకు సమర్పించనున్నారు. 15 నుంచి వార్డు సభలు అర్హుల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 15 నుంచి డివిజన్ల వారీగా వార్డు సభలు నిర్వహిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. ప్రాథమిక అర్హుల జాబితాను డివిజన్ల వారీగా అందుబాటులో ఉంచామన్నారు. అందరికీ ఇళ్లు పథకం ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలోను, ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేసి ప్రాథమిక అర్హుల జాబితాను రూపొందించామని తెలిపారు. అర్హుల జాబితాపై ఫిర్యాదులు, సలహాలు, సూచనలను వార్డు సభల్లో అందిస్తే విచారణ చేసి, తుది జాబితాను సిద్ధం చేస్తామని వివరించారు. -
100 రోజుల ప్రజాప్రభుత్వం
-
జనరంజక పాలనకు వైఎస్ జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి: ప్రజల కష్టాలు దగ్గరి నుంచి చూశారు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.. కులం, మతం, రాజకీయం చూడకుండా సాయం చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే వాయు వేగంతో నిర్ణయాలు.. నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రీకారం.. విప్లవాత్మక బిల్లులతో పారదర్శక పాలన దిశగా అడుగులు.. సమాజంలో సగం ఉన్న మహిళలకు అన్నింట్లో సగం.. సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వంద రోజుల్లో వందకు పైగా కీలక నిర్ణయాలు.. ఇదో చరిత్ర.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నవ చరిత్ర. ప్రజలకిచ్చిన హామీల అమల్లో నాన్చుడు లేదు.. మీన మేషాలు లెక్కించడం అసలే లేదు.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోంది. కనీసం ఆరు నెలలైనా గడవందే పాలనపై ఓ అంచనాకు రావడం కష్టం. అలాంటిది కేవలం వంద రోజుల్లోనే వందకు పైగా కీలక నిర్ణయాలు తీసుకుని ‘ఇది అందరి ప్రభుత్వం’ అని నిరూపించారు. గత పాలకుల తీరుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ వంద రోజుల పాలన ఐదు కోట్ల ప్రజానీకానికి కళ్లకు కట్టినట్లు కనిపించింది. మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. జూన్ 10వ తేదీన నిర్వహించిన తొలి కేబినెట్ భేటీలోనే నవరత్నాల్లో ప్రజలకిచ్చిన హామీల్లో 80 శాతం మేర అమలుకు నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ గ్రామ స్వరాజ్యానికి గాంధీ జయంతి రోజు నుంచి నాంది పలుకుతున్నారు. ఈ మేరకు తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేశారు. సీఎం వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇలా.. పింఛన్ల పెంపుపై తొలి సంతకం ► అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్ ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3000 వరకు తీసుకెళ్లాలని నిర్ణయం. ► పింఛను పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు. దీంతో అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం. ► కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్. తలసీమియా, పక్షవాతం, మస్కులర్ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు గురైన బాధితులకు పింఛన్లు ఇచ్చే పథకంపై సమాలోచన. మహిళలకు చేయూత ► డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా.. అధికారంలోకి వచ్చేనాటి వరకు ఉన్న రుణాలకు సమానమైన సొమ్మును నాలుగు విడతల్లో అందజేయాలని నిర్ణయం. ► ఉగాది రోజు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. ► అక్రమ మద్యం, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం. ► పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15,000. ఇంటర్ వరకూ పథకం వర్తింపు. జనవరి 26 నుంచి అమలు రైతాంగానికి అన్ని విధాలా భరోసా ► ప్రతి రైతు కుటుంబానికి వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా (ఈ ఏడాది అక్టోబర్ నుంచే) రూ.12,500. విడతల వారీగా రూ.50 వేలు చెల్లించేందుకు నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్లో మాత్రమే ఇస్తారు. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ లేని రుణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రైతులకు ఉచితంగా 200 రిగ్గు బోర్లు. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా. ► ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్కు రూ.1.50కు తగ్గింపు. ► గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు. ► ప్రమాదవశాత్తూ చనిపోయిన లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం. ► ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు. అవసరం మేరకు çఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ► భూ యాజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు 11 నెలలు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా కౌలుదార్ల చట్టం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసాతో పాటు పంటల బీమా, పంటల పరిహారం అందించే ఏర్పాటు. ► జలయజ్ఞం ద్వారా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయం. గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేలా ప్రణాళిక. ► సీఎం చైర్మన్గా వ్యవసాయ మిషన్ ఏర్పాటు. ► రైతు పండించే పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించేలా వైఎస్సార్ ఉచిత బీమా పథకం. ► 2018 ఖరీఫ్లో కరువుకు సంబంధించి రైతులకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల. ► ధాన్యం సేకరణకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.960 కోట్లు చెల్లించడానికి చర్యలు. రూ.360 కోట్లు విడుదల. ► కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్కు రూ.1,500 చొప్పున రూ.300 కోట్లు బోనస్గా విడుదల. ► ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కోసం రూ.80 కోట్లు విడుదల. ► నాఫెడ్ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్దతు ధర కోసం చర్యలు. ► తొలి ఏడాదే సహకార రంగ పునరుద్ధరణకు చర్యలు. ► గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించిన రూ.384 కోట్లు ఇచ్చేందుకు చర్యలు. ► వరదలు, భారీ వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్పుట్ సబ్సిడీ. ► పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం. ► కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం. సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం. నాఫెడ్ సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో 5 కొనుగోలు కేంద్రాలు. మార్కెట్ సెస్ రద్దు. ఫలితంగా క్వింటాల్ రూ.8,500కు పెరిగిన కొబ్బరి ధర. కొబ్బరి పంటల బీమా ప్రీమియంలో 75 శాతం కొబ్బరి బోర్డుతో కలిసి ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. జీతాల పెంపు ► పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.18,000కు పెంపు. ఆశా వర్కర్ల జీతాలు రూ.10 వేలకు పెంపు. ► అంగన్వాడీ వర్కర్ల జీతాలు రూ.10,500 నుంచి రూ.11,500కు పెంపు. ఆయాల జీతం రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంపు. ► డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపునకు నిర్ణయం. ► గిరిజన తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4,000కు పెంపు ► హోంగార్డుల వేతనాలు పెంచుతూ నిర్ణయం. ఉద్యోగాలు.. ఉపాధి.. విద్య ► గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులు.. గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం. 4 లక్షలకుపైగా ఉద్యోగాలు.. వీటిలో శాశ్వత ప్రాతిపదికన 1లక్షా 27 వేల ఉద్యోగాలు. ► గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం. వీరి ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు శ్రీకారం. ► కాపు కార్పొరేషన్కు తొలి బడ్జెట్లోనే రూ.2 వేల కోట్ల నిధులు.. 5 ఏళ్లలో రూ. 10 వేల కోట్లు కేటాయింపునకు రంగం సిద్ధం. ► ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపుల నిర్వహణ. మద్యం దుకాణాల్లో 16 వేల ఉద్యోగాలు. ► జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి పేదవాడి పెద్ద చదువుకు అయ్యే ఖర్చు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్. ► ఇంటర్ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు. ► రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు,,.. మొత్తం 25 సెంటర్లు ఏర్పాటు. ► సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం. ► దశలవారీగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ కాంపౌండ్, టాయ్లెట్లు, మంచినీటి సదుపాయం, ఫర్నిచర్, బ్లాక్బోర్డ్, పాఠశాల భవనాలకు మరమ్మతులు, పెయింట్లు వేయించటం వంటి చర్యలతో పాఠశాలలన్నింటి రూపురేఖల్ని మార్చేందుకు బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయింపు ► ఉద్యోగాలకు ఉపయోగపడేలా చదువుల ప్రణాళికను మార్చాలని నిర్ణయం. తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం. ► పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి శనివారం నో బ్యాగ్ డే ప్రజా సొమ్ము ఆదా ► వివిధ ప్రభుత్వ శాఖల్లో రూ. కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్లైన్లోనే టెండర్లు. కొనుగోలు చేయాల్సిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి, మునుపటి రేట్ల కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికే అవకాశం. ► గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నవారికి, కాంట్రాక్టర్లకు ఏటీఎం మిషన్గా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రీటెండరింగ్ ► రూ.100 కోట్లు దాటిన కాంట్రాక్టులన్నింటినీ జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపేలా చట్టం. కీలక బిల్లులు.. చట్టాల సవరణ ► 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ.75 వేలు ఆర్థిక సాయం. ► కబ్జాలు, దందాలు, అవకతవకలకు విరుగుడుగా భూమి మీద నిజమైన హక్కు ఉన్న వారికి న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ – 2019 బిల్లు ఆమోదం. అత్యాధునిక విధానంలో సమగ్రంగా భూముల సర్వే. ► రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా వ్యవసాయ మార్కెట్లను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం సవరణ బిల్లు ఆమోదం. ► మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం. ఇందులో నలుగురు డిప్యూటీ సీఎంలు. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు. ► శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు. ► ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. ► పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు. ► దశల వారీగా మద్య నిషేధం దిశగా.. మద్య నియంత్రణ చట్ట సవరణ. బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేత. తగ్గిన మద్యం వినియోగం. ► ఆలయ పాలక మండళ్లలో (టీటీడీ మినహా) 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు. ► ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం. ► పాఠశాల విద్య, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు బిల్లులు –2019కు ఆమోదం. ► గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో గౌరవ చైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేల నియామకం. అందరికీ వైద్యం.. అదే ధ్యేయం ► ప్రపంచంలోనే రోల్ మోడల్గా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు. రూ.1000 బిల్లు దాటినట్టయితే, వార్షిక ఆదాయం రూ.5 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల వారికి పథకం వర్తింపు. 2031 జబ్బులకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో చికిత్స చేయించుకున్నా వర్తింపు. ► అధునాతన సౌకర్యాలతో 108, 104 అంబులెన్స్లు.. కొత్త వాహనాలు కొనుగోలు. ► రెండేళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు చర్యలు. ► శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, చుట్టుపక్కల గ్రామాల కిడ్నీ బాధితుల కోసం.. 200 పడకలతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఉత్తర్వులు (రూ. 50 కోట్లు తక్షణ కేటాయింపు) ► డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు (అక్టోబరు 10 నుంచి అమలు) కార్యక్రమం కింద ఉచితంగా కంటి పరీక్షలు. ► రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో (గిరిజన ప్రాంతాలు) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు నిర్ణయం. ► విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కడపలో క్యాన్సర్ ఆసుపత్రుల ఏర్పాటు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ ఆసుపత్రులు. ► పాడేరు, విజయనగరం, పల్నాడులో మెడికల్ కాలేజీల ఏర్పాటు పారదర్శక పాలన ► అవినీతి, పైరవీలకు తావు లేని ఇసుక విధానం.. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘స్పందన’. చిన్న చిన్న సమస్యలకు 72 గంటల్లోనే పరిష్కారం. ► ‘స్పందన’లో వచ్చిన అర్జీలపై ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష.. ► ప్రజా సమస్యలపై సోమ, మంగళవారాల్లో కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని అధికారులతో భేటీ ► ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు. ► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్. సీపీఎస్ రద్దుకు నిర్ణయం. ► అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు ► వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్కు ఈ ఏడాది డిసెంబరు 26న శంకుస్థాపన. ► పారిశ్రామిక పెట్టుబడుల కోసం.. అవినీతికి తావులేని, పారదర్శకమైన ఇండస్ట్రీయల్ పాలసీ. రాష్ట్రంలో కొత్తగా మరో 4 పోర్టులు, ఎయిర్పోర్టుల ఏర్పాటుకు చర్యలు. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు. ► అక్రమ నిర్మాణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం. ► అమరావతిలో గత ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్పై వాస్తవాల వెలికితీతకు చర్యలు ► గత ప్రభుత్వం దోపిడీకి సంబంధించి 30 అంశాల్లో విచారణకు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు. ► గ్రామాల్లో 11,158 సచివాలయాలు, పట్టణాల్లో 3,768 వార్డు సచివాలయాల ఏర్పాటు. ప్రజాభ్యుదయమే లక్ష్యం ► ఉద్దానం కిడ్నీ వ్యాధుల కోసం రూ.600 కోట్లతో మంచినీటి పథకం. ► విశాఖ ఏజెన్సీలో గిరిజనుల హక్కులకు అగ్ర తాంబూలం.. బాక్సైట్ తవ్వకాలకు నో. ► రేషన్ కార్డుల ద్వారా 5, 10, 15 కిలోల బ్యాగుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ. ► దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పోలీసులకు వీక్లీ ఆఫ్.. ఫ్రెండ్లీ పోలీసింగ్. ► షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం. ► ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పరిమితి 100 నుంచి 200 యూనిట్లకు పెంపు ► చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం. డీజిల్పై ఇస్తున్న సబ్సిడీ లీటరుకు రూ.6 నుంచి రూ.9కి పెంపు. ► సొంత ఆటో, ట్యాక్సీ నడిపేవారికి మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ అవసరాల కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం ► మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం. ► వైఎస్సార్ కళ్యాణ కానుక కింద.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని యువతులు వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సాయం. బీసీ యువతుల వివాహాలకు రూ.50 వేలు. ► ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన గిరిజన కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం. ► క్రీడాకారులకు ప్రోత్సాహకాలు. ► ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు మూడు దశల్లో వాటర్ గ్రిడ్ పథకాలు. ► ముస్లింలు, క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్లే హజ్, జెరూసలెం యాత్రలకు ప్రభుత్వం ఇచ్చే సాయం పెంపు. ఇమామ్, మౌజమ్, పాస్టర్లకు గౌరవ వేతనాల పెంపు. ► ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు. -
ఆధార్.. బేజార్!
ప్రభుత్వ పథకాలను పొందడానికి, ఉద్యోగాలకు, స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశాలకు వెళ్లడానికి పాస్పోర్టులు.. ఇలా సేవలకు ఆధార్కార్డే ఆధారంగా మారింది. జిల్లాలో గతంలో చేసిన ప్రజాసాధికార సర్వేలో ఆధార్ అప్డేట్ చేయకపోవడం వల్ల సమస్యలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం రేషన్కార్డు పొందాలన్నా, మార్చుకోవాలన్నా, రేషన్ సరుకులు పొందాలన్నా ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయ్యింది. ప్రజలు తమ కుటుంబంలోని సభ్యుల ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవడానికి వారం రోజులుగా ముప్పుతిప్పలు పడుతున్నారు. ఆధార్ అనుమతి ఉన్న మీ–సేవ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండితిప్పలు మాని బారులు తీరుతున్నారు. ఈ సమస్య జిల్లాలో ప్రస్తుతం అధికంగా కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. సాక్షి, చిత్తూరు : ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. నవరత్నాల నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సంక్షేమ పథకాలను తెరపైకి తెచ్చారు. ఆ పథకాలు దక్కాలంటే ప్రజాసాధికార సర్వే చేయించుకోవాల్సిందే. గత సర్కారు చేసిన ప్రజాసాధికార సర్వేలో జరిగిన లోపాల వల్ల ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసిన బృందం నిర్లక్ష్యంగా ప్రజాసాధికార సర్వే చేయడం వల్ల చాలామంది పేర్లు అప్డేట్ కాలేదు. ప్రభుత్వ పథకాలను పొందాలంటే ముఖ్యంగా రేషన్కార్డు ఉండి తీరాల్సిందే. ఆ రేషన్కార్డు ఆధార్తో అనుసంధానం కాకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హలవుతారు. దీంతో జిల్లాలోని ప్రజలు తమ పేర్లను అనుసంధానం చేసుకోవడానికి ఆధార్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఫెయిల్ ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటే అనుమతి ఉన్న మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసులకెళ్లి సేవలు పొందవచ్చు. అయి తే జిల్లాలో అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ప్రజలకు ఆధార్ అనుసంధాన సేవలు అందించకపోవడంతో ప్రజలు మీ–సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నిత్యం ఆధార్ సేవలు అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. వారు పట్టించుకోకపోవడం వల్ల జిల్లాలో ఆధార్ అనుసంధాన ప్రక్రియ సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టడంలో విఫలమైందని ఆరోపణలున్నాయి. బ్యాంకు, పోస్టాఫీసు, మీ–సేవ, ఆధార్ కేంద్రాల ప్రతినిధులతో జిల్లా ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ చర్యలు చేయాల్సి ఉన్నా, అలా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పరికరాలు నిల్ ఆధార్ అనుసంధానం కోసం జిల్లాలోని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలకు, రేషన్ షాపులకు ప్రజలు వెళుతున్నారు. అయితే అక్కడ ఆధార్ అనుసంధానానికి తగిన పరికరాలు లేకపోవడంతో ప్రజలను మీ–సేవ కేంద్రాలకు వెళ్లండని పంపేస్తున్నారు. సర్వర్ స్లో, చిన్నపిల్లలకు, వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్యకు ప్రత్యామ్నాయ సేవలు అందించా లంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఐరిష్ యంత్రాలు తప్పనిసరి. జిల్లాలోని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో ఐరిష్ యంత్రాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. రేషన్షాపుల్లో ఐరిష్ యంత్రాలున్నా అవి పనిచేయడం లేదు. అవగాహన లోపంతో అవస్థలు ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటే ప్రభుత్వ, మీ–సేవ కేంద్రాలే కాదు.. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా సంప్రదించవచ్చు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. తిరుపతి అర్బన్ పరిధిలో తిరుపతి నార్త్ చీఫ్ పోస్ట్మాస్టర్, ఎస్వీ యూనివర్శిటీ వద్ద ఉన్న చీఫ్ పోస్టుమాస్టర్, తిరుపతి హెడ్ పోస్టాఫీసు, తిరుపతిలోని ఎన్సీపీ కాలనీలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్డీ, ఎస్వీ యూనివర్శిటీ రోడ్డులో డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్డీ, బైరాగ పట్టెడలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్డీ, బాలాజీ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు, శ్రీదేవి కాంప్లెక్స్ వద్దనున్న ఆంధ్రాబ్యాంకు, ఖాదీ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు తదితర చోట్ల ఆధార్ అనుసంధాన సేవలు పొందవచ్చు. -
పేదింటి కల.. సాకారం ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు.. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు స్థలం పట్టణాల్లో జీ ప్లస్ 3.. ఎకరంలో 100 యూనిట్లు మహిళల పేరుపై ఉగాది పండుగ రోజు పట్టాల పంపిణీగ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక.. లబ్ధిదారుల ముసాయిదా జాబితా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురణ తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్ ద్వారా జాబితాకు జిల్లా కలెక్టర్ల ఆమోదం ఇప్పటికే అందుబాటులో 11 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సంప్రదింపులు లేదా భూసేకరణ ద్వారా మరో 14 లక్షల మందికి అవసరానికి మించి ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న భూముల వినియోగం గతంలో ఇచ్చిన స్థలాలు ఉపయోగించుకోకపోతే స్వాధీనంమార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణతో కూడిన మార్గదర్శకాలను ప్రకటించింది. వచ్చే ఉగాది పండుగ రోజు అర్హులైన 25 లక్షల మంది పేదలందరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందుకు అనుగుణంగా ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక, అవసరమైన స్థలాల గుర్తింపు, సేకరణ తదితర అంశాలతో విధాన పరమైన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ జారీ చేశారు. కుల, వర్గ, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందు కోసం ఇప్పటి నుంచే అవసరమైన స్థలాలను గుర్తించడం, సేకరించడం, లబ్ధిదారుల ఎంపిక ప్రాతిపదిక, అర్హతలు, పథకం అమలుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇల్లు లేని పేదలందరికీ పక్కా గృహాలను దశల వారీగా నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఉగాది రోజు అర్హులైన 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 11 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో 14 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూములను గుర్తించాలని నిర్ణయించారు. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూమి గుర్తింపు ఇలా.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ జిల్లా కలెక్టర్లు గుర్తించాలి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు అవసరానికి మించి భూములు కలిగి ఉంటే గుర్తించి, ఇళ్ల స్థలాలకు అనువుగా ఉంటే నిబంధనల మేరకు స్వాధీనం చేసుకోవాలి. చిన్న చిన్న వివాదాల్లో ఉన్న సీలింగ్ భూములు, ఇనామ్, ఎస్టేట్, ఎల్టీఆర్ భూములను గుర్తించి వివాదాలను పరిష్కరించి కొద్ది నెలల్లోనే స్వాధీనం చేసుకోవాలి. ఇళ్ల స్థలాలకు అనువుగా ఉన్న ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కుల కోసం అభివృద్ధి చేసిన భూములను పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగించాలి. ల్యాండ్ పూలింగ్ స్కీము కింద భూములు అందుబాటులో ఉంటే స్వాధీనం చేసుకోవాలి. గ్రామ కంఠంలో అర్హులైన లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణాలకు అనుమతిస్తూ పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయాలి. గతంలో వివిధ శాఖలు ఇళ్ల స్థలాలను మంజూరు చేసినప్పటికీ నిర్మాణాలు చేయకుండా ఖాళీగా ఉంటే అలాంటి స్థలాలను గుర్తించి నిబంధనల మేరకు స్వాధీనం చేసుకోవాలి. ఇల్లు లేని పేదల కోసం ఎవరైనా భూములను దానం చేసేందుకు ముందుకు వస్తే అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. సంప్రదింపులు లేదా భూ సేకరణ ద్వారా జిల్లా కలెక్టర్లు అవసరమైన భూములను తీసుకోవాలి. ఇతర ప్రత్యామ్నాయాలు లేని పక్షంలోనే అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని నిబంధనల మేరకు పరిహారం చెల్లించాలి. గ్రామ, పట్టణ యూనిట్గా తగిన ఇళ్ల స్థలాలను గుర్తించాలి. గుర్తించిన ఇళ్ల స్థలాలను జిల్లా కలెక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖలకు స్వాధీనం చేయాలి. స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ఎటువంటి జాప్యం లేకుండా గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ శాఖ నిబంధన మేరకు లేఅవుట్స్ను రూపొందించాలి. ల్యాండ్ సర్వే, సబ్ డివిజన్స్ లే అవుట్ అండ్ పెగ్ మార్కింగ్లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ సహకారం అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలను చదును చేసేందుకు ఉపాధి హామీ నిధులను వినియోగించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను చదును చేసేందుకు పట్టణ స్థానిక సంస్థలు, ఏపీటీఐడిసీవో, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలి. భూ సేకరణ పరిహారం చెల్లించేందుకు, లే అవుట్స్ రూపకల్పన, వ్యక్తిగత ప్లాటింగ్, ఇతర కార్యకలాపాలకు అవసరమైన నిధులను బడ్జెట్ నుంచి రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు సమకూరుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అలాంటి వాటిని రద్దు చేసి అర్హులైన ఇతరులకు కేటాయించాలి. పర్యవేక్షణకు మూడు కమిటీలు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అమలును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం (రెవెన్యూ) అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో మున్సిపల్, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్, మున్సిపల్ పట్టణాభివృద్ది కార్యదర్శి, సీసీఎల్ఏ లేదా ప్రత్యేక సీఎస్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం కోసం రెవెన్యూ శాఖ (ల్యాండ్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సభ్యులుగా సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ సభ్య కన్వీనర్గా కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కార్యక్రమం అమలు పర్యవేక్షణకు జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కో–చైర్మన్గా జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, జిల్లా పంచాయతీ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్, గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా అవసరమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, డేటా సేకరణకు సాంకేతిక సహాయాన్ని ఐటీ శాఖ రియల్ టైమ్ గవర్నెన్స్ అందిస్తాయి. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. సమన్వయ బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్కు అప్పగిస్తారు. ఈ కార్యక్రమం అమలు తీరుపై జాయింట్ కలెక్టర్ తరచూ సీసీఎల్ఏకు నివేదిక పంపించాలి. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల అర్హతలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇళ్ల స్థలం ఉండరాదు. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొంది ఉండరాదు. రెండున్నర ఎకరాలకుపైగా మాగాణి లేదా ఐదు ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండరాదు. లబ్ధిదారుల అనుమతితోనే ఆధార్, ఇతర వివరాలు సేకరించాలి. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల అర్హతలు లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇళ్ల స్థలం ఉండరాదు. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొంది ఉండరాదు. రెండున్నర ఎకరాలకు పైగా మాగాణి లేదా ఐదు ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండరాదు. వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయలకు మించ రాదు. లబ్ధిదారుల అనుమతితోనే ఆధార్, ఇతర వివరాలు సేకరించాలి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇలా.. గ్రామ, పట్టణ యూనిట్గా గ్రామ, వార్డు స్థాయిలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. అర్హత నిబంధనల మేరకు దరఖాస్తులను గ్రామ, వార్డు వలంటీర్లు పరిశీలిస్తారు. అర్హత గల లబ్ధిదారుల ముసాయిదా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాలో లబ్ధిదారులపై అభ్యంతరాలను, క్లెయిమ్లను స్వీకరిస్తారు. అభ్యంతరాలను, క్లెయిమ్లను పరిగణనలోకి తీసుకుంటూ గ్రామ, వార్డు సభలను నిర్వహించి తుది జాబితాలను ఖరారు చేస్తారు. తుది జాబితాలను గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్ల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు. జిల్లా కలెక్టర్లు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, క్లెయిమ్లు ఉంటే సంబంధిత తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ల అనుమతితో పరిష్కరిస్తారు. మార్గదర్శకాలు ఇవీ.. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 1.5 సెంట్ల ఇంటి స్థలం ఇస్తారు. వచ్చే ఏడాది ఉగాది పండుగ రోజు మహిళల పేరు మీద పట్టాలను పంపిణీ చేస్తారు. వ్యక్తిగత లబ్ధిదారులు ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు గృహ నిర్మాణ శాఖ అందుబాటులో ఉన్న పథకాల కింద దశల వారీగా నిధులు మంజూరు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఎకరంలో 100 యూనిట్లు నిర్మిస్తారు. ఇందులో భాగంగా పట్టణ లబ్ధిదారులకు ఒక సెంటు చొప్పున కేటాయిస్తూ మహిళల పేరు మీద ఉగాది రోజున పట్టాలు పంపిణీ చేస్తారు. వ్యక్తిగత లబ్ధిదారులందరి ప్లాట్లకు 11 అంకెలతో విశిష్ట భూధార్ నంబర్ ఇస్తారు. -
కొలువుల కొలుపు
జిల్లాలో కొలువుల జాతర మొదలైంది. సర్కార్ ఉద్యోగాల కోసం ఐదేళ్ల పాటు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన నిరుద్యోగుల్లో కొత్త ప్రభుత్వం నూతనోత్తేజాన్ని నింపింది. సర్కార్ చేపట్టే సంక్షేమ ఫలాలను పకడ్బందీగా అమలు చేసేందుకు అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇందుకు సంబంధించి దేశంలో తొలిసారిగా వేలాది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు రెగ్యులర్ విధానంలో భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేలాది ఉద్యోగాలు తమ కళ్ల ముందు కనిపిస్తుండడంతో నిరుద్యోగులు వీటిని సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రేయింబవళ్లు చదవడమే కాకుండా పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు అవసరమైన శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం వచ్చి శిక్షణ పొందుతున్నారు. దీంతో నెల్లూరులోని కోచింగ్ సెంటరులన్నీ నిరుద్యోగులతో కళకళలాతున్నాయి. సాక్షి, నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పౌర సేవలు అత్యున్నతంగా అందించడానికి గ్రామ సచివాలయాలు వ్యవస్థను పటిష్టంగా అమలు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో త్వరలో గ్రామ ముఖచిత్రం మారనుంది. స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వాలని దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 73, 74 రాజ్యాంగ సవరణల్లో పేర్కొన్నారు. కానీ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయడం లేదు. స్వాతంత్య్ర భారతదేశంలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇందుకు నడుం బిగించింది. అందులో భాగంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టారు. ఇవి భర్తీ అయితే ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా పోతుంది. తమ గ్రామాల్లోనే అవసరమైన పనులు చేసుకోవచ్చు. ప్రజల వినతులకు జవాబుదారీతనం ఉంటుంది. జిల్లాలో 7,814 పోస్టులు నవరత్నాల హామీలు అమలులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఒకేసారి రాష్ట్రంలో 1.29 లక్షల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా జిల్లాలో 7,814 పోస్టులు భర్తీ కానున్నాయి. మూడు కేటగిరీల్లో భర్తీ కానున్న ఈ పోస్టుల కోసం నిరుద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లాలో పోస్టుల వివరాలు పంచాయతీ సెక్రటరీలు–472, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు–250, మహిళా పోలీసు–925, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్–232, విలేజ్ సర్వేయర్–665, ఇంజినీరింగ్ అసిస్టెంట్–665, వార్డు ఎమినిటీస్–260, విలేజీ అగ్రికల్చరల్ అసిస్టెంట్–537, విలేజీ హార్టికల్చరల్–159, ఏనిమల్స్ హజ్బెండరీ–626, ఏఎన్ఎం–850, విలేజీ ఫిషరీస్–75, డిజిటల్ అసిస్టెంట్–665, విలేజీ సెరీకల్చర్–3, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్–171, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ–260, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ–163, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ–171 పోస్టులు ఉన్నాయి. కోచింగ్ సెంటర్లు కళకళ ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. జిల్లాలో 15 కోచింగ్ సెంటర్లకు పైగా ఉన్నాయి. ఉద్యోగాల సాధనకు జిల్లా నుంచే కాకుండా తిరుపతి, శ్రీకాళహస్తి, కందుకూరు తదితర ప్రాంతాల నుంచి కోచింగ్ సెంటర్లకు విద్యార్థులు వస్తున్నారు. ఈ పోస్టులన్నీ 3 కేటగిరీల్లో భర్తీ కానుండడంతో ఎలాగైనా ఉద్యోగం పట్టాలనే కృతనిశ్చయంతో కోచింగ్కు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరి నుంచి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరికి నెల పాటు కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ అవకాశం ముందెన్నడూ రాదన్న ఆలోచనతో వేల సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగాలు పొందేందుకు కోచింగ్ సెంటర్లకు క్యూ కట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటున్న పరిస్థితి ఉంది. 150 మార్కులకు ప్రశ్నపత్రం ఈ ఉద్యోగాల భర్తీకి ఐఐటీ నుంచి డిగ్రీ, బీటెక్ వరకు చదువుకున్న వారు అర్హులు. కేటగిరీ–1లో మొదటి పేపరు 75, రెండో పేపరు 75 కలిపి మొత్తం 150 మార్కులకు జనరల్ స్టడీస్ ఉంటుంది. కేటగిరీ–2, కేటగిరీ–3లో మొదటి పేపరులో జనరల్ స్టడీస్ 50 మార్కులకు, సబ్జెక్ట్కు సంబంధించి 100 మార్కులు ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. అయితే ఈ పరీక్ష విధానంలో మైనస్ మార్కులు ఉంటాయి. ప్రతి 4 తప్పులకు ఒక మార్కును తగ్గిస్తారు. ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సు 42 ఏళ్ల లోపు వారు అర్హులు. ఉద్యోగాల్లో స్థానికతకు ప్రాధాన్యం ఇచ్చారు. మెరిట్ ప్రాతిపదికగా స్థానికులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం ఉద్యోగాలు కల్పిస్తారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. పోస్టును బట్టి వేతనం రూ.14,600 నుంచి రూ.44,870 వరకు చెల్లించనున్నారు. మహిళలకు సువర్ణావకాశం గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగాలతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. చరిత్రలో వారికి ఉద్యోగ కల్పనలో సువర్ణవకాశం లభించింది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఏఎన్ఎం, మహిళా పోలీసు వలంటీర్, సంక్షేమ సహాయకుల పోస్టులను పూర్తిగా కేటాయించారు. వీటితో పాటు మిగిలిని అన్ని ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ ఉంది. దీంతో పాటు ఓపెన్ కేటగిరీల్లోనూ మహిళలు పోటీ పడవచ్చు. చాలా ఆనందంగా ఉంది పెద్ద మొత్తంలో పోస్టులు భర్తీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. కొద్దిగా కష్టపడితే ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. – తిరుపతి రవికుమార్, దగదర్తి మహిళలకు మంచి అవకాశం సచివాలయ ఉద్యోగాల భర్తీలో మహిళలకు మంచి అవకాశాలు కల్పించారు. ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా మహిళలకు ఎన్నో ఉద్యోగావకాశాలు కల్పించారు. మహిళలకు ఇది సువర్ణావకాశం. – జి.లీనా, నెల్లూరు పోస్టుల భర్తీ అభినందనీయం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1.29 లక్షల ఉద్యోగాలు కల్పించడం అభినందనీ యం. ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. దేశ చరిత్రలో ఇన్ని ఉద్యోగాలు ఎప్పు డూ కల్పించలేదు. – ఎస్.బ్రిజిత, చిల్లకూరు చరిత్రలో సువర్ణాధ్యాయం దేశ చరిత్రలో ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించడం సువర్ణాధ్యాయం. పోస్టుల భర్తీ వల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్రామ సచివాలయాల వల్ల మండల కార్యాయాలకు వెళ్లకుండా గ్రామ పరిధిలోనే సమస్యలను పరిష్కరించకోవచ్చు. – హరిబాబు, శ్రీహర్ష కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు లక్షలాది నిరుద్యోగులకు లబ్ధి ఉద్యోగాల భర్తీతో లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని చేపట్టలేదు. ఇదో మంచి అవకాశం. ఉద్యోగాలకు ఎంపికైన వారిని రెండేళ్లలో రెగ్యులర్ చేస్తామని చెప్పడం అభినందనీయం. – షణ్ముఖాచారి, శ్రీహర్ష కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు -
పార్టీలకు అతీతంగా నవరత్నాలు : బుగ్గన
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. శనివారం కర్నూల్లో జిల్లాలో పర్యటించిన ఆయన.. మీడియా సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మహిళలను పెద్ద ఎత్తున మోసం చేశారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసిం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని బుగ్గన మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని మంత్రి తెలిపారు. -
అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసి.. తానే అడ్డంగా బుక్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సంబంధించి పెన్షన్ ప్రకటనపై ఓ పేపర్ కటింగ్ను చూపిస్తూ.. ఆ పార్టీ నేతలు రాద్ధాంతం చేశారు. ఇదే అంశంపై అధికార పక్ష సభ్యులు పదే పదే వివరణ ఇచ్చినా.. స్వయంగా వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను సభలో చదివి వినిపించినా.. దీనికి సంబంధించిన వీడియోను రెండుసార్లు చేసినా చంద్రబాబు అదే అంశాన్ని లేవనెత్తారు. ఈ విధంగా పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఒక పేపర్ కటింగ్పై ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూడా సూచించారు. అయినా, చంద్రబాబు తీరు మారకపోవడంతో.. సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించుకొని.. ఈ విషయమై పూర్తి స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష నేత చూపిస్తున్న పేపర్ కటింగ్ 18-10-2017నాటిదని, ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇస్తూ.. 2018 సెప్టెంబర్ మూడో తేదీన విశాఖపట్నం మాడుగుల నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుండగా.. వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రకటించిన విషయాన్ని సీఎం సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సభాపతి అనుమతితో సభలో ప్లే చేయించారు. ఈ వీడియోతో చంద్రబాబు డొల్లతనం బట్టబయలు అయింది. వీడియోలో ఏముందంటే.. పాదయాత్రలో భాగంగా మాడుగుల నియోజకవర్గంలో కే.కోటపాడులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ పథకం స్థానంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే.. ‘మేం అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే నవరత్నాల్లో ఇది. నాన్నగారు కలలు కన్నట్టు ప్రతి అక్కా, ప్రతి చెల్లె లక్షాధికారి కావాలి. వారు సంతోషంగా ఉండాలి. వారు సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే వ్యక్తిని నేను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అక్కలు అనారోగ్యం కారణంగా, మరో కారణంగానో వారం రోజులు పనులకు వెళ్లకపోతే.. వారు ఇంట్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో ఆ వర్గాల అక్కలకు తోడుగా ఉండాలని 45 ఏళ్లుకు పెన్షన్ ఇవ్వాలని నేను చెబితే.. 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటని కొందరు వెటకారం చేశారు. వెటకారం చేస్తూ వారు చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకానికి నాందిపలుకుతున్నాం. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు, ప్రతి కుటుంబానికి అక్షరాల 75వేల రూపాయలు ఉచితంగా ఇస్తాం. రెండో ఏడాది నుంచి దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పాదర్శకతతో, ఏమాత్రం అవినీతి తావు లేకుండా.. ప్రతి అక్కకు అందేవిధంగాచూస్తాం’ అని వైఎస్ జగన్ వీడియోలో తెలిపారు. ఈ వీడియోలో ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ.. ఇందులో వక్రీకరణకు తావులేనప్పటికీ.. ఈ అంశాన్ని పట్టుకొని విలువైన సభా సమయాన్ని ప్రతిపక్ష సభ్యులు వృధా చేస్తున్నారని వైఎస్ జగన్ సభలో పేర్కొన్నారు. ఈ విషయంలోనూ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి పెద్ద మనిషి ఈ శాసనసభలో ఉండటం నిజంగా బాధపడాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ అంశానికి ఫుల్స్టాప్ పెట్టి.. కీలక బిల్లులపై చర్చ చేపట్టాలని సభాపతిని కోరారు. చదవండి: ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు ప్రవర్తన! అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్ ప్రూఫ్ గోడ కట్టండి! అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ -
ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు మేలు చేకూర్చే చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుండటంతో తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఆక్రోశంతో, ఈర్ష్యతో చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చూపిస్తున్న పేపర్ కటింగ్ను స్వయంగా పరిశీలించి.. దానిపై సభా నాయకుడు వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష నేత చూపిస్తున్న పేపర్ కటింగ్ 18-10-2017నాటిదని, ఈ అంశం మీద స్పష్టత ఇస్తూ.. 2018 సెప్టెంబర్ మూడో తేదీన విశాఖపట్నం మాడుగుల నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుండగా.. వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రకటించిన విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏ నేపథ్యంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రకటించామో కూడా పాదయాత్రలోనే వివరంగా ప్రజలకు తెలిపినట్టు వెల్లడించారు. పాదయాత్ర సందర్భంగా కనీసం ఓ పది సమావేశాల్లో ఈ విషయమై స్పష్టంగా ప్రజలకు చెప్పామన్నారు. రెండు నెలలపాటు జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని స్పష్టం చేశారు. వైఎస్సార్ చేయూత పథకాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ వివరంగా చేర్చిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చంద్రబాబు అధికకారంలో ఉన్నప్పుడు ఏ రోజు పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు, బలహీనవర్గాల గురించి ఆలోచించామని, మొట్టమొదటి శాసనసభలోనే వారి గురించి చరిత్రాత్మక చట్టాలను తీసుకొస్తున్నామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా నామినేషన్ పనుల్లో, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పునరుద్ఘాటించారు. అందులోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ.. 50శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఉండేలా నిర్ణయం తీసుకున్నామని, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించామని వెల్లడించారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన ఈ బిల్లులతో ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దుర్బుద్ధితో చంద్రబాబు నిన్నటి నుంచి సభను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. చదవండి : అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు! అబద్ధాలు ఆడటం మాకు తెలియదు: సీఎం జగన్ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్ ప్రూఫ్ గోడ కట్టండి! -
ప్రజా సంకల్ప జాతర
సాక్షి, తూర్పు గోదావరి: ఎన్నో ఆశలు.. మరెన్నో సమస్యలు.. ఇంకెన్నో వినతులు.. విన్నారు.. నేనున్నా అన్నారు.. భరోసా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇంకేముంది ప్రజలే గెలిపించుకున్నారు. పగ్గాలు చేపట్టిందే తడవుగా నవోదయానికి నాందిగా నవరత్న మాలికలను అందజేసే పనిలో నిమిషం ఖాళీ లేకుండా ముందుకు సాగిపోతున్నారు. మమ్మల్ని వదిలేశారు అనే మాట లేకుండా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతౌల్యం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్వయంగా భూమిని సాగు చేస్తున్న రైతు ఏ మేరకు లబ్ధి పొందుతున్నాడో.. అదే స్థాయిలో కౌలు రైతుకూ నేనున్నా అంటూ భరోసా ఇచ్చి చేతల్లోనూ రైతు బాంధవుడని అనిపించుకున్నారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి మొదలుకొని ధరల స్థిరీకరణ వరకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అలాగే ఆశా కార్యకర్తల వేతనాల పెంపుతో ఆయా వర్గాలు ఎంతో హుందాగా బతికేందుకు ఆసరా కల్పించారు. అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు రూ.వెయ్యి పెంచడంతో వారి ఆనందానికి అవధులు లేవు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు మానసిక స్థైర్యం కల్పించారు. ఇక ఆక్వా రంగం అభివృద్ధికి విద్యుత్ చార్జీల తగ్గింపు, ఏజెన్సీ ప్రాంతాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ నిర్ణయాల పట్ల ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అలాగే ఆలయ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించే నిర్ణయం భగవంతుడి ముందు అంతా సమానమని చెప్పకనే చెప్తూ వివక్షకు తావులేని ప్ర భుత్వం తమదని చాటి చెప్పారు. ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న మద్యపానాన్ని దశలవారీగా తగ్గించే విధంగా మొదట బెల్టు దుకాణాల పైనా.. తరువాత మద్యం దుకాణాల తగ్గింపుపైనా చకచకా నిర్ణయాలు తీసుకుని అక్కచెల్లెమ్మల చేత ఇది కదా జగనన్న ప్రభుత్వం అంటే అనిపించేలా సాగిపోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంగన్వాడీల్లో ఆనందోత్సాహాలు కాకినాడ సిటీ: జిల్లాలోని అంగన్వాడీలకు జీతాల పెంపు ప్రతిపాదన కేబినెట్ ఆమోదం పొందడంతో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. చిరుద్యోగులపై సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలను ఆయా వర్గాలు అభినందిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,545 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 5,113 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 432 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. 5,113 మంది అంగన్వాడీ హెల్పర్లు (ఆయాలు) ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తకు గతంలో రూ.10,500 వేతనం ఉండగా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1000 అదనంగా పెంచడంతో వీరికి వేతనం రూ.11,500 పెరిగింది. ఆయాకు గతంలో రూ.6 వేల వేతనం ఉంటే ఇప్పుడు రూ.1000 పెంచడంతో వేతనం రూ.7 వేలు అయ్యింది. తాజా వేతనాలు జూలై నెల నుంచే అమలులోకి వస్తున్నాయి. ఈ మేరకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలో సుమారు 11 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ కార్యకర్తలకు నెలకు రూ.1.1 కోటి వేతనాలు అదనంగా చెల్లించనున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. గ్రామాల్లో కొలువుల జాతరే బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోను పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజల్లో మమేకమై, రాష్ట్రంలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, గ్రామాల్లోని సమస్యలు తెలుసుకొన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక్కో గ్రామంలో పదిమందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 1072 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 24,440 మంది గ్రామ వలంటీర్ పోస్టులు, 12,700కు పైగా గ్రామ సచివాలయాల్లో పోస్టులు మంజూరు కానున్నాయి. జగన్మోహన్రెడ్డి అన్నమాట ప్రకారం ఆగస్టు 15 నాటికి వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమించి అక్టోబర్ రెండు నుంచి గ్రామ సచివాలయాలకు ఊపిరిపోయడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక్కో గ్రామానికి పది మందిని ఉద్యోగాల్లో నియమించడం, ప్రతి కుటుంబానికి ఒక వలంటీర్ను నియమించడం వల్ల గ్రామ ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్ సెంటర్కు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా మీ సమస్యని సంబంధిత అధికారులకు తెలియజేస్తాం అనేవారు కానీ సమస్యలు మాత్రం పరిష్కారమయ్యేవి కాదు. ఇప్పడు అలా కాకుండా సీఎం కాల్సెంటర్కు వచ్చిన కాల్స్ నేరుగా వలంటీర్లకు రావడం, వాటిని 72 గంటల్లో పరిష్కరించే విధానమే ఈ గ్రామ సచివాలయాల లక్ష్యం. తద్వారా పల్లెలు దేశాభివృద్ధికి పట్టుగొమ్మలుగా తయారుకాగలవు. గిరిజనులకు వరం ఉచిత విద్యుత్ రంపచోడవరం: ఆదివాసీలకు నెలకు 200 యూనిట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించడంపై ఏజెన్సీ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు భారంగా మారిన తరుణంలో 200 యూనిట్ల వరకు గిరిజనులు ఉచితంగా విద్యుత్ వినియోగించుకోవచ్చని ప్రభుత్వం శుక్రవారం శాసన సభలో ప్రకటించింది. దీంతో విద్యుత్ బిల్లుల కోసం వినియోగించే డబ్బులు తమ ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 37,119 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. అలాగే చింతూరు ఐటీడీఏ పరిధిలో మరో 22 వేల మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. పాదయాత్ర ద్వారా గిరిజన పల్లెల్లో సమస్యలు తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టాక గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గిరిజనుల కష్టాలు తెలుసుకుని.. గ్రామాల్లో గిరిజనుల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి జగన్ గిరిజనులకు విద్యుత్ బిల్లులో 200 యూనిట్ల వరకూ ఉచితం ప్రకటించడం ఆనందంగా ఉంది. అరకొర ఆదాయంతో విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న మాకు ప్రభుత్వ ప్రకటన వరంగా మారింది. –బందం విజయలక్ష్మి , వీఆర్ పురం మద్యం.. పరిమితం మండపేట: దశల వారీ మద్యం నిషేధం అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే బెల్టు షాపులు రద్దు చేయగా, అక్టోబరు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపుల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న షాపుల్లో 25 శాతం రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 137 మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. నిబంధనలు పటిష్టంగా అమలు చేయడం ద్వారా విక్రయాలు భారీగా తగ్గనున్నాయి. జిల్లాలో 546 మద్యం షాపులు ఉండగా, 45 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. రోజుకు రూ.6.83 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా గత ప్రభుత్వం జిల్లాలో మద్యాన్ని ఏరులై పారించింది. 2015 నాటికి జిల్లాలో 54 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 480 ప్రైవేటు దుకాణాలు ఉండగా విక్రయాలు పెంచుకునేందుకు ప్రభుత్వ దుకాణా లను రద్దుచేసి ప్రైవేట్ పరం చేసింది. గుడి, బడి పట్టించుకోకుండా ఎక్కడపడితే అక్కడ దుకాణాలు వెలిశాయి. లిఫ్టింగ్ను తెరపైకి తెచ్చి బెల్టుషాపుల ఏర్పాటులో వ్యాపారులకు వెసులుబాటు ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్ర హైవేలకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలోకి తొక్కింది. ఈ హైవేలను మున్సిపల్ డెవలప్మెంట్ రోడ్డు (ఎండీఆర్)ల పరిధిలోకి తీసుకువచ్చి హైవేలలో యథేచ్ఛగా మద్యం విక్రయించుకునే అవకాశం కల్పించింది గత ప్రభుత్వం. దశలవారీ నిషేధం దిశగా అడుగులు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే దశలవారీగా మద్య నిషేధం హామీపై తొలి అడుగువేశారు జగన్. బెల్టు షాపు తీయకుంటే మద్యం దుకాణం లైసెన్సు రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అక్టోబర్ నుంచి ప్రభుత్వ అధీనంలోనే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ ప్రస్తుత షాపుల లైసెన్సును పొడిగించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలపై అధ్యయనం చేసిన ప్రత్యేక బృందాలు ఇచ్చిన నివేదికలపై గురువారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు దూరంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం వల్ల బెల్టు షాపులు ఉండవు. నిర్ణీత వేళల్లోనే దుకాణం తెరిచి ఉంచడంతో విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలకు బ్రేక్ పడుతుంది. దీంతో మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పలువురు అంటున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జాయింట్ కలెక్టర్
సాక్షి, కాకినాడ సిటీ(తూర్పు గోదావరి) : ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన కర్తవ్యమని జిల్లాకు కొత్త జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డి.లక్ష్మీశ అన్నారు. ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ‘సాక్షి’తో మాట్లాడారు. తన అనుభవాలను, మనోభావాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మాది కర్నాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలోని హాళుగుండనహాళీ అనే చిన్న పల్లెటూరు. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. నా తల్లిదండ్రులు లక్ష్మమ్మ, గంగముత్తయ్య వ్యవసాయం చేస్తుంటారు. ఒక అన్న, ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. నా బాల్యం అంతా కర్నాటకలోనే సాగింది. వ్యవసాయ కుటుంబం కావడంతో బీఎస్సీ అగ్రికల్చర్ చేసి అదే సబ్జెక్టులో పీహెచ్డీ చేశాను. అమ్మ కోరిక మేరకు ఐఏఎస్ చదివేందుకు ఢిల్లీ వెళ్లాను. అక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష కోసం చదివాను. 2010లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యాను. అదే సమయంలో వ్యవసాయశాఖ కృషి విజ్ఞాన్ కేంద్రంలో సైంటిస్టుగా పోస్టింగ్ వచ్చింది. అప్పట్లో ప్రజలకు సేవ చేయాలన్నా, అమ్మ ఆశయం నెరవేరాలన్నా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసే కరెక్ట్ అని భావించి దానిలో చేరాను. అయితే అమ్మ కోరిక ప్రకారం ఐఏఎస్కు ఎంపిక కావాలనే ఆశయంతో మరోమారు ప్రయత్నించాను. ఇలా నాలుగో సారి 2013 బ్యాచ్లో ఐఏఎస్కు ఎంపికయ్యాను. అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం సాకారమైంది. జేసీగా తూర్పులోనే తొలి పోస్టింగ్ 2013లో ఐఏఎస్గా ఎన్నిక అయిన తరువాత మొట్టమొదటిగా కర్నూలు జిల్లాలో ట్రైనీ కలెక్టర్గా చేరాను. అనంతరం నూజివీడులో సబ్ కలెక్టర్గా పని చేశాను. అక్కడ నుంచి 2016లో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్గా వెళ్లాను. అక్కడ పని చేస్తుండగా బదిలీ చేయడంతో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా వచ్చాను. నూజివీడులో సబ్ కలెక్టర్గా పని చేసిన సమయంలో ఎయిర్పోర్టుకు 450 ఎకరాల భూమిని ఫిల్లింగ్ చేశాను. పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి 1,400 ఎకరాలు సేకరించాం. కృష్ణా పుష్కరాల నిర్వహణలో ఇన్చార్జిగా పని చేశాను. జిల్లాను పూర్తి అవగాహన చేసుకుంటాను. మెరుగైన సేవల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాను. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పథకాలను పేద వర్గాల ప్రజలకు నేరుగా చేరేందుకు కృషి చేస్తాను. భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడతాను. రైతులు నిత్యం ఎదుర్కొనే భూ సమస్యలు, పట్టాదారు పాస్పుస్తకాలు, మ్యుటేషన్స్, ఒకరి భూమి మరొకరి పేరిట ఆన్లైన్ చేయడం, భూమి కొలతలు, చుక్కల భూములు తదితర అనేక సమస్యలు ఉన్నాయి. జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకున్న అనంతరం రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆయనతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు చేపడతాం. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం, తొండంగి తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ భూములను సేకరించారు. ఆ భూములను పరిశీలించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాం. అదే విధంగా సివిల్సప్లైస్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం. రైతులు పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తాం. ప్రభుత్వ లక్ష్యం మేరకు పేదలకు ప్రభుత్వం అందించే బియ్యం, పంచదార, కందిపప్పు తదితర నిత్యావసర సరుకులు నేరుగా పేద ప్రజలకు చేరేందుకు చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో పని చేయడం అదృష్టం వ్యవసాయ ప్రధానమైన, ధాన్యాగారంగా పేరున్న తూర్పుగోదావరి జిల్లాలో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాది వ్యవసాయ కుటుంబం కావడంతో వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అదే ఉద్దేశంతో బీఎస్సీ అగ్రికల్చర్ చదివి పీహెచ్డీ చేశాను. రైతు బాగుంటేనే రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం బాగుంటుందని నేను నమ్మడంతో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేసే పథకాలు నేరుగా పేద రైతుకు చేరేలా ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తాను. సీఎం జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో అవినీతిరహిత పాలన సాగిస్తూ, ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని పేదలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాను. అధికారులు కూడా అందుకు అనుగుణంగానే పనిచేయాలి. ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తా. ప్రజలకు జవాబుదారీగానే పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రెవెన్యూలో అనేక రకాల భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా పని చేస్తాం. అమ్మ చెప్పింది.. అమ్మ నన్ను ఓ ఉన్నతమైన వ్యక్తిగా, పది మందికి సేవ చేసే వాడిగా చూడాలనుకొంది. బాగా చదువుకుంటేనే అది సాధ్యమవుతుందనుకున్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆదర్శంగా తీసుకుని, అమ్మ ఆశయం నెరవేర్చాలని భావించాను. పేదరికంలో ఉన్నా నేను ఉన్నతస్థాయికి వెళ్లి పేదలకు సేవలు చేయాలన్న అమ్మ కోరికను నెరవేర్చాలని సంకల్పించుకున్నాను. ఒక్క ఐఏఎస్తోనే అది సాధ్యమని భావించాను. సాధించాను. –డి.లక్ష్మీశ -
ప్లీజ్.. నో అడ్మిషన్
భీమవరం(పశ్చిమ గోదావరి) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న ‘అమ్మఒడి’ పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. భీమవరం పట్టణం నాచువారి సెంటర్లోని పొట్టిశ్రీరాములు మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు భారీ స్థాయిలో జరిగాయి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటుచేశారు. మంగళవారం పాఠశాలను సందర్శించిన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్వీ రమణ పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య ప్రకారం పాఠశాలలో 750 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లకు అవకాశం ఉందని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 850 మించిపోవడంతో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటుచేశారు. నూతనంగా భవన నిర్మిస్తే విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు అవకాశం ఉందని హెచ్ఎం చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కేవీవీ భోగేశ్వరరావు, ఉపాధ్యాయులు వీఎం రాధాకృష్ణ, జె సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సమస్యలు తీర్చేందుకే ‘స్పందన’
సాక్షి, పులివెందుల(కడప) : ప్రజల సమస్యలు తీర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్వగృహం వద్ద ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఆలకించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందుకే ప్రజావేదిక తొలగించడానికి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజా వేదికే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ఎవరూ స్వాధీనం చేసుకున్నా చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ అధికారం చేపట్టి నెల రోజులు కూడా గడవకమునుపే తనదైన శైలిలో పరిపాలన చేస్తున్నారన్నారు. జగన్ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు చూసి ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు తమ అవినీతి కప్పిపుచ్చుకునేందుకు బీజేపీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కచ్చితంగా సాధించి తీరుతామన్నారు. కేంద్రంలోని బీజేపీకి ఎలాంటి మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కృషి చేస్తామన్నారు. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అండగా ఉండి ముందుకెళతామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామిలను ఏ ఒక్కటి కూడా మరిచిపోకుండా అమలు చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లుగా ప్రజలకు పాలకులుగా కాకుండా సేవకులుగా ఉండి సేవలందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు సువర్ణపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. మంగళవారం ఉదయం పులివెందుల వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్రెడ్డితో కలిసి ఆర్ఎంపీ డాక్టర్లు వైఎస్ అవినాష్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎంపీతో మొరపెట్టుకున్నారు. 429జీఓను పునరుద్ధరించాలని విన్నవించుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించారు. -
కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్
-
మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ‘మనం పాలకులం కాదు.. సేవకులం’ అని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్, అధికారి దగ్గర ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించాలన్నారు. సోమవారం ఆయన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కలెక్టర్లు ఏ విధంగా పని చేయాలో తెలియజేశారు. పై స్థాయిలో తాను నిర్ణయాలు తీసుకుంటే.. కింది స్థాయిలో అమలు చేసేది కలక్టర్లేనని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ఇంకా ఏమన్నారంటే.. చిరునవ్వుతో పలకరించాలి.. ‘మేనిఫెస్టోను గొప్పగా అమలు చేస్తామని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. నా ద్వారా మీకు అధికారం ఇచ్చారు. ఏపీ చరిత్రలో ఇంత మెజారిటీ ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. ప్రజలు మనల్ని నమ్మారు కాబట్టి.. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలి. రేపటి ఎన్నికల్లో మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పుకుని ఓట్లు అడగాలి. దీనికి మీ అందరి సహకారం అవసరం. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలది కీలక పాత్ర. రెండు లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తే వారు ఎమ్మెల్యేలు అయ్యారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలి. ఎమ్మెల్యేలు, ప్రజలు మీదగ్గరికి వచ్చినప్పుడు చిరునవ్వుతో పలకరించాలి. అవినీతి, దోపిడీ వ్యవహారాలు చేస్తే ఈ ప్రభుత్వం సహించదు. ఏ స్థాయిలో ఉన్న సరే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజాస్వామ్యానికి ఎమ్మెల్యేలు,అధికారులు రెండు కళ్లలాంటి వారు. కలెక్టర్లు ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వర్గాల్లోని ప్రతి అర్హుడిగా సంక్షేమపథకాలు అందించాలి. అందిచకపోతే దేవుడి దృష్టిలో తప్పు చేసిన వాళ్లం అవుతాం. ఈ వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి. వారు ఆర్థికంగా ఎదిగేలా మన ప్రతి అడుగు వారికి దగ్గరుండాలి. ఇందుకోసమే నవరత్నాలు ప్రకటించాం. మావాళ్లు చెప్పినా వినవద్దు.. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు ఇవేవి చూడకుండా ఈ పథకాలు అందజేయాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు ఇవ్వద్దంటే పట్టించుకోవద్దు. మనకు ఓటు వేయనివారికి కూడా మంచి చేయాలి. మనం చేసిన మంచితో వారు మళ్లీ ఓట్లేసేలా చేసుకోవాలి. ఎన్నికలయ్యేవరకే రాజకీయాలు.. ఎన్నికలయ్యాక అందరు మనవాళ్లే. పథకాలు అందరికీ అందించేందుకే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడితే.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్ తీసుకుంటారు. ప్రతి సంక్షేమ పథకాన్ని డోర్ డెలివరీ చేస్తారు. ఇది చేసేటప్పుడు గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడవద్దు. వివక్ష చూపవద్దు. ఇలా చేయవద్దని రూ.5వేల జీతం ఇస్తున్నాం. అవినీతికి పాల్పడితే నేరుగా సీఎం ఆఫీస్కు కాల్ చేయవచ్చు. నేరుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. 50 ఇళ్ల పరిధే కాబట్టి విచారణకు పెద్దగా ఇబ్బంది ఏర్పడదు. తప్పు చేస్తే వెంటనే తొలగిస్తాం. ఇందులో ఏమాత్రం మొహమాటం పడవద్దని చెబుతున్నాను. ప్రభుత్వ యంత్రాగమంతా నిజాయితీగా పనిచేయాలి. గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదు. ప్రతి పనిలో పారదర్శకత కనిపించాలి. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వ్యవస్థలో మార్పు రావాలి. దేశం మొత్తం మనవైపు చూడాలి. మన రాష్ట్రాన్ని నమూనగా తీసుకోవాలి. చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండకూడదు.. ప్రజలు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి, పనుల కోసం ప్రజలు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. మన పనితీరు ఆధారంగా ఓట్లు వేస్తారు. మనం మంచి చేస్తే మళ్లీ గెలుస్తాం. ఎంత పెద్దవాళ్లు చెప్పినా అక్రమాలు, ఇసుక రవాణా, పేకాట క్లబ్లను ప్రోత్సహించొద్దు. గత ప్రభుత్వంలో బర్త్, డెత్ సర్టిఫికెట్, రేషన్ కావాలన్న లంచం. జీవిత బీమా కోసం కూడా లంచాలు తీసుకున్నారు. చివరకు బాత్రూం మంజూరు కావాలన్నా లంచం అడిగారు. మన ప్రభుత్వంలో ప్రజలకు ఆ లంచాలిచ్చే పరిస్థితి ఉండకూడదు. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగకూడదు. గ్రామస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. పైస్థాయిలో కాంట్రాక్ట్లు అంటేనే అవినీతనే స్థితికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకే రివర్స్ టెండరింగ్ను తీసుకొచ్చాం. ఎక్కడెక్కడ తప్పు జరిగిందో గుర్తించి రివర్స్ టెండరింగ్ వేస్తున్నాం. టెండరింగ్ ప్రీ క్వాలిఫికేషన్ను మారుస్తాం. చాలా మంది టెండరింగ్కు వచ్చేలా చేస్తాం. తక్కువ ఎవరైనా ఇస్తారా అని అడిగి మరి ఇస్తాం. ఏం మిగిలినా కూడా ప్రభుత్వానికి ఆదా చేస్తాం.’ అని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. చదవండి: ‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం -
నవశకానికి దిశానిర్దేశం
సాక్షి, విజయనగరం : అమరావతిలో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించి అజెండాను ప్రభుత్వం రెండురోజుల క్రితమే ఖరారు చేసింది. ఈ సదస్సులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నవరత్నాలపై చర్చకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో ఉన్న పలు పథకాల అమలు గురించి అజెండాలో చేర్చా రు. వీటితోపాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యలపైనా దృష్టిసారించారు. ముఖ్యంగా ఎనిమిది అంశాలపై ఫోకస్ చేశారు. అందులో మొదటిది గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వ్యవస్థతోపాటు ఆగస్టు 15వ తేదీ నుంచి విధుల్లోకి రానున్న గ్రామ వలంటీర్ల గురించి చర్చించాలని నిర్ణయించారు. ఆరో గ్యశ్రీ పథకం అమలు, 108, 104 సేవలు రెండో ప్రాధాన్యత అంశంగా చేర్పించారు. సెప్టెంబర్ నెల నుంచి ఇంటింటికి సరకులు పంపిణీ, సన్నబియ్యం పంపిణీ మూడో అంశంగా చేర్చారు. పాఠశాలల్లో పిల్లల నమో దు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ అంశం తర్వాత చర్చిస్తారు. కరువు, ప్రస్తుతం పంటలు సాగు పరిస్థితి, పశుగ్రాసం, తాగునీరు, విద్యుత్ సరఫరాపై సమీక్షిస్తారు. వైఎస్సార్ భద్రతా రాష్ట్రంలో జనరంజక పాలన మొదలైంది. వివిధ వర్గాలవారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయిలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటి అమలుపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. దానిపై ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందించారు. ఇక క్షేత్రస్థాయిలో అమలుకు అవసరమైన సూచనలు చేసేందుకు జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. నవరత్నాల అమలుకు సంబంధించి... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అవసరమైన జిల్లా సమాచారంతో కలెక్టర్ హరిజవహర్లాల్ అమరావతికి పయనమయ్యారు. పెన్షన్ల పంపిణీ, ఇళ్ల పట్టాలు పంపిణీ, కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీ తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. వీటన్నింటిపై అధి కా రుల నుంచి సమాచారం తీసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి వీటిపై మార్గనిర్దేశనం చేస్తారు. పూర్తి సమాచారంతో వెళ్లిన కలెక్టరు ముఖ్యమంత్రి జగన్హన్రెడ్డి నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్లాల్ శనివారం సాయంత్రం జిల్లా నుంచి వెళ్లారు. ఆదివారం స్థానికంగా పనులు చూసుకుని సోమవారం సమావేశానికి హాజరవుతారు. కలెక్టర్ల సదస్సు ముఖ్య ఉద్దేశానికి సంబంధించి ముందే ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఆ మేరకు పూర్తి సమాచారంతో కలెక్టర్ పయనమయ్యారు. కొత్త ముఖ్యమంత్రితో తొలి సదస్సు కావడంతో అజెండాలోని అంశాలకు సంబంధించిన సమాచారంతోపాటు... మరింత ఇతర సమాచారాన్ని కూడా కలెక్టర్ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. జిల్లా పరిస్థితులపై నివేదిక ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా జిల్లాలో పరిస్థితులను కలెక్టర్ హరి జవహర్లాల్ ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. జిల్లాలో 919 గ్రామపంచాయతీల్లో సచివాలయ ఏర్పాటు, సిబ్బంది నియామకంపై కసరత్తు చేసి తీసుకెళ్లారు. వారితోపాటు 50 కుటుంబాలకు ఒక వలంటీర్ నియామకానికి సంబంధించి నివేదిక తయారు చేశారు. అందులో జిల్లాలో 10,012 మంది వలంటీర్లు అవసరమని పేర్కొన్నారు. ⇔వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇప్పటికే జిల్లాలో 108 వాహనాలు 27, 104 వాహనాలు 19 ఉన్నట్లు కలెక్టర్ సీఎంకు నివేదించనున్నారు. వీటికి అదనంగా 108 వాహనాలు 9, 104 వాహనాలు 8 కావాలని కోరేందుకు సిద్ధమయ్యారు. ⇔ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ అంశం గురించి కలెక్టర్ సీఎంకు నివేదిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 7,13,053 కార్డులు ఉన్నాయని, ఆయా కార్డులకు 1,20,784 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉందని, ఇందుకు అవసరమయ్యే వలంటీర్ల గురించి కూడా కలెక్టర్ వివరిస్తారు. ⇔విద్యకు సంబంధించి పిల్లల నమోదు, పుస్తకాల పంపిణీ, యూనిఫాం పంపిణీ గురించి నివేదిస్తారు. జిల్లాలో ఈ ఏడాది 1,44,356 మంది పిల్లలు బడిలో ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి మూడు జతల యూనిఫాం లెక్కన పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 54.90శాతం పంపిణీ చేశారు. పుస్తకాలు పంపిణీ కూడా 80శాతం పూర్తయింది. మిగతా పంపిణీకి సంబంధించి కార్యాచరణ వివరించనున్నారు. అమ్మ ఒడి పథకంలో అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్యపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు రాగా ఆ విషయం కలెక్టరు వివరించనున్నారు. ⇔జిల్లాలో గతేడాది ఖరీఫ్, రబీలో ప్రకటించిన కరువు మండలాలకు రావాల్సిన పంటల నష్ట పరి హారం గురించి కలెక్టర్ ప్రస్తావించనున్నారు. ఖరీ ఫ్లో 8,917 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇందుకు 24,320మంది రైతులకు రూ.13.37 కోట్లు పంటల నష్ట పరిహారం రావాల్సి ఉంది. రబీలో 9388 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 30,893మంది రైతులకు రూ.9.25కోట్లు పరిహా రం రావాలి. సదస్సులో కలెక్టర్ ఈ అంశం ప్రస్తావించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షాల ఆలస్యం తదితర అంశాలు వల్ల కలిగే ఇబ్బందులు నివేదించనున్నారు. ⇔జిల్లాలో 1,06,126మంది పెన్షన్లు పొందుతున్నారు. పెన్షన్లు మొత్తం పెంపు తర్వాత నెలకు రూ.71.35కోట్లు అవసరం అవుతుంది. ఈ అంశంతో పాటు 60 ఏళ్లకు తగ్గిస్తే అదనంగా పెరిగే పెన్షనర్ల గురించి కూడా చర్చించనున్నారు. ⇔జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 23,405 మందికి ఇళ్ల పట్టాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వం కొంతమందికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని చూస్తోంది. వీటిపై వివరాలు కోరింది. అయితే ప్రస్తుతం దరఖాస్తులు పెండింగ్లో ఉండే లబ్ధిదారులు లేరని కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. ⇔ కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు 13,218 జారీ చేశారు. ఈ వివరాలు కోరడంతో కలెక్టర్ సమాచారం సేకరించారు. దీని ఆధారంగా నూతన విధివిధానాలు రూపొందే అవకాశం ఉంది. -
విజయసాయి రెడ్డికి కేబినెట్ హోదా
-
విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయసాయి రెడ్డికి కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ భవన్ కార్యాలయంగా విజయసాయి రెడ్డి విధులు నిర్వహించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా ఉంటూ సంస్థాగత నిర్మాణంలోనూ ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. ‘నవరత్నాలు’కు ప్రత్యేక అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నవరత్నాలు’ పథకం అమలుకు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.శామ్యూల్ నవరత్నాల మానిటరింగ్ కమిటీ వైస్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నవరత్నాలు అమలు శాఖలను సమీక్షించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా వ్యవహరించనున్న శామ్యూల్కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. -
తుని: నాడు తండ్రి..నేడు తనయుడు..
సాక్షి, తుని రూరల్(తూర్పు గోదావరి): సార్వత్రిక ఎన్నికల ముందు నవరత్నాల పథకాల్లో భాగంగా వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం నియోజకవర్గంలో ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలు వరకు, ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటలు వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు ట్రాన్స్కో అధికారులు ట్రయిల్రన్ నిర్వహించారు. ట్రయిల్రన్ నిర్వహించి ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లలో మార్పులు గమనిస్తున్నట్టు ట్రాన్స్కో అధికారులు తెలిపారు. ఏ విధమైన ఒత్తిడి ఉందో ఉన్నత అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు తుని రూరల్ ఏఈ కామేశ్వర శాస్త్రి తెలిపారు. నియోజకవర్గంలో 3,593 వ్యవసాయ విద్యుత్ బోరుబావులు ఉన్నాయి. అమలులో జగన్ వాగ్దానం నవరత్నాల పథకాల్లో అమలు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ట్రాన్స్కో అధికారులు 9గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఏడు గంటలు ఉచిత విద్యుత్ అందించి రైతుల గుండెళ్లో నిలిచిపోయారు. దివంగత రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రైతులకు అండగా నిలిచేందుకు పగలే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రాత్రివేళల్లో సరఫరా అయ్యే ఉచిత విద్యుత్ కోసం పంట పొలాల్లో కష్టపడుతూ, విద్యాద్ఘాతానికి గురై ఎంతో మంది కర్షకులు మృత్యువాత పడ్డారు. అటువంటి సంఘటనలు తన ప్రభుత్వంలో జరగకుడదన్న సంకల్పంతో పగలే రెండు షిఫ్టులుగా ఉచిత విద్యుత్ను సరఫరాకు ఆదేశించారు. ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో... తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ను సరఫరా చేయాలన్న రైతులు కల నెరవేరనుంది. ఉదయం ఐదు గంటల నుంచి మొదటి షిప్టు, పది గంటల నుంచి రెండో షిప్టు ఉచిత విద్యుత్ను తొమ్మిది గంటలు సరఫరా చేయనున్నారు. అనుకున్నట్టు రెండు మూడు రోజులు ట్రయిల్ రన్లు నిర్వహించి అవాంతరాలు సవరించి పట్టపగలే వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసి సాగుకు కొత్త కళ తీసుకురానున్నారు. తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరా సమర్థవంతంగా అమలయితే వేలాది ఎకరాలకు సాగునీరు లభించడంతో మెట్ట భూములు సస్యశ్యామలమవుతాయిన రైతులు పేర్కొన్నారు. నాడు తండ్రి, నేడు తనయుడు రైతులు కష్టాలను కళ్లారా చూసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఏడు గంటలు అందిస్తే, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పగలే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అమలకు చర్యలు చేపట్టడం వ్యవసాయం, రైతులపై తండ్రికొడుకులకు ఉన్న నిబద్ధత తెలియజేస్తుంది. – నాగం దొరబాబు, రైతు, చామవరం కరెంట్ కష్టాలు తీరినట్టే పగలనక రాత్రనక ఉచిత విద్యుత్ ఎప్పుడు సరఫరా అవుతుందాని పంట పొలాల్లో కాపలాకాసే రోజులు పోయాయి. వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందించడం సహసమే. రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పాదయాత్రలో చూసిన ముఖ్యమంత్రి జగన్ు రైతులకు కరెంట్ కష్టాలను తీర్చారు. – పరవాడ అప్పారావు, రైతు, కుమ్మరిలోవ వాణిజ్య సాగుకు ఊతం పట్టపగలే వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందించడం వాణిజ్య పంటల సాగుకు ఊతం ఇచ్చి నట్టయ్యింది. సూక్ష్మ పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ఎనిమిది నుంచి పది ఎకరాలకు సాగునీరు అందనుంది. పగలే భూగర్భ జలాలను తోడుకోవడం వల్ల రాత్రులు పొలాల్లో కష్టాలు పడాల్సిన పనిలేదు. – దాట్ల సతీష్ వర్మ, రైతు, తేటగుంట -
అలా చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ : కొడాలి నాని
సాక్షి, అమరావతి : ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటు తన పాలనలో వైవిధ్యం కనబరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మేనిఫెస్టోనే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని తెలిపిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తామని ఇప్పటికే వైఎస్ జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. శనివారం తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చిన ఆయన ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. 27 శాతం ఐఆర్ను ప్రకటించడంతో పాటు సీపీఎస్ రద్దుపై ఆదివారం జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు పర్చేవిధంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక సమతూల్యత పాటిస్తూ బడుగు బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన నవరత్నాలకు సంబంధించిన వాల్ పెయింట్స్ను సీఎం వైఎస్ జగన్ సచివాలయంలో పెట్టించారు. 1.ఆరోగ్యశ్రీ 2. వైఎస్సార్ రైతు భరోసా 3. అమ్మ ఒడి 4. ఫీజు రీయింబర్స్మెంట్ 5. వైఎస్సార్ ఆసరా ఫించన్లు 6. డ్వాక్రా రుణాలు 7. పక్కాఇళ్లు 8. మద్య నిషేధం 9. జలయజ్ఞం వంటి వాల్పెయింట్స్ను వరుసగా ఏర్పాటు చేయించారు. ఈ విషయాన్ని మంత్రి కొడాలి నాని తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ‘మ్యానిఫెస్టోను తూచ తప్పకుండ అమలు చేస్తానని చెప్తూ ఇలా సచివాలయంలో గోడల మీద వేయించిన ఏకైక సీఎం వైయస్ జగన్’ అని కొనియాడారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ఫించన్లపై తొలి సంతకం చేసిన వైఎస్ జగన్.. వైఎస్సార్ రైతు భరోసా అమలు దిశగా అడుగులు వేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రైతు కుటుంబం చేతికి నేరుగా రూ. 12,500లు పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 13,125 కోట్లు రైతులకు ప్రభుత్వం అందించనుంది. సమీక్ష సందర్భంగా రైతులకు ఏమేం చేయాలో అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మ్యానిఫెస్టోను తూచ తపకుండ అమలు చేస్తానని చెప్తూ ఇలా సచివాలయంలో గోడల మీద వేయించిన ఏకైక సీఎం వైయస్ జగన్@ysjagan #APCMYSJagan #YSJagan #ThatIsJagan pic.twitter.com/hxnhwL0WpV — Kodali Nani (@IamKodaliNani) June 8, 2019 -
తొలి హామీ జీవో జారీ చేసిన జగన్ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల పెంపుదలపై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వృద్ధుల పెన్షన్ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు కుదించారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తొలి జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అర్హులందరికీ జూలై 1 నుంచి కొత్త పెన్షన్ పథకం అందుతుంది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధులకు రూ. 2250, వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు చెల్లిస్తారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రసంగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి సంతకం వృద్ధులకు పింఛను పెంపు ఫైల్పై చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ ఈ ఏడాది జూన్ 1 వతేదీ నుంచి 2,250 పింఛను ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. దశలవారీగా రెండో ఏడాది మరో రూ.250, మూడో ఏడాది మరో రూ.250, నాల్గో ఏడాదికి పింఛను రూ.3 వేలకు పెంచుతానని వివరించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం జీవో జారీచేసింది. [ పెన్షన్ జీవో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాదయాత్ర
సాక్షి, దెందులూరు : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి పాదయాత్రగా ద్వారకా తిరుమల చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంతో పాటు, దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలన విజయవంతంగా సాగాలంటూ పాదయాత్ర చేశా. ఈ అయిదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు ‘నవరత్నాలు’ పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తా.’ అని హామీ ఇచ్చారు. కాగా టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్పై అబ్బయ్య చౌదరి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగంలో సుమారు 17 ఏళ్లు అనుభవం ఉన్న ఆయన...రాజకీయాలపై ఆసక్తితో వైఎస్సార్ సీపీలో చేరారు. దెందులూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. -
శ్రీకారం చుట్టుకుంది సంక్షేమ శకం
సంక్షేమ శకం శ్రీకారం చుట్టుకుంది. రాజన్న రాజ్యం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ప్రతి కుటుంబంలో వెలుగులు నింపేందుకు నవరత్నాలు నడుచుకుంటూ వస్తున్నాయి.అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జననేత వై.ఎస్.జగన్ నవ్యాంధ్ర సీఎంగా పట్టాభిషేకంతోనే విప్లవాత్మక నిర్ణయాలతో పాలనపై ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ఇంతకుముందే ప్రకటించిన నవరాత్నాల్లో తొలి రెండింటిని ప్రజలకు అందించే దిశగా తొలి అడుగులు వేశారు. సామాజిక పెన్షన్లను రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతామన్న హామీ అమల్లో తొలి దశగా రూ2250కి పెంచుతూ తొలి ఫైలుపై చేవ్రాలు చేసి.. పెన్షనర్లను మురిపించారు. ఈ నిర్ణయం ఫలితంగా విశాఖ జిల్లాలోని పెన్షనర్లకు రూ.16.76 కోట్ల మేరకు ప్రతి నెలా అదనపు లబ్ధి చేకూరుతుంది. ఇక గ్రామాల్లో అవినీతి రహిత పాలన.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రెండు లక్ష్యాల సాధనకు వీలుగా గ్రామ సురాజ్యానికి బాటలు వేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరు నియామకం.. అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి.. ఒక్కో దాంట్లో పది మందికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా.. జిల్లాలో 38,321 మందికి ఉపాధి లభిస్తుంది.తొలి అడుగులోనే లక్షలాది మందికి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్జగన్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సాక్షి, విశాఖపట్నం : ‘ప్రతి అవ్వకు.. ప్రతి తాతకు..’ అంటూ సభల్లో భరోసానిచ్చే జననేత మాట నిలబెట్టుకున్నారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను..’అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్సార్ పింఛన్ ఫైల్పై తొలి సంతకం చేశారు. జనహితమే తన నినాదమనడంతో పల్లెలు పండుగు చేసుకుంటున్నాయి. ప్రజారంజకమైన పాలన ప్రారంభమైంది. రాజన్న రాజ్యం వచ్చింది. సంక్షేమ రాజ్యం మొదలైంది. రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజల దిశదశను మారుస్తాయని బలంగా విశ్వసించే నవరత్నాల్లో ఒకటైన పెన్షన్ల పెంపు ఫైల్పై జనహృదయ నేత ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని చేశారు. అధికారంలోకి రాగానే పెన్షన్ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలి అడుగు వేశారు. ప్రస్తుతం రూ.2వేలు ఇస్తున్న పెన్షన్ను జూలై 1వ తేదీ నుంచి రూ.2250 పంపిణీ చేయనున్నారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఇస్తున్న రూ.1000 పింఛన్ మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతామని 2017లో జరిగిన పార్టీ ప్లీనరీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జగన్ రూ. రెండు వేలు పెంచుతామని చెప్పడంతో చంద్రబాబు రూ.2 వేలు పెంచుతూ ప్రకటన చేశాడు. ఫిబ్రవరి నుంచి అమలులోకి తీసుకొచ్చారు.అయినా ఆ అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు చంద్రబాబు మాటను విశ్వసించలేదు. జననేతకు జై కొట్టారు. అఖండ మెజార్టీతో గెలిపించి సీఎం చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం పెన్షన్ పెంపుపై చేయడంతో అంతా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది రూ.250 పెంచుతున్నట్టు ప్రకటించారు. అదే విధంగా రెండో ఏడాది రూ.500, మూడో ఏటా రూ.750, నాల్గో ఏడాది రూ.3వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 80 శాతం వికలత్వం ఉన్న దివ్యాంగులకు మాత్రమే రూ.3వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. మిగిలిన వారందరికి రూ.2వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. దీంతో మిగిలిన వారందరూ జూలై 1వ తేదీ నుంచి రూ.2250 చొప్పున పెన్షన్ పొందనున్నారు. దీంతో జిల్లాలో 4,19,236 మంది లబ్ధిపొందనున్నారు. ఈ విధంగా సామాజిక పెన్షన్ దారులకు అదనంగా రూ.16.76 కోట్ల మేర లబ్ధి కలుగనుంది. ఎంతో ఆసరా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన హామీని వెంటనే నిలుపుకున్నారు. వృద్ధాప్య పింఛన్ను రూ.2 వేల నుంచి రూ.2250కు పెంచారు. ఇది ఎంతో ఆనందంగా ఉంది. తనలాంటి వారికి మరింత ఆసరాగా నిలవనుంది.– మొల్లి సత్యవమ్మ, కశింకోట అవ్వాతాతలంటే అభిమానం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అవ్వాతాతలను గుర్తుపెట్టుకొని పింఛన్ పెంచడం చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన హామీలను వాయిదా వేయకుండా, పదవిలోకి వచ్చిన తొలిరోజే అమలు చేయడం చాలా గొప్ప విషయం. వచ్చే నెల నుంచి రూ.2250లు చేతికి రానున్నాయి. నా మందులకు, ఇతర ఖర్చులకు పనికివస్తాయి.– ఆళ్ల సూర్యకాంతం, జగన్నాథపురం, అక్కయ్యపాలెం తండ్రిని తలపించాడు ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్రెడ్డి వృద్ధులకు ఎంతో మేలు చేశారు. ఈ రోజు అతని బిడ్డ ముఖ్యమంత్రిగా వచ్చి మాలాంటి వాళ్లకు మరింత ఆసరా కల్పించారు. నెలకు రూ.2,250 పింఛన్ ఇవ్వడం మాకు వరమే. ఆ మహానుభావుడు పదికాలలపాటు చల్లగా ఉండాలి.– జెట్టి సన్యాసమ్మ, సబ్బవరం ఆయన మాటల్లో నిజాయతీ ఉంది ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛను పెంచుతున్నట్టు జగన్మోహన్రెడ్డి ముఖమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం సంతకం చేయడం ఎంతో అభినందనీయం. పింఛను పెంచి మాట నిలబెట్టుకున్నారు. ప్రతి ఏడాది పింఛను పెంచుతామని చెప్పడంలో నిజాయతీ కనిపించింది.–కంటి.లక్ష్మి. రాజన్నపేట, రోలుగుంట ఇచ్చిన మాట ప్రకారం.. పింఛన్లను రూ.3వేల వరకు పెంచుతామని ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి సంతకం చేయడం అభినందనీయం. పింఛన్దారులంతా జగనన్నకు రుణపడివుంటారు. జూన్ నుంచి రూ.2250 మేరకు పింఛన్ల పెంపు సంతోషదాయకం.– పి.జయమ్మ, గృహిణి, పెదవాల్తేరు -
నవరత్నాల అమలుపై వైఎస్ జగన్ కసరత్తు
-
నవరత్నాల అమలుపై కసరత్తు చేస్తోన్న జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిశ్చయ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. నవరత్నాల అమలుపై ఆయన కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఆ పథకాల అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నవరత్నాల్లోని ప్రతీ పథకంపై ఈ సమీక్షలో చర్చించారు. బడ్జెట్ కేటాయింపులపై చర్చ నవరత్నాల్లో ఏ పథకానికి ఎంత నిధులు అవసరం, వచ్చే బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేయాల్సి ఉంటుందనే అంశాలపై చర్చించారు. అలాగే నవరత్నాల్లో ఏ పథకాన్ని ఏ శాఖ ద్వారా అమలు చేయించాలనే విషయంపైన కూడా ఈ సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా కేబినెట్ కూర్పు చేసి నవరత్నాల అమలుపై కీలక నిర్ణయాలను తీసుకోవాలనే ఆలోచనలో జగన్మోహన్రెడ్డి ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు సాధ్యమైనంత త్వరగా నవరత్నాలను ప్రజలకు అందించాలనే తపన జగన్మోహన్రెడ్డిలో కనిపిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. లబ్దిదారుల గుర్తింపు... నవరత్నాల్లో ప్రతీ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా ఏర్పాట్లు చేసే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మోడీని కలిసి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నవరత్నాల విషయంలో కూడా ఆయన అంతే స్పీడుతో ముందుకు సాగుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 18లోగా కొత్త అసెంబ్లీ వచ్చే నెల 18వ తేదీలోగా కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రొటెం స్పీకర్ను ఎంపిక చేసిన తరువాత అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వచ్చే నెల 18వ తేదీలోగా పూర్తి కావాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ ఏర్పడ్డాక బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. -
ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి అడుగుతూనే ఉంటా
-
మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆదివారం ఆయన న్యూఢిల్లీలో ఏపీ భవన్లో ప్రెస్మీట్లో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించామని, రాష్ట్రానికి అన్నిరకాల సాయం అవసరమని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని జగన్ పేర్కొన్నారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన సాయం ఆలస్యం అయిందని, వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని పరిస్థితుల్ని ప్రధానికి వివరించామన్నారు. బాబు పాలనలో రూ.2లక్షల 57 వేలకోట్ల అప్పులు రాష్ట్రం విడిపోయేనాటికి 97వేల కోట్ల అప్పులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలో 2 లక్షల 57వేల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని జగన్ తెలిపారు. అప్పులపై ఏటా రూ.20వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. హోదా గురించి అడుగుతూ ఉంటా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా ఇచ్చేవరకూ ప్రధానిని తాము అడుగుతూనే ఉంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు చాలావరకూ అమలు చేయాల్సి ఉందన్నారు. ఒకవేళ బీజేపీకి 250 సీట్లు మాత్రమే వచ్చి ఉంటే...హోదాపై సంతకం పెట్టించుకుని మద్దతు ఇచ్చి ఉండేవాళ్లమన్నారు. అందుకే ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి గుర్తు చేస్తూనే ఉంటామన్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే మద్యపాన నిషేధంపై స్పష్టంగా చెప్పామని అన్నారు. మద్యపాన నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాకే 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడుగుతామన్నారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంధం ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావిస్తామని, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలయ్యేలా చూస్తామని జగన్ మరోసారి స్పష్టం చేశారు. విశ్వసనీయతకు ప్రజలు పట్టంగట్టారని, దాన్ని సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తామన్నారు. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తామన్నారు. కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశాను. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాల కోసం భేటీ జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు నిలుస్తామన్నారని తెలిపారు. వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం ఇవాళ్ట నుంచి ఆరు నెలల్లోగా ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు చేస్తాం. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత శాఖలవారీగా సమీక్ష నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేస్తాం. రాష్ట్రంలో అవినీతి అన్నది ఎక్కడా లేకుండా, పారదర్శక పాలన అందిస్తాం. మొత్తం వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్లు రద్దు చేస్తామన్నారు. ఇక యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సి ఉందని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజధాని భూముల్లో అతి పెద్ద కుంభకోణం అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసు. ఫలానా చోట రాజధాని వస్తుందని చంద్రబాబుకు ముందే తెలుసు. ప్రకటనకు ముందు రాజధాని వేరేచోట వస్తుందని ప్రచారం చేసి ప్రస్తుత రాజధాని ప్రాంతంలో బినామీలతో చంద్రబాబు తక్కువ ధరకు భూములు కొనిపించారు. ఆ తర్వాత రాజధానిని ప్రకటించారు. హెరిటేజ్ కంపెనీ సైతం 14 ఎకరాలు భూమి కొనుగోలు చేసింది. ల్యాండ్ పూలింగ్లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారు. రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది. నచ్చినవారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారు. ఇక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డాడరు. ఇదంతా మామూలు స్కామ్ కాదు. సంచలనాత్మకమైన కుంభకోణం. వ్యక్తిగతంగా చంద్రబాబుకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ మరో వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈ నెల 30న తాను మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ తెలిపారు. డే వన్ నుంచి ఏం చేయబోతామనేది ప్రమాణస్వీకారం రోజు తెలియచేస్తామని అన్నారు. యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి పోలవరం ప్రాజెక్ట్ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ చేసి గతంలో అవకతవకలు జరిగి ఉంటే వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే అలాగే చేస్తాం. సత్వరమే పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నాపై కేసులు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా సచివాలయంలోకి అడుగుపెట్టలేదు. అప్పట్లో ఏ మంత్రికిగాని, అధికారులకు ఫోన్ చేయలేదు. ఆ సమయంలో నేను హైదరాబాద్లోనే లేను. బెంగళూరులో ఉన్నాను. అమ్మానాన్నలను చూసేందుకు మాత్రమే హైదరాబాద్ వచ్చేవాడిని. నాన్న బతికి ఉన్నప్పుడు నాపై కేసులు లేవు. నాన్న చనిపోయాక కాంగ్రెస్ను వ్యతిరేకించాకే నాపై టీడీపీ ప్రోద్భలంతో కేసులు పెట్టారని అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి అడుగుతూ ఉంటా -
బాబు నవరత్నాలను కాపీ కొట్టారు
మార్కాపురం: నవరత్నాల పథకాలను సీఎం చంద్రబాబు కాపీ కొట్టి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు కలలు కంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఎప్పటికీ జరగదని చెప్పారు. శుక్రవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలన్నీ నవరత్నాల్లో నుంచి కాపీ కొట్టినవేనని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు 70 ఏళ్ల చంద్రబాబు ఇతర నాయకులతో కలసి లేని, పోని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నాడని, అయినా 11న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గాలి స్పీడుకు సైకిల్కు బ్రేకులు పడతాయన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్ను సీఎం చేయాలని నిర్ణయించుకున్నారని చంద్రబాబు ఆయన వర్గీయులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరని చెప్పారు. జగన్ చేసేవే చెబుతారని, చంద్రబాబులా 630 హామీలు ఇవ్వలేదన్నారు. 40 ఏళ్ల కొడుకును (లోకేష్ను) సీఎం చేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని విమర్శించారు. అమరావతిని భ్రమరావతిగా మార్చి కేంద్రం ఇచ్చిన రూ.2,500 కోట్లను తాత్కాలిక కట్టడాలకు ఖర్చు చేయటం మంచిదా అని ప్రశ్నించారు. రాజధాని డిజైన్కే రూ.235 కోట్లు కేటాయించి ఆ నిధులను హైదరాబాదులో ఇళ్లు కట్టుకునేందుకు ఖర్చు చేయటం మంచి పద్ధది కాదన్నారు. పట్టిసీమలో రూ.400 కోట్ల దోపిడీ జరిగిందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. పోలవరానికి రూ.7 వేల కోట్లు ఇచ్చినా ఇంత వరకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ పంపలేదని, అది పంపి ఉంటే ఇంకా ఎక్కువ నిధులు వచ్చేవని అభిప్రాయపడ్డారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మీర్జా షంషీర్ అలీబేగ్ పాల్గొన్నారు. -
అమ్మ ఒడి..చదువుల గుడి
సాక్షి,అమరావతి : ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చదువు అందని ద్రాక్షగా మారింది. పిల్లలను బడికి పంపించాలంటేనే.. తల్లిదండ్రులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఎల్కేజీ, యూకేజీల్లో చేర్పించాలన్నా.. వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే. చంద్రబాబు సర్కారు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ను ప్రోత్సహిస్తూ.. సర్కారీ బడులను నిర్వీర్యం చేసింది. వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను మూసేసింది. ఉన్న పాఠశాలల్లోనూ టీచర్లను నియమించకుండా.. సరైన సదుపాయాలు కల్పించకుండా సర్కారీ బడులను అధ్వానంగా మార్చివేసింది. దీంతో రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద తల్లిదండ్రులు సైతం పిల్లలకు వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితిల్లో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సాగిన సుదీర్ఘ పాదయాత్రలో.. తల్లిదండ్రుల ఇబ్బందులను స్వయంగా చూసిన జననేత వైఎస్ జగన్.. పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కల్గించేలా ‘అమ్మ ఒడి’ పథకం ప్రకటించారు. పిల్లలను బడికి పంపితే చాలు.. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ హామీతో తమపై పిల్లల చదువుల భారం తగ్గుతుందని తల్లిదండ్రుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక తమ పిల్లల చదువులకు ఎలాంటి ఢోకా ఉండదని తల్లిదండ్రులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ‘అమ్మ ఒడి’ అమలైతే తమపై పిల్లల చదువుల భారం తగ్గుతుందని.. బడుల్లో డ్రాపవుట్లు కూడా తగ్గుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పిల్లల చదువు భారం కాకూడదనే.. పిల్లల చదువులు కుటుంబానికి భారం కాకూడదని.. తల్లిదండ్రులు ఆందోళన చెందకూడదన్న ఆశయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నవరత్నాల్లో భాగంగా ‘అమ్మ ఒడి’ పథకం ప్రకటించారు. దీంతోపాటు సర్కారీ బడులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టులన్నిటినీ భర్తీచేసేందుకు మెగా డీఎస్సీని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని, ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన అందిస్తామని భరోసా ఇచ్చారు. మొన్న..1995 –2004 విద్యావ్యాపారానికి ద్వారాలు తెరిచిన చంద్రబాబు చంద్రబాబు 1995లో అధికారంలోకి వచ్చీరాగానే ప్రైవేట్ విద్యావ్యాపారానికి ద్వారాలు తెరిచారు. నారాయణ, శ్రీచైతన్య వంటి బినామీ సంస్థలను ఏర్పాటుచేసి.. విద్యను వ్యాపార వస్తువుగా మార్చేశారు. ప్రభుత్వ పాఠశాలలను అప్పటినుంచే నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ప్రభుత్వ బడుల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచేశారు. మరోవైపు విద్యావాలంటీర్ల వ్యవస్థకు తెరతీశారు. విద్యార్ధులు లేరనే సాకుతో వేలాది పాఠశాలలను మూసేయించారు. ఫలితంగా వేలాది మారుమూల గ్రామాలకు ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో లేకుండాపోయాయి. వాటి స్థానంలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ స్కూల్స్ పుట్టుకొచ్చాయి. నాటి చంద్రబాబు పాలనలో సామాన్య, మధ్యతరగతి పిల్లలకు చదువు అందుబాటులో లేకుండా పోయింది. నిన్న.. 2004–2009 వైఎస్ హయాం.. సర్కారీ విద్యకు స్వర్ణయుగం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారం చేపట్టిన తరువాత విద్యావ్యవస్థను మెరుగుపర్చడానికి అనేక చర్యలు చేపట్టారు. తాను అధికారంలోకి వచ్చాక వరుసగా డీఎస్సీలు నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీచేశారు. 2008 డీఎస్సీలో ఏకంగా 50వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత వైఎస్కే దక్కింది. ప్రైవేటు స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు కృషిచేశారు. ప్రభుత్వ స్కూల్స్లో ఆంగ్లమాధ్యమం ఉండేలా.. సమాంతరంగా సక్సెస్ స్కూళ్లను ప్రారంభించారు. మోడల్ స్కూళ్లూ అప్పుడే వచ్చాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పాఠశాలలను వేలాదిగా ప్రారంభించారు. హైస్కూళ్ల సంఖ్య అప్పటివరకు 3వేలకు పరిమితం కాగా వైఎస్ పాలనలో వాటిసంఖ్య 6వేలకు పైగా చేరింది. పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యత కల్పించారు. డిజిటల్ తరగతులకు శ్రీకారం చుట్టింది వైఎస్సారే. ప్రతి పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు తప్పనిసరిగా ఉండేలా చేశారు. సక్సెస్ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమ తరగతులకోసం ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లను నియమించారు. నేడు.. 2014–2019 చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కునారిల్లిన విద్యావ్యవస్థ 2014లో చంద్రబాబు అధికారం చేపట్టాక విద్యావ్యవస్థలో మళ్లీ ప్రైవేట్ పెత్తనం పెరిగిపోయింది. చంద్రబాబు వచ్చీరావడంతోనే రేషనలైజేషన్కు తెరతీశారు. ఈ ఐదేళ్లలో 6వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసేయించారు. ఎస్సీ,ఎస్టీ కుటుంబాలున్న ప్రాంతాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లు మూతపడటంతో అక్కడ చదువుతున్న వేలాది మంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లల్లో నిబంధనల మేరకు తగినంత సంఖ్యలో టీచర్లను నియమించడం లేదు. 30వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలున్నా.. వాటిని భర్తీచేయడం లేదు. ఇప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాలలు 6వేల వరకు ఉన్నాయంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించడం లేదు. బయోమెట్రిక్ యంత్రాలు, ట్యాబ్ల పంపిణీ, పాఠశాలలకు ఫర్నీచర్ సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం.. ఇలా అన్ని వ్యవహారాల్లో భారీగా నిధులు దండుకున్నారు. నాలుగున్నరేళ్లలో సర్వశిక్ష అభియాన్ నిధులతోపాటు ఇటు బడ్జెట్ నిధులనూ ఇష్టానుసారంగా తమ వారికి కాంట్రాక్టుల పేరిట కట్టబెట్టింది చంద్రబాబు సర్కారు. తాజాగా రూ.4800 కోట్లతో మౌలిక సదుపాయాల పేరిట మరిన్ని కాంట్రాక్టులు ఇచ్చింది. మధ్యాహ్నం భోజనం, దుస్తుల పంపిణీ, పాఠ్యపుస్తకాల సరఫరా, ఇతర పరికరాలు ఏర్పాటు వంటి టెండర్లలో కోట్లాది రూపాయలను కమీషన్లు తీసుకొని వాటిని తమ అనుయాయులకు అప్పగించారు. రేపు.. జగన్... అమ్మ ఒడితో తల్లిదండ్రులకు భరోసా ఫీజుల భారం పెరిగి పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా.. పిల్లలను బడికి పంపితే చాలు ఏటా రూ.15వేలు నేరుగా తల్లి చేతికే ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. సర్కారీ బడులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టులన్నిటినీ భర్తీచేసేందుకు మెగా డీఎస్సీని నిర్వహిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు హామీ ఇచ్చి మరిచారు 2014 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు.. ఉచిత విద్య అందిస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. అది అమలు కాలేదు. ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల.. ప్రతి 3కిలో మీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల.. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హైస్కూలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాస్తవానికి గత ఐదేళ్లలో ఉన్న స్కూళ్లను సైతం మూసేయించారు. ప్రతి ఏటా విద్యాసంవత్సరానికి మూడు నెలల ముందే డీఎస్సీని నిర్వహించి టీచర్లను నియమిస్తామన్నారు. తన ఐదేళ్ల పాలనలో ఎన్నికలకు ముందు అరకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మమ అనిపించారు.ఆ చట్టంతో చదువులు మరింత భారం: చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ను ప్రోత్సహించడానికి ఏకంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తెస్తోంది. సెల్ఫ్ఫైనాన్స్డ్ ఇండిపెండెంటు స్కూల్సు పేరిట తెస్తున్న ఈ చట్టంతో ఇక చదువులు మరింత భారంగా మారనున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే పాఠశాలలు స్థాపించేలా ఈ నిబంధనలు పెట్టింది. ఈ చట్టంవస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్య కూడా పేద మధ్యతరగతి పిల్లలకు అందకుండాపోనుంది. కార్పొరేట్ విద్య మరింత భారంగా మారనుంది. నారాయణ, చైతన్య చేతుల్లో ఇంటర్ విద్య చంద్రబాబు పాలనలో ఇంటర్మీడియెట్ విద్య మరింత భారంగా మారింది. రాష్ట్రంలో 3500 వరకు జూనియర్ కాలేజీలుంటే.. అందులో 1100 మాత్రమే ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు. మిగతావన్నీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. వీటిల్లో అత్యధిక శాతం నారాయణ, చైతన్య సంస్థలవే. ఈ కార్పొరేట్ స్కూల్స్లో ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచేస్తున్నాయి. రూ.30వేల నుంచి లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా పుస్తకాలు, యూనిఫారాలు, ఇతరాల పేరిట వేలకు వేలు డబ్బు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలకు రూ.15వేలు, యూనిఫారానికి రూ.7వేలు, ఇతర సామగ్రి అంటూ మరో 2వేలు దండుకుంటున్నాయి. ఇంటర్మీడియెట్ విద్య పేరిట కార్పొరేట్ సంస్థలు విద్యార్ధులను పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఏటా రూ.లక్షన్నర నుంచి రూ.3లక్షల వరకు ఇంటర్కు ఫీజులుగా వసూలు చేస్తున్నాయి. -
రైతన్నలకు భరోసా.. శీతల గిడ్డంగుల హామీ
ముని నాయుడుది చిత్తూరు జిల్లా నగరి. మామిడి రైతు. తోతాపురి రకాన్ని పండిస్తారు. దిగుబడి బాగా వచ్చింది. అయితే, ధర మరీ తగ్గిపోయింది. ధర వచ్చే వరకు పంటను అమ్మకుండా ఉందామంటే శీతల గిడ్డంగి లేదు. కాబట్టి చెప్పిన ధరకు అమ్ముకోక తప్పని దుస్థితి రైతులది. ఆ జిల్లాలో ఎక్కువగా పండే తోతాపురి మామిడి రకం జ్యూస్కి పనికి వస్తుంది. మార్కెట్లో ధర లేదన్న సాకుతో రైతుల నుంచి చౌకగా కొనడం ప్రారంభించాయి పల్ప్ కంపెనీలు. పెద్ద కంపెనీలకు సరుకు నిల్వ చేసే శీతల గిడ్డంగుల సౌకర్యం ఉంటుంది. రైతులకు ఈ సదుపాయం లేకపోవడాన్ని ఆసరా చేసుకుని కంపెనీలు దోపిడికి పాల్పడుతున్నాయి.. ఇలా ఒకటి, రెండు పంటల విషయంలోనే కాదు. కూరగాయల మొదలు వివిధ రకాల ఉద్యాన పంటల మార్కెటింగ్ పరిస్థితీ ఇదే. టమాటా బయటి మార్కెట్లో కిలో రూ. 15 – 20 అమ్ముతున్నా రైతులకు మాత్రం కిలోకి ఒకటి రెండు రూపాయలు కూడా దక్కడం లేదు. ఉల్లి రైతులదీ అదే పరిస్థితి. రైతులు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించే తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణం. అదే ప్రభుత్వమే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తేనో, రైతులే సొంతంగా కట్టుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తేనో అన్నదాతలు దుర్భర స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. ఆహార శుద్ధి రంగంలో అగ్రగామిగా ఉండాలంటే వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించాలి. అప్పుడే రైతన్నలకు గిట్టుబాటు లభిస్తుంది. మార్కెట్లో జరిగే దోపిడీని అరికట్టడానికి వీలవుతుంది. ఇన్ని ప్రయోజనాలు చేకూరాలంటే రైతులకు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే శీతల గిడ్డంగి సౌకర్యం ఉండాలి. ఎప్పుడు ధర వస్తే అప్పటిదాకా నిల్వ చేసే పరిస్థితి ఉంటే రైతులకు మేలు జరుగుతుంది. పరిశోధనా కేంద్రాలు సరే... దేశంలో అత్యధిక ఆహార ఉత్పత్తి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆహార శుద్ధి పరిశ్రమలకు అనువైన ముడిపదార్థాలు పెద్ద ఎత్తున దొరికే రాష్ట్రాలలో ఏపీ ఒకటి. రాష్ట్రంలో 5 వ్యవసాయానుకూల జోన్లు, 58 వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, మూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పెద్దఎత్తున జరుగుతున్న పట్టణీకరణ, రోజురోజుకు మారుతున్న జీవన స్థితిగతుల నేపథ్యంలో ఆహార శుద్ధి రంగం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దీనికితోడు 980 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతం. ఇన్ని వనరులు ఉన్నా రైతులు మాత్రం ఏటా కొన్ని కోట్ల రూపాయల ఉత్పత్తులను నేల పాలు చేయాల్సి వస్తోంది. పరిశోధన ఫలితాలు రైతులకు చేరకపోవడం, ఆహార శుద్ధి పరిశ్రమలు లేకపోవడం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు లేకపోవడమే ప్రధాన కారణం. ఇవే ఉంటే.. రైతులకు అదనపు ఆదాయం కోసం వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు చెడిపోకుండా తాజాగా వినియోగించుకోవచ్చు. ధర లేని పరిస్థితులలో రైతులు తమ ఉత్పత్తులను వీటిల్లో నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఆహార శుద్ధి పరిశ్రమలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం కోసం, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ఇవి ఉపయోగపడతాయి. ప్రకటనలు సరే.. ఫుడ్ పార్కులు ఏవీ? ప్రతి జిల్లాకు ఫుడ్ పార్క్లు, ఆహార శుద్ధి రంగ పరిశ్రమలు, శీతల గిడ్డంగులంటూ చంద్రబాబు పాట పాడడం మొదలు పెట్టి ఐదేళ్లు దాటింది. అదిగో సమీకృత ఫుడ్ పార్క్... ఇదిగో మెగా ఫుడ్ పార్క్... అల్లదిగో అల్ట్రా మెగా ఫుడ్ పార్క్... అంటూ ఊదరగొడుతున్నారే తప్ప ఆచరణ మాత్రం అందనంత దూరంలో ఉంది. ఒకటీ రెండు వచ్చినా సామాన్యులకు వాటిల్లో స్థానం లేకుండా పోయింది. ఇక కోల్డ్స్టోరేజీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. స్వాతంత్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న కోల్డ్ స్టోరేజీల సంఖ్య 456కి మించలేదు. వీటిల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో మాత్రమే 176 ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో వీటి సంఖ్య 47 దాటలేదంటే మిగతా చోట్ల పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం 85 లక్షల మందికి పైగా రైతులు ఉంటే– వీటిని ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య నాలుగైదు లక్షలకు మించడం లేదు. నిల్వ సౌకర్యం లేక కూరగాయలు, పూలు, పండ్లు, మత్స్య సంపద వృథా అవుతోంది. జగన్ హామీ ఇలా... ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను ప్రకటించారు. వాటిల్లో ఒకటి వైఎస్సార్ రైతు భరోసా. ఈ పథకంలో భాగంగా కోల్డ్స్టోరేజీ ప్లాంట్లు, గిడ్డంగులు, నియోజకవర్గాల స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటివన్నీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించి కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు నిర్మించుకునే వెసులు బాటు కల్పిస్తానని వాగ్దానం చేశారు. రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటయితే రైతులు వలస పోవాల్సిన దుస్థితి ఉండదు. మామిడి, టమాటా, ఉల్లి వంటి పచ్చి సరకును రోడ్ల పాల్జేసి ట్రాక్టర్లతో తొక్కించాల్సిన అవసరం రాదు. శీతల గిడ్డంగులు వస్తే ధర లేనప్పుడు ఉద్యాన ఉత్పత్తుల్ని రైతులు నిల్వ చేసుకుని సరైన ధరకు అమ్ముకునే వెసులు బాటు ఉంటుంది. – ఆకుల అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
మనవడొస్తాడు..అందరికీ ఇస్తాడు
సాక్షి, కైకలూరు : ‘వృద్ధులను గౌరవించడం మా బాధ్యత.. వారికి అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించి వారి శేషజీవితం ఆనందంగా గడిపేందుకు సహకరిస్తాం’. ఇది ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన మాటలు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లలో రాజకీయాలకు తెరలేపారు. అర్హులకు మొండిచేయి చూపిస్తూ జన్మభూమి కమిటీలు సూచించిన తమ పార్టీవారు వారు అర్హులు కాకపోయినా పింఛను ముట్టజెప్పారు. ‘అయ్యా.. మాకు పింఛను సొమ్ము రావడంలేదు. వృద్ధాప్యంలో మాకు కాస్త అండగా ఉండేది ఆ డబ్బులేనయ్యా’ అంటూ పండుటాకులు వేడుకుంటున్నా.. ఓపిక లేకపోయినా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈక్రమంలో కార్యాలయాల చుట్టూ తిరగలేక, మనోవ్యథతో, మందులకు డబ్బులులేక రాలిపోయిన పండుటాకులు ఎందరో.. పింఛన్లు పెంచామని డప్పులు కొట్టుకున్నారు గానీ.. మహానేత వైఎస్సార్ హయాంలో పింఛన్ పొందుకున్న దాదాపు 50శాతం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్ను దూరం చేశారన్నది జగమెరిగిన సత్యం. ఈక్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీపై అవ్వాతాతలు ఆశపెట్టుకున్నారు. గతంలో కులం, మతం, వర్గం, పార్టీ అంటూ చూడకుండా మహానేత వైఎస్సార్ నడిచిన బాటలోనే వైఎస్ జగన్ నడిచి మాకు న్యాయం చేస్తాడని కన్నీళ్లు నిండిన కళ్లతో ఎదురుచూస్తున్నారు... జగన్ చేసేదే చెప్తారు... వైఎస్ జగన్ నెలకు రూ2వేలు పింఛన్ ఇస్తానని నవరత్నాల్లో ప్రకటించడంతో ఎంతో ఆశపడ్డా. ఎన్నికలముందు చంద్రబాబు హడావుడిగా రూ.2వేలకు పెంచారు. ఇది ఎన్నికల గిమ్మిక్కని మాకుతెలుసు. ఇప్పుడు రూ.3వేలు ఇస్తానని చంద్రబాబు చెప్పే మాటలు నమ్మం. జగన్ చెప్పింది చేస్తాడనే నమ్మకం మాకుంది. – చొప్పాల మహంకాళరావు, చినకామనపూడి ఇన్నాళ్లు ఏమైంది? గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతేనే వారిస్థానంలో కొత్తపింఛన్ మంజూరు చేసేవారు. దివంగత వైఎస్ దయతో అర్హుౖలకు అందరికీ పింఛన్ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు రకరకాల మాటలతో పింఛన్దారులను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నారు.ఇన్నాళ్లులేని జాలి ఇప్పుడే ఎందుకు చూపాల్సి వస్తుందో మాలాంటి వారికందరికీ తెలుసు. – పి.సూర్యచంద్రరావు, చిగురుకోట -
జగన్ హమారా
సాక్షి, దర్శి: ఆధ్మాత్మిక చింతనలో మనుగడ సాగిస్తున్న ఇమామ్, మౌజన్లకు స్థిరమైన ఆదాయం లేకపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం స్థానికులు అందజేస్తున్న విరాళాలతోనే కుటుంబాలు వెళ్లదీస్తున్న వారికి ప్రభుత్వ పరంగా అతి తక్కువ సాయం మాత్రమే అందుతుంది. ఇలాంటి తరుణంలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముస్లింల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. తాను అధికారంలోకి రాగానే ఇమామ్లకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేలు ప్రతి నెల గౌరవ వేతనంగా అందిస్తానంటూ ప్రకటించారు. జగన్ ఇచ్చిన భరోసాతో ఇమామ్, మౌజన్ల కుటుంబాల్లో వెలుగు నిండనున్నాయి. విరాళాలతో కాలం గడుపుతున్న తమకు ఇకపై జగన్ వల్ల సమాజంలో సముచిత గౌరవం దక్కనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో సుమారుగా 520 మసీదులు ఉన్నాయి. ఒక్కో మసీదుకు ఒక ఇమామ్, ఒక మౌజన్ లెక్కన 1040మంది ఇమామ్లు, మౌజన్లు పనిచేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో 36 మసీదులు ఉండగా 72 మంది ఇమామ్లు, మౌజన్లు పని చేస్తున్నారు. జిల్లాలోని ముస్లిం ఆధ్యాత్మిక సంస్థల్లో పని చేస్తున్న మత పెద్దలు చాలీ చాలనీ వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. చాలా చోట్ల మసీదులను చందాలతో నిర్మిస్తారు. వాటికి ఎలాంటి ఆదాయ వనరులు ఉండవు. అక్కడికి వచ్చే ముస్లింలతో నమాజ్ చదివించే ఇమామ్లకు రూ.5వేలు, వాటి నిర్వహణ చూసుకునే మౌజన్లకు రూ.3వేలు ఇస్తుంటారు. ఈ మొత్తం ఎందుకూ చాలడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నారు. బాబు హామీ..నిబంధనల కొర్రీ ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం ఇవ్వబోతున్నట్లు రెండేళ్ల క్రితం సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి ఎన్నో నిబంధనలు పెట్టారు. గౌరవ వేతనం అందుకోబోయే వారు పని చేస్తున్న మసీదులకు భూములు, చరాస్తులు, ఆదాయ మార్గాలు ఏవీ ఉండరాదని, వక్ఫ్ బోర్డులో ఆ మసీదు రిజిస్టర్ అయి ఉండాలని తదితర నిబంధనలు పెట్టారు. మసీదుతో పాటు స్థిర, చరాస్తి డాక్యుమెంట్లు, వాటి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంది. ఇన్నీ చేసిన తర్వాత ముతవల్లి కమిటీ ద్వారా సిఫారసు పత్రం జత చేయాలి. ఇలాంటి అర్ధ రహిత కారణాలతో గౌరవ వేతనాలు సక్రమంగా అందకుండా పోతున్నాయి. జగన్ అధికారంలోకి వస్తేనే ముస్లింలకు న్యాయం చేకూరుతుంది. – డాక్టర్ ఎస్ఎం బాషా, ప్రముఖ హోమియో వైద్యులు జగన్తోనే ముస్లింల సంక్షేమం ముస్లింల అభ్యున్నతి కోసం దివంగత మహానేత వైఎస్సార్ ఎంతో శ్రమించారు. ఆయనలా వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ముస్లిం సంక్షేమం కోసం పలు హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆ హామీలన్ని ఆయన నెరవేర్చి తీరుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ముస్లింల సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జగన్ అధికారంలోకి వస్తే జిల్లాలోని అన్ని మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం అందుతుంది. – బాబావలి, దర్శి ఎందరికో మేలు జరుగుతుంది ముస్లింలలో ఆధ్యాత్మిక భావన పెంపొందిస్తున్న ఇమామ్లు, మౌజన్లకు తాను అధికారంలోకి రాగానే గౌరవ వేతనం ఇస్తానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్షణీయం. అన్ని మసీదుల్లో పని చేస్తున్న ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనం ఇస్తామంటూ జగన్ ముందుకు రావడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. – షేక్ హుస్సేన్, మదీనా మసీద్ ప్రెసిడెంట్ వైఎస్సార్లా ఆదుకుంటారు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ఆదుకున్నారు. ఆయన తనయుడిగా వైఎస్ జగన్ కూడా మా సంక్షేమానికి పాటు పడతారని ఆశిస్తున్నాం. ప్రార్థనా మందిరాల్లో ఇమామ్లు, మౌజన్ల సేవలను గుర్తించి వారి కష్టాలను గుర్తించి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ముస్లింలు స్వాగతించాలి. – నాగూర్, దర్శి అభినందనీయం ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలనుకోవడం అభినందనీయం. జిల్లాలోని చాలా మసీదుల్లో ఇమామ్, మౌజన్లుగా ఉన్న వారు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు. గౌరవ వేతనం నేరుగా ఇమామ్ల అకౌంట్కు వేస్తే ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండదు. ఈ విషయంలో జగన్కు ఎంతో రుణపడి ఉంటాం. – పఠాన్ దస్తగిరి, మౌజన్, రాజంపల్లి మసీద్ రూ.3వేలతో ఎలా బతకాలి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఇమాంమ్లకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తామని చెబుతున్నారు. ఆయన ఇస్తారనే నమ్మకం మాకుంది. అందుకే జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. – షేక్ అబ్దుల్ బషీర్, మర్కస్ మసీద్, దర్శి రుణపడి ఉంటాం ఇమామ్లకు గౌరవ వేతనం పెంచాలని ఆలోచించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ఆయన ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు గట్టెక్కుతాయి. జగన్కు రుణపడి ఉంటాం. చాలీచాలని ఆదాయంతో కుటుంబం గడిచేది చాలా కష్టంగా ఉంది. ఈ తరుణంలో జగన్ ప్రకటన ఎంతో సంతోషం కలిగించింది. – షేక్ ఇమ్రాన్, ఇమామ్, రాజంపల్లి మసీద్ -
అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా
సాక్షి, విజయనగరం పూల్బాగ్: వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల అప్పు మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తామన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒక్కొక్కరికి రూ.50వేల మొత్తాన్ని నాలుగు దఫాలుగా చెల్లిస్తారు. వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పిస్తామని చెప్పడం మరింత ఊరట కలిగిస్తోంది. ఈ ప్రకటనపై నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని చెబుతున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయాం పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పడంతో బ్యాంక్లో రుణాలు కట్టలేదు. నేటికీ రుణాలు మాఫీ చేయలేదు. నెల నెలా వడ్డీలు కడుతున్నాం. బాబు మాటలు నమ్మి మోసపోయాం. ఐదేళ్ల పాలనలో మహిళలకు మాయ మాటలు చెప్పి మోసగిస్తున్నారు. జగనన్న ప్రకటించిన వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలతో మహిళలకు ఎంతో లబ్ది చేకూరుతుంది. – కాదులూరి లీలాత్రి, బూర్లి పేట, 38వవార్డు, విజయనగరం. బతుకులు బాగు పడతాయి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా బతుకులు బాగుపడతాయి. రుణాలన్నీ మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. పొదుపు రుణాలు మాఫీ అయితే కష్టాల నుంచి బయట పడినట్లు అవుతుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. మహిళల కోసం జగన్ ప్రకటించిన పథకాలు బాగున్నాయి. – పండూరి మంగమ్మ, ఆబాద్వీధి, అశోక్నగర్ మహిళల జీవితాల్లో వెలుగు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే మహిళల జీవితాల్లో వెలుగులు వస్తాయి. టీడీపీ మోసాలను మహిళలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. మా కష్టాలను తెలుసుకున్న జగనన్న అప్పు మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా చేతికే అందజేస్తామని హామీ ఇవ్వడం శుభపరిణామం. వడ్డీ లేని రుణాలను అందించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. – మహంతి లక్ష్మి, పూల్బాగ్కాలనీ, 3వవార్డు, విజయనగరం టీడీపీకి గుణపాఠం తప్పదు.. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంక్ రుణాలు కట్టకపోవడంతో వడ్డీలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు మా పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. చివరికి చేసేదేమీ లేక వడ్డీతో సహా చెల్లిస్తున్నాం. హామీ నెరవేర్చలేనప్పుడు మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పడం ఎందుకు? ఇచ్చిన డబ్బులు వడ్డీ చెల్లించేందుకు కూడా సరిపోలేదు. టీడీపీకి ఈ సారి గుణపాఠం తప్పదు. – పి.శ్రీదేవి, అశోక్నగర్, విజయనగరం -
విద్యా విప్లవానికి నాంది
సాక్షి, దర్శి టౌన్: విద్య విజ్ఞాన వికాసానికి చిరునామా..ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకం. బాల్యంలో సరైన పునాది పడితేనే బంగారు భవిష్యత్కు నాంది అవుతుంది. విద్యతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో పలువురు నిరుపేదలు మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు. భవిత అంధకారంగా మారి కూలీలుగా మారుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుపేదలకు విద్య వైపు ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం ప్రకటించారు. ఈ పథకం ప్రయోజనాలు తెలుసుకున్న సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులకు ప్రయోజనాలు ఇవే .... ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బడికి పంపే పిల్లలకు ఒక్కక్కరికి రూ. 500, ఇద్దరు ఉంటే రూ. 1000లు చెల్లిస్తారు. 5 నుంచి 10వ తరగతి వరకు బడికి వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 750, ఇద్దరు ఉంటే రూ. 1500లు చెల్లిస్తారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికీ ప్రతి నెల రూ.1000లు, ఇద్దరు ఉంటే రూ. 2000లు అందుతుంది. ఉన్నత చదువుల కోసం విద్యార్థుల మెస్ చార్జీలకు రూ. 20వేలు చెల్లిస్తారు. దర్శి నియోజకవర్గంలో... దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 72,715 మంది విద్యను అభ్యసిస్తున్నారు. అందులో 344 ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలలో 31,215మంది, 31 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 41,500 మంది విద్యను అభ్యసించే వారిలో ఉన్నారు. ఇలాంటి పథకం ఎక్కడా లేదు ప్రతి నెలా పిల్లలకు చదువు కోసం నగదు ఇవ్వడం మంచి పరణామం. దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం ఏ ప్రభుత్వం అమలు పరచడం లేదు. ఇది అమలు జరిగితే పేద విద్యార్థులు విద్యావంతులవుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. – ముఖం లక్ష్మికుమారి, కురిచేడు పేదలకు వరం కూలీ నాలి చేసుకుని జీవనం కొనసాగించే వారి పిల్లలను చదివించే స్థోమత లేని పరిస్థితిలో నిరక్షరాస్యులుగా మిగిలుతున్నారు. కూలి పనులకు వెళ్తేనే పూట గడిచే పరిస్థితిలో ఇక పిల్లల గురించి ఏమి ఆలోచిస్తారు. అమ్మ ఒడి పథకం అమలయితే అనేక మంది విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. – దేసు రజని, కురిచేడు మాలాంటి వాళ్లకు ఉపయోగం నేను ఇలాంటి పథకాన్ని ఎప్పుడూ వినలేదు. పిల్లల కోసం ఏ నాయకుడూ ఆలోచించ లేదు. మేము పొలం కూలి పనులు చేసుకుని జీవించాలి. మాలాంటి వాళ్లకు ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. మా పిల్లల భవిష్యష్యత్కు డోకా లేకుండా ఉంటుంది. – వెన్నా రమణ, విద్యార్థిని తల్లి, పొట్లపాడు పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతారు ఇలాంటి పథకాల వలన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రతి ఒక్కరికీ తమ పిల్లలను చదివించుకోవాలనే ఆలోచన కలుగుతుంది. తాము పేదరికంలో ఉన్న తమ పిల్లలకు బంగారు భవిష్యత్ను అందించే అవకాశం ఉంది. ఇలాంటి నాయకులు మనకు అవసరం. – సుబ్బులు, తాళ్లూరు అమ్మ ఒడి ఒక వరం అమ్మ ఒడి పథకం పిల్లల పాలిట ఒక వరం. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇచ్చి చదివించేవారు లేరు. చదివించే శక్తి లేక పొలం పనులకు తీసుకెళ్లాల్సి వస్తుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ పథకం వస్తే పిల్లలు చదువుకుని చల్లగా నీడ పట్టున బతికే అవకాశం కలుగుతుంది. మా కష్టాలు వారికి రాకుండాపోతాయి. – యేరేసి సుబ్బులు, విద్యార్థిని తల్లి, గంగదొనకొండ పిల్లలు బాగుపడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అమలు చేసే పథకంలో అమ్మ ఒడి వలన ఎంతోమంది పేద పిల్లల జీవితాలు ధన్యమవుతాయి. చదువుకునే స్థోమత లేక బజార్ల వెంట కాగితాలు ఏరుకుంటున్నారు. అలాంటి పిల్లలందరూ బడికి వచ్చి చక్కగా చదువుకుని బాగు పడతారు. – సూరా వెంకటరత్నం, కురిచేడు -
అమ్మ ఒడి.. అక్షరానికి గుడి
సాక్షి, విజయనగరం అర్బన్: విద్యాభివృద్ధికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పేద కుటుంబాలు అక్షరాస్యతకు నోచుకోవడం లేదు. మరోవైపు మధ్యలో చదువులు మానేసిన (డ్రాపౌట్స్) విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణాలు ఎన్నున్నా పేదరికమే ప్రధానం. చాలీచాలని సంపాదనతో బడిబాట పట్టాల్సిన పిల్లల్ని కూలి పనులకు పంపుతున్నారు. పిల్లలూ పనికి వస్తే నాలుగు డబ్బులు సంపాదించవచ్చని.. వారిని బడికి పంపితే తమ కుటుంబాలు ఎలా గడుస్తాయి.. ఎలా చదివించాలంటూ ప్రశ్నించే తల్లిదండ్రులూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పేద కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారంతా రోజురోజుకూ నిరుపేదలుగా మారుతున్నారు. బిడ్డల భవిష్యత్తును తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల దీనస్థితిని వైఎస్ జగన్ మోహన్రెడ్డి గమనించారు. నవరత్నాల్లో భాగంగా అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పేద విద్యార్థులకు మేలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. విప్లవాత్మకమైన మార్పు పేదల కుటుంబాల్లో కచ్చితంగా ‘అమ్మ ఒడి’ పథకం విప్లవాత్మకమైన మార్పు తెస్తుంది. కార్మిక, కర్షక, బడుగు, బలహీన, పేద, మధ్యతరగతి, అగ్రవర్ణాల్లోని నిరుపేదలు, చిన్న సన్నకారు రైతు బిడ్డలకు ఈ పథకం స్వాంతన చేకూరుస్తుంది. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టి పేద విద్యార్థుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. వైఎస్ జగన్ ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పేదలకు భరోసాగా నిలుస్తుంది. ఈ పథకం అమలైతే అక్షరాస్యతలో మన రాష్ట్రం కేరళ కంటే కూడా ముందుంటుంది. – సిద్దాబత్తుల జగదీష్, ప్రైవేటు కంపెనీ ఉద్యోగి, విజయనగరం పిల్లల్లంతా బడిబాట అమ్మ ఒడి పథకం అమల్లోకి వస్తే తల్లిదండ్రులందరికీ తమ పిల్లలను బడికి పంపాలనే ఆకాంక్ష పెరుగుతుంది. పిల్లల చదువుకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం పిల్లలను చదివించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత అడ్డొస్తోంది. అమ్మ ఒడితో ఆ భయం ఉండదు. – జేసీ రాజు, ఉపాధ్యాయుడు, బొబ్బిలి డ్రాపౌట్స్ పూర్తిగా తగ్గుతాయి పేదరికం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ తగ్గడం లేదు. కూలినాలి చేసుకునే తల్లిదండ్రులు పిల్లల చదువు ఖర్చు భరించలేక మాన్పిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ దిశగా తమ పార్టీ మేనిఫెస్టోలను తయారు చేస్తే మంచిది. పేద కుటుంబాల పిల్లల చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తే డ్రాపౌట్స్ పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. –బంకపల్లి శివప్రసాద్, ఉపాధ్యాయుడు, గంట్యాడ మండలం అమ్మ ఒడి పథకం వివరాలు... ప్రతి విద్యార్థి తల్లి ఖాతాకు ఏటా - రూ.15 వేలు ప్రతి ఇంటా ఇద్దరు పిల్లలకు 1 నుంచి 5 వరకు విద్యార్థులు రూ.500 ఒక్కొక్కరికి నెలకు ఒకే ఇంట్లో ఇద్దరుంటే.. రూ.1000 5 నుంచి 10 వరకు ఒక్కొక్కరికి.. రూ.750 ఒకే ఇంట్లో ఇద్దరుంటే.. రూ.1500 ఇంటర్ విద్యార్థులు ఒక్కొక్కరికి.. రూ.1000 ఇద్దరుంటే... రూ.2 వేలు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్కు.. ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నత చదువులకు మెస్ చార్జీలు రూ.20 వేలు -
లీటర్కు రూ. 4 బోనస్!
‘ఇదిగో ఇటు చూడండి.. ఇది మంచి నీళ్ల సీసా. లీటర్ ధర అక్షరాల రూ. 20. ఇదిగో ఇది పాల సీసా.. లీటర్ పాలకు రైతుకు ఇచ్చే ధర రూ. 22, 23. నీళ్ల ధర, పాల సేకరణ ధర ఒకటే అయితే పాడి రైతు బతికేదెలా? ఆ కుటుంబం గడిచేదెలా?‘ అన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన. పాడి ఉన్న ఇంట సిరులు విరజిల్లునంట అనే సామెత పాతబడింది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ది దేశంలో ఐదోస్థానం. 47 లక్షల పశువులు (ఆవులు, గొర్రెలు, మేకలు), 64.62 లక్షల గేదెలు ఉన్నట్టు పశుసంవర్థక శాఖ అంచనా. లక్షలాది మంది రైతులు పాడి పశువుల పెంపకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం 133 లక్షల మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం పాల ఉత్పత్తిలో 69 శాతంతో ఆవు పాలు అగ్రస్థానంలో ఉండగా గేదె పాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ధరలో కూడా ఈ రెండింటికీ తేడా ఉంది. 2023 నాటికి పాల ఉత్పత్తి సుమారు 20 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. కరవొచ్చినా కాటకం వచ్చినా ఇబ్బంది పడకుండా పాడి కాపాడుతుంది. ఏడాది పొడవునా అంతో ఇంతో ఆదాయం వస్తుందని పెద్దలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబుకు కరవుకు అవినాభావ సంబంధం ఉంటుందన్నది నానుడి. దానికి తగ్గట్టే నాలుగైదు ఏళ్లుగా మృగశిర కార్తె చిందేయడం మానేసింది. ముసలి ఎద్దు రంకె వేయడమూ ఆగింది. కరవు, పశుగ్రాసం కొరతతో పశువులు కబేళాలకు తరలుతున్నాయి. మరోపక్క పశువుల దాణా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తవుడు, చిట్టు, చెక్క ధరలు భారీగా పెరిగాయి. పాడి రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ స్థాయిలో పాల సేకరణ ధరలు మాత్రం పెరగలేదు. దీంతో తీవ్ర నిరాశా నిస్పృహలతో రైతులు పాడిని వదిలేసుకుంటున్నారు. పశువు పోయాక పాడి బయటపడినట్టుగా– పాలు పోయించుకుంటున్న పాల సంఘాలు రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం లేదు. బకాయిలు పేరుకుపోతున్నాయి. సహకార డైరీలకు ప్రభుత్వం మొండి చేయి చూపడంతో మూతపడుతున్నాయి. హెరిటేజ్ వంటి ప్రైవేటు సంస్థలకు ఇది వరంగా మారింది. రైతుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నాయి. 2015 మే నెలకు ముందు లీటర్ పాల ఉత్పత్తికి 26 రూపాయలు ఖర్చయ్యేది. కరవు పరిస్థితుల నేపథ్యంలో ఆ ధర రూ. 30 దాటి పోయింది. కానీ, పాల సేకరణ ధర మాత్రం రూ. 18 నుంచి 28 మధ్యే ఉంది. పాలలో వచ్చే వెన్న శాతాన్ని బట్టి ఈ ధర ఉంటుంది. 2015 మే నెలకు ముందు పాల సేకరణ ధర రూ.32, 35 మధ్య ఉండేది. ఉత్పత్తి పెరిగిందన్న సాకుతో ధరను తగ్గించి పాడి రైతుల నోట మట్టికొడుతున్నారు. లీటర్ నీళ్ల ధర రూ.20గా ఉంటే పాల సేకరణ ధర 23, 24 రూపాయలకు మించడం లేదు (గేదె పాల ధర రూ.28 నుంచి 34 మధ్య ఉంటుంది). అంతర్జాతీయ మార్కెట్లో మిగులు పేరిట పెద్ద కంపెనీలు ధరలు తగ్గిస్తున్నాయి. విధాన నిర్ణేతల లోపభూయిష్టమైన విధానాల వల్ల చిన్న, సన్నకారు పాడి రైతులు బడా కార్పొరేట్ సంస్థలలో కాంట్రాక్ట్ కార్మికులుగా చేరాల్సి వస్తోంది. వ్యవసాయ సంక్షోభం, తీవ్ర కరవు పరిస్థితులను తట్టుకునేందుకు ఆసరా ఉంటుందని పాడి పశువుల్ని పెట్టుకుంటే ఇప్పుడు వాటినీ పోషించలేని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా పాల ఉత్పత్తికి వెన్నుముకగా ఉన్న చిన్న రైతులు పశువుల్ని అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో మానవత్వం ఉన్న ఏ ప్రభుత్వమైనా పాడి రైతుల్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలి. పాల సేకరణ ధర పెంచడమో, లీటర్కు ఇంతని బోనస్ ఇవ్వడమో చేయాలి. పాడి రైతుల కష్టాలకు చలించిన చాలా రాష్ట్రాలు లీటర్కు నాలుగైదు రూపాయల బోనస్ను ప్రకటించాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో రూ.4, కర్ణాటకలో రూ.5, మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్కు రూ.5 ల బోనస్ ఇస్తోంది. కర్ణాటకలో రైతులకు బోనస్ ఇవ్వడం వల్ల సహకార పాల సంఘాలు చాలా బలీయంగా తయారయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాడి రైతుల్ని గాలికి వదిలేశారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసాను ప్రకటించారు. సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే ప్రతి రైతుకూ లీటర్కు 4 రూపాయల బోనస్ ఇస్తానని భరోసా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో దాదాపు 60, 65 లక్షల మంది కుటుంబాలకు మేలు జరుగుతుంది. జగన్ ఇచ్చే బోనస్తో కలుపుకుని పాల సేకరణ ధర లీటర్కు రూ. 30 దాటుతుంది. చంద్రబాబు హయాంలో మూతపడిన చిత్తూరు, ప్రకాశం, విశాఖ, కాళహస్తి కో ఆపరేటివ్ డైరీ వంటి వాటినన్నింటినీ తిరిగి తెరిపిస్తానని హామీ ఇవ్వడం పట్ల పాడి రైతులు సంబరపడుతున్నారు. బకాయిల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి లేకుండా పాల డైరీలన్నింటినీ సహకార రంగంలోకి తీసుకువస్తానని భరోసా ఇస్తున్నారు. డైరీలను సహకార రంగంలోకి తీసుకువచ్చి ప్రోత్సహిస్తే రైతులకు మేలు జరుగుతుంది. అప్పుడు చచ్చినట్టు ప్రై వేటు డైరీలు కూడా పాల సేకరణ ధర పెంచకతప్పదు. సకాలంలో డబ్బులు ఇస్తాయి. విశ్వసనీయతా పెరుగుతుంది. పాల సంఘాలను కంపెనీ చట్టం నుంచి సహకార చట్టంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ పర్యవేక్షణలో నడపగలిగితే ప్రైవేటు డైరీల ఆగడాలకు ముగుతాడు వేయడమే కాకుండా అటు పాడి రైతులకు ఇటు వినియోగదారులకు మేలు చేసినట్టవుతుంది. ఆ పని చేస్తానని జగన్ ఇచ్చిన హామీ పట్ల రాష్ట్ర పాడి రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది. – ఆకుల అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
ఆంధ్రా ప్యారిస్లో.. అందరిదీ అదేమాట
సాక్షి, అమరావతి : రాజకీయ చైతన్య వీచిక తెనాలి మార్పును ఆకాంక్షిస్తోంది. గత ఐదేళ్ల పాలన చేదు అనుభవాలను నెమరవేసేవారు కొందరైతే.. గ్రాఫిక్స్, ఇంద్రజాలం తప్ప అభివృద్ధి, సంక్షేమం కరువైన దైన్య స్థితిని గుర్తుచేస్తున్నవారు మరికొందరు. మాయామాటలతో మూలన పడేసిన హామీలకు కొత్త రంగు పులిమి అనుభవం ఉన్న నేతనంటూ కాళ్ల బేరానికొచ్చినా నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఓటుకు నోట్లిచ్చినా... గుడ్డిగా అనుకరించేవాళ్లు్ల కనిపించడం లేదు. హక్కును అమ్ముకునే అవసరమేంటనేది స్థానికుల ప్రశ్న. ప్రతి ఇంటికి నవరత్నాలు చేరితే ఏటా రూ.లక్షల ప్రయోజనం ఉంటుందంటూ వారంతా చెబుతున్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ‘సాక్షి’ బృందం జరిపిన రోడ్ షోలో ప్రజాభిప్రాయం వెల్లడైంది. నేతల నామినేషన్లతో తెనాలిలో పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. సాగునీటి శాఖ కార్యాలయం దాటి కాస్త ముందుకెళ్తే శీతల పానీయాలు ఆస్వాదిస్తూ కొందరు చర్చించుకుంటున్నారు. వారి ప్రధాన టాపిక్ వైఎస్సార్ సీపీ నవరత్నాలే. ‘చంద్రబాబు పథకాలెక్కడా? జగన్ నవరత్నాలెక్కడా? ఎన్నికల ముందు అదిగో ఇదిగో అంటూ చంద్రబాబు మాయ చేస్తున్నాడు. అర్థం కావట్లేదా?’ అనే హబీబుల్లా మాటలతో చర్చ కాస్త సీరియస్గా మారింది. ‘ఐదేళ్ల క్రితం అందరినీ నమ్మించాడు. ఇప్పుడూ అదే చేయాలనుకుంటున్నాడు. ఈసారి గ్రాఫిక్స్తో ముందుకొస్తున్నాడు. ప్రజలు దీన్ని గుర్తించాలి’ విశ్వనాథ్ మాటల్లో ఆవేశం కన్పించింది. ‘చదువుకున్నాళ్లే జనాన్ని చైతన్యం చెయ్యాలి’ ఆ పక్కనే చెరుకు రసం గ్లాస్ చేతుల్లోకి తీసుకున్న రమణ అన్నాడు. నవరత్నాల్లో లేని అంశమే లేదు. రైతులు, విద్యార్థులు, పేదలు, ఆరోగ్య శ్రీ ఒకటేంటి అన్నీ అందరికీ ఉపయోగపడేవే. జనంలోకి తీసుకెళ్లాలి’ అన్నాడు కొత్తగా ఓటొచ్చిన మల్లికార్జున ప్రసాద్. అక్కడకు వచ్చేవాళ్లు వస్తున్నారు... పొయ్యేవాళ్లు పోతున్నారు. చర్చ కొనసాగుతూనే ఉంది. ఐదేళ్ల మోసానికి ఓటే దీటైన జవాబు తెనాలి మండలం కొలకలూరులో ప్రజలను కదిలిస్తే చాలు మండిపడుతున్నారు. ఈ ఐదేళ్లు మోసపోయామన్న ఆవేదన వాళ్లలో కన్పిస్తోంది. తోటి మహిళలతో కోసూరు స్వప్న సాగించిన సంభాషణలో ఆ వాడివేడి తెలిసింది. ఒక్క నిమిషం అక్కడ ఆగితే... స్వప్నతో మరికొందరు మహిళలు గొంతు కలిపారు. ‘తెలుగు దేశపాయన నిన్న మా ఇంటికి వచ్చిండు వదినా.. వాళ్లంట పథకాలిత్తనారట. ఏదీ ఒక్కటైనా వచ్చిందా? సిగ్గు లేకుండా చెప్పుకొంటున్నారు. ఏం జగన్కు ఒక్క అవకాశం ఇస్తేంటి?’ అంటూ ఈశ్వరమ్మ స్వరం కాస్త గట్టిగానే పలికింది. ‘ఔను మా ఇంటికీ వచ్చారు. డబ్బులిస్తామన్నారు. ఏం చూసి ఓటేయాలని మా పిల్లలు అడిగితే సమాధానం లేదు’ రుక్మిణమ్మ తన ఇంట్లో విషయాలు చెప్పుకొచ్చింది. స్వప్న కాస్త అడ్వాన్స్డ్గా తన అభిప్రాయం బయటపెట్టింది. సుపరిపాలన ఇచ్చే వాళ్లకే ఓటెయ్యాలంది. జగన్ ఉండబట్టే ఆ పథకాలు... సమయం సాయంత్రం నాలుగవుతోంది. కొల్లిపర మండలం అత్తోట మెయిన్ రోడ్డులో ఓ తోపుడు బండి. వృద్ధులంతా చెట్టు కింద పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. తోపుడు బండి మీద వేడివేడి ఇడ్లీలు తినేవరకు రోజూ ఆ చర్చ ఇలాగే సాగుతుందట. ‘ఇదేంటి ఈ టైంలో టిఫినా...?’ అంటే అదంతే అన్నారు. ‘జగన్ నవరత్నాలు ప్రకటించాకే కదా చంద్రబాబు పథకాలు నెత్తికెత్తుకున్నాడు’ అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు గనిపిశెట్టి సాంబశివరావు. ‘జగన్ ఉండబట్టే ఈ ఐదేళ్లు చంద్రబాబు కాస్త వళ్లు దగ్గరపెట్టుకున్నాడు. జగన్ అంటే ఏంటో జనానికి తెలిసింది. మార్పు కోరుకుంటున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. జనసేన కుల ప్రభావాన్ని నమ్ముకుంది’ అన్నాడు రామశేఖరయ్య. ‘ఇడ్లీ రెడీ’ అని తోపుడు బండి అతను చెప్పేవరకు ఆ చర్చ రాజకీయాల చుట్టూ సాగుతూనే ఉంది. ఇవే కాదు... చెట్ల దగ్గర, చేలల్లో... రచ్చబండల వద్ద ఇలాంటి మాటామంతీలే! -
పుష్కరాలంటూ..రోడ్డున పడేశారు
‘గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కూడా అలాంటి ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే మీ ఇళ్లు తొలగించాలి. ప్రతి ఇంటికీ పరిహారం, స్థలాలు ఇస్తాం’ 2016 కృష్ణా పుష్కరాల సందర్భంగా మంత్రులు, అధికారులు చెప్పిన మాటలివి. ఆ ఏడాది జూన్లో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో సుమారు 300 కుటుంబాలకు చెందిన ఇళ్లను అధికారులు తొలగించారు. ఆ ప్రాంతంలో ‘సాక్షి’ పర్యటించగా.. నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఉన్నపళంగా ఇంటిని పీకేశారయ్యా. అప్పట్లో కనీసం సామగ్రి తరలించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. న్యాయం కోసం మూడేళ్లుగా తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు’ అని సరోజని వాపోయింది. లక్ష్మీదేవి అనే మహిళ మాట కలుపుతూ.. ‘కాళ్లరిగేలా తిరిగినా కూసింత జాగా కూడా ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు ఎలక్షన్లు రావడంతో తగదునమ్మా అంటూ ఓట్లగడానికి వస్తున్నారు’ అంటూ నిట్టూర్చింది. అటుగా వెళుతున్న పార్వతి మాట్లాడుతూ.. ‘పేదోళ్ల ఓట్లతో గెలిచిన నాయకులంతా తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఈసారి ఆయనే వస్తే చుట్టుపక్కల కొండలను పర్యాటకంగా తీర్చిదిద్దుతా అంటున్నాడే... ఆ కొండలపై ఉన్న వాళ్లందరినీ మనలాగే రోడ్డున పడేస్తారేమో’ అంటూ తన మనసులోని సందేహాన్ని బయటపెట్టింది. మరికొందరు ఏమన్నారంటే..... నా వయసు డెబ్భై ఏళ్లు. ఏడుగురు కొడుకులు. వారికి పిల్లలున్నారు. అంతా కృష్ణా నదిలో చేపలు పట్టుకుని జీవిస్తున్నారు. మా ఇంటితోపాటు నా పిల్లల ఇళ్లూ తొలగించారు. తాత్కాలికంగా 30 గజాల స్థలం ఇచ్చారు. అందులో ఆరుగురు ఉంటున్నారు. నాకు పాక వేసుకునే స్థోమత లేకపోవడంతో వినకొండ అంకమ్మ ఆలయంలో వండుకుని తింటున్నా. ఈ వయసులో ఇలాంటి దుర్భర జీవితం అనుభవించాల్సి వస్తుందనుకోలేదు. – మల్లాడి సీతామహాలక్ష్మి, నిర్వాసితురాలు అమ్మ ఇంట్లో తలదాచుకుంటున్నా భర్త లేడు. ఇద్దరు పిల్లలు. అబ్బాయి పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. అమ్మాయి పదో తరగతి చదివింది. కూలి పనులు చేసుకుంటున్నాం. 2016 జూన్లో మా ఇల్లూ తొలగించారు. ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. తాత్కాలికంగా స్థలాలు చూపించి చేతులు దులుపుకున్నారు. ఇళ్లు కట్టే శక్తి లేక మా అమ్మ గారింట్లో తలదాచుకుంటున్నాం. – బలగం భాగ్యలక్ష్మి, నిర్వాసితురాలు ఆవేదనతో నా భర్త మరణించాడు ‘మూడేళ్ల కిందట అధికారులంతా వచ్చి ఇళ్లు తొలగించారు. మేం ఖాళీ చేయబోమని చెప్పినా వినిపించుకోలేదు. పోలీసులొస్తారు.. లాఠీచార్జి చేస్తారంటూ భయపెట్టి ఖాళీ చేయించారు. ఈ ఆవేదనతో నా భర్త మంచాన పడ్డాడు. చివరకు గుండెపోటుతో చనిపోయాడు. ప్రస్తుతం నా కుమార్తె ఇంట్లో తలదాచుకుంటున్నా. – గాడి దుర్గ, నిర్వాసితురాలు రూ.2 వేల అద్దె కడుతున్నాం నాకు ఐదుగురు పిల్లలు. భర్త చనిపోయారు. నలుగురికి పెళ్లిళ్లు చేశా. నేను నా కుమారుడు ఉంటున్నాం. నాకొచ్చే పింఛన్ రూ.2 వేలు ఇంటి అద్దెకు సరిపోతోంది. మూడేళ్లుగా తిరగని కార్యాలయం అంటూ లేదు. అక్కడ చిన్నపాకలు వేసుకుంటే రెండు నెలలు కూడా నివశించలేకపోయాం. చిన్నపాటి వర్షానికే మోకాలులోతు నీరు వచ్చేది. – సి.శివకుమారి, బాధితురాలు తాత్కాలిక స్థలాలే సీతానగరంలో 300 కుటుంబాలు, రోడ్ల విస్తరణ పేరుతో మరో వంద ఇళ్లను తొలగించారు. మూడేళ్లలో ఏ ఒక్క కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయలేదు. పోలకంపాడు సమీపంలో కుటుంబానికి 45 గజాల స్థలమిచ్చారు. సీతానగరం బోటు యార్డు సమీపంలో 30 గజాల చొప్పున ఇచ్చారు. కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు బాధితులు ముందుకు రావడం లేదు. కేటాయించిన స్థలాలు కూడా తాత్కాలికమే కావడం గమనార్హం. -
మద్యం పై యుద్ధం
సాక్షి, బాపట్ల : ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన భర్త తూలుతూ వస్తాడు.. నాన్న వస్తే పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు అడుగుదామని గుమ్మం వద్ద ఎదురుచూస్తూ ఉన్న కూతురికి తన తండ్రి నోటివెంట వచ్చే మద్యం వాసన గుప్పుమంటుంది. ప్రెండ్స్తో పార్టీలో ఉన్నానని భర్త ఫోన్ చేసి చెబుతాడు. కళాశాలకు వెళ్లే కుర్రాడి గదిలో బీరుబాటిల్స్ దర్శనమిస్తుంటాయి. నెలఖర్చులు జమచేసేందుకు జీతం డబ్బులు లెక్కేస్తే మిగిలినవి కనిపించని పరిస్థితి. రోజంతా కాయాకష్టంచేసి ఉన్నదంతా మద్యానికి తగలేసి ఇంటిల్లిపాదీ పస్తులు పెట్టే మహానుభావులు కూడా ఎందరో... కుటుంబాలను ఎంతో నాశనం చేస్తున్న ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే కారణం మద్యం. దురలవాటుల వల్ల మాత్రమే ఈ నష్టాలకు కారణం అనుకుందామనుకుంటే.. ప్రభుత్వం మరో కారణంగా ఉండడం బాధాకరం. మద్యం విక్రయాలు పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్న ఆర్థిక సూత్రాన్ని తరతరాలుగా పాలకులు ఫాలో అవుతున్నారు. ఎన్నికలకు మందు గ్రామానికి ఓ మహిళా కానిస్టేబుల్ను నియమిస్తాం.. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు లేకుండా చూస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాలకు తాగునీటికన్నా కూడా మద్యమే అందుబాటులో ఉండేలా వీధికొకషాపు చొప్పున ఏర్పాటు చేయించారు. తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని నవరత్న పథకాల్లో ప్రకటించారు. అది ఎలా నిషేధిస్తారో కూడా ప్రణాళికను ప్రజల ముందు ఉంచారు. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల పట్టణం, మండలం, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల పరిధిలో 22 మద్యం దుకాణాలు 4 బార్లు ఉన్నాయి. సుమారు నియోజకవర్గంలో 50కు పైగా అనధికారికంగా బెల్టుషాపులు ఉంటాయని మహిళలు అరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలో పర్యటించినప్పుడు మహిళల బాధలు నేరుగా చూశారు. బరువెక్కిన హృదయాలతో వారు చెప్పిన మాటలు విని చలించిపోయారు. ఇళ్ల మధ్యనే మద్య దుకాణాలు ఉండడంతో చిన్నపిల్లలు సైతం వెసనపరులుగా మారుతున్నారంటూ జననేత వద్ద మహిళలు అవేదన చెందారు. మద్యపాన నిషేధానికి పెద్దపీట మద్యం ఎంతగా పేదల కుటుంబాలను కుంగతీస్తుందో కళ్లారా చూసిన జగన్ నవరత్నాల్లో మద్యపాన నిషేధానికి పెద్దపీట వేశారు. ఐదేళ్లల్లో శాస్త్రీయ పద్ధతిలో దశలవారీగా మద్యం నిషేధిస్తామంటూ పార్టీ జాతీయ ప్లీనరీలో ప్రకటన చేశారు. ఉత్తుత్తి హామీ కాకుండా నిషేధం ఏ పద్ధతిలో చేస్తానో కూడా వివరించడంతో జగన్మోహన్రెడ్డిపై మహిళలకు నమ్మకం కలిగింది. దేవుని దయవలన ప్రజలందరి ఆదరణ వల్ల ఏర్పడే ప్రజా ప్రభుత్వ పాలనలో మద్య విక్రయాలను ఏడాదికాఏడాది తగ్గిస్తూ మద్యం మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రణాళికను రూపొందించారు. దీంతో కారుచీకట్లో కాంతిపుంజంలా మహిళలకు జగన్మోహన్రెడ్డిపై అభిమానం పెరిగింది. ఆయన అధికారంలోకి వచ్చి మద్యాన్ని నిషేధిస్తే సామాన్య కుటుంబాలు ఎన్నో బాగుపడుతాయంటూ ప్రజా ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. తప్పక నెరవేరుస్తారనే విశ్వాసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం తాగటానికి నీళ్లులేక ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం అసలు చర్యలు తీసుకోవడం లేదు. కానీ విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బెల్టుషాపులు పెట్టి ఖజానా నింపుకుంటున్నారు. ఐదేళ్ల నుంచి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. సంపాదించిన సొమ్మంతా మగవారు తాగుడుకే తగలేయడంతో కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. జగనన్న ప్రకటించిన మద్యపాన నిషేధ హామీ తప్పక నేరవేరుస్తారని విశ్వాసం ఉంది. – కొండా అన్నమ్మ రాజన్న బిడ్డ.. మాట నిలబెట్టుకుంటాడు తెలుగు ప్రజల దైవం.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలుబెట్టుకుంటాడన్నా విశ్వాసం మాలో ఉంది. ఐదేళ్లపాటు చంద్రబాబు పాలన చూసిన తర్వాత జగనన్నకు ఓ అవకాశం ఇచ్చి చూడాలన్న ఆలోచన ప్రజలందరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని విడతల వారీగా నిషేధిస్తామని నవరత్నాల్లో ప్రకటించడం మహిళల్లో భరోసా నింపుతుంది. –షేక్ ఫాతిమా -
‘రైతు’కు జగన్ భరోసా..
మట్టి తల్లినే నమ్ముకున్నారు వారంతా. రేయింబవళ్లు ఆ తల్లి ఒడిలోనే కాలం గడుపుతారు. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని వారంతా కరాల సత్తువ..నరాల బిగువుతో స్వేదం చిందించి..ఆరుగాలం ఇంటిల్లిపాది కష్టపడి పంటలు సాగుచేస్తే..అతివృష్టి, లేకపోతే అనావృష్టి కారణంగా వారి శ్రమ మట్టిలో కలిసిపోతోంది. అన్నీ బాగుండి పంట చేతికొచ్చినా సరైన మద్దతు ధర లభించకపోవడంతో పెట్టుబడికి కూడా నోచుకోలేకపోతున్నారు. దీంతో రైతులు పంట పెట్టుబడి కోసం బ్యాంకుల్లోను, వ్యాపారుల దగ్గర తెచ్చే రుణాలకు వడ్డీలు పేరుకుపోయి తడిసిమోపెడవుతున్నాయి. ఎవరో వస్తారని..ఏదో చేస్తారని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అన్నదాతలు విసిగి వేశారిపోయారు. అంతలో అన్నదాత దీనస్థితిని ఆకళింపు చేసుకుని..రైతులకు భరోసా కల్పించాలని భావించి నేనున్నానంటూ ముందుకు వచ్చారు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుకు భరోసా కల్పిస్తానని ధైర్యం చెబుతూ రైతు భరోసా పేరిట అన్నదాతలను ఎలా ఆదుకుంటామో తెలియజేస్తూ వారికి కొండంత మనోస్థైర్యాన్ని కల్పించారు. సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే తినడానికి తిండి లేదు. జీవనం లేదు. ప్రజలందరికీ అన్నం పెట్టే రైతులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో, రుణ భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందరి జీవితాలతో ముడిపడి ఉన్న రైతులు ఆధారపడిన వ్యవసాయ రంగం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో రైతులకు వ్యవసాయం చేయడం సమస్యగా మారింది. గతి లేక వ్యవసాయం చేస్తే, చివరిలో విపత్తు వస్తే, ఆ ఏడాది పంట తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ పరిస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయాన్ని పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు రైతాంగానికి, వ్యయసాయ రంగానికి మేలు చేసేందుకు ముందుకువచ్చారు. తాను రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పేరిట రైతాంగాన్ని అదుకుంటామని ధైర్యం చెబుతున్నారు. ఈ హామీతో సగటు రైతుకు ఏడాదిలో కనీసం ఒక రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. ఏటా రూ.12,500 ఆర్థిక సాయం, ఉచిత బోరు, ఉచిత విద్యుత్, రోడ్ ట్యాక్స్, సున్నా వడ్డీ వంటి సేవలతో రైతులకు ప్రతి ఏటా ప్రయోజనం చేకూరుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీతో ప్రతి రైతు ధైర్యంగా వ్యయసాయం చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. గతంలో రైతులు పంటలకు భద్రత లేక, పెట్టుబడికి భరోసా లేక వ్యయసాయాన్ని విడిచి, ఇతర పనులు, ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఒక్కోసారి రాత్రింబవళ్లు తేడా లేకండా విద్యుత్ సరఫరా కోసం పొలంలో పడిగాపులు కాసిన సందర్భాలు కోకొల్లలు. పంటలు వేసే సమయంలో పెట్టుబడి లేక, అప్పు దొరక్క అవస్థలు పడిన పరిస్థితులు అధికం. తీరా బ్యాంకు నుంచి రుణం పొందినా, ప్రతిఏటా వడ్డీ కట్టలేని పరిస్థితి. రైతులకు ఎప్పటికప్పుడు అప్పు కావాలంటే దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రతిపక్షనేత, వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో భాగంగా రైతాంగాన్ని ఆదుకోవడం సంతోషమంటూ రైతులు సంబరపడుతున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా ఇలా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తాం. ఆ మొత్తాన్ని మే నెలలో పెట్టుబడి కోసం రూ.12,500 చొప్పున నాలుగేళ్లు చెల్లిస్తాం. రెండవ సంవత్సరం నుంచి, రైతన్నకు వడ్డీలేని రుణాలు, రైతులకు ఉచిత బోర్లువేయిస్తాం. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్కి రూ.1.50 తగ్గింపు రైతుల కోసం రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు,రైతులకు రూ.4000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు మొదటి ఏడాది సహకార రంగం పునరుద్ధరణ రెండో ఏడాది సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 సబ్సిడీ వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు దురదృష్టవశాత్తు ఆత్మహత్యకు పాల్పడిన రైతుకు వైఎస్ఆర్ బీమా పేరిట ఆ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం. అంతేకాకుండా ఆ డబ్బు అప్పుల వారికి చెందకుండా అసెంబ్లీ తీర్మానం తీసుకువస్తామని నవరత్నాలు పథకంలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ బీమాతో ఆర్థిక ఆసరా మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా పేరిట రూ.5 లక్షలు నగదు ఇస్తామని చెప్పడం చూస్తుంటే ఆ రైతు కుటుంబానికి ఆసరా లభించినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు పేద రైతులు చనిపోతే, బాధిత కుటుంబం రోడ్డున పడుతోంది. ఇక నుంచి ఈ పథకంతో రైతుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది రైతు కుటుంబాలకు నిజంగా మంచి ఆసరా. –సాధు రామారావు, ఏవీ పేట, గార మండలం రైతుకు పెట్టుబడి ప్రకటన ఎంతో మేలు ప్రతి రైతుకు ఏటా రూ.12,500 ఇస్తామని, అది కూడా ఖరీఫ్ సీజన్కు ముందు వ్యవసాయానికి పెట్టుబడికి పనికి వచ్చేలా సకాలంలో అందజేస్తామని, ఇలా ఐదేళ్లలో ప్రతి రైతుకు రూ. 50 వేలు ఆర్థిక ప్రోత్సాహం సమకూరుస్తామని చెప్పాడం వల్ల రైతుకు చాలా మేలు జరుగుతుంది. దీని వల్ల రైతుకు వ్యవసాయంపై ఆసక్తి కలుగుతుంది. – గోండు రఘురాం, వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు వడ్డీలేని రుణంతో ప్రయోజం వడ్డీలేని రుణాలను మంజూరు చేయడం వల్ల రైతులు తీసుకున్న అప్పులో అసలు వేగంగా చెల్లించవచ్చు. వడ్డీ పెరిగే ప్రమాదం లేనందున ఏటా అప్పుతీసుకోవడం, సకాలంలో తీర్చుకోవడం కుదురుకుంది. –అనుపోజు నాగరాజు, శ్రీకాకుళం తీరనున్న సాగునీటి సమస్య సాగునీరు అందుబాటులోలేని, వర్షాభావంపై ఆధారపడి ఉన్న భూములలో ఉచితంగా లక్షలాది రూపాయల వ్యయంతో మెట్టు భుముల్లో బోర్లు వేయడం వల్ల పంటలు పండుతాయి. పల్లం, మెట్టు భూముల రైతులకు మేలు చేకూరుతుంది. మూడు పంటలు పండించే అవకాశం ఉంది. –యతిరాజుల ప్రసాదరావు, రైతు, శ్రీకాకుళం జిల్లాలో రైతుల పరిస్థితి....... ఏ జిల్లాలో ఉన్న రైతు కుటుంబాల సంఖ్య –6.70 లక్షలు ఏ రైతులు ప్రతి ఏటా తీసుకున్న రుణాల మొత్తం రూ. 1,400 కోట్లు ఏజిల్లాలో ఉన్న విద్యుత్ బోర్లు 11,000 ఏజిల్లాలో ఆక్వా ప్లాంట్లు 10,000 ఏజిల్లాలో సహకార సంస్థలు 48 (ఎన్జీవో–ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 100) ఏ జిల్లాలో వ్యసాయ ట్రాక్టర్లు 7,000 -
ఇదే నా జలయజ్ఞ వాగ్దానం: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ జల దినోత్సవాన్ని(మార్చి 22) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్షలాది రైతుకుటుంబాలకు వెలకట్టలేని లబ్ధి చేకూర్చే జలయజ్ఞం వాగ్దానాన్ని పునరుధ్ఘాటించారు. నవరత్నాల్లోని జలయజ్ఞం వాగ్ధానంకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కల జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం మొదలు పెండింగ్లో ఉన్న హంద్రీనీవా, గాలేరునగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. అన్ని ప్రాజెక్టులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదే నా జలయజ్ఞ వాగ్దానమని పేర్కొన్నారు. Fulfillment of my father, Late Dr.YS Rajashekhar Reddy’s dream irrigation projects. Completion of all pending projects including Polavaram. This is my ‘Jalayagnam’ promise! #NavaRatnalu #WorldWaterDay pic.twitter.com/exdrzUCA82 — YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2019 -
వైఎస్సార్సీపీలో నూతన ఉత్సాహం
ఎన్నికల రోజు వచ్చేసరికి చంద్రబాబు ఒక పెద్ద డ్రామాకు తెరలేపుతారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు పెడతారు. అవ్వా, తాతా, అక్కా, చెల్లీ.. ప్రతి వారిని కోరేది ఒకటే. రూ.3 వేలకు మోసపోకండి. పాదయాత్రలో ప్రతి పేదవాని గుండెచప్పుడూ నేను విన్నాను. మీ బాధలు అర్థం చేసుకున్నాను. ప్రతి వ్యక్తికి సంక్షేమ పాలన అందించేందుకు నేను ఉన్నాను. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో సమరనాదం మోగించారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో కొయ్యలగూడెం జనసంద్రంగా మారింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయుడు వైఎస్ జగన్ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు గిరిజనం వెల్లువలా తరలివచ్చింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా జనం జగన్ రాక కోసం పడిగాపులు పడ్డారు. ఒక్కసారి తమ అభిమాన నేతను తనివితీరా చూసేందుకు మేడలు, మిద్దెలు ఎక్కి మరీ వేచి చూశారు. జగన్ ప్రసంగిస్తున్నంత సేపూ ఆయన ప్రతి మాటకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మహిళలు, రైతులు, అవ్వాతాతలు, యువతకు భరోసా కల్పిస్తూ హామీలు ఇస్తుంటే కరతాళ ధ్వనులతో హర్షామోదాలు తెలిపారు. కాబోయే సీఎం.. సీఎం.. సీఎం.. అంటూ యువత నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో వైఎస్సార్సీపీలో నూతన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. పార్టీ నేతలు, క్యాడర్లోనూ జగన్ రాక కొండంత ధైర్యాన్ని నింపిందనటంలో సందేహం లేదు. నే విన్నాను.. నేనున్నాను రాష్ట్రవ్యాప్తంగా 14 నెలల పాటు 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లు మీ అందరి చల్లని దీవెనలు, దేవుని ఆశీస్సులతో పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మీతో నడిచాను మీ కష్టాలు విన్నాను.. మీ బాధలు అర్థం చేసుకున్నాను.. పాదయాత్రలో ప్రతి పేదవాని గుండెచప్పుడూ నేను విన్నాను.. ప్రతి పేదవానికీ సంక్షేమ పాలన అందించేందుకు నేను ఉన్నాను.. అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగానికి అశేష ప్రజానీకం నుంచి విశేష స్పందన వచ్చింది. అక్కాచెల్లమ్మల బాధలన్నీ నేను విన్నాను.. నేనున్నాను అనీ, పాదయాత్రలో దారిపొడవునా రైతన్నల కష్టాలన్నీ నేను విన్నాను.. వారికి కొండంత అండగా నేనున్నాను.. అంటూ భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ హామీలు ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రసంగం ఆద్యంతం ప్రజల నుంచి హర్షామోదం లభించింది. తాను ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తానో స్పష్టంగా తెలిపారు. వైఎస్ జగన్ హామీలు ఇస్తున్నంత సేపూ ప్రజలు చప్పట్లు, ఈలలతో హర్షద్వానాలు చేస్తూ మద్దతు తెలిపారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల మాఫియాను తెచ్చాడని, వాటిని పూర్తిగా రద్దు చేస్తానని జగన్ చెప్పారు. లంచాలు లేని సంక్షేమ పాలన ఇస్తానంటూ ప్రజలకు వాగ్దానం చేశారు. అక్కా, చెల్లీ రూ.3 వేలకు మోసపోవద్దు చంద్రబాబునాయుడు రాబోయే రోజుల్లో చేయని జిమ్మిక్కులు ఉండవు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయనే సరికి చంద్రబాబు చూపని సినిమా ఉండదు. చేయని డ్రామా ఉండదు. చెప్పని అబద్ధం ఉండదు. చేయని మోసం ఉండదు. ఎన్నికల రోజు వచ్చేసరికి చంద్రబాబు ఒక పెద్ద డ్రామాకు తెరలేపుతారు. గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు పెడతారు. అందరినీ కోరేది ఒకటే.. ప్రతి అక్క, చెల్లెమ్మ వద్దకు వెళ్లి చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. అన్నను గెలిపించుకుందాం. ఆయన్ను గెలిపించుకుంటే మన పిల్లల చదువుకు భరోసా ఉంటుందని తెలపండి అని జగన్ సభికులకు తెలిపారు. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు సంబంధించి ఎన్నికల నాటికి ఎంతైతే అప్పుందో ఆ అప్పును నాలుగు దఫాల్లో వారి చేతికే ఇస్తామని చెప్పండి. ప్రతి అవ్వాతాతకు చెప్పండి అన్న ముఖ్యమంత్రి అయితే పెన్షన్ రూ.3 వేలు చేస్తాడని, ప్రతి రైతన్నకు చెప్పండి వ్యవసాయాన్ని పండుగ చేస్తాడనీ అంటూ ఎన్నికల్లో టీడీపీ మోసాలను ఎండగడుతూనే.. తానేమి చేయబోతానో వైఎస్ జగన్ వివరంగా చెప్పారు. సభలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ∙ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని అక్కాచెల్లెమ్మలకు ఎంతైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పంతా 4 దఫాల్లో నేరుగా వారి చేతులకే ఇస్తాను. ∙ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అక్కాచెల్లెమ్మలు 45 నుంచి 60 ఏళ్లు వయసున్న వారికి వైఎస్సార్ చేయూత పథకంలో రూ.75 వేలు ఇస్తాం ∙పిల్లలను బడికి పంపించే ప్రతి మహిళకు ఏడాదికి రూ.15 వేలు వారికి అందిస్తాం ∙అప్పులన్నీ మాఫీ చేయటమే కాదు.. సున్నా వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చేస్తాను ∙ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్న చేతికి పెట్టుబడిగా రూ.12,500 ఇస్తాను ∙నాలుగేళ్లలో ప్రతి రైతుకు పెట్టుబడిగా రూ.50 వేలు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం ∙రైతన్నలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటమే కాదు, బీమా సొమ్ములు మేమే కడతాం ∙రైతన్నలకు పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తాం, వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం ∙వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ లేకుండా అన్నిరకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తాం ∙రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ∙తుపానులు వస్తే రైతులను ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు ∙రైతన్నలు ప్రమాదవశాత్తు మరణించినా, ఆత్మహత్యలు చేసుకున్నా రూ.7 లక్షలు డబ్బులు ఇస్తాం ∙పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2006, 2007లో రూ.1 లక్ష, రూ.1.5 లక్షలకే భూములు త్యాగం చేసిన రైతన్నకు ముందే చెప్పినట్లు రూ.10 లక్షలు పరిహారం అందిస్తాం ∙ప్రతి అవ్వాతాతకు పింఛను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచి ఇస్తాం -
అన్న వస్తున్నాడు...
సాక్షి, మంగళగిరి : అన్న వస్తున్నాడు! నవరత్నాలతో రాష్ట్ర గతిని మార్చనున్నాడు. పేదవాడి ఇంటికి సంక్షేమాన్ని చేర్చనున్నాడు. రాజన్న రాజ్యాన్ని నెలకొల్పి చదువుల విప్లవానికి నాంది పలకనున్నాడు. అవును ఇప్పుడు నియోజకవర్గంలో వినిపిస్తున్న మాటలు ఇవి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పట్టణంలోని అంజుమన్ షాదిఖానా పక్కన మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పార్టీ కార్యాలయం చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా కార్యాలయానికి వచ్చిన యువకులు వాటిని చూసి తాము విషయాలను తెలుసుకోవడంతో పాటు పదిమందికీ వివరిస్తున్నారు. -
మహిళలకు అండ.. వైఎస్సార్ చేయూత
సాక్షి, రాచర్ల (ప్రకాశం): వైఎస్సార్ సీసీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై గ్రామాల్లోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఇస్తామని జగన్ ప్రకటించడంతో మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుందని చర్చించుకుంటున్నారు. ఈ పథకం ప్రకటించినందుకు జనగ్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలుపించుకుని, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని మహిళలు ఆకాంక్షిస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు వ్యాపారాలు చేసుకోవచ్చు... జగనన్న ప్రవేశ పేట్టిన వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలు వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ఎవరి దగ్గరో అప్పు అడగాల్సిన అవసరం లేదు. జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము. - బైర్ల. లలితమ్మ, మాజీ సర్పంచు, యడవల్లి వైఎస్సార్ చేయూత పథకం పేద మహిళలకు వరం వైఎస్సార్ చేయూల పథకం నిరుపేదలైన ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఒక వరం లాంటిది. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది తమ కుటుంబానికి అసరాగా నిలుస్తారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టలేదు. జగన్మోహన్రెడ్డి చేయూత పథకం ద్వారా మహిళలకు రూ.75 వేలు ప్రకటించడంపై చాలా సంతోషంగా భావిస్తున్నాము. - బందం శకుంతల, మాజీ సర్పంచు, రాచర్ల టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగలేదు... టీడీపీ ప్రభుత్వంలో మహిళలను చిన్నచూపు చూశారు. మహిళలు అంటే గౌరవం లేదు. డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తామని చంద్రబాబు మహిళలను మోసం చేశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మహిళలకు నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఇస్తామని జగనన్న ప్రకటించడంతో చాలా సంతోషంగా ఉంది. అందుకే జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే మహిళలకు న్యాయం జరుగుతుంది. - సగినాల రాయలమ్మ, రాచర్ల నవరత్నాలు ఒక వరంగా బావిస్తున్నాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు రాష్ట్రంలోని ప్రజలకు, మహిళలకు ఒక వరంగా భావిస్తున్నాం. ముఖ్యంగా నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళల అభివృద్ధి కోసం జగనన్న వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రవేశ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో జగనన్న సీఎం కావాలని కోరుకుంటున్నాము. - సూర.చిన్నమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు, ఆకవీడు -
మంచి జీవితం నవరత్నాలతోనే సాధ్యం ..
సాక్షి, పెళ్లకూరు: చంద్రబాబు నిరంకుశ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల అధికారాలను తుంగలో తొక్కి ‘జన్మభూమి కమిటీలు’ ఏర్పాటుచేసి నిధులను టీడీపీ నేతలు స్వాహా చేసేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారు. సంక్షేమం పేరుతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అర్హుల చెంతకు చేరలేదు. తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి పాలన చూసిన ప్రజలు ‘మార్పు’ కోరుకుంటున్నారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు భరోసా కల్పిస్తున్నాయి. జగన్ సీఎం అయితే ప్రతి ఇంట ఆనందం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. రూ.40 వేలు రుణమాఫీ అయింది.. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పంటపై తీసుకున్న రుణం రూ.40 వేలు ఒకే దఫా రుణమాఫీ జరిగింది. చంద్రబాబునాయుడిని నమ్మి నిండా మునిగాం. ఆయన రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. బ్యాంక్ నుంచి నోటీసులు రావడంతో రుణాన్ని విడతల వారీగా చెల్లించాల్సి వచ్చింది. వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తి జగన్. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరిపోతాయి. – కొండా చిన్నఅంకయ్య, రైతు, తల్లంపాడు గ్రామం నిరుద్యోగ సమస్య ఉండదు.. వైఎస్సార్ హయాంలో సెజ్ భూముల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అధికారంలోకి వస్తే జగన్మోహన్రెడ్డి పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా బిల్లు తెస్తామన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య ఉండదు. జగన్పై నమ్మకం ఉంది. – పి.సుబ్బలక్ష్మి, ఎగువచావలి న్యాయం జరుగుతుంది.. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసి అన్నివర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన మాటపై నిలబడతారు. – ఎ.రామకృష్ణ, గోమతి గార్డెన్, తాళ్వాయిపాడు రైతులు రారాజుల్లా బతుకుతారు వైఎస్సార్ రైతు భరోసాతో రైతులందరూ రారాజుల్లా బతుకుతారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పడంతో అన్నదాతలకు భవిష్యత్పై భరోసా ఏర్పడింది. – రఘునాయుడు, పెళ్లకూరు మిట్ట పేదలకు కార్పొరేట్ వైద్యం వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తామని జగన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ బాగా అమలవుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ అందించి జగనన్న ఆదుకుంటారు. – పోలంరెడ్డి శ్రీదేవి, నెలబల్లి -
రైతు కష్టం ఊరికే పోదిక
అది 2017.. ఏప్రిల్.. మండు వేసవి.. కళ్లాల్లో మిర్చి కళకళలాడుతోంది. ఎర్రటి ఎండకు మిలమిలా మెరిసిపోతోంది. సరిగ్గా అప్పుడే మార్కెట్ క్రాష్ అయింది. మే నెల మొదటి వారానికి క్వింటాల్ మిర్చి ధర రూ.14, 12 వేల నుంచి అమాంతం రూ.5 వేలకు పడిపోయింది. రైతులు పోరు బాట పట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి మిర్చి రైతులకు అండగా శాసనసభలో అధికార పక్షాన్ని నిలేశారు. ధరల స్థిరీకరణ నిధి కోసం గుంటూరు మార్కెట్ యార్డుకు సమీపంలో రెండు రోజుల నిరాహార దీక్ష చేశారు. మాట ఇచ్చి మరచిన బాబు.. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ప్రతిపాదిస్తే చంద్రబాబు ఏకంగా రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మర్చిపోయాడు. లక్షలాది మంది రైతులు కంది, పెసర, మినుము, పసుపు, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, వరి, టమాటా, ఉల్లి.. ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఉల్లికి ధర లేక రైతులు పొలాల్లోనే విడిచిపెట్టే దుస్థితి. టమాటాలను రోడ్ల మీద పారబోసి ఎడ్లతో తొక్కించిన దృశ్యాలనూ మర్చిపోలేం. సరిగ్గా ఈ దశలో జగన్మోహన్రెడ్డి 2017లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి, 2 వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. రైతుల్ని ఆదుకుంటామని, ప్రతి పంటకూ ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతో పాటు పంట వేయడానికి ముందే రైతులకు గిట్టుబాటు ధరనూ ప్రకటిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇదే జరిగితే రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా తక్కువకు అమ్ముకునే దుస్థితి ఉండదు. ప్రకృతి వైపరీత్యాల నిధి.. ఈ నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లను కేటాయిస్తే కేంద్రం మరో రూ.2వేల కోట్లను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రూ.4వేల కోట్లతో నిధి ఏర్పాటవుతుంది. రాష్ట్రంలో కరవులు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ నిధి ఉపయోగపడుతుంది. తిత్లీ వంటి తుపాన్లు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు, వరదలు వచ్చినప్పుడు కేంద్రం సాయం కోసం చకోర పక్షిలా ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల్ని ఆదుకోవచ్చు. అన్నదాతల ముఖంలో చిరునవ్వు చూసేందుకు ఈ స్కీములు తోడ్పడతాయని – కనీస మద్దతు ధరల నిర్ణాయక కమిటీ– మాజీ సభ్యుడు అతుల్ కుమార్ అంజన్ వంటి వారు సైతం ప్రశంసించారు. ధరల స్థిరీకరణ నిధి పథకం అంటే.. పంటలకు మార్కెట్లో కనీస మద్దతు ధర రానప్పుడు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. వచ్చిన పంటను దళారీల చేతుల్లో పోసి దక్కిందే చాలనుకుని కన్నీళ్లు పెట్టుకునే దయనీయమైన స్థితి రైతుకు ఇక ఉండదు. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలులో ఏదైనా నష్టం వాటిల్లితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇదే జరిగితే... రైతు చిందించిన చెమట చుక్కలు వృథాగా పోవిక, రూపాయలుగా మారి బ్యాంకులో జమ అయి తీరుతాయి. – ఎ.అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
ఆరోగ్యశ్రీ కావాలంటే.. ‘రావాలి జగన్’
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సర్వేలన్నీ వైఎస్సార్ సీపీకే అనుకూలంగా వస్తున్నాయి. టీడీపీ నుంచి నాయకులు వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏంచేయాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలుపోవడం లేదు. ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీపై వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెలుగు తమ్ముళ్లకు పూరమాయించారు. అంతేకాదు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన హామీలను నిసిగ్గుగా కాపీ కొట్టేస్తున్నారు. ‘నవరత్నాల’ను హడావుడిగా అమలు చేయడం మొదలుపెట్టారు. పింఛన్ పెంపు, పొదుపు సంఘాల రుణమాఫీ హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు విశ్వసించరని వైఎస్సార్ సీపీ దీమాగా ఉంది. చంద్రబాబు పాలనలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న రాజన్న తనయుడి మాటతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరిస్తామని, తాను కూడా చికిత్స కోసం అక్కడికే వెళ్లేలా గవర్నమెంట్ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తానని జగన్ చెప్పిన మాటను జనం పూర్తిగా విశ్వసిస్తున్నారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని, ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తామన్న వైఎస్ జగన్ హామీ పేదల పాలిట ఆశాదీపంలా మారింది. అన్ని రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని వాగ్ధానం చేసిన జననేత ఎప్పుడు అధికారంలోకి వస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రపంచంలోనే అద్భుతమైన పథకంగా ప్రపంచ బ్యాంక్ నీరాజనాలు అందుకున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఏపీలో ఆస్పత్రులను అభివృద్ధి చేయకుండానే హైదరాబాద్లో వైద్యం చేయించుకునే వెసులుబాటు లేకుండా ప్రభుత్వ విధించిన ఆంక్షలు పేద ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో తరచుగా ప్రైవేటు ఆస్పత్రులు నిరసనలకు దిగుతుండటంతో రోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం దక్కాటంటే ‘రావాలి జగన్’ అంటూ ప్రజలు నినదిస్తున్నారు. -
భయంతో ’నవరత్నాలు’ కాపీ కొడుతున్న బాబు
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలను చూసే టీడీపీ నేతలు పార్టీని వీడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భయంతోనే ’నవరత్నాలు’ను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పేర్ని నాని శనివారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో జోగి రమేష్తో కలిపి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ భయంతోనే చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో అధర్మ దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష కోసం రూ.14 కోట్లు దుర్వినియోగం చేశారని పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి మాట దేవుడెరుగని, ఆంధ్రప్రదేశ్ను రుణాంధ్రప్రదేశ్గా మార్చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఇస్తున్నది కల్తీ కుంకుమ, కల్తీ పసుపు కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్కు ప్రజల ఆశ్సీసులు.. వైఎస్ జగన్కు ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి, ఆయనతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్ని నాని అన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలుపై చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ తలో మాటా మాట్లాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పతనం ఖాయమని జోస్యం చెప్పారు. కాపులను మోసం చేసింది చంద్రబాబు, చినరాజప్పేనని పేర్ని నాని ఆరోపించారు. కాపులను బీసీలను చేస్తామని సొల్లు కబుర్లు చెప్పిన చినరాజప్ప...కాపులకు బీసీ సర్టిఫికెట్లు ఇప్పించగలరా అని ప్రశ్నలు సంధించారు. చినరాజప్ప తీరు వెర్రి వెంగళప్పలా ఉందని అన్నారు. అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ను కాపు ద్రోహులంటున్న చినరాజప్పే కాపు ద్రోహి అని పేర్ని నాని మండిపడ్డారు. కాపుల మనోభావాలను చంద్రబాబు కాళ్లదగ్గర తాకట్టు పెట్టారన్నారు. ఇక పార్టీ మారేవాళ్లు రాజకీయ పరిపక్వత లేనివారన్న కళా వెంకట్రావు మాత్రం ...అవకాశాల కోసం ఎన్ని గోడలు అయనా దూకుతారంటూ ధ్వజమెత్తారు. బాబూ మీ ఆస్తులు హైదరాబాద్లో లేవా? బీసీల కోసం వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకోబోతున్నారని వైఎస్సార్ సీపీ నేత జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు బీసీలను ఓట్ల కోసం వాడుకుంటున్నారే తప్ప, వాళ్లకు చేసిందేమీ లేదని విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే బీసీలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రమంతా ముక్తకంఠంతో నిన్ను నమ్మం బాబు అంటున్నారని, టీడీపీలో ఉన్న నేతలు కూడా ఆయనను నమ్మడం లేదన్నారు. టీడీపీ నేతలంతా వైఎస్సార్ సీపీలో చేరుతుంటే చంద్రబాబుకు చలిజ్వరం వచ్చిందన్నారు. చంద్రబాబు మరో పదిరోజుల్లో ఆపద్ధర్మ సీఎం, 50 రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి అవుతారని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు పతనం ఖాయమని, ఆయనవి ఉత్తర కుమార ప్రగల్భాలేని తేల్చేశారు. కేసీఆర్, నరేంద్ర మోదీ బెదిరిస్తున్నారంటున్న చంద్రబాబు.. ఆస్తులు, ఆ పార్టీ నేతల ఆస్తులు హైదరాబాద్లో లేవా అని ప్రశ్నించారు. -
‘రైతు భరోసా’ కాపీగా ‘అన్నదాత సుఖీభవ’
-
మళ్లీ కాపీ కొట్టిన చంద్రబాబు...
సాక్షి, అమరావతి : ప్రతి విషయంలోనూ పక్కవాళ్ల క్రెడిట్ను చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకువడంలో సిద్ధహస్తుడనే విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరిగి అధికారం దక్కించుకోవడానికి ఆయన దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ’నవరత్నాలు‘ను చంద్రబాబు నాయుడు వరుసపెట్టి కాపీ కొడుతున్నారు. కాపీ కొట్టడమే కాకుండా అదంతా తమ ఘనతే అని ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. గురువారం నుంచి ఏడు జిల్లాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్, ఈ నెలాఖరున సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో చంద్రబాబు సర్కార్... చివరి కెబినెట్ సమావేశంలోఎన్నికల తాయిలాలను విచ్చలవిడిగా ప్రకటించేసింది. ‘రైతు భరోసా’ కాపీగా ‘అన్నదాత సుఖీభవ’ గత నాలుగు కేబినెట్ సమావేశాల్లో వైఎస్ జగన్ హామీలు ఏపీ మంత్రివర్గం అజెండాలో చర్చకు రావడమే కాకుండా కేబినెట్ సాక్షిగా ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించిన రూ.2,000 పెన్షన్ పథకాన్ని బాబు కాపీ కొట్టారు. తాజాగా ‘రైతు భరోసా’ పథకానికి కాపీగా ’అన్నదాత సుఖీభవ’ గా పేరు మార్చిఆ పథకానికి మంత్రవర్గం ఆమోదం కూడా వేసింది. ‘రైతు భరోసా’ పథకాన్ని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించారు కూడా. వచ్చే ఏడాది పథకానికి ఇప్పుడే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఎన్నికల ముందు పోస్ట్డేటెడ్ చెక్కులు ఇచ్చేలా నిర్ణయించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6వేలతో కలిసి రూ.10వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన సమావేశంలోనే చంద్రబాబు దాదాపు తాను అనుకున్న అన్ని పనులకు ఆమోదం తెలిపారు. జర్నలిస్టులకు 30 ఎకరాల భూమి (ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు) కేటాయించింది. తొలివిడత సీఆర్డీఏకు రూ.కోటి చెల్లిస్తే సొసైటీకి భూమి కేటాయింపు, మిగతా మొత్తం రెండేళ్లలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇక ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల స్థలం...గజం రూ.4వేల చొప్పున 2390 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్ ఆమోదించింది. అధికారంలోకి వచ్చాక ఆలోచించని చంద్రబాబు ప్రభుత్వం నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజలను మాయ చేసేందుకు ఈ పథకాలను ప్రకటించడం విశేషం. వైఎస్ జగన్ ప్రకటించిన రూ.2,000 పెన్షన్ పథకాన్ని బాబు కాపీ కొట్టారు. జనవరి 1వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దాన్ని ఆమోదించారు. అలాగే ప్రతిపక్ష నేత ప్రకటించిన ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు పథకాన్ని సైతం కాపీ కొట్టి, అదే సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా చంద్రబాబు మళ్లీ కాపీ కొట్టేశారు. -
కావలిలో నవరత్నాల ప్రచార రథాలు
-
వైఎస్ జగన్ నవరత్నాలను బాబు కాపీ కొట్టారు
-
చంద్రబాబు ఐదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు
-
చంద్రబాబుకు వైఎస్ జగన్ ఝలక్
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ సీపీ ‘నవరత్నాలు‘ను కాపీ కొడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవ్వా, తాతలకు నెలకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్ ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం తిరుపతి సమీపంలో జరిగిన వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు ప్రతి మే నెలలో రూ.12,500 సాయం అందిస్తామని తెలిపారు. (చంద్రబాబు ఒక్కరే మనకు పోటీ కాదు) కాగా వైఎస్సార్సీపీ నవరత్నాల్లో.. వృద్ధాప్య ఫించన్ రూ.2 వేలు ఇస్తామని ఇప్పటికే ప్రకటన చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న పింఛన్ల వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తామని, అలాగే వికలాంగులకు పింఛన్ రూ.3వేలు ఇస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశలవారీగా రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు కూడా. అయితే నవరత్నాలను కాపీ కొట్టిన టీడీపీ సర్కార్ ఇటీవలే వృద్ధాప్య ఫించన్ను రూ.1000 నుంచి రూ.2వేలుకు పెంచింది. వైఎస్సార్ సీపీ తాజా నిర్ణయంతో కాపీ కొట్టడంకూడా సరిగా రాని చంద్రబాబుకు ఝలకే అని చెప్పుకోవచ్చు. (ఎన్నికల సమర శంఖం పూరించిన వైఎస్ జగన్) -
‘ఆ పదివేల రూపాయలు రుణమే’
సాక్షి, హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో గాల్లో లెక్కలు వేసి చూపించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు దువ్వూరి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలలోని పథకాలనే టీడీపీ కాపీ కొట్టిందని విమర్శించారు. బడ్జెట్లో డ్వాక్వా రుణ మాఫీ గురించి ప్రస్తావించలేదన్నారు. పసుపు కుంకుమ పథకం కింద కేవలం రూ.1700 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. పసుపు కుంకుమ పథకంలో ఇస్తున్న 10 వేల రూపాయలు రుణమే అని స్పష్టం అవుతుందన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి పన్నులు పెంచుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ పాలనకు చరమగీతం
బేతంచెర్ల: ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని టీడీపీ పాలనకు చరమగీతం పాడాలని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ఆర్ కొత్తపల్లె గ్రామంలో శనివారం.. నిన్ను నమ్మం బాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు అందికాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. విద్యుత్ సబ్స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు సైతం రూ. 5లక్షల చొప్పున అమ్ముకున్న ఘన చరిత్ర అధికార పార్టీ నాయకులకు దక్కుతుందన్నారు. గ్రాఫిక్స్, బొమ్మలకు మాత్రమే రాజధాని పరిమితమైందని ఎద్దేవా చేశారు. నీటి ప్రాజెక్టులు, రాజధాని భూముల పేరుతో వేల కోట్ల రూపాయ లు టీడీపీ నేతలు దిగమింగారని విమర్శించారు. చంద్రబాబు అబద్ధాల చిట్టా చూసి..హరికథ చెప్పే వారు కూడా భయపడి పారిపోతున్నారన్నారు. గతంలో ఇచ్చిన హమీలు అమలు చేయకుండా అధికారం కోసం మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారని, మరోసారి మోసపోవద్దని సూచించారు. పార్టీ నాయకులు బాబుల్ రెడ్డి, రాజేంద్రనాథ్రెడ్డి, మురళీకృష్ణ, రామచంద్రుడు, వెంకటరెడ్డి, నాగముని రెడ్డి, వెంగళ్ రెడ్డి, స్వామి రెడ్డి, నరసింహులు, ముద్దుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రైతు కోసం ముందు జగనే
సాక్షి, హైదరాబాద్ : సంక్షోభంలో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు నేరుగా ఆర్థిక సాయం అందజేసే పథకాలు తెరపైకి రావడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందజేయడానికి వారి ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తూ.. రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టగా.. తాజాగా కేంద్రంలోని మోదీ సర్కారు కూడా ఇదే పథకాన్ని ప్రకటించింది. రైతులకు ఏడాదికి నేరుగా రూ. ఆరువేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ పథకం మొదట ప్రకటించింది ఎవరు? ఈ పథకాన్ని మొదట రూపొందించిన దార్శనికత ఎవరిది అన్న చర్చ ఊపందుకుంది. అసలు రైతులకు నేరుగా పెట్టుబడి సాయం అందజేయాలన్న ఆలోచన చేసిన తొలి వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాల కన్నా ఎంతోముందే.. జూలై 9, 2017లోనే రైతులకు నేరుగా పెట్టుబడి సాయం అందజేస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా అన్నదాతలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందజేస్తామని, ఏడాదికి రూ. 12,500 చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించారు. ‘‘అధికారంలోకి రాగానే నేను చేపట్టబోయే తొలి పథకం వైఎస్సార్ రైతు భరోసా.. 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ రూ. 50 వేల రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తాను. ఏటా రూ. 12,500ను ఒకేసారి మే నెలలో ఇస్తాం. మే నెలనే ఎందుకంటే వ్యవసాయానికి రైతు సన్నద్దం అయ్యే విధంగా.. నేరుగా రైతుల చేతికే ఇస్తాం. మొత్తం నాలుగు విడతల్లో అందజేస్తాం’’- 9 జూలై 2017న గుంటూరులో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో వైఎస్ జగన్ -
రైతు కోసం ముందు జగనే
-
మన రాష్ట్రానికి అదే మేలు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకీ సొంతంగా మెజారిటీ రాదని, త్రిశంకుసభ(హంగ్) ఏర్పడుతుందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. దేవుడు ఆంధ్రప్రదేశ్కు మేలు చేయడం కోసమే కేంద్రంలో హంగ్ పరిస్థితులు సృష్టిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాసిచ్చిన పార్టీకే వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ తమకు పొత్తులుండవని జగన్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు మాయమాటలతో ప్రజల్ని మరోసారి వంచించేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. మేధావులు, తటస్తులతో వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ‘అన్న పిలుపు’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వారి నుంచి సూచనలు, సలహాలను జగన్ తీసుకున్నారు. రానున్న రోజుల్లో 13 జిల్లాలో ఇటువంటి సమావేశాలు నిర్వహించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ప్రభావం చూపగల దాదాపు 60 వేల మందికి పైగా వ్యక్తులు జగన్ నుంచి వ్యక్తిగతంగా జనవరిలో ఈ ఉత్తరాలు అందుకున్నారు. వారిలో కొందరు తొలి విడత భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సోదాహరణంగా సమాధానాలు చెప్పారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవీ.. వచ్చేది హంగ్ పార్లమెంటే... ప్రత్యేక హోదా, రైల్వేజోన్ కోసం మనం ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉన్నాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తాడనే నమ్మకం నాకుంది. రేపొద్దున కేంద్రంలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదు అనేది క్లియర్కట్గా కనిపిస్తోంది. అది దేవుడు మన ఆంధ్రప్రదేశ్కు మేలు చేయడం కోసమే చేస్తున్నాడు. కనీసం అప్పుడైనా మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు అంటే 25కి 25 మన చేతిలో ఉంటే మనం రేపొద్దున కేంద్రంపై ఏ స్థాయిలో ఒత్తిడి తెస్తామంటే... మనం ముందే పొత్తు పెట్టుకోవడాలూ ఇవన్నీ ఉండవు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. రేప్పొద్దున మనం 25 లోక్సభ సీట్లు గెలిచిన తర్వాత అప్పుడు మనమంటాం... నువ్వు సంతకం పెట్టు నేను సపోర్ట్ చేస్తా అని. ఇప్పుడు పొత్తు పెట్టుకోండి మేం చేస్తాం అని చెప్పే మాటలను నమ్మడానికి లేదు. ఇప్పుడు అలాగే చేస్తాం చేస్తాం అంటారు పనైపోయిన తర్వాత ఎవరూ చేయరు. నువ్వు సంతకం పెట్టు నేను సపోర్ట్ చేస్తా అనే స్టేజిలోకి మనం వెళ్లాలి. దేవుడు ఆశీర్వదిస్తే అది ఖచ్చితంగా జరుగుతుందని నాకు నమ్మకముంది. రాష్ట్రంలో కూడా నిన్నా మొన్నా సర్వే రిపోర్టులు చూస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోంది. దేవుడు ఖచ్చితంగా హంగ్ ఇస్తాడు, అది మన కోసమే ఇస్తాడు..ఖచ్చితంగా నువ్వు అడిగిన రైల్వేజోన్ వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది...అది మన హక్కు కూడా. వైఎస్సార్ చేయూత కింద అందరికీ సాయం... ‘‘పాదయాత్ర జరుగుతున్నప్పుడు బహుశా విశాఖలో అనుకుంటా.. మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రసూల్ తదితరులు కూడా వచ్చారు. అప్పుడు ప్రధానంగా అడిగిందేమిటంటే మైనార్టీ కార్పొరేషన్తో మమ్మల్ని (దూదేకులను) ఏకం చేశారన్నా.. ఆ ప్రయోజనాలు మాదాకా రావడం లేదన్నా అంటూ చంద్రబాబు తమను ఏరకంగా మోసం చేశారో వివరించారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో రూ.40 కోట్లు కూడా ఇవ్వలేదన్నా అని చెప్పారు. మీకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అప్పుడు నేను హామీ ఇచ్చా. సంతృప్తస్థాయి (శాచురేషన్) విధానంలో మీ అందరికీ మేలు జరిగేటట్లు చేస్తానని చెప్పా. ఈ కార్పొరేషన్ ద్వారా ‘వైఎస్సార్ చేయూత’ కార్యక్రమం వర్తించేలా చేస్తా అని కూడా అన్నా. అందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఏమాత్రం వ్యత్యాసం చూపకుండా చేస్తానని చెప్పా. అదికాకుండా ఇతర పద్ధతుల్లో ఇంకా ఏం చేయవచ్చో మీరు సూచనలు, సలహాలు ఇస్తే వాటిని కూడా పరిశీలించి న్యాయం చేద్దాం. దూదేకులనూ ఆదుకుంటాం... పాదయాత్ర జరుగుతున్నప్పుడు ప్రతివర్గం వారు మాకు కార్పొరేషన్ కావాలన్నా అని ప్రతిచోటా కోరారు. అందుకు ప్రధాన కారణమేమిటంటే ఏదైనా కార్పొరేషన్ ఉంటే దాని ద్వారా వాళ్లకు రుణాలు వస్తాయని, ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అంది మేలు జరుగుతుందనే. కానీ ఇప్పుడేం జరుగుతోందంటే.. ఊరు మొత్తానికి ఒక వెయ్యి మంది ఉంటే కేవలం ఏ ఐదుగురికో రుణాలిస్తున్నారు. వాళ్లకు ఇచ్చేది కూడా లక్ష రూపాయలంటారు, రూ.50 వేలు లోను అంటారు. ఆ లోను ఎలాగూ రాదు. బ్యాంకర్లు ఎలాగూ ఇవ్వరు. మిగిలిన రూ.50 వేలల్లో లబ్ధిదారుడి వాటా ఏ పది వేలో, ఇరవై వేలో అంటారు. ఆ మిగిలిన రూ.ముప్పై వేలో నలభై వేలో ప్రభుత్వం గ్రాంటు కింద ఇస్తుందని చెబుతారు. ఆ ముప్పై వేలో, నలభై వేలో గ్రాంటుగా తెచ్చుకునేందుకు కనీసం రూ.పది వేలో రూ.15 వేలో అంటే 25 శాతమన్నా లంచాలకింద ఇవ్వందే ఆ ఐదుగురికి కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రవ్యాప్తంగా నాకు ఈ పరిస్థితి కనిపించిందిది. అప్పుడు ఏం చేశానంటే.. పాదయాత్ర మధ్యలోనే నేనో సభలో ‘వైఎస్సార్ చేయూత’ అనే పథకాన్ని ప్రకటించా. ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో ప్రకటించాం. పారదర్శకంగా ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి అందేలా చూస్తామని చెప్పాం. వైఎస్సార్ చేయూత పథకం ప్రధాన ఉద్దేశం రాజకీయ నేతల అండదండలు లేనివారికి కూడా ప్రభుత్వ పోత్సాహకాలు అందేలా చూడడం. గ్రామ వాలంటీర్లను నియమించి ప్రతి ఊరిలోనూ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తాం. అదే గ్రామానికి చెందిన పది మంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలిస్తాం. వారిని గ్రామ సచివాలయంలో నియమిస్తాం. ఊరిలో పెన్షన్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, నవరత్నాలకు సంబంధించిన అంశాలలో సహాయం కావాలన్నా, ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ..మరేది కావాలన్నా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే ఎవరి సిఫార్సు లేకుండా మంజూరు చేస్తాం. దీన్ని మరో అడుగు ముందుకు తీసుకుపోయే దిశగా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తాం. గ్రామ వాలంటీర్గా సేవా దృక్పథం కలిగి చదువుకున్న వ్యక్తులను (మహిళలు గానీ పురుషులు గానీ) నెలకు రూ.ఐదు వేల చొప్పున ఇచ్చి నియమిస్తాం. ఆ యాభై ఇళ్లకు సంబం«ధించిన పూర్తి బాధ్యతంతా ఆ వాలంటీర్ చూస్తారు. ఈ వాలంటీర్ గ్రామ సచివాలయంతో అనుసంధానమై పని చేస్తారు. రేషన్ బియ్యం కోసం ఎక్కడికో పోవాల్సిన పని లేదు. ఇంటి వద్దకే వస్తాయి. గ్రామ వాలంటీరే డోర్ డెలివరీ చేస్తారు. బియ్యం మొదలుకుని పెన్షన్, అమ్మ ఒడి వరకూ అన్నీ వారే చూస్తారు. నవరత్నాలలో భాగంగా ‘వైఎస్సార్ రైతు భరోసా’ ప్రకటించా.ం ఇలా అన్ని పథకాలను డోర్ డెలివరీ చేస్తాం. ఇందులో భాగంగానే చేయూత కూడా అమలు చేస్తున్నాం. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీల అక్కలకు ఈ చేయూత పథకం కింద సాయం నేరుగా వాళ్లింటికే వస్తుంది. వాళ్లకు 75 వేల రూపాయలను ఉచితంగా ఈ పథకం కింద అందిస్తాం. ఇది లోను కాదు. ఎవర్నీ అడగాల్సిన పనిలేదు. నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా ఇస్తాం. సంవత్సరానికి రూ.19 వేల చొప్పున నాలుగేళ్లలో ఈ మొత్తాన్ని ఆ అక్కల చేతికే నేరుగా అందిస్తాం. మీరు అడుగుతున్న కార్పొరేషన్ ద్వారానే ఈ పని చేయిస్తాం. ఈ డబ్బుతో ఏం చేస్తే బాగుంటుందో సూచనలు, సలహాలు కూడా ఇస్తాం. ఇలా చేయడం వల్ల విప్లవాత్మక మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరికి సాయం అందుతుంది. సంఖ్యాపరంగా తాము చిన్న కులం వారిమన్న తేడా లేకుండా అందరికి ఈ పథకం ద్వారా సాయం అందుతుంది. దూదేకుల కులానికి సంబం«ధించి ఇంకా సమస్యలను పరిశీలించి తగు న్యాయం చేస్తాం. ఆ మేరకు నేను మీకు భరోసా ఇస్తున్నా. మీ సూచనలు, సలహాల కోసమే మిమ్మల్ని ఇక్కడకు రమ్మన్నా. నన్ను అడగడం కన్నా.. మీరు సలహాలు ఇవ్వండి నేను నోట్ చేసుకుంటా. ఇంకా మెరుగ్గా ఎలా చేయాలో కూడా ఆలోచిస్తాం’’ విశాఖ రైల్వే జోన్ కోసం కచ్చితంగా పోరాడతాం నాకు తెలిసినంత వరకూ అన్ని రాష్ట్రాలకు రైల్వే జోన్ ఉంది. మన ఖర్మకొద్దీ ఆంధ్రప్రదేశ్ ఆ జాబితాలో లేదు. విశాఖకు రైల్వేజోన్ ఇస్తామని మనకు వాగ్దానం కూడా చేశారు. అయితే ఆతర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ విషయంలో ఖచ్చితంగా పోరాటం చేసి తీరతాం. నాకు దీనిపై పూర్తి అవగాహన ఉంది. రైల్వే ఉద్యోగాల పరీక్షల కోసం భువనేశ్వర్కు వెళ్లాల్సి వస్తోంది. భువనేశ్వర్లో లోకల్, నాన్లోకల్ ఫీలింగ్ తెచ్చి మనల్ని రానివ్వరు. మనవారిని కొట్టి వెనక్కు పంపిస్తున్నారు. దీనిపై రెండుమూడు సార్లు నేను మాట్లాడాను కూడా. పెన్షన్లలో ఏం జరుగుతుందో చూస్తున్నారుగా... ఇక పెన్షన్లలోనే కాదు మిగతా అన్నింటిలో ఏం జరుగుతోందో మీకు తెలిసిందే. గతంలో జరిగిన ఒక విషయం చెబుతా. అప్పుడు నేను చిన్నపిల్లాణ్ని. ఎన్టీరామారావు గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు.ఎన్నికలకు 6 నెలల ముందు వచ్చారు. ప్రజలు కూడా ఆయనపై విపరీతమైన ప్రేమ చూపించడం మొదలు పెట్టారు. అప్పట్లో ఆయన 2 రూపాయలకే కిలో బియ్యం అధికారంలోకి రాగానే ఇస్తానని చెప్పారు. ఎన్టీఆర్ ఆ మాట చెప్పాక ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. నిజంగానే అలాంటి మంచి కార్యక్రమం ఎవరూ చేయలేదు అప్పటిదాకా. ఈ స్పందన చూసి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్రెడ్డి తాము రూ.1.90కే ఇస్తామన్నారు. అంటే ఎన్టీఆర్ చెప్పిన దానికంటే 10 పైసలు తక్కువ. కానీ ఆరు నెలల ముందునుంచే ఎన్టీఆర్ చెప్పిన దానికంటే 10 పైసలకు తక్కువకు ఇచ్చినా కూడా ప్రజలు విజయభాస్కర్రెడ్డికి పట్టం కట్టలేదు. నాలుగున్నరేళ్లు మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేశావు. ఎన్టీఆర్ చెప్పారు కాబట్టి, ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కనుకనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ విజయభాస్కరరెడ్డికి ప్రజలు మైనస్ మార్కులు వేశారు. సరిగ్గా చంద్రబాబునాయుడి పరిస్థితి కూడా అంతే. ఎందాకా కాపీ కొడతాడు? ఓ స్టూడెంట్ బాగా చదువుతాడు. కష్టపడి చదివి టెన్త్క్లాస్ పరీక్షలకు హాజరవుతాడు. చాలా కష్టపడి చదివాడు కాబట్టి బాగా రాస్తాడు. ఇంకో పిల్లాడు పక్కనే ఉంటాడు. అసలు చదవడు. మోసం చేస్తా ఉంటాడు, అబద్ధాలాడుతూ ఉంటాడు. పక్కన కాపీకొట్టి రాస్తాడు. కానీ చివరకు వచ్చేసరికి ఎంత కాపీ కొడతాడు...? కాబట్టి కాపీ కొట్టే వారికి మార్కులు రావు. మీలాంటి యువతీ యువకులను బాగుపరచాలి అంటే ఈ వ్యవస్థలో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చాలా ముఖ్యమైనది. ఒకవైపు ఉద్యోగాలు సృష్టిస్తూ మరోవైపు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కల్పించేందుకు ఎంటర్ప్రెన్యూర్లను సపోర్ట్ చేయాలి. దీంతో నేను ఏకీభవిస్తా.నా మనసులో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలా ఉందీ అంటే..ఉదాహరణకు ఆర్టీసీనే తీసుకోండి.. పేరుకే ఆర్టీసీ బస్సులు. మంచిరూట్లన్నీ ప్రైవేటుకు ఇస్తారు. దివాకర్ ట్రావెల్స్ అంటారు (దివాకర్రెడ్డి), కేశినేని నాని అంటారు...ఏదన్నా తీసుకోండి అంతా కాంట్రాక్టే. కాంట్రాక్టుకు ఇవ్వడం, డబ్బులు సంపాదించుకోవడం, బినామీలుగా వీళ్లే పంచుకోవడం. ఎంత దారుణం? ఆలయాల్లో పారిశుద్ద్య పనులనూ వదలడం లేదు.. చివరకు ఆలయాల్లో పారిశుద్ధ్యం పనులు కూడా. అన్ని గుళ్లకు సంబంధించి గతంలో నెలకు రూ.లక్ష అయ్యే పనులకు చంద్రబాబు బంధువు భాస్కర్నాయుడుకు నెలకు రూ.7 లక్షలకు ఇచ్చారు. ఇలా ప్రతిచోటా కాంట్రాక్టుకు ఇవ్వడం వీళ్లే పంచుకోవడం. ఇలా కాకుండా మీలాంటి యువతకే ఇవ్వవచ్చు కదా. చిన్న చిన్న కాంట్రాక్టులను పారదర్శకంగా చదువుకున్న వాళ్లకు, ఉద్యోగాలు వెతుక్కుంటున్న వాళ్లకు, ఎంటర్ప్రెన్యూర్గా మారాలని ఆరాటపడే వాళ్లకు, కొద్దో గొప్పో పెట్టుబడి పెట్టే కెపాసిటీ ఉన్నవాళ్లకు ఇస్తే బాగుపడతారు. మీలాంటి ఎంతోమందికి మేలు చేయవచ్చు. ఇలాంటివన్నీ మనం చేస్తాం.విప్లవాత్మక విధానం తెస్తాం. కంపెనీల్లో కూడా ఒక రూల్ తెస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనేది మొట్టమొదటి ఆసెంబ్లీలోనే యాక్ట్ తెస్తాం. ఆ ప్రాంతంలో చదువుకున్న వారికి కచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తీసుకొస్తే పాత కంపెనీలు, కొత్త కంపెనీలు అవే లైన్లోకి వస్తాయి. ఈరోజు కూడా చూశా. కియా మోటార్స్ అంట. బాగానే ఉంది. నరేంద్రమోదీ కొరియా వెళ్లినప్పుడు అక్కడి ప్రధానితో మాట్లాడారు. ఆ తర్వాత మొదలైంది. ఫైనల్గా కియా ఏపీకి వచ్చింది. కానీ చంద్రబాబు ఆ క్రెడిట్ తనవల్లే అంటారు. అయినా ప్రాబ్లం లేదు. కానీ స్థానికులకు 5 శాతం ఉద్యోగాలు కూడా కల్పించలేదు. మన పిల్లలకు మనమే ఉద్యోగాలు చూపించలేకపోతే ఎలా? ఆ ఫ్యాక్టరీలకు భూములు ఫ్రీ అంటాం. కరెంటు తక్కువ రేటుకు అంటాం.. ఇన్ని ప్రయోజనాలు మనం కల్పిస్తూ మనం కోరేది మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమనే. అంతకన్నా మనం ఏమీ అడగడం లేదు. అది ఇవ్వనప్పుడు ఆ ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టడం వల్ల అర్థమేముంది? లాభమేముంది? దీనికి అర్థం లేదు. ఇలాంటి దానికి ఎందుకు ఆరాట పడాలి? అందుకే 75 శాతం లోకల్ రిజర్వేషన్లు ఇస్తాం. మన పాలనలో ఉద్యోగాల కల్పన ముఖ్యమైనది. ఈ ఐదు సంవత్సరాల్లో రిటైరైన పోస్టులు 90 వేలు. మొత్తం 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఈ ప్రభుత్వం రిక్రూట్ చెయ్యడం లేదు. ఇవన్నీ రిలీజ్ చేస్తాం. ఏపీపీఎస్సీతో పాటు అన్ని ఖాళీలు రిలీజ్ చేస్తాం. ఏదైనా మాట చెబితే ఆ మాట మీద నిలబడాలి. రుణమాఫీ సొమ్ము వడ్డీలకు సరిపోలేదు.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రైతుల రుణాలు రూ.87,612 కోట్లు. మొత్తం మాఫీ చేస్తా అని చెప్పి మొదటి సంతకం మాఫీపైనే అని ఎన్నికలకు ముందు చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత చూస్తే సంవత్సరానికి రూ.3 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మొత్తం ఐదేళ్లలో ఎంత ఇచ్చాడో చూస్తే...రూ.14,800 కోట్లు. రైతులు రూ.87,612 కోట్లకు కట్టే వడ్డీ కనీసం అంటే 9 లేదా 10 శాతం వేసుకున్నా ఎంతలేదన్నా ఏడాదికి రూ. 8 వేల కోట్లు అవుతుంది. ఆయన ఇచ్చింది వడ్డీకి కూడా సరిపోలేదు. మన ప్రభుత్వం రాగానే అందరికీ సాయం... మేం రాగానే 85 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద నాలుగేళ్లపాటు ఏటా రూ.12,500ల చొప్పున రూ.10,600 కోట్లు ఇస్తాం. ఆయన (చంద్రబాబు) రూ.4,000 కోట్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడిన పరిస్థితుల్లో మనం రూ.10,600 కోట్లు రైతులకు సాయం చేస్తామని చెబుతున్నాం. కచ్చితంగా మే నెలలో రూ. 12,500 రైతుల చేతిలో పెడతాం. ఆశ్చర్యమేమిటంటే మన రాష్ట్రంలోని 85 లక్షల మంది రైతు కుటుంబాలలో ఒక ఎకరా లోపు ఉన్న రైతులు 42 లక్షల మంది దాకా ఉంటారు. అంటే 50 శాతం మందికి నేరుగా రూ. 12,500 వారి చేతికే అందిస్తే వరి రైతులకు పెట్టుబడిలో 60 నుంచి 70 శాతం సాయం అందుతుంది. అదే వేరుసెనగ రైతులకైతే దాదాపు 90 శాతం పెట్టుబడి చేతిలో పెట్టినట్టే అవుతుంది. పెట్టుబడి లేదని బాధపడటం, ఆత్మహత్య చేసుకోవడం లాంటి పరిస్థితులుండవు. ఆ తపన ఉండాలి... నాకు బాగా గుర్తు. నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగున్నరకే నిద్ర లేచేవారు. ఐదు గంటలకు ముఖ్యమైన పథకాలు ఆరోగ్యశ్రీ లాంటి వాటి గురించి ఎలా అమలు జరుగుతున్నాయో నేరుగా ఫోన్ చేసి అడిగి తెలుసుకునేవారు. ఏ ముఖ్యమంత్రి అయినా కొన్ని ఇష్టమైన ప్రాజెక్టులు ఉంటాయి. ఇది నా పథకం, దీన్ని బాగా నిర్వర్తించాలనే తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడు ఏ పథకమైనా బాగా జరుగుతుంది. వెంటపడే గుణం ఉండాలి. కానీ చంద్రబాబుకు ఇవేమీ లేవు. మన ఖర్మమేంటంటే ఆరోగ్యశ్రీ బాగుంటే వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందని ఆయనకు భయం. ఫీజు రీఇంబర్స్మెంట్ బాగుంటే రాజశేఖరరెడ్డికి పేరొస్తుందేమోననే బాబుకు భయం. కాబట్టి ఏ పథకమూ అమలు చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. నా తపన ఏంటంటే నేను చనిపోయాక కూడా బతకాలని ఉంది. ఆ తపన ఉన్నప్పుడు కచ్చితంగా చేసే ఆలోచనలు వేరే ఉంటాయి. నవరత్నాల్లో మేం చెప్పాం. ఫీజు రీఇంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాం. చేనేతలకు నెలనెలా సాయం... చేనేతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ సబ్సిడీ కింద గానీ ఇంకేదైనాగానీ నెలనెలా రూ.2,000 చేతిలో పెడతాం. ఆ తరువాత నవరత్నాల పథకాలు ఎలానూ ఉన్నాయి. పిల్లలను బడికి పంపిస్తే సంవత్సరానికి 15వేలు ఇస్తాం. చేయూత పథకం కింద 45 సంవత్సరాలు నిండిన అక్క ఇంటిలో ఉంటే రూ.19 వేలు వస్తాయి. ఇంటిలో అవ్వాతాత ఉంటే నెలకు రూ.2000 పెన్షన్ వస్తుంది.దీంతో నాకు తెలిసి సగం సమస్యలు తీరిపోతాయి. చేయూత ద్వారా ఏటా రూ.75 వేలు ఇస్తాం కరెంటు రేటు కూడా తగ్గించి ఏ రూపాయిన్నరకో రెండు రూపాయలకో ఇవ్వగలిగితే మేలు జరుగుతుంది. అది కచ్చితంగా జరిగేటట్టు చూద్దాం. జంబో డీఎస్సీ నిర్వహిస్తా... పాదయాత్ర సభల్లోనే చెప్పా. అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్ పోస్టుల భర్తీకి జంబో డీఎస్సీ ప్రకటిస్తా. స్కూళ్లలో, విద్యుత్తు శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పా. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పా. కాంట్రాక్ట్ సిబ్బంది అర్హతలు, సర్వీసును బట్టి వీలైనంత వరకు ప్రభుత్వపరంగా తీసుకుని న్యాయం చేస్తామని ఇప్పటికే చెప్పా. ఉపాధి చట్టానికి తూట్లు.. చంద్రబాబు పాలనలో ఉపాధిహామీలో దోచేయడానికి విపరీతంగా మెటీరియల్ కాంపొనెంట్ను పెంచుతున్నారు. ఏ పనికైనా ఉపాధిహామీతోనే చేయడం ప్రారంభించారు. చివరకు అంగన్వాడీ బిల్డింగ్లను కూడా ఉపాధి హామీ నిధులతోనే కడుతున్నారు. ఉపాధిహామీ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది. ఉపాధిహామీ స్ఫూర్తి పోయింది. దీన్ని రైతులకు నేరుగా అనుసంధానించాలంటే చట్టం అడ్డం వస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సవరించాలి. దీనిపై సూచనలు ఆహ్వానిస్తున్నాం. మేమూ మనుషులమే కదా సర్... చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాంటి మాటలు మాట్లాడకూడదు. అయినా మాట్లాడారు మరి ఏం చేద్దాం? (సీఎం తీరుపై తనవద్ద ఆవేదన వ్యక్తం చేసిన వారితో జగన్ స్పందిస్తూ...) అలాంటివారు ఉన్నారు. అయినా అలా అనకూడదు. దాదాపు గంటన్నరకుపైగా మీ అందరితో కలిసి గడపడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నా. సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం సొంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడకు వచ్చి నన్ను కలసినందుకు మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నా. మీ సూచనలు, సలహాలు నా డేటాబేస్లో ఉంటాయి. కచ్చితంగా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నేను, నా టీమ్ వాటిని అమలు చేసే కార్యక్రమాలు చేస్తాం. ఇదొక్కటే కాకుండా నేను మీ జిల్లాలకు ఎలాగూ వస్తా. మీ అందరి పేర్లు, వివరాలు గుర్తు పెట్టుకుంటా. నా అంతట నేనే మీ వద్దకు మనుషులను పంపించి మీతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టా. ఈ సంబంధాలు జీవిత కాలం ఉండాలనేదే నా లక్ష్యం. ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. అందరినీ ఇప్పుడు కలవలేకపోవచ్చేమోగానీ ఏదో ఒకరోజు ఎక్కడో ఒకచోట కలుసుకునే కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. దీనికి సంబంధించి ఒక టీమ్ సమన్వయం చేస్తూ ఉంటుంది. ఏ రోజైనా మీరు నాతో టచ్లో ఉండవచ్చు. ఇక్కడకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’. -
C ఫర్ కాపీ B ఫర్ బాబు N ఫర్ నథింగ్
-
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్సీపీ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.. వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం బూత్ కమిటీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డితోపాటు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ పాల్గొన్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైఎస్సార్సీపీ ప్రకటించిన పథకాలను ఆయన కాపీ కొడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు వందల హామీలల్లో ఒక్క హామీ కూడా ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ చేసే కుటిల యత్నాలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొని వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
నవరత్నాలు: వైఎస్ఆర్ రైతు భరోసా
-
నవరత్నాలతోనే పేదల అభ్యున్నతి
సాక్షి, విశాఖపట్నం: అరకు మండలం కొర్రయిగూడ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ స్థానిక నాయకులు చెట్టి ఫాల్గుణ, మత్స లింగం, దన్ను దొర, పార్టీ కార్యకర్తలు, పలువురు ప్రతినిధులతో కలిసి కొర్రయిగూడ గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా మంచి నీటి బోర్లు, సీసీ రోడ్డు నిర్మాణాల కోసం ఎంపీ నిధులను మంజూరు చేశారు. ఈ సందర్బంగా విజయసాయి రెడ్డికి గ్రామ ప్రజలు టీడీపీ హయాంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించుకున్నారు. డ్వాక్రా రుణాలు అందడం లేదని మహిళలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వృద్ధాప్య ఫించన్లు, ఇళ్లు మంజూరు చేయడం లేదని గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టే నవరత్నాల ద్వారా అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని, పేదల అభ్యున్నతి సాధ్యమవుతుందని విజయసాయి రెడ్డి వారికి భరోసానిచ్చారు -
నిండా ముంచారు
నవరత్నాలు – 7చంద్రబాబు వైఖరి చూస్తుంటే ‘ఏరు దాటే వరకుఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’అన్నట్లుందంటున్నారు డ్వాక్రా మహిళలు. ‘డ్వాక్రామహిళలందరికీ చెబుతున్నా.. మీ అప్పులన్నీ నేను మాఫీచేస్తాను.. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు. మీరికనిశ్చింతగా ఉండొచ్చు’ అని 2014 ఎన్నికల ముందుచంద్రబాబు ఊరూరా నమ్మకంగా చెప్పడంతో లక్షలాదిమంది మహిళలు ఆయన మాటలు నమ్మారు. తీరాఅధికారంలోకి రాగానే ఆ ఊసే ఎత్తలేదు. వడ్డీతో సహాకట్టాల్సిందేనని బ్యాంకర్లు నోటీసుల మీద నోటీసులుఇవ్వడంతో పాటు అవమానాలకు గురి చేస్తోండటంతోఅధిక వడ్డీకి బయట అప్పులు తెచ్చి కడుతున్నారు.బాబు మోసంతో నిండా మునిగాం.. కాపాడండంటూకన్నీటిపర్యంతమవుతున్నారు. సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి ఇప్పుడు 9.37 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలకు బ్యాంకులు 9.02 లక్షల లోను ఖాతాల ద్వారా రూ.21,479 కోట్లు అప్పుగా ఇచ్చాయి. చంద్రబాబు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పారు. దీంతో అప్పట్లో చాలా సంఘాలు అప్పులు చెల్లించడం ఆపేశాయి. దీనికితోడు మహిళలు డ్వాక్రా వ్యవహారాలకు దూరంగా జరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నెలా రూ.21 కోట్ల మేర సంఘాల పేరిట జరగాల్సిన పొదుపు రూ.7 లక్షలకు పడిపోయింది. సంఘాల్లో మహిళలు పొదుపు చేసుకుంటున్న తీరు, ప్రతి నెలా సమావేశాల ఏర్పాటు, బ్యాంకు లోను తిరిగి చెల్లింపుల ఆధారంగా సంఘాలకు గ్రేడింగ్లు ఇస్తే.. 2015, 2016 సంవత్సరాల్లో దాదాపు 90 శాతం సంఘాలు సీ, డీ గ్రేడ్లకే పరిమితమయ్యాయి. మరోవైపు కొత్తగా పొదుపు సంఘాలలో చేరే మహిళల సంఖ్య క్రమంగా సన్నగిల్లింది. రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన మహిళలు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారని అంచనా ఉండగా, పొదుపు సంఘాల్లో కేవలం 93.74 లక్షల మందే సభ్యులుగా ఉన్నారు. గత నాలుగున్నరేళ్లలో కొత్త సంఘాల్లో చేరిన సభ్యుల సంఖ్య కేవలం ఐదు లక్షలు కూడా లేకపోవడం గమనార్హం. జగన్ హామీతో మహిళలకు భరోసా ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద డ్వాక్రా మహిళల అప్పుల మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తామన్న జగన్ హామీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉదాహరణకు పది మంది సభ్యులున్న వెంకటేశ్వర పొదుపు సంఘం పేరిట ఎన్నికల నాటికి రూ.5 లక్షలు అప్పు ఉందనుకుంటే, ఒక్కొక్కరికి రూ.50 వేల మొత్తాన్ని 4 దఫాలుగా చెల్లిస్తారు. సున్నా వడ్డీ రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పడం మరింత ఊరట కలిగిస్తోంది. ఉదాహరణకు ఓ డ్వాక్రా సంఘం రూ.5 లక్షలు అప్పు తీసుకుంటే దానికి నెల నెలా దాదాపు రూ.4 వేలు వడ్డీ అవుతుందనుకుంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఇలా బ్యాంకులకు వడ్డీ డబ్బులు చెల్లించక పోవడంతో డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందడం లేదు. వైఎస్సార్ పథకం వల్ల రాష్ట్రంలో దాదాపు 90 లక్షల మంది డ్వాక్రా మహిళల కుటుంబాలకు దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఎన్నికల నాటికి సంఘాల పేరిట ఉండే దాదాపు రూ.22 వేల కోట్ల అప్పు డబ్బులను మహిళలకు నేరుగా అందజేసే అవకాశం ఉండగా.. జీరో వడ్డీ రూపేణా ఏటా రూ.1,200 నుంచి రూ.1,500 కోట్ల చొప్పున ఆరేడు వేల కోట్ల రూపాయల మేర మహిళలకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ♦ డబ్బు నేరుగా మహిళల చేతికే అందడంతో ఆ డబ్బుతో కొత్త వ్యాపారమో, పాడి గేదెలు, ఆవుల కొనుగోలు, లేదా స్వయం ఉపాధి కార్యక్రమంపై పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకులో ఉన్న అప్పును దీనిపై వచ్చే ఆదాయంతో చెల్లించవచ్చు. ♦ వ్యాపారం, స్వయం ఉపాధి ద్వారా వచ్చే ఆదాయంలో కొంత నెలవారీ కిస్తీల చెల్లింపునకు పోను మిగిలేది కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవడం ద్వారా కొత్తగా బయట అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ♦ ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలన్న లక్ష్యంతో 2005 – 07 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీ పథకానికి రూపకల్పన చేశారు. అప్పట్లో అది పెద్ద సంచలనమై మహిళలు పెద్ద సంఖ్యలో పొదుపు సంఘాల్లో చేరారు. రేపు వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వైఎస్సార్ ఆసరా, చేయూత పథకం అమలవ్వడం ద్వారా ఇప్పుడు స్తబ్ధుగా ఉన్న డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు మళ్లీ ఊపందుకోవడంతో పాటు, కొత్తగా పెద్ద సంఖ్యలో మహిళలు సంఘాల్లో చేరే అవకాశం ఉంటుంది. కోర్టు చుట్టూ తిప్పుతున్నారు.. విజయనగరం జిల్లా ఎస్.రాయవరం మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో 40 కుటుంబాలున్నాయి. 250 మందికి పైగా జనాభా ఉన్నారు. ఇక్కడ నివసిస్తున్న వారంతా నిరుపేదలే. కూలీ పనులు చేసుకునే వారే. ఇక్కడ శ్రీచైతన్య, శ్రీదుర్గ, వెంకటేశ్వర –1, వెంకటేశ్వర – 2 పేరిట నాలుగు డ్వాక్రా సంఘాలున్నాయి. దాదాపు 80 శాతం కుటుంబాల్లోని ఒకరిద్దరు ఈ సంఘాల్లో సభ్యులే. 2014 వరకు ఈ సంఘాలు చక్కగా పని చేశాయి. తొలుత రూ.50 వేల చొప్పున రుణాలు పొందాయి. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించేవారు. 2010 నాటికే ఒక్కో సంఘం రూ.4.50 లక్షల వరకు రుణ పరపతిని పొందే స్థాయికి ఎదిగింది. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అయిపోతాయని చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణ మాఫీని అట కెక్కించారు. దీంతో వడ్డీతో సహా పేరుకుపోయిన రుణ బకాయిలు తలకు మించిన భారం కావడంతో వారు చెల్లించలేకపోయారు. మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఎస్.రాయవరం స్టేట్ బ్యాంక్ చివరకు కోర్టు నుంచి నోటీసులు జారీ చేయించింది. రూ.4.50 లక్షల రుణం తీసుకున్న శ్రీచైతన్య సంఘానికి రూ.9,42,098, రూ.3.60 లక్షల రుణం తీసుకున్న శ్రీ దుర్గ సంఘానికి రూ.7,36, 280, రూ.4 లక్షల రుణం తీసుకున్న వెంకటేశ్వర –1 సంఘానికి రూ.7.5 లక్షలు, రూ.4 లక్షల రుణం తీసుకున్న వెంకటేశ్వర –2 సంఘానికి రూ.7,60,645 బకాయిలున్నాయని నోటీసులు అందాయి. వెంటనే చెల్లించకపోతే జప్తు నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని అందులో హెచ్చరించాయి. ఇప్పుడు వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చచ్చిపోయినా వదలట్లేదు మా డ్వాక్రా సంఘానికి 2010 పాడేరు యూనియన్ బ్యాంకు పావలా వడ్డీపై రూ.3 లక్షలు రుణం మంజూరు చేసింది. 2014 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి తాము అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో ఆనందపడ్డాం. అసలు, వడ్డీ చెల్లించలేదు. 2014లో ఆయనకే ఓట్లు వేసాం. చంద్ర బాబు సీఎం అయ్యాడు. ఆరు నెలల్లోనే రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత మాట మార్చాడు. రుణమాఫీ చేయలేదు. దీంతో వడ్డీకి చక్రవడ్డీ కలిపి తడిసి మోపెడైంది. మేము చెల్లించాల్సిన అప్పు వడ్డీతో సహా కొండలా పేరుకుపోయింది. ప్రస్తుతం అసలు, వడ్డీ కలిపి రూ.9 లక్షల 67 వేలు చెల్లించాలని యూనియన్ బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నోటీసులు ఇచ్చారు. చివరకు మా వ్యక్తిగత ఖాతాలో ఉన్న పొదుపు సొమ్ము రూ.19 వేలు కూడా జమ చేసుకున్నారు. మా గ్రూప్లో అప్పు తీసుకున్న ఓ సభ్యురాలు లలితాకుమారి చనిపోయింది. ఆమె అప్పు కూడా మిగతా సభ్యులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. మమ్మల్ని నమ్మించి చంద్రబాబు చివరకు ఇలా తీవ్ర అన్యాయం చేశారు.– జంపరంగి వనజ, అధ్యక్షురాలు,ఉమా నీలకంఠేశ్వర డ్వాక్రా సంఘం, అడ్డుమండ, హుకుంపేట మండలం, విజయనగరం జిల్లా. అప్పు కడితేకాని పుస్తెలతాడు ఇవ్వమంటున్నారు మా ఆయన నా పుస్తెల తాడు తాకట్టు పెట్టి రూ.10 వేలు తెచ్చాడు. ఆ డబ్బులతో గేదె కొన్నాం. ఆ తర్వాత వడ్డీ రూ.2 వేలతో సహా అప్పు మొత్తం తీర్చేశాం. ఈలోగా మా ఆయన కూడా కాలం చేశాడు. మా ఆయన పెట్టిన నా పుస్తెల తాడు ఇమ్మని బ్యాంకోళ్ల దగ్గరకు పోతే.. ముందు నీ డ్వాక్రా అప్పు కట్టు.. ఆ తర్వాత నీ పుస్తెలతాడు ఇస్తామంటున్నారు. మూడేళ్లుగా తిప్పించుకుంటున్నారు. బ్యాంకోళ్లు నరకం చూపిస్తున్నారు. లక్షల్లో ఉన్న అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – గారా రమణమ్మ,శ్రీ చైతన్య డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు,వెంకటాపురం. విజయనగరం జిల్లా. జగన్ వస్తే అభాగ్యులకు చేయూత మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిని చదివించలేక చదువు మాన్పించి పెద్దమ్మాయికి పెళ్లి చేసి పంపాం. ప్రస్తుతం పూట గడవని పరిస్థితితో అల్లాడిపోతున్నాం. ఇప్పుడు 65 ఏళ్లు దాటితేనే పింఛను వస్తుంది. జగనన్న వస్తే వైఎస్సార్ చేయూత పేరుతో 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరికీ నాలుగేళ్లలో రూ.75 వేలు ఉచితంగా ఇస్తానని చెప్పడం సంతోషం. ఆ రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాం. మాలాంటి నిరుపేద మహిళలకు దీని ద్వారా చేయూత దొరుకుతుంది.– మీసాల ఏసమ్మ, కేశానుపల్లి, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా బడుగు వర్గాలకు ఎంతో మేలు వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం బడుగు, బలహీన వర్గాల వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడున్న కార్పొరేషన్ల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు. పలుకుబడి ఉన్నోళ్లకు మాత్రమే పనులు జరుగుతున్నాయి. జగన్ రాగానే కార్పొరేషన్లను ప్రక్షాళన చేసి పారదర్శక ప్రమాణాలు తీసుకు వస్తారని నమ్ముతున్నాం. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలందరికీ వైఎస్సార్ చేయూత పథకం కింద ఎంతో మేలు జరుగుతుంది. డ్వాక్రా సంఘాల వాళ్లకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని చెప్పడం ఎంతో మంచిది.– జి.విజయసుందరి,సత్తెనపల్లి,గుంటూరు జిల్లా ఇంతగా మోసం చేస్తారనుకోలేదు.. ఆంజనేయస్వామి మహిళా సంఘంలో 12 మంది సభ్యులమున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో మేము చాలా సంతోషించాం. ఇక మా కష్టాలన్నీ తీరినట్లేనని సంబరపడ్డాం. మా సంఘానికి బ్యాంకులో రూ.3.60 లక్షలు అప్పు ఉండేది. రుణమాఫీ అవుతుందని సంఘ సభ్యులందరం ఆశతో అప్పు చెల్లించలేదు. మాతో ఓట్లు వేయించుకుని చంద్రబాబు అధికారంలోకి అయితే వచ్చారు కానీ మాకు ఇచ్చిన హామీ నిలుపుకోలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకులో మాత్రం అసలు, వడ్డీ కలిపి రూ.4.44 లక్షలు అయ్యింది. అంతా చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేశారు. గత్యంతరం లేక సభ్యులందరం బయట అప్పు తెచ్చి బ్యాంకులో కట్టాం. ప్రతి రోజు కూలి పని చేసుకొని కష్టపడి సంపాదించిన సొమ్మంతా వడ్డీకే సరిపోతోంది. బయట తెచ్చిన అప్పులకు వడ్డీ కడుతూనే ఉన్నాం. అసలు ఎప్పుడు చెల్లిస్తామో తెలీదు. బతకడం కష్టమైంది.– ఆంజనేయస్వామి మహిళా సంఘం సభ్యులు, యర్రగుంట్ల, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటా ♦ 2019లో అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రాఅక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తాం. ♦ మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. ఆ వడ్డీ డబ్బును అక్కచెల్లెమ్మల తరఫున మేమే బ్యాంకులకు కడతాం. ‘వైఎస్సార్ ఆసరా’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తాం. ♦ 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు పెన్షన్ ఇస్తామంటే కొందరు వెటకారం చేశారు. అందులో ఉన్న స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోయారు. అయినా వారి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని తీసుకొస్తున్నాం. ♦ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండినఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని అక్కలందరికీ తోడుగా ఉంటాం. ♦ ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా, ♦ కొందరికో అరకొరగా ఇస్తూ.. అది కూడా లంచం లేనిదే ఇవ్వనిపరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకొస్తాం. ♦ 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు ఈ పథకం ద్వారా రూ.75,000 ఉచితంగా ఇస్తాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన రెండవ ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లలో నాలుగు విడతలుగా ఈ మొత్తాన్నిఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందజేస్తాం. – వైఎస్ జగన్ -
నీరు, నేల సాక్షిగా.. స్వాహా పర్వం
సీఎం చంద్రబాబు తొలుత విడుదల చేసిన శ్వేతపత్రంలో వెల్లడించిన మేరకు చూస్తే.. పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తయుండాలి. రాష్ట్రం సస్యశ్యామలమై ఉండాలి.. కానీ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. అదనంగా ఒక్క ఎకరా ఆయకట్టుకూ నీళ్లివ్వలేదు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రూ.20 వేల కోట్లు, నీరు–చెట్టు కింద రూ.పది వేల కోట్లు, చెరువులు, వాగులు, వంకల్లో పూడిక తీసిన మట్టి, ఇసుక అమ్మకం ద్వారా రూ.25 వేల కోట్లు.. వెరసి రూ.55 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఎవరైనా ఇంటికి పునాదులు వేసి.. గృహ ప్రవేశానికి రండంటూ అందరినీ పిలిచి భోజనం పెడితే ఏమంటాం? పిచ్చోడంటాం.. లేదా మనందరినీ తప్పుదోవ పట్టించడానికి చెవిలో పూలు పెడుతున్నాడంటాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సరిగ్గా ఇదిగో ఇలానే చేస్తున్నారు. – వైఎస్ జగన్ బాబు పుణ్యమా అని మా బతుకులిలా తగలడ్డాయి.. మాది నిరుపేద కుటుంబం. రెండెకరాల చిన్న రైతును. నాలుగేళ్లుగా చినుకు లేదు. పంటలు పండే పరిస్థితి లేదు. అప్పుడప్పుడు పడ్డ కొద్దిపాటి వర్షానికి కంది, మిరప, పత్తి లాంటి పైర్లు వేసినా ఆ తర్వాత వర్షాల్లేక ఎండిపోవడం మామూలైంది. పంటలు వేయడమే మానుకున్నాం. సేద్యాన్ని పక్కన పెట్టాం. కడుపు నిండాలంటే రెక్కల కష్టం తప్పలేదు. ఇక్కడ పనుల్లేకపోవడంతో వలస వెళ్లక తప్పలేదు. వరి కోతలకు కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు.. చెరకు నరకడానికి శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు పోతున్నాం. ఒంట్లో సత్తా ఉన్నన్నాళ్లు నేను వెళ్లే వాడిని. ఇప్పుడు కష్టంగా ఉంది. మా పిల్లలు వెళుతున్నారు. నెల కిందట తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో వరి కోతలకు వెళ్లి.. ఆదివారం తిరిగొస్తుండగా లారీ ప్రమాదంలో మా పిల్లలకు గాయాలయ్యాయి. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారు. అలా జరగకుండా ఉన్నట్లయితే గుంటూరు జిల్లాలో వరి కోతలకు వెళ్లేవారు. ఏడేళ్లుగా వలసపోతూనే ఉన్నాం. ఏడాదిలో మూడు నెలలే కూలి ఉంటుంది. దాంతోనే కుటుంబం మొత్తం బతకాల్సి వస్తోంది. బతుకు దుర్భరంగా ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పనులను చంద్రబాబు సర్కారు పూర్తి చేయకపోవడంతో ఆయకట్టు రైతులమైన మా బతుకు భారమైంది. పొలాలన్నీ బీళ్లే. తిండి గింజలు, పశువుల మేత దొరికే పరిస్థితి లేదు. ప్రాణప్రదంగా పెంచుకున్న పశువులను కబేళాలకు తరలించి రైతులందరం ఇతర ప్రాంతాలకు కూలికెళ్లి బతుకీడుస్తున్నాం. మా బతుకులిలా తగలడ్డాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండ పనులు వేగంగా జరిగాయి. అప్పుడే పనులు పూర్తయి నీరొచ్చి మా బతుకులు మారతాయన్న ఆశ చిగురించింది. ఆయన చనిపోయాక చంద్రబాబు ప్రభుత్వం వెలిగొండ పనులను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారన్న నమ్మకం ఉంది. – నార్లగడ్డ సుబ్బయ్య, వెంకటరెడ్డి పల్లె, పుల్లలచెరువు మండలం, ప్రకాశం జిల్లా ఆయ‘కట్టు’కథలు.. కమీషన్ల పర్వాలు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయి వరుస ఓటములతో కుంగి కుదేలైన టీడీపీని అధికారంలోకి తేవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సాగు నీటి ప్రాజెక్టుల జపం చేసి, అధికారంలోకొచ్చాక తన అక్రమార్జనకు వాటిని వనరులుగా మార్చుకున్నారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు మినహా మిగతా పెండింగ్ ప్రాజెక్టుల పనులను కేవలం రూ.17,368 కోట్లతోనే పూర్తి చేస్తానంటూ సాగునీటి ప్రాజెక్టులపై 2014 జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. కానీ.. నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.63,657.62 కోట్లు ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.10,227.92 కోట్లు, నీరు–చెట్టు కింద చేసిన పనులకు రూ.15,806.70 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. మిగతా రూ.37,623 కోట్లను పెండింగ్ ప్రాజెక్టుల పనులకు ఖర్చు చేశామని చెబుతున్నా ఒక్క ప్రాజెక్టూ పూర్తయింది లేదు. నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన రూ.63,657.62 కోట్లను సక్రమంగా వినియోగించుకుని ఉండుంటే.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ దాదాపుగా పూర్తయ్యేవని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జల సంరక్షణ, భూగర్భ జల వనరుల పరిరక్షణ ముసుగులో నీరు–చెట్టు కింద పనులు చేయకుండానే చేసినట్లు చూపి దోపిడీ చేయకుండా ఆ నిధులను పోలవరం ప్రాజెక్టుకు మళ్లించి ఉంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పనులు కొలిక్కి వచ్చేవని జల వనరులశాఖ అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. కమీషన్ల వర్షం కురిపించే కామధేనువులుగా సాగునీటి ప్రాజెక్టులను మార్చేయడం వల్ల ఈ దుస్థితి నెలకొంది. జలయజ్ఞం కింద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన గుండ్లకమ్మ, పుష్కర, తాడిపూడి, గురురాఘవేంద్ర, భూపతిపాలెం, ముసురుమిల్లి, ఎర్రకాల్వ, తోటపల్లి తదితర 11 ప్రాజెక్టులు ముగింపు దశకు చేరుకున్నాయని, మిగిలిపోయిన ఐదు శాతం పనులు పూర్తి చేస్తే కొత్తగా 2,03,628 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చని 2013–14 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ 11 ప్రాజెక్టులను కేవలం రూ.780 కోట్లతో పూర్తి చేయవచ్చని అప్పట్లో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనుల్లో పెద్దగా కమీషన్లు రావనే నెపంతో ఆ పనులకు టీడీపీ సర్కార్ ప్రాధాన్యమివ్వలేదు. గాలేరు–నగరి తొలి దశ, హంద్రీ–నీవా తొలి దశ, తెలుగుగంగ ప్రాజెక్టులు 2014 నాటికే పూర్తయ్యాయి. కానీ ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను టీడీపీ ప్రభుత్వం చేపట్టలేదు. దీనివల్ల 6.45 లక్షల ఎకరాలకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధి ఉంటే.. ఆ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసేది. కానీ తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసిన సర్కారు.. పాత కాంట్రాక్టర్లను తొలగించి, కమీషన్లు ఇచ్చిన వారికి పనులు అప్పగించింది. అయినా ఆ పనులను పూర్తి చేయలేకపోయింది. దాంతో నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో.. ఎప్పుడో పూర్తయి, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులనే చంద్రబాబు మళ్లీ ప్రారంభించి.. అది తన ఘనతగా చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతుండటంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నుంచి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వరకూ ఇదే కథ. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన భూమి 199.04 లక్షల ఎకరాలుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బోరు బావుల కింద 104.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందేవి. కానీ నాలుగున్నరేళ్లుగా ఆయకట్టు తగ్గిపోతూ వస్తోంది. గరిష్టంగా 76 లక్షల ఎకరాలకే సాగునీరు అందించినట్లు జల వనరుల శాఖ రికార్డులే చెబుతున్నాయి. కానీ.. క్షేత్ర స్థాయిలో ఆ మేరకు కూడా సాగునీళ్లు అందిన దాఖలాల్లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. పొలం వదిలేసి.. డ్రైవర్గా వెళ్తున్నా... నాకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఓ కుమార్తెకు పెళ్లి చేశా. మరో కుమార్తె ఇంటర్, కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. నాకు నాలుగెకరాల మామిడి తోట ఉంది. మూడేళ్లుగా కాపు తగ్గుతూ వస్తోంది. బోరు బావి తవ్వాలంటే రూ.80 వేలవుతోంది. అంత డబ్బు పెట్టలేని పరిస్థితి. పోనీ అప్పు తెద్దామన్నా ఆర్థికంగా చితికిపోయిన నాకు ఎవరిస్తారు? అప్పు దొరికే పరిస్థితి లేదు. తోటలో చెట్లన్నీ ఎండిపోయాయి. కష్టాలన్నీ ఒక్కసారిగా మొదలయ్యాయి. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఒకప్పుడు ఎంతో మంది కూలీలకు పని కల్పించిన నేను.. ఇప్పుడు కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ను కూడా అమ్మేశాను. పండ్ల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ కూలీగా పని చేసేందుకు మహారాష్ట్రకు కూలీగా వెళ్లాను. అక్కడ భాష రాక బతుకు భారమై మళ్లీ ఇంటికొచ్చాను. పొట్టకూటి కోసం ఇక్కడే ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నా. చంద్రబాబు సర్కారు అన్నదాతలను ఆదుకోదని తేలిపోయింది. నా గోడు వినేవారు లేరు. వైఎస్ జగన్ వస్తేనే మళ్లీ నాకు మునుపటి బతుకు వస్తుంది. ఆయనే ఉచితంగా బోరు వేయిస్తానన్నారు. పెట్టుబడికి డబ్బులు కూడా ఇస్తానన్నారు. ముఖ్యంగా మా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తవుతాయి. మా పొలాలకు నీరొస్తుంది. – అమ్మనబ్రోలు నాగయ్య, కొల్లూరుపాడు, ఉలవపాడు పంచాయతీ, ప్రకాశం జిల్లా. చంద్రబాబు ఇలా చెప్పారు.. చంద్రబాబు 2014 ఎన్నికప్పుడు.. అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ దశల వారీగా పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం మినహా మిగిలిన ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతోనే పూర్తి చేస్తాం. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి గ్రావిటీ ఆయకట్టుకు నీళ్లందిస్తాం. నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తాం. సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను మళ్లించి రెండు కోట్ల ఎకరాలకు నీళ్లందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. చంద్రబాబు చేసిందిదీ..: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేశారు. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గత నాలుగున్నరేళ్లలో రూ.37,952.92 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 23 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మాత్రం రూ.96,060.73 కోట్లకు పెంచేశారు. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.58,107.86 కోట్లు పెంచేశారు. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున కమీషన్లు తీసుకున్నారనేది స్పష్టమవుతోంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నారు. ఆ తర్వాత పనులన్నీ నామినేషన్పై కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ఇంకా నోటిఫై చేయక ముందే ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేందుకు కర్ణాటక సర్కార్ చర్యలు తీసుకుంటున్నా, ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో అదనపు నీటిని వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదు. కృష్ణా నదీ జలాల విషయంలోనే కాదు.. గోదావరి జలాలపై రైతుల హక్కుల పరిరక్షణలోనూ అదే కథ. చివరకు వంశధార జలాలపై ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను కూడా పరిరక్షించలేకపోయారు. అపర భగీరథుడు వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా, దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధికెక్కింది. కానీ 1995 నుంచి 2004 వరకు వరుస కరవులతో వ్యవసాయం సంక్షోభంలో పడింది. పది మందికి పట్టెడన్నం పెట్టే రైతులు ఆకలితో అలమటించారు. ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కడలి పాలవుతున్న నదీ జలాలను మళ్లించి.. బంజరు భూములను సస్యశ్యామలం చేసి, కరవును శాశ్వతంగా తరిమికొట్టేందుకు 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. తె లుగునేలను కరువనేదే ఎరుగని సీమగా మార్చాలని, దేశ ధాన్యాగారంగా నిలపడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణ నామధేయాన్ని సార్థకం చేసి.. రైతేరాజు అన్న నానుడిని నిజం చేసే దిశగా వేగంగా అడుగులేశారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2004లో రూ.లక్ష కోట్ల బడ్జెట్ లేదు. కానీ.. రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారు. వాటిని పూర్తి చేయడం ద్వారా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పక్కాగా ప్రణాళిక వేసుకున్నారు. ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా మొక్కవోని స్థైర్యంతో, చెదరని ఆత్మవిశ్వాసంతో.. అకుంఠిత దీక్షతో జలయజ్ఞాన్ని కొనసాగించారు. ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లను ఖర్చుచేసి 16 ప్రాజెక్టులను పూర్తిగా, 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయడం ద్వారా 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. సాగునీటి రంగం చరిత్రలో ఇదో చెరిగిపోని రికార్డు. అధిక శాతం ప్రాజెక్టు పనులను ఓ కొలిక్కి తెచ్చిన వైఎస్.. జలయజ్ఞం ఫలాలను సంపూర్ణ స్థాయిలో అందుబాటులోకి తెచ్చే క్రమంలో అమరుడయ్యారు. మహానేత స్ఫూర్తి.. అదే ఆర్తి.. తెలుగునేలను సుభిక్షం చేయడానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞాన్ని చేపడితే.. దాన్ని పూర్తి చేసి, ఫలాలను రైతులకు అందించే గురుతర బాధ్యతను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీసుకున్నారు. ఆయన ప్రకటించిన నవరత్నాలలో జలయజ్ఞానికి పెద్దపీట వేశారు. మహానేత చేపట్టిన జలయజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేసే సమర్థత.. ప్రణాళిక ఒక్క వైఎస్ జగన్కే ఉన్నాయని సాగునీటి రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలు, రైతులు స్పష్టీకరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులను సమీక్షించి.. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యం కింద పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తాం. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కడలి పాలవుతున్న గోదావరి జలాలను పొలాలకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలను దేశపు ధాన్యాగారంగా తీర్చిదిద్దుతాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తాం. ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తాం. వంశధార, తోటపల్లి, జంజావతి, తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులను శరవేగంగా పూర్తిచేసి ఉత్తరాంధ్రను సుభిక్షం చేస్తాం. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ, గుండ్లకమ్మ, సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసి దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించి, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలు, కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీళ్లందించేలా చూస్తాం. నిర్వాసితులుగా మారిన ప్రజలకు పునరావాసం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతాం. -
అందని చదువులు.. ఉసురు తీస్తున్న ఫీజులు!
నెల్లూరు జిల్లా కుడుములదిన్నెపాడుకు చెందినగడ్డమడుగు గోపాల్ పేదరికంలో మగ్గుతున్నా అన్ని కష్టాలు ఓర్చుకొని తన కొడుకునుబాగా చదివించాడు. తండ్రి కష్టం నిత్యం కళ్లారా చూసిన అంకమరావు అందుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచి చదువులో మేటిగా నిలిచాడు. కష్టపడి ఇంటర్ పూర్తి చేసి ఎన్నో ఆశలతో ఇంజనీరింగ్లో చేరాడు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పూర్తిగా డబ్బులు రాకపోవటం, తన కోసం తండ్రి అప్పులు చేస్తూ.. రెక్కలు ముక్కలు చేసుకొని పని చేయటం చూసి తట్టుకోలేకపోయాడు. ఉరి వేసుకొని తనువు చాలించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కోట్లలో పేరుకు పోతున్నాయి. నిధులు విడుదల చేస్తున్నామని చెబుతున్నా, కాలేజీలకు సకాలంలో జమ కావడం లేదు. దీంతో ఎంతో మంది విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. చదువు పూర్తయి ఉద్యోగం వేటలో ఉన్న నిరుద్యోగులపై ఈ పరిణామం పిడుగు పడినట్లైంది. చాలా మంది నిరుద్యోగులకు 2017 – 18 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చివరి దఫా కాలేజీలకు అందలేదు. పీజీ చదువుతున్న వారికి కూడా సరిగా ఇవ్వటం లేదు. అందరి కంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీలు, నవోదయ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. అయినా వీరికి కూడా రూ.35 వేలకు మించి ప్రభుత్వం ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆదేశాల కాపీని జత చేసి అర్జీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. గత సంవత్సర బకాయిలు ఇటీవలే విడుదల చేశామని ప్రభుత్వం చెబుతున్నా కూడా అది కాలేజీలకు అందలేదు. – సాక్షి అమరావతి / సాక్షి ప్రతినిధి, నెల్లూరు వైఎస్సార్ హయాంలో ఇలా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బీసీలు, ఈబీసీలకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. అంతకు ముందు బీసీ, ఈబీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది కాదు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఫీజులు కొంత వరకు చెల్లిస్తుండటంతో 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు బీసీ, ఈబీసీలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఇచ్చారు. దీంతో వందల కోట్లలో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్క సారిగా వేల కోట్లలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం తీరిది.. ప్రతి సంవత్సరం నాలుగు క్వార్టర్లలో ప్రభుత్వం ఫీజులు కాలేజీలకు చెల్లిస్తోంది. ఉదాహరణకు 2018 –19 సంవత్సరానికి రెండు క్వార్టర్లు రీయింబర్స్మెంట్ చెల్లించారు. మొదటి క్వార్టర్లో రూ. 576.25 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.537.10 కోట్లు మాత్రమే చెల్లించింది. అంటే రూ.39.15 కోట్లు మొదటి క్వార్టర్కు బకాయి ఉంది. ఇక రెండో క్వార్టర్లో రూ.618.33 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.485.05 కోట్లు మాత్రమే చెల్లించింది. అంటే రూ.133.28 కోట్లు ఇంకా చెల్లించాలి. రెండు క్వార్టర్లకు కలిపి ఈ సంవత్సరంలో ఇంకా రూ.162.43 కోట్లు విద్యార్థులకు ప్రభుత్వం బకాయి ఉంది. ఇంకా రెండు క్వార్టర్ల ఫీజులు చెల్లించాలి. 75 శాతం హాజరు ఉన్నట్లు కాలేజీ నుంచి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి వివరాలు అందాలి. లేకుంటే చివరి క్వార్టర్ ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ కావడం లేదు. హాజరుతో సంబంధం లేకుండానే బకాయిలు ఉంటున్నాయి. నాలుగో క్వార్టర్ రిలీజ్లో జాప్యం కారణంగా వేలాది మంది విద్యార్థులకు ఏడాది వృధా అవుతోంది. ప్రభుత్వ ఈ విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. హాజరు లేదని కొర్రీలు వేస్తోంది. పైకి మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఇస్తున్నామని అబద్ధాలు చెబుతోంది. ఇంజినీరింగ్ విద్యార్థులపై పెనుభారం రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు 321 ఉన్నాయి. ఈ కాలేజీల్లో సుమారు 90 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో కలిపి మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన వారు (ఇంటర్ నుంచి పీజీ వరకు అన్ని కోర్స్లు కలిపి) 16,00,054 మంది ఉన్నారు. 8,352 కాలేజీల్లో చదువుతున్న వీరికి ప్రభుత్వ నిర్దేసించిన మేరకు ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,555.26 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఒక్కో ఇంజినీరింగ్ విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.35 వేలు మాత్రమే. అది కూడా సకాలంలో ఇవ్వడం లేదు. సగటున రూ.65 వేలు సొంతంగా చెల్లిస్తున్నారు. ఇతర కోర్సుల విద్యార్థులదీ ఇదే పరిస్థితి. ఆ ఫీజే ప్రాణం తీసింది.. బేల్దారి పని చేసే మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు అంకమరావు 10వ తరగతి వరకు కలిగిరి జెడ్పీ హైస్కూల్లో 9.5 జీపీఏతో పాసయ్యాడు. వింజమూరులోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. 9.8 జీపీఏ వచ్చింది. నాన్నా.. ఇంజినీరింగ్ చదువుతా అన్నాడు.. మాలాగా కష్టపడటం వద్దనుకుని సరేనన్నాము. 2016లో నెల్లూరులోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో సీటు వచ్చింది. కళాశాల యాజమాన్యం సంవత్సరానికి రూ.65 వేలు ఫీజు చెల్లించాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అంతా వస్తుందనుకున్నాము. కానీ కేవలం రూ.30 వేలు మాత్రమే వస్తుందని, మిగిలిన రూ.35 వేలు ఫీజు సొంతంగా చెల్లించాలని కాలేజీ వాళ్లు చెప్పారు. తొలుత రూ.20 వేలు కట్టాము. మొదటి సంవత్సరంలో చేరాడు. హాస్టల్ ఖర్చు భరించలేమని నేను (గోపాల్) నెల్లూరుకు వెళ్లి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నా. నెల్లూరులోనే బెల్దారి పనులు చేసుకుంటూ అంకమరావును కాలేజీకి పంపేవాడిని. నా భార్య వరమ్మ ఊళ్లోనే ఉంటూ వ్యవసాయ కూలి పనులకు వెళ్తుండేది. మూడు నెలలు కాలేజీకి వెళ్లాడు. మిగిలిన ఫీజు చెల్లించాలని చెప్పాడు. చూద్దాం.. కడదాములే అని చెప్పాము. ఇద్దరు ముగ్గురిని అప్పు అడిగాం. లేదన్నారు. ఎలాగైనా అప్పు తెస్తామని చెప్పాను. సరేనన్నాడు. అంతలోనే ఏమనుకున్నాడో ఏమో.. బిడ్డడు అదే ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ఇంట్లో మేమెవ్వరం లేనప్పుడు ఉరేసుకుని మమ్మల్ని వదిలి కనిపించనంత దూరం వెళ్లిపోయాడు. చేతికందొచ్చిన కొడుకు ఇలా మమ్మల్ని వదిలి కానరాని లోకాలకు వెళ్లిపోతాడని కలలో కూడా ఊహించలేదు. ఇంజనీరయ్యి మిమ్మల్ని బాగా చూసుకుంటా అనేవాడు. ఆ చదువు చదివించకపోయుంటే పిల్లాడు మా కళ్ల ముందే ఉండేవాడు. పెద్దోడు ఇలా అయిపోయాక మాకు దిక్కుతోచడం లేదు. చిన్నోడి భవిష్యత్ కోసం కన్నీళ్లు దిగమింగుకుంటూ జీవిస్తున్నాం. చిన్నోడు కలిగిరిలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. మాకు సెంటు భూమి కూడా లేదు. ఇప్పుడుంటున్నది కూడా పూరిల్లే. – గోపాల్, వరమ్మ దంపతులు, కుడుములదిన్నెపాడు,కృష్ణారెడ్డిపాలెం పంచాయతి, కలిగిరి మండలం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అదే జరిగితే మా బతుకులే మారిపోతాయి నాకు ఇద్దరు పిల్లలు. రోజూ కూలినాలీ చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి మాది. నా పిల్లల్లో అమ్మాయి సరళ కొండాపురంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా ఇచ్చివుంటే కార్పొరేట్ కళాశాలలో చేర్పించేవాళ్లం. సొంత నగదుతో ఆ కళాశాలలో చేర్పించే తాహతు లేదు. వైఎస్.రాజశేఖరరెడ్డి గారు బతికున్నప్పుడు మాలాంటి అనేక మంది పేద కుటుంబాలకు చెందిన పిల్లలు అన్ని సౌకర్యాలున్న కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునేవారు. దానికయ్యే డబ్బంతా ప్రభుత్వమే చెల్లించేది. కానీ ఇప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. పేద పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. చదివించే స్థోమత లేనివారు పిల్లలను మధ్యలోనే చదువు మాన్పించి పనులకు పంపాల్సి వస్తోంది. మాలాంటి పేదోళ్ల కష్టాలు కళ్లారా చూసిన రాజన్న బిడ్డ జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బాగా అమలు చేస్తానని చెబుతున్నాడు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు ఉచితంగా ఉన్నత చదువులు చదువుకోవచ్చు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే ఇస్తానంటున్నాడు. అంతా ప్రభుత్వంమే భరించేలా చేస్తానంటున్నాడు. పైగా హాస్టల్ ఖర్చులకు మెస్ చార్జీల కింద ఏటా రూ.20 వేలు అదనంగా ఇస్తానని చెబుతుండటం చాలా చాలా మంచిది. ఇదే జరిగితే మా లాంటి పేదోళ్ల జీవితాలే మారిపోతాయి. నా కూతురును, ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న నా కొడుకు వెంకట్ను ఉన్నత చదువు చదివిస్తాను. జగన్ చెబుతున్న మాటలపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ల నాయన రాజశేఖరరెడ్డి గారు పేదోళ్ల కోసం ఈ పథకాన్ని బాగా అమలు చేశాడు. ఆయన కంటే రెండడుగులు ముందుకు వేసి పేదోళ్లను చదివిస్తానని జగన్ కసిగా చెబుతుండటం రోజూ చూస్తున్నాం. అందుకే ఆయన (జగన్) ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. – కొప్పర్తి సుజాతమ్మ, సాయిపేట ఎస్సీ కాలనీ, కొండాపురం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నా... ‘నేను విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో 2017లో ఫైనల్ ఇయర్ ఈసీఈ పూర్తి చేశా. నాకు హైదరాబాద్లోని ఓ ప్రై వేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. సర్టిఫికెట్లు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని బతిమాలినా ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఫైనల్ క్వార్టర్ రాలేదు. కాలేజీకి రావాల్సిన ఫీజు ఇంకా రూ.26 వేలు ఉంది. డబ్బులు చెల్లిస్తే సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. మాది నిరుపేద కుటుంబం. మా అమ్మా నాన్నలు వేరే వారి దగ్గర అప్పు తెచ్చిచ్చారు. డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నాను. గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కాలేజీ అకౌంట్లోకి వేయగానే నా డబ్బులు వెనక్కి ఇస్తామన్నారు. ఇప్పటికి ఏడాదిన్నరైంది. ఆ డబ్బులు రాలేదు. – అన్నాబత్తుల సురేష్కుమార్, పోరంకి, కృష్ణా జిల్లా సర్టిఫికెట్లు ఇవ్వలేదు నేను ఏలూరులోని కట్టమంచి రామలింగారెడ్డి పీజీ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను. నాకు కాలేజీ వారు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. 2017 – 18 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. కాలేజీ వారు రాజమండ్రిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుంచి సాంఘిక సంక్షేమ శాఖకు లేఖలు రాయించారు. అయినా స్పందించ లేదు. గత ఏడాది మార్చిలో మా కోర్స్ పూర్తయింది. మొత్తం 16 మందిమి పొలిటికల్ సైన్స్ క్లాస్లో ఉన్నాము. ఎవ్వరికీ ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. కారణమూ చెప్పలేదు. – జె శ్రావణి, కాకినాడ. పేదలచదువుకుపూచీ నాది : వైఎస్ జగన్ బంగారు భవిష్యత్తు ఉన్న విద్యా కుసుమం నేలరాలిన వైనంపై తండ్రి గోపాల్.. ప్రజా సంకల్ప యాత్రలోప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు వివరించి.. కొడుకు ఫొటో చూపించి కుమిలిపోయాడు. గోపాల్ మాటలు విన్న వైఎస్ జగన్ తీవ్రంగా చలించిపోయారు. ఇలాంటి కష్టం భవిష్యత్తులో ఏకుటుంబానికి రాకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. సమగ్ర మార్పులు, చేర్పులతో ఆర్థిక ఇబ్బందులు లేని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఎన్నికోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు. పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమేపూర్తిగా భరిస్తుంది. ఎన్ని లక్షల రూపాయలైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాం. అంతే కాకుండా మెస్ చార్జీల (వసతి, భోజనం కోసం)కోసం అదనంగా ప్రతి విద్యార్థికి ఏటా రూ.20 వేలు ఇస్తాం. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళ్ల కూడదనేది మా ఆలోచన. పిల్లల చదువును ప్రభుత్వం చూసుకుంటుందనే భరోసా కల్పిస్తాం. దీంతో పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులు ఆలోచించకుండా సంతోషంగా వారి పనులు వారు చేసుకునే అవకాశం కలుగుతుంది. పేదల చదువుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే, ఆయన స్ఫూర్తితో నేను రెండడుగులు ముందుకు వేస్తా. - వైఎస్ జగన్ -
మోడుబారిన బతుకుల్లో చిగురించిన ఆశలు
ఎటుచూసినా నెర్రెలిచ్చిన నేలలు.. వరస కరవులు.. రాష్ట్రంలో సగానికి పైగా మండలాలు నిరంతరం కరవులోనే.. పసిబిడ్డలు తల్లిపాల కోసం ఏడుస్తున్న తీరుగా నీళ్ల కోసం రైతుల ఎదురు చూపులు.. పశువులు కబేళాలకు.. కడుపు నింపుకోవడానికి పొలాలను తెగనమ్ముకుని కూలీల అవతారమెత్తుతున్న రైతులు.. వ్యవసాయ కూలీలు పొట్ట చేత పట్టుకుని పని కోసం రాష్ట్రేతర ప్రాంతాలకు వలసలు.. ప్రతికూల పరిస్థితుల్లో ఏటికి ఎదురీది పంట పండించినా, కనీస మద్దతు ధరా దక్కని దౌర్భాగ్యపు పరిస్థితి. దళారులు ఆడింది ఆట.. పాడింది పాట.. పాలకులే దళారుల అవతారం ఎత్తిన వేళ ధరల స్థిరీకరణ కలగా మారిన దుస్థితి. రుణమాఫీ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోక, కొత్త అప్పు పుట్టక.. బ్యాంకర్ల దృష్టిలో దొంగలన్న అపవాదే మిగిలింది. సున్నా, పావలా వడ్డీ జాడ లేక.. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులే దిక్కయిన వేళ అప్పుల కుప్పలే మిగిలిన దయ నీయ పరిస్థితి.. పర్యవసానం.. పూటకో రైతు బలవన్మరణం.. నేలను గుంజుకుంటున్నోడు ఆకాశానికి ఎగబాకుతుంటే, నమ్ముకున్నోడు అదే నేలలో కలిసిపోతున్నాడు. ఈ పరిస్థితి మార్చడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలను ప్రకటించారు. ఎప్పటికప్పుడు అందరి సూచనలు, సలహాలతో ప్రజా రంజకముగా వాటికి మెరుగులు దిద్దారు. ఈ నవరత్నాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటం ఖాయం అని వివిధ రంగాల నిపుణులు స్పష్టీకరిస్తున్న తరుణంలో నేటి నుంచి ‘సాక్షి’ వాటిని ప్రజల ముంగిటకు తీసుకువస్తోంది. ఈ ప్రయత్నంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం వివరాలు.. ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులు.. –సాక్షి, అమరావతి రైతుల కష్టాలన్నింటినీ కళ్లారా చూశారు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. తిరిగి వైఎస్సార్ స్వర్ణ యుగాన్ని తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. ‘రైతు కంట కన్నీరు పెడితే దేశానికే అరిష్టం’ అని వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో.. ఆయన కంటే ఒకడుగు ముందుకేసి ‘వైఎస్సార్ రైతు భరోసా’ అనే రత్నాన్ని (పథకాన్ని) ప్రకటించారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం తుమ్మరకుంట పంచాయతీ నావాబ్ కోట గ్రామానికి చెందిన గంగులప్పకు మూడెకరాల పొలం ఉంది. టమాటా సాగు చేశాడు. దిగుబడి ఉన్నా ధర లేదు. దీంతో చేసిన అప్పు తీరలేదు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్టుబడుల కోసం చేసిన అప్పు రూ.1.10 లక్షలయింది. అప్పు ఇచ్చిన ప్రైవేటు వ్యక్తులు ఒత్తిడి చేయడంతో 2017 ఆగస్టు 5న పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన లోవరాజు వరి పండిస్తాడు. గత ఖరీఫ్లో పండిన పంటను అమ్ముకోవడానికి పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. పంట చేతికి వచ్చేంత వరకు రూ.1300 పలికిన వడ్ల బస్తా పంట చేతికి వచ్చాక రూ.1100కు పడిపోయింది. దళారుల మాయాజాలంలో చిక్కిన రైతులు చేసేది లేక అయిన కాడికి అమ్ముకుని వడ్డీకి తెచ్చిన అప్పులు తీర్చుకోవాల్సివచ్చింది. ఫలితంగా బస్తాకు సగటున రూ.200 నష్టపోవాల్సి వచ్చింది. క్వింటాల్ వరికి ప్రకటించిన మద్దతు ధర రూ.1580 అయితే రైతుకు దక్కింది మాత్రం రూ.1100 కావడం గమనార్హం. రాష్ట్రంలోని రైతులందరిదీ ఇదే దుస్థితి. ఒక్కో రైతుది ఒక్కో దీనగాధ. పంట అమ్ముకోలేక కొందరు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినా పరిహారం రాక మరికొందరు.. పాలకుల మాయ మాటలు నమ్మి ఇంకొందరు అప్పులపాలయ్యారు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రుణాలు మాఫీ కాక రైతులు కుదేలు అధికారంలోకి రావడానికి అడ్డమైన, అలివికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం. రైతుల రూ.87,612 కోట్ల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి, తుదకు ఆ పథకం కింద ఇచ్చిన సొమ్ము వడ్డీలకు కూడా సరిపోక రైతులు డిఫాల్టర్లుగా మిగిలారు. అపరాధ వడ్డీలు కట్టాల్సిన దుస్థితిలోకి వచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వక పోవడం, పంటల బీమా సొమ్మును ఇతర పనులకు మళ్లించడం, గిట్టుబాటు ధర కల్పించక పోవడం ప్రధానంగా రైతాంగాన్ని కుంగదీసింది. మామిడి, మిర్చి, టమాటా, ఉల్లి, వరి.. పంట ఏదైనా కష్టం రైతుదైతే, లాభం మాత్రం దళారికే. భరోసా కరువై.. బతుకు బరువై.. వాస్తవానికి రైతులు లక్ష రూపాయల లోపు పంట రుణాన్ని సకాలంలో చెల్లించగలిగితే ఎటువంటి వడ్డీ ఉండదు. ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల లోపు పంట రుణాలను పావలా వడ్డీకి ఇప్పించాలి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ మేరకు వడ్డీ రాయితీని బ్యాంకులకు చెల్లించక పోవడంతో సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలు అమలు కావడం లేదు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులు ధర లేక తమ పంటను రోడ్లపై పోసి నిరసన తెలపడం.. మిర్చి, కంది రైతులు రోడ్డెక్కడం చూశాం. కూలి కూడా గిట్టుబాటు కాక టమాటా రైతులు పంటను రోడ్డుపై పారబోసిపోవడమూ చూశాం. తుపాన్లప్పుడు పంట తుడిచి పెట్టుకుపోవడం కూడా చూశాం. ఈ బాధలు పడలేక రైతు ఆత్మహత్య చేసుకోని రోజంటూ లేదు. చంద్రబాబు చెప్పిందిదీ.. అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాం (2014 టీడీపీ ఎన్నికల ప్రణాళికలో, బహిరంగ సభల్లో) 9 గంటల పాటు ఉచిత విద్యుత్ రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి రైతు వారీగా ఇన్సూరెన్స్ చౌకధరలకు మేలు రకం విత్తనాలు ప్రతి జిల్లాలో ఒక మెగా ఫుడ్ పార్క్, ప్రతి మండలంలో ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ రైతులకు మేలు చేసేలా పంటల బీమా పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్లకు 24 గంటల్లో మరమ్మతులు స్వామినాథన్ నివేదిక ఆధారంగా కనీస మద్దతు ధరను ప్రకటిస్తాం. (ఎన్నికల ప్రణాళిక పేజీ 13) ప్రత్యేక విత్తన చట్టం తెస్తాం. బీటీ పత్తి విత్తనాలను సబ్సిడీపై అందజేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి రుణ సౌకర్యం కల్పిస్తాం రైతులకు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ సరఫరా నిమిత్తం రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి చంద్రబాబు చేసిందిదీ.. పదవీ కాలం ముగుస్తున్నా పూర్తి స్థాయిలో మాఫీ కాలేదు. ఈ పథకం కింద ఇచ్చిన మొత్తం రైతులు తీసుకున్న అప్పులకు సంబంధించి వడ్డీలకు కూడా సరిపోలేదు. ఈ విషయమై వేలాది మంది రైతులు వైఎస్ జగన్ పాదయాత్రలో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. 7 గంటలకు కోత వేసి రెండు షిఫ్టులుగా సరఫరా.. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చంద్రబాబుకే ఎరుక. అసలు ఈ విషయాన్నే మరచిపోయారు. పంటల బీమాకే దిక్కులేదు.. ఇక రైత్వారీ ఎక్కడో? ప్రభుత్వం ఇచ్చే విత్తనాల కన్నా బహిరంగ మార్కెట్లోనే చౌక దివిటీ పట్టుకుని వెతికినా కనిపించవు ప్రస్తుతం అమల్లో ఉన్నది ప్రధాన మంత్రి పంటల బీమానే.. బాబు చేసిందేమీ లేదు 24 గంటలు కాదు.. 48 గంటలైనా దిక్కులేదు) గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కుతుంటే పోలీసులను పురమాయించి లాఠీలతో కొట్టించారు ఆ చట్టం టీడీపీ చుట్టమైంది. ఇంత వరకు బయటకు రాలేదు. 16.5 లక్షల మందికి ఇస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లలో ఇచ్చింది 6 లక్షల మందికే. ఇందులో సగానికిపైగా గత ప్రభుత్వం ఇచ్చినవే. కనీసం ఇలాంటి ఆలోచనే చేయలేదు ఇదీ వైఎస్ జగన్ భరోసా ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు సాయం. రెండవ ఏడాది నుంచి మే నెలలోనే రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తారు. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ప్రతి రైతుకు వడ్డీ లేకుండా, సున్నా వడ్డీ రుణాలు రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తారు. పంట వేయడానికి ముందే గిట్టుబాటు ధర ప్రకటన. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. రూ.4 వేల కోట్ల (కేంద్ర, రాష్ట్రాలు చెరిసగం భరిస్తాయి)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి. పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి. తొలి ఏడాది మూతపడ్డ సహకార డెయిరీల పునరుద్ధరణ. ఆ తర్వాత వీటికి పాలు పోసిన రైతులకు లీటరుకు రూ.4 çసబ్సిడీ అనుకోకుండా ఏ రైతు అయినా ఈ లోకాన్ని వీడిపోతే అప్పుల వాళ్లు అతని కుటుంబంపై పడి పీడించకుండా ప్రత్యేక చట్టం. రూ.5 లక్షలు ఆ కుటుంబానికి వారంలోగా అందజేసి తోడుగా ఉంటారు. ఈ రూ.5 లక్షలు ఆ కుటుంబ ఆస్తిగా పరిగణిస్తారు. రైతుల వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఆక్వా రైతులకు కరెంటు చార్జీ యూనిట్ రూ.1.50కి తగ్గింపు (వీటన్నింటి ద్వారా ప్రతి రైతుకు ఏటా రూ.12,500 నుంచి రూ.లక్ష వరకు లబ్ధి కలిగేలా ప్రణాళిక) పంట నష్టపోయినా దిగులుండదు నాపేరు గుర్రం శ్రీనివాసులు. నాకు 10 ఎకరాల భూమి ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏటా వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. దీంతో పంట కోసం ఏటా అప్పులు చేయాల్సి వస్తోంది. మా కష్టాలు పాలకులకు పట్టలేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రతో రైతుల కష్టాలు తెలుసుకుంటున్నారు. మా కష్టాలను కళ్లారా చూసి రైతు భరోసా పథకం తీసుకొస్తామని చెప్పారు. నిజంగా ఈ పథకం అద్భుతం. ప్రతి రైతుకు ఉచితంగా బోర్లు, పంట పెట్టుబడుల కోసం ఏటా రూ.12,500 మే నెలలోనే రైతు చేతికి ఇవ్వనుండటం, తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్.. ఇలా అన్ని అంశాలు ఆభినందించదగ్గవే. పంట నష్టపోయినా భయం ఉండదు. ఇంతగా రైతుల శ్రేయస్సు కోరే నాయకుడు జగనే ముఖ్యమంత్రి కావాలని మా రైతులందరం కోరుకుంటున్నాము. –శ్రీనివాసులు, రైతు,షేక్షానిపల్లి, ఉరవకొండ నియోజకవర్గం, అనంతపురం జిల్లా. దళారి వ్యవస్థ తగ్గుతుంది రైతు భరోసా పథకం చాలా బాగుంది. ఈ పథకం అమలైతే అన్నదాతలకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా దళారి వ్యవస్థ తగ్గుతుంది. రైతుల వద్ద నుంచి అధికారులు గుంజే లంచాలు తగ్గుతాయి. రైతులు స్థిమితంగా ఉంటూ తమకు ఇష్టమైనప్పుడు పంటను అమ్ముకునే అవకాశం ఉంది. –వి. వెంకటేశ్వర్లు, రైతు, మాచవరం, నర్సరావుపేట నియోజకవర్గం, గుంటూరు జిల్లా పెట్టుబడి సొమ్ముతో రైతుకు మేలు జగన్ తీసుకున్న నిర్ణయాలు సమర్థనీయం. పెట్టుబడి మొత్తం బాగా ఉపయోగపడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 35 లక్షల మంది (అధికారిక లెక్కల ప్రకారం 17 లక్షలు) కౌలు రైతులు ఉన్నారు. వాళ్లకూ మేలు చేకూరే ఆలోచన చేయాలి. – రావుల వెంకయ్య, పి.జమలయ్య, ఏపీ రైతు సంఘం నేతలు ధరల స్థిరీకరణ నిధి ఉంటేనే అండ ఇంతవరకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించడం హర్షణీయం. ప్రతి ఏటా దీన్ని పెంచుకుంటూ పోవాలి. – డాక్టర్ డి.నరసింహారెడ్డి, వ్యవసాయ రంగ నిపుణులు -
45 ఏళ్ళు పైబడిన అక్కచెల్లెమ్మలకు వైఎస్అర్ చేయూత
-
ఉల్లికల్లు వాసులను ఆదుకుంటాం
అనంతపురం, శింగనమల: చాగల్లు రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో నిర్వాసితులైన ఉల్లికల్లు వాసులను అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఉల్లికల్లు గ్రామంలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓ మాదిరిగా నీరు వచ్చిన సమయంలోనే గ్రామంలోకి నీరు వస్తే, రిజర్వాయర్కు పూర్తి స్థాయిలో నీరు వస్తే పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఉల్లికల్లు వాసులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నియోజకవర్గంలోని ఉల్లికల్లు గ్రామంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని బుధవారం వారు ప్రారంభించి, మాట్లాడారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రవేశపెట్టనున్న పలు పథకాలపై ప్రజలను చైతన్యపరిచారు. జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలతోనే పేదల అభ్యు న్నతి సాధ్యమవుతుందనిఅన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పథకం, పేదలకు పక్కా గృహాలు, అమ్మఒడి, రైతు భరోసా తదిత ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, మండల కన్వీనర్ చెన్నకేశవులు, నాయకులు శ్రీరామిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, పరంధామరెడ్డి, కోనారెడ్డి, రాజు, వెంకట నారాయణ, మహిళ నేతలు బండి లలిత కళ్యాణి, చెన్నమ్మ, శకుంతలమ్మ పాల్గొన్నారు. -
నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగు
పకాశం, రామాయపాలెం (పెద్దారవీడు): వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అమలు చేసే నవరత్నాల్లాంటి పథకాలు అందరి జీవీతాల్లో వెలుగులు నింపుతాయని నియోజకవర్గ సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిబూలపు సురేష్ అన్నారు. ఆదివారం సాయంత్రం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంచారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పి జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే సువర్ణ పరిపాలన, రాజన్న రాజ్యం వస్తుందన్నారు. రైతు భరోసా కింద రూ. 12,500 పంట పెట్టుబడి, ఉచిత బోర్లు, వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ బ్యాంకులో డబ్బులు వేస్తారని, ఇల్లు లేని లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఆ ఇంటి మహిళ పేరిట రిజస్ట్రేషన్ చేయిస్తారని, 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు నెలకు రూ. 2 వేలు చెల్లిస్తారని, డ్వాక్రా సంఘాల్లోని అక్కచెల్లెమ్మలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు 4 దఫాలుగా చేతికే అందిస్తామని తెలిపారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలునిచ్చారు. మట్టి ఇసుక, మద్యపానంలో అవినీతిగా సంపాదించిన డబ్బులు టీడీపీ నాయకుల ఇళ్లలో నుంచి బయట పడుతుందన్నారు. పింఛన్, సబ్సిడీ రుణాలు, బోర్లు, సంక్షేమ పథకాలకు టీడీపీ నాయకులు డబ్బులు వసూలు చస్తున్నారని, టీడీపీ మద్దతు పలికిన వారికే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద నెలకు రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి యువకులను మోసం చేశారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాలిరెడ్డి క్రిష్ణారెడ్డి, జెడ్పీటీసీ దుగ్గెంపుడి వెంకటరెడ్డి, మాజీ సర్పంచులు బొచ్చు సుబ్బారెడ్డి, మోటకట్ల అక్కిరెడ్డి, దుద్దెల వెంకటరెడ్డి, మూల లక్ష్మీరెడ్డి, రామకృష్ణారెడ్డి, అల్లు పెద్ద అంకిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు తమ్మిశెట్టి తిమ్మరాజు, మండల నాయకులు పొందుగుల వెంకటరెడ్డి, మూల రమణారెడ్డి, షేక్ బుజ్జీ, గాలి రమణారెడ్డి, మూల సత్యంరెడ్డి, మూల శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, కందుల రమణారెడ్డి, రంగారెడ్డి, పలు విభాగాల నాయకులు వజ్రాల ఆదిరెడ్డి, కాసు వెంకటరెడ్డి, ఒద్దుల లక్ష్మిరెడ్డి, సొంటి నాగర్జునరెడ్డి, బీసీ నాయకులు రామచంద్రుడు, సాయిక్రిష్ణ, ఏర్వ సహదేవుడు, వెంకటేశ్వర్లు, ముత్యాలయ్య, తోకల ఆవులయ్య, అమృతపుడి కోటేష్, రమణారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కందుల కాశిరెడ్డి, ఆచారి పాల్గొన్నారు. -
విజయవాడలో నవరత్నాలు అవగాహన సదస్సు
-
నవరత్నాలు వరం
పశ్చిమగోదావరి, కొవ్వూరు/చాగల్లు: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవశకానికి నాంది పలుకుతాయని, ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రూ.లక్ష నుంచి రూ.5లక్షల మేరకు లబ్ధి చేకూరనుందని ఆ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చాగల్లు మండలం నెలటూరులోని నిమ్మగడ్డ చినరాములు కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. పార్టీ బూత్ కమిటీ సభ్యులంతా ప్రజలతో మమేకమై నవరత్నాల పథకాల ద్వారా చేకూరే లబ్ధిని వివరించాలని సూచించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రజల్లో ఎండగట్టాలన్నారు. టీడీపీ పాలన పైశాచికత్వానికి కొవ్వూరు నియోజకవర్గమే ఉదాహరణ అన్నారు. ఇక్కడ ఇసుక, మద్యం, మట్టితో టీడీపీ నేతలు ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు చేస్తున్న దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆయన సూచించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లోఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నందున రానున్న ఐదారు నెలలపాటు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లు పార్టీ విజయం కోసం కష్టించి పనిచేయాలని కోరారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీకి తూట్లు పొడవడమే కాకుండా మాఫీ చేసేదే లేదంటూ స్వయంగా చట్టసభలో మంత్రి ప్రకటన చేయడం బాధాకరమని పేర్కొన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని స్పష్టం చేశారు. సమష్టిగా పనిచేస్తేనే విజయం సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బూత్స్థాయిలో కమిటీలు పటిష్టంగా లేకపోవడం వల్లే ఓటమిపాలు కావాల్సి వచ్చిందని, ఆ పరిస్థితిని అధిగమించేందుకు ఈసారి బూత్ కమిటీలు కీలక పాత్ర పోషించాలని కోరారు. తటస్థులను పార్టీలో చేర్చుకోవడంతోపాటు సమష్టిగా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. టీడీపీ మోసాలను ప్రజలకు వివరించండి రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త రోజుకు గంట చొప్పున కేటాయించాలని సూచించారు. టీడీపీ పాలనలో ఎలా మోసపోయామో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ కమిటీలపై ఉందన్నారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికీ నెలకు రూ.8వేలకు పైగా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఓటర్ల సవరణపై దృష్టి సారించండి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ బూత్ కమిటీల కో–ఆర్డినేటర్ బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లో దొంగ ఓట్ల తొలగింపు, అర్హుల ఓట్ల నమోదుపై బూత్ కమిటీలు శ్రద్ధ వహించాలని కోరారు. ప్రతి బూత్లోనూ తొలగించిన పేర్ల జాబితాలను పంపుతామని, వాటిని సరి చూసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా అత్యధిక శాతం ఓట్లు పోలయ్యేలా చూడాలని, ప్రతి ఓటూ విలువైనదిగా భావించాలని సూచించారు. బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ బూత్స్థాయిలో ఎవరెవరు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారో తెలుసుకోవడంతోపాటు తటస్థులు ఎవరనే అంశాలపై బూత్ కమిటీలకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. తద్వారా తటస్థుల ఓట్లను పార్టీకి అనుకూలంగా మలుచుకునే యత్నం చేయాలని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కరిబండి గనిరాజు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీల కో–ఆర్డినేటర్ యండపల్లి రమేష్, పార్టీ మండల అధ్యక్షులు కోఠారు అశోక్బాబా, కుంటముక్కల కేశవనారాయణ, గురుజు బాల మురళీకృష్ణ, పట్టణ అ«ధ్యక్షుడు రుత్తల భాస్కరరావు తదితరులు మాట్లాడారు. పార్టీ సంయుక్త కార్యదర్శి పోతుల రామతిరు పతి రెడ్డి, ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, లకంసాని సూర్యప్రకాశరావు, బొర్రా కృష్ణ, కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, గండ్రోతు సురేంద్రకుమార్, కాకర్ల నారాయుడు తదితరులతోపాటు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
నవరత్నాలతో అందరికీ లబ్ధి
జగన్ ప్రకటించిన నవరత్నాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. అందుకే రానున్న ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతను తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసింది. ఈసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తాం. –చందక మంగ, చీపురుపలి -
నవరత్నాలు...పేదల అభివృద్ధికి బాసట
కర్నూలు, ప్యాపిలి: వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలు అన్ని సామాజికవర్గాల అభివృద్ధికి బాసటగా నిలుస్తాయని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని బావిపల్లి గ్రామంలో గురువారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గ్రామానికి చేరుకున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగిన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నవరత్నాలు పథకాల ప్రయోజనాలను వివరించారు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ‘నవరత్నాలు’ రూపొందిచామని, జగనన్న అధికారంలోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు సంవత్సరానికి రూ. 12,500 చొప్పున పెట్టుబడికి అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడంతో పాటు ఉచితంగా బోర్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామన్నారు. వైద్యం ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పింఛన్ వయసును 45 సంవత్సరాలకు తగ్గించి పింఛన్ రూ. 2 వేలు, వికలత్వ పింఛన్ రూ. 3 వేలు అందజేస్తామన్నారు. అదేవిధంగా పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి తదితర పథకాలు పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబులా మాయ మాటలు చేతకావు... సీఎం చంద్రబాబులా మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టడం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చేతకాదని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి చెప్పారు. జగన్ చెప్పింది చేస్తారని.... చేసేదే చెబుతారని స్పష్టం చేశారు. అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో హామీలు గుప్పించిన సీఎం ఏ ఒక్క హామీని పక్కాగా అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, కొద్ది నెలలు ఓపికపడితే రాజన్న రాజ్యం వస్తుందని ఈ సందర్భంగా బుగ్గన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ప్యాపిలి, డోన్ జెడ్పీటీసీ సభ్యులు దిలీప్ చక్రవర్తి, శ్రీరాములు, సీనియర్ నాయకులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, సప్తశైల వెంకటేశ్, మండల కన్వీనర్ రాజా నారాయణమూర్తి, సింగిల్ విండో అధ్యక్షులు సీమ సుధాకర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గడ్డం భువనేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, వి. శ్రీనివాసరెడ్డి, బషీర్, చంద్రశేఖర్రెడ్డి, గ్రామ నాయకులు నాగిశెట్టి, ఎల్లయ్య, గోపాల్, మల్లికార్జున, గోవిందు, సోమశేఖర్, నాగరాజు, శ్రీనివాసులు, సతీష్, తిమ్మప్ప, తెలుగు మోహన్, రామాంజి, యాగంటి, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో వర్షాలు కరువు
కర్నూలు, బేతంచెర్ల: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు వర్షాలు కురవబోవని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని అంగళ్ల బజారు, గౌరిపేటలో వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు ముర్తుజావలి, మండల కన్వీనర్ సీహెచ్ లక్ష్మీరెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు బుగ్గన నాగభూషణంరెడ్డి, ఎంపీపీ గజ్జి కిట్టమ్మ, ఎంపీటీసీ సభ్యులు శివరామిరెడ్డి, సుమతి ఆధ్వర్యంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుగ్గన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అడ్డంగా దోచుకోవడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్తో చేతులు కలపడానికి సిద్ధపడిన చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సా«ధ్యం అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీకి పట్టం కట్టాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నవరత్నాల పథకాలను వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు రాజేంద్రతో పాటు ఆయా కాలనీల్లో బుగ్గనకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఆయా కాలనీల్లో సమస్యలు వింటూ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి కమిటీలతో సంబంధం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజవర్గ బూత్ లెవల్ కో ఆర్డినేషన్ కమిటీ ఇన్చార్జి రాజేంద్రనాథ్రెడ్డి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, బాబుల్రెడ్డి, చలం రెడ్డి, దస్తగిరి, మల్దిరెడ్డి, నాగేశ్వరరావు, మురళీ కృష్ణ, రామచంద్రుడు, మహేశ్వర్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, ఆకుల రమణ, భాస్కర్రెడ్డి, ఇబ్రహీమ్, సలీమ్, సంథానీ బాషా, ఇలియాజ్, బుగ్గానిపల్లె రాముడు, రమణ, రామనాయుడు, కిరన్, బూషిరెడ్డి, భాస్కర్, నడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసంక్షేమం కోసమే నవరత్నాలు
వేముల : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసంమే నవరత్నాలు అనే పథకాలను ప్రవేశపెట్టారని..వైఎస్ జగన్తోనే రాజన్న రాజ్యం సాధ్యమని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గొల్లలగూడూరు గ్రామంలో శనివారం వైఎస్సార్సీపీ మండల నాయకుడు నాగెళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ మరక శివకృష్ణారెడ్డితో కలసి రావాలి జగన్–కావా లి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్వర్ణయుగం, సంక్షేమ పాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందన్నారు. పింఛన్ల పెంపు, వైఎస్ఆర్ రైతు బరోసా, వైఎస్సార్ ఆసరా, పేదలందరికి ఇళ్లు, మధ్యపాన నిషేదం, ఫీజు రీఇంబర్స్మెంట్, జలయజ్ఞం, అమ్మఒడి పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకాల ద్వారా కలిగే మేలును, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే జరిగే అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద వచ్చే ఎన్నికల నాటికి పొదుపు సంఘాల రుణాలు ఎంతైతే ఉంటాయో ఆమొత్తాన్ని పూర్తిగా రద్దుచేయడం జరుగుతుందన్నారు. వడ్డి లేని రుణాలుల ఇవ్వనున్నట్లు చెప్పారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు, కార్పొరేషన్ల ద్వారా అర్హులకు రుణాలు, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రూ.75వేల వరకు రుణం ఇవ్వనున్నట్లు చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామన్నారు. కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తున్న మద్యపానాన్ని పూర్తిగా నిషేధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు చెప్పారు. జలయజ్ఞం, ఫీజు రీఇంబర్స్మెంట్, పేదలందరికి ఇళ్లు, పింఛన్ల పెంపు వంటి పథకాలను అమలుచేయనున్నట్లు చెప్పారు.వచ్చే ఎన్నికల్లో జగనన్నకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి శంకరరెడ్డి, మాజీ ఎంపీపీ జనార్థనరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, ఎంపీటీసీ శ్రీరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు ఇసీ ప్రసాద్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రామాంజనేయరెడ్డి, ప్రతాప్రెడ్డి, సింగారెడ్డి, బయన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జనంలోకి దూసుకెళ్తున్న నవరత్నాలు
నవరత్నాలు.. ఒకవైపు రాష్ట్ర విభజన కష్టాలు.. మరోవైపు చంద్రబాబు దుర్మార్గమైన పాలన.. ఈ రెండింటి నడుమ నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్లోని సామాన్య ప్రజానికాన్ని ఆదుకునేందుకు, వారికి ఆపన్నహస్తం అందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంకేమపథకాల సమాహారం. తాము అధికారంలోకి వస్తే.. నిరుపేద, మధ్యతరగతి సామాన్య ప్రజలను ఆదుకునేందుకు, వారికి అడుగడుగునా అండగా ఉండేందుకు, వారి సంక్షేమం కోసం నవరత్నాలు పథకాన్ని అమలు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నవరత్నాలు పథకానికి ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఏ నోటా విన్న ఈ పథకం గురించే చర్చ జరుగుతోంది. ప్రజాసంకల్పయాత్ర దారి పొడవునా.. నవరత్నాల గురించి వైఎస్ జగన్ ప్రజలకు వివరిస్తూ వచ్చారు. దీంతో ఈ పథకం ప్రజల్లోకి విస్తృతం వెళ్లింది. ఈ పథకం వివరాలివి.. 1. వైఎస్సార్ రైతు భరోసా ఈ పథకంతో రైతన్న కుటుంబానికి ఏటా రూ.12,500 నుంచి రూ.లక్ష వరకూ ప్రయోజనం ఉంటుంది. ఉచిత బోర్లు వేయించడం, ఉచిత విద్యుత్ అందించడం, సున్నావడ్డీకి రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్ ట్యాక్స్ మాఫీ ఇందులో వర్తించే అంశాలే. ప్రభుత్వం ఏర్పడ్డ రెండో ఏడాది నుంచి మే నెలలో పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 చొప్పున వరుసగా నాలుగేళ్లు అందిస్తారు. వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను యూనిట్కు రూ.1.50కు తగ్గిస్తారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకతి వైపరీత్యాల సహాయ నిధి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరమైతే ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేస్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరించి.. రెండో ఏడాది నుంచి సహకార డైరీలకు పాలుపోసే పాడి రైతులకు లీటర్కు రూ.4 సబ్సిడీ ఇస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షలు చెల్లిస్తారు. ఆ మొత్తాన్ని అప్పులవాళ్లు తీసుకోకుండా చట్టం చేస్తారు. 2. ఫీజు రీయింబర్స్మెంట్ పేదవాడి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ మొత్తం కాకుండా విద్యార్థులకు వసతి, భోజనం కోసం ఏటా అదనంగా రూ. 20 వేలు ఇస్తారు. 3. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ మేలు జరుగుతుందని అంచనా. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తారు. ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచిత వైద్యం అందిస్తారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లను దీని పరిధిలోకి తెస్తారు. ఆపరేషన్ చేయించుకున్న లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక చేయూతనందిస్తారు. కిడ్నీవ్యాధి, తలసేమియాతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తారు. 4. జలయజ్ఞం లక్షలాది రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతుల లోగిళ్లలో సిరులు నింపుతారు. 5. మద్యపాన నిషేధం కుటుంబాల్లో చిచ్చుపెడుతూ, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తున్న మద్యం రక్కసిని మూడు దశల్లో నిషేధిస్తారు. తద్వారా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు వెలకట్టలేని సంతోషం కలిగించాలనేది ఉద్దేశం. 6. అమ్మఒడి పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా అందిస్తారు. 7. వైఎస్సార్ ఆసరా ఈ పథకం కింద వచ్చే ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మల చేతికే నేరుగా ఇస్తారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారు. ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.50 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా వైఎస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పింఛన్లు ఇస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందిస్తారు. 8. పేదలందరికీ ఇళ్లు ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకూ ప్రయోజనం చేకూరుతుంది. ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టాలన్నది లక్ష్యం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. అవసరమైతే ఆ ఇంటి మీద పావలా వడ్డీకే బ్యాంకులో రుణం ఇప్పిస్తారు. 9. పింఛన్ల పెంపు ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.24,000 నుంచి రూ.48,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం పింఛన్ తీసుకోవ డానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తారు. అవ్వతాతలకు నెలకు రూ.2000, దివ్యాంగులకు రూ.3000 పింఛన్ అందిస్తారు. చదవండి: రావాలి జగన్.. కావాలి జగన్.. జననేత వెంట జనప్రవాహం పాలకుల కుట్రలపై జనం కన్నెర్ర రాజకీయ ప్రభంజనం బీసీల ఆశా దీపం నువ్వేనన్నా..