Vande Bharat Express
-
ఏప్రిల్ 19 నుంచి కట్రా- శ్రీనగర్ ‘వందేభారత్’
శ్రీనగర్: అందాల కశ్మీర్(Kashmir) ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న కట్రా నుండి శ్రీనగర్కు నడిచే తొలి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘కశ్మీర్ వందేభారత్ రైలు ప్రారంభమయ్యే చారిత్రాత్మక క్షణం కశ్మీర్కు కొత్త అధ్యాయం అవుతుందని’ అన్నారు.272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ పూర్తికావడంతో కశ్మీర్కు కొత్త రైలు మార్గం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ గత నెలలోనే పూర్తయింది. అలాగే కట్రా-బారాముల్లా మార్గంలో రైలు రాకపోకల ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఏడాది జనవరిలో కట్రా- కశ్మీర్ మధ్య రైలు సర్వీసుకు రైల్వే భద్రతా కమిషనర్ ఆమోదం తెలిపారు.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express) ప్రారంభంతో జమ్ము.. శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అలాగే ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. కశ్మీర్కు నేరుగా రైలు సర్వీసు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. నూతన వందేభారత్ రైలు సర్వీసుతో అది నెరవేరనుంది.కశ్మీర్లో పరుగులు తీయబోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇతర రైళ్లకు భిన్నంగా ఉండనుంది. దీనిని మైనస్ -20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో కూడా సజావుగా నడిచేలా తీర్చిదిద్దారు. ఈ మార్గంలో నిరంతరాయంగా రైలు సేవలను కొనసాగించేందుకు, పట్టాలపై ఉన్న మంచును తొలగించేందుకు ముందుగా ప్రత్యేక మంచు క్లియరెన్స్ రైళ్లను నడుపుతారు. ఫలితంగా ఈ రైల్వే లైన్ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.ఇది కూడా చదవండి: ఈద్ వేళ సీఎం మమత సంచలన ఆరోపణలు -
ఎట్టకేలకు కశ్మీర్ లోయలో రైలు సేవలు
శ్రీనగర్: పర్వతమయ కశ్మీర్ లోయలో వచ్చే నెలలో రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 19వ తేదీన కట్రా–శ్రీనగర్ రైలు సేవలను ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. నూతన రైలు సర్వీస్ ప్రారంభోత్సవాన్ని చిరస్మరణీయంగా మార్చేందుకు కొత్త మార్గంలో వందేభారత్ రైలును నడపాలని అధికారులు నిర్ణయించారు. నూతన సర్వీస్ను ప్రధాని మోదీ స్వయంగా వచ్చి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతకుముందు చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెనను మోదీ పరిశీలించనున్నారు. తర్వాత కట్రాలో రైలు సేవలను ప్రారంభించి అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, స్థానిక బీజేపీ నేతలు తదితరులు పాల్గొంటారు. రైలును కొంతకాలం కట్రా, శ్రీనగర్/బారాముల్లా స్టేషన్ల మధ్య నడుపుతారు. జమ్మూ రైల్వేస్టేషన్ విస్తరణ పనులు పూర్తయ్యాక ఆగస్ట్ నెల నుంచి జమ్మూ దాకా ఈ రైలు సేవలను విస్తరిస్తారు. అప్పటి నుంచి రైలు సేవలు జమ్మూ–శ్రీనగర్/ బారాముల్లా మార్గంలో కొనసాగనున్నాయి. ఇంతవరకు ఢిల్లీ నుంచి శ్రీనగర్కు నేరుగా ఒక్క రైలు సర్వీస్ కూడా లేదు. దశాబ్దాలుగా కశ్మీర్ లోయ ప్రాంతం భారత్తో రైలు మార్గాన అనుసంధానమై లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు గరిష్టంగా సంగల్దాన్–బారాముల్లా సెక్షన్ దాకా మాత్రమే రాగలవు. సుదూర సర్వీస్ రైళ్లు అయితే కట్రా వరకే రాగలవు. తాజా విస్తరణతో కశ్మీర్ లోయ ప్రాంతవాసులు కూడా తొలిసారిగా రైలు సేవలను అందుకోనున్నారు. -
కశ్మీర్కు వందేభారత్ .. టిక్కెట్ ఎంత? ఏ రూట్లో వెళుతుంది?
రాబోయే వేసవి సెలవుల్లో కుటుంబంతోపాలు ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా? అయితే అందుకు కశ్మీర్కు వెళ్లే వందేభారత్ సిద్ధంగా ఉంది. అందమైన లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సహజసిద్ధ అందాలను ఈ రైలులో నుంచి చూసి ఎంతగానో ఆనందించవచ్చు. అంతేకాదు ఈ ప్రయాణంలోని మధురానుభూతులను మీ వెంట తీసుకెళ్లవచ్చు.ఇదంతా ఎంతో దూరంలో లేదు. కశ్మీర్కు ప్రతిపాదిత వందే భారత్ రైలును ఎప్పుటి నుంచి నడుపుతారనే దానికి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న శ్రీనగర్కు వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. శ్రీనగర్కు నడిచే ఈ వందే భారత్ రైలు కాట్రా- శ్రీనగర్ మధ్య నడుస్తుంది. అంటే ఢిల్లీలో లేదా దేశంలోని మరో ఇతర ప్రాంతంలో నివసిస్తున్నవారు ముందుగా కాట్రా చేరుకోవాలి. ఇక్కడి నుండి కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలులో శ్రీనగర్కు చేరుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఢిల్లీ నుంచి కట్రాకు గల వందేభారత్ రైలులో కట్రా చేరుకుని, అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్లవచ్చు. కాగా కట్రా- శ్రీనగర్ మధ్య నడిచే కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలు దేశంలోని ఇతర ప్రాంతాలకు నడిచే వందే భారత్ రైళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.కశ్మీర్కు నడిచే ప్రత్యేక వందే భారత్ రైలును అక్కడి వాతావరణం, అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ ప్రత్యేక రైలు -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రయాణిస్తుంది. ఈ రైలులోని కోచ్లు చైర్ కార్లు, జనరల్ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్లుగా విభజించారు. కొన్ని నెలల తర్వాత ఈ రైలును జమ్మూ వరకు పొడిగించనున్నారు. అప్పటి నుంచి ఈ రైలు జమ్మూ- శ్రీనగర్ మధ్య నడవనుంది. ఈ రైలు మార్గంలో రియాసి, బక్కల్, దుగ్గ, సవల్కోట్, సంగల్డాన్, సుంబెర్, ఖారి, బనిహాల్, ఖాజిగుండ్, సదురా, అనంతనాగ్, బిజ్బెహారా, పంజ్గామ్, అవంతిపోరా, రత్నిపోరా, కాకాపోరా, పాంపోర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు కాట్రా నుంచి శ్రీనగర్కు రెండున్నర నుండి మూడు గంటల్లో చేరుకుంటుంది.రైల్వే వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ రైలులో ఏసీ చైర్ కార్ ఛార్జీ రూ.1500 నుంచి రూ.1700 మధ్య ఉండే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2400 నుండి రూ. 2600 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 17న రైలు ప్రారంభించిన అనంతరం రైల్వే అధికారులు ఛార్జీలను ప్రకటించనున్నారు. అప్పటి నుంచి సీట్ల బుకింగ్ ప్రారంభం కానుంది. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్? -
హైరిస్క్ జోన్లో వందేభారత్!
కుదుపులు లేని వేగవంతమైన ప్రయాణం, ఆధునిక కప్లింగ్ సిస్టం వల్ల కోచ్ల మధ్య సమన్వయం, ‘కవచ్’(Kavach)ఏర్పాటుతో ప్రమాదాలకు అతి తక్కువ ఆస్కారం.. వందేభారత్ రైళ్ల(Vande Bharat) గురించి రైల్వే శాఖ చెప్పే విశేషాలివి. నిజానికి ఈ రైళ్లు హై రిస్క్ జోన్లో పరుగు పెడుతున్నాయి. ఒక్క ప్రాంతంలో తప్ప మరెక్కడా రైలు ప్రమాదాలు నివారించే కవచ్ వ్యవస్థ ఈ రైళ్లలో లేదు. ఢిల్లీ–ఆగ్రా, మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. నిడివిలో మాత్రమే వందేభారత్ రైళ్లు సురక్షితంగా ప్రయాణిస్తాయి.మిగతా ప్రాంతాల్లో సాధారణ రైళ్లకు ఉన్న ప్రమాద భయం వీటినీ వెంటాడుతోంది. గంటకు 50 – 70 కి.మీ. సగటు వేగంతో ప్రయాణించే సాధారణ రైళ్లు నిరంతరం ‘రిస్క్’లో ఉంటే.. 100 కి.మీ. సగటు వేగం (గరిష్టం 130 కి.మీ.)తో దూసుకెళ్లే వందేభారత్ రైళ్లు హై రిస్కులో ఉన్నాయని స్పష్టమవుతోంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న ఐదు వందేభారత్ రైళ్లు ప్రమాదకరంగానే పరుగు పెడుతున్నాయి. పట్టాలపై రైళ్ల అధిక సాంద్రత, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించకపోవటం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఆ పరికరం నిరుపయోగమే.. ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో కవచ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. లోకో పైలట్ నిర్లక్ష్యంగా ఉన్నా, తప్పుడు సిగ్నల్తో వేరే రైళ్లకు చేరువగా దూసుకెళ్లినా రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుందనే భావన చాలా మందిలో ఉంది. కానీ, రైళ్ల లోకోమోటివ్లలో మాత్రమే కవచ్ యంత్రం ఉంటే నిరుపయోగమే. కవచ్ వ్యవస్థ పనిచేయాలంటే, రైలు ఇంజిన్లలో కవచ్ పరికరం ఉండటంతో పాటు, ప్రతి స్టేషన్లో కవచ్ వ్యవస్థ ఉండాలి.అక్కడి ట్రాక్ వెంట ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్ ఏర్పాటు చేయాలి. ట్రాక్ వెంట ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉండాలి. వీటిని అనుసంధానిస్తూ ఆ మార్గంలో నిర్ధారిత నిడివిలో టెలికం టవర్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ అనుసంధానమై పనిచేసినప్పుడే రైళ్లు వాటంతట అవి ప్రమాదాన్ని నివారించుకోగలవు. లోకో పైలట్లను కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. మిగతావి ఏవీ లేకుండా కేవలం ఇంజిన్లలో కవచ్ పరికరంతో పరుగుపెట్టే వందేభారత్లు ప్రమాదాన్ని నివారించుకోలేవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఒకే మార్గంలో.. ఢిల్లీ–ఆగ్రా మధ్య దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్ పరుగు పెడుతోంది. దీని వేగం గంటకు 160 కి.మీ.. ఈ వేగాన్ని సాధారణ ట్రాక్ తట్టుకోలేదన్న ఉద్దేశంతో ఆ మార్గంలో 125 కి.మీ. ప్రత్యేక ట్రాక్ నిర్మించారు. అదే మార్గంలోని మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. మేర పూర్తిస్థాయి కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. ఆ మార్గంలో మాత్రమే రైళ్లు కవచ్ రక్షణతో ఉన్నట్టు. ఆ మార్గంలో ఒకే ఒక వందేభారత్ రైలు నడుస్తోంది.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి–వికారాబాద్–వాడీ సెక్షన్ల మధ్య 245 కి.మీ. మేర కవచ్ ఏర్పాటైంది. కానీ ఆ మార్గంలో వందేభారత్ రైలు తిరగటం లేదు. మన్మాడ్–ముధ్ఖేడ్–డోన్ మధ్య 959 కి.మీ... బీదర్–పర్బణి మధ్య 241 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. నార్తర్న్ రైల్వే పరిధిలో కూడా కొంతమేర ఉంది. మొత్తంగా 1,548 రూట్ కి.మీ. మేర మాత్రమే ఇది ఏర్పడింది. మరో 3 వేల కి.మీ.లో పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వందేభారత్ రైళ్లను పెంచటంపై ప్రదర్శిస్తున్న వేగం.. కవచ్ వ్యవస్థ ఏర్పాటులో చూపటం లేదు. -
వందేభారత్ రైళ్లలో భోజనం.. రైల్వే కీలక ప్రకటన
న్యూఢిల్లీ:వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు రైల్వేశాఖ తాజాగా మరో సదుపాయం కల్పించింది. టికెట్ బుకింగ్ సమయంలో ‘ఫుడ్ ఆప్షన్’ ఎంచుకోని వారికి కూడా ప్రయాణం సమయంలో అప్పటికప్పుడు ఆహారం అందించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే అప్పటికప్పుడు కొనుగోలు చేసేందుకు ప్రయాణికులకు అవకాశం కల్పించనుంది.టికెట్ బుకింగ్ సమయంలో ‘ఫుడ్ ఆప్షన్’ ఎంచుకున్న వారికే ప్రస్తుతం ఆ సేవలను ఐఆర్సీటీసీ అందిస్తోంది. ప్రయాణంలో భోజన వసతి కల్పించడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఐఆర్సీటీసీ మార్పులు చేసింది. ఈ మేరకు ఇండియన్ రైల్వే శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక ప్రకటన విడుదల చేసింది. -
కశ్మీర్కు వందేభారత్ రికార్డు పరుగు
శ్రీనగర్: కశ్మీర్ను రైలు మార్గం ద్వారా భారతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించే బృహత్ కార్యక్రమం విజయవంతమైంది. శనివారం ప్రఖ్యాత వైష్ణో దేవి ఆలయం నెలకొన్న జమ్మూలోని కాట్రా నుంచి కశ్మీర్లోని బుద్గాం వరకు వందే భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. నౌగావ్ ప్రాంతంలోని శ్రీనగర్ స్టేషన్కు ఉదయం 11.30 గంటల సమయంలో ఆరెంజ్– గ్రే– కలర్ రైలు చేరుకుంది. ఆ రైలులో వచ్చిన వారికి జనం పూల దండలతో స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో మంచు, అతిశీతల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అత్యాధునిక వసతులతో రూపొందించిన ప్రత్యేక రైలు శుక్రవారం జమ్మూకు చేరుకుంది. ట్రయల్ రన్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంజి ఖాద్ వంతెనతోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ వంతెన మీదుగా ఈ రైలు పరుగులు తీసిందని అధికారులు తెలిపారు. కొద్ది సమయం తర్వాత రైలు బుద్గాం స్టేషన్ నుంచి ముందుకు వెళ్లి ట్రయల్ రన్ను పూర్తి చేసింది. ఉత్తర రైల్వే చీఫ్ ఏరియా మేనేజర్(శ్రీనగర్) సకీబ్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ట్రయల్ రన్ చారిత్రక ఘట్టంగా అభివరి్ణంచారు. ఇంజినీరింగ్ అధికారుల పదేళ్ల శ్రమకు తగిన ప్రతిఫలమన్నారు. రైల్వే సేఫ్టీ కమినర్ కూడా ధ్రువీకరించినందున కాట్రా–బారాముల్లా సెక్షన్లో నడిచే ఈ రైలును త్వరలోనే ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశముంది. సుమారు 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్–శ్రీనగర్– బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టును రైల్వే శాఖ డిసెంబర్లో పూర్తి చేసింది. వాతావరణానికి తగ్గ ఏర్పాట్లు కాట్రా–శ్రీనగర్ రైలు మార్గం కోసం జమ్మూకశ్మీర్లోని పర్వత ప్రాంతంలోని శీతాకాల పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును గతేడాది జూన్ 8వ తేదీన అధికారులు ఆవిష్కరించారు. ఇందులో ఇతర వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉండే వసతులతోపాటు అనేక ప్రత్యేకతలున్నాయి. శీతాకాలంలో రైలులోని పైపులు, బయో టాయిలెంట్ ట్యాంకుల్లో నీరు గడ్డకట్టకుండా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థను అమర్చారు. వాక్యూమ్ సిస్టమ్కు వెచ్చని గాలి అందేలా చేశారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఎయిర్ బ్రేక్ వ్యవస్థ యథా ప్రకారం పనిచేస్తుంది. తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో సైతం డ్రైవర్ ముందున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగేలా విండ్ షీల్డ్పై పేరుకుపోయిన మంచును స్వయంచాలితంగా తొలగించే ఏర్పాటుంది. అదనంగా మిగతా వందే భారత్ రైళ్లలో ఉండే ఇతర అన్ని వసతులు..ఎయిర్ కండిషన్డ్ కోచ్లు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మొబైల్ చార్జింగ్ సాకెట్ల వంటివి ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ రైలు వంతెన అంజి ఖాద్ బ్రిడ్జి, చినాబ్ నదిపై కౌరి వద్ద నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జిల మీదుగా గత నెలలో ఈ రైలును ఆరుసార్లు ప్రయోగాత్మకంగా నడిపారు. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులోని భాగమైన అంజి ఖాద్ వంతెన ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఒకే ఒక పైలాన్పై నిర్మితమైన వారధి ఇది. పునాది నుంచి దీని ఎత్తు 191 మీటర్లు. దీనిని పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులకు ఏళ్లు పట్టింది. మొత్తం 473.25 మీటర్ల పొడవైన అంజి ఖాద్ వంతెన ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, చినాబ్ నదిపైప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది పారిస్లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల పొడవెక్కువ. -
కశ్మీర్కు వందేభారత్.. మంచులోనూ వెచ్చదనం
దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతూ, ప్రయాణికులకు నూతన రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. తాజాగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రైల్వే లైన్ ద్వారా దేశాన్ని అనుసంధానించడానికి ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్(యూఎస్బీఆర్ఎల్) పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఢిల్లీ నుండి రైళ్లు కశ్మీర్కు బయలుదేరనున్నాయి. ఈ మార్గంలో నడిపేందుకు ముందుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఎంపిక చేశారు. అయితే కశ్మీర్ లోయలో హిమపాతం, అక్కడి సబ్-జీరో ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ వందేభారత్ రైలులో పలు నూతన ఫీచర్లను జోడించారు.ఇప్పటివరకు కశ్మీర్ వైపు వెళ్లే రైళ్లు కాట్రా వరకు మాత్రమే నడుస్తున్నాయి. తదుపరి రైల్వే లైన్ వేసే పనిని వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్(USBRL Project) కింద చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా 17 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది. ఇది త్వరలో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్మూ, కాట్రా గుండా వెళతాయి. సంగల్డాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీనిని రోడ్డు మార్గంతో పోలిస్తే, ఆరు గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం అవుతుంది.కశ్మీర్ లోయ వరకూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందే భారత్ను ఎంపిక చేశారు. ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. రైలు బయట మంచుకురుస్తుంటో లోపలి ప్రయాణికులు వెచ్చదనాన్ని అనుభవించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్లో రైళ్లు నడపడానికి మంచు కురువడం, సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయి. విండ్ స్క్రీన్ పై మంచు కురుస్తున్న కారణంగా, లోకో పైలట్ ముందున్న రోడ్డును చూడలేకపోతారు. మైనస్ ఉష్ణోగ్రత(Subzero temperature)లో టాయిలెట్ పైప్లైన్లు కూడా స్తంభించిపోతాయి. అలాగే విపరీతమైన చలి కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.కశ్మీర్కు నడిపేందుకు రూపొందించిన రైలులో పైలట్ క్యాబిన్ విండ్స్క్రీన్ డబుల్ లేయర్ గ్లాస్తో తయారు చేశారని, మధ్యలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఉత్తర రైల్వే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ మీడియాకు తెలిపారు. ఈ సాంకేతికత కారణంగా గ్లాస్కు అంటుకున్న మంచు వెంటనే కిందకు జారిపోతుందన్నారు. వైపర్ నుండి వేడి నీరు కూడా బయటకు వస్తుందని, ఇది మిగిలిన మంచు, ఆవిరిని తొలగిస్తుందన్నారు. కొత్త ఫీచర్లతో కూడిన ఈ వందే భారత్లో లోకో పైలట్ క్యాబిన్లోని సీట్లు కూడా మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. రైలు అంతటా హీటర్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్లో హై లెవల్ థర్మోస్టాట్ లేయరింగ్ ఉంటుంది. తద్వారా సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా లోపలి ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉంటుంది.వందే భారత్ టాయిలెట్లలో నీటి పైప్లైన్ను సిలికాన్ హీటింగ్ ప్యాడ్లతో ఇన్సులేట్ చేశారు. తద్వారా బయో టాయిలెట్లోని ట్యాంక్కు హీటింగ్ కూడా అందుతుంది. ఫలితంగా దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు. ఇదేవిధంగా ఈ నూతన వందే భారత్ రైలు కిటికీలకు డబుల్ లేయర్డ్ గ్లాస్ కూడా అమర్చారు. దీంతో ఎవరైనా ఒకవేళ రాయి విసిరినప్పటికీ, పైగాజు మాత్రమే పగిలిపోతుంది. ప్రయాణికులకు ఎటువంటి హాని వాటిల్లదు.ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా -
చర్లపల్లి టెర్మినల్తో గణనీయ అభివృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్ను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో గణనీయ అభివృద్ధి సాకారం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. చర్లపల్లి స్టేషన్లోని ప్లాట్ఫామ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, సౌరశక్తితో నడిచే కార్యకలాపాలతో సహా సుస్థిరమైన మౌలిక ఆధునిక సౌకర్యాలను సృష్టించడంలో ఇది ఒక ముందడుగు అని అన్నారు. ఈ కొత్త టెర్మినల్ సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలలోని ప్రస్తుత స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రజలకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి ప్రాజెక్ట్లు ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వ్యాపారాన్ని సులభతరం చేయడాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ ఉద్ఘాటించారు. సమష్టిగా ఈ వృద్ధిని మరింతగా వేగవంతం చేసేందుకు తాను నిశ్చయించుకున్నానని ప్రధాని అన్నారు. చర్లపల్లి న్యూ టెర్మినల్ రైల్వే స్టేషన్తో పాటు జమ్మూ రైల్వే డివిజన్, ఈస్ట్కోస్ట్ రైల్వే రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘జమ్మూకశ్మీర్, తెలంగాణ, ఒడిశాలో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభంతో పర్యాటకం మరింత పెరుగుతుంది. ఈ ప్రాంతాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది’’ అని అన్నారు.త్వరలోనే తొలి బుల్లెట్ రైలు‘‘ఇవాళ ప్రజలు ఎక్కువదూరాలను తక్కువ సమయంలో పూర్తిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే మేం పనిచేస్తున్నాం. వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం చూశాక నాకెంతో సంతోషం కలిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భారతదేశంలో మొదటి బుల్లెట్ రైలు పరుగులు తీసే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. రాబోయే రోజుల్లో రైల్వేల ప్రయాణం ఓ గుర్తుండిపోయే మధురస్మృతిగా నిలిచిపోయేలా చేస్తాం. దేశంలో 2014లో 74 ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 150కి పైగా పెంచాం. 5 నగరాల నుంచి 21 నగరాలకు మెట్రో సేవలు విస్తరించాం. దేశం కలిసికట్టుగా, అంచెలంచెలుగా ముందుకు సాగుతోందనడానికి ఇలాంటి కార్యక్రమం ఒక నిదర్శనం’’ అని అన్నారు. -
Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే..
భారతీయ రైల్వే అనునిత్యం లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. 2024లో రైల్వే అనేక ఆధునిక మార్పులను సంతరించుకుంది. ఈ ఏడాది పలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఫలితంగా దేశంలోని పలు నగరాలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం ఏర్పడింది. 2024లో కొత్తగా ప్రారంభమైన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇవే..ఢిల్లీ-పట్నా ఢిల్లీ-పట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 30న ప్రారంభమయ్యింది. ఈ రైలు న్యూఢిల్లీ- పట్నాలను అనుసంధానం చేస్తుంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీ-బీహార్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ ఆధునిక రైలులో ఆన్బోర్డ్ వైఫై, జీపీఎస్ ఆధారిత సమాచార ప్రదర్శనలు, సౌకర్యవంతమైన ఏటవాలు సీట్లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.మీరట్-లక్నో మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఆగస్టు 31న ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన దరిమిలా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా మేరకు తగ్గింది. భద్రతతో పాటు వేగాన్ని దృష్టిలో పెట్టుకుని వందేభారత్ రైళ్లను రైల్వేశాఖ తీసుకువచ్చింది.మదురై-బెంగళూరుమదురై-బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ను తమిళనాడులోని మదురైని కర్ణాటకలోని బెంగళూరుతో కలిపేందుకు ఆగస్ట్ 31న ప్రారంభించారు. రెండు నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ రైలు పట్టాలెక్కింది. పర్యాటకులకు ఈ రైలు ఎంతో అనువైనదని చెబుతున్నారు.చెన్నై-నాగర్కోయిల్తమిళనాడులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి చెన్నై-నాగర్కోయిల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఆగస్ట్ 31న ప్రారంభించారు. ఈ రైలు చెన్నైని నాగర్కోయిల్తో కలుపుతుంది. ఈ రైలు ప్రయాణం ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తుంది.టాటానగర్-పట్నా టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ జార్ఖండ్లోని టాటానగర్ను బీహార్లోని పట్నాను కలుపుతుంది. సెప్టెంబర్ 15న దీనిని ప్రారంభించారు. ఈ రైలు రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణించేవారికి వరంలా మారింది.భాగల్పూర్-హౌరాభాగల్పూర్-హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ను 2024 సెప్టెంబర్ 15న బీహార్లోని భాగల్పూర్ను హౌరాతో కనెక్ట్ చేయడానికి ప్రారంభించారు. రైలు ప్రారంభంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది.బ్రహ్మపూర్-టాటానగర్బ్రహ్మపూర్-టాటానగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 15న ప్రారంభించారు. ఇది ఒడిశాలోని బ్రహ్మపూర్ను టాటానగర్తో కలుపుతుంది. ఈ రెండు పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ రైలు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపార, పర్యాటకరంగ వృద్ధికి తోడ్పాటునందిస్తుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: నూతన రామాలయం మొదలు వయనాడ్ విలయం వరకూ.. -
వందేభారత్పై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మీరట్ నుండి మోదీనగర్కు వస్తుండగా ఈ స్టేషన్కు ఐదు కిలోమీటర్ల ముందుగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడితో రైలు అద్దాలు పగిలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఈ ప్రాంతంలో టార్గెట్ చేయడం ఇది నాలుగోసారి. గతంలో అక్టోబర్ 22, 27 తేదీల్లో, నవంబర్ 22, 27 తేదీల్లో ఇదేవిధమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ నెలలో సిక్రి కలాన్- సోనా ఎన్క్లేవ్ కాలనీ సమీపంలో, నవంబర్లో హనుమాన్పురి- శ్రీనగర్ కాలనీ సమీపంలో వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వారు.ఘజియాబాద్ పోలీసులు ఈ నాలుగు ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వందేభారత్పై రాళ్లు రువ్వుతున్న ఘటనలు అటు రైల్వే యంత్రాంగాన్ని, ఇటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ తీర్పుతో 16 ఏళ్లకు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం -
11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన
న్యూఢిల్లీ: ఉత్తరాదిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి పొగమంచు ప్రధాన కారణంగా నిలిచింది. తాజాగా భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ 11 గంటలు ఆలస్యమైంది. ఇలా రైలు ఆలస్యంగా నడవడానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్కు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు భోపాల్లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుండి సాంకేతిక లోపం కారణంగా సుమారు 11 గంటల ఆలస్యంగా బయలుదేరింది.ఈ రైలు సాధారణంగా రాణి కమలాపతి స్టేషన్ నుండి ఉదయం 5.40 గంటలకు బయలుదేరుతుంది. అయితే సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో కోపోద్రిక్తులైన ప్రయాణికులు రైలు పట్టాలపై నిరసన తెలిపారు. రైలు ఆలస్యం గురించి తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.ఈ సెమీ-హై స్పీడ్ రైలు ఉదయం నిర్ణీత సమయానికి బదులుగా సాయంత్రం గమ్యస్థానానికి చేరేందుకు బయలుదేరిందని పశ్చిమ మధ్య రైల్వే తాత్కాలిక ప్రజా సంబంధాల అధికారి (భోపాల్ డివిజన్) నావల్ అగర్వాల్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల రైలు ఆలస్యమైందన్నారు. అయితే రైలు సంబంధిత యాప్లతో సహా పలు మార్గాల ద్వారా ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం అందించామని ఆయన చెప్పారు.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.40 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్కు బయలుదేరాల్సిన రైలు రాకపోవడంతో రాణి కమలపాటి స్టేషన్కు వచ్చిన ప్రయాణికులు నిరసన తెలిపారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో కొంతమంది ప్రయాణికులు శతాబ్ది ఎక్స్ప్రెస్ (న్యూఢిల్లీకి వెళ్లేది)లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు బ్యాగులు పట్టుకుని పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. ఆదివారం రాత్రి 10.20 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి రాణి కమలాపతి స్టేషన్కు రావాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (20172)లో సాంకేతిక లోపం తలెత్తిందని, సీ11 కోచ్ స్ప్రింగ్ పాడైందని అధికారులు తెలిపారు. మరమ్మతుల కోసం రైలును యార్డుకు తరలించామని, అయితే లోపాన్ని సకాలంలో సరిదిద్దలేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున రైలు బయలుదేరలేదన్నారు.ఇది కూడా చదవండి: దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా -
ప్రీమియం రైళ్లలో ప్రత్యేకత ఇదే
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అందుకే వీటిని దేశానికి లైఫ్ లైన్ అని అంటారు. భారతీయ రైల్వేలు పేద తరగతికి అతి తక్కువ ఛార్జీలతో జనసాధారణ్ ఎక్స్ప్రెస్లను నడుపుతుండగా, ధనికుల కోసం వందే భారత్ వంటి ప్రీమియం సెమీ-హై స్పీడ్ రైళ్లను కూడా నడుపుతున్నాయి. వీటిలోని కొన్ని రైళ్లలో ప్రయాణీకులు ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు.సాధారణంగా సుదూర రైళ్లలో మాత్రమే ఆన్బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం ఉంటుంది. తక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ఆన్బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదు. అయితే దేశంలోని కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ఆహారం అందిస్తారు. దీని కోసం విడిగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.వందే భారత్ ఎక్స్ప్రెస్, గతిమాన్ ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్ తదితర ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందిస్తారు. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుంచి వారు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ఆహారం కోసం ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే ఈ రైళ్ల టిక్కెట్లలో ఆహారం ఖర్చు కూడా జతచేరి ఉంటుంది. ఇతర రైళ్లలో మాదిరిగా కాకుండా ఈ రైళ్లలో విడిగా ఆహారానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదు.ఇతర సాధారణ మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల నుంచి టిక్కెట్లతో పాటు ఆహారం కోసం ఎటువంటి ఛార్జీ విధించరు. అటువంటి పరిస్థితిలో ఈ సాధారణ మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఆహారం కోసం విడిగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్, గతిమాన్ ఎక్స్ప్రెస్, రాజధాని, శతాబ్ది తదితర ప్రీమియం రైళ్లలో ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
'వందే భారత్' మేడిన్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో త్వరలోనే రైల్ కోచ్.. మేడ్ ఇన్ తెలంగాణ అన్న అక్షరాలు కనిపించబోతున్నాయి. దశాబ్దాలుగా కలగానే మిగిలిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరికొన్ని నెలల్లో కార్యరూపం దాల్చబోతోంది. దేశవ్యాప్తంగా దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లకు ఇక్కడి నుంచి హైస్పీడ్ బోగీలు సరఫరా కాబోతున్నాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరగటం, కేంద్రం కూడా భవిష్యత్తులో సాధారణ రైళ్ల స్థానంలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తుండటంతో కాజీపేటలో ఎక్కువగా వందేభారత్ రైల్ కోచ్లు తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు బడ్జెట్ ను కూడా పెంచింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నది. రొబోటిక్ టెక్నాలజీ వినియోగం..: కాజీపేటలో ఏర్పాటుచేస్తున్న కోచ్ ఫ్యాక్టరీలో అత్యాధునిక రొబోటిక్ యంత్రాలు వాడాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని కోచ్ ఫ్యాక్టరీగా మార్చిన నేపథ్యంలో ఆ మేరకు నిర్మాణాల డిజైన్లను మార్చింది. వందేభారత్ రైళ్ల బోగీల తయారీకి వీలుగా జపాన్కు చెందిన టైకిషా ఇంజినీరింగ్ సంస్థ నుంచి ఆధునిక రొబోటిక్ యంత్రాలను దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే ఆ సంస్థకు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీని రూ.521 కోట్లతో ఏర్పాటుచేస్తామని గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆధునిక యంత్రాలు కొనుగోలు చేస్తుండటంతో బడ్జెట్ను మరో రూ.150 కోట్ల మేర పెంచుతోంది. డిమాండ్కు అనుగుణంగా.. ఆలస్యానికి బ్రాండ్గా మారిన భారతీయ రైల్వేలను పరుగులు పెట్టించే పని మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా క్రమంగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. వందేభారత్ రైళ్లు కూడా అందులో భాగమే. రైల్వేశాఖ సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్ల వినియోగాన్ని కూడా ఆపేసి పూర్తిగా ఆధునిక ఎల్హెచ్బీ కోచ్లనే వినియోగించటం ప్రారంభించింది. క్రమంగా ఈ ఎల్హెచ్బీ కోచ్ రైళ్లను కూడా తప్పించి వందేభారత్ రైళ్లనే తిప్పాలని నిర్ణయించింది. అన్ని కేటగిరీల్లో వాటినే వాడాలన్నది కేంద్రం యోచన. వందేభారత్ రైళ్లకు డిమాండ్ కూడా అమాంతం పెరిగింది. రైల్వేకు చెందిన ప్రధాన కోచ్ ఫ్యాక్టరీలైన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ఫ్యాక్టరీ (ఐసీఎఫ్), కపుర్తలాలోని రైల్ కోచ్ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్)లలో ప్రస్తుతం సింహభాగం కోచ్ల ఉత్పత్తి జరుగుతోంది. త్వరలో లాతూరులోని మరాటా్వడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంఆర్సీఎఫ్)లో ఉత్పత్తి మొదలు కాబోతోంది. వీటితోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా కోచ్ల కోసం రైల్వేశాఖ ఆర్డర్ ఇస్తోంది. భవిష్యత్తు డిమాండ్కు సరిపడా ఉత్పత్తి జరగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాజీపేటలో కూడా అత్యాధునిక కోచ్ల తయారీని ప్రారంభిస్తున్నది. క్రమంగా ఉత్పత్తి పెంపు – పూర్తిస్థాయిలో నిర్మాణ వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కాజీపేటలో తక్కువ పరిమాణంలో అయినా ఉత్పత్తిని ప్రారంభించాలన్నది కేంద్రం యోచన. ఇందులో భాగంగా తొలుత నెలకు 10 ఎల్హెచ్బీ, వందేభారత్ కోచ్లు తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. – తదుపరి ఐదారు నెలల్లో నెలకు 20 చొప్పున కోచ్లు తయారు చేసేలా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా సామరŠాధ్యన్ని మరింత పెంచుతారు. అందుకు తగ్గట్టు బడ్జెట్ను కేటాయిస్తారు. – యాద్గిర్లో తయారయ్యే చక్రాలను ఇక్కడికి పంపుతారు. మరో ప్రాంతంలో తయారైన విడి భాగాలను (కోచ్ దిగువ భాగం) ఇక్కడికి తీసుకొచ్చి పూర్తిస్థాయి బోగీగా రూపొందించి దానిపై షెల్ (కోచ్ బాడీ)ను బిగిస్తారు. – కోచ్లలో కావాల్సిన అమరికలను సిద్ధం చేసేందుకు కాంపోనెంట్ ఎరిక్షన్, ఫ్యాబ్రికేషన్ షెడ్లను నిర్మిస్తున్నారు. –తయారైన కోచ్లకు రంగులు వేయటం, వాటి పనితీరును తనిఖీ చేసేందుకు పెయింటింగ్ బూత్, టెస్ట్ షాప్లను ఏర్పాటుచేస్తున్నారు. – ఒక వందేభారత్ రైలు రేక్ తయారీకి రూ.125 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఎల్హెచ్బీ కోచ్ల రైలుకు రూ.80 కోట్లవుతుంది. ఐదు దశాబ్దాల కల కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఐదు దశాబ్దాలుగా ఉన్నది. 1982లో ఈ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అయింది. నాటి ప్రధాని ఇందిర హత్య, ఆ తర్వాత సిక్కులపై ఊచకోత.. కాంగ్రెస్పై సిక్కుల్లో ఆగ్రహం.. వారిని శాంతపరిచే చర్యల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటువాల్సి కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్లోని కపుర్తలాకు తరలించారు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ కోసం తెలంగాణలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2009లో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కాజీపేటకు రైలు చక్రాల తయారీ యూనిట్ మంజూరైంది. అది కూడా ఆ తర్వాత రద్దయ్యి, మోదీ ప్రభుత్వం వచ్చాక పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్గా మారింది. భూ సమస్య కారణంగా దాని ఏర్పాటు పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. చివరకు గత ఏడాది ఫిబ్రవరిలో దాన్ని గూడ్సు రైలు వ్యాగన్ల తయారీ కేంద్రంగా అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు దాన్ని కోచ్ల తయారీ కేంద్రంగా మళ్లీ అప్గ్రేడ్ చేశారు. మరో 35 ఎకరాల భూ సేకరణకాజీపేట ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం 160 ఎకరాల భూమిని మంజూరు చేసింది. అందులో 150 ఎకరాలు ఇప్పటికే రైల్వేకు అప్పగించింది. మిగతా భూమి త్వరలో అందజేయనుంది. మారిన డిజైన్ నేపథ్యంలో తాజాగా మరో 35 ఎకరాలు కూడా రైల్వే తీసుకోనున్నట్టు తెలిసింది. కాజీపేట స్టేషన్తో అనుసంధానిస్తూ కోచ్ తయారీ కేంద్రంలోకి ట్రాక్ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. 390 మీటర్ల పొడవైన షెడ్లుకాజీపేట ఫ్యాక్టరీలో తొలుత వ్యాగన్లు తయారుచేయాలని నిర్ణయించినందున అందుకు తగ్గట్టుగానే డిజైన్లు రూపొందించారు. తాజాగా ఆ డిజైన్లలో 50 శాతం వరకు మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం 30 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. 2026 మార్చి నాటికి పూర్తిగా యూనిట్ సిద్ధమై ఉత్పత్తి పనులు మొదలుపెట్టాలన్నది లక్ష్యం. ఇక్కడ భారీ షెల్ అసెంబ్లింగ్ షెడ్ నిర్మిస్తున్నారు. ఇందులో కోచ్ల బాడీలు సిద్ధమవుతాయి. వందే భారత్ రైలు దాదాపు 390 మీటర్ల పొడవుంటుంది. దానికి సరిపడే రీతిలో దీన్ని నిర్మిస్తున్నారు. 600 మంది ఉద్యోగులుకాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ప్రత్యక్ష్యంగా 600 మంది ఉద్యోగులు పనిచేస్తారు. పరోక్షంగా 8 వేల నుంచి పది వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. వేగంగా కోచ్లను సిద్ధం చేయాల్సిన నేపథ్యంలో ఇది అసెంబ్లింగ్ యూనిట్గా ఏర్పాటవుతోంది. కోచ్ల తయారీకి కావాల్సిన ముడి సరుకు పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. దీంతో ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా స్థానికంగా ప్రైవేటు సంస్థలు లాభపడతాయి. వాటిల్లో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రాబోతున్నారు. -
భీమ్ ఆర్మీ చీఫ్ ప్రయాణిస్తున్న వందే భారత్పై రాళ్ల దాడి
లక్నో: భీమ్ ఆర్మీ పార్టీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రయాణిస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్పై అల్లరి మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో రైలు కిటికీ ధ్వంసమైంది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా కమల్పూర్లో ఆదివారం చోటుచేసుకున్న ఘటనలో ఆజాద్కు ఎటువంటి హాని జరగలేదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వస్తుండగా ఉదయం 7.12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో షాక్కు గురయ్యాయనని అనంతరం ఆజాద్ ఎక్స్లో పేర్కొన్నారు. ‘నా కంటే రెండు సీట్లు ముందు కూర్చున్న ప్రయాణికుడి దగ్గర ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటనతో నేను షాక్కి గురయ్యాను. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాదు, ప్రయాణికుల భద్రతకు సైతం ముప్పు కలిగించే పరిణామమిది. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదు’అని ఆయన పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో భద్రత కోసం సి–3 నుంచి సి–14 బోగీకి మారినట్లు చెప్పారు. దీనిపై రైల్వే భద్రతాధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి పరిశీలించారని, సి–3 బోగీపై మాత్రమే రాళ్ల దాడి జరిగినట్లు గుర్తించారని ఆజాద్ చెప్పారు. ‘ఒక్క 2022 లోనే రైళ్లపై రాళ్లు రువి్వన ఘటనలు 1,503 నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటితో రైల్వే శాఖకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. పదేపదే జరుగుతున్న ఈ ఘటనలు ప్రయాణికుల ప్రాణాలకు సైతం ప్రమాదకరంగా మారాయి’అని ఆజాద్ తెలిపారు. -
సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ రైలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్–పుణే మధ్య త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనే ఈ మార్గాన్ని రైల్వేబోర్డు నోటిఫై చేసినా.. రైల్ రేక్ సిద్ధంగా లేకపోవటంతో ప్రారంభించలేదు. ఈ క్రమంలో త్వరలో ఈ రైలును పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. అది ముగిశాక ప్రారంభించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది సర్వీసు కొనసాగుతోంది. అది రోజూ మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది. వందే భారత్ను ఉదయమే బయలుదేరేలా నడిపే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి.స్లీపర్ కేటగిరీపై పరిశీలన!వందే భారత్ రైళ్లలో స్లీపర్ కేటగిరీ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇటీవలే నమూనా రైలు సిద్ధమైంది. ఆ రైలు రేక్స్ తయారవుతున్నాయి. ట్రయల్రన్ తర్వాత వాటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 16 రూట్లను ఈ రైళ్లకోసం ఖరారు చేశారు. మరిన్ని మార్గాలను కూడా ఎంపిక చేయనున్నారు. సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ను నడిపే అంశాన్ని కూడా రైల్వే బోర్డు పరిశీలిస్తోంది.ఈ నగరాల మధ్య ప్రస్తుతమున్న పుణే శతాబ్ది రైలు సికింద్రాబాద్లో మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతోంది. కానీ రాత్రివేళ సర్వీసు పెట్టాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఈ క్రమంలో రాత్రివేళ వందే భారత్ స్లీపర్ సర్వీసును ప్రారంభించి.. ఆ తర్వాత సాధారణ వందే భారత్ను శతాబ్ది స్థానంలో ప్రవేశపెట్టాలన్నది రైల్వే యోచన అని సమాచారం.నాగ్పూర్ సర్వీసు విఫలంతో..సికింద్రాబాద్–నాగ్పూర్ మధ్య 20 కోచ్లతో వందే భారత్ రైలు సేవలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు నగరాల మధ్య నిత్యం నాలుగు రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో వందే భారత్కు డిమాండ్ లేకుండా పోయింది. ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం కూడా ఉండటం లేదు. నెల గడుస్తున్నా దీనికి ఆదరణ పెరగకపోవటంతో కోచ్ల సంఖ్యను తగ్గించి.. ఎనిమిది కోచ్లకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పుణే సర్వీసు ఎలా ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.సికింద్రాబాద్–పుణే మధ్య సర్వీసులు తక్కువ. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న నగరాలు కావడం, ప్రయాణికుల డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో.. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ సర్వీసు విఫలమయ్యే చాన్స్ లేదని ప్రాథమికంగా తేల్చారు. వందే భారత్ను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి వచ్చారు. సాధారణ వందే భారత్ సర్వీసా? స్లీపర్ సర్వీసా? అన్నదానిపై మహారాష్ట్ర ఎన్నికల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్.. అట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు
-
చెన్నైలో వందే భారత్ స్లీపర్ ఆవిష్కరణ
సాక్షి, చెన్నై: వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైలును చెన్నై ఐసీఎఫ్లో బుధవారం ఆవిష్కరించారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) జనరల్ మేనేజర్ సుబ్బారావు ఈ రైలు గురించి మీడియాకు తెలిపారు. చెన్నైలోని ఐసీఎఫ్లో వందే భారత్ రైళ్ల తయారీ జరుగుతోందని చెప్పారు. దీంతోపాటు వందే మెట్రో రైళ్లు, అమృత్ వందే మెట్రో రైళ్లు కూడా తయారు చేస్తున్నామన్నారు. అదే సమయంలో స్లీపర్ సౌకర్యాలతో కూడిన వందే భారత్ రైళ్లను సిద్ధం చేసి రాత్రి వేళల్లో నడపాలని రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా స్లీపర్ వెర్షన్ అన్ని హంగులతో రూపుదిద్దుకుందని వివరించారు. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించి పట్టా లెక్కించబోతున్నట్లు తెలిపారు. -
నిలిచిన వందేభారత్
బాపట్ల టౌన్: వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలు నిలిపేశాడు. ట్రాక్ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్ మరమ్మతు చేయడంతో రైలు యధావిధిగా గుంటూరు వైపు ప్రయాణించింది. -
స్లీపర్ వందేభారత్ జిగేల్..!
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే గతిని మార్చిన ‘వందేభారత్’సిరీస్లో స్లీపర్ బెర్తులతో కూడిన రైలు త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వేయి కిలోమీటర్లను మించిన దూరంలో ఉన్న ప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై తొలి పరుగుకు సన్నద్ధమైంది. ఇప్పటి వరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.రైల్వే శాఖ మంత్రి అశ్వీనీవైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. త్వరలో దేశంలోని ప్రధాన ప్రాంతాల మధ్య ఇవి రాత్రి వేళ పరుగులు పెట్టబోతున్నాయి. 14 రూట్లలో వీటినే నడిపే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నారు. స్వదేశీ పరిజ్ఞానం, పూర్తిస్థాయి అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో ఈ రైలు రూపుదిద్దుకుంది. ⇒ ఈ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరో డైనమిక్ డిజైన్తో కనువిందు చేయనుంది. ⇒ ఇంటీరియర్ను జీఎఫ్ఆర్పీ ప్యానల్తో రూపొందించారు. ⇒ అగ్ని నిరోధ వ్యవస్థ ఈఎన్ 45545 ప్రమాణ స్థాయితో రూపొందింది (హజార్డ్ లెవెల్:3). ⇒ దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు ఇందులో పొందుపరిచారు. ⇒ ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని, మూసుకునే పద్ధతి గల డోర్లు ఏర్పాటు చేశారు. ఇవి సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్తో పనిచేస్తాయి. ⇒ దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ⇒ మొదటి శ్రేణి ఏసీ కోచ్లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ⇒ కోచ్లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. ⇒ అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ, ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. మొత్తం 16 కోచ్లు ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్లు ఉంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్తులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. లోకో పైలట్తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. -
సికింద్రాబాద్-నాగ్పూర్ వందేభారత్కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్పూర్ వందేభారత్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. వందేభారత్లో బాంబు ఉందని ఓ ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు. అయితే రైలులో బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని సమాచారంచ్చినక్తిని లింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్గా గుర్తించారు, దీంతో అతడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.కాగా సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ప్రారంభించగా.. సెప్టెంబర్ 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ కొత్త రైలు ఏర్పాటు చేశారు.అయితే ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి 80 శాతం ఖాళీతో నడుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. దాదాపు 1200 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ ట్రైన్ బోగీల సంఖ్యను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 బోగీలతో నడుస్తుండగా.. 10 బోగీలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. -
వందేభారత్ రైళ్ల కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు విదేశాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. చిలీ, కెనడా, మలేషియా తదితర దేశాలు ‘వందే భారత్’ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రైలు నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.ఇతర దేశాలలో ఆధునిక సౌకర్యాలు కలిగిన రైళ్ల నిర్మాణానికి రూ. 160-180 కోట్ల మధ్య ఖర్చు అవుతుంది. భారతదేశంలో నిర్మితమయ్యే వందే భారత్ రైలు వ్యయం రూ.120 నుండి రూ. 130 కోట్ల మధ్య ఉంటుంది. వందే భారత్ గంటకు 0 నుండి 100 కి.మీ. వేగాన్ని చేరుకోవడానికి కేవలం 52 సెకన్లు పడుతుంది. ఇది జపాన్ బుల్లెట్ రైలు కంటే అధికం. జపాన్ బుల్లెట్ రైలు గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి 54 సెకన్లు పడుతుంది. వందేభారత్ను మరింత మెరుగ్గా రూపొందించారని విదేశీ ప్రతినిధులు చెబుతున్నారు.కాగా భారతీయ రైల్వేల అభివృద్ధి గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ గడచిన 10 ఏళ్లలో 31,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్లను జోడించామని తెలిపారు. దీన్ని 40,000 కిలోమీటర్ల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 10,000 లోకోలు, 9,600 కిలోమీటర్ల ట్రాక్కు టెండర్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇది కూడా చదవండి: ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్ -
కొత్త రైళ్లను తగ్గించి.. కోచ్ల సంఖ్య పెంచేలా!
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ స్లీపర్ రైళ్ల కాంట్రాక్టును రైల్వే శాఖ సవరించింది. రైళ్ల సంఖ్యను తగ్గిస్తూ.. కోచ్ల సంఖ్యను పెంచుతూ కాంట్రాక్టులో మార్పులు చేసింది. స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే రూట్లను కూడా కుదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న చైర్ కార్ వందేభారత్ రైళ్లతోపాటు స్లీపర్ కోచ్లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కాంట్రాక్టు ఖరారు చేసింది. 800 కి.మీ. నుంచి 1,200 కి.మీ. దూరప్రాంతాలకు స్లీపర్ కోచ్లతో కూడిన 200 వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రూ.58వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసింది. కానీ.. స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో ప్రవేశపెట్టాలనే అంశంపై రైల్వే శాఖ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది.స్లీపర్ కోచ్ల నిర్వహణ వ్యయం, టికెట్ల ద్వారా వచ్చే రాబడి మధ్య సమతుల్యత లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. అందుకే.. మొదటి స్లీపర్ వందేభారత్ రైలును ప్రారంభించే విషయంలో కాలయాపన చేస్తోంది. డిమాండ్ ఉన్న, అంతగా లేని మొత్తం 200 రూట్లలో స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టడం నిర్వహణ వ్యయం పరంగా సరైన నిర్ణయం కాదని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎందుకంటే.. ఒక్కో కోచ్లో 80 సీట్లు ఉంటాయి. 16 కోచ్లతో కూడిన స్లీపర్ రైళ్లను అంతగా డిమాండ్లేని రూట్లలో కూడా నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతుందని అంచనాకు వచ్చింది.దాంతో స్లీపర్ కోచ్లకు అధిక డిమాండ్ ఉంటుందని భావిస్తున్న రూట్లలోనే ఆ రైళ్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు రైళ్లలో కోచ్ల సంఖ్యను పెంచడం ద్వారా టికెట్ల ఆదాయాన్ని పెంచుకోవాలని భావించింది. ఈ మేరకు స్లీపర్ రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కు తగ్గించింది. ఇక ఒక్కో రైలులో కోచ్ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచింది. కాంట్రాక్టు మొత్తం వ్యయం మాత్రం రూ.58వేల కోట్లుగానే ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్), భారతహెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు సవరించిన కాంట్రాక్టును ఖరారు చేసింది. -
Narendra Modi: దేశ ప్రతిష్ట దిగజార్చే యత్నం
అహ్మదాబాద్: పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ, కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు. విద్వేషాన్ని నింపుకున్న వాళ్లు దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వదలిపెట్టరని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభలో రూ.8,000 కోట్ల పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. తర్వాత దేశంలోనే తొలి వందేభారత్ మెట్రో సర్వీస్ అయిన భుజ్–అహ్మదాబాద్ ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ను ప్రారంభించారు. దీంతోపాటు ఐదు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లనూ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాహుల్, కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కొందరు ప్రతికూలత, విద్వేషంతో భారత్ను విడగొట్టేందుకు దేశ ఐక్యత, సమత్రలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇండియా, గుజరాత్ల పరువు తీసేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వీళ్లు చేజార్చుకోరు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక తొలి 100 రోజుల్లో పాలనపై విపక్షాలు దారుణంగా విమర్శించాయి. నేను మాత్రం అభివృద్ధి అజెండా అమలుపైనే దృష్టిపెట్టా. నేను జీవిస్తే మీ కోసమే జీవితాన్ని ధారపోస్తా. పోరాడితే మీ కోసమే పోరాడతా. చనిపోవాల్సి వస్తే మీ కోసమే ప్రాణాలప్పిస్తా’’ అని వేలాది మంది సభకులనుద్దేశించి అన్నారు.తొలి భారత్ మెట్రో పేరు మార్పుమెట్రో నగరాల మధ్య తిరిగే దేశంలో తొలి మెట్రో ‘వందే మెట్రో’ పేరును ప్రారంభోత్సవానికి కొద్దిసేపటి ముందు కేంద్రం ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’గా మార్చింది. సోమవారం సాయంత్రం ఈ రైలును మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఇది తొమ్మిది స్టేషన్లలో ఆగుతూ 359 కి.మీ. ప్రయాణించి అహ్మదాబాద్కు చేరుకుంటుంది. ఈ రైలు సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. భుజ్ నుంచి అహ్మదాబాద్కు టికెట్ ధర రూ.455గా నిర్ణయించారు.మరో మెట్రోలో ప్రధాని ప్రయాణంఅహ్మదాబాద్, గాంధీనగర్లను కలిపే రెండో దశ మెట్రోను మోదీ ప్రారంభించారు. అందులో గాంధీనగర్ సెక్టార్1 స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీకి వెళ్లారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కొందరు విద్యార్థులు ప్రయాణించారు. రూ.5,384 కోట్ల వ్యయంతో ఫేజ్2 పనులు చేపట్టారు.భారత సౌర విప్లవం ఒక సువర్ణాధ్యాయంగాంధీనగర్లో నాలుగో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడి దారుల సదస్సు, ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. ‘‘వెయ్యేళ్ల ప్రగతికి భారత్ పునాదులు వేసుకుంటోంది. అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవడమే గాక, అక్కడే కొనసాగాలని లక్షిస్తోంది. మూడో దఫా పాలన తొలి 100 రోజుల్లో మా ప్రాధమ్యాలను గమనిస్తే దేశం వేగం, విస్తృతి అర్ధమవుతాయి’’ అని పెట్టుబడిదారులను ఉద్దేశించి అన్నారు. ‘‘సౌర, పవన, అణు, జల విద్యుదుత్పత్తి ద్వారా భారత్ ఇంధన అవసరాలు తీర్చుకోనుంది. దేశ 21వ శతాబ్ద చరిత్రలో సౌరవిప్లవ అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో రాస్తారు’’ అన్నారు. గాంధీనగర్లో వవోల్ ప్రాంతంలోని షాలిన్–2 సొసైటీలో ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనా’ పథక లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. -
తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ సోమవారం(సెప్టెంబర్16) ప్రారంభించారు. భుజ్-అహ్మదాబాద్ మధ్య నడిచే వందేభారత్ మెట్రో రైలు సర్వీసుల పేరును నమోభారత్ ర్యాపిడ్ రైలుగా మార్చారు. ఈ రైలుతో మరిన్ని వందేభారత్ రైళ్లను మోదీ వర్చువల్గా ప్రారంభించారు.దుర్గ్-విశాఖపట్నం,వందేభారత్,నాగ్పుర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను కూడా మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-నాగ్పుర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. వందేభారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు తన పట్ల ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయన్నారు. అయితే, ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి.. ఈ టర్ములోనే ఒకే దేశం-ఒకే ఎన్నికలు -
నేడు వందే మెట్రో పరుగు
సాక్షి, హైదరాబాద్: రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ల స్థానంలో వందే మెట్రో రైళ్లను తిప్పాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందేభారత్ రైలు సిరీస్లో మరో కొత్త కేటగిరీని ప్రారంభిస్తోంది. దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సోమవారం పట్టాలెక్కుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి 360 కి.మీ. దూరంలో ఉన్న భుజ్ నగరం మధ్య ఇది రాకపోకలు సాగిస్తుంది. ఇప్పటికే మరిన్ని వందే మెట్రో రైళ్లను సిద్ధం చేసిన రైల్వే శాఖ, త్వరలో వాటిని కూడా ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చెన్నై–తిరుపతి మధ్య దీన్ని నడపనున్నట్లు సమాచారం. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్–విజయవాడ రూట్ ఉంది.వందేభారత్ తరహాలోనే..వందే మెట్రో కూడా వందేభారత్ రూపులోనే ఉండనుంది. బయటి నుంచి చూస్తే పెద్దగా తేడా ఉండదు. కానీ, లోపలి వ్యవస్థ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది. దీని సీటింగ్ పూర్తిగా వేరుగా ఉండనుంది. ముగ్గురు చొప్పున కూర్చునే వెడల్పాటి సీట్లను ఏర్పాటు చేశారు. సీట్ల మధ్యలో ప్రయాణికులు నిలబడి ప్రయాణించేందుకు వీలుగా లోకల్ రైళ్లలో ఉన్నట్టుగా రూఫ్ భాగంలో హ్యాండిల్స్ ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో 12 కోచ్లుంటాయి. మొత్తం 1,150 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. నిలబడి ప్రయాణించేవారితో కలుపుకొంటే మొత్తం సామర్థ్యం 3208 అవుతుంది. ఈ రైళ్లలో రిజర్వేషన్ వ్యవస్థ అమల్లో ఉండదంటున్నారు. అందుకే సీట్లకు నంబరింగ్ ఉండదు.350 కి.మీ. నిడివి వరకు..100 నుంచి 350 కి.మీ. దూరం ఉండే రెండు ప్రధాన నగరాలు/పట్టణాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం 110 కి.మీ. వీటిలో ప్రతి కోచ్లో రెండు చొప్పున టాయిలెట్లు ఉంటాయి. ఒకవైపు ఇండియన్ మోడల్, మరోవైపు వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ ఉంటాయి. ఇవి పూర్తి ఏసీ రైళ్లు, భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడా నడపనున్నట్టు సమాచారం.కనీస చార్జీ రూ.30ఈ రైళ్లలో కనీస చార్జీ రూ.30. దూరాన్ని బట్టి గరిష్ట చార్జీ (350 కి.మీ.కు) రూ.445గా ఉండనుంది. సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్, నేరుగా లోకోపైలట్తో మాట్లాడేందుకు టాక్ బ్యాక్ యూనిట్, అగ్నిమాపక వ్యవస్థ, ఇన్ఫర్మేషన్ స్క్రీన్, ఫైర్ అలారమ్, దివ్యాంగుల టాయిలెట్, అనారోగ్యానికి గురైన వారికి స్ట్రెచర్ తదితరాలు రైల్లో ఉంటాయి. -
ఇంటర్సిటీ స్థానంలో వందే మెట్రో
సాక్షి, హైదరాబాద్: రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ల స్థానంలో వందే మెట్రో రైళ్లను తిప్పాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందేభారత్ రైలు సిరీస్లో మరో కొత్త కేటగిరీని ప్రారంభిస్తోంది. దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సోమవారం పట్టాలెక్కుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి 360 కి.మీ. దూరంలోని భుజ్ నగరం మధ్య ఇది నడవనుంది. మరిన్ని వందే మెట్రో రైళ్లను కూడా త్వరలో ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చెన్నై–తిరుపతి మధ్య దీన్ని నడపనున్నట్లు సమాచారం. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్–విజయవాడ రూట్ ఉంది. వందే మెట్రో కూడా వందేభారత్ రూపులోనే ఉండనుంది. బయటి నుంచి చూస్తే పెద్దగా తేడా ఉండదు. లోపలి వ్యవస్థ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది.350 కి.మీ. నిడివి వరకు..100 నుంచి 350 కి.మీ. దూరం ఉండే రెండు ప్రధాన నగరాలు/పట్టణాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం 110 కి.మీ. వీటిలో ప్రతి కోచ్లో రెండు చొప్పున టాయిలెట్లు ఉంటాయి. ఒకవైపు ఇండియన్ మోడల్, మరోవైపు వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ ఉంటాయి. ఇవి పూర్తి ఏసీ రైళ్లు, భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడా నడపనున్నట్టు సమాచారం. ఈ రైళ్లలో కనీస చార్జీ రూ.30. దూరాన్ని బట్టి గరిష్ట చార్జీ (350 కి.మీ.కు) రూ.445గా ఉండనుంది. -
ఆరు వందేభారత్లకు మోదీ పచ్చ జెండా
న్యూఢిల్లీ: ఆరు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల రాకతో 54గా ఉన్న వందేభారత్ రైళ్ల సంఖ్య 60కి చేరిందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రధాని మోదీ ఆదివారం నాడు జార్ఖండ్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఆరు నూతన వందేభారత్ రైళ్లు టాటా నగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటా నగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మధ్య నడుస్తాయి.ఈ కొత్త వందే భారత్ రైళ్లు దేవఘర్లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, కాళీఘాట్, కోల్కతాలోని బేలూర్ మఠం వంటి మతపరమైన ప్రదేశాలకు త్వరగా చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది కాకుండా ఈ రైళ్లు ధన్బాద్లో బొగ్గు గనుల పరిశ్రమను, కోల్కతాలోని జనపనార పరిశ్రమను, దుర్గాపూర్లో ఇనుము, ఉక్కు పరిశ్రమను చూపిస్తాయి.ఇది కూడా చదవండి: కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లుమొదటి వందే భారత్ రైలు 2019, ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యింది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యేక ప్రయాణ అనుభూతిని అందజేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు వందే భారత్ మొత్తం సుమారు 36,000 ప్రయాణాలను పూర్తి చేసింది. 3.17 కోట్ల మంది ప్రయాణీకులకు ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. #WATCH | PM Modi virtually flags off the Tatanagar-Patna Vande Bharat train at Tatanagar Junction Railway Station.He will also lay the foundation stone and dedicate to the nation various Railway Projects worth more than Rs. 660 crores and distribute sanction letters to 20,000… pic.twitter.com/vNiDMSA6tK— ANI (@ANI) September 15, 2024 -
వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రాంచీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్15) ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ జెండా ఊపి ప్రారంభించనున్న ఆరు కొత్త వందే భారత్ రైళ్లు వేగం, సురక్షితమైన సౌకర్యాలను ప్రయాణికులకు అందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జార్ఖండ్ టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ కొత్త రైళ్లు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో, 280 జిల్లాలను కవర్ చేస్తూ ప్రతిరోజు 120 సార్లు రాకపోకలు నిర్వహిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. కాగా,ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా ఈ ఆరు కొత్త మార్గాల్లో కార్యకలాపాల్ని నిర్వహించనున్నాయి.గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ట్రైన్లు సెప్టెంబర్ 14, 2024 నాటికి 54 రైళ్లు 108 సర్వీసులుతో 36,000 ట్రిప్పులను పూర్తి చేసి 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. కాగా, మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 15,2019న ప్రారంభమైంది.ఇదీ చదవండి : నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది -
వందేభారత్పై రాళ్ల దాడి.. ఐదుగురు నిందితుల అరెస్ట్
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో మూడు కోచ్ల అద్దాలు పగిలిపోయాయి. సెప్టెంబరు 16న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో మహాసముంద్లో వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతోంది. రాళ్ల దాడిలో సీ2-10, సీ4-1, సీ9-78 కోచ్ల అద్దాలు పగిలిపోయాయి. బాగ్బహ్రా రైల్వే స్టేషన్లో ఈ రాళ్ల దాడి జరిగింది.ఈ దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బాగ్బహ్రాకు చెందినవారు. వీరిపై పోలీసులు రైల్వే చట్టం 1989 కింద కేసు నమోదు చేశారు. 16 నుంచి నడవనున్న వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ జరుగుతుండగా, రాళ్ల దాడి చోటుచేసుకున్నదని ఆర్పీఎఫ్ అధికారి పర్వీన్ సింగ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారన్నారు. ఇది కూడా చదవండి: పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య -
సికింద్రాబాద్–నాగ్పూర్ వందేభారత్కు 20 కోచ్లు?
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పునకు కారణమైన వందేభారత్ రైళ్ల సిరీస్లో మరో నూతన అంకానికి కేంద్ర ప్రభుత్వం తెరదీస్తోంది. అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ కేటగిరీ రైళ్లలో మొదలైన వందేభారత్ తదుపరి వర్షన్గా వందేభారత్ స్లీపర్ సరీ్వసులు ప్రారంభిస్తున్న రైల్వే, తాజాగా 20 కోచ్లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 16 కోచ్ల వందేభారత్, 8 కోచ్ల మినీ వందేభారత్ రైళ్లే తిరుగుతున్నాయి. మొదటిసారి 20 కోచ్ల రేక్ను ప్రారంభిస్తున్నారు. ఒకేసారి అలాంటి నాలుగు రైళ్లను ప్రారంభిస్తుండగా, అందులో ఒకటి తెలంగాణ నుంచి నడవనుండటం విశేషం. ఈనెల 16న ప్రారంభం కానున్న సికింద్రాబాద్–నాగ్పూర్ ఆరెంజ్ వందేభారత్ను కూడా 20 కోచ్లతో ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి నాలుగు రైళ్లే..మరింతమంది ప్రయాణికులను సర్దుబాటు చేసే క్రమంలో 20 కోచ్ల సెట్ను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు నాలుగు నెలల క్రితమే ఈ ఆలోచనకు రాగా, ప్రతినెలా అలాంటి ఒక సెట్ను తయారు చేయాలని చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యా క్టరీని ఆదేశించింది. దీంతో మే, జూన్, జూలై, ఆగస్టులకు సంబంధించి నాలుగు రేక్లు సిద్ధమయ్యాయి. వాటిల్లో రెండింటిని ఉత్తర రైల్వేకు, తూర్పు రైల్వేకు, సెంట్రల్ రైల్వే జోన్కు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. హైదరాబాద్–నాగ్పూర్ మధ్య వందేభారత్ రైలు గతంలోనే మంజూరైంది. రేక్ కొరత వల్ల దాని ప్రారంభం ఆలస్యమవుతూ వచి్చంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వేకు కేటాయించిన 20 కోచ్ల రైలును సికింద్రాబాద్–నాగ్పూర్ మధ్య తిప్పనున్నట్టు తెలిసింది. 20 కోచ్ల వందేభారత్లో 3 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్లు, 16 ఎకానమీ (ఏసీ చైర్కార్) కోచ్లు ఉంటాయని సమాచారం. సాధారణ 16 కోచ్ల రేక్లో ఎగ్జిక్యూటివ్ కోచ్లు 2, ఎకానమీ కోచ్లు 14 ఉంటున్నాయి.యమ గిరాకీఎనిమిది కోచ్ల వందేభారత్లో 530 సీట్లుంటున్నాయి. అదే 16 కోచ్ల వందేభారత్లో 1,128 సీట్లు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబోతున్న 20 కోచ్ల రేక్లో 312 సీట్లు పెంచుతూ వాటి సంఖ్యను 1,440కి విస్తరించారు. ఆ మేరకు ప్రయాణికులకు అదనంగా వెసులుబాటు కలుగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు విపరీతమైన గిరాకీ ఉంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న నాలుగు వందేభారత్ రైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేషియో 110 శాతంగా ఉంది. మరి ముఖ్యంగా విశాఖపట్నం వందేభారత్లో అది 130 శాతాన్ని మించింది. దీంతో కోచ్ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్–నాగ్పూర్ మధ్య మూడు డెయిలీ ఎక్స్ప్రెస్లు తిరుగుతున్నాయి. హైదరాబాద్–న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్, దక్షిణ్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–దానాపూర్ మధ్య నడిచే దానాపూర్ ఎక్స్ప్రెస్లు నాగ్పూర్ మీదుగా నడుస్తున్నాయి. ఇవి కాకుండా వారానికి ఓసారి నడిచే హైదరాబాద్–ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, వారానికి నాలుగు రోజులు తిరిగే బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్లు సహా మొత్తం 8 రైళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వందేభారత్ రైలు రానుంది. -
తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే వ్యవస్థ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లు అనేక రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైలులో ఛార్జీలు కొంచెం ఎక్కువైనా సరే, అత్యాధునిక టెక్నాలజీతోపాటు అనేక సౌకర్యాలు ఉండటంతో ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని రూట్లలో మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్, చత్తీస్ఘడ్లోని దుర్గ్ జంక్షన్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.చదవండి: తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు -
తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రూట్లలో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంత్పూర్-కాచిగూడ, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు సైతం రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.తాజాగా వందే భారత్ రైళ్లకు తోడు వందే భారత్ మెట్రో రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16వ తేదీన తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలు ఎక్కనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనున్న తొలి వందే భారత్ మెట్రో రైలును..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండగా.. వాటి కంటే సుదూర ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణించనుంది. భుజ్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభమై.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్కు చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్లో ప్రారంభమై.. రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్-అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకు 9 స్టాప్లు ఉండగా.. ప్రతీ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని భారతీయ రైల్వే తెలిపింది.వందే భారత్ మెట్రో అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది గంటకు 100 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ రైలు లాగానే ఈ రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. మొదట 12 కోచ్లతో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలుకు.. ప్రయాణికుల రద్దీ దృష్టా వాటిని 16 కోచ్లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్లు ఒక యూనిట్గా ఉంటాయి. ఇందులో మన మెట్రో రైలు లాగా ఆటోమేటిక్ డోర్లు ఉండటం మరో ప్రత్యేకత. ఈ వందే భారత్ మెట్రో రైలును గంటకు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు.ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్తో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి కోచ్లో మంటలు, పొగ వంటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించేలా మొత్తం 14 సెన్సార్లతో కూడిన సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. దివ్యాంగుల కోసం కోచ్లలో వీల్చైర్ యాక్సెస్ కలిగిన టాయిలెట్లు ఏర్పాటు చేశారు. -
Vande Bharat: ఆటోమెటిక్ తలుపులు.. ఆధునిక టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వెయ్యి కి.మీ.ని మించిన దూరప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై త్వరలో తొలి పరుగుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. పూర్తిస్థాయిలో అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం విశేషం. ప్రత్యేకతలు ఇవే.. 👉స్లీపర్ వందేభారత్ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీలుతో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరోడైనమిక్ డిజైన్తో కనువిందు చేస్తోంది. 👉 ఇంటీరియర్ను జీఎప్ఆర్పీ ప్యానెల్తో రూపొందించారు. ఇందులో మాడ్యులర్ పాంట్రీ ఉంటుంది. 👉 అగ్ని నిరోధక వ్యవస్థలో ఈఎన్–45545 ప్రమాణ స్థాయితో రూపొందింది. 👉 దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లను ఇందులో పొందుపరిచారు. 👉 ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని మూసుకునే పద్ధతిగల తలుపులను ఏర్పాటు చేశారు. ఇది సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్తో పనిచేస్తాయి. 👉 దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 👉 లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 👉 మొదటి శ్రేణి ఏసీ కోచ్లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. 👉 కోచ్లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. 👉 అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ ఉంటుంది. 👉 ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. 👉 సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. లోకోపైలట్తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. మొత్తం 16 కోచ్లు.... ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్లు ఉంటాయి. అందులో ఏసీ 3–టైర్ కోచ్లు 11 ఉంటాయి. వాటిల్లో 611 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 2 టైర్ కోచ్లు 4 ఉంటాయి. వీటిల్లో 188 బెర్తులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఒకటి ఉంటుంది. అందులో 24 బెర్తులుంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్డులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. æ బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. -
Bihar: ట్రయల్ రన్లోని ‘వందేభారత్’పై రాళ్ల దాడి
గయ: బీహార్లోని గయలో ట్రయల్ రన్లో ఉన్న వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇంతలోనే ఈ రైలుపై కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వి, రైలు అద్దాలు పగలగొట్టారు. ధన్బాద్ రైల్వే డివిజన్ పరిధిలోని గయలోని బంధువా-టంకుప్ప స్టేషన్ మధ్య ఈ రాళ్ల దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ రైలు జంషెడ్పూర్ నుండి పట్నా వరకు నడవనుంది.ఈ ఘటనలో వందేభారత్ రైలు ఇంజన్కు ఆనుకుని ఉన్న రెండో కోచ్లోని సీటు నంబర్ నాలుగు దగ్గరున్న కిటికీ అద్దం పగిలిందని రైల్వే అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ కావడంతో ఈ వందే భారత్ రైలులో ప్రయాణికులెవరూ లేరు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇదిలావుండగా సోమవారం న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
ఆటోమెటిక్ తలుపులు..ఆధునిక టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వెయ్యి కి.మీ.ని మించిన దూరప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై త్వరలో తొలి పరుగుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. పూర్తిస్థాయిలో అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం విశేషం. ప్రత్యేకతలు ఇవే.. » స్లీపర్ వందేభారత్ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీలుతో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరోడైనమిక్ డిజైన్తో కనువిందు చేస్తోంది. » ఇంటీరియర్ను జీఎప్ఆర్పీ ప్యానెల్తో రూపొందించారు. ఇందులో మాడ్యులర్ పాంట్రీ ఉంటుంది. » అగ్ని నిరోధక వ్యవస్థలో ఈఎన్–45545 ప్రమాణ స్థాయితో రూపొందింది. » దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లను ఇందులో పొందుపరిచారు. » ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని మూసుకునే పద్ధతిగల తలుపులను ఏర్పాటు చేశారు. ఇది సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్తో పనిచేస్తాయి. » దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. » లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. » మొదటి శ్రేణి ఏసీ కోచ్లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. » కోచ్లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. » అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ ఉంటుంది. » ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. » సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. లోకోపైలట్తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. మొత్తం 16 కోచ్లు.... ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్లు ఉంటాయి. అందులో ఏసీ 3–టైర్ కోచ్లు 11 ఉంటాయి. వాటిల్లో 611 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 2 టైర్ కోచ్లు 4 ఉంటాయి. వీటిల్లో 188 బెర్తులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఒకటి ఉంటుంది. అందులో 24 బెర్తులుంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్డులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. æ బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. -
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో 4 వారాల్లోగా చెప్పండి.. : రాష్ట్ర హైకోర్టు ఆదేశం
-
విశాఖకు మరో వందే భారత్!
తాటిచెట్లపాలెం: వేగవంతమైన ప్రయాణానికి పేరొందిన వందే భారత్ రైళ్లను మరింత విస్తరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మరో వందే భారత్ రైలును విశాఖకు నడిపేందుకు ఈస్ట్కోస్ట్ రైల్వే సిద్ధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్కు రెండు వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.మూడో వందేభారత్ దుర్గ్–విశాఖపట్నం–దుర్గ్ మధ్య నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వాల్తేర్ డివిజన్ నుంచి ఏ విధమైన అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ రైలు నడిచేది మాత్రం వాస్తవమేనని తెలిసింది. కొంచెం మార్పులతోనైనా లేదా ఇదే విధంగానైనా దుర్గ్–విశాఖపట్నం–దుర్గ్ వందే భారత్ రాకపోకలు సాగించనుంది. దుర్గ్–విశాఖపట్నం(20829) వందే«భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 6 గంటలకు దుర్గ్లో బయల్దేరి మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో విశాఖపట్నం–దుర్గ్(20830) వందే భారత్ మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుందని సమాచారం. -
Video: వందే భారత్ రైలులో సాంకేతిక లోపం.. లాక్కెళ్లిన మరో ఇంజిన్
లక్నో: భారత రైల్వే తీసుకొచ్చిన సెమీ స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు.. అంతే స్పీడ్తో పలు రూట్లలో పరుగులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ రైళ్లపై అంతే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి . గతంలో ఎన్నోసార్లు రైళ్లపై రాళ్లు రువ్వడం, గేదేలు వంటివి ఢీకొని రైళ్లు ధ్వంసమైన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.తాజాగా ఓక వందే భారత్ రైలు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగిన ఆ రైలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. చివరకు మరో రైలు ఇంజిన్ ద్వారా వందే భారత్ రైలును సమీపంలోని స్టేషన్ వరకు లాక్కెళ్లారు. ఈ ఘటన న్యూఢిల్లీ- వారణాసి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. రైలు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సోమవారం ఉదయం 9.15 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో అది ఆగిపోయింది. సమాచారం రైల్వే టెక్నికల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని వందే భారత్ రైలు ఇంజిన్లోని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చివరకు మూడు గంటల తర్వాత మరో రైలు ఇంజిన్ను రప్పించారు. దాని ద్వారా వందే భారత్ రైలును భర్తానా రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లారు.What a sight.The old engine comes to rescue the famed Vande Bharat which ran into technical glitch and got stranded in Etawah, UP. Happened to the Varanasi bound Vande Bharat adversely affecting operations of other trains on the route. pic.twitter.com/rvOwbkDz4K— Piyush Rai (@Benarasiyaa) September 9, 2024మరోవైపు ఈ సంఘటన వల్ల వందే భారత్ ట్రైన్లోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపార్ట్మెంట్స్లోని ఏసీలు పని చేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చివరకు వందే భారత్ ట్రైన్లోని సుమారు 750 మంది ప్రయాణికులను ఇతర రైళ్లలో వారి గమ్యస్థానాలకు చేర్చారు. కాగా, వందే భారత్ ట్రైన్ను మరో రైలు ఇంజిన్ ద్వారా లాక్కెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వేతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా మరికొన్ని రూట్లలో వందే భారత్ రైళ్లనుప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, విజయవాడ- చెన్నై, కాచిగూడ- బెంగళూరు మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది.సికింద్రాబాద్నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కు కొత్తగా వందే భారత్ రైలు నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య 578 కి.మీ దూరం ఉండగా.. కేవలం 7 గంటల 20 నిమిషాల్లోనే గమ్య స్థానాలకు చేర్చనుంది. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ నుంచి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.ఇక ఈ రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, రామగుండం, కాజీపే స్టేషన్లలో మాత్రమే ఆగనుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నాగ్పూర నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. ఇప్పుడు నాగ్పూర్- సికింద్రాబాద్ రైలుతోపాటు నాగ్పూర్- పుణె రైలు కూడా సెప్టెంబర్ 15న ప్రారంభం కానుంది.#Secunderabad - #Nagpur VandeBharat Express will be introduced very soonTentative launch date: 📅 15th September pic.twitter.com/K43a6Eu1an— TechChaitu (@techchaituu) September 9, 2024హైదరాబాద్ నగరం నుంచి ప్రస్తుతం ఏపీలోని తిరుపతి, విశాఖ, కర్ణాటకలోని యశ్వంత్పుర (బెంగళూరు) నగరాలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ, తిరుపతి నగరాలకు రైల్లు నడుస్తుండగా.. కాచిగూడ స్టేషన్ నుంచి యశ్వంత్పురకు ట్రైన్ పరుగులు పెడుతోంది. దీంతో నాగపూర్ ప్రాంతానికి మరో ట్రైన్ ప్రతిపాదించారు. -
Lucknow: 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై దాడి
లక్నో: కొందరు అల్లరిమూకలు వందేభారత్ రైళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారనే వార్తలను అప్పుడప్పుడు మనం వింటుంటాం. తాజాగా గడచిన 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటి సంఘటన బుధవారం రాత్రి యూపీలోని లక్నో- పట్నా వందే భారత్పై జరగగా, రెండవ ఘటన గురువారం ఉదయం రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై జరిగింది.బుధవారం రాత్రి లక్నో నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై అల్లరి మూకలు భారీగా రాళ్లు రువ్వారు.ఈ దాడి కారణంగా రైలులోని సీ-5 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. యూపీలోని వారణాసి స్టేషన్ నుండి రైలు బయలుదేరిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. రైల్వేశాఖ కూడా విచారణ చేపట్టింది.ఇదేవిధంగా జార్ఖండ్లోని హజారీబాగ్లో రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందే భారత్ రైలుపై గురువారం ఉదయం రాళ్ల దాడి జరిగింది. 24 గంటల్లోనే రెండు వందేభారత్ రైళ్లపై దాడి జరిగిందని రైల్వేశాఖ తెలిపింది. రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలు నంబర్ 22350లోని బోగీ నంబర్ ఈ వన్పై రాళ్ల దాడి జరిగింది. ఇందులో ఐదు, ఆరో నంబర్ సీట్ల సమీపంలోని అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన హజారీబాగ్లోని చార్హి- బేస్ రైల్వే స్టేషన్ మధ్య జరిగింది.ఈ రాళ్లదాడిలో కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో రైలులో కూర్చున్న ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వేశాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా అల్లరి మూకలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. -
వావ్..!అనిపించే వందేభారత్ స్లీపర్ కోచ్ (ఫొటోలు)
-
వందేభారత్ స్లీపర్ కోచ్ వచ్చేసింది..విశేషాలివే..
బెంగళూరు: ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎమ్ఎల్) తయారీ కర్మాగారంలో వీటిని ప్రారంభించారు. బీఈఎమ్ఎల్లో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి మంత్రి ఆదివారం(సెప్టెంబరు1) శంకుస్థాపన చేశారు. First visual of the #VandeBharatSleeper is here!Union Minister @AshwiniVaishnaw unveiled the prototype version of #VandeBharat sleeper coach today.#VandeBharatTrain Credit: @DDNewslive@RailMinIndia @Murugan_MoS @PIB_India pic.twitter.com/TbTew5TJLN— Ministry of Information and Broadcasting (@MIB_India) September 1, 2024ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత, వందే భారత్ స్లీపర్ కోసం చాలా శ్రమించామని చెప్పారు.వందేభారత్ స్లీపర్ కోచ్ల తయారీ ఇప్పుడే పూర్తయిందన్నారు. పది రోజుల పాటు వీటికి కఠినమైన ట్రయల్స్, టెస్ట్లు నిర్వహించనున్నామని తెలిపారు. మూడు నెలల్లో ప్రయాణికులకు ఈ కోచ్ల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.The Vande Bharat sleeper train will have 24 coaches and will reach Chennai from Bangalore on September 20 for final testing. 🚄🏁#VandeBharat #vandebharatsleeper pic.twitter.com/5zgFAsQNqE— MAYA ✍🏻 (@Maya_Lokam_) August 24, 2024 వందేభారత్ స్లీపర్ కోచ్లలో ఉండే సౌకర్యాలు ఇవే...కోచ్లలో రీడింగ్ ల్యాంప్స్, ఛార్జింగ్ అవుట్లెట్లు, స్నాక్ టేబుల్, మొబైల్, మ్యాగజైన్ హోల్టర్స్ ఉంటాయి.India's first Vande Bharat prototype sleeper train unveiled in Bengaluru. Excited to Travel in Vande Bharat Sleeper 😍#IndianRailways #VandeBharatExpress #VandeBharatSleeper pic.twitter.com/8n6dcmFXyE— Shiwangi Thakur (@ShiwangiThakurX) September 1, 2024రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ‘కవచ్’ వ్యవస్థ ఉంటుంది.అన్ని కోచ్లు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో నిర్మించారు. లోపల జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి.కోచ్లన్నీ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సదుపాయాలతో మరుగు దొడ్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్లు ఇందులో అమర్చారు.16 కోచ్లు, 823 బెర్త్లతో స్లీపర్ ట్రైన్ రానుంది. వీటిలో పదకొండు 3టైర్ ఏసీ కోచ్లు (600 బెర్త్లు), నాలుగు 2 టైర్ ఏసీ కోచ్లు (188 బెర్త్లు), ఒక ఫస్ట్ టైర్ ఏసీ కోచ్(24 బెర్త్లు) ఉంటాయి. #WATCH : First Look of Vande Bharat Trains Sleeper Version.#VandeBharat #VandeBharatExpress #VandeBharatSleeper #India #latest #LatestUpdate pic.twitter.com/1Vt7Zmjo1g— upuknews (@upuknews1) October 2, 2023 -
ప్రజలందరికీ సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యం
న్యూఢిల్లీ: సమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రైల్వేలకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేదాకా ఈ పరుగు ఆగదని స్పష్టంచేశారు. మూడు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇవి మీరట్–లక్నో, మధురై–బెంగళూరు, చెన్నై–నాగర్కోయిల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. వందేభారత్ రైళ్ల ఆధునీకరణ, విస్తరణ ద్వారా ‘వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధన దిశగా భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇండియన్ రైల్వే ఒక గ్యారంటీగా మారాలన్నదే తమ ధ్యేయమని, అది నేరవేరేదాకా తమ కృషి ఆగదని స్పష్టంచేశారు. భారత రైల్వే శాఖ సాగిస్తున్న అభివృద్ధి ప్రయాణం తమ ప్రభుత్వ అంకితభావానికి ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దార్శనికతకు ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు ఒక బలమైన మూలస్తంభమని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.2.5 లక్షల కోట్లకుపైగా కేటాయించినట్లు గుర్తుచేశారు. మన రైల్వే వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తున్నామని, హై–టెక్ సేవలతో అనుసంధానిస్తున్నామని వివరించారు. దక్షిణాది అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన ఆశయ సాధనకు దక్షిణాది రాష్ట్రాల వేగవంతమైన ప్రగతి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దక్షిణాదిన నిపుణులకు, వనరులకు, అవకాశాలకు కొదవ లేదని చెప్పారు. సౌత్ ఇండియా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో రైళ్ల సంఖ్యను పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు ఎన్నో రెట్లు పెంచామని వివరించారు. రైల్వే ట్రాకులు మెరుగుపరుస్తున్నామని, విద్యుదీకరణ వేగం పుంజుకుందని, రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందని, ప్రయాణికులకు మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. -
Uttar Pradesh: నేడు వందేభారత్ రైలులో ఉచిత ప్రయాణం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్-లక్నోల మధ్య నేటి నుంచి వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.ఈరోజు (శనివారం) ఈ రైలు తొలిసారిగా పట్టాలు ఎక్కనుంది. నేడు అతిథి ప్రయాణికులకు రైల్వేశాఖ మీరట్-లక్నోల మధ్య ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్ప్రెస్ల రెగ్యులర్ ఆపరేషన్ ఆదివారం నుండి ప్రారంభంకానుంది. శుక్రవారం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ రైలు అప్డేట్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు.బరేలీ జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ప్రస్తుతం బరేలీ జంక్షన్లో రైలుకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మీరట్-లక్నో వందే భారత్ మీరట్ నుండి ఉదయం 6:35 గంటలకు బయలుదేరి, 8:35 గంటలకు మొరాదాబాద్, 9:56 గంటలకు బరేలీ చేరుకుని మధ్యాహ్నం 1:45 గంటలకు లక్నో చేరుకుంటుంది. అలాగే లక్నో-మీరట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లక్నో నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:02 గంటలకు బరేలీకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రాత్రి 7:32 గంటలకు మొరాదాబాద్, రాత్రి 10 గంటలకు మీరట్ చేరుకుంటుంది. -
డిసెంబరులో పట్టాలపైకి వందేభారత్ స్లీపర్ రైలు
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది.2019లో వందేభారత్ చైర్-కార్ రైలును ప్రారంభించారు. ఇప్పుడు వస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు ఈ సిరీస్లో మూడవ ఎడిషన్. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు గుజరాత్లో నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. ఈ రైలును రెండు నెలల పాటు పరీక్షించనున్నారు.వందే భారత్ తొలి స్లీపర్ రైలు బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఇఎంఎల్) ప్లాంట్ నుండి సెప్టెంబర్ 20 నాటికల్లా బయలుదేరుతుందని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్) చెన్నై జనరల్ మేనేజర్ యూ సుబ్బారావు మీడియాకు తెలిపారు. దీని తర్వాత రైలు ట్రయల్ రన్ జరగనుంది. వాయువ్య రైల్వే జోన్లో హైస్పీడ్ రైలు ట్రయల్ను నిర్వహించనున్నారు.స్లీపర్ వందేభారత్లో స్టెయిన్లెస్ స్టీల్ కార్ బాడీ, ప్రయాణీకులకు మెరుగైన రక్షణ సదుపాయాలు, జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్లు, ఏరోడైనమిక్ డిజైన్, మాడ్యులర్ ప్యాంట్రీ, ఫైర్ సేఫ్టీ కంప్లైయెన్స్, డిసేబుల్డ్ ప్యాసింజర్ల సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, సెన్సార్ ఆధారిత ఇంటర్కమ్యూనికేషన్, ఫైర్ బారియర్ డోర్లు ఉన్నాయి. యూఎస్బీ ఛార్జింగ్తో కూడిన ఎర్గోనామిక్ టాయిలెట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్ కూడా దీనిలో ఉండనున్నాయి. -
వందేభారత్కు ఏలూరులో హాల్ట్
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయం కల్పించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 25 నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఉదయం 9.49 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 9.50 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా 26 నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు సాయంత్రం 5.54 గంటలకు ఏలూరు స్టేషన్ చేరుకుని, 5.55 గంటలకు బయలుదేరి వెళుతుంది. -
20 కోచ్ల వందేభారత్.. ట్రయల్ రన్ విజయవంతం
అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రయాణానికి వందేభారత్ రైలు పేరొందింది. ఇప్పుడు మరో వందేభారత్ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. పశ్చిమ రైల్వే తాజాగా అదనపు బోగీలతో కూడిన వందేభారత్ రైలును పరీక్షించింది. ఈ రైలు ఐదు గంటల 21 నిమిషాల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకుంది.కొత్తగా పట్టాలెక్కిన ఈ కాషారంగు వందేభారత్కు అదనంగా నాలుగు కోచ్లను జతచేర్చారు. దీంతో మొత్తం 20 బోగీలతో ఈ నూతన వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. శుక్రవారం నాడు అహ్మదాబాద్- ముంబై మధ్య గంటకు 130 కి.మీ. వేగంతో ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారి తెలిపారు. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్లో బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12:21 గంటలకు ముంబై సెంట్రల్కు చేరుకుంది.తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ రైలు ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్కు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. భారతీయ రైల్వే 2024, జూలై 29 నుంచి దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైలు సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య వందే భారత్, తేజస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ తదితర రైళ్లతో సహా 50కి పైగా రైలు సర్వీసులు నడుస్తున్నాయి. -
ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ షెడ్యూల్ మార్పు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రమాణీకులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలు షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.వివరాల ప్రకారం.. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలు షెడ్యూల్లో మార్పులు చేశారు అధికారులు. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు. ప్రస్తుతం ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు నడుస్తోంది. మారిన షెడ్యూల్ ప్రకారం ఈ రైలు మంగళవారం ప్రయాణించదు. ఈ విషయాన్ని ప్రయాణీకులు దృష్టిలో పెట్టుకోవాలని రైల్వే శాఖ తెలిపింది. Change in Days of Service of Visakhapatnam - Secunderabad - Visakhapatnam Vande Bharat express @drmsecunderabad pic.twitter.com/kNudtIeEc1— South Central Railway (@SCRailwayIndia) August 9, 2024 -
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్పై దాడి
కలకత్తా: వందేభారత్ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్లోని హవ్డా నుంచి రాంచీకి వందేభారత్ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్ చేశాడు. అయితే ఒక వెయిటర్ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి అది నాన్-వెజ్ భోజనం అని గుర్తించాడు. Kalesh b/w a Passenger and Waiter inside Vande Bharat over A person slapped a waiter for mistakenly serving him non-vegetarian foodpic.twitter.com/Oh2StEthyX— Ghar Ke Kalesh (@gharkekalesh) July 29, 2024 శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది. ‘అవును, పొరబాటు జరిగింది. అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది. -
‘వందేభారత్పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
కొత్త రైళ్లు కూత వేసేనా?
» కోట్లాదిమంది భక్తులు సందర్శించే ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసికి కొంతకాలంగా హైదరాబాద్ నుంచి భక్తుల రద్దీ పెరిగింది. కానీ భక్తుల డిమాండ్ మేరకు రైళ్లు లేవు. » నగరవాసులు అయోధ్య బాలరాముడిని సందర్శించాలంటే ఖరీదైన ఐఆర్సీటీ ప్యాకేజీతో భారత్ గౌరవ్ రైళ్లు ఎక్కాల్సిందే. పైగా అది వారం, పది రోజుల పర్యాటక రైలు (టూరిస్ట్ ట్రైన్). జంటనగరాల నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లేందుకు ఎలాంటి సదుపాయం లేదు. » సికింద్రాబాద్ నుంచి దానాపూర్కు ఒకే ఒక్క రైలు అందుబాటులో ఉంది. ఇది ప్రతిరోజూ 180 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. తాజాగా ఈ ట్రై న్కు 2 సాధారణ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. కానీ ఈ రూట్లో మరో రైలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖ, బెంగళూరులకు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు మినహా హైదరాబాద్ మహా నగరానికి సంబంధించి ఈ పదేళ్లలో కొత్తగా పట్టాలెక్కిన రైళ్లు తక్కువే. ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్ ఈ నెలలోనే బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టింది. దీంతో ఈసారైనా కొత్త రైళ్లు కరుణిస్తాయేమోనని నగర ప్రయాణికు లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ అత్యధికంగా ఉన్న మార్గాల్లో కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనకు గ్రీన్సిగ్నల్ వే స్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఈ మార్గాల్లో భారీ డిమాండ్ .... ∙సికింద్రాబాద్ నుంచి బిహార్లోని దానాపూర్కు ఇప్పుడు ఒకే ఒక్క సూపర్ఫాస్ట్ రైలు ఉంది. కానీ ప్రతిరోజూ కనీసం రెండు రైళ్లకు సరిపడా ప్రయాణికులు పడిగాపులు కాస్తూనే ఉంటారు. ఈ రూట్లో అన్ని వర్గాల ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఏర్పాటు చేయవలసి ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి అయోధ్యకు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, బల్లార్షా, గోండియా, జబల్పూర్, కట్ని, ప్రయాగరాజ్, వారణాసిల మీదుగా వారానికి రెండుసార్లు బై వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును నడపాలనే డిమాండ్ ఉంది. ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే నగరానికి చెందిన భక్తులు ఐఆర్సీటీసీ రైళ్లపైన ఆధారపడవలసిన అవసరం లేకుండా నేరుగా అయోధ్య, వారణాసిలకు రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. » సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చి ( కోల్కతా )కి కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ రూట్లో ఒక బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ను ప్రవేశపెట్టవలసి ఉంది. దీంతో సికింద్రాబాద్ నుంచి కాజీపేట, బల్లార్షా, గోండియా, రాయ్పూర్, ఝర్సుగూడ, టాటానగర్ల మీదుగా ప్రయాణికులకు సదుపాయం లభిస్తుంది. కాజీపేట– బల్లార్షా సెక్షన్లో కోల్కతాకు వెళ్లేందుకు ప్రస్తుతం ఒక్క రైలు కూడా లేదు. » ప్రతి సంవత్సరం లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరికి వెళ్తారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్–శబరి ఎక్స్ప్రెస్ ఒక్కటే ఇక్కడినుంచి అందుబాటులో ఉంది. ఈ రూట్లో సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు ఒక బై వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వికారాబాద్, గుంతకల్, తిరుపతిల మీదుగా నడపాలని భక్తులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి గాం«దీధాం (గుజరాత్) వరకు బై వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశ పెట్టాలనే డిమాండ్ కూడా పెండింగ్లోనే ఉంది. తెలంగాణ సంపర్క్ క్రాంతి ఏమైనట్లు? హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు రాకపోకలు సాగించే విధంగా తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలును నడపాలనే ప్రతిపాదన పదేళ్లుగా పెండింగ్లోనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ప్రతిరోజూ వందలాది మంది వెయిటింగ్ లిస్ట్పై దృష్టి పెట్టి పడిగాపులు కాస్తుంటారు. మరోవైపు ఇటీవలి కాలంలో నగరవాసులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం రూట్లో ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ను కాజీపేట, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాంచీపురం, విల్లుపురం మీదుగా ప్రవేశపెడితే ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. రాజధానితో అనుసంధానం ఏదీ? రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి, ఉమ్మడి జిల్లా కేంద్రాలకు ట్రైన్ కనెక్టివిటీ అరకొరగానే ఉంది. ఇంటర్సిటీ రైళ్ల తరహాలో ప్రత్యేకంగా వివిధ జిల్లా కేంద్రాలకు రైళ్లను ప్రవేశపెట్టాలని చాలాకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి.సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకు కాజీపేట, పెద్దపల్లి పట్టణాల మీదుగా వందే మెట్రో రైలును ప్రవేశపెట్టాలి, అలాగే సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ మార్గంలో ఒక ఇంటర్ సిటీ రైలును నడపాలనే ప్రతిపాదన చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. అలాగే హైదరాబాద్ – బోధన్, కాచిగూడ–పుదుచ్చేరి తదితర మార్గాల్లో రైళ్లకు డిమాండ్ ఉంది. చర్లపల్లిని ప్రారంభిస్తారా? టెరి్మనల్గా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి స్టేషన్ ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ ఇంకా రైళ్ల రాకపోకలు అందుబాటులోకి రాలేదు. ఇది ప్రారంభమైతే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న దృష్ట్యా కూడా చర్లపల్లిని వినియోగంలోకి తేవలసి ఉంది. ఎన్నికల నేపథ్యంలో చర్లపల్లి ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలు వుదీరింది. ఇప్పటికైనా చర్లపల్లి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సదుపాయంగా ఉంటుంది. -
వైష్ణోదేవి దర్శనానికి వందేభారత్... ఖర్చెంత?
వైష్ణో దేవి భక్తులకు ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. ఇకపై అమ్మవారి దర్శనాన్ని వందేభారత్ రైలు ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. ఇది లగ్జరీ రైలు కావడంతో ప్రయాణికులకు పలు సౌకర్యాలు అందనున్నాయి. దీనిలో ప్రయాణించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు.వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢిల్లీ నుండి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కట్రాకు చేరుతుంది. అదే ఇతర రైలు అయితే ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి కట్రాకు సాయంత్రం ఆరు గంటలకు చేరుతుంది. అయితే ఈ మార్గంలో ప్రయాణించే వందే భారత్ ఛార్జీలు మిగిలిన రైళ్ల ఛార్జీల కంటే కొంచెం అధికం.ఢిల్లీ నుండి మాతా వైష్ణో దేవి కట్రా స్టేషన్కు ఇతర రైళ్ల టిక్కెట్ రూ. 990 వరకూ ఉంటుంది. అయితే వందే భారత్ చైర్ కార్లో రూ. 1610 టిక్కెట్తో కట్రాకు చేరుకోవచ్చు. ఎకనామిక్ చైర్ క్లాస్లో వెళితే ఒక్కో ప్రయాణికునికి రూ. 3005 చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్ రైలులో టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు సమీపంలోని రైల్వే స్టేషన్లోని కౌంటర్కు వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్, ఆఫ్లైన్లలోనూ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. -
వందే భారత్ రీషెడ్యూల్.. నాలుగు గంటల ఆలస్యం!
ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘వందే భారత్’ రైలు సుమారు నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరనుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. రేపు (ఆదివారం) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వచ్చే ట్రైన్ సుమారు 4.15 గంటలకు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకోనుంది.Train RescheduleTrain No.20833 Visakhapatnam - Secunderabad Vande Bharat express is rescheduled to leave at *10:00 hrs* on 23.06.2024 instead of its scheduled departure at 05:45 hrs. (Rescheduled by 4 hrs 15 Minutes) @RailMinIndia@EastCoastRail@SCRailwayIndia @drmvijayawada pic.twitter.com/fJjRmKUV5z— DRMWALTAIR (@DRMWaltairECoR) June 21, 2024 అయితే రేపు ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్ను ఉదయం 10 గంటలకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఇక.. రీషెడ్యూల్ కారణంగా ఆలస్యం జరగనున్నట్లు సమాచారం. దీంతో ట్రైన్ ఆలస్యానికి చింతిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం ‘ఎక్స్’లో వైరల్గా మారింది. -
వందే భారత్ రైలు ఆహారంలో బొద్దింక..
కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణ రైళ్లలో కంటే వందేభారత్లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఫుడ్ మాత్రం సరిగా ఉండటం లేదని.. పాచిపోయిన, పురుగులు పడిన ఆహారం వచ్చిందంటూ ప్రయాణికుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.తాజాగా ఓ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తుండగా దంపతులక వందే భారత్ రైలులో అందించిన ఫుడ్లో చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో ఈ విషయాన్ని తన బందువుల తరుపున విదిత్ వర్ష్నే అనే నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు. ‘ఈనెల 18వ తేదీన మా ఆంటీ, అంకుల్ వందేభారత్ రైలులో భోపాల్ నుంచి ఆగ్రా వరకూ ప్రయాణించారు. ఆ సమయంలో ఐఆర్సీటీసీ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది’ అని పోస్టు పెట్టారు.అంతేకాకుండా ఘటనపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్కు ట్వీట్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.అయితే ఈ ఘటనపై ఐఆర్సీటీసీ క్షమాపణలు చెప్పింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘మీకు కలిగిన అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్కు తగిన జరిమానా విధించాం’ అని తెలిపింది.Today on 18-06-24 my Uncle and Aunt were travelling from Bhopal to Agra in Vande Bharat.They got "COCKROACH" in their food from @IRCTCofficial. Please take strict action against the vendor and make sure this would not happen again @RailMinIndia @ AshwiniVaishnaw @RailwaySe pic.twitter.com/Gicaw99I17— Vidit Varshney (@ViditVarshney1) June 18, 2024 కాగా వందేభారత్ రైళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదేం తొలిసారి కాదు. గత మార్చిలో సిలిగురి నుంచి కోల్కతా వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న ప్రసూన్ దేవ్.. తన ఆహారంలో పురుగును గుర్తించాడు. -
స్లీపర్ వందేభారత్ ప్రత్యేకతలివే..
త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ రైలు గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ న్యూ జనరేషన్ రైలు పూర్తిగా భారత్లోనే తయారు కావడం విశేషం. ఇప్పటి వరకు వందేభారత్ రైలులో కేవలం చైర్ కార్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు స్లీపర్ వందే భారత్ మరిన్ని సౌకర్యాలతో మనముందుకు రానుంది. ఈ రైలుకు సంబంధించిన కార్యకలాపాలను ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024, ఆగస్టు 15న ఈ రైలు ట్రయల్ రన్ జరగనుంది.తాజాగా స్లీపర్ వందే భారత్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్చేస్తున్నాయి. భారీ గాజు అద్దాల కిటికీలు రైలుకు ప్రీమియమ్ లుక్ని ఇస్తున్నాయి. బోగీలోని పైసీటు కాస్త కిందకే ఉంది. దాన్ని ఎక్కడానికి అమర్చిన మెట్లలో గ్యాప్ తక్కువగా ఉంది. అంతేకాకుండా మెట్లపై కుషన్లు కూడా ఏర్పాటు చేశారు. బోగీలో ఒకవైపు మూడు సీట్లు ఉన్నాయి.సీటు రంగు లేత గోధుమ రంగులో ఉంది. ఫ్యాన్సీగా కనిపించే లైట్లను అమర్చారు. ఇది కోచ్కు మరింత అందాన్నిచ్చింది. రాబోయే ఐదేళ్లలో 500 వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను పట్టాలపై పరుగులు తీయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్స్
న్యూఢిల్లీ: త్వరలో వందేభారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఆగస్ట్ 15వ తేదీ నాటికి వీటి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఇవి మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ఇవి త్వరలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుని పట్టాలెక్కే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు అంటున్నాయి. వీటితోపాటుగా, తక్కువ దూరంలో ఉండే నగరాల మధ్య ప్రయాణాల కోసం వందే మెట్రో లేదా వందే భారత్ మెట్రోగా పిలిచే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే మొదలవనుందని చెబుతున్నారు. -
‘వందేభారత్’లో టికెట్లేని ప్రయాణికులు.. స్పందించిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ: భారత్ రైళ్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటిపై రాళ్లదాడులు జరగడం సర్వ సాధారణమైపోయింది. వందేభారత్కు సంబంధించి రోజూ ఏదో ఒక వార్త ఎక్కడో ఒక చోట చూస్తుంటాం. అయితే తాజాగా లక్నో-డెహ్రాడూన్ వందేభారత్ రైలులో టికెట్లేని ప్రయాణికులు చాలా మంది ఎక్కి టికెట్ ఉన్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగజేసిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది.ప్రీమియం రైలులో ఈ పరిస్థితి తలెత్తితే మిగిలిన రైళ్ల పరిస్థితి ఏంటని వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు బోగీలను కూడా పెంచాలని వారు రైల్వే శాఖను డిమాండ్ చేశారు.అయితే వందేభారత్ వీడియోపై రైల్వేశాఖ స్పందించింది. ఇది పాత వీడియో అని తెలిపింది. కొందరు రైతులు గతంలో బలవంతంగా రైలులోకి ఎక్కినపుడు తీసిన వీడియో అని వెల్లడించింది. ఇలాంటి పాత వీడియోలను మళ్లీ వైరల్ చేసి ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని కోరింది. -
వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
బీహార్లోని గయ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్లో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.గయ జిల్లాలో గల ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్ పరిధిలోని మాన్పూర్ జంక్షన్లో హోమ్ సిగ్నల్ దగ్గర ఓవర్హెడ్ వైరు తెగిపోయింది. ఈ నేపధ్యంలో రాంచీ-పట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్, రాంచీ-పట్నా జనశతాబ్ది ఎక్స్ప్రెస్లను ముందుజాగ్రత్త చర్యగా అంతకు ముందుగల స్టేషన్లలో నిలిపివేశారు. తెగిన వైర్ను సరిచేయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. దీంతో వందే భారత్, జన శతాబ్ది ఎక్స్ప్రెస్లలోని ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.మాన్పూర్ జంక్షన్ హోమ్ సిగ్నల్ సమీపంలో ఓవర్ హెడ్ వైరు తెగిపోవడంతో రైల్వే సిబ్బంది వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. దీంతో ట్రాక్షన్ డిపార్ట్మెంట్, ఇతర విభాగాలకు చెందిన బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి తొమ్మిది గంటలకు మరమ్మతు పనులు పూర్తయ్యాక ఈ మార్గంలోని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ను గుర్పా రైల్వే స్టేషన్లో, జన శతాబ్ది ఎక్స్ప్రెస్ను టంకుప్ప రైల్వే స్టేషన్లో నిలిపివేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. -
భూమి చుట్టూ 310 రౌండ్లు
సాక్షి, హైదరాబాద్: రైల్వే ఆధునికీకరణలో భాగంగా కొత్తగా ప్రారంభించిన వందేభారత్ రైళ్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లకు ఇప్పుడు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. 2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైన వందేభారత్ రైళ్లు ఇప్పటి వరకు తిరిగిన నిడివిని పరిశీలిస్తే.. 310 పర్యాయాలు భూపరిభ్రమణం చేసిన దూరంతో సమానమట. ఇది సరికొత్త రికార్డు అంటూ రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది. 105.57% ఆక్యుపెన్సీ రేషియోతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సగటు 105.57 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. వీటిలో కేరళలో తిరుగుతున్న వందేభారత్ రైలు సర్వీసు గరిష్టంగా 175.3 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసింది. వందేభారత్ రైళ్లలో తిరుగుతున్న ప్రయాణికుల్లో 26–45 ఏళ్ల మధ్య ఉన్నవారు 45.9 శాతంగా నమోదవుతోంది. కేరళలో తిరుగుతున్న వందేభారత్ సర్వీసుల్లో అత్యధికంగా 15.7 శాతం వృద్ధులు ప్రయాణిస్తున్నట్టు తేలింది. గోవాలో తిరుగుతున్న వందేభారత్ రైళ్లలో అత్యధికంగా 42 శాతం మంది మహిళా ప్రయాణికులుంటున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సర్వీసుల్లో గరిష్టంగా 67 శాతం మంది పురుషులు ఉంటున్నట్టు నమోదైంది. తెలంగాణలో నాలుగు రైళ్లుప్రస్తుతం తెలంగాణలో నాలుగు వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య 16 కోచ్లతో కూడిన వందేభారత్ రైలు సేవలు గతేడాది సంక్రాంతికి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రైలులో 120 శాతానికి మించి ఆక్యుపెన్సీ రేషియో ఉంటుండటంతో ఇటీవల ఇదే రూట్లో రెండో వందేభారత్ రైలు మొదలైన విషయం తెలిసిందే. రెండోది 8 కోచ్ల మినీఆరెంజ్ వందేభారత్. ఒకే రూట్లో రెండు వందేభారత్ రైళ్లు తిరగటం తొలుత కేరళలో మొదలైంది. రెండో ప్రయత్నంగా సికింద్రాబాద్– విశాఖ మార్గం ఎంచుకోవటం విశేషం. ఈమా ర్గం కాకుండా, సికింద్రాబాద్–తిరుపతి, కాచిగూడ–బెంగుళూరు మధ్య మరో రెండు సర్వీసులు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లు తిప్పాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఆమేరకు వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. ఇక త్వరలో రాత్రి వేళ తిరిగే స్లీపర్ వందేభారత్ రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి.సెమీ హైస్పీడ్ రైళ్లుగా...రైళ్ల వేగాన్ని గరిష్టస్థాయికి తీసుకెళ్తూ సెమీ హైస్పీడ్ రైళ్లుగా వీటిని ప్రారంభించారు. గంటకు 160 కి.మీ. వేగ సామర్థ్యమున్న ఈ రైళ్లు సగటున 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 వరకు సర్వీసులు (స్పెషల్ రైళ్లు కలుపుకొని) సేవలు అందిస్తున్నాయి. తొలి రైలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అన్ని వందేభారత్ రైళ్లు 18423 ట్రిప్పులు తిరిగాయి. వీటి మొత్తం నిడివి1,24,87,540 కిలోమీటర్లుగా నమోదైంది. ఇది 310 పర్యాయాలు భూమి చుట్టూ పరిభ్రమించిన దూరంతో సమానమని రైల్వే శాఖ పేర్కొంది. గత ఏడాది కాలంలో 97,71,705 కి.మీ.లు తిరిగినట్టు వెల్లడించింది. -
పరుగులకు మరో ‘వందేభారత్’ సిద్ధం
పట్టాలపై పరుగులు తీసేందుకు మరో వందేభారత్ రైలు సిద్ధంకానుంది. పట్నా- ఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఈ రైలు రాకతో పట్నా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి పట్నాకు కేవలం తొమ్మది గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం పట్నా-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్, తేజస్ ఎక్స్ప్రెస్ వంటి హై స్పీడ్ రైళ్లు ఢిల్లీ నుండి పట్నా చేరుకోవడానికి 13 గంటలు పడుతోంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రైల్వే బోర్డు త్వరలో పట్నా- ఢిల్లీ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనుంది. అంటే త్వరలోనే పట్నా- న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ విడుదల కానున్నది. భారతీయ రైల్వే తొలిసారి ఢిల్లీ-హౌరా లైన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడిపింది. అయితే అది గయ జంక్షన్ మీదుగా ఢిల్లీకి చేరుతుంది. అయితే ఇప్పుడు మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ను బీహార్ రాజధాని పట్నా నుండి నడపడానికి ప్లాన్ చేస్తున్నది.న్యూఢిల్లీ- పట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ వేగం గంటకు 130 కి.మీ. వందే భారత్ పట్నా నుండి అర్రా, బక్సర్ మీదుగా 9 గంటల ప్రయాణంతో ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలులో ఒక కోచ్ ఎగ్జిక్యూటివ్ చైర్కార్ క్లాస్, ఏడు కోచ్లు ఎయిర్ కండిషన్డ్ చైర్కార్గా ఉండవచ్చు. ఎగ్జిక్యూటివ్ చైర్కార్లో 52 సీట్లు, ఎయిర్ కండిషన్డ్ చైర్కార్లో 478 సీట్లు ఉండనున్నాయి. కాగా పట్నా-ఢిల్లీ మార్గంలో వందేభారత్ను నడిపే విషయమై భారత రైల్వే నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. -
‘వందేభారత్’ నత్తనడక..
హైదరాబాద్కు చెందిన ప్రసాద్ విజయవాడకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చి వందేభారత్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ, ఆ రోజు రైలు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. తక్కువ టికెట్ ధర ఉన్న రైళ్ల కంటే ఆలస్యంగా అది విజయవాడకు చేరింది. వందేభారత్ సర్విసు మొదలైన 16 నెలల కాలంలో ఈ తరహా సమస్యలు తక్కువే, కానీ, ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. వెంటవెంటనే ఏర్పడుతుండటం ఇటు ప్రయాణికులకు చికాకు తెప్పిస్తుండగా, రైల్వే అధికారులను కలవరపెడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే ఆధునికతకు అద్దంపడుతూ దూసుకొచ్చిన ‘వందేభారత్’కూ సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. రైళ్లలో సాంకేతిక సమస్యలు సాధారణమే అయినా, క్రమంగా ఆ సమస్య పెరుగుతోంది. దూర ప్రాంతాల మధ్య తిరిగే సాధారణ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు మూడు జతల రేకు(ఓ రైలు సెట్) ఉంటుంది.ప్రయాణ సమయం దాదాపు 26 గంటలు తీసుకునే హైదరాబాద్–ఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ను తీసుకుంటే.. హైదరాబాద్లో ఉదయం ఒక రైలు బయలు దేరగా, దాని ఒక జత రైలు అదే రోజు ఢిల్లీలో బయలుదేరుతుంది. మరో జత రైలు దారిలో ఉంటుంది. తక్కువ దూరం తిరిగే వాటికి రెండు జతలుంటాయి. » హైదరాబాద్–విశాఖపట్నంలాంటి సాధారణ దూరం తిరిగే (సగం రోజు ప్రయాణ సమయం) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను తీసుకుంటే.. ఒక రైలు హైదరాబాద్లో బయలుదేరుతుంటే, అదే సమయానికి దాని జత రైలు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. » హైదరాబాద్లో ఉదయం బయలుదేరే తిరుపతి వందేభారత్ రైలు, అదే రోజు మధ్యాహ్నం తిరుపతి చేరుకొని, కాసేపటికే అక్కడ బయలుదేరి రాత్రి హైదరాబాద్కు చేరుకుంటుంది. దేశంలోని అన్ని వందేభారత్ రైళ్లది ఇదే తీరు. ఇక్కడే ఇప్పుడు సమస్య ఏర్పడుతోంది. ఒక చోట రైలు బయలుదేరేప్పుడు సాంకేతిక సమస్య ఏర్పడి ఆలస్యంగా బయలుదేరితే, గమ్యస్థానం చేరి, తిరిగి అక్కడ బయలుదేరేందుకు జాప్యం తప్పటం లేదు. » ఈనెల 16న విశాఖపట్నంలో హైదరాబాద్ వచ్చే వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. విజయవాడలో మరో రెండు గంటలు ఆలస్యమైంది. వెరసి ఐదు గంటలు ఆలస్యంగా హైదరాబాద్ చేరుకుంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్లో మధ్యాహ్నం 3 గంటలకు తిరుగుప్రయాణం ఉండాల్సి ఉండగా, ఐదు గంటలు ఆలస్యంగా రాత్రి 8 గంటలకు ఆ రైలు బయలుదేరాల్సి వచ్చింది. ఒక కోచ్లో సాంకేతిక సమస్య తలెత్తితే రైలు ఆగిపోవాల్సిందే.. ఇక వందేభారత్ డిజైన్ కూడా ఈ జాప్యానికి మరో కారణమవుతోంది. ఇది సంప్రదాయ ఎక్స్ప్రెస్ రెళ్లకు భిన్నంగా ఉంటుంది. డెమూ, మెమూ తరహాలో రెండు ఇంజిన్లు రైలులో అంతర్భాగంగా ఉంటాయి. మూడునాలుగు కోచ్లు కలిపి ఒక సెట్గా ఉంటుంది. దీనికి పవర్కార్ జత కలిసి ఉంటుంది. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఇదే డిజైన్తో ఉంటాయి. ఓ కోచ్లో సాంకేతిక సమస్య తలెత్తితే, ఆ కోచ్ ఉండే సెట్ మొత్తాన్ని తొలగించి దాని స్థానంలో మరో సెట్ చేర్చి రైలును పంపేస్తారు. తర్వాత.. సాంకేతిక సమస్య తలెత్తిన కోచ్ను డిపోనకు తీసుకెళ్లి మరమ్మతు చేస్తారు. ఇందుకోసం స్పేర్ కోచ్లను అందుబాటులో ఉంచుతారు. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సర్విసుకు 12 కోచ్లతో కూడిన రెండు రేక్లు స్పేర్ విధుల్లో ఉన్నాయి. కానీ వందేభారత్కు స్పేర్ చోక్ సెట్లు లేవు. ఓ కోచ్లో సమస్య తలెత్తితే దానికి మరమ్మతు చేసేవరకు మొత్తం రైలును నిలిపివేయాల్సిందే. వారంరోజుల క్రితం విశాఖపట్నం నుంచి ఐదు గంటలు ఆలస్యంగా రావటానికి ఇదే కారణమైంది. -
ఇంటర్సిటీల మధ్య వందే మెట్రోలు!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మార్గాల్లోనే!హైదరాబాద్ నుంచి నల్లగొండ మీదుగా గుంటూరు, సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కరీంనగర్, సికింద్రాబాద్–కర్నూలు, కాచిగూడ–కర్నూలు, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొదట ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–విజయవాడ వంటి రూట్లలో వందే మెట్రోలను ప్రవేశపెట్టొచ్చు. అనంతరం దశలవారీగా ఇతర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమైన స్టేషన్లలోనే హాల్టింగ్.. వందే మెట్రో రైళ్లు ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తున్న మెట్రో రైళ్ల తరహాలోనే ఉంటాయి. మొదట 12 కోచ్లతో ప్రారంభించి డిమాండ్కు అనుగుణంగా ఆ తరువాత 16 కోచ్ల వరకు పెంచనున్నారు. మెట్రో రైళ్ల తరహాలోనే పూర్తిగా ఏసీ సదుపాయం, ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకొని మూసుకొనే ఏర్పాటు ఉంటుంది. ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు ముఖ్యమైన స్టేషన్లలోనే ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం పుష్పుల్ రైళ్లకు ఉన్నట్లుగానే ముందు, వెనుక రెండు ఇంజన్లు ఉంటాయి. దీంతో ఈ రైళ్లను ప్రత్యేకంగా పిట్ లైన్లకు తరలించాల్సిన అవసరంలేదు. తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణ సేవలను అందించే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు ఉండవు... ఈ రైళ్లన్నీ సాధారణ రైళ్ల తరహాలోనే సేవలు అందిస్తాయి. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు కొనుక్కొని బయలుదేరొచ్చు. కూర్చొని ప్రయాణం చేసేందుకు వీలుగా సీట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే వీటిలో కొద్దిగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలనుకొనే వారికి ఈ రైళ్లలో ప్రయాణం లాభదాయకం. వివిధ మార్గాల్లో నడిచే ఇంటర్ సిటీ రైళ్ల స్థానంలోనే వందే మెట్రోలు రానున్నాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్సిటీ ట్రైన్ యథాతథంగా సేవలను కొనసాగించనుంది. -
త్వరలో తొలి స్లీపర్ వందేభారత్.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
దేశంలోని తొలి స్లీపర్ వందేభారత్ త్వరలో పట్టాలపై పరుగులు తీయనుంది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్- న్యూఢిల్లీ మధ్య స్లీపర్ వందే భారత్ను నడపడానికి ఈశాన్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇండియన్ రైల్వే టైమ్ టేబుల్ కమిటీ (ఐఆర్టీటీసీ) ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జైపూర్లో సమావేశం కానుంది. దీనిలో ఈ రైలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రైల్వే జోన్ల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.. కొత్త రైళ్లను నడపడం, ట్రిప్పులను పెంచడం, రూట్లను మార్చడం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈశాన్య రైల్వే రూపొందించిన ప్రతిపాదన ప్రకారం నూతన స్లీపర్ వందేభారత్ రైలు వారానికి మూడు రోజులు నడవనుంది. గోరఖ్పూర్ నుంచి రాత్రి వేళల్లో ఈ రైలును నడపాలని ప్రతిపాదించారు. ఈ రైలు గోరఖ్పూర్ నుండి న్యూఢిల్లీకి 12 గంటల్లో చేరుకుంటుంది. ఈ సమావేశంలో ఈ రైలుకు ఆమోదం లభిస్తే 2024, జూలై నుంచి ఈ రైలు రాకపోకలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోరఖ్పూర్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా రైలు నడపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం గోరఖ్పూర్ నుండి ప్రయాగ్రాజ్ వరకు వందే భారత్ రైలు నడుస్తోంది. నూతన ప్రతిపాదనల ప్రకారం స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ గోరఖ్పూర్ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. అంటే గోరఖ్పూర్ నుంచి ఢిల్లీకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవచ్చు. -
‘ఆటోమేటిక్ డోర్కు అలవాటు పడలేదు’
‘వందే భారత్’ రైలులో ప్రయాణించాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఆధునిక సౌకర్యాలతో తళతళలాడుతున్న ఈ రైలు ఎక్కాలని చాలామంది తహతహలాడిపోతుంటారు. అయితే ఈ రైలులోని కొన్ని సాంకేతిక విషయాలు తెలియక కొందరు చిక్కుల్లో పడుతున్నారు. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా రైలు ప్రయాణానికి బయలుదేరినప్పుడు వారిని దిగబెట్టేందుకు తోడుగా ఎవరో ఒకరు వెళుతుంటారు. ఇదేవిధంగా ఒక భర్త తన భార్యను వందేభారత్ రైలు ఎక్కించేందుకు వెళ్లాడు. ఆమె తన సీటులో కూర్చున్నాక భర్త కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. అయితే ఇంతలో వారుంటున్న కోచ్ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. మరి అప్పుడేం జరిగింది? వివరాల్లోకి వెళితే ఒక మహిళ తన కుమార్తె దగ్గర ఉండేందుకు తొలిసారిగా వందే భారత్ రైలులో గుజరాత్లోని వడోదర నుంచి ముంబైకి బయలుదేరింది. ఆ మహిళకు తోడుగా స్టేషన్ వరకూ ఆమె భర్త వచ్చాడు. లగేజీని ఆమె కూర్చున్న సీటు దగ్గర ఉంచి, కాసేపు కూర్చున్నాడు. ఇంతలో రైలు తలుపులు మూసుకుపోయిన శబ్ధం వినిపించింది. ఆ వ్యక్తి రైలు దిగకముందే డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి టీసీతో మాట్లాడి రైలును ఆపాలనుకున్నాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో రైలు వేగం అందుకుంది. దీంతో ఆ వ్యక్తి తనకు ఇష్టం లేకపోయినా తదుపరి స్టేషన్ వచ్చే వరకు ప్రయాణించవలసి వచ్చింది. అతని కుమార్తె తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్ట్ను ఇప్పటివరకూ కొన్ని లక్షలమంది వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్.. ‘అతను స్టేషన్లోని నో పార్కింగ్ జోన్లో పెట్టిన తన కారు గురించి ఆందోళన చెందుతున్నాడేమోనని’ రాయగా, మరొక యూజర్ ‘ఇది అతనికి అందమైన జ్ఞాపకంగా మిగులుతుందని’ రాశాడు. మరో యూజర్ ‘అతనింకా ఆటోమేటిక్ డోర్కు అలవాటుపడలేదని’ పేర్కొన్నాడు. My mother is travelling for the first time in Vande Bharat from Vadodara to Mumbai today to visit me. As it is going to be a longer stay, she had two big bags to travel with. (1/4) — Kosha (@imkosha) April 2, 2024 -
‘వందేభారత్’ వేళలు మార్చండి
సాక్షి, హైదరాబాద్: ‘సికింద్రాబాద్ – విశాఖ’ వందేభారత్ రైలు టైమింగ్ మార్చాలనే డిమాండ్ రైల్వే ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 5:05 గంటలకే బయలుదేరుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరానికి నలువైపులా ఉన్నవారు తెల్లవారుజామునే స్టేషన్కు చేరుకోవాలి. అయితే ఆ సమాయానికి క్యాబ్లు, ఆటోలు బుక్ కావడం లేదు. ఒకవేళ బుక్ అయినా ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో ఆ రైలు టైమింగ్ మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. సికింద్రాబాద్–విశాఖ మధ్య ఈ నెల 12న రెండో వందేభారత్ రైలుకు ప్రారంభించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ రైలు ఉదయం 6 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి బయలు దేరాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో ఇతర రైళ్లు నడుస్తుండటంతో ఈ రైలును నడపలేని దుస్థితి నెలకొంది. మరో గంట తర్వాత కాస్త నిడివి ఉంది. కానీ, ఉదయం ఏడున్నరకు లింగంపల్లి–విశాఖ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉదయం 7.10కి సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. అది కూడా వందేభారత్ తరహాలో చైర్కార్ ఎక్స్ప్రెస్ రైలు. దీంతో విశాఖపట్నానికి రెండు చైర్కార్ ఎక్స్ప్రెస్లు ఒకేసారి బయలుదేరాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో వందేభారత్ రైలును ఉదయం 5.05 సమయాన్ని ఖరారు చేశారు. అయితే ఆ సమయం ప్రయాణికులకు అసౌకర్యంగా మారింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు ఉదయం ఐదింటిలోపు చేరుకోవాలంటే, దూరప్రాంతాల నుంచి వచ్చే వారు ఉదయం నాలుగింటికల్లా ఇళ్లలో బయలుదేరాలి. ఆ సమయాల్లో ఆటోలు, క్యాబ్లు తక్కువగా ఉండటంతో వాటి బుకింగ్ ఇబ్బందిగా మారింది. మూడోలైన్ పూర్తయితేనే... విశాఖకు నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లు వరంగల్ మీదుగా తిరుగుతున్నాయి. ఆ మార్గంలో మూడో లైన్ అందుబాటులో లేదు. ఉన్న రెండు లైన్లమీదుగా వందల సంఖ్యలో రైళ్లు పరుగుపెడుతున్నాయి. ప్రయాణికుల రైళ్లు, సరుకు రవాణా రైళ్లు ఆ రెండు లైన్లమీదుగానే నడపాల్సి వస్తోంది. ఈమార్గంలో మూడోలైన్ పనులు 2017 నుంచి న డుస్తున్నా..తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడోలైన్ పూర్తయి తే, మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలవుతుంది. ప్రయాణికుల కు అనువైన వేళల్లో నడిపేందుకూ అవకాశం కలుగుతుంది. ఆ రూట్లో నడపలేక.. విశాఖపట్నం మొదటి వందేభారత్ రైలును వరంగల్ రూట్లో నడుపుతున్నందున, రెండో వందేభారత్ను నల్లగొండ–నడికుడి– గుంటూరు మార్గంలో తిప్పాలని తొలుత భావించారు. కానీ, ఆ మార్గం ప్రస్తుతం సింగిల్ లైన్తో ఉంది. ఎదురుగా ఓ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తే, మిగతా వాటిని ఆయా ప్రాంతాల్లోని స్టేషన్లలో నిలపాలి. ఈ మార్గంలో తిరుపతి వందేభారత్ రైలు నడుస్తోంది. ఆ సింగిల్లైన్ను దాటే సమయంలో చాలా రైళ్లు క్రాసింగ్ సమయంలో నిలిచిపోవాల్సి వస్తోంది. దీంతో ఆ రూట్లో ఇబ్బందులు ఉన్నాయని, వరంగల్రూట్కు మార్చారు. అయినా వెయిటింగ్ జాబితానే.. విశాఖకు నడిచే మొదటి వందేభారత్ రైలు సికింద్రాబాద్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. దానికి దాదాపు 114 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. కనీసం ఐదారు రోజుల వెయిటింగ్ లిస్టు ఉంటోంది. దీనికి ఆదరణ బాగుందనే రెండో వందేభారత్ రైలు ప్రారంభించారు. ఇది కూడా వందశాతం ఆక్యుపెన్సీ రేషియో దాటి నడుస్తోంది. నాలుగు రోజుల వెయిటింగ్ లిస్టు ఉంటోంది. -
ఉత్తరప్రదేశ్లో ‘వందేభారత్’పై రాళ్ల దాడి!
ఉత్తరప్రదేశ్లో వందేభారత్ రైలుపై అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనతో రైల్వేశాఖలో కలలకం చెలరేగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని లక్నో నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై ఈ రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై బయటి నుంచి ఎవరో రాళ్లు విసిరారు. దీంతో రైలులోని సీ-3 కోచ్ కిటికీ అద్దం బద్దలయ్యింది. రైలు టెక్నీషియన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. -
పట్టాలెక్కిన సికింద్రాబాద్– విశాఖ రెండో వందేభారత్
సాక్షి, హైదరాబాద్/ రాంగోపాల్పేట్: సికింద్రాబాద్– విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించటం సహా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పూర్తయిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. మంగళవారం ఉదయం ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి అహ్మదాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజె క్టులను జాతికి అంకితం చేశారు. గతేడాది సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రారంభించిన తొలి వందేభారత్ రైలు కిక్కిరిసి ప్రయాణిస్తుండటంతో దానికి అద నంగా ఇటీవలే రైల్వే బోర్డు రెండు నగరాల మధ్య రెండో వందేభారత్ రైలును మంజూరు చేసింది. సికింద్రాబాద్లో ఉద యం ప్రారంభమయ్యే ఈ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. కొల్లాం–తిరుపతి ఎక్స్ప్రెస్ను కూడా ప్రా రంభించారు. కాజీపేట– విజయవాడ, కాజీపేట– బలార్షా మధ్య పూర్తయిన మూడో లైన్ భాగాలను, 14 డబ్లింగ్ లైన్ల ను, కొన్ని బైపాస్, గేజ్ మార్పిడి లైన్లు, పాత రైల్ కోచ్లను, స్టేషన్లలో ఏర్పాటుచేసిన రెస్టారెంట్లను, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 193 స్టేషన్లలో ఏర్పాటు చేసిన వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ కేంద్రాలను, తొమ్మిది పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్సు షెడ్లు, రెండు జన్ ఔషధి కేంద్రాలను ఆయన జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్లో చోటుచేసుకుంటున్న పురోగతిని ఆయన వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా.. ప్రధాని అహ్మదాబాద్ నుంచి నిర్వహించిన ఈ వర్చువల్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనటం విశేషం. సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, డీఆర్ఎం కుమార్, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జన ఔషధి షాపులో తక్కువ ధరకు మందులు సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన జన ఔషధి, స్థానిక ఉత్పత్తుల కేంద్రాలను కిషన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు, తక్కువ ధరకు మందులు అందుబాటులో ఉండేలా జన ఔషధి షాపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్, రూ.350 కోట్లతో నాంపల్లి స్టేషన్ల పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. చర్లపల్లి టెర్మినల్ పనులు చాలావరకు పూర్తయ్యాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కిషన్రెడ్డి తెలిపారు. -
రైలు పట్టాలపై జీవితం ఆరంభించా: ప్రధాని మోదీ
అహ్మదాబాద్/పోఖ్రాన్: రైలు పట్టాలపైనే తన జీవితాన్ని ప్రారంభించానని, రైల్వే శాఖకు సంబంధించిన కష్టాలు, ప్రయాణికుల ఇబ్బందులన్నీ తనకు తెలుసని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నరకం లాంటి పరిస్థితి నుంచి రైల్వేలను బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైల్వే రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వాలు రైల్వేశాఖ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని, సొంత రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయని విమర్శించారు. 21వ శతాబ్దంలో రైల్వేల ప్రగతిని దృష్టిని పెట్టుకొని రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేశామని వెల్లడించారు. తద్వారా రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మంగళవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించారు. సబర్మతి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.1,06,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. పది నూతన వందేభారత్ రైళ్లను ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో సికింద్రాబాద్–విశాఖపట్నం, పూరీ–విశాఖపట్నం వందేభారత్ రైళ్లు కూడా ఉన్నాయి. తిరుపతి–కొల్లాం స్టేషన్ల మధ్య కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాదు 2004–2014తో పోలిస్తే గత పదేళ్లలో తమ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి 6 రెట్లు అధికంగా ఖర్చు చేసిందని ప్రధానమంత్రి అన్నారు. గతంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణ వ్యవహారంగా ఉండేదన్నారు. 2014 వరకు దేశంలో కేవలం 35 శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణకు నోచుకున్నాయని గుర్తుచేశారు. రైళ్లలో ప్రయాణానికి రిజర్వేషన్ దొరకడం చాలా కష్టంగా ఉండేదని, టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిల్చునేవారని, ఏజెంట్లు కమీషన్లు వసూలు చేసేవారని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. దేశ ప్రగతి అనే మిషన్లో భాగంగానే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు చేపడుతున్నామని, అంతేతప్ప కొందరు ఆరోపిస్తున్నట్లు ఎన్నికల్లో లబ్ధి కోసం ఎంతమాత్రం కాదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారసత్వ సంపదను కాపాడుకోవాలి సొంత వారసత్వ సంపదను కాపాడుకోని దేశానికి భవిష్యత్తు ఉండదని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. మన దేశ వారసత్వ సంపదను కాపాడే విషయంలో గత ప్రభుత్వాలు ఏమాత్రం నిబద్ధత చూపలేదని విమర్శించారు. మంగళవారం అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో దండి యాత్ర వార్షికోత్సవంలో మోదీ పాల్గొన్నారు. రూ.1,200 కోట్లతో అమలు చేయనున్న గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్ప్లాన్ను ప్రారంభించారు. ఆధునీకరించిన కోచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఆరంభించిన సబర్మతి ఆశ్రమం కేవలం మన దేశానికే కాదు, మొత్తం మానవాళికే వారసత్వ సంపద అని తేల్చిచెప్పారు. పోఖ్రాన్లో అబ్బురపర్చిన ‘భారత్ శక్తి’ భారతదేశ ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి పోఖ్రాన్ ఒక ఘనమైన సాక్షి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రాన్లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం భారత త్రివిధ దళాలు ‘భారత్ శక్తి’ పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించారు. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ విన్యాసాలను మోదీ ప్రత్యక్షంగా తిలకించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రక్షణ పరికరాల విన్యాసాలు చూపరులను అబ్బురపర్చాయి. తేజస్, ఏఎల్ఎస్ ఎంకే–4 యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు అర్జున్, కె–9 వజ్ర, ధనుష్ వంటివి ఆకట్టుకున్నాయి. పినాకా ఉపగ్రహ వ్యవస్థతోపాటు డ్రోన్ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఆకాశంలో మన యుద్ధ విమానాల గర్జనలు, నేలపై మన జవాన్ల సాహసాలు నవ భారత్(న్యూ ఇండియా)కు ఆహ్వానం పలుకుతున్నామని మోదీ పేర్కొన్నారు. -
10 ‘వందే భారత్’లకు ప్రధాని మోదీ పచ్చ జెండా!
దేశంలోని ప్రజలకు మరో పది నూతన వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 10 నూతన వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అలాగే ఇతర రైల్వే సేవలను కూడా స్వాగతించారు. ‘రైల్వేని నరకం నుంచి బయటపడేశాం’ ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతీయ రైల్వేలను నరకం లాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. తమ సంకల్ప శక్తికి సజీవ నిదర్శనం రైల్వేల అభివృద్దేనని అన్నారు. దేశంలోని యువత ఎలాంటి దేశం, ఎలాంటి రైళ్లు కావాలో నిర్ణయించారన్నారు. తమ ఈ పదేళ్ల కృషి కేవలం ట్రైలర్ మాత్రమేనని, మనం మరింత ముందుకు సాగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ కూడా పాల్గొన్నారు. 10 రైళ్ల వివరాలు ఇవే.. అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ సికింద్రాబాద్-విశాఖపట్నం మైసూరు- డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై) పాట్నా- లక్నో న్యూ జల్పాయిగురి-పాట్నా పూరీ-విశాఖపట్నం లక్నో – డెహ్రాడూన్ కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు రాంచీ-వారణాసి ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్) మరోవైపు.. కొత్తవలస-కోరాపుట్,.. కోరాపుట్-రాయగఢ్ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్లో కొన్ని పనులు ప్రారంభించారు మోదీ. మొత్తం 85వేల కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. Honourable PM @narendramodi ji virtually flags off Second Vande Bharat Express between Secunderabad & Visakhapatnam, facilitating swift connectivity between #Telangana & #AndhraPradesh.#VandebharatExpress #ModiKiGuarantee pic.twitter.com/t8nDqOlqzi — Dr K Laxman (Modi Ka Parivar) (@drlaxmanbjp) March 12, 2024 ప్రారంభించిన కిషన్రెడ్డి సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా... సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య రెండో రైలు కాగా... మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది. Live: Flagging off 4th Vande Bharat Train From Telangana, Secunderabad - Visakhapatnam (Train Number 20707), Secunderabad Railway Station. https://t.co/wkmmWP0wth — G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 12, 2024 మహాత్మునికి ప్రధాని మోదీ నివాళులు అహ్మదాబాద్లోని సబర్మతిలోగల మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొచరబ్ ఆశ్రమాన్ని, గాంధీ ఆశ్రమం మెమోరియల్ మాస్టర్ ప్లాన్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. నేడు (మంగళవారం) ప్రధాని మోదీ గుజరాత్, రాజస్థాన్లలో పర్యటిస్తున్నారు. #WATCH | Prime Minister Narendra Modi offers floral tributes to Mahatma Gandhi at Mahatma Gandhi Ashram at Sabarmati, in Ahmedabad, Gujarat. He will inaugurate Kochrab Ashram and launch the Master plan of Gandhi Ashram Memorial here. pic.twitter.com/x95WUUF7Tt — ANI (@ANI) March 12, 2024 -
ఇకపై కాశీ నుంచి అయోధ్యకు మూడు గంటలే..
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు కాశీ నుండి అయోధ్యకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలోని ప్రజలకు మరో కానుక అందించారు. ఇకపై వారణాసికి వచ్చే భక్తులు కేవలం మూడు గంటల్లో ‘వందే భారత్’ సాయంతో అయోధ్య ధామ్ చేరుకోగలుగుతారు. ప్రధాని మోదీ నేడు (మంగళవారం) ఈ నూతన వందేభారత్ రైలుకు పచ్చ జెండా చూపించనున్నారు. మంగళవారం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వందే భారత్ బీహార్లోని పట్నా నుండి అయోధ్య ధామ్, లక్నో మీదుగా వారణాసి కాంట్ రైల్వే స్టేషన్కు చేరుకోనుంది. ఇది కాశీ పర్యాటకులు అయోధ్యకు వెళ్లడాన్ని సులభతరం చేయనుంది. ఈ వందే భారత్ పట్నా నుండి వారణాసి కాంట్ స్టేషన్కు ఉదయం 9.30 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. కాశీ నుండి అయోధ్య కు భక్తులు కేవలం మూడు గంటల్లో చేరుకోగలుగుతారు. -
Vande Bharat: సికింద్రాబాద్–విశాఖ మధ్య వందేభారత్–2
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సదుపాయాలు, అత్యధిక వేగంతో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీసే వేళైంది. ఈ నెల 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్లో ఈ ట్రైన్ను వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో నిర్వహించనున్న ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్– విశాఖ మధ్య ఇప్పటికే నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు వంద శాతానికిపైగా ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా రైల్వేశాఖ ఈ రూట్లో రెండోరైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 13న విశాఖపట్టణం నుంచి, 15న సికింద్రాబాద్ నుంచి వందేభారత్ సెకెండ్ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 12వ తేదీ నుంచి ప్రయాణాలను బుక్ చేసుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖకు సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో చేరుకోనుంది. ఈ ట్రైన్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో నిమిషం నుంచి 2 నిమిషాలపాటు హాల్టింగ్ సదుపాయం ఉంది. వందేభారత్ ఎక్స్ప్రెస్ వేళలు ► సికింద్రాబాద్–విశాఖపట్టణం(20707) వందేభారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇది ఉదయం 6.39 గంటలకు వరంగల్, 7.43 గంటలకు ఖమ్మం, 9.05 గంటలకు విజయవాడ, 11 గంటలకు రాజమండ్రి, ఉదయం 11.43 గంటలకు సామర్లకోట స్టేషన్లకు చేరుకుంటుంది. ► విశాఖపట్టణం–సికింద్రాబాద్ (20708) వందేభారత్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 4.03 గంటలకు సామర్లకోట, 4.38 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6.40 గంటలకు విజయవాడ, రాత్రి 8.03 గంటలకు ఖమ్మం, 10.03 గంటలకు వరంగల్, రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. -
త్వరలో అందుబాటులోకి వందే భారత్ స్లీపర్ రైలు
దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగుళూరులో బీఈఎంఎల్ తయారు చేసిన వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్ రైలు కార్ బాడీ స్ట్రక్చర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ చైర్ కార్, నమో-భారత్ (రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్), అమృత్ భారత్ రైలు (పుష్-పై రైళ్లు) విజయవంతమయ్యాక తదుపరి వందే భారత్ స్లీపర్, వందే మెట్రో రైళ్లను పరిచయం చేయడమేనని అన్నారు. Furnishing of Vande Sleeper started! pic.twitter.com/itYaSQyNG2 — Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 9, 2024 వందే భారత్ స్లీపర్ వెర్షన్లో పురోగతి ఆశాజనకంగా ఉందని, పూర్తి నిర్మాణం, పైకప్పుతో సహా కొత్త డిజైన్ పూర్తయిందని వైష్ణవ్ చెప్పారు. ఫర్నిషింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేయాలని మేము భావిస్తున్నామని వెల్లడించారు. -
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 12న వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు మరో వందే భారత్ రైలు నడపనున్నారు. గురువారం మినహా మిగిలిన ఆరు రోజులు వందే భారత్ నడవనుంది. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకి వందేభారత్( రైల్ నంబర్-20707) విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 11.20కి వందేభారత్ ( రైలు నంబర్-20708) సికింద్రాబాద్ చేరుకోనుంది. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్- విశాఖ మధ్య మరొక వందేభారత్ రైలును కేటాయించారు. విశాఖ- పూరి మధ్య ఈ నెల 12 నుంచి వందే భారత్ పరుగులు పెట్టనుంది. శనివారం మినహా మిగిలిన ఆరు రోజులలో పూరి- విశాఖ మధ్య వందేభారత్ నడవనుంది. పూరిలో ఉదయం 5.15 బయలుదేరి.. ఉదయం 11.30 గం.లకి విశాఖ చేరుకోనున్న వందేభారత్ ( రైలు నంబర్- 20841).. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.40కి బయలుదేరి రాత్రి 9.55 గంటలకి పూరి వందేభారత్ ( రైలు నంబర్- 20842) చేరుకోనుంది. కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరంలో స్టాపేజ్లు ఉన్నాయి. ఇదీ చదవండి: ఇంగ్లిష్.. భవిత భేష్ -
మరో ‘వందే భారత్’ ట్రయల్ రన్ విజయవంతం
ఇది రామ భక్తులకు పండుగలాంటి వార్త. అయోధ్యలోని రాములోరిని చూసేందుకు యూపీ భక్తులు ఇకపై కాషాయ రంగులో మెరిసిపోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ వందే భారత్ రైలు యూపీ రాజధాని పట్నా నుండి అయోధ్య మీదుగా లక్నో వరకు నడుస్తుంది. ఈ రైలుకు సంబంధించిన తుది ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ ట్రయల్ రన్లో ఈ రైలు నిర్ణీత సమయానికి ముందుగానే లక్నోకు చేరుకుంది. ఈ రైలును మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. కాగా అధికారికంగా ఈ రైలు టైమ్ టేబుల్ను ఇంకా విడుదల చేయలేదు. పట్నా నుంచి అయోధ్య మీదుగా లక్నో వరకు నిర్వహించిన ఈ రైలు ట్రయల్ రన్లో నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందుగా వారణాసి, 12 నిమిషాల ముందుగా అయోధ్య , 20 నిమిషాల ముందుగా లక్నో చేరుకుంది. ట్రయల్ రన్లో ఈ రైలు ఉదయం 6:05 గంటలకు పట్నా నుంచి లక్నోకు బయలుదేరింది. ఈ సమయంలో రైలు వేగం 130 కి.మీ.గా ఉంది. -
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు రద్దు
సాక్షి, సికింద్రాబాద్/ విశాఖపట్నం: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) విజ్ఞప్తి అందించింది. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు నేడు రద్దయినట్లు తెలిపింది. విశాఖ పట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలుతోపాటు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ విశాఖ పట్నం వందే భారత్ రైలు కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. రేక్ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులువ వెల్లడించారు. అయితే ప్రత్యామ్నాయంగా ప్రయాణికుల సౌకర్యం కోసం అధికారులు ప్రత్యేక రైలును (08134A) ఏర్పాటు చేశారు. ఇది మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని, రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలుకు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. వరంగల్, ఖమ్మంలో ఒక్క నిమిషం.. రాజమండ్రి, సామర్లకోటలో రెండు నిమిషాలు.. విజయవాడ స్టేషన్లో ఐదు నిమిషాలు ఈ రైలు ఆగుతుంది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. మరోవైపు ఇలా అనూహత్యం, రైలురద్దయినట్లు ప్రకటించడం సరైనది కాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
పట్టాలెక్కనున్న ‘స్లీపర్ వందే భారత్’.. రూట్ ఇదే!
వందే భారత్ ఎక్స్ప్రెస్ అనంతరం ‘స్లీపర్ వందే భారత్’ త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం పలువురు ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వందే భారత్ మాదిరిగానే ‘స్లీపర్ వందే భారత్’ కూడా ప్రత్యేకమైన రైలుగా గుర్తింపు పొందనుంది. దేశంలోనే మొట్టమొదటి ‘స్లీపర్ వందే భారత్’ ఏ మార్గంలో నడుస్తుందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం 41 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 39 రైళ్లు ట్రాక్పై నడుస్తుండగా, రెండు రైళ్లు రిజర్వ్లో ఉన్నాయి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లన్నీ చైర్ కార్ సౌకర్యం కలిగినవి. అంటే వీటిలో కూర్చుని ప్రయాణించవచ్చు. రాబోయే రోజుల్లో ‘వందే భారత్’ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ‘స్లీపర్ వందే భారత్’ రైళ్లలో మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు చాలా దూరం వరకూ ప్రయాణిస్తాయి. ఇవి రాత్రిపూట నడుస్తాయి. ఇందులో ప్రయాణికులు నిద్రిస్తూనే ప్రయాణం సాగించవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని ప్రధాన మార్గాలైన ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రూట్లలో సాధారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఏకకాలంలో ఈ రెండు మార్గాల్లో నడపపనున్నారని తెలుస్తోంది. ఈ రెండు మార్గాలే కాకుండా, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-గౌహతి, ఢిల్లీ-భువనేశ్వర్, ఢిల్లీ-పాట్నా రూట్లలో 10 ‘స్లీపర్ వందే భారత్’ రైళ్లు నడవనున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొదటి స్లీపర్ వందే భారత్ రైలును ఐసీఎఫ్ చెన్నై తయారు చేయనుంది. దీని స్లీపర్ కోచ్ రాజధాని, ఇతర ప్రీమియం రైళ్లకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక్కో కోచ్లో నాలుగు టాయిలెట్లకు బదులుగా మూడు టాయిలెట్లు ఉంటాయి. దీనితో పాటు మినీ ప్యాంట్రీ కూడా ఉంటుంది. స్లీపర్ వందే భారత్ రైలులో మొత్తం 823 బెర్త్లు ఉంటాయి. ఇందులో ప్రయాణికులకు 823 బెర్త్లు, రైల్వే సిబ్బందికి 34 బెర్త్లు ఉంటాయి. -
వందే భారత్లో పాడైపోయిన భోజనం?
దేశంలోనే సెమీహైస్పీడ్ రైళ్లుగా ప్రత్యేకతను చాటుకుంటున్నాయి వందే భారత్ రైళ్లు. సాధారణ రైళ్ల కంటే టికెట్ ధర ఎక్కువైనప్పటికీ.. త్వరగా గమ్యస్థానం చేర్చడం, ఇతర సదుపాయాల విషయంలో వందేభారత్ రైళ్లకు మంచి స్పందనే వస్తోంది. అయితే.. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న రైలులో ఓ ప్రయాణికుడికి భోజనం విషయంలో చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఎక్స్లో వందేభారత్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా, దుర్వాసన వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికుడు వెంటనే వీడియో తీశాడు. పాడైపోయిన భోజనం ఇచ్చారంటూ ఆ కస్టమర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన డబ్బులు తనకు రిటర్న్ చేయాలంటూ.. ఆ ఘటనంతా వీడియో రూపంలో బయటకు రావడంతో రైల్వే శాఖ స్పందించింది. ఫిర్యాదు అందిందని.. ఘటనపై దర్యాప్తు చేపడతామని రైల్వేస్సేవ తెలియజేసింది. ఫిర్యాదు వివరాల కోసం తమను సంపద్రించాలంటూ సదరు ఎక్స్ యూజర్కు సూచించింది. ఇక.. ఐఆర్సీటీసీ సైతం సదరు వీడియోపై స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూనే.. విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీనికి సర్వీస్ ప్రొవైడర్ పెనాల్టీ విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. @indianrailway__ @AshwiniVaishnaw @VandeBharatExp Hi sir I am in journey with 22416 from NDLS to BSB. Food that was served now is smelling and very dirty food quality. Kindly refund my all the money.. These vendor are spoiling the brand name of Vande Bharat express . pic.twitter.com/QFPWYIkk2k — Akash Keshari (@akash24188) January 6, 2024 Sir, our sincere apologies for the unsatisfactory experience you had. The matter is viewed seriously. A suitable penalty has been imposed on the service provider. Further the service provider staff responsible have been disengaged and the licensee has been suitably instructed.… — IRCTC (@IRCTCofficial) January 11, 2024 -
ప్రౌడ్ మూమెంట్
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వర్చువల్గా ప్రారంభించిన జాల్నా–ముంబై వందేభారత్ ఎక్స్ప్రెస్కు లోకో–పైలట్ అయిన కల్పన ధనవత్ సోషల్ మీడియా అట్రాక్షన్గా మారింది. 27 సంవత్సరాల కల్పన ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత అసిస్టెంట్ లోకో–పైలట్గా చేరింది. ట్రైన్ ప్రారంభోత్సవ సమయంలో కల్పన సెలబ్రిటీగా మారింది. సెల్ఫోన్లో ఆమె ఫొటోలు తీసుకోవడానికి ప్రయాణికులు పోటీ పడ్డారు. ‘ప్రౌడ్ మూమెంట్: గర్ల్ ఫ్రమ్ పూలంబ్రీ బికమ్స్ ది ఫస్ట్ ఉమన్ లోకో–పైలట్ ఆఫ్ వందేభారత్ ఎక్స్ప్రెస్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. మరోవైపు ‘ఎక్స్చేంజింగ్ ఆఫ్ సిగ్నల్స్ బిట్వీన్ లోకో– పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో – పైలట్ ఆఫ్ జాల్నా–ముంబై ఎక్స్ప్రెస్’ కాప్షన్తో రైల్వేశాఖ పోస్ట్ చేసిన కదులుతున్న ట్రైన్ వీడియో కూడా ఆట్టుకుంటోంది. -
100% ఆక్యుపెన్సీ దాటిన ‘వందేభారత్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన వందేభారత్ రైళ్లు అత్యధిక ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్నాయి. దక్షిణమధ్య రైల్వేలో గతేడాది ప్రవేశపెట్టిన నాలుగు రైళ్లలో ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్లో 134% ఆక్యుపెన్సీ.. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్ను గతేడాది జనవరిలో ప్రవేశపెట్టారు. 16 కోచ్లతో ఈ రైలు ప్రారంభమైంది. మొదటి నుంచి ఈ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. గత డిసెంబర్లో ఈ ట్రైన్లో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. సికింద్రాబా ద్ నుంచి విశాఖకు వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్లో 134 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇక విశాఖ నుంచి సికింద్రాబాద్కు వచ్చే వందేభారత్లో ఇది ఏకంగా 143 శాతానికి చేరుకుంది. సంవత్సరాంతం కావడంతో రెండు వైపుల నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో చాలా మంది వెయిటింగ్ జాబితాలో నిరీక్షించవలసి వచ్చింది. గత డిసెంబర్ ఆఖరు వారంలో వరుస సెలవులు రావడంతో ఎక్కువ మంది రాకపోకలు సాగించారు. సంక్రాంతి వరకు కూడా ప్రయాణికుల రద్దీ ఇలాగే ఉండవచ్చని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్లో... గతేడాది ఏప్రిల్లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ను మొదట 8 కోచ్లతో ప్రారంభించారు. ఈ ట్రైన్ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తోంది. ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో గతేడాది మే 17 నుంచి 16 కోచ్లకు పెంచారు. గత డిసెంబర్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు 114 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్కు వచ్చే వందేభారత్లో 105 శాతానికి ఆక్యుపెన్సీ చేరుకోవడం గమనార్హం. మరోవైపు గత సెపె్టంబర్లో 8 బోగీలతో ప్రవేశపెట్టిన కాచిగూడ–యశ్వంత్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్లో డిసెంబర్లో ఆక్యుపెన్సీ 107 శా తానికి చేరింది. తిరుగుదిశలో యశ్వంత్పూర్ నుంచి కాచిగూడ వరకు 110 శాతం వరకు నమోదైంది. అలాగే దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విజయవాడ–ఎంజీఆర్ చెన్నై–వందేభారత్ ఎక్స్ప్రెస్లో సైతం గత డిసెంబర్లో 126 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా చెన్నై నుంచి విజయవాడకు వచ్చే ట్రైన్లో ఇది 119 శాతం వరకు ఉంది. గత సెస్టెంబర్లో 8 కోచ్లతో ఈ ట్రైన్ను ప్రవేశపెట్టారు. ఈ ట్రైన్ తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తోంది. ఆకట్టుకుంటున్న సదుపాయాలు... వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏర్పాటు చేసిన సదుపాయాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకొనే విధంగా రైళ్లను నడుపుతుండటంతో ఎక్కువ మంది వందేభారత్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ ట్రైన్లో ఏసీ చైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లతో అన్ని రకాలసదుపాయాలు అందుబాటులో ఉన్నా యి. జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్లలో సీసీటీవీ కెమెరాలు, డిఫ్యూజ్డ్ ఎల్ఈడీ లైటింగ్, చార్జింగ్ పాయింట్లు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులకు పూర్తిగా సురక్షితమైన, మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. -
అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. ఏపీలోని స్టాప్స్ ఇవే..
సాక్షి, అమరావతి: ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. కొత్త రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం చేశారు. శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లు బాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్ విస్తరించి ఉంది. ఈ స్టేషన్ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్) అభివృద్ధి చేసింది. #WATCH | Uttar Pradesh: Visuals of the new Amrit Bharat train, which PM Narendra Modi will flag off in Ayodhya today. PM Narendra Modi will also inaugurate the redeveloped Ayodhya Dham railway station and flag off the new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/y9oWEt6sXm — ANI (@ANI) December 30, 2023 రెండు అమృత్ భారత్ రైళ్లలో ఒకటి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అయోధ్య మీదుగా బీహార్లోని దర్బంగా వరకూ ప్రయాణించనుండగా.. రెండో పశ్చిమబెంగాల్లోని మాల్దా టౌన్ నుంచి బెంగళూరులోని ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినస్ మధ్య నడవనుంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణం సాగనుంది. అయితే, ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఆగుతుంది. జనవరి 7 నుంచి రెగ్యులర్గా నడవనుంది. చదవండి: Live: అయోధ్య మెగా రోడ్ షోలో ప్రధాని మోదీ ఈ సూపర్ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో 22 ఎల్హెచ్బీ కోచ్లలో 12 నాన్ ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ క్లాస్లు, 8 జనరల్ అన్రిజర్వుడ్ కోచ్లతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సౌకర్యవంతమైన సీట్లు, మెరుగైన లగేజీ రాక్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఎల్ఈడీ లైట్లు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సీసీ టీవీ, పరిశుభ్రత, ఆధునిక టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేశారు. ఈ రైళ్లలో ఒక కి.మీ నుంచి 50 కి.మీ లోపు ప్రయాణానికి కనీస టికెట్ ధర రూ.35గా నిర్ణయించారు. టికెట్ ఛార్జీలు ఇతర మెయిల్/ ఎక్స్ప్రెస్ల కంటే 15-17% ఎక్కువగా ఉంటాయి. దానికి రిజర్వేషన్ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు అన్ని జోన్లకు సమాచారమిచ్చింది. ఏసీ తరగతుల రుసుములు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అమృత్ భారత్ రైళ్లు గరిష్టంగా 130 కి.మీ వేగంతో పరుగులు పెట్టనుంది. 50 కి.మీ.లోపు దూరానికి కనీస టికెట్ ధర రూ.35గా ఉంటుంది. మరోవైపు అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. రామమందిర శంకుస్థాపనకు ముందు ప్రధాని మోదీ శనివారం అయోధ్యలో పర్యటిస్తున్నారు. రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభించనున్నారు.మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను పటిష్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెంచారు. -
Minister RK Roja: గుంటూరు నుంచి తిరుపతికి వందేభారత్ రైలులో ప్రయాణించిన మంత్రి రోజా (ఫొటోలు)
-
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: రూర్కెలా–పూరి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మెరామండలి, బుద్ధపంక్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లోని ఒక కిటికీ రాళ్ల తాకిడికి దెబ్బతిందని తెలిపింది. -
వందే సృజన!
వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చిన తరువాత చాలా ప్రాంతాల మధ్య దూరం తగ్గిపోయింది. కానీ టికెట్ ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడంతో కొంతమంది దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు. ఇలా వందేభారత్కు దూరంగా ఉన్న గ్రామానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ను తీసుకొచ్చి అబ్బుర పరుస్తోంది పూర్ణిమా ముర్ము. అవును మీరు కరెక్ట్గానే చదివారు. మారుమూల గ్రామానికి వందే భారత్ను తీసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది పూర్ణిమ. జార్ఖండ్లోని జంషెడ్పూర్కు పక్కనే ఉన్న ఓ గ్రామం పేరు జొండరాగోడ. ఈ గ్రామానికి చెందిన విద్యార్థే పూర్ణిమా ముర్ము. గిరిజనులు ఎక్కువ ఉండే ఈప్రాంతంలో దీపావళి సమయంలోనే సోహ్రాయ్ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. దీపావళి రెండో రోజున జరుపుకునే ఈ పండక్కి గిరిజనులంతా... తమ మట్టి ఇళ్లను శుభ్రం చేసి, రకరకాల సాంప్రదాయ డిజైన్లతో పెయింట్ వేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూర్ణిమ తన ఇంటిని వందే భారత్ చిత్రంతో నింపేసింది. మట్టింటికి ముచ్చటగా.. గ్రామంలో ఎంతో సంతోషంగా ఆర్భాటంగా జరుపుకునే పండగను మరింత బాగా జరుపుకోవాలన్న ఉద్ధేశ్యంతో హైస్పీడ్ ట్రైన్తో ఇంటిని అలంకరించాలనుకుంది పూర్ణిమ. గ్రామవాసులు సహజసిద్ధ పదార్థాలతో తయారు చేసే రంగుల నుంచి.. తెలుపు, నీలం, నల్లరంగులు తీసుకుని ఇంటి గోడపైన వందేభారత్ రైలు బొమ్మను చక్కగా చిత్రించింది. రైలు బొమ్మ ఆకర్షణీయంగా ఉండడంతో గ్రామస్థులు పూర్ణిమ ఇంటిని చూసేందుకు ఎగబడుతున్నారు. ‘‘గ్రామంలోని చాలామందికి ‘వందేభారత్ రైలు’ ఎలా ఉంటుందో తెలియదు. దీని గురించి వినడమేగాని చూసింది లేదు. అందుకే అందరికీ వందేభారత్ను పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో రైలు బొమ్మను చిత్రించాను. నిజానికి నేను కూడా ఇప్పటిదాకా వందేభారత్ చూసింది లేదు. ఫోన్లో వందేభారత్ బొమ్మను చూసి గీశాను. అచ్చం వందేభారత్ను పోలి ఉండడంతో నా పెయింటింగ్ గురించి తెలిసిన వారంతా చూడడానికి వస్తున్నారు. రైలు పెయింటింగ్ వేసిన తరువాత ఇంట్లో ఉన్నట్టుగా గాక, ట్రైన్లో ఉన్నట్టు ఉంది’’ అని సంతోషంగా చెబుతోంది పూర్ణిమ. వేడుకల్లో వందేభారత్ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పెయింటింగ్ను చూసిన గ్రామస్థులంతా.. ‘‘మేమయితే ఇంతవరకు ఈ రైలు ఎక్కలేదు. కనీసం ఇలాగైనా చూడగలుగుతున్నాం. వందే భారత్ను పూర్ణిమ చక్కగా వేసింది’’ అని మెచ్చుకుంటున్నారు. పిల్లలైతే కొత్త రైలు తమ ఊరు వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు. -
‘కుక్కలకూ’ ఓ కంపార్ట్మెంట్
సాక్షి, హైదరాబాద్: రైల్వే వ్యవస్థ దశ మార్చే రైళ్లుగా పేర్కొంటున్న వందేభారత్ రైళ్లను మరింత అప్గ్రేడ్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తదుపరి వెర్షన్గా రాబోతున్న వందేభారత్ స్లీపర్ రైళ్లలో పెంపుడు జంతువుల కంపార్ట్మెంట్ను చేరుస్తుండటం విశేషం. రైలులో ప్రయాణం చేసేవారు వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేస్తున్నారు. 16 కోచ్లతో ఉండబోయే ఈ రైలులో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల కోసం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉంది. వాటి ఇంటీరియర్, ఎక్ట్సీరియర్లను అధికారికంగా రైల్వే శాఖ ఇప్పటికే విడుదల చేసి ప్రజల్లో ఆసక్తి పెంచడం తెలిసిందే. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. దూర ప్రయాణాలు చేసే వారు ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకెళ్తుంటారు. పిల్లులు, కుక్కలు సహా ఇతర పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లటం ప్రస్తుతం చాలా ఇబ్బందిగా మారింది. లగేజీ కంపార్ట్మెంట్లో వాటిని తీసుకెళ్లేందుకు కొన్ని సందర్భాల్లో అనుమతిస్తున్నా.. వాటిల్లో సరైన వ్యవస్థ ఉండటం లేదు. కొన్ని చోట్ల బుకింగ్ చేసుకునేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ప్రయాణికుల కోచ్లలో వాటిని తరలించాలంటే, వాటిల్లోని ఇతర ప్రయాణికుల నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. అందరి అంగీకారం లభించటం అసాధ్యంగా ఉంటోంది. జంతు ప్రేమికుల విజ్ఞప్తితో.. ఈ నేపథ్యంలో చాలా కాలంగా జంతు ప్రేమికుల నుంచి రైల్వేకు విన్నపాలు వస్తున్నాయి. ఇంతకాలం ఆ దిశగా దృష్టి సారించని అధికారులు ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్లలో అందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. లగేజీ కంపార్ట్మెంట్ పక్కన ప్రత్యేకంగా పెంపుడు జంతువుల కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో జంతువులను ఉంచేందుకు ప్రత్యేకంగా ర్యాక్స్ ఉంటాయి. అక్కడ వాటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బంది కూడా ఉంటారు. ప్రయాణికుల కోచ్లతో ఈ కంపార్ట్మెంట్కు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉంటుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్లు రూపొందుతున్నాయి. వచ్చే మార్చి నాటికి తొలి రైలు అందుబాటులోకి రానుంది. ఇక్కడ తొలుత పది రైళ్లు రూపొందిస్తారు. ఆ తర్వాత రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్తో కలిసి రష్యాకు చెందిన కీనెట్ రైల్వే సొల్యూషన్స్ 120 రైళ్లను తయారు చేయనుంది. లాతూరులోని కోచ్ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతాయి. -
పదేళ్లయినా విస్తరించని కవచ్!
సాక్షి, హైదరాబాద్: వందేభారత్... వేగవంతమైన, ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన రైలు. కానీ వేగంగా, విలాసవంతంగా ప్రయాణించడం కంటే రైళ్లు భద్రంగా గమ్యస్థానం చేరడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని విస్మరించిన రైల్వే శాఖ... రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ వ్యవస్థను విస్తరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో కోరమండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు–హౌరా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురై ఏకంగా 296 మంది ప్రయాణికులు దుర్మరణం పాలై నాలుగున్నర నెలలు దాటినా నేటికీ కవచ్ వ్యవస్థను కొత్తగా ఒక్క కిలోమీటర్ మేర కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. ఒకవేళ ఆ వ్యవస్థను విస్తరించి ఉంటే తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటన తప్పి ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో కేవలం 5 డీజిల్ లోకొమోటివ్లలో దీన్ని ఏర్పాటు చేయడం తప్ప ఎలాంటి పురోగతీ లేదు. ఏటా 5 వేల కి.మీ. మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇటీవల 3 వేల కి.మీ. మేర దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ పనుల్లో వేగం లేదు. టీకాస్ నుంచి కవచ్గా రూపాంతరం... రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) 2013లో తొలుత రైల్ కొలీజన్ అవాయ్డెన్స్ సిస్టం (టీకాస్)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్–వాడీ–సనత్నగర్ సెక్షన్లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. 260 కి.మీ. నిడివిలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించింది. ఆరేళ్ల క్రితం దాని పేరును కవచ్గా మార్చింది. 2022 నాటికి కవచ్ ఎక్కడెక్కడంటే.. నాందేడ్–నిజామాబాద్–సికింద్రాబాద్–కర్నూలు–గుంతకల్ మార్గంలో 960 కి.మీ. పర్బణి–పర్లివైజ్నాథ్–లాతూర్–వికారాబాద్ మార్గంలో 31 కి.మీ. వాడి–వికారాబాద్–సనత్నగర్ మార్గంలో 174 కి.మీ. ఇవి తప్ప, దేశంలోని మిగతా ప్రాంతాల్లో వీటి ఏర్పాటు జరగలేదు. కవచ్ పనితీరు ఇలా... ప్రత్యేక కవచ్ యంత్రాలను రైల్వే స్టేషన్లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్పై ప్రతి కి.మీ.కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేస్లతో అనుసంధానిస్తారు. దీంతో ఎప్పటికప్పుడు ఇవి రైళ్లను నియంత్రిస్తుంటాయి. లోకో పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినా తనంతట తనుగా బ్రేక్లు వేసుకోవటం, హారన్ మోగించటం లాంటివి కవచ్ చేయగలదు. పొరపాటున ఒకే ట్రాక్పై ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తే.. కనీసం 100 మీటర్ల దూరంలోనే అవి ఆటోమేటిక్గా నిలిచిపోతాయి. వందేభారత్లకూ పొంచి ఉన్న ప్రమాదం.. గంటకు 160 కి.మీ.వేగంతో (నిర్ధారిత పరిధి) దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లలోనూ కవచ్ వ్యవస్థ లేదు. అవి పరుగుపెట్టే ట్రాక్ మొత్తం కవచ్ వ్యవస్థ ఏర్పాటైతేనే పనిచేసే పరిస్థితి ఉన్నందున వందేభారత్ రైళ్లు కూడా ఎదురెదురుగా ఇతర రైళ్లను ఢీకొనే ప్రమాదపు అంచులో ఉన్నట్టే. వందేభారత్ ఎక్స్ప్రెస్..పరిజ్ఞానం: దేశీయం నేపథ్యం: 2016 చివర్లో తయారీపై మొదలైన ప్రయోగాలు 2018 నాటికి పూర్తి. అందుకే దీన్ని తొలుత ‘ట్రైన్–18’గా పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరిలో ఢిల్లీ–వారణాసి మధ్య తొలి రైలు పరుగు ప్రారంభించింది. ఆలోచన నుంచి పట్టాలెక్కడం వరకు పట్టిన సమయం కేవలం రెండున్నరేళ్లు. ఖర్చు: ఒక్కో రైలు తయారీకి అవుతున్న వ్యయం దాదాపు రూ. 100 కోట్లు. కవచ్ ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పుడు పరస్పరం ఢీకొనకుండా నిరోధించేందుకు అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా రూపొందించిన వ్యవస్థ. పరిజ్ఞానం: దేశీయం నేపథ్యం: 2013లో ప్రయోగాలు మొదలు. అవి విజయవంతం కావడంతో ఆ వ్యవస్థను వినియోగించేందుకు 2021లో అనుమతి. ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్వర్క్ 1.29 లక్షల కి.మీ. మేర విస్తరించి ఉంది. కానీ కవచ్కు అంకురార్పణ జరిగి దశాబ్దం దాటుతున్నా ఇప్పటివరకు ఏర్పాటైంది కేవలం 1,425 కి.మీ. నిడివిలోనే.ఖర్చు: కిలోమీటర్కు రూ.50 లక్షలు. -
మనకు రెండు వందే సాధారణ్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్ల తర్వాత అదే తరహాలో సిద్ధమవుతున్న వందే సాధారణ్ రైళ్లు వచ్చే నెలలో పట్టాలెక్కబోతున్నాయి. వందేభారత్ రైళ్లు పూర్తి ఏసీ కోచ్లతో ఉండగా, ఇవి నాన్ ఏసీ కోచ్లతో నడిచే సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లు. వందేభారత్ రైళ్లలో టికెట్ ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో పేద ప్రజలు వాటిలో ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు. ఈ వెలితిని దూరం చేయాలన్న ఉద్దేశంతో దాదాపు అదే రూపంతో, ఇంచుమించు అంతే వేగంతో నడిచేలా కేంద్ర ప్రభుత్వం వందే సాధారణ్ పేరుతో ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమైన తొలి రైలును పశ్చిమ రైల్వేకు కేటాయించారు. అది రెండు రోజుల క్రితం ముంబైకి చేరుకుంది. దాన్ని ఢిల్లీ–ముంబై మధ్య నడిపే యోచనలో అధికారులున్నారు. ఇప్పటికే వందే సాధారణ్ రైళ్ల కోసం ఐదు మార్గాలకు రైల్వే బోర్డు అనుమతించింది. ఇందులో హైదరాబాద్–న్యూఢిల్లీ కూడా ఉండటం విశేషం. మరో 13 మార్గాలలో నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు. వాటికి అనుమతి రావాల్సి ఉంది. ఆ జాబితాలో హైదరాబాద్–నాగర్కోయల్ సర్విసు కూడా ఉండటం విశేషం. వెరసి తెలంగాణకు రెండు వందేసాధారణ్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. పుష్పుల్ పద్ధతిలో.. తొలి రెండు విడతలలో పట్టాలెక్కిన వందేభారత్ రైళ్లు తెలుపు రంగుపై నీలి చారలతో ఆకట్టుకున్నాయి. మూడో విడతకొచ్చేసరికి కాషాయం–నలుపులతో కూడిన మరింత ఆకర్షణీయ కలర్ కాంబినేషన్ ప్రత్యక్షమైంది. ఇప్పుడు వందే సాధారణ్ రైళ్లు కూడా కాషాయ–నలుపు కాంబినేషన్తో వస్తున్నాయి. వందేభారత్ తరహాలోనే ఇవి కూడా పుష్పుల్ ఇంజన్లతో నడుస్తాయి. అయితే, వందేభారత్లో ఇంజిన్లు విడిగా ఉండవు. రైలులోనే అంతర్భాగంగా ఉంటాయి. వందే సాధారణ్లో మాత్రం డబ్లూపీ–5 లోకోమోటివ్లను ముందు ఒకటి వెనక ఒకటి అమరుస్తారు. 130 కి.మీ. గరిష్ట వేగం.. డబ్ల్యూపీ–5 లోకోమోటివ్లు గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటా యి. కానీ, వందే సాధారణ్ రేక్ వేగాన్ని తట్టుకునే 130 కి.మీ.వేగాన్ని మాత్రమే తట్టుకుంటాయి. ఇక ట్రాక్ సామర్థ్యం కూడా చాలా ప్రాంతాల్లో అంతే ఉంది. దీంతో ఈ రైలు గరిష్ట వేగం గంటకు 130 కి.మీ. 2004లో రైల్వే జన్సాధారణ్ పేరుతో రైళ్లను ప్రారంభించారు. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే వేగంగా వెళ్లే ఈ రైళ్లు పూర్తిగా అన్ రిజర్వ్డ్ కోచ్లతో ఉంటాయి. కానీ, అవి సరిగా నడవలేదు. ఇప్పుడు వాటిని రీప్లేస్ చేస్తున్నట్టుగా వందే సాధారణ్ పేరుతో రైళ్లను ప్రారంభిస్తుండటం విశేషం. ఈ రైలులో రెండు ఇంజన్లతోపాటు 12 స్లీపర్ క్లాస్ కోచ్లు, 8 జనరల్ కంపార్ట్మెంట్ కోచ్లుంటాయి. ప్రతి కోచ్లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీట్ వద్ద ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు, మడత స్నాక్ టేబుల్స్, లగేజీ ర్యాక్, అగ్ని నియంత్రణ వ్యవస్థ ఉంటాయి. సెమీ పర్మనెంట్ కప్లర్స్ వ్యవస్థ వల్ల కుదుపులు తక్కువ. ఈ రైళ్లు 8.36 నిమిషాల్లో 110 కి.మీ. వేగాన్ని అందుకుంటాయి. 130 కి.మీ. వేగాన్ని 9.2 నిమిషాల్లో అందుకుంటాయి. అనుమతి పొందిన మార్గాలు ఇవీ.. ఢిల్లీ– ముంబై ఢిల్లీ – పట్నా ఢిల్లీ – హౌరా ఢిల్లీ – హైదరాబాద్ గువాహటి – ఎర్నాకులం పరిశీలన జాబితాలో ఉన్న రూట్లలో కొన్ని హైదరాబాద్ – నాగర్కోయల్ దర్బంగా– లూథియానా ముంబై–చాప్రా ముంబై–రాక్సౌల్ ముంబై–జమ్మూతావి దర్బంగా–అహ్మదాబాద్ కోల్కతా–పోర్బందర్ వారణాసి–దర్బంగా సార్సా–అమృత్సర్ మెంగళూరు–కోల్కతా గువాహటి–జమ్మూతావి -
56% యువత, ఉద్యోగులే..
పట్టాలెక్కిన కొద్ది నెలల్లోనే ప్రయాణికులను వేగంగా తనవైపు ఆకర్షించుకుంటోందివందేభారత్ రైలు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి రూట్లలో మూడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మూడింటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతానికి పైగానే నమోదవుతోంది. ఆ రూట్లలో రెండో వందేభారత్ రైలును ప్రవేశపెట్టినా, ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఈ రైళ్లలో ఎక్కువగా ప్రయాణిస్తున్న కేటగిరీలపై ఓ సర్వే నిర్వహించింది. మొత్తం ప్రయాణికుల్లో 56 శాతం మంది యువకులు, ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్టు తేలింది. –సాక్షి, హైదరాబాద్ యువకులే ఎక్కువ వందేభారత్ రైళ్లలో సగటున 29.08 శాతం యువతీయువకులే ఉన్నారు. 25–34 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నట్టు తేలింది. వేగంగా గమ్యం చేరుతుండటంతో ఈ రైలులో ప్రయాణానికే వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. చదువు, ఉద్యోగ ప్రయత్నం, టూర్లు.. ఇతర పనులకు వెళ్లేందుకు ఈ రైలు వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణ సమయం తక్కువగా ఉండటంతో పనులు వేగంగా చేసుకునే వీలు ఉండటం వీరికి కలిసి వస్తోంది. భద్రత పరంగా మెరుగ్గా ఉండటంతో ఒంటరిగా వెళ్లే యువతులు ఇందులో ప్రయాణించేందుకే ఇష్టపడుతున్నారు. ఈ రైలు ఒకవైపు ఉదయం బయలుదేరి మధ్యాహ్నం వరకు, రెండో వైపు మధ్యాహ్నం బయలు దేరి రాత్రి 11 వరకు గమ్యం చేరుతోంది. దీంతో అది సురక్షిత సమయంగా యువతులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులూ ఎక్కువే వందేభారత్ రైళ్లలో 26.85 శాతం మంది ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్లు సర్వేలో తేలింది. గరుడ ప్లస్ బస్సు చార్జీతో వందేభారత్ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు ఉండటాన్ని ఉద్యోగులు పరిగణిస్తున్నారని రైల్వే అధికారులు చెబుతున్నారు. వందేభారత్ దెబ్బకు కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలు టికెట్ చార్జీలను సవరించే పరిస్థితి వస్తోందంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చని అంటున్నారు. ఈ సర్వే నివేదికను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లామని, దాని ఆధారంగా వందేభారత్ రైళ్లలో మరిన్ని మార్పు చేర్పులు చేసే వీలుందని పేర్కొంటున్నారు. కాగా, 11.81 శాతం మంది వయో వృద్ధులు ఉంటున్నట్టు తేలింది. ప్రయాణాన్ని ఆస్వాదించండి వేగంగా గమ్యం చేరటంతోపాటు ప్రయాణికులు విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల అవసరాలు గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు మరింత ఉన్నతీకరిస్తున్నాం. అనతికాలంలోనే లక్షల మంది వాటిల్లో ప్రయాణించారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మిగతా ప్రయాణికులు కూడా వాటి సేవలను పొందాలని ఆశిస్తున్నాం. – అరుణ్కుమార్ జైన్, జీఎం, దక్షిణ మధ్య రైల్వే -
‘నమో భారత్’ అదిరెన్.. హైదరాబాద్లోనే డిజైన్!
సాక్షి, హైదరాబాద్: వందే భారత్ రైలు తర్వాత మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న రైలు సర్వీసు ‘నమో భారత్’. మెట్రో రైళ్ల కంటే చాలా ఎక్కువ వేగంతో దూసుకుపోయే ఈ రైళ్లు.. వసతుల్లోనూ వాటికంటే మెరుగ్గా ఉంటాయి. బుల్లెట్ రైలు మాదిరిగా ముందు భాగం ఏరోడైనమిక్ డిజైన్తో ఉండటం దీని ప్రత్యేకత. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే.. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పట్టణాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టు మొదటి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. సాహిబాబాద్–దుహై స్టేషన్ల మధ్య ఈ సేవలు మొదలయ్యాయి. దాదాపు 160 కి.మీ. వేగాన్ని అందుకునే ఈ రైళ్లు ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భాగ్యనగరంతో బంధం... ఎన్నో ప్రత్యేకతలతో పట్టాలెక్కిన ఈ రైళ్లకు భాగ్యనగరంతోనూ ఓ బంధం ముడిపడి ఉంది. చూడగానే ఆకట్టుకునే రూపం, అత్యధిక వేగం, మెట్రో రైళ్లకంటే వెడల్పు, ఎత్తుగా ఉండటంతో విశాలమైన కోచ్లు.. ఇలా పలు ప్రత్యేకలతో ఉన్న ఈ రైలును డిజైన్ చేసింది ఆల్స్టోమ్ అనుబంధ విభాగం ఉన్న హైదరాబాద్లోనే కావటం విశేషం. ఫ్రాన్స్కు చెందిన బహుళజాతి కంపెనీ ఆల్స్టోమ్ ప్రపంచ వ్యాప్తంగా రైలు రోలింగ్స్టాక్ తయారీలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా మన దేశంలో ఆల్స్టోమ్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ పేరుతో ఏర్పాటై, మెట్రో రైళ్లను తయారు చేస్తోంది. దీనికి హైదరాబాద్లో ఉన్న ఇంజినీరింగ్ కేంద్రం నమో భారత్ రైలును డిజైన్ చేసింది. ఎరోడైనమిక్ నోస్ మోడల్తో రూపొందించిన ఈ డిజైన్ టెండర్ ద్వారా అమోదం పొందింది. ఎన్నో ప్రత్యేకతలు... గంటకు దాదాపు 180 కి.మీ. వేగంతో దూసుకుపోయే సామర్ధ్యంతో దీన్ని రూపొందించారు. అంత వేగంతో వెళ్లేప్పుడు గాలి ఒత్తిడిని తట్టుకునేందుకు బుల్లెట్ రైలు తరహాలో ఎరోడైనమిక్ నోస్ మోడల్ను రూపొందించారు. దేశంలో సాధారణ మెట్రో రైళ్లు 2.8 మీటర్ల నుంచి 3 మీటర్ల వెడల్పు ఉంటాయి. కానీ నమో భారత్ ఏకంగా 3.2 మీటర్ల వెడల్పుతో ఉంది. మెట్రో రైళ్లలో బెంచీల తరహాలో సీటింగ్ సిస్టం ఉండగా, ఇందులో వందేభారత్ చైర్ కార్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ఉన్నవారిని వేగంగా ఢిల్లీ నగరంలోని అసుపత్రులకు తరలించేందుకు కూడా అనుకూలంగా వీటిని డిజైన్ చేశారు. రోడ్డు మార్గాన రెండు గంటల్లో వెళ్లే దూరాన్ని ఈ రైలు కేవలం అరగంటలో చేరుతుంది. స్ట్రెచర్తో సహా రోగిని రైలు కోచ్లో ఉంచేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. స్ట్రెచర్ను అటాచ్ చేసే సిస్టమ్ ఉంది. ఆ కంపెనీ టేకోవర్.. నమో భారత్ రైలు డిజైన్ను హైదరాబాద్లో రూపొందించగా, గుజరాత్లోని సావ్లీ గ్రామంలో ఉన్న బాంబార్డియర్ ట్రాన్స్పోర్టేషన్ అనే మరో బహుళజాతి కంపెనీకి చెందిన యూనిట్లో ఈ రైళ్లను తయారు చేశారు. 2021లో ఈ కంపెనీని కూడా ఆల్స్టోమ్ కంపెనీ టేకోవర్ చేయటం విశేషం. త్వరలో చేపట్టనున్న హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుకు కూడా ఈ సంస్థ బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ప్రస్తుతం నగరంలో 90 కి.మీ. వేగంతో తిరుగుతున్న మెట్రో రైళ్ల కంటే ఎయిర్పోర్టు మెట్రో రైళ్లు కనీసం 30 కి.మీ. అధిక వేగంతో తిరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కాస్త ఎరో డైనమిక్ లుక్తో ఉండనున్న ఈ రైళ్ల తయారు కోసం ఈ కంపెనీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. -
త్వరలో ‘వందే సాధారణ్’ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు విజయవంతం కావడంతో రైల్వే శాఖ సాధారణ ప్రజలకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకునే పూర్తి ఏసీతో ఉండే వందేభారత్ రైలు ఎక్కాలని సామాన్య జనానికి కోరిక ఉన్నా, రూ.1,600 టికెట్ ధర చూసి వారు వెనకడుగు వేస్తున్నా రు. మరింత సౌకర్యవంతంగా ఉండే ఎగ్జిక్యూటివ్ కోచ్ టికెట్ ధర ఏకంగా రూ.2,550 ఉండటంతో మామూలు ప్రయాణికులు అటు వైపు చూసే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతి సాధారణ జనానికి కూడా కొంతమేర వందేభారత్ రైలు అనుభూతిని కలిగించేందుకు రైల్వే శాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మరో మూడు నెలల్లో నాన్ ఏసీ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ‘వందే సాధారణ్’నాన్ ఏసీ రైలు కోచ్లను రైల్వే శాఖ వేగంగా సిద్ధం చేస్తోంది. జనవరి నాటికి తొలి రైలు.. వందేభారత్ రైళ్లు విజయవంతం కావటంతో వాటిని మరింత అప్గ్రేడ్ చేసే పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రైళ్లు ఉదయం బయలుదేరి, మళ్లీ రాత్రి 12 వరకు తిరిగి వస్తున్నాయి. తాజాగా దూరప్రాంతాలకు కూడా తిరిగేలా స్లీపర్ వందేభారత్ రైళ్ల తయారీ ప్రారంభించిన రైల్వే, సమాంతరంగా నాన్ ఏసీ సాధారణ రైళ్లను కూడా తయారు చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో వచ్చే జనవరి నాటికి తొలి రైలు సిద్ధమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మామూలు రైళ్లు తెరమరుగు.. శతాబ్ది రైళ్లను క్రమంగా తొలగించి వాటి స్థానంలో వందేభారత్ రైళ్లు నడుపుతారని సమాచారం. అలాగే కొత్తగా వచ్చే స్లీపర్ వందేభారత్ రైళ్లు రాజధాని రైళ్ల స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఇక సాధారణ సంప్రదాయ రైళ్లను దశలవారీగా తొలగిస్తూ వాటి స్థానంలో వందే సాధారణ్ రైళ్లను తిప్పే అవకాశం ఉందని చెపుతున్నారు. వందే సాధారణ్ ప్రత్యేకతలు ఇవే.. ♦ సంప్రదాయ నాన్ ఏసీ రైళ్లకు ఇవి కొంత భిన్నంగా ఉంటాయి. వందేభారత్ తరహాలో పుష్పుల్ పద్ధతిలో ముందు, వెనక ఇంజిన్లు ఉంటాయి. ♦ గరిష్టంగా 24 చొప్పున లింక్ హాఫ్మాన్ బుష్ (ఎల్హెచ్బీ) కోచ్లు ఉంటాయి. ♦ సంప్రదాయ రైళ్లలోని సీట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగ్గా ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద చార్జింగ్ పాయింట్లు కూడా ఉంటాయి. ♦ వందేభారత్ రైళ్లలో ఉన్నట్టుగానే ప్రయాణికులకు కోచ్లలో అనౌన్స్మెంట్ స్క్రీన్లు, ఆడియో వ్యవస్థ ఉంటాయి. ♦ ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. వందేభారత్ రైళ్ల లో ఉన్నట్టు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ♦ శుభ్రంగా ఉండేలా చూడటంతోపాటు చెడు వాసన రాకుండా బయో వాక్యుమ్ టాయి లెట్లు ఏర్పాటు చేస్తారు. -
వందేభారత్ స్లీపర్ కోచ్లు వస్తున్నాయోచ్..!
ఢిల్లీ: స్వదేశీ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టి దేశరవాణాలో అరుదైన మైలురాయిని చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముందడుగు వేస్తోంది భారత రైల్వేశాఖ. వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్లను ప్రవేశపెట్టనుంది. 2024 నుంచి ఆ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. స్లీపర్ కోచ్ల ఫొటోలు షేర్ చేశారు. Concept train - Vande Bharat (sleeper version) Coming soon… early 2024 pic.twitter.com/OPuGzB4pAk — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 3, 2023 వందేభారత్ స్లీపర్ కోచ్లు ప్రస్తుతం ఉన్న సౌకర్యాల కంటే ఎన్నో అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. నిద్రించడానికి సౌకర్యవంతమైన పడకలు, ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్, విశాలమైన టాయిలెట్స్, ప్రపంచ స్థాయి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కోచ్లలో ఉన్నాయి. ఈ స్లీపర్ కోచ్ వందేభారత్ మరింత శక్తివంతమైన, పర్యావరణ అనుకూలంగా ఉండనుంది. 'మేక్ అన్ ఇండియా' ప్రోగ్రామ్లో భాగంగా చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. మొదటి రైలును 2019 ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఢిల్లీ-వారణాసి రైలు ప్రారంభం అయింది. దేశంలో ఎంత దూరంలో ఉన్న ప్రాంతాన్నైనా వందేభారత్ రైళ్ల రాకతో గంటల వ్యవధిలోనే సౌకర్యవంతంగా ప్రయాణికులు చేరుతున్నారు. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. న్యూస్క్లిక్ ఫౌండర్కు రిమాండ్ -
వందే భారత్ రైలుకు తప్పిన పెనుప్రమాదం
జైపూర్: ఉదయపూర్ జైపూర్ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాల వెంబడి ఇటుక సైజులో ఉన్న రాళ్లను గమనించిన లోకోపైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రాళ్లు అమర్చి ఉన్న చోటుకు ముందే రైలు ఆగింది. రైల్వే సిబ్బంది ఈ రాళ్లను తొలగిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోమవారం ఉదయం సుమారు 7.50 ప్రాంతంలో ఉదయపూర్ నుంచి జైపూర్ వెళ్తున్న వందే భారత్ రైలు లోకో పైలట్ చాలా దూరం నుంచే ప్రమాదాన్ని పసిగట్టారు. చిట్టోగఢ్ వద్ద గాంగ్రార్ సోనియానా స్టేషన్ల మధ్య పట్టాలపై రాళ్లు ఉండటాన్ని గమనించి వెంటనే ఎమర్జెన్సి బ్రేకులు వేయడంతో రైలు అక్కడి వరకు వెళ్లకుండానే ఆగింది. లోకోపైలట్ సహా కొంతమంది రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి ఆ రాళ్లను, జాయింట్ వద్ద ఉన్న రాడ్డును తొలగించారు. వాటితో పాటు పట్టాలను వదులు చేసే పరికరం ఉండటాన్ని గమనించి దాన్ని కూడా తొలగించారు. నిందితులెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. అనంతరం వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణం యధాతధంగా కొనసాగింది. రైల్వే సిబ్బంది రాళ్లను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో సంచలనంగా మారింది. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైలు 435 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 గంటల 15 నిముషాల్లో చేరుకుంటుంది. గతంలో ఇదే దూరం ప్రయాణించడానికి కనీసం 7 గంటల సమయం పట్టేది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యమున్న ఈ రైలును సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. Alert train drivers stop #VandeBharatExpress in time. Stones and clips to derail Udaipur-Jaipur #VandeBharat near Bhilwara. pic.twitter.com/vftHAtZpMw — Rajendra B. Aklekar (@rajtoday) October 2, 2023 ఇది కూడా చదవండి: కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఇద్దరు డాక్టర్లు మృతి -
వందేభారత్ X గరుడ ప్లస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైల్వే విస్తరణతో ఆర్టీసీకి పోటీ ఎదురైంది. ఇటీవలే ప్రారంభమైన కాచిగూడ–బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్కు ఆదరణ లభించడం.. ప్రతి ట్రిప్పులో దాదాపు 500 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణిస్తుండటంతో ఇది హైదరాబాద్–బెంగళూరు మధ్య పగటిపూట తిరిగే ఆర్టీసీ గరుడ బస్సులపై కొంత ప్రభావం చూపుతోంది. వందేభారత్ సైతం పగలే పరుగులు తీస్తున్నా కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే గమ్యం చేరుతుండటం ప్రజాదరణకు కారణమవుతోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది ఈ రైలు వైపు మళ్లితే గరుడ ప్లస్ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో తగ్గే అవకాశం ఉందని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. ప్రయాణికులను ఆకర్షించే చర్యలు చేపట్టింది. పక్కాగా డైనమిక్ ఫేర్ సిస్టం... కాచిగూడ–బెంగళూరు వందేభారత్ ఎనిమిదన్నర గంటల్లో గమ్యం చేరుకుంటుంటే హైదరాబాద్–బెంగళూరు గరుడ ప్లస్ బస్సు 11 గంటలు తీసుకుంటోంది. దీంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అటు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సులపై ప్రభావం పెద్దగా లేకుండా ఉండేందుకు డైనమిక్ ఫేర్ విధానాన్ని పక్కాగా నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. వందేభారత్ రైలు టికెట్ చార్జీ (భోజనం చార్జీ లేకుండా) రూ. 1,255గా ఉండగా ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు టికెట్ చార్జీ 1,200గా ఉంది. అందువల్ల డైనమిక్ ఫేర్ విధానాన్ని పక్కాగా అమలు చేయడం ద్వారా వారాంతాల్లో కాకుండా డిమాండ్ తక్కువగా ఉండే సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ. 880గా మారుతోంది. మంగళ, బుధ, గురువారాల్లో తక్కువ ధర, మిగతా రోజుల్లో కాస్త ఎక్కువ ధర ఉంటోంది. సాధారణ రోజులు, ప్రయాణ సమయం వంటి మొత్తం 44 అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ ధరలను రకరకాల మొత్తాలకు తగ్గించి ఆర్టీసీ ఖరారు చేస్తోంది. ఇది ఆటోమేటిక్గా ఖరారయ్యేలా సాంకేతికను వినియోగిస్తోంది. టికెట్ చార్జీ భారీగా తగ్గడంతో బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. సిద్దిపేట, ఇతర ప్రాంతాలకు రైలు సర్వీసులతో.. ఇక ప్రస్తుతం సిద్దిపేటకు ఆర్టీసీ నిత్యం 15 నిమిషాలకో బస్సు నడుపుతోంది. ఇవి ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్నాయి. కానీ మరో మూడు రోజుల్లో సిద్దిపేట నుంచి కాచిగూడకు రైలు సర్వీసు ప్రారంభం అవుతోంది. ఒక ట్రిప్పులో వెయ్యి మందిని తరలించే అవకాశం ఉండటంతో ఇది కూడా ప్రభావం చూపుతుందని ఆర్టీసీ భావిస్తోంది. ఇక మహబూబ్నగర్ సమీపంలోని జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా లాంటి ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ప్రయాణిస్తుంటారు. అయితే దేవరకద్ర–కృష్ణా మధ్య ఆదివారం నుంచి రైలు సర్విసు ప్రారంభం కానుంది. దీంతో కృష్ణా–కాచిగూడ, సిద్దిపేట–కాచిగూడ రైళ్లు ప్రారంభమయ్యాక వాటిల్లో ప్రయాణికుల సంఖ్య ఏ మేరకు ఉంటోంది? ఏయే ప్రాంతాల్లో ఎక్కువ మంది ఎక్కి దిగుతున్నారు లాంటి అంశాలను పరిశీలించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు కొందరు సిబ్బందిని నియమించారు. వారు ఈ వివరాలు పరిశీలించి సమాచారం ఇచ్చాక తదనుగుణంగా బస్సుల విషయంలో మార్పుచేర్పులు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. -
వందే భారత్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్
సేలం: వందే భారత్ రైలు అత్యవసర డోర్ తెరుచుకున్న వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను శుక్రవారం సస్పెండ్ చేశారు. చైన్నె– కోయంబత్తూరు మధ్య వందే భారత్ రైలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 26న ఈ రైలు అత్యవసర డోర్ తెరుచుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైన్నెకు చెందిన రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పౌలేష్ (70), ఆయన భార్య రోజ్ మార్గరేట్ ఈరోడ్కు ఈ రైలులో ఈ నెల 26న ప్రయాణించారు. సాయంత్రం 6.05 గంటలకు వందే భారత్ రైలు సేలం చేరుకుని ప్లాట్ఫామ్ 4 వద్ద ఆగింది. ఈ సమయంలో పౌలేష్ తన సీటు నుంచి లేచి రైలు ఎమర్జెన్సీ డోర్ దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అకస్మాత్తుగా డోర్ తెరుచుకోవడంతో పౌలేష్ అవతలివైపు ఉన్న 5వ ప్లాట్ఫారమ్పై పడి మృతిచెందాడు. ఈ ఘటనపై సేలం రైల్వే డివిజనల్ మేనేజర్ పంకజకుమార్ సిన్హా విచారించారు. సీ3 కంపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇందులో సేలం రైల్వే స్టేషన్న్లోని 4వ ప్లాట్ఫారమ్లో వందే భారత్ రైలు ఆగి ఉన్న సమయంలో 5వ ప్లాట్ఫారమ్లో ఉన్న ఇద్దరు రైల్వే ఉద్యోగుల పనితీరుపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరు మరో ప్లాట్ఫామ్కు వెళ్లేందుకు బలవంతంగా అత్యవసర డోర్ తెరిచినట్టు తేలింది. ఆ కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వెలుగుచూసింది. దీంతో సేలం రైల్వేస్టేషన్న్లో పాయింట్స్మన్లుగా పనిచేస్తున్న తామరైసెల్వన్, అదిమీనాగా గుర్తించారు. వీరిని సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలకు డివిజనల్ మేనేజర్ పంకజ్ కుమార్ సిన్హా ఆదేశించారు. -
సికింద్రాబాద్–వైజాగ్ మధ్య మరో వందేభారత్!?
సాక్షి, హైదరాబాద్: రెండో వందేభారత్ రైలు సాధించేందుకు సికింద్రాబాద్–విశాఖపట్నం మార్గం పోటీ పడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలను వందేభారత్తో జోడించేందుకు కేంద్రప్రభుత్వం వేగంగా వందేభారత్ రైళ్లను కేటాయిస్తోంది. ఒక మార్గానికి ఒకే రైలు పద్ధతిలో ఇప్పటి వరకు ఆ కేటాయింపులున్నాయి. అయితే తొలిసారిగా కేరళలోని తిరువనంతపురం–కాసర్గాడ్ మధ్య తాజాగా రెండో వందేభారత్ రైలును ప్రారంభించి ఆ పద్ధతిని బ్రేక్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న వందేభారత్ రైళ్లలో ఇది అత్యధిక ఆక్యుపెన్సీ (సగటున 177 శాతం) రేషియోతో కిక్కి రిసి నడుస్తూ, రైల్వేకు మంచి లాభాలు తెచ్చిపెడు తోంది. ఈ క్రమంలో అత్యధిక ఆక్యుపెన్సీ రేషియో ఉన్న మార్గాల జాబితాలో సికింద్రాబాద్– విశాఖప ట్నం ముందు వరుసలో ఉండటంతో ఈ మార్గాన్ని కూడా రైల్వే శాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అత్యధిక ఆక్యుపెన్సీ రేషియోతో: ఇటీవల దేశ వ్యాప్తంగా తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించినప్పుడు కాసర్గాడ్–తిరువనంతపురం మధ్య రెండో వందేభారత్ రైలును పట్టాలెక్కించింది. తొలి వందేభారత్ తిరువనంతపురం, కొల్లాం జంక్షన్, కొట్టా యం, ఎర్నాకులం, త్రిసూర్, కోజికోడ్, కన్నూరు, కాసర్గాడ్ మార్గంలో తిరుగుతుండగా, రెండో వందే భారత్ కాసర్గాడ్, కన్నూరు, కోజికోడ్, తిరూర్, షా రనూర్ జంక్షన్, త్రిసూర్, ఎర్నాకులం జంక్షన్, అల్లె ప్సీ, కొల్లామ్ జంక్షన్, తిరువనంతపురం రూట్లో తిరుగుతోంది. ఇక సంక్రాంతి రోజున ప్రారంభమైన సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ రైలు 120–130 శాతం ఓఆర్తో తిరుగుతోంది. రెండోది గుంటూరు మీదుగా? దేశంలో ప్రస్తుతం పరుగుపెడుతున్న వందేభారత్ రైళ్లలో ముంబై–గాంధీనగర్, ఢిల్లీ–వారణాసి, సికింద్రాబాద్–విశాఖపట్నం రైళ్లు గరిష్ట ఓఆర్తో తిరుగుతున్నాయి. వీటిల్లో విశాఖ రైలు ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువ స్థిరంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ మార్గంలో మరో మినీ వందేభారత్కు అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వేబోర్డు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం వరంగల్ మీదుగా విశాఖ వందేభారత్ రైలు తిరుగుతోంది. గుంటూరు మీదుగా రెండోదాన్ని తిప్పొచ్చన్నది అధికారుల మాట. -
వందే భారత్లో 6 నెలలు అవన్నీ బ్యాన్.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
ఇండియన్ రైల్వే దినదినాభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే మరింత వేగవంతమైన ప్రయాణం కోసం గత కొంత కాలంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పుట్టుకొస్తున్నాయి. నేడు చాలామంది దూరప్రయాణాలు చేసేవారు కూడా వందే భారత్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా కొంతమంది ప్యాసింజర్ల ఫీడ్బ్యాక్ ఆధారంగా రైల్వే శాఖ ఇప్పుడు కొన్ని మార్పులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, వందే భారత్ ట్రైన్లలో లంచ్ లేదా డిన్నర్ ఆర్డర్ చేసే ప్రయాణికులకు మెనూలో లేని పదార్థాలు కూడా విక్రయిస్తున్నారని, ఫుడ్ ఐటమ్ కవర్లన్నీ కొందరు కోచ్లోనే పడేయడం వల్ల అపరిశుభ్రత ఏర్పడుతోందని, ఇది ప్రయాణికుల సౌకర్యానికి భంగం కలిగిస్తుందని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్, కూల్ డ్రింక్స్, లా కార్టే ఐటెమ్స్ వంటి వాటిని ఆరు నెలలు పాటు నిషేదించింది. ఫుడ్ కవర్లు కోచ్లో ఉండటం వల్ల.. కొన్ని సార్లు ఆటోమాటిక్ డోర్లు ఓపెన్ అవుతున్నాయి. అంతే కాకుండా వ్యర్దాల వల్ల కోచ్లో దుర్వాసన కూడా వ్యాపిస్తోంది. ఈ కారణాల వల్ల రైల్వేశాఖ ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ చదవండి: భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది! ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే విషయం మీద కూడా కొంత గందరగోళం నెలకొంది. అయితే ఇకపై బుక్ చేసేటప్పుడు బుకింగ్ సమయంలోనే ప్రయాణానికి ముందు రీకన్ఫర్మేషన్ క్యాటరింగ్ సర్వీస్ వివరాలు ప్రయాణికులకు మెసేజ్ రూపంలో వస్తాయి. ఇది ప్రయాణికులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. -
ఈ టైంలో యూరప్ ట్రిప్పు అవసరమా?.. దీదీపై ఫైర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐరోపా పర్యటనపై లోక్సభ ఎంపీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌద్రీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక పక్క రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారి నొప్పిని పట్టించుకోకుండా విలాసవంతమైన పర్యటనలకు వెళతారా అని ప్రశ్నించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విధానాలపైనా ప్రధానిపైనా విమర్శలతో చౌదరి విరుచుకుపడ్డారు. అర్ధం చేసుకోలేరా? కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆగస్టు సెప్టెంబర్ వ్యవధిలో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని మేము ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని అయినా కూడా వారు దాన్ని పట్టించుకోలేదని సామాన్యులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజలు బాధను అర్ధం చేసుకునే తీరిక లేదు గానీ స్పెయి పర్యటనకు మాత్రం వీలు కుదురుతుందని ఎద్దేవా చేశారు. విలాసాలకు డబ్బెక్కడిది? ముఖ్యమంత్రి ఐరోపా పర్యటనలో విలాసవంతమైన హోటల్లో బస చేయడంపై స్పందిస్తూ.. ముఖ్యామంత్రి జీతం తీసుకోకుండా కేవలం ఆమె రచనలు, పెయింటింగులు అమ్ముకుని సంపాదిస్తూ ఉంటారు. అలాంటిది రోజుకు రూ. 3 లక్షలు ఖర్చుతో మాడ్రిడ్ హోటల్లో బస చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఈ విలాసవంతమైన ట్రిప్లో ఖర్చులు ఎవరు భరించారని ఏ పారిశ్రామికవేత్త మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్లారని ప్రశ్నిస్తూ ప్రజలను మోసం చేయాలని చూడొద్దని అన్నారు. ఇటీవల బిశ్వ బంగ్లా పారిశ్రామిక సమావేశంలో మీరు ఖర్చు చేసిన దానిలో పది శతం వెచ్చించి ఉంటే లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవని అన్నారు. మామూలు రైలే.. ఇక ప్రధాని కొత్తగా ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలకు బులెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చి 'వందేభారత్' పేరుతో డొల్ల ట్రైన్లు తీసుకొస్తున్నారని ఇవి వాటి సహజ వేగంతో కాకుండా సాధారణ వేగంతోనే ప్రయాణిస్తున్నాయని దీని టికెట్టు ధర మాత్రం సామాన్యుడికి కన్నీరు తెప్పిస్తోందని అన్నారు. యునెస్కో శాంతినికేతన్కు వారసత్వగుర్తింపు కల్పించడంపైన కూడా మాట్లాడుతూ శాంతినికేతన్కు ఎటువంటి ప్రత్యేక గుర్తింపులు అవసరం లేదని దాని ప్రత్యేకత దానికుందని అలాగే ఒక ప్రాచీన ఆలయం తప్ప ఏమీ లేని ముర్షిదాబాద్ కృతేశ్వరి గ్రామానికి ఉత్తమ్ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించడం సరైనది కాదని చేతనైతే అక్కడి నవాబుల కాలం నాటి నిర్మాణాలను పరిరక్షించాలని అన్నారు. దృష్టి మళ్లించడానికే.. ప్రజా సమస్యలపై స్పందించకుండా వాటి నుంచి దృష్టి మళ్లించడానికి మోదీ ప్రభుత్వం ఇలాంటి అనేక అంశాలను తెరమీదకు తీసుకొస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి కొత్త కొత్త అంశాలను తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. బీజేపీ ఆలోచనా విధానం ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కుతూ పార్లమెంటును అగౌరవపరిచే విధంగా ఉందని అన్నారు. #WATCH | Murshidabad, West Bengal: West Bengal Congress President Adhir Ranjan Chowdhury says, "PM Modi's government keeps on making excuses before elections... Be on the Women's Reservation Bill or the One Nation, One Election... To do anything, it is necessary to come to… pic.twitter.com/LSi9Ehi1Ew — ANI (@ANI) September 24, 2023 ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గెలుపు పక్కా -
పట్టాలెక్కిన విజయవాడ–చెన్నై వందేభారత్ రైలు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ–చెన్నై, కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆదివారం పట్టాలు ఎక్కాయి. దేశవ్యాప్తంగా 9 వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపైకి చేరుకున్న వందేభారత్ రైలుకు 1,500 మందికిపైగా విద్యార్థులతో కలసి రైల్వే అధికారులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ మాట్లాడుతూ..మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భార్ భారత్, ఇండియా ఫస్ట్ ఇనీషియేటివ్స్ ఆఫ్ ది నేషన్ను ప్రోత్సహించే లక్ష్యంతో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును తయారు చేయడం దేశం సాధిస్తోన్న ప్రగతికి నిదర్శనమన్నారు. 9 నెలల్లోనే ఏపీకి 3 వందేభారత్ రైళ్లను కేంద్రం కేటాయించిందని చెప్పారు. రైల్వే చరిత్రలో 2023 గొప్ప మేలి మలుపుగా నిలిచిపోతుందన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు జెండాలు ఊపి రైలుకు వీడ్కోలు పలికారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కాచిగూడ– యశ్వంతపూర్ వందేభారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ రైలు ఏపీలోని కర్నూలు, అనంతపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడ–చెన్నై సెంట్రల్కు మొట్టమొదటి వందే భారత్ రైలును చూసేందుకు నగరవాసులు, పలు పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్కు చేరుకోవడంతో స్టేషన్ సందడిగా మారింది. రైల్వేశాఖ ఆధ్వర్యంలో ప్లాట్ఫాంపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు పాఠశాల విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో ప్రదర్శించిన పలు నాటకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.విద్యార్థులు వందే భారత్ రైలుతో సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. -
పట్టాలెక్కిన యశ్వంతపూర్ వందేభారత్
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: తెలంగాణకు మూడో వందేభారత్ రైలుగా కేటాయించిన కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ రైలు పట్టాలెక్కింది. ఆదివారం దేశవ్యాప్తంగా ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బెంగళూరులోని యశ్వంతపూర్ స్టేషన్కు బయలుదేరింది. కాచిగూడ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, హైదరాబాద్ డీఆర్ఎం లోకేష్ విష్ణోయ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది.. ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నాక తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్లు ఖర్చుచేసిందని కిషన్రెడ్డి అన్నారు. వందేభారత్ రైలు ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చిందని, మోదీ దీన్ని గుర్తించి తెలంగాణకు న్యాయం చేస్తున్నారన్నారు. సంవత్సరానికి 55 కి.మీ. చొప్పున కొత్త లైన్లు ఏర్పాటు చేస్తుండగా, ప్రస్తుతం రూ.31,221 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లను రూ.2,300 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నామని, త్వరలో మరిన్ని ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కాజిపేటలో వ్యాగన్ తయారీ కర్మాగారం అందుబాటులోకి వస్తోందని, అక్కడ భవిష్యత్తులో రైల్వేకు అవసరమైన ఇతర పరికరాలు కూడా తయారవుతాయని వివరించారు. మంగళవారం ఉదయం నుంచి.. సాధారణ ప్రయాణికులు లేకుండా తొలిరోజు బెంగుళూరు వెళ్లిన రైలు, సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు అక్కడి నుంచి ప్రయాణికులతో హైదరాబాద్కు బయల్దేరనుంది. మంగళవారం ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి ప్రయాణికులతో బెంగళూరు బయల్దేరనుంది. -
‘వందే భారత్’కు అపూర్వ స్వాగతం
అనంతపురం సిటీ: ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ రైలుకు అనంతపురంలో అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ప్రెస్ ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 7.10 గంటలకు అనంతపురం రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఎంపీ తలారి రంగయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుమతి సురతాని, ప్రజలు, విద్యార్థులు రైల్వేస్టేషన్ చేరుకుని రైలుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొందరు త్రివర్ణ పతాకం ఎగురవేసి జాతీయభావాన్ని ప్రదర్శించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రైలు వద్ద గ్రూపు ఫొటోలు దిగారు. ప్రయాణికులు, భారీగా తరలివచ్చిన సందర్శకులు సెల్ఫీలు దిగడంతో పాటు రైలును తాకుతూ, ముద్దాడుతూ ఆనందం పంచుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ‘వందే భారత్’ రైళ్లలో ప్రయాణం చేస్తే సమయం ఆదా అవుతుందని, వీటిని ఆదరించాలని ఎంపీ రంగయ్య, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, డీఆర్ఎం మనీష్ అగర్వాల్, అనంతపురం స్టేషన్ మేనేజర్ అశోక్కుమార్ నాయుడు కోరారు. ► వందే భారత్ రాకను పురస్కరించుకొని అనంతపురంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జాతీయ భావాన్ని పెంపొందించేలా విద్యార్థినులు చేసిన నృత్యాలు కట్టిపడేశాయి. ► ‘వందే భారత్’ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులతో పాటు వీఐపీలు, విలేకర్లు, ప్రముఖులకు రైల్వే అధికారులు బోర్డింగ్ పాసులు పాసులు ఉచితంగా అందజేశారు. ఎనిమిది కోచ్లతో వచ్చిన ఈ రైలులో పాసులున్న వారు అనంతపురం నుంచి ధర్మవరం వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. అక్కడి నుంచి తిరిగి రావడానికి మరో రైలులో వారందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. -
పట్టాలెక్కిన వందే భారత్
విజయవాడ రైల్వేస్టేషన్లో ఆదివారం చైన్నె వెళ్లే వందే భారత్ రైలు ప్రారంభోత్సవం జరిగింది. దీన్ని ఢిల్లీలో వర్చువల్గా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30గంటలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ జెండా ఊపి రైలును పంపారు. ఈ రైలు వద్ద ప్రయాణికులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
ఒకేసారి 9 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ.. తెలుగు రాష్ట్రాలకు..
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో తొమ్మిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవంలో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ సందర్బంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాకే రైల్వేశాఖ నూతన శకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో అభివృద్ధి చేపడుతున్నారు. ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను నేడు ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మీదుగా రెండు రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరో వందే భారత్ రైలు కాచిగూడ, బెంగళూరు ప్రారంభమైంది. మూడు రాష్ట్రాలు, 12 జిల్లాలకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు చాలా సౌకర్యవంతంగా ఈ రైలు ఉంటుంది. వచ్చే నెల 1న మహబూబ్ నగర్, వచ్చే నెల 3న నిజామాబాద్ జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. తెలంగాణలో కొత్త రైల్వే ప్రోజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు. తెలంగాణకు రూ.4418 కోట్ల బడ్జెట్ రైల్వే అభివృద్ది కోసం కేంద్రం కేటాయించింది. రూ.31,200 కోట్ల రైల్వే ప్రోజెక్టులు పనులు సాగుతున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ది కూడా చేపట్టబోతున్నాం అని కామెంట్స్ చేశారు. 9 New #VandeBharat poised for debut. Prime Minister #NarendraModi inagurated all the #VandeBharatExpress today. pic.twitter.com/sBgBcRpUWa — Nitu Kumari (@nitukumari_94) September 24, 2023 కాచిగూడ-బెంగళూరు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్లోని కాచిగూడ-బెంగళూరులోని యశ్వంత్పూర్ మధ్య నడుస్తుంది. మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం, ధరంవరం స్టేషన్లలో స్థానికంగా ఆగుతుంది. ఈ రైలులో 530 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు ఛైర్ కార్ కోచ్లు ఉంటాయి. Shri Arun Kumar Jain, GM,SCR welcomes Shri G.Kishan Reddy, Hon'ble Union Minister to the inaugural run Kacheguda - Yesvantpur Vande Bharat Express which will be virtually flag off by Hon'ble PM@RailMinIndia#Hyderabad #VandeBharat pic.twitter.com/16B9F61wvi — South Central Railway (@SCRailwayIndia) September 24, 2023 విజయవాడ-చెన్నై వందే భారత్ చెన్నైలో ప్రధాని మోదీ ప్రారంభించిన రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇది. ఈ రైలు తిరుపతి పుణ్యక్షేత్రానికి రేణిగుంట మార్గంలో వెళ్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా విజయవాడ, చెన్నై మధ్య నడుస్తుంది. 6:40 గంటల్లోనే విజయవాడ నుండి చెన్నైకి ప్రయాణం పూర్తి కానుంది. టిక్కెట్ ధర ఛైర్ కార్ : రూ.1,420, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర : రూ.2,630. -
దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?
ఢిల్లీ: దేశవ్యాప్తంగా తొమ్మిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. 11 రాష్ట్రాల్లో అనుసంధానం పెంచే ఈ రైలు మార్గాలు ప్రయాణికుల సమయాన్ని ఘనణీయంగా ఆధా చేయనున్నాయి. 9 New #VandeBharat poised for debut. Prime Minister #NarendraModi inagurated all the #VandeBharatExpress today. pic.twitter.com/sBgBcRpUWa — Nitu Kumari (@nitukumari_94) September 24, 2023 ఉదయ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఉదయ్పూర్-జైపూర్ మధ్య నడుస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణిస్తున్న అత్యంత వేగవంతమైన రైలు కంటే ఇది దాదాపు 30 నిమిషాల సమయాన్ని ఆధా చేస్తుంది. రాజస్థాన్లో ఇది మూడో వందే భారత్ రైలు. మిగిలిన రెండు జోధ్పూర్-సబర్మతి, అజ్మీర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్. తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తిరునెల్వేలి, మధురైలను చెన్నైతో కలుపుతుంది. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలకు పైగా తగ్గే అవకాశం ఉంది. ఈ రైలు తిరునెల్వేలి జంక్షన్ నుంచి బయలుదేరి విరుదునగర్, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లిలో అనేక స్టాప్లతో చెన్నై చేరుకుంటుంది. కాచిగూడ-బెంగళూరు ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్లోని కాచిగూడ-బెంగళూరులోని యశ్వంత్పూర్ మధ్య నడుస్తుంది. మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం, ధరంవరం స్టేషన్లలో స్థానికంగా ఆగుతుంది. ఈ రైలులో 530 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు ఛైర్ కార్ కోచ్లు ఉంటాయి. విజయవాడ-చెన్నై వందే భారత్ చెన్నైలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇది. ఈ రైలు తిరుపతి పుణ్యక్షేత్రానికి రేణిగుంట మార్గంలో వెళ్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా విజయవాడ, చెన్నై మధ్య నడుస్తుంది. పాట్నా-హౌరా వందే భారత్ ఈ రైలు మార్గం బీహార్లోని పాట్నా జంక్షన్ను పశ్చిమ బెంగాల్లోని హౌరాతో కలుపుతుంది. ఇది 6 గంటల 35 నిమిషాల్లో 532 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు పాట్నా సాహెబ్, మొకామా, లక్కీసరాయ్ జంక్షన్, జసిదిహ్, జమ్తారా, అసన్సోల్, దుర్గాపూర్లలో రెండు నిమిషాల చొప్పున ఆగుతుంది. కాసరగోడ్ - తిరువనంతపురం కాసరగోడ్ - తిరువనంతపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ కేరళకు చెందింది. ఇది సుమారు మూడు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఏడు గంటల 55 నిమిషాల్లో 573 కి.మీ. ప్రయాణిస్తుంది. పూరీ-భువనేశ్వర్- రూర్కెలా ఈ రైలు ఒడిశాలోని పూరిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు రూర్కెలా చేరుకుంటుంది. తిరిగి వచ్చే సమయంలో, రైలు రూర్కెలా నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు పూరీకి చేరుకుంటుంది. ఇది ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, దెంకనల్, అంగుల్, సంబల్పూర్ సిటీ, ఝర్సుగూడలో స్టాప్లను కలిగి ఉంటుంది. రాంచీ-హౌరా వందే భారత్ రాంచీ-హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని నగరాలను కలిపే అత్యంత వేగవంతమైన రైలు ఇది. ఇది రాంచీలో ఉదయం 5:15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు హౌరా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, రైలు హౌరా నుంచి మధ్యాహ్నం 3:45 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10:50 గంటలకు రాంచీబాట్ చేరుకుంటుంది. జామ్నగర్-అహ్మదాబాద్ వందే భారత్ జామ్నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఐదు స్టాప్లతో 4 గంటల 40 నిమిషాల్లో 331 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది జామ్నగర్లో 5:30 గంటలకు బయలుదేరి రాజ్కోట్, వాంకనేర్, సురేంద్రనగర్, విరామ్గామ్, సబర్మతి మీదుగా ఉదయం 10:10 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. ఇదీ చదవండి: ప్రధాని మోదీ భద్రతా వలయంలో కలకలం -
నేటి నుంచి విజయవాడ-చెన్నై వందేభారత్ రైలు
-
నేడు పట్టాలెక్కనున్న విజయవాడ–చెన్నై వందేభారత్ రైలు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ–చెన్నై వందేభారత్ రైలు ఆదివారం నుంచి పట్టాలు ఎక్కనుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా జెండా ఊపి ఈ రైలును ఆదివారం ప్రారంభిస్తారు. విజయవాడ నుంచి తమిళనాడు రాజధానితోపాటు తిరుపతి ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేందుకు రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది. అదే మార్గంలో చెన్నై నుంచి విజయవాడకు వస్తుంది. విజయవాడలో సాయంత్రం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి విజయవాడ చేరుకుంటుంది. మధ్యలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో హాల్ట్ ఉండేలా ఈ రైలు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ వందేభారత్ రైలు సర్విసును నిర్వహిస్తారు. ఒక ఎగ్జిక్యూటివ్ చైర్కార్ కోచ్తోపాటు మొత్తం 8 కోచ్లు, 530 సీట్లతో ఈ రైలును రూపొందించారు. ఈ రైలు టికెట్ల బుకింగ్ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. టైమింగ్స్ ఇలా.. రోజూ ఉదయం 5.30 గంటలకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట జంక్షన్కు 7.05, నెల్లూరుకు 8.39, ఒంగోలుకు 10.09, తెనాలి జంక్షన్కు 11.21, విజయవాడకు మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో బయలుదేరి తెనాలి 3.49, ఒంగోలు 5.03, నెల్లూరు 6.19, రేణిగుంట రాత్రి 8.05, చెన్నై సెంట్రల్కు 10 గంటలకు చేరుకుంటుంది. టికెట్ ధరలు ఇలా.. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్కు కేటరింగ్ చార్జీలతో.. ఏసీ చైర్ కార్: రూ.1,420 ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్: రూ. 2,630 కేటరింగ్ చార్జీ లేకుండా.. ఏసీ చైర్ కార్: రూ.1,135 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్:రూ. 2,280 చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకు కేటరింగ్ చార్జీలతో.. ఏసీ చైర్ కార్: రూ.1,320 ఎగ్జిక్యూటివ్ క్లాస్: రూ.2,540 కేటరింగ్ చార్జీ లేకుండా.. ఏసీ చైర్ కార్: రూ.1,135 ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్: రూ.2,280 -
బెంగళూరు ఎకానమీ చైర్కార్ చార్జి రూ.1,600
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ–యశ్వంతపూర్ (బెంగళూరు) వందేభారత్ రైలు (నం.20703) టికెట్ చార్జీలను దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. కాచిగూడ నుంచి యశ్వంతపూర్ స్టేషన్కు ఎకానమీ చైర్ కార్లో క్యాటరింగ్ రుసుముతో కలుపుకొని రూ.1,600గా నిర్ణయించారు. క్యాటరింగ్ చార్జి లేకుండా సాధారణ ప్రయాణానికి రూ.1,255, ఎగ్జిక్యూటివ్ చైర్కార్ కోచ్లో ప్రయాణానికి క్యాటరింగ్ చార్జీతో కలుపుకొని రూ. 2,915గా, కేటరింగ్ చార్జీ లేకుండా 2,515గా నిర్ధారించారు. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ (నం.20704)కు ఈ ధరల్లో స్వల్ప తేడా ఉంది. ఎకానమీ చైర్ కార్లో కేటరింగ్ చార్జీలతో కలిపి రూ.1,540, కేటరింగ్ చార్జీ లేకుండా రూ.1,255, ఎగ్జిక్యూటివ్ చైర్కార్ కోచ్లో కేటరింగ్ చార్జీతో కలిపి రూ.2,865, కేటరింగ్ చార్జీ లేకుండా రూ.2,515గా నిర్ణయించారు. రైల్లో అల్పాహారం, లంచ్: ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో ప్రారంభమయ్యే వందేభారత్ రైలు మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. కేటరింగ్ చార్జీతో కలిపి టికెట్ బుక్ చేసుకున్నవారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్ను రైల్లో అందిస్తారు. కేటరింగ్ రుసుము చెల్లించని వారికి అవి అందవు. ఇంటి నుంచి తెచ్చుకునే భోజనాన్ని రైల్లోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త వందేభారత్ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఆదివారం సాధారణ ప్రయాణికులను అనుమతించరు. సోమవారం నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ను ఐఆర్సీటీసీ ప్రారంభించింది. -
ఒకేసారి 9 ‘వందేభారత్’ల పరుగు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లను మరింత వేగంగా పట్టాలెక్కించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో మాదిరిగా ఒక్కో రైలును ప్రారంభించటం కాకుండా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 24న ఒకేసారి తొమ్మిది వందేభారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ వర్చువల్గా వాటిని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో కాచిగూడ–యశ్వంత్పూర్ మధ్య నడిచే వందేభారత్తోపాటు విజయవాడ–చెన్నై సర్వీసు కూడా ఉంది. అలాగే ఉదయ్పూర్–జైపూర్, తిరునెల్వేలి–చెన్నై, పట్నా–హౌరా, కాసర్గాడ్–తిరువనంతపురం, రౌర్కెలా–భువనేశ్వర్–పూరీ, రాంచీ–హౌరా, జామ్నగర్–అహ్మదాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్లను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. వాస్తవానికి రెండు నెలల క్రితమే కాచిగూడ–యశ్వంత్పూర్ సర్వీసు ప్రారంభం కావాల్సి ఉండగా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రైళ్లను ప్రారంభించేందుకు వీలుగా దాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అన్నీ చిన్న రైళ్లే.. గతంలో ప్రారంభించిన వందేభారత్ రైళ్లు 16 కోచ్లతో ఉండగా ఇప్పుడు ఒకేసారి 9 రైళ్లు ప్రారంభించనున్నందున ఎనిమిది కోచ్లతోనే వాటిని సిద్ధం చేశారు. ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏడు ఎకానమీ చైర్కార్ కోచ్లు ఉండనున్నాయి. విశాఖ, తిరుపతి సర్వీసులు 120 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో పరుగుపెడుతున్నాయి. కొత్తగా ప్రారంభమయ్యేవి కూడా అదే స్థాయి డిమాండ్తో నడిస్తే వాటి కోచ్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఐటీ నగరాల మధ్య నాలుగో రెగ్యులర్ సర్వీసు.. హైదరాబాద్–బెంగుళూరు మధ్య ఐటీ నిపుణులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తు తం రెండు నగరాల మధ్య రెగ్యులర్ సర్వీసులు మూడే ఉన్నాయి. కాచిగూడ–బెంగుళూరు–మైసూ రు, కాచిగూడ–యలహంక, నిజాముద్దీన్–బెంగుళూరు రాజధాని ఎక్స్ప్రెస్లు నిత్యం నడుస్తున్నాయి. ఇవి కాకుండా వారానికి మూడు రోజులు గరీబ్రథ్ ఎక్స్ప్రెస్, ఒక్కో రోజు చొప్పున కాచిగూడ–యశ్వంత్పూర్ జబల్పూర్–యశ్వంత్పూర్ లక్కో–యశ్వంత్పూర్లున్నాయి. ఇప్పుడు నాలుగో రెగ్యులర్ సర్వీసుగా వందేభారత్ ప్రారంభమవుతోంది. ఈ రైలు మహబూబ్నగర్ మీదుగా ప్రయాణించనుంది. ఫలితంగా తొలిసారి మన వందేభారత్ రైలు మూడు రాష్ట్రాల మీదుగా (తెలంగాణ–ఏపీ–కర్ణాటక) ప్రయాణించినట్లు కానుంది. తగ్గనున్న ప్రయాణ సమయం... ప్రస్తుతం హైదరాబాద్–బెంగుళూరు మధ్య నడిచే ఎక్స్ప్రెస్లు గమ్యం చేరుకొనేందుకు పదకొండున్నర గంటల సమయం తీసుకుంటున్నాయి. ఒక్క రాజధాని ఎక్స్ప్రెస్ మాత్రమే 10 గంటల్లో చేరుకుంటోంది. ఇప్పుడు కొత్తగా పట్టాలెక్కబోతున్న వందేభారత్ సర్వీసు ఎనిమిదిన్నర గంటల్లోనే గమ్యం చేరుకోనుంది. కాచిగూడలో ఉదయం ఐదున్నరకు (ఇంకా సమయాలు అధికారికంగా వెల్లడి కాలేదు) ప్రారంభమై మధ్యాహ్నం 2:15కు బెంగుళూరు చేరుకోనుంది. తిరిగి అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:15కు కాచిగూడకు చేరుకోనుంది. ఈ రైలు మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురంలలో మాత్రమే ఆగనుందని సమాచారం. మరో రెండు స్టేషన్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. -
రేపటి నుంచి పట్టాలపైకి ‘వందే భారత్’
హిందూపురం అర్బన్ : కాచిగూడ–యశ్వంతపూర్ మధ్య ‘వందే భారత్’ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం నుంచి పరుగులు తీయనుంది. దేశవ్యాప్తంగా 9 వందేభారత్ ఎక్స్ప్రెస్లను ప్రధాని మోదీ ఈ నెల 24వ తేదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. అందులో కాచిగూడ–యశ్వంతపూర్ మధ్య నడిచే ‘వందే భారత్’కూడా ఒకటి. వారంలో బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు నడిచే వందేభారత్ రైలు కేవలం 8.30 గంటల్లోనే కాచిగూడ నుంచి యశ్వంతపూర్ చేరేలా రైల్వే అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే వందేభారత్ (20703) మహబూబ్నగర్, కర్నూలు మీదుగా ఉదయం 10.55 గంటలకు అనంతపురానికి, 11.30 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 2.45 గంటలకు బయలుదేరనున్న వందేభారత్ (20704) సాయంత్రం 5.20 గంటలకు ధర్మవరం, 5.41 గంటలకు అనంతపురం, రాత్రి 11.15 గంటలకు తిరిగి కాచిగూడకు చేరుకుంటుంది. కాచిగూడ – యశ్వంతపూర్ మధ్య 609.81 కిలో మీటర్లు దూరం ఉండగా, అందులో సింగిల్ ట్రాక్ 213.31 కి.మీ కాగా, డబుల్ ట్రాక్ 396 .50 కి,మీ ఉంది. వందేభారత్ సగటున 71.74 కి.మీ వేగంతో దూసుకువెళ్లనుంది. భోజన సదుపాయంతో కలిపి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ. 2,425 కాగా, ఏసీ చైర్ టికెట్ రూ. 1,545గా నిర్ణయించారు. -
తెరపైకి మళ్లీ డబుల్ డెక్కర్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ కావటంతో, ఫెయిల్యూర్గా ముద్రపడ్డ డబుల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది. బెర్తులు ప్రవేశపెట్టి.. డబుల్ డెక్కర్ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్ కార్ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణికులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారికి పగటి సమయం వృథా కావటం లేదు. కానీ, డబుల్ డెక్కర్ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అయ్యేది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. ఫలితంగా వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది. దీంతో ఆ రెండు సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగుపెడుతున్నా కిక్కిరిసిపోతున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమయంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభారత్ తరహా లో అన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల వేగా న్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనలో రైల్వే ఉంది. ప్రయాణికులతోపాటు సరుకులు కూడా.. ఇక పైడెక్లో ప్రయాణికులు, దిగువ డెక్లో సరుకులను ఏకకాలంలో తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ నమూనాలో కూడా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే భావిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి డిజైన్లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్డీఎస్ఓ పరిశీలిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్ డెక్కర్ రైళ్లకు మళ్లీ డిమాండ్ కల్పించాలని రైల్వే భావిస్తోంది. -
వందే భారత్కు తప్పని రాళ్ల దెబ్బలు
ఇది సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిస్థితి. ఏకంగా ఆరు కోచ్ల అద్దాలను ఆకతాయిలు పగలకొట్టేశారు. ఇటీవల ప్రారంభమై ప్రయాణికుల ఆదరణ చూరగొంటూ దాదాపు 115 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్న ఈ రైలును ఆకతాయిలు టార్గెట్గా చేసుకుంటున్నారు.– సాక్షి, హైదరాబాద్ వందేభారత్ రైళ్లపైనే కసిగా.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడులు జరగటం ముందు నుంచీ ఉంది. కానీ వందేభారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత అది మరింతగా పెరిగింది. గత ఏడు నెలల్లో రాష్ట్రంలో దాదాపు 300 పర్యాయాలు రైళ్లపై దాడులు జరిగితే, అందులో వందేభారతపై జరిగినవే 50కి పైగా ఉండటం గమనార్హం. వెడల్పాటి అద్దాలుండటంతో వందేభారత్ రైళ్లకు ఈ రాళ్లదాడి తీవ్ర నష్టం చేస్తోంది. సాధారణంగా రైలు అద్దాలు పగిలితే, మెయింటెనెన్స్ సమయంలో వాటిని మార్చేస్తారు. కానీ, వందేభారత్ రైళ్ల అద్దాలు తరచూ పగిలిపోతుండటంతో వాటిని మార్చటం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య పరిధిలో సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో విశాఖపట్నం రైలు విశాఖలో మెయింటెయిన్ అవుతుండగా,తిరుపతి రైలు సికింద్రాబాద్లో అవుతోంది. వారానికి ఒక రోజు వీటికి సెలవు ఉండటంతో ఆ రోజు పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు చేపడుతూ పగిలిన అద్దాలను మారుస్తున్నారు. బాగా పగిలితే మాత్రం వెంటనే మార్చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో అద్దాలను స్థానికంగా నిల్వ చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ డివిజన్లోనే ఎక్కువగా.. తాజాగా తిరుపతి రైలులో ఆరు కోచ్ల అద్దాలు పగలగా, విశాఖ రైలుకు మూడు కోచ్ల అద్దాలు పగిలాయి. ఈ ఏడాది రైళ్లపై జరిగిన 300 రాళ్ల దాడుల్లో ఎక్కువ సికింద్రాబాద్ డివిజన్లోనే చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రైళ్లపై దాడుల విషయంలో నిందితులపై తీవ్రచర్యలుంటాయి. రైళ్లపై దాడి చేయటాన్ని జాతి ఆస్తి విధ్వంసంగా పరిగణిస్తూ కఠిన సెక్షన్లు దాఖలు చేస్తారు. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం పోతుంది. దాడి చేసి అలాంటి కేసులుకొని తెచ్చుకోవద్దని ఎంతగా ప్రచారం చేసినా ఆకతాయిలు వినటం లేదు. దీంతో ఆ సెక్షన్ల కింద గరిష్ట జైలు శిక్షలు విధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి పట్టుబడిన వారికి వీలైనంత ఎక్కువ కాలం జైలు శిక్ష పడే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
‘వందేభారత్’లో సాంకేతిక లోపం
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ: విశాఖలో గురువారం బయల్దేరాల్సిన విశాఖ–సికింద్రాబాద్ (20833) వందేభారత్ ఎక్స్ప్రెస్లోని ఓ కోచ్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు రైలుని రద్దు చేసి మరో రైలులో ప్రయాణికులను సికింద్రాబాద్కు పంపారు. డీఆర్ఎం సౌరభ్ప్రసాద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విశాఖ నుంచి ఈ స్పెషల్ రైలు ఏర్పాటు చేశారు. ఈ రైలు విశాఖలో ఉదయం 7 గంటలకు బయల్దేరింది. వందేభారత్ మార్గంలో అదే హాల్ట్స్తో ఈ రైలు సికింద్రాబాద్ చేరుకుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్పెషల్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ మార్గంలో అదే హాల్ట్స్తో విశాఖ చేరుకోనుంది. కాగా, వందే భారత్ రద్దు చేయడంపై అన్ని రైల్వే స్టేషన్ల్లో ప్రకటనలు, మెసేజ్ల ద్వారా ప్రయాణికులకు సమాచారమిచ్చి, ప్రతి రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణం రద్దు చేసుకున్న వారికి పూర్తిగా నగదు రిఫండ్ చేశారు. ప్రత్యేక రైలులో ప్రయాణం చేసిన ప్రయాణికులకు వ్యత్యాసం నగదు రిఫండ్ చేశారు. ఈ రైలులో వందే భారత్ రైలు సేవలతో సమానంగా క్యాటరింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. -
వందకు వందే భారత్!
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా వందేభారత్ రైళ్లను ఒకేసారి పెద్దసంఖ్యలో ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు 30లోపు మాత్రమే నడుస్తున్నాయి. ఈ సంఖ్యను వీలైనంత తొందరలో వందకు చేర్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతానికి నాలుగు రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా వాటిని వాయిదా వేశారు. ఇందులో కాచిగూడ– యశ్వంత్పూర్(బెంగళూరు) రైలు కూడా ఉంది. వాస్తవానికి ఈ రైలు గత నెల 31నే చెన్నై నుంచి కాచిగూడ స్టేషన్కు చేరుకుంది. ఆ తర్వాత మహబూబ్నగర్ మీదుగా దీని ట్రయల్రన్ కూడా పూర్తి చేశారు. దీనిని ఈనెల ఆరో తేదీన ప్రారంభిస్తున్నట్టు గుంతకల్ స్టేషన్ అధికారులు అప్పట్లోనే ప్రకటించగా, దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు ఖండించారు.అది పంద్రాగస్టు రోజు ప్రారంభమయ్యే సూచనలున్నాయంటూ కొందరు అధికారులు అనధికారికంగా ప్రకటించారు. దానికి బలం చేకూరుస్తూ ఈలోపే ట్రయల్రన్ పూర్తి చేశారు. కానీ, రైల్వేబోర్డు మాత్రం అధికారికంగా ప్రారంభతేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఎన్నికల వేళ... ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, వందేభారత్ రైళ్లను కూడా ప్రధాన ఆకర్షణగా జనం ముందు నిలపాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో భారత్లో వంద వందేభారత్ రైళ్లను పట్టాలెక్కించాలని ముందుగా అనుకున్నా, ఇప్పుడు ఆ సంఖ్యను వీలైనంత తొందరలోనే ప్రయాణికుల సేవలోకి తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొన్నింటిని ఆపి, మరికొన్నింటిని జతచేసి ఒకేసారి ప్రారంభించాలని భావి స్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పంద్రాగస్టు కానుకగా పట్టాలెక్కాల్సిన కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. 8 కోచ్ల రైళ్లే ఎక్కువ.. ప్రారంభంలో వందేభారత్ రైళ్లను 16 కోచ్లతో పట్టాలెక్కించారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో మాత్రమే వందేభారత్ రైళ్లు తయారవుతున్నాయి. త్వరలో మరో మూడు కోచ్ఫ్యాక్టరీల్లో వాటి ఉత్పాదన ప్రారంభిస్తారు. ఇప్పుడు ఒక్కో రైలు సిద్ధం కావటానికి చాలా సమయం పడుతోంది. ప్రొడక్షన్ వేగం పుంజుకునే వరకు, ఒక రైలుకు వినియోగించే 16 కోచ్లను రెండు రైళ్లుగా మార్చి నడపాలని రైల్వేశాఖ భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లు ప్రారంభించే అవకాశం ఉంటుందనేది ఆలోచన. డిమాండ్ పెరిగే కొద్ది క్రమంగా కోచ్ల సంఖ్య పెంచాలని అనుకుంటున్నారు. దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన మొదటి వందేభారత్ను సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య 16 కోచ్లతో ప్రారంభించారు. సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రారంభమైన రెండో వందేభారత్ను మాత్రం 8 కోచ్లతో ప్రారంభించి, ఆ సంఖ్యను పెంచుతామని తర్వాత రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పుడు 8 కోచ్ల మినీ వందేభారత్ రైళ్లు ఎక్కువ సంఖ్యలో ప్రారంభించి, ఆ తర్వాత ఉత్పత్తి పెరిగే కొద్దీ వాటికి అదనపు కోచ్లను జతచేస్తూ పోవాలని నిర్ణయించారు. -
సిగరెట్ తాగి పడేయడంతో.. వందే భారత్ రైలు నుంచి పొగలు
మనుబోలు(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ రైల్లోంచి హఠాత్తుగా పొగలు రావడంతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద రైలును 30 నిమిషాలు ఆపివేసిన ఘటన బుధవారం జరిగింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో రైలు మనుబోలు స్టేషన్ సమీపంలోకి వస్తుండగా ఓ బోగిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన అధికారులు రైలును స్టేషన్లో నిలిపివేశారు. ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురై కిందకు దిగేశారు. 3వ భోగీ బాత్రూం నుంచి పొగలు వస్తున్నాయని తెలుసుకుని సిబ్బంది వెళ్లి పరిశీలించారు. ఎవరో సిగరెట్ తాగి పడేయడంతో ప్లాస్టిక్ వస్తువులకు అంటుకుని పొగలు వచ్చినట్లు గుర్తించారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆ పని చేసి ఉంటాడని అనుమానిస్తూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరగంట తర్వాత రైలు బయలుదేరింది. చదవండి: మహిళలపై కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన -
తిరుపతి- హైదరాబాద్ వందే భారత్ ట్రైన్లో పొగలు..
తిరుపతి: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైలు ప్రాజెక్టు నాణ్యతా లోపాలపై తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. వందేభారత్పై రాళ్లు రువ్వడం నుంచి అనేక ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా వందే భారత్ ట్రైన్ లో పోగలు వెలువడ్డాయి. తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ రైలులో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలులో పొగలు వెలువడ్డాయి. గూడూరు-మనుబోలు మధ్య రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పొగలు వెలువడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇదీ చదవండి:రైల్వే ట్రాక్పై నిలిచిపోయిన కారు.. లోకో పైలట్ సమయస్ఫూర్తితో.. -
ఇక వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు.. ఒక్కో రైలుకు రూ.120 కోట్ల ఖర్చు
సాక్షి, అమరావతి: వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖ వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లను ప్రవేశపెడుతోంది. మొదటిదశలో 200 రైళ్ల తయారీకి కాంట్రాక్టును ఖరారు చేసింది. రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లలో ప్రస్తుతం చెయిర్కార్ కోచ్లే అందుబాటులో ఉన్నాయి. దేశంలో రెండో అతివేగంగా ప్రయాణించే వందేభారత్ రైళ్లలో ప్రస్తుతం ఏసీ చెయిర్కార్ కోచ్లే ఉన్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. కానీ స్లీపర్ కోచ్లు లేకపోవడంపై ప్రతికూల స్పందన కూడా వ్యక్తమవుతోంది. స్లీపర్ కోచ్లు లేకపోవడంతో దూరప్రాంత ప్రయాణాలకు ప్రయాణికులు విముఖత చూపుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగానే రైల్వేశాఖ వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ప్రవేశపెడుతోంది. స్లీపర్ కోచ్లతో కూడిన వందేభారత్ రైళ్ల తయారీకి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. మొత్తం 400 రైళ్లు ప్రవేశపెట్టాలన్నది రైల్వేశాఖ ఉద్దేశం. మొదటిదశలో ప్రవేశపెట్టే 200 రైళ్ల కోసం టెండర్లను ఇటీవల ఖరారు చేసింది. ఏడుసంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. రైల్వికాస్ నిగమ్ లిమిటెడ్, రష్యాకు చెందిన టీఎంహెచ్ గ్రూప్తో కూడిన కన్సార్షియం 120 రైళ్ల తయారీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఒక్కో రైలును రూ.120 కోట్లతో తయారు చేసేందుకు ఈ కన్సార్షియం ముందుకొచ్చింది. టిట్లాఘర్ వేగన్, బీహెచ్ఈఎల్తోకూడిన కన్సార్షియం మరో 80 రైళ్లను తయారు చేయనుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగం.. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లలో మొత్తం 16 బోగీలుంటాయి. థర్డ్ ఏసీ కోచ్లు 11, సెకండ్ ఏసీ కోచ్లు 4, ఫస్ట్ ఏసీ ఒక కోచ్ ఉండేలా డిజైన్ చేశారు. ప్రయాణికుల స్పందనను బట్టి.. తరువాత దశల్లో కోచ్ల సంఖ్యను 20 లేదా 24కు కూడా పెంచాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ రైలు బయలుదేరిన నిమిషం వ్యవధిలోనే గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రాజధాని ఎక్స్ప్రెస్లు ‘ఫ్రంట్ డ్రివెన్’ విధానంలో ప్రయాణిస్తున్నాయి. వందేభారత్ స్లీపర్ కోచ్లు ‘డిస్ట్రిబ్యూటెడ్’ విధానంలో ప్రయాణిస్తాయి. దీంతో రైలు ప్రయాణంలో కుదుపులు, శబ్దం కనిష్టస్థాయిలోనే ఉంటాయి. రాజధాని ఎక్స్ప్రెస్ల కంటే వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు పట్టాలపై తక్కువ ఒత్తిడి కలిగిస్తూ అధికవేగంతో ప్రయాణిస్తాయి. దీనివల్ల పట్టాల నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని రైల్వే ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరినాటికి తొలి వందేభారత్ స్లీపర్ కోచ్ల రైలును పట్టాలెక్కించాలని రైల్వేశాఖ భావిస్తోంది. నేటినుంచి సామర్లకోటలో వందేభారత్కు హాల్ట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం నుంచి వందేభారత్ రైలు ఆగనుంది. ఈ రైలు సామర్లకోట జంక్షన్లో ఒక్క నిమిషం ఆగేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. ఈ రైలు హాల్ట్కు అనుమతి ఇవ్వాలన్న ప్రజల విజ్ఞప్తుల్ని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 48 గంటల వ్యవధిలోనే వందేభారత్ రైలు హాల్ట్కు ఆమోదం లభించింది. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
అఫీషియల్: మరో వందేభారత్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి మరో వందేభారత్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే విశాఖ, తిరుపతిల నడుమ సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైళ్లు నడుస్తున్న సంతి తెలిసిందే. ఇప్పుడు మూడో రూట్లో ఉరుకులు పెట్టేందుకు రెడీ అయ్యింది. చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి సోమవారమే రైలు కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకుంది. దేశంలోనే ఐటీ దిగ్గజ నగరాలుగా పేరొందిన హైదరాబాద్–బెంగళూరు మధ్య వందేభారత్ రైలు సేవలు ప్రారంభం కాబోతున్నాయి. కాచిగూడ–యశ్వంతపూర్ (బెంగళూరు) స్టేషన్ల మధ్య ఈ సెమీ బుల్లెట్ రైలు పరుగుపెట్టనుంది. దక్షిణ మధ్య రైల్వేకు మూడో వందేభారత్ సర్వీసుగా అందుబాటులోకి రానున్న ఈ రైలు సేవలు ఆగస్టు 6న లేదా 15వ తేదీన లేదంటే ఆ తేదీల మధ్యలో గానీ ప్రారంభం కానున్నాయి. ఎనిమిదిన్నర గంటల్లో.. ప్రస్తుతం నగరం నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణ సమయం దాదాపు 11 గంటలు పడుతోంది. వందేభారత్ రైలు మాత్రం కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే బెంగుళూరు చేరుకోనుంది. కాచిగూడలో ఉదయం ఆరుగంటల సమయంలో బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర వరకు బెంగుళూరు చేరుకుని, తిరిగి అక్కడ 3 గంటలకు బయలు దేరి రాత్రి పదకొండున్నర వరకు కాచిగూడకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రారంభ తేదీని.. సమయాలను మాత్రం ఇంకా రైల్వే బోర్డు అధికారికంగా ప్రకటించలేదు. -
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం..
భోపాల్: వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన నాటినుండి ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ప్రమాదాల కారణంగానో, సౌకర్యాల విషయంలోనే ఎదో ఒక విధంగా హైలైట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఈ ట్రైన్ మరోసారి ట్రెండింగ్ అయ్యింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ అభాగ్యుడికి ఫుడ్ పార్సిల్ లో బొద్దింక రావడంతో రైలు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. పైన పటారం లోన లొటారం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. సరికొత్త హంగులతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ రైళ్ళలో అంతా అత్యాధునికమేనని ప్రచారం చేస్తుండటంతో ఆహారం కూడా హైజీనిక్ గా ఉంటుందని భావించి ఫుడ్ ఆర్డర్ చేశాడో అభాగ్యుడు. తీరా ఆర్డర్ వచ్చాక ఆత్రుతతో ఓపెన్ చేసి చూస్తే రోటీలకు బొద్దింక అతుక్కుని ఉంది. దీంతో రోటీలకంటే ముందు ఖంగుతిన్న ప్రయాణికుడు సుబోధ్ పహాలాజన్ ఈ ఉదంతం మొత్తాన్ని ఎక్స్(ఒకప్పటి ట్విట్టర్) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రోటీకి అతుక్కున్న బొద్దింక ఫోటో తోపాటు వందే భారత్ రైలులో నాకు ఒక బొద్దింక వచ్చిందని క్యాప్షన్ కూడా రాశారు. దీనికి రైల్వే కేటరింగ్ సేవ వారు స్పందింస్తూ.. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాము. దీనికి బాధ్యులైన వారి మీద వెంటనే చర్యలు తీసుకుంటాము. మీ పీఎన్ఆర్ నెంబరు ఫోన్ నెంబరు మాకు డైరెక్ట్ మెసేజు పంపగలరు అని కోరుతూనే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. @IRCTCofficial found a cockroach in my food, in the vande bharat train. #Vandebharatexpress#VandeBharat #rkmp #Delhi @drmbct pic.twitter.com/Re9BkREHTl — pundook🔫🔫 (@subodhpahalajan) July 24, 2023 ఇది కూడా చదవండి: మహిళా అధికారులకు 12 నెలలు ప్రసూతి సెలవులు -
కర్ణాటక వందేభారత్ రైలుపై రాళ్ల దాడి!
కర్ణాటక: రామనగరలో మరోసారి వందేభారత్ రైలుపై ఆకతాయిలు రాళ్లు విసిరారు. బుధవారం మైసూరు నుంచి చైన్నెకి వెళ్తున్న ఈ రైలుపై రామనగరలో గుర్తుతెలియని దుండగులు రాళ్లు విసరడంతో ఒక బోగీ అద్దాలు ముక్కలయ్యాయి. ఎవరికీ ఏమీ కాలేదని తెలిసింది. రాష్ట్రంలో పలుచోట్ల వందేభారత్ రైళ్లపై రాళ్లు విసరడం తెలిసిందే. -
మరిన్ని ఫీచర్లతో వందే భారత్ రైళ్లు.. కొత్తగా ఏమేం ఉన్నాయంటే..?
చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ప్రాజెక్టు వందేభారత్ రైళ్లు. దేశమంతటా వేగంగా ప్రయాణించగల వందేభారత్ రైళ్లను ప్రధాన నగరాల మధ్య ఇప్పటికే ప్రవేశపెట్టారు. అయితే.. ఈ రైళ్లలో నాణ్యతపై విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ప్రయాణికులు కూడా కొన్ని లోపాలను రైల్వే శాఖకు ఫీడ్బ్యాక్లో ఇచ్చారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వందే భారత్ రైళ్లలో 25 రకాల మార్పులను చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఏమేం మార్పులంటే.. ► రైళ్లలో ప్రయాణికులు కూర్చునే కుషింగ్స్ గట్టిగా ఉన్న నేపథ్యంలో వాటిని మార్చనున్నారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేలా మరిన్ని స్లాట్లను ఏర్పాటు చేయనున్నారు. ► సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఎక్కువగా వంగేలా సీటును ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మార్చనున్నారు. కోచ్లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నారు. దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా వీల్ ఛైర్ ఫిక్సింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ► అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్తో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో బోర్డర్లెస్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్లో మార్పులు చేయనున్నారు. ► వందే భారత్ రైళ్లలో కోచ్ల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం యాంటీ క్లైంబర్స్ అనే కొత్త భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థను వందే భారత్తోపాటు, అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ► మెరుగైన ఎయిర్ కండీషనింగ్ కోసం ఎయిర్టైట్ ప్యానల్స్లో మార్పులు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ పుష్ బటన్ను లోకో పైలట్కు సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలుగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ► నీరు బయటకు రాకుండా వాష్ బెసిన్ లోతులను పెంచనున్నట్లు తెలిపారు. టాయిలెట్స్లో లైటింగ్ సిస్టమ్స్ మెరుగుపరచనున్నట్లు పేర్కొన్నారు. ► త్వరలో రిజర్వేషన్ చేయించుకోనివారికి కూడా అధునాతన సదుపాయాలతో కోచ్లను తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దశలవారిగా వందే భారత్ రైళ్లకు మరిన్ని సదుపాయాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: Gyanvapi Case Updates: జ్ఞానవాపిలో పురావస్తు సర్వేకు బ్రేక్.. సుప్రీం కీలక ఆదేశాలు -
టాయిలెట్ కోసం వందే భారత్ రైలెక్కి.. ఇరుక్కుపోయిన వ్యక్తి..
ప్రస్తుతం దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ల కాలం నడుస్తోంది. వేగంగా ప్రయాణించగలిగే ప్రత్యేకత కలిగిన ఈ సెమీ హైస్పీడ్ రైలుకీ రోజురోజుకీ వీటికి ప్రజాదరణ పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. .అయితే రాళ్లు రువ్వడం, ఆవు, గేదేలు గుద్దుకొని రైలు దెబ్బతినడం వంటి విషయాలతో తరుచూ వందే భారత్ రైలు వివాదాల్లో నిలుస్తుంది. తాజాగా వందే భారత్ ఎక్స్ప్రెస్ మరోసారి వార్తల్లో నిలిచింది.. ఒక వ్యక్తి మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు ఎక్కినందుకు ఏకంగా రూ. 6 వేల మూల్యం చెల్లించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి హైదరాబాద్లో నివాసముంటూ డ్రైఫ్రూట్ బిజినెస్ చేస్తూంటాడు. ఇతనికి హైదరాబాద్తో పాటు సొంత ఊరైన మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీలో షాపులున్నాయి. ఈ క్రమంలో జూలై 15న తన భార్య 8 ఏళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్ నుంచి భోపాల్కు వెళ్లాడు. అక్కడి నుంచి సొంతూరు సింగరౌలీకి రాత్రి 8.20కు రైలు ఎక్కాల్సి ఉంది. దీంతో స్టేషన్లోని ఫ్లాట్ఫాంపై వేచి ఉన్నారు.అయితే ఆ సమయంలో అబ్దుల్కు అర్జెంట్గా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఫ్లాట్ఫామ్పై ఉన్న ఇండోర్ వెళ్లే వందే భారత్ రైలులోని టాయిలెట్లోకి వెళ్లాడు. మూత్ర విసర్జన అనంతరం బయటకు రావడంతో.. అప్పటికే రైలు డోర్లు మూసుకుపోయి భోపాల్ స్టేషన్ నుంచి కదిలింది. చదవండి: ఎంత విషాదం.. జిమ్లో వర్కౌట్లు చేస్తూ కుప్పకూలిన యువకుడు దీంతో ఆందోళన చెందిన అబ్దుల్, టీసీలు, కోచ్ల్లోని పోలీస్ సిబ్బందిని సంప్రదించి సాయం కోరాడు. అయితే ట్రైన్ డ్రైవర్ మాత్రమే డోర్స్ తెరిచేందుకు వీలు ఉంటుందని చెప్పడంతో అతడు డ్రైవర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. చివరకు టికెట్ లేకుండా రైలు ఎక్కినందుకు అబ్దుల్ రూ.1020 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తర్వాత స్టేషన్ ఉజ్జయినిలో రైలు ఆగిన తర్వాత దిగి.. భోపాల్కు రూ. 750 చెల్లించి బస్సులో వెళ్లాడు. మరోవైపు భోపాల్ రైల్వే స్టేషన్లో వేచి ఉన్న అబ్దుల్ భార్య, కుమారుడు సైతం ఈ విషయం తెలుసుకుని ఆందోళన చెంది సొంతూరు సింగ్రౌలీ వెళ్లే రైలు ఎక్కకుండా ఆగిపోయారు. ఈ నేపథ్యంలో వారు బుక్ చేసిన రూ.4,000 విలువైన రిజర్వేషన్ టిక్కెట్లు వినియోగించకపోవడంతో వృథా అయ్యాయి. మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు ఎక్కిన అబ్దుల్ ఖాదిర్ ఈ విధంగా సుమారు రూ.6,000 మూల్యం చెల్లించుకున్నాడు. -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అదే నిజమైతే బడ్జెట్ ధరలో లగ్జరీ ప్రయాణం!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. విలాసవంతమైన వందే భారత్ ట్రైన్లు ఇకపై సామాన్యులకు సైతం అందుబాటులోకి రానున్నాయి. తక్కువ టికెట్ ధరతో నాన్ ఏసీ ట్రైన్ సర్వీసులు ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అప్గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్, సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్లతో వందే సాధారణ్ పేరుతో కొత్త ట్రైన్లను తయారు చేయించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వందే సాధారణ్ ట్రైన్లపై భారత రైల్వే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకే వేళ ఇదే నిజమైతే మెరుగైన ప్రయాణం చేసే సౌలభ్యం కలగనుంది. ఇక బడ్జెట్ ధరలో ప్రయాణించేందుకు వీలుగా తయారు చేయనున్న వందే సాధారణ్ ట్రైన్ ఫీచర్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ తరహాలో ఉండనున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ మాదిరిగా కాకుండా లేటెస్ట్ రైలు లోకో లాగింగ్ ఉంటుంది. అన్నీ రైళ్లు ఒక లోకోమోటివ్ (ఇంజిన్)తో ప్రయాణికులకు సేవల్ని అందిస్తుండగా..దీనికి రెండు వైపులా లోకోమోటివ్ ఉంటాయి. ప్రతి చివరలో లోకోమోటివ్తో పాటు, ట్రైన్ వేగం కోసం పుష్-పుల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ట్రైన్లు చివరి గమ్య స్థానానికి చేరుకున్న వెంటనే ..స్టేషన్ వద్ద లోకోమోటివ్ సదరు ట్రైన్ నుంచి విడిపోనుంది. తద్వారా టర్న్ రౌండ్ సమయం తగ్గుతుంది. ఈ కొత్త ట్రైన్ల కోసం లోకోమోటివ్లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్డబ్ల్యూ)లో, కోచ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో తయారు చేస్తారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తయారు చేస్తున్న ఏకైక భారతీయ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐసిఎఫ్ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త రైలు ఎలా ఉండబోతుంది. అందులోని సౌకర్యాలు ఎలా ఉండనున్నాయని రైల్వే బోర్డ్ నిర్ధేశించిన అక్టోబర్ నాటికి వెలుగులోకి రానున్నాయి. లింకే హాఫ్మన్ బుష్ (LHB) కోచ్ అనేది ఇండియన్ రైల్వేస్కు చెందిన ఒక ప్యాసింజర్ కోచ్. ఇందులో 2 సెకండ్ లగేజీ, గార్డ్ అండ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ కోచ్లు, 8 సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్ కోచ్లు, 12 సెకండ్ క్లాస్, 3 టైర్ స్లీపర్ కోచ్లు ఉంటాయి. అన్ని బోగీలు నాన్ ఏసీగా ఉంటాయి. చదవండి👉 నైట్ షిఫ్ట్లు నిషేధం.. కంపెనీ తీసుకున్న నిర్ణయం ఎంత పనిచేసిందంటే -
జడ్జిగారూ.. వందే భారత్ ఆగేలా ఆదేశించండి
ఢిల్లీ: భారత సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ గురించి దేశంలో ఎక్కువ చర్చ నడుస్తోంది. ఒకదాని తర్వాత మరో సర్వీస్ పట్టాలెక్కుతుండడంతో.. ఇతర రైళ్లపైనా ఈ ప్రభావం పడుతోంది. అయితే.. తాజాగా సుప్రీం కోర్టులో వందేభారత్ గురించి ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. వందేభారత్ రైలును తమ ఊరి స్టేషన్లో ఆగేలా రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలంటూ కేరళకు చెందిన ఓ యువ లాయర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో పిటిషనర్ పీటీ షీజీష్ను సుప్రీం కోర్టు మందలించగా.. కనీసం ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించేలా ఆదేశాలివ్వాలని కోరగా.. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మండిపడింది. ఇది అసాధారణమైన విజ్ఞప్తి.. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని పోస్టాఫీసుగా భావించొద్దంటూ ధర్మాసనం మండిపడింది. వందేభారత్ రైలు ఎక్కడ ఆగాలో నిర్ణయించాలని మమ్మల్ని కోరుతున్నావ్?.. తర్వాత ఢిల్లీ-ముంబై రాజధానిని ఆపాలని అడుగుతావా?.. ఇది విధానాలకు సంబంధించిన విషయం కాబట్టి అధికారులకు దగ్గరకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే పిటిషనర్కు బెంచ్ సూచించింది. ఇక పరిశీలనకు పంపాలన్న అభ్యర్థనకు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన సీజేఐ.. ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. వందేభారత్ రైలు.. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య నడుస్తోంది. అత్యధిక జన సాంద్రత.. పైగా ప్రయాణికుల రద్దీతో ఉండే మలప్పురం స్టేషన్కు మాత్రం వందేభారత్ స్టాప్ కేటాయించలేదు. బదులుగా.. తిరూర్ రైల్వేస్టేషన్లో వందేభారత్కు స్టాప్ను కేటాయించించింది రైల్వేశాఖ. అయితే.. ఆ తర్వాత ఆ ప్రతిపాదనను విస్మరించిందని.. చుట్టుపక్కల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంట్నునారంటూ పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బదులుగా 60 కిలోమీటర్ల దూరంలోని పలక్కాడ్ షోర్నూర్కు స్టాప్ మంజూరు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు పిటిషనర్. అయితే.. వందే భారత్ రైలు వంటి హై స్పీడ్ ఎక్స్ప్రెస్ రైళ్లకు వ్యక్తిగత లేదంటే స్వార్థ ప్రయోజనాల ఆధారంగా డిమాండ్పై స్టాప్లు కేటాయించబడవు. ప్రజల డిమాండ్ మేరకు స్టాప్లు ఏర్పాటు చేస్తే, ఎక్స్ప్రెస్ రైలు అనే పదం తప్పుగా మారుతుంది అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతకు ముందు పిటిషనర్ కేరళ హైకోర్టులోనూ ఓ పిటిషన్ వేయగా.. అది రైల్వే పరిధిలోకి వస్తుందంటూ ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. -
వందే భారత్ రైలులో మంటలు..
-
వందే భారత్ రైలులో మంటలు.. పరుగు తీసిన ప్రయాణీకులు
భోపాల్: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని సీ-14 కోచ్ వద్ద మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో భయంతో ప్రయాణీకులు పరుగు తీశారు. వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం వందే భారత్ రైలు భోపాల్ నుంచి ఢిల్లీ బయలు దేరింది. ఈ క్రమంలో రాణికమలాపాటి స్టేషన్ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్ వద్ద రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రైల్వే సిబ్బంది మంటలను గుర్తించిన వెంటనే లోకోపైలట్కు సమాచారం అందించారు. దీంతో, రైలును అక్కడే నిలిపివేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక దళం అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. Vande Bharat train from Bhopal to Delhi catches fire today morning at around 7:15am. Was on board but by God’s grace everyone is safe!#VandeBharatExpress #traincatchesfire pic.twitter.com/8k5uHDn7lT — Nupur Singh (@NupurSiingh) July 17, 2023 ఇది కూడా చదవండి: వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు.. -
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు...
ప్రయాణికులారా.. జాగ్రత్త, మార్గమధ్యలో ఎప్పుడైనా రాళ్ల దాడి జరిగే ప్రమాదం ఉంది.. అని ప్రకటన చేరిస్తే బాగుండుననే చలోక్తులు వ్యాప్తిలో ఉన్నాయి. అంతగా రాళ్ల దాడులు రైల్వేశాఖకు సమస్యగా మారాయి. ప్రయాణంలో ఆదమరిచి ఉన్నవారు.. దుండగులు రాళ్లు విసురుతున్నారని తెలిసి భయాందోళనకు గురికావాల్సి వస్తోంది. సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై ఆకతాయిల రాళ్ల దాడులు పరిపాటిగా మారాయి. ఇలాంటి తరహా ఘటనలు రాష్ట్రంలోనూ ఎక్కువగా జరుగుతున్నాయి. వందేభారత్ రైళ్లకు మాత్రమే కాకుండా మిగతా రైళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే శాఖకు ఈ పరిణామాలు పెద్ద తలనొప్పిగా మారాయి. వందేభారత్పై గురి ఇటీవల బెంగళూరు–ధార్వాడ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం అయింది. ప్రారంభం అయిన 15 రోజుల్లోనే సుమారు మూడు సార్లు వందేభారత్ రైలు రాళ్ల దాడికి గురయింది. రాళ్లు తగిలి రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ రాళ్లు తగలకపోవడంతో హాని జరగలేదు. కానీ రాళ్ల దాడుల వల్ల భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని నైరుతి రైల్వే, దక్షిణ రైల్వే, కొంకణ్ రైల్వే జోన్లలో రాళ్లు విసరడం మామూలుగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు చెన్నై–మైసూరు, బెంగళూరు–ధార్వాడ మధ్య రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లు ఇప్పటివరకు 24 సార్లు రాళ్ల దాడులకు గురయ్యాయి. ఇతర రైళ్లు కూడా 190కి పైగా రాళ్ల దాడులకు గురయ్యాయి. పట్టుబడితే కఠినచర్యలు గడిచిన ఏడు నెలల్లో నైరుతి రైల్వేజోన్ పరిధిలో 65కు పైగా సాధారణ రైళ్లపై దాడి జరిగింది. రెండుసార్లు ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో కలబురిగిలో ప్యాసింజర్ రైలుపై కూడా దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ప్రమాదంలో ఆశా కార్యకర్త ఒకరు గాయపడ్డారు. మరోవైపు రైల్వే చట్టం 152, 153 సెక్షన్ల ప్రకారం రాళ్ల దాడి శిక్షార్హమైన నేరం. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని నైరుతి రైల్వే హెచ్చరిస్తోంది. ఇటీవల దావణగెరెలో దాడికి పాల్పడిన ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో 200కు పైగా ఇలాంటి తరహా ఘటనలు జరిగాయి. సుమారు 49 మంది నిందితులను అరెస్టు కూడా చేశారు. పనీపాట లేని ఆకతాయిలు, మద్యం, గంజాయి వ్యసనపరులు పొంచి ఉండి రాళ్ల దాడులు చేస్తున్నట్లు, ప్రజలకు హాని చేయాలనే ఉన్మాద మనస్తత్వం ఉన్నవారు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు అంచనా. రైల్వే పోలీసులు గస్తీ ముమ్మరం చేయాల్సి ఉంది. -
అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్’కు ఎందుకు మినహాయింపు?
మనదేశంలోని అన్ని రైళ్ల చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు కనిపిస్తుంది. దీనిని భద్రతా నియమాలను అనుసరిస్తూ రూపొందిస్తారు. ఈ ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. అయితే వందేభారత్ రైలు చివరి బోగీకి మాత్రం ఈ ‘X’ గుర్తు కనిపించదు. వందేబారత్ ట్రైన్.. హై స్పీడ్ ట్రైన్. ఈ ట్రైన్ అంతా అటాచ్డ్గా ఉంటుంది. ఈ రైలు రెండు వైపుల నుంచి పరుగులు పెడుతుంది. అందుకే ఈ రైలుకు ‘X’ గుర్తు ఉండదు. రైల్వే విభాగం పలు భద్రతా చర్యలు చేపడున్న దృష్ట్యా పలు సిగ్నళ్లు, సైన్లను రూపొందించి, ఉపయోగిస్తుంది. ఈ కోవలోనే రైలు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు రూపొందిస్తారు. ఇది రైల్వే అధికారులను, సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తారు. ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. రైలు ఏదైనా స్టేషన్ మీదుగా వెళ్లినప్పుడు రైల్వే సిబ్బంది ఆ రైలు చివరి బోగీపై ఉన్న ‘X’ గుర్తును చూస్తారు. దానిని గమనించాక ఆ రైలుకు అది చివరి బోగీ అని స్పష్టం చేసుకుంటారు. ఒకవేళ ‘X’ గుర్తు అనేది లేకపోతే.. ఆ రైలుకు వెనుకవైపు గల బోగీలు రైలు నుంచి విడిపోయాయని అర్థం. ఇలా జరిగితే వెంటనే రైల్వే సిబ్బంది కంట్రోల్ రూమ్కు పోన్ చేసి, ఆ రైలుకు గల వెనుక బోగీలు ఎక్కడో విడిపోయాయనే సమాచారాన్ని అందిస్తారు. అందుకే ఏ రైలుకైనా చివరి బోగీ వెనక ‘X’ గుర్తు ఉండటం ఎంతో ముఖ్య విషయమని రైల్వే సిబ్బంది భావిస్తారు. వందేభారత్ విషయానికొస్తే దీనికి ‘రైల్వే సురక్షా కవచ్’ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ అనుకోని విపత్తుల నుంచి ప్రయాణికులను రక్షిస్తుంది. వందేభారత్ ఎక్స్ప్రెస్ స్పీడు అధికారికంగా గంటకు 160 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్కు ఇంటెలిజంట్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ -
పరోక్షంగా పార్టీ ప్రచారం కూడా జరుగుతుంటుంది!
పరోక్షంగా పార్టీ ప్రచారం కూడా జరుగుతుంటుంది! -
ఇక కాషాయ వందేభారత్
చెన్నై: వందేభారత్ రైళ్లు ఇకపై రంగు మార్చుకోనున్నాయి. ఇన్నాళ్లూ నీలం రంగులో ఉండే రైలు బోగీలు ఇకపై కాషాయం రంగులో కనిపిస్తాయి. కొత్తగా తయారు చేసే రైళ్లకు కాషాయం రంగు వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో వందేభారత్ రైలు కోచ్లు తయారవుతున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఫ్యాక్టరీని సందర్శించారు. రైలు బోగీలోకి వెళ్లి సీట్లను పరిశీలించారు. లోకో పైలెట్ జోన్లోకి కూడా వెళ్లి అన్నీ సరిగ్గా అమర్చారా లేదా అని పరీక్షించి చూశారు. ఈ కొత్త రైళ్లు బూడిద, కాషాయం రంగు కలయికతో ఉన్నాయి. మన దేశ జెండా త్రివర్ణ పతాకం స్ఫూర్తితో ఈ రంగుల్ని ఎంపిక చేసినట్టుగా అశి్వన్ వైష్ణవ్ తెలిపారు. ‘‘వందేభారత్ రైళ్లు మేకిన్ ఇండియాలో భాగంగా రూపొందిస్తున్నాం. ప్రస్తుతమున్న రైళ్లలో లోటు పాట్లు గురించి సమాచారాన్ని సేకరించి కొత్తగా నిర్మించే కోచ్ల్ని మరింతగా మెరుగుపరుస్తున్నాం’’ అని వైష్ణవ్ వివరించారు. -
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్: ఆ టికెట్ చార్జీల తగ్గింపు
రైల్వే శాఖ ప్రయాణికులు భారీ ఊరట కల్పించింది. ఏసీ చెయిర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రైల్వే టికెట్లను తగ్గించింది. ఈ తగింపు పథకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. అనుభూతి , విస్టాడోమ్ కోచ్లతో సహా ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్లలో w తగ్గింపు వర్తించనుంది. వందేభారత్తో సహా అన్ని రైళ్లలోని ఏసీ చైర్కార్లు, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలు, అనుభూత్, విస్టాడోమ్ కోచ్లు ఉన్నవాటిపై ఆక్యుపెన్సీని బట్టి 25 శాతం వరకు తగ్గిస్తామని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ విషయంలో గత 30 రోజులలో 50శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ (ఎండ్-టు-ఎండ్ లేదా కొన్ని నిర్దేశిత కాళ్లు/సెక్షన్లలో) ఉన్న రైలును పరిగణనలోకి తీసుకుంటామని రైల్వే తెలిపింది. అయితే, ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తగ్గించిన ఛార్జీల వాపసు లభించదు. -
Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్ల సక్సెస్ మాటేమోగానీ.. అధిక టికెట్ ధరలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. అయితే దూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండడంతో నెమ్మదిగా సాధారణ ప్యాసింజర్ రైళ్లకు ప్రయాణికులు దూరమైపోతున్నారు. అయినప్పటికీ వందే భారత్ రైళ్లనే ప్రమోట్ చేసేందుకే భారతీయ రైల్వేస్ మొగ్గు చూపిస్తోంది. ఈ క్రమంలో.. వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్ ధరల్ని తగ్గించాలని నిర్ణయించింది. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. తక్కువ దూరం ఉండే మార్గాల్లో నడిచే రైళ్లలో టికెట్ ధరలు తగ్గించాలని భారతీయ రైల్వేస్ భావిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల రూట్లకు ఇది వర్తించబోదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఇండోర్-భోపాల్ వందే భారత్ రైలు ప్రయాణ సమయం మూడు గంటలు. జూన్ నెలలో 29 శాతం ఆక్యుపెన్సీతోనే నడిచింది ఈ రైలు. అలాగే.. భోపాల్-ఇండోర్ రూట్లో 21 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. అందుకే ఈ తరహా తక్కువ దూరం ఉన్న రూట్లో టికెట్ ధరల్ని తగ్గించాలని.. తద్వారా ఆక్యుపెన్సీ పెంచుకోవాలని భావిస్తోంది రైల్వేస్. ఇక ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లల్లో మాత్రం టికెట్ ధరలు యథాతధంగా కొనసాగించాలనుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నడుస్తున్న సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లకు ఆదరణ బాగుందని అధికారులు చెబుతున్నారు. దీంతో, టికెట్ ధరల తగ్గింపు ప్రతిపాదనలు ఈ రైళ్లకు లేవని స్పష్టత ఇచ్చేశారు. ఇదిగాక.. త్వరలోనే విజయవాడ - చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. వచ్చే నెలలో మరో వందేభారత్ సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆయా రూట్లలోనూ టికెట్ ధరలు అధికంగానే ఉండొచ్చని ఇప్పటికే అధికారులు సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఇదీ చదవండి: ఇంతకీ కట్టప్ప ఎవరు? బాహుబలి ఎవరు? -
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఫుడ్ బాగాలేదని ప్రయాణీకులు సీరియస్
-
వందే భారత్పై రాళ్ల దాడి.. ఫుడ్ బాగాలేదని ప్రయాణీకులు సీరియస్
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరో వందే భారత్పై రాళ్ల దాడి జరిగింది. ధార్వాడ్-బెంగళూరు ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు.. వందే భారత్లో ఫుడ్ సరిగాలేదని ప్రయాణీకులు ఆందోళనలకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. శనివారం (జూలై 1) ధార్వాడ్-బెంగళూరు ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో రైలు కిటికీ అద్దాలకు స్వల్ప నష్టం జరిగింది. దేవంగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల మధ్య దేవంగిరి స్టేషన్ నుంచి రైలు బయలుదేరి కొంతదూరం చేరుకోగానే రాళ్ల దాడి జరిగింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఆర్పీఎఫ్ రైల్వే చట్టంలోని సెక్షన్ 153 (రైల్వే ఆస్తులను స్వచ్ఛందంగా ధ్వంసం చేయడం) కింద కేసు నమోదు చేసింది. దీని కింద ఐదేళ్ల వరకు శిక్ష విధించే నిబంధన ఉంది. కాగా, ఈ రైలును ప్రధాని మోదీ జూన్ 28వ తేదీన జెండా ఊపి ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్లో వడ్డించే ఆహారం చెడిపోయిందని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రైలు ప్రయాణిస్తున్న వారు అధికారులను నిలదీశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది కూడా చదవండి: డ్రోన్లతో రోడ్డు ప్రమాదాలకు చెక్ ? -
జస్ట్ మిస్..! వందేభారత్ కింద.. చెకింగ్ అధికారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి..
అహ్మదాబాద్: వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబయికి వెళ్తున్న రైలులో చెకింగ్ అధికారి కాస్తలో ప్రాణాలతో బయటపడ్డారు. ట్రైన్లోకి ఎక్కే ప్రయత్నంలో డోర్లు మూసుకోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. గుజరాత్ నుంచి వందేభారత్ రైలు ముంబయికి వెళుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వద్ద ఆగింది. అక్కడే ఉన్న చెకింగ్ అధికారి రైలులోకి ఎక్కడం కాస్త ఆలస్యం అయింది. అంతలోనే రైలు ప్రారంభమైంది. ట్రైన్లోకి ఎక్కే ప్రయత్నం చేశారు చెకింగ్ అధికారి. కానీ అప్పటికే డోర్లు మూసుకున్నాయి. ఈ క్రమంలో ఆయన కిందపడ్డారు. కాస్తలో రైలు కింద పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు ఆయన్ను పైకి లాగారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. Video | Gates of Mumbai bound Vande Bharat closed at Ahmedabad station & a Ticket checker was left out. Desparate to get in, he attempted something that may have cost him his life. This is reported to have happened on 26th June. #Vandebharat #Mumbai #IndianRail pic.twitter.com/WvzuQDGudN — ABS (@iShekhab) June 29, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. ట్రైన్ ఎక్కేప్పుడు జాగ్రత్తలు సూచించారు. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
‘వందే భారత్’ ఢీకొని యువకుడు మృతి.. ఎక్కడంటే..
వారణాసి నుంచి ఢిల్లీ వెళుతున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని టూండలా వద్ద చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జలేసర్-పోరా మధ్య రైలు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేమీ మొదటిది కాదు.. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగంగా వెళుతోంది. ఈ సమయంలో ఆ యువకుడు పట్టాలు దాటుతుండగా, అటువైపుగా వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ యువకుడిని ఢీకొంది. సంఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. కాగా వందే భారత్ ఎక్సెప్రెస్ కారణంగా గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. ఇదేమీ మొదటిది కాదు. పలుమార్లు ట్రాక్పైకి పశువులు వచ్చిన కారణంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ముందుభాగం స్వల్పంగా ధ్వంసమయ్యింది. అలాగే ఈ రైలు వేగం కారణంగా రైలును ఢీకొనడంతో పలు పశువులు మృతి చెందాయి. ఐదు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను స్వాగతించిన ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఐదు వందేభారత్ రైళ్లను స్వాగతించారు. భోపాల్లో ఈ రైళ్లకు పచ్చజెండా చూపారు. వీటిలో మొదటి రైలు కమలాపతి- జబల్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్. రెండవ వందేభారత్ ఖజురహో నుంచి భోపాల్ మధ్య ఇండోర్ మీదుగా నడవనుంది. ఇదేవిధంగా గోవాలోని మడ్గావ్ నుంచి ముంబైకి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు మొదలయ్యాయి. నాల్గవ వందేభారత్ ధార్వాడ- బెంగళూరు మధ్య నడవనుంది. ఇది కూడా చదవండి: బ్యాంకు డిపాజిట్ ఫారంలో.. ‘ఇదేందయ్యా ఇది..’ -
పట్టాలెక్కిన మరో ఐదు వందే భారత్ రైళ్లు.. పచ్చ జెండా ఊపిన ప్రధాని..
భోపాల్: మధ్యప్రదేశ్ నుంచి ఐదు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వీటిలో రెండిటిని ప్రత్యక్షంగా ప్రారంభించగా మూడింటిని మాత్రం వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ప్రధాని ప్రకటించిన 75 వందే భారత్ రైళ్లలో ఇప్పటికి 23 రైళ్లు పట్టాలెక్కాయి. మధ్యప్రదేశ్ షాహ్ధూల్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మొదట భోపాల్ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ చేరుకుని భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్ పూర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం గోవా- ముంబై, ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా వందేభారత్ రైళ్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈరోజు ప్రారంభించిన రైళ్లు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతాయని.. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య అనుబంధాలను మరింత మెరుగుపరుస్తాయని అన్నారు. వాణిజ్యపరంగా, పర్యాటకంగా కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుందని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది బూత్ స్థాయి కార్యకర్తలతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. అనంతరం దేశంలోని 3000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా మాట్లాడనున్నారు. #WATCH | Madhya Pradesh | PM Narendra Modi flags off five Vande Bharat trains from Rani Kamlapati Railway Station in Bhopal. Vande Bharat trains that have been flagged off today are-Bhopal (Rani Kamalapati)-Indore Vande Bharat Express; Bhopal (Rani Kamalapati)-Jabalpur Vande… pic.twitter.com/N4a72zwR0m — ANI (@ANI) June 27, 2023 ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మణిపూర్ వెళ్లి చూడండి.. -
టిక్కెట్ లేకుండా ‘వందేభారత్’ ఎక్కి.. భయంతో వాష్రూమ్లో నక్కి..
వందేభారత్ రైలులో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో వందేభారత్ ఎక్స్ప్రెస్ ఎక్కిన ఒక యువకుడు వాష్రూమ్లోకి దూరి, డోర్ లాక్ చేసుకున్నాడు. అధికారులు ఎంతచెప్పినా బయటకు రానంటూ మొండికేశాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వందేభారత్ ఎక్స్ప్రెస్లోకి ఎక్కి, వాష్రూమ్లో నక్కిన ఆ యువకుడు ఎవరు చెప్పినా బయటకు రాలేదు. అయితే రైలు పాలక్కడ్ పరిధిలోని షోర్నూర్ రైల్వే స్టేషన్కు చేరుకోగానే అధికారులు వాష్రూమ్ డోర్ పగులగొట్టి ఆ యువకుడిని బయటకు తీసుకువచ్చారు. ఆ యువకుడు ఎరుపురంగు చెక్స్ కలిగిన టీ ధరించివున్నాడు. అధికారులకు ఎంతో భయపడుతూ కనిపించాడు. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడిని ఆర్పీఎఫ్ పోలీసులు పలు విధాలుగా ప్రశ్నించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తాను మహారాష్ట్రకు చెందినవాడినని తెలిపాడు. ఆ యువకుడు హిందీలో మాట్లాడుతున్నాడు. తాను కాసర్గోడ్లో ఉంటానని కూడా ఆ యువకుడు రైల్వే పోలీసులకు తెలిపాడు. టిక్కెట్ లేకుండానే ప్రయాణిస్తూ.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకునికి సంబంధించిన ఖచ్చితమైన గుర్తింపు లభ్యం కాలేదు. పైగా ఆ యువకుడు టిక్కెట్ లేకుండానే రైలు ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ యువకుడు భయపడుతూ పోలీసులతో తనను ఎవరో వెంబడిస్తున్నారని, వారి నుంచి తప్పించుకునేందుకే రైలులోకి ఎక్కి, వాష్రూమ్లో దాక్కున్నానని తెలిపాడు. కాగా కోజికోడ్, కన్నూర్లలో రైలు ఆగినప్పుడు అధికారులు ఆ యువకుడిని వాష్రూమ్ నుంచి బయటకు రావాలని కోరినా, బయటకు రాలేదు. దీంతో అధికారులు ఆ యువకుడు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాడని గుర్తించి, వాష్రూమ్ డోర్ పగులగొట్టి, అతనిని బయటకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్వర్క్ ఉన్నా.. -
ప్రీమియం రైళ్ల స్థానంలో ‘వందేభారత్’
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో ప్రీమియం కేటగిరీ రైళ్లుగా గుర్తింపు పొంది, దశాబ్దాలుగా విజయవంతంగా నడుస్తున్న శతాబ్ది, రాజధాని రైళ్లు త్వరలో కనుమరుగు కాబోతున్నాయి. కొత్తగా ప్రారంభమై సూపర్ సక్సెస్ అయిన వందేభారత్ రైళ్లను వాటి స్థానంలో నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం పగటి వేళ నడుస్తున్న చైర్కార్ కోచ్లతో కూడిన రెగ్యులర్ వందేభారత్ రైళ్లు శతాబ్ది స్థానాన్ని ఆక్రమించనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైళ్లను రాజధాని స్థానంలో నడపాలని ప్లాన్ చేస్తోంది. దీంతో ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది, రాజధాని రైళ్లు దశలవారీగా మాయం కానున్నాయి. అదే వేగంతో.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. వీలైనంత తొందరలో 400 వందేభారత్ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే శాఖ వాటి తయారీపై దృష్టి సారించింది. చైర్కార్ కోచ్లతో ఉన్నందున వీటిని రాత్రి వేళ నడిపే వీలు లేదు. దీంతో ఉదయం నుంచి అర్ధరాత్రి లోపు గమ్యం చేరి, మళ్లీ సొంత స్టేషన్కు తిరిగి వచ్చేలా సమయాలను సెట్ చేశారు. ప్రస్తుతం శతాబ్ది రైళ్లు కూడా ఇదే తరహాలో చైర్కార్ కోచ్లతో పగటి వేళ నడుస్తున్నాయి. భారత తొలి ప్రధాని నెహ్రూ శతజయంతికి గుర్తుగా శతాబ్ది (వందేళ్లు) పేరుతో 1988లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. వచ్చే మార్చికి స్లీపర్ రైళ్లు.. తక్కువ దూరం ఉన్న ప్రధాన నగరాల మధ్య తిరుగుతున్న వందేభారత్ రైళ్లను దూరప్రాంతాల మధ్యా ప్రవేశపెట్టాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధమవుతున్నాయి. వచ్చే మార్చి నాటికి తొలి రైలు పట్టాలెక్కించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాజధాని నగరం ఢిల్లీకి, దేశంలోని ప్రధాన నగరాలకు మధ్య అనుసంధానంగా ఉన్న రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల స్థానంలో వీటిని నడపాలని భావిస్తోంది. 1969లో ఢిల్లీ–హౌరా మధ్య తొలి రాజధాని ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. ప్రస్తుతం 18 రాజధాని రైళ్లు తిరుగుతున్నాయి. రాజధానిని తేజస్ రైళ్లుగా మార్చాలని నిర్ణయించి, తేజస్ రాజధాని పేరుతో ఏడు రైళ్లను రైల్వే శాఖ ఇప్పటికే ప్రారంభించింది. తాజాగా వాటి స్థానంలో వందేభారత్ స్లీపర్ కోచ్లను నడపాలని భావిస్తోంది. -
విజయవంతంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్
యశవంతపుర: బెంగళూరు–ధార్వాడ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. సోమవారం తెల్లవారు 5:45 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు ధార్వాడకు చేరనుంది. మధ్యాహ్నం 1:15కు ధార్వాడలో బయలు దేరి రాత్రి 8:10 గంటలకు బెంగళూరుకు చేరుకోనుంది. వారంలో ఆరు రోజుల పాటు బెంగళూరు–ధార్వాడల మధ్య తిరుగుతుంది. లాంఛనంగా ఈ నెల 26న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. 6 గంటల 55 నిమిషాల వ్యవధిలో ధార్వాడకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎనిమిది బోగీలు ఉండగా 530 మంది ప్రయాణికులను తీసుకెళ్లే దీన్ని మినీ వందే భారత్ రైలుగా పిలుస్తారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో రైల్వే అధికారులు హర్షం వ్యక్తం చేశారు. -
వందే భారత్లో మొరాయించిన ఏసీలు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విశాఖపట్నం–సికింద్రాబాద్ (20833) వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతిక సమస్య తలెత్తడంతో విజయవాడ స్టేషన్లో మూడున్నర గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరాల్సిన ఈ రైలు దాని జత రైలు అలస్యం కారణంగా ఇప్పటికే 5 గంటలు అలస్యంగా బయలుదేరేలా అధికారులు రీషెడ్యూల్ చేశారు. దీంతో విశాఖలో ఈ రైలు 10.43 గంటలకు బయలు దేరింది. బయలుదేరిన కొంత సమయానికే రైలులోని నాలుగు బోగీలలో ఏసీలు పనిచేయడం ఆగిపోయాయి. అసలే వేసవి ఉక్కపోత దీనికి తోడు రైలులో తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేసి ఉండడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై కొంత మంది ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రాజమండ్రి స్టేషన్లో కొంతమంది టెక్నిషియన్లను రైలులో పంపారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ చేరుకోవడంతో ఏడీఆర్ఎం శ్రీకాంత్ పర్యవేక్షణలో సిబ్బంది సుమారు మూడున్నర గంటలు శ్రమించి మరమ్మతులు పూర్తిచేశారు. అనంతరం 5.30 గంటలకు రైలు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లింది. అసలే 5 గంటల ఆలస్యం అందులో మరోమూడున్నర గంటలు మరమ్మతుల కోసం నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విశాఖ మార్గంలో పలు రైళ్లు రద్దు విజయవాడ డివిజన్ అనకాపల్లి–తాడి సెక్షన్ మధ్యలో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రద్దు చేసిన రైళ్లు: ఈ నెల 17న గుంటూరు–విశాఖపట్నం (17239), విశాఖపట్నం–విజయవాడ (22701/22702), మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైళ్ల రద్దు, 18న విశాఖపట్నం–గుంటూరు(17240), విశాఖ పట్నం–మచిలీపట్నం (17220) రైళ్లను రద్దు చేశారు. -
విశాఖ టూ సికింద్రాబాద్: వందేభారత్ టైమింగ్స్ మార్పు..
సాక్షి, విశాఖపట్నం: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. రేపటి వందే భారత్ రైలు టైమింగ్స్ను రీషెడ్యూల్ చేసినట్టు రైల్వేశాఖ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. - కాగా, రేపు(శనివారం) విశాఖ నుంచి సికింద్రాబాద్కు వెళ్లై వందే భారత్ రైలు ఉదయం 5.45 గంటలకు కాకుండా ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. - అలాగే, రేపు(శనివారం) సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే రైలు మధ్యాహ్నం 3 గంటలకు కాకుండా రాత్రి 8 గంటలకు బయలుదేరనుందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: విశాఖ పోలీసులు అలర్ట్గా ఉన్నారు కాబట్టే కిడ్నాపర్లను పట్టుకోగలిగాం: డీజీపీ రాజేంద్రనాథ్ -
వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్ట్ దక్కించుకున్నదెవరో తెలుసా?
న్యూఢిల్లీ: దేశీ రైల్వేలు కొత్తగా ప్రవేశపెట్టదలచిన వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్టును టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(భెల్) కన్సార్షియం దక్కించుకుంది. తద్వారా మొత్తం 80 స్లీపర్ ట్రైయిన్ల తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వీటిని 2029కల్లా అందించవలసి ఉన్నట్లు సంయుక్త ప్రకటనలో టిటాగఢ్, భెల్ తెలియజేశాయి. మొత్తం కాంట్రాక్టు విలువను ర. 24,000 కోట్లుగా వెల్లడించాయి. దేశీ సంస్థల కన్సార్షియంకు ఈ స్థాయి విలువలో రైల్వే శాఖ కాంట్రాక్టునివ్వడం ఇదే తొలిసారికాగా.. వందే భారత్ స్లీపర్ రైళ్ల డిజైన్, తయారీతోపాటు.. 35 ఏళ్లపాటు నిర్వహణను చేపట్టనున్నాయి. టెండర్ విధానంలో ఏకైక ఆత్మనిర్భర్ కన్సార్షియంగా టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, బీహెచ్ఈఎల్ కన్సార్షియం నిలిచింది. (ఇదీ చదవండి: చిన్నప్పుడు స్కూల్లో నన్ను ఇలా ఎగతాళి చేసేవారు - అనంత్ అంబానీ) రెండేళ్లలో..: వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్టును ఆరేళ్లలో పూర్తి చేయవలసి ఉన్నట్లు టిటాగఢ్ రైల్ వైస్చైర్మన్, ఎండీ ఉమేష్ చౌధరీ తెలియజేశారు. తొలి ప్రొటోటైప్ రైలును రెండేళ్లలోగా డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి మిగిలిన రైళ్లను అందించనున్నట్లు వివరించారు. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) ప్రతీ రైలుకు 16 కోచ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా సువరు 887 మంది ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా డిజైన్ చేయనున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచి్చన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగమవుతున్నందుకు గర్వపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. రైళ్ల తయారీలో చివరి దశ అసెంబ్లీ, పరిశీలన, నిర్వహణ వంటివి చెన్నైలోని దేశీ రైల్వే ప్లాంటులో చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
వీడియో: వందే భారత్ రైలులో వర్షపు నీరు లీక్.. ప్రయాణికుల ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రైళ్లు ఇప్పటికే పలు ప్రమాదాల్లో దెబ్బతిన్న విషయం తెలిసిందే. అంతకుముందు జంతువులు ఢీకొనడంతో రైలు ముందు భాగం దెబ్బతిన్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక, తాజాగా వర్షాల నేపథ్యంలో రైలులో వర్షపు నీరు కారడంతో ఆ నీళ్లు బోగీలోకి ప్రవేశించాయి. దీంతో, వర్షపు నీటిని సిబ్బంది టబ్స్తో పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన కేంద్రం కేరళకు వందే భారత్ ఎక్స్ప్రెస్ను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాజధాని తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్లో స్వయంగా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది. అయితే, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో డొల్లతనం బయటపడింది. వర్షాల కారణంగా రైలులోకి వర్షపు నీరు రైలు బోగీల్లో కారింది. కాగా, భారీ వర్షాలకు ఈ రైలు చూరు లీక్ కావడంతో బోగీల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. దీంతో, వర్షపు నీటిని సిబ్బంది టబ్స్తో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, ఈ వీడియోను కేరళ కాంగ్రెస్.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనిపై సెటైరికల్ కామెంట్స్ చేసింది. వందే భారత్లో ప్రయణికులకు గొడుగులు సప్లై చేసే పరిస్థితి ఏర్పడిందంటూ కామెంట్స్ పెట్టింది. Farewell blankets, hello umbrellas: Vande Bharat redefines comfort. pic.twitter.com/8mTKeaqkYL — Congress Kerala (@INCKerala) June 14, 2023 ఇదిలా ఉండగా.. కిందటి నెలలో కురిసిన భారీ వర్షాలకు ఒకసారి ఈ రైలు టాప్ లీక్ కావడం వల్ల వర్షపు నీరు లోనికి ప్రవేశించిన విషయం తెలిసిందే. అప్పట్లో సిబ్బంది దీనికి మరమ్మతు చేశారు. నీరు లోనికి ప్రవేశించకుండా రబ్బర్ బెండ్స్ అమర్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే తరహా పరిస్థితి కనిపించింది. మరోవైపు.. ఈ ఘటనపై దక్షిణ రైల్వే స్పందించింది. కేరళ లేదా సంబంధిత రైలు సేవలను అందించే ఏ ఇతర దక్షిణాది రాష్ట్రం నుండి ఇలాంటి ఘటనలు జరిగినట్టు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసింది. కేరళలో నడుస్తున్న వందే భారత్లో అలాంటి ఘటన జరగలేదు అంటూ ట్విట్టర్లో తెలిపింది. ఇది కూడా చదవండి: బీజేపీకి ఊహించని షాక్.. సీనియర్ నేత ఔట్ -
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’ అనే డైలాగ్ ప్రయాణికులు చెప్పుకునేలా.. సరికొత్త ఆధునిక రైల్వే లైన్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా శంషాబాద్, విశాఖ నుంచి విజయవాడ మీదుగా కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. ఈ రెండు మార్గాలకు సంబంధించిన పీఈటీఎస్ సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. సాక్షి, విశాఖపట్నం : రైళ్ల వేగంలో మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే వందేభారత్ రైళ్లతో కొత్త శకానికి నాంది పలికిన భారతీయ రైల్వే శాఖ.. ఇప్పడు అంతకు మించి అన్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్ని కలుపుతూ అత్యాధునిక సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ల సామర్థ్యం 110 నుంచి గరిష్టంగా 150 కిలోమీటర్లు. ముఖ్య నగరాల్ని కలుపుతూ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా సెమీ హైస్పీడ్ రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు రాజధానుల్ని అనుసంధానం చేస్తూ.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి కానున్నాయి. తాజాగా వస్తున్న రైల్వే లైన్లు కూడా ఈ మూడు రాజధానుల్ని అనుసంధానిస్తున్నట్లుగానే డిజైన్ చేశారు. అదేవిధంగా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కీలకంగా ఉన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో ఈ లైన్లు అనుసంధానం కానున్నాయి. అంటే.. శంషాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ వరకూ ఈ సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. మొత్తం 942 కిలోమీటర్ల మేర.. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా ట్రాక్లు నిర్మించనున్నారు. 5 గంటల్లో విశాఖ టూ హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కానీ.. ఈ సెమీ హైస్పీడ్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే.. 4 నుంచి 5 గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లు గరిష్ట వేగం 160 కిలోమీటర్లు అయినా.. ప్రస్తుతం 80 నుంచి 120 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లను అప్గ్రేడ్ చేస్తున్నారు. వందేభారత్లోనూ స్లీపర్ కోచ్లు రాబోతున్నాయి. కొత్తగా రాబోతున్న ఈ ట్రైన్లు గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లేలా తయారు కాబోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో ఎక్కువ శాతం ఈ ట్రైన్లు నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకే.. ఈ సెమీ హైస్పీడ్ కారిడార్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పీఈటీఎస్కు టెండర్లు ఈ రెండు కారిడార్లకు సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే(పీఈటీఎస్)కు రైల్వే బోర్డు టెండర్లు ఖరారు చేసింది. సింగిల్ పాకెట్లో ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. రూ.2.70 కోట్లతో నిర్వహించనున్న ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సదరు సర్వే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి సర్వే పూర్తయిన వెంటనే.. ఈ సెమీ హై స్పీడ్ కారిడార్ పనులకు సంబంధించిన ప్రాథమిక అంచనా వ్యయాన్ని నిర్ధారిస్తూ.. డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే పనులకు టెండర్లు పిలవాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ కారిడార్ పనులు పూర్తయితే.. ఏపీ తెలంగాణ మధ్య రవాణా మరింత సులభతరం, వేగవంతం కానుందని వాల్తేరు డివిజన్ అధికారులు భావిస్తున్నారు. విశాఖను అనుసంధానం చేస్తూ జరుగుతున్న ఈ కారిడార్కు రైల్వే శాఖ ప్రాధాన్యమివ్వడం శుభపరిణామంగా చెబుతున్నారు. -
ఒక ట్రైన్ తయారు చేయడానికి.. ఎన్ని కోట్ల ఖర్చు అవుతుందో తెలుసా?
-
పట్టాలు తప్పిన రైలు.. 3 గంటలు ఆలస్యంగా వందేభారత్ ఎక్స్ప్రెస్
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి-తాడి మార్గంలో బుధవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు చెందిన అయిదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో విశాఖ- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దు కాగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుంది. రద్దైన రైళ్ల వివరాలు ►నేడు ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ►విశాఖ- లింగంపల్లి జన్మభూమి, విశాఖ-గుంటూరు ప్యాసింజర్ రైళ్లు రద్దు. ►రేపు లింగంపల్లి-విశాఖ జన్మభూమి, గుంటూరు-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు. ►నేడు విశాఖ- విజయవాడ, విజయవాడ-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు. చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ సోదాలు -
వందేభారత్ వచ్చేస్తోంది!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పూర్తిస్వదేశీ సాంకేతికతతో రూపొందిన సూపర్ఫాస్ట్ ట్రెయిన్ వందేభారత్ ఉమ్మడి జిల్లాలో కూత పెట్టనుంది. ఈనెలలో నాగపూర్ – సికింద్రాబాద్ మధ్య రైలు ప్రారంభానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాజీపేట – బల్లార్షా సెక్షన్లో ఈరైలు రెండుసార్లు ట్రయల్ రన్ పూర్తిచేసుకుంది. సోమవారం కూడా రైలు ఎక్కడా ఆపకుండా సికింద్రాబాద్ – నాగపూర్ వరకు 100 కి.మీ. వేగంతో నడిపినట్లు తెలిసింది. మే నెలలో తొలిసారి వందేభారత్ రైలును ఖాజీపేట – బల్లార్షా సెక్షన్లో ట్రయల్ రన్ చేపట్టగా సకాలంలో గమ్యస్థానం చేరుకుందని సమాచారం. ప్రస్తుతం సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి రూట్లలో వందేభారత్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్ – నాగపూర్ రూట్లో పరుగుతో రికార్డునెక్కనుంది. రామగుండం, కాగజ్నగర్లో హాల్టింగ్? అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన వందేభారత్ రైలు.. సికింద్రాబాద్ – ఖాజీపేట, ఖాజీపేట – బల్లార్షా సెక్షన్లో త్వరలో పరుగులు తీయనుంది. ఇటీవలే ఈ సెక్షన్లో మూడోలైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఇదే సెక్షన్ మీదుగా వందేభారత్ను సికింద్రాబాద్ టు నాగపూర్ వరకు ట్రయల్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ – నాగపూర్ వరకు 581 కిలో మీటర్లు. సాధారణ రైళ్లకై తే ఈ రెండు నగరాల మధ్య 10 గంటలకుపైగా సమయం పడుతోంది. వందేభారత్ రైలైతే 6.30 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునే వీలుంది. మొన్న జరిగిన పరీక్షల్లో రైలు కేవలం ఆరుగంటల్లోనే చేరుకుందని సమాచారం. మిగిలిన అరగంటలో హాల్టింగ్ల సమయాన్ని తీసేసినా.. ఆరున్నర గంటల్లో చేరుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెద్దపల్లి, రామగుండం, ఉమ్మడి ఆదిలాబాద్లో మంచిర్యాల, కాగజ్నగర్లో హాల్టింగ్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో మార్పులు కూడా ఉండవచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. జగిత్యాల రూట్లో నడపాలి జగిత్యాల రూట్లో చాలా మంది ఎక్స్ప్రెస్ సర్వీసు కోసం ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి – జగి త్యాల మార్గంలో వందేభారత్ రైలు నడిపితే ముంబై వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఇ ప్పుడు 10 గంటల సమయం పడుతుంది. రూ.2 వేల ఖర్చవుతుంది. వందేభారత్ వస్తే.. వేగంగా ముంబై చేరుకుంటాం, ఖర్చు తగ్గుతుంది. – నాగిరెడ్డి రాజిరెడ్డి, హార్వెస్టర్ యజమాని, జగిత్యాల పెద్దపల్లిలో హాల్టింగ్ ఇవ్వాలి ఖాజీపేట – బల్లార్షా సెక్షన్లో వందేభారత్ రైలు రానుండటం హర్షణీయం. దీంతో స్థానికులకు చాలామేలు జరుగుతుంది. పెద్దపల్లిలో హాల్టింగ్ ఉంటుందన్న ప్రచారంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లికి హా ల్టింగ్ కల్పిస్తే నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ వాసులకు అనుకూలంగా ఉంటుంది. – కొండి సతీశ్, ఆమ్ ఆద్మీ పార్టీ ట్రాక్ల సామర్థ్యం పెంపు రైలు పరుగుపెట్టనున్న నాందేడ్, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో ట్రాక్స్పీడ్ పెంచారు. సికింద్రాబాద్ పరిధిలో ఖాజీపేట – బల్లార్ష రూట్ను అప్గ్రేడ్ చేశారు. దాదాపు 130 కి.మీ. వేగంతో ఈ మార్గంలో రైళ్లు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట – రామగుండం వరకు, పెద్దపల్లి – మెట్పల్లి వరకు కనిష్టంగా 90 కి.మీ. నుంచి గరిష్టంగా 130 కి.మీ. వరకు వేగంగా వెళ్లేలా ట్రాక్లు రెడీ చేశారు. భవిష్యత్తులో వందేభారత్ రైలును పెద్దపల్లి – కరీంనగర్, కరీంనగర్ – జగిత్యాల, జగిత్యాల – నిజామాబాద్ రూట్లలోనూ నడపగలిగితే.. పొరుగున ఉన్న మహారాష్ట్రకు కేవలం మూడు, నాలుగు గంటల్లోనే చేరుకునే వీలుంటుంది. సిరిసిల్ల, జగిత్యాల విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, నేత, వలస కార్మికులకు ఇది ఎంతో అనువుగా ఉండనుంది. -
ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతం గుండానే..వందే భారత్ రైలు..
ఒడిశా రైలు ప్రమాదం ఎంతటీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఆ దుర్ఘటన తర్వాత ఆ ప్రాంతం గుండా తొలిసారిగా వందే భారత్ హైస్పీడ్ ప్యాసింజర్ హౌరా పూరీ రైలు వెళ్లింది. ఆ ప్రమాదం తర్వాత... పట్టాలు పునరుద్ధరణ పనులు పూర్తవ్వడంతో.. ఈ ఉదయమే బాలాసోర్ గుండా వందే భారత్ రైలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు . ఈ రోజు ఉదయం 9.30 నిమిషాలకు బహనాగ బజార్ స్టేషన్ను దాటినట్లు తెలిపారు. అదే సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రమాద స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. ఆ వందే భారత్ రైలు వెళ్లినప్పుడూ.. అందులోని డ్రైవర్లకు వైష్ణవ్ చేయి చూపినట్లు అధికారులు తెలిపారు. ఆ పట్టా పునురుద్ధరణ పనులు ఆదివారం రాత్రికే పూర్తయినట్లు వైష్ణవ్ తెలిపారు. ఆదివారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో వైజాగ్ పోర్టు నుంచి బొగ్గుతో కూడిన రూర్కెలా స్టీల్ ప్లాంట్ రైలు ఆ ట్రాక్పై పరుగులు పెట్టినట్లు తెలిపారు అధికారులు. కాగా ఆ మూడు రైళ్ల ప్రమాదం విషయమై ఇది మానవ తప్పిదమా? ..సిగ్నల్ వైఫల్యమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రైలు ప్రమాదం మరణాలపై సర్వత్రా ఆరోపణలు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఒడిశా ప్రధాన కార్యదర్శి) -
ట్రాక్ పునరుద్ధరణ తర్వాత వందే భారత్ రైలు ట్రయిల్ రన్
-
మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని
గువాహటి: గువాహటి(అస్సాం)–న్యూజల్పాయ్గురి(పశ్చిమబెంగాల్) వందేభారత్ ఎక్స్ప్రెస్ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈ వందేభారత్ రైలుతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి దిశగా అద్భుతమైన ప్రయాణం సాగించిందన్నారు. 2014కు పూర్వం ఊహించని అనేక విజయాలను ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గువాహటిలో ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. గువాహటి– న్యూజల్పాయ్గురి మధ్య రైలు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 6.30 గంటల నుంచి వందేభారత్ ఎక్స్ప్రెస్ రాకతో 5.30 గంటలకు తగ్గనుంది. -
త్వరలో సికింద్రాబాద్ – నాగ్పూర్ మధ్య.. వందేభారత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రాబోతోంది. హైదరాబాద్–నాగ్పూర్ మధ్య ఈ రైలు ప్రారంభం కానుంది. ఈ సంవత్సరారంభంలో దక్షిణమధ్య రైల్వేకు మూడు వందేభారత్ ఎక్స్ప్రెస్లను రైల్వే బోర్డు మంజూరు చేసింది. అందులో తొలి రైలు సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య సంక్రాంతి రోజున ప్రారంభమవగా ఏప్రిల్లో సికింద్రాబాద్–తిరుపతి మధ్య రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. మూడో వందేభారత్ రైలు హైదరాబాద్–పుణే మధ్య ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు దానికంటే ముందు నాగ్పూర్తో అనుసంధానం తెరపైకి వచ్చింది. దీనికి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా సానుకూలత వ్యక్తం చేశారు. ఈ రెండు నగరాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వందేభారత్ ఎక్స్ప్రెస్ నడపాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. తగ్గనున్న ప్రయాణ సమయం.. నాగ్పూర్–హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు శతాబ్ది, రాజధాని లాంటి ప్రీమియర్ కేటగిరీ రైళ్లు లేవు. సాధారణ రైళ్లు ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తున్నా ఇరు నగరాల మధ్య 581 కి.మీ. దూరం ఉండటంతో ప్రయాణ సమయం 11 గంటలుగా ఉంటోంది. దీంతో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తే వ్యాపార బంధం మరింత దృఢంగా మారుతుందన్న ఉద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతానికి చెందిన ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుదీర్ ముంగంటివార్ ఇటీవల రైల్వే మంత్రిని కలిసి వందేభారత్ రైలును కోరారు. విదర్భలోని వార్ధా ఎంపీ రామ్దాస్ కూడా ఈ మేరకు విన్నవించారు. వాటికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక టైంటేబుల్ ఇలా... ప్రతిపాదిత వందేభారత్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక టైంటేబుల్ను అధికారులు రూపొందించారు. దీని ప్రకా రం రైలు నాగ్పూర్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30కు సికింద్రాబాద్ చేరుకోనుంది. మళ్లీ మధ్యాహ్నం 1:30కు సికింద్రాబాద్లో బయలుదేరి రాత్రి 8 గంటలకు నాగ్పూర్ చేరుకుంటుంది. వారంలో ఆరు రోజులు ఈ రైలు తిరగనుంది. బల్లార్షా, సిర్పూర్, కాగజ్నగర్, రామగుండం, కాజీపేటల్లో ఈ రైలుకు తాత్కాలిక స్టాప్లను కేటాయించారు. ఎకానమీలో రూ.1,450– రూ.1,550, ఎగ్జిక్యూటివ్లో రూ.2,750–రూ.2,850 వరకు చార్జీలను ఖరారు చేసే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఇక వందే భారత్ స్లీపర్
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లోని ఆధునిక రైళ్లతో పోటీపడే రీతిలో రూపుదిద్దుకుని సూపర్ సక్సెస్ అయిన వందేభారత్ రైళ్ల తదుపరి వర్షన్ తయారీకి రైల్వే సిద్ధమైంది. ప్రస్తుతం చైర్ కార్ కోచ్లతో నడుస్తున్న ఈ రైళ్లలో స్లీపర్ కోచ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి డిజైన్లు రూపొందించేందుకు రైల్వే చర్యలు ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చికల్లా డిజైన్లు ఖరారు చేసి రైల్ కోచ్ల తయారీ ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుత రైలుకు భిన్నంగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 800 కి.మీ.లోపు దూరం ఉన్న ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య నడిచే తొలి వందేభారత్ రైలును, ఏప్రిల్లో రెండో వందేభారత్ సర్విసుగా సికింద్రాబాద్–తిరుపతి మధ్య నడిచే రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. పగటి వేళ నడిచే రైళ్లు అయినప్పటికీ ఈ రెండు సర్వీసులు విజయవంతమయ్యాయి. వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 140 శాతంగా నమోదవుతోంది. ఇలా దేశవ్యాప్తంగా చాలా వందేభారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. అయితే, వీటిల్లో బెర్తులు లేకపోవటంతో ప్రయాణికులు కూర్చునే వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఎనిమిది గంటల్లో గమ్యం చేరేలా సమయాలను సెట్ చేశారు. దూర ప్రాంత నగరాల మధ్య నడపాలంటే, సమయం ఎక్కువ పడుతుంది, అంతసేపు కూర్చోవటం సాధ్యం కానందున కేవలం దగ్గరి నగరాల మధ్యనే తిప్పుతున్నారు. అయితే వీటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి దూర ప్రాంత నగరాల మధ్య రాత్రింబవళ్లు తిప్పాలని రైల్వే నిర్ణయించింది. మరింత వేగంగా.... గతంలో పగటి వేళ చైర్ కార్తో తిరిగేలా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టారు. అన్ని వసతులు మెరుగ్గానే ఉన్నప్పటికీ వీటి వేగం సాధారణ రైళ్లలాగే ఉండేది. దీంతో గంటల తరబడి పగటి వేళ కూర్చుని ప్రయాణించేందుకు ప్రయాణికులు విముఖత చూపటంతో ఆ కేటగిరీ విజయం సాధించలేదు. వందేభారత్ రైళ్లు మాత్రం శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వీలుండటంతో వీటి ప్రయాణ సమయం బాగా తక్కువగా ఉంది. ఈ కేటగిరీ సక్సెస్కు ఇదే ప్రధాన కారణం. దీంతో తదుపరి స్లీపర్ కేటగిరీ రైళ్లు మరింత వేంగంగా ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. వాటి గరిష్ట వేగం దాదాపు 200 కి.మీ. మించి ఉంటుందని తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించటం ఆసక్తిని రేపుతోంది. అంత వేగంతో దూసుకుపోయేలా దీని డిజైన్ను రూపొందించనున్నారని, ఇది ప్రస్తుత వందేభారత్ రైళ్లకు భిన్నంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని కోచ్ ఫ్యాక్టరీల్లో వందేభారత్ రైళ్లను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో కొత్త రైలు నమూనాలను రూపొందించే పని ప్రారంభించినట్టు సమాచారం. మార్చి నాటికి నమూనా రైలును కూడా సిద్ధం చేసి కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా తిప్పాలని భావిస్తున్నారు. వందేభారత్ రైలు 2018లో రూపొందినా.. దాదాపు ఏడాదిన్నర పాటు దాన్ని పరిశీలించి పలు మార్పులు చేస్తూ వచ్చారు. కొత్త రైలుకు కూడా అలా పరిశీలించి మార్పులు చేసి, లోపాలు లేకుండా ప్రారంభించాలని భావిస్తున్నారు. సాధారణ రైళ్లను రీప్లేస్ చేసేలా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంప్రదాయ నమూనా రైళ్లే నడుస్తున్నాయి. ప్రీమియం కేటగిరీ రైళ్లుగా పిలుచుకునే శతాబ్ది, తేజస్, రాజధాని, దురంతో లాంటివి కూడా సంప్రదాయ రూపులోనే ఉంటున్నాయి. ఇటీవల కోచ్లను మాత్రం ఐసీఎఫ్ బదులు ఎల్హెచ్బీవి జత చేస్తున్నారు. కొత్త వందేభారత్ రైలు పట్టాలెక్కటం ప్రారంభించాక ఇక ప్రీమియం కేటగిరీ రైళ్లను కొత్త వందేభారత్తో రీప్లేస్ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత సాధారణ రైళ్లను కూడా కొత్త రూపు రైళ్లతో మార్చే యోచనలో రైల్వే ఉంది.