Advocate General
-
అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సిబ్బంది అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ మేరకు బాధిత కుటుంబాలు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్ల నుంచి సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. పోలీస్ స్టేషన్ల నుంచి సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలి. ఈ నెల 4 నుంచి ఇవాళ్టి వరకు సీసీ ఫుటేజీలను స్థానిక మెజిస్ట్రేలకు సమర్పించాలి. పౌరస్వేచ్ఛను కాపాడడంలో ఈ కోర్టుకు బాధ్యత ఉంది. చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా? లేదా?. ప్రొసీజర్ ఫాలో కాకపోతే.. భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తాం అంటూ ప్రభుత్వానికి ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం.. హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇన్నేసి పిటిషన్లు దాఖలు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. మధ్యాహ్నాం భోజన విరామం తర్వాత తిరిగి విచారణ ప్రారంభం కాగా.. ఇవన్నీ తప్పుడు పిటిషన్లని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ధర్మాసనాన్ని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఇవన్నీ నిజమైన పిటిషనలేనని, బాధిత కుటుంబ సభ్యులే వీటిని వేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో..ఏజీ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అదే టైంలో.. పిటిషన్లు వేసిన వాళ్లందరినీ పోలీసులు వదిలేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ వాదనపై న్యాయమూర్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘మీ మాటలు మేము ఎలా నమ్మాలి. మీరు వదిలేశారు అనడానికి ఆధారాలు ఏంటి?’’ అని ప్రశ్నిస్తూ.. ఆ ఆరుగురు ఎక్కడ ఉన్నారో వెంటనే కనుక్కుని చెప్పాలి’’ని ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే టైంలో పీఎస్ల సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి(11వ తేదీకి) వాయిదా వేసింది. -
ఏపీ అడ్వొకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్
సాక్షి, అమరావతి: అందరూ ఊహించిన విధంగానే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఏజీగా దమ్మాలపాటిని నియమించాలన్నది చంద్రబాబు అభిలాష అని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ను కోరారు. దీంతో సీఎస్ ఏజీ నియామక ఫైల్ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే, దమ్మాలపాటి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయి. రెండోసారి ఏజీగా దమ్మాలపాటి ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కావడం ఇది రెండోసారి. 2016లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయన ఏజీగా సేవలందించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన∙వెంటనే సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ అడ్వొకేట్ జనరల్ అయ్యారు. , దమ్మాలపాటి అదనపు ఏజీగా నియమితులయ్యారు. 2016లో వేణుగోపాల్ ఏజీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 2016 మే 28న దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వొకేట్ జనరల్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయేంత వరకు ఏజీగా కొనసాగారు. దమ్మాలపాటికే పూర్తి స్వేచ్ఛ ఏజీ నియామకం కొలిక్కి రావడంతో అదనపు ఏజీ (ఏఏజీ), ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు (ఎస్జీపీ), ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదుల (ఏజీపీ) పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. అదనపు ఏజీ పోస్టు భర్తీ చేస్తారా లేక గతంలోలా ఆ పోస్టును భర్తీ చేయకుండా వదిలేస్తారా అన్న దానిపై న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకవేళ ఏఏజీ పోస్టును భర్తీ చేస్తే జనసేన లేదా బీజేపీల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. అదనపు ఏజీ పోస్టు ఒకటా లేక రెండు ఉంటాయా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఒక అదనపు ఏజీ పోస్టు మాత్రమే భర్తీ చేస్తే జనసేనకే అవకాశం ఉంది. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) నియామకం కొంత సుదీర్ఘ ప్రక్రియ. హైకోర్టును సంప్రదించిన తరువాతే పీపీని నియమించాలి. అందువల్ల పీపీ నియామకం అలస్యమవుతుంది. టీడీపీ నుంచి ఎవరిని జీపీలు, ఏజీపీలు చేయాలన్న విషయంపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. జీపీలు, ఏజీపీలతో పాటు స్టాండింగ్ కౌన్సిల్స్ నియామకాల్లో గతంలోలానే దమ్మాలపాటి శ్రీనివాస్కు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలిసింది. శ్రీరామ్ తదితరుల రాజీనామాలకు ఆమోదం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అడ్వొకేట్ జనరల్గా పనిచేసిన శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులిచ్చి0ది. దమ్మాలపాటి వైపే చంద్రబాబు మొగ్గు తాజాగా ఏజీ పోస్టుకి పలువురి పేర్లు వినిపించాయి. సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు సహా పలువురి పేర్లు చర్చకు వచ్చాయి. అయితే చంద్రబాబు చివరకు దమ్మాలపాటి వైపే మొగ్గు చూపారు. గతంలో ఏజీగా పనిచేసి ఉండటం, పలు విపత్కర పరిస్థితుల నుంచి చంద్రబాబుతో సహా పార్టీ ఇతర నేతలను బయటపడేయడం, పార్టీలో అందరికీ అందుబాటులో ఉండటం వంటివి దమ్మలపాటికి కలసి వచ్చాయి. న్యాయవ్యవస్థలో దమ్మాలపాటికి మంచిపట్టు ఉండటం కూడా ఆయనకు సానుకూల అంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంతకాలం ఆయన ఏజీ పదవిలో కొనసాగుతారు. -
అమాయకుడేమి కాదు..రఘురామకు హైకోర్టు చురకలు
-
AP: ఆ పిటిషన్కు అర్హతే లేదన్న ఏజీ
సాక్షి, గుంటూరు: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ విచారణ అర్హతే లేదని.. పైగా పిటిషనర్లు అమరావతిలో భూముల్ని కలిగి ఉన్నారనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష కోసం.. కాబోయే పాలనా రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన జీవో నెంబర్ 2283 జారీ చేసింది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్ల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వేయాలని కోర్టును పిటిషన్ ద్వారా కోరారు వాళ్లు. అయితే ఇవాళ్టి విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) రూపేనా కోర్టు ముందుకు రావాలే తప్ప రిట్ రూపంలో కాదని ఏజీ శ్రీరామ్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్గా దాఖలు చేశారు. రాజధానితో ముడిపడి ఉన్న అంశం చీఫ్ జస్టిస్ బెంచ్ లేదంటే ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ పిటిషనర్లు కావాలనే రిట్ వేశారు. పైగా పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారు. కాబట్టి ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందన్నారు (ఫోరమ్ షాపింగ్పై పలు తీర్పులను న్యాయస్థానానికి వివరించారాయన.. ). ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదీ చదవండి: విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు -
రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు: ఏజీ
-
బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్: మనోహర్ రెడ్డి
-
అమరావతి R-5 జోన్..ఇది పేదల విజయం
-
బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వలేదన్న ఏజీ.. హైకోర్టు స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పేపర్ లీక్ కేసు బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్ను సవాల్ చేస్తూ సంజయ్ పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా సంజయ్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్(ఏజీ) కోరారు. ఇక, విచారణకు బండి సంజయ్ సహకరించట్లేదని ఏజీ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సంజయ్ తన ఫోన్ను అప్పగించలేదని ఏజీ తెలిపారు. దీంతో, ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. అనంతరం, తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్ సంచలన నిర్ణయం -
జీవో నంబర్-1పై హైకోర్టులో విచారణ.. వాదనలు వినిపించిన ఏజీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జీవో నంబర్-1పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని సీపీఐ రామకృష్ణ కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ పిటిషన్ను అత్యవసరంగా తీసుకోనక్కర్లేదని ఏజీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న చెంచ్కు పిల్ను విచారించే అధికారం లేదని ఏజీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పిల్ను తామే అత్యవసరంగా విచారిస్తామని వెకేషన్ కోర్టు తెలిపింది. కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు. -
కామారెడ్డి మాస్టర్ప్లాన్.. ఏజీకి హైకోర్టు కీలక ఆదేశాలు!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో మాస్టర్ప్లాన్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మాస్టర్ప్లాన్పై రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, రిట్ పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. రైతుల తరఫున న్యాయవాది సృజన్ రెడ్డి.. మాస్టర్ ప్లాన్ను కోర్టుకు సమర్పించారు. రైతులను పక్కనపెట్టి రీక్రియేషన్ జోన్గా ప్రకటించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని తెలిపారు. దీంతో, మాస్టర్ ప్లాన్పై ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాత పిటిషన్ను హైకోర్టు పాస్ ఓవర్ చేసింది. -
రాజాసింగ్పై వందకుపైగా క్రిమినల్ కేసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయని, అందులో ఒక హత్య కేసు కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో ఆయనపై నమోదైన రౌడీషీట్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది. రాజాసింగ్పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య టి. ఉషాభాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం కూడా విచారణను కొనసాగించింది. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు. 1860లో ఏర్ప డిన ఉత్తరప్రదేశ్లోని ఇస్లామిక సెమినరీ ప్రకారం.. ‘ఆకా’‘మౌలా’అనే పదాలు ప్రవక్తను చూచి స్తాయని చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడిన వీడియో సీడీని కోర్టు అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. అనంతరం ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. చదవండి: నన్ను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా?.. ఈటల హెచ్చరిక -
ఆ యాత్ర ఉద్దేశమే వేరు
సాక్షి, అమరావతి: అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ పాదయాత్ర చేపట్టిన రైతులు.. ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొడుతూ, వారి మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు విధించిన షరతులను అమరావతి రైతులు ఉల్లంఘిస్తున్నందున వారి యాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి.. యాత్రలో 600 మంది రైతులు మాత్రమే ఉండాలని, సంఘీభావం పేరుతో ఇతరులెవ్వరూ యాత్రలో పాల్గొనడానికి వీల్లేదంటూ ఇచ్చిన ఆదేశాలను సవరించాలని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్రావు శుక్రవారం విచారణ జరిపారు. అది ముమ్మాటికీ రాజకీయ యాత్రే పోలీసుల తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘యాత్రలో పాల్గొనే 600 మంది రైతులకు పోలీసులు గుర్తింపు కార్డులు సిద్ధం చేశారు. వాటిని జారీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాం. అయితే కొద్ది మంది మాత్రమే గుర్తింపు కార్డులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు గుర్తింపు కార్డులు చూపాలని పోలీసులు అడిగితే, కోర్టు విధించిన షరతులను సడలించాలని వారు అడుగుతున్నారు. యాత్ర వెంట నాలుగు వాహనాలకు బదులుగా 200 వాహనాలు వెంట ఉన్నాయి. అసలు అమరావతి రైతులు తలపెట్టిన యాత్ర ఉద్దేశమే వేరు. ఇటీవల గుడివాడలో అక్కడి ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి.. గుడివాడ వచ్చాం.. తేల్చుకుందాం రా అంటూ తొడలు కొడుతూ తీవ్రంగా రెచ్చగొట్టారు. వారికి కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేదు. దైవ దర్శనం కోసం వెళుతున్నామని చెప్పి రాజకీయ యాత్రగా మార్చేశారు. అందువల్ల అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి’ అని ఆయన కోర్టును అభ్యర్థించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నారు.. మంత్రులు గుడివాడ అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, ఆర్.ఎన్.హేమేంద్రనాథ్రెడ్డి, చిత్తరవు రఘు, వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. కొందరు రైతులు న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం, టీవీల్లో చర్చలు పెట్టడం చేస్తున్నారని తెలిపారు. మంత్రులపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటికి కౌంటర్ రూపంలో సమాధానం ఇస్తామన్నారు. రైతుల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. సంఘీభావం పేరుతో యాత్రలో ఇతరులు పాల్గొనడానికి వీల్లేదన్న ఆదేశాలు యాత్రలో పాల్గొనాలనుకుంటున్న వారి హక్కులను హరించేలా ఉన్నాయన్నారు. గుర్తింపు కార్డులు పొందిన వారే కాకుండా ఇతరులు కూడా యాత్రలో పాల్గొంటారని, రొటేషన్ పద్దతిలో యాత్రను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అవేం మాటలు? రైతులు దాఖలు చేసిన పిటిషన్లో ఉపయోగించిన భాషపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్నది జంతువుల్లా అలా నడుచుకుంటూ వెళ్లడానికి కాదంటూ పిటిషన్లో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును శాసించేలా పదజాలం ఉపయోగించడంపై కూడా మండిపడ్డారు. దీంతో రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు క్షమాపణలు కోరారు. -
రివ్యూనా.. ఎస్ఎల్పీనా.. పరిశీలిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ హైకోర్టు ముందు రివ్యూ పిటిషన్ లేదా సుప్రీంకోర్టు ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలుచేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు కొందరు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పెండింగ్లో ఉండగా రాజధాని వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాల్లో తాము విచారణ జరపడం సమంజసం కాదని స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పులపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు పెండింగ్లో ఉన్నప్పుడు కోర్టు ధిక్కారమన్న ప్రశ్న తలెత్తదని చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. ఈలోపు పిటిషనర్లు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును సీఎం, మంత్రులు, అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వారిచర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు దాఖలు చేసిన కోర్టుధిక్కార పిటిషన్లు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. వీటితోపాటు రాజధాని అంశంపై వ్యాజ్యాలు కూడా విచారణకు వచ్చాయి. వీటన్నింటిని సీజే ధర్మాసనం విచారించింది. -
హైకోర్టులో జీపీలు, ఏజీపీల నియామకం
సాక్షి, అమరావతి: హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకుగాను పలువురిని ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), ప్రభుత్వ సహాయ న్యాయవాదులు(ఏజీపీ)గా నియమిస్తూ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. జీపీగా నియమితులైన వారిలో గోడ రాజాబాబు, ఎల్వీఎస్ నాగరాజు, టీఎంకే చైతన్య, వేగి కొండయ్య నాయుడు, జీఎల్.నర్సింహారెడ్డి ఉన్నారు. వీరిలో టీఎంకే చైతన్య సీఐడీ స్టాండింగ్ కౌన్సిల్గా, రాజాబాబు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. జీఎల్ నర్సింహారెడ్డి ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేయగా, ఆయనకు ఇప్పుడు జీపీ పోస్టు ఇచ్చారు. ఏజీపీలుగా నియమితులైన వారిలో కుంచె ఆనందరావు, బొల్లవరపు సత్యేంద్ర మణికుమార్, గటల రాజశ్రీ, టి.రాధారాణి, కరగంజి హేమంత్ కుమార్, వై.సుబ్బారావు, బి.ధరణీ కుమార్, షేక్ ఆసిఫ్, తాయి లక్ష్మీ పద్మజ, జి. ప్రశాంతి, విశ్వనాధ శక్తిధార్, వేలూరి భరత్ సురేందర్రెడ్డి ఉన్నారు. వీరు మూడేళ్ల పాటు ఆయా పోస్టుల్లో కొనసాగుతారు. జీపీలకు నెలకు రూ.1 లక్ష, ఏజీపీలకు రూ.44 వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తారు. కాగా, జీపీలకు శాఖలను కేటాయిస్తూ ఏజీ ఎస్.శ్రీరామ్ బుధవారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ, హోం శాఖలను రెండుగా విభజించారు. కొన్ని జిల్లాలకు చెందిన హోం శాఖ కేసులను మహేశ్వర్రెడ్డికి, మరికొన్ని జిల్లాలను చైతన్యకు అప్పగించారు. రెవెన్యూ అసైన్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆంధ్ర ప్రాంతం నాగేశ్వరరావుకు, రాయలసీమ ప్రాంతాన్ని నర్సింహారెడ్డికి కేటాయించారు. రెవెన్యూ జనరల్ ఆంధ్ర ప్రాంతాన్ని సుభాష్కు, రాయలసీమ ప్రాంతాన్ని బాలస్వామికి అప్పగించారు. వేగి కొండయ్యనాయుడికి వ్యవసాయం, సహకార శాఖ, రాజాబాబుకు గ్రామ, వార్డు సచివాలయాలు, నాగరాజుకు పాఠశాల విద్యాశాఖను కేటాయించారు. -
నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ (జెడ్పీ)లను 26 జెడ్పీలుగా విభజించి, కొత్తగా ఏర్పాట య్యే జిల్లాలకు వేరుగా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ దిశగా కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగి ఐదు నెలలైంది. 13 జిల్లాల్లో ఒక్కో జెడ్పీ చైర్మన్, ఇద్దరేసి వైస్ చైర్మన్ల చొప్పున గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా పదవులకు ఎన్నికైన వారు మరో నాలుగున్నర ఏళ్లకు పైనే ఆ పదవుల్లో కొనసాగాల్సి ఉంది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు పాత జిల్లా ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్లను కొనసాగించడం మంచిది కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త జెడ్పీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అప్పట్లో తెలంగాణలో భిన్న పరిస్థితులు మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా అప్పటికే ఉన్న జెడ్పీ చైర్మన్లే పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. ఆ రాష్ట్రంలో 2016 దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అంతకు ముందు 10 జిల్లాలుగా ఉండే తెలంగాణ రాష్ట్రం జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాలుగా మారిపోయింది. 2014లో ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో వారి పూర్తి పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. అయితే రాజకీయంగా ఆ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి మధ్య చాలా తేడా ఉందని, ఈ దృష్ట్యా కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో తెలంగాణలో కొత్త జిల్లాలకు అనుగుణంగా వెంటనే జెడ్పీల విభజన చేపట్టడానికి పలు చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదనేది ఒక కారణం అని తెలుస్తోంది. అప్పట్లో తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్ల కచ్చితంగా అధికార టీఆర్ఎస్ వారే చైర్మన్లుగా గెలుస్తారో లేదో అన్న సంశయంతో పాత జెడ్పీలనే కొనసాగించారని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం అప్పటికి మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండడం వల్ల కూడా జెడ్పీల విభజన జోలికి పోలేదని సమాచారం. అయితే మన రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా 26 జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలను విభజిస్తే అన్ని చోట్ల అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉందనే విషయాన్ని గమనించాలని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ దృష్ట్యా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఏజీకి లేఖ.. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం మధ్యలో కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియలో న్యాయ పరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా.. అని నిర్ధారించుకోవడానికి పంచాయతీ రాజ్ శాఖ న్యాయ సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్కు లేఖ రాశారు. మరోవైపు జిల్లాల పునర్విభజన జరిగిన వెంటనే కొత్త జిల్లాల వారీగా జెడ్పీలను విభజిస్తే.. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి వంటి అదనపు పోస్టుల కల్పనకు కూడా పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
పరిస్థితికి తగ్గ చర్యలు
సాక్షి, అమరావతి: కొత్త వేతన సవరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏ రూపంలో ఉన్నా, వాటిని ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. పరిస్థితికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం రాజ్యాంగ వ్యతిరేకమే కాక, సర్వీసు నిబంధనలకు కూడా విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసును రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ విశాఖపట్నంకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం కోర్టు విచారణ మొదలు కాగానే సాంబశివరావు తరఫు న్యాయవాది ఎస్.శరత్ కుమార్ తమ పిల్ గురించి న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కుంభజడల మన్మధరావుల ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళుతున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో విచారణ జరపాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యోగులు ఆందోళనలు చేస్తూ ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారాన్నే ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఘర్షణ ఉండకూడదన్నారు. చర్చలు, ఏకాభిప్రాయం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా, ఉద్యోగులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని వివరించారు. ఉద్యోగులు మూకుమ్మడిగా సమ్మెకు వెళితే పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయన్నారు. ‘ఛలో విజయవాడ’ పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగులందరూ ఓ చోట చేరారని, ప్రస్తుత కోవిడ్ థర్డ్వేవ్ పరిస్థితుల్లో ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు. ఓ రకంగా రాష్ట్రాన్ని కోవిడ్ ప్రమాదంలోకి నెట్టడమే అవుతుందని తెలిపారు. అందుకే సమ్మెను నిషేధించాలని కోరుతున్నామని తెలిపారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విన్నవించారు. రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యోగులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఉద్యోగులు ప్రస్తుతం సమ్మె చేయడం లేదు కదా? అని ప్రశ్నించింది. పెన్డౌన్ మొదలు పెట్టారని శరత్ చెప్పగా, పెన్డౌన్ సమ్మె కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్ ఉండగా ఎలా అనుమతి ఇచ్చారు? ఈ వ్యవహారంలో మీ స్పందన ఏమిటని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ను అడిగింది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదన్న వాదన సరికాదని శ్రీరామ్ చెప్పారు. మరి గురువారం ఏం జరిగింది? కోవిడ్ వ్యాప్తి ఉన్నా అనుమతులు ఎలా ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. గురువారం ఛలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని శ్రీరామ్ తెలిపారు. 5 వేల మంది రావాల్సిన చోట 35 వేల నుంచి 40 వేల మంది వరకు వచ్చారని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని శ్రీరామ్ చెప్పారు. సుప్రీంకోర్టు కూడా టీకే రంగరాజన్ కేసులో ఇదే చెప్పిందన్నారు. కాబట్టి సమ్మె చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అలా అయితే ప్రభుత్వం కోవిడ్ను నియంత్రించేందుకు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా మహమ్మారి ఇతరులపై కూడా ప్రభావం చూపుతుందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలంది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తాము ఆ అంశం జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో శరత్ స్పందిస్తూ, సమ్మెకు వెళ్లకుండా ఉద్యోగులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రానున్న రోజుల్లో పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో తెలియదని చెప్పింది. ఉద్యోగుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఈ నెల 10న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. చదవండి: (సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ) -
అమరావతిపై వ్యాజ్యాలన్నీ నిరర్థకమే
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటూ చట్టాలు వచ్చిన నేపథ్యంలో వాటిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకమే అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్రెడ్డి, శాసన మండలి తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. ఆ వ్యాజ్యాల్లో విచారించడానికి ఏమీలేదని వివరించారు. ఈ ముగ్గురి వాదనలతో పాటు కేంద్ర ప్రభుత్వ వాదనలు సైతం ముగిసిన నేపథ్యంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తిరుగు సమాధానం ఇచ్చేందుకు వీలుగా తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులందరూ 4వ తేదీన అర్థగంటలో తమ వాదనలు ముగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? ఏవి నిరర్థకమయ్యాయి? అన్న పిటిషనర్ల వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరుపుతోంది. తాజాగా.. బుధవారం మరోసారి వీటిపై విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు పూర్తిచేసిన నేపథ్యంలో ఏజీ ఎస్. శ్రీరామ్, సీనియర్ న్యాయవాదులు ఎస్. నిరంజన్రెడ్డి, ఎస్.సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఆ అంశం తేలిస్తే ఇది కూడా తేల్చండి.. ముందుగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. అమరావతిని రాజధానిగా మార్చకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరుతున్నారని, ఆ అంశంపై కోర్టు తేలిస్తే, అసలు అమరావతిని పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారమే రాజధానిగా నిర్ణయించారా? అన్న అంశాన్ని కూడా తేల్చాల్సి ఉంటుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటుచేసిందన్నారు. అలాగే, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం బోస్టస్ కమిటీ, జీఎన్ రావు కమిటీలను ఏర్పాటుచేసిందని, ఇవి నిజ నిర్ధారణ కమిటీల వంటివని శ్రీరామ్ వివరించారు. ఈ నివేదికలపై న్యాయ సమీక్ష చేయడానికి లేదా వాటిని రద్దు చేయడానికీ వీల్లేదన్నారు. ఆ చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత కూడా వాటిపై దాఖలైన వ్యాజ్యాలను విచారించాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. ఏ రకంగా చూసినా అవన్నీ నిరర్థకమయ్యాయని శ్రీరామ్ తెలిపారు. సీఆర్డీఏ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. తర్వాత నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏ చట్టం చేయాలి.. ఆ చట్టం ఎలా ఉండాలన్నది ప్రభుత్వ, శాసన వ్యవస్థ పరిధిలోని అంశమన్నారు. ఆ చట్టం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉందా? లేదా? అన్నది మాత్రమే కోర్టులు చూడాల్సి ఉంటుందని తెలిపారు. సీఆర్డీఏ ప్రాంతాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో వెనక్కివెళ్లే ఉద్దేశంలేదన్నారు. అయితే.. నిధుల కొరతే ప్రధాన సమస్య అన్నారు. మాస్టర్ ప్లాన్ను అమలుచేసేందుకు రూ.1.09 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, ఇప్పుడు అది రూ.2 లక్షల కోట్లకు చేరవచ్చునని వివరించారు. ప్రాధాన్యతల ఆధారంగా కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం భవిష్యత్తులో ఏ చట్టం చేస్తుంది? అందులో ఏముంటాయి తదితర విషయాలు కోర్టుకు సంబంధంలేదన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలా? లేక మరేదైనా రాజధానిగా ఉండాలా? వంటి అంశాలను న్యాయస్థానాలను తేల్చజాలవన్నారు. ఇందుకు సంబంధించి న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. పాలనా కేంద్రం ఎంపిక రాష్ట్రం ఇష్టం అనంతరం.. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్. హరినాథ్ వాదనలు వినిపిస్తూ, రాజధాని విషయంలో తమ పాత్ర ఏమీ ఉండదన్నారు. పాలనా కేంద్రం ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని తెలిపారు. దీంతో ప్రతివాదుల తరఫున వాదనలన్నీ పూర్తి కావడంతో ఈ వాదనలకు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తిరుగు సమాధానమివ్వడం మొదలుపెట్టారు. అప్పటికి కోర్టు సమయం ముగియడంతో మరికొందరి తిరుగు సమాధానం కోసం ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 4కి వాయిదా వేసింది. ఆ రోజున అందరి వాదనలు పూర్తయితే, ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తుంది. -
పీఆర్సీ వ్యాజ్యం మళ్లీ మొదటికి..
సాక్షి, అమరావతి : ప్రభుత్వోద్యోగుల కొత్త వేతన సవరణపై దాఖలైన వ్యాజ్యం విషయంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా మరోసారి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిం ది. ఈ వ్యాజ్యాన్ని ఎవరికి కేటాయించాలన్న దాని పై సీజే తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయాన్ని బట్టి ఈ కేసు విచారణ ఆధారపడి ఉంటుంది. కొత్త వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల ను సవాలుచేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య దాఖలు చేసిన వ్యాజ్యాన్ని రోస్టర్ ప్రకారం తాము విచారించలేమని జస్టిస్ అమానుల్లా ధర్మాసనం రెండ్రోజుల క్రితం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాజ్యాన్ని ఎవరికి కేటాయించాలన్న దానిపై సీజే పరిపాలనా పరమైన నిర్ణయం తీసుకుని, దాన్ని సింగిల్ జడ్జి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తికి కేటాయించారు. దీంతో ఆ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ సత్యనారాయణమూర్తి ముందు విచారణకు వచ్చిం ది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం లో పిటిషనర్ రాజ్యాంగంలోని అధికరణ 309 కింద ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట నిబంధనలను సవాలు చేశారని తెలిపారు. హైకోర్టు రిట్ రూల్స్ ప్రకారం.. దీనిని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనమే విచా రించాల్సి ఉందంటూ సంబంధిత రూల్ను చదివి వినిపించారు. అధికరణ 309 కింద ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలపై దాఖలయ్యే వ్యాజ్యా లను సాధారణంగా మొదటి కోర్టు ముందే విచారణకు వస్తాయని శ్రీరామ్ వివరించారు. దీనిపై న్యాయమూర్తి పిటిషనర్ న్యాయవాది రవితేజ స్పందన కోరారు. ఇది ఓ ఉద్యోగి స్వతంత్రంగా వేసిన సర్వీ సు పిటిషన్ మాత్రమేనని రవితేజ తెలిపారు. తాని చ్చిన వినతులను పరిగణ నలోకి తీసుకోకుండా వేతన సవరణ చేయడంవల్ల తనకు అన్యాయం జరి గిందంటూ వ్యక్తిగతంగా పిటిషన్ వేశారని ఆయన వివరించారు. మీ వ్యాజ్యంలో మీ అభ్యర్థన ఏమిట ని రవితేజను న్యాయమూర్తి ప్రశ్నించారు. అభ్యర్థన ను స్వయంగా చదివిన న్యాయమూర్తి, ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకే వెళ్లాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యాజ్యం ఎవరికి కేటాయించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ వ్యాజ్యం తాలుకు ఫైళ్లను సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ రెండు తీర్పులనూ పరిగణనలోకి తీసుకోండి.. ఇక గత విచారణ సమయంలో జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ఉద్యోగుల జీతం ఏ విధంగా తగ్గుతుందో వివరించాలని పలుమార్లు అడిగిన నేపథ్యంలో, పిటిషనర్ కేవీ కృష్ణయ్య ఆ వివరాలతో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. 2015 పీఆర్సీ ఆధారంగా తనకు ఎంత జీతం వస్తోంది, 2022 పీఆర్సీ ఆధారంగా ఎంత వస్తుందో ఆయన వివరించారు. అలాగే, 2015 డీఏ ఆధారంగా వచ్చే జీతం, 2022 డీఏ ఆధారంగా వచ్చే జీతం వివరాలను కూడా ఆయన పొందుపరిచారు. మొత్తం మీద తనకు 2022 పీఆర్సీవల్ల రూ.6,072 మేర తగ్గుదల ఉందన్నారు. ఈ అనుబంధ పిటిషన్తో పాటు ఆయన రాష్ట్ర విభజన సందర్భంగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రహస్య నివేదికను బహిర్గతం చేయాలంటూ 2011లో అప్పటి న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి ఇచ్చిన తీర్పును జతచేశారు. ఈ తీర్పు ఆధారంగా పీఆర్సీ విషయంలో అశుతోష్ మిశ్రా సిఫారసుల నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. అంతేకాక.. కోవిడ్వల్ల ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లలో 50 శాతం వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ జీతాలు, పెన్షన్లను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి 2020లో ఇచ్చిన తీర్పునూ జతచేశారు. తన వ్యాజ్యాన్ని తేల్చేటప్పుడు ఈ రెండు తీర్పులనూ పరిగణనలోకి తీసుకోవాలని కృష్ణయ్య తన పిటిషన్లో కోర్టును కోరారు. -
సినిమా టికెట్ల ఖరారుకు కమిటీ వేశాం
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ రేట్ల ఖరారుకు హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కమిటీ ఇప్పటికే ఓసారి సమావేశమైందని, త్వరలో మరోసారి సమావేశమవుతుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఫిబ్రవరి మొదటి వారంలో రేట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున, విచారణను అప్పటికి వాయిదా వేయాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. సినిమా టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35తో సంబంధం లేకుండా, అంతకు ముందున్న విధంగానే ధరలు ఖరారు చేసుకోవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం జాయింట్ కలెక్టర్లను సంప్రదించిన తరువాతే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. సోమవారం ఈ అప్పీళ్లపై ధర్మాసనం మరోసారి విచారణ జరపగా.. ఏజీ శ్రీరామ్ టికెట్ రేట్ల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు ధర్మాసనానికి తెలిపారు. జాయింట్ కలెక్టర్లను సంప్రదించిన తరువాత టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలన్న కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని న్యాయవాది వీవీ సతీష్ చెప్పగా.. దరఖాస్తులు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లకు సూచిస్తామని ఏజీ బదులిచ్చారు. -
ఆ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది: ఏపీ అడ్వొకేట్ జనరల్
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సోమవారం ఏపీ హైకోర్టుకు నివేదించారు. ఉపసంహరణ బిల్లును ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారని వివరిం చారు. ఆ బిల్లును ఎందుకు తీసుకొచ్చారు, ఆ బిల్లు ఉద్దే శాలు ఏమిటి తదితర వివరాలతో మెమో దాఖలు చేస్తా మని చెప్పారు. బిల్లు కాపీని సైతం కోర్టు ముందుంచు తామన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు శుక్రవారానికల్లా మెమో దాఖలు చేయాలని ఏజీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. తదుపరి కార్యాచరణను ఆ రోజు నిర్ణయిస్తామని మౌఖికంగా తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమ యాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై గత 5 రోజులుగా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. -
Navjot Singh Sidhu: పంజాబ్లో పంతం నెగ్గించుకున్న సిద్ధూ
Punjab Advocate General Who Sidhu Wanted Out Resigns: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ తన పంతం నెగ్గించుకున్నారు. సిద్ధూ డిమాండ్లకు ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీ తలొగ్గారు. ఎట్టకేలకు అడ్వకేట్ జనరల్ (ఏజీ) రాజీనామాను ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నియమించాలనే నిర్ణయాన్ని ప్రకటించడంతో పంజాబ్ కాంగ్రెస్లో ప్రతిష్టంభన ముగిసినట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై చున్నీ మాట్లాడుతూ.. ఏజీ కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. ఇవాళ కేబినెట్ ఆమోదించింది. గవర్నర్ ఆమోదం కోసం పంపుతున్నాము. ఈరోజు ఆమోదం పొందితే రేపు కొత్త ఏజీని నియమిస్తామన్నారు. అంతేకాకుండా డీజీపీ పోస్టుకు చట్టప్రకారం 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారి ప్యానెల్కు పంపి.. కొత్త డీజీపీని కూడా నియమిస్తాం' అని తెలిపారు. కాగా, పంజాబ్ అడ్వకేట్ జనరల్ పదవికి ఏపీఎస్ డియోల్, డీజీపీగా ఇక్బాల్ ప్రీత్సింగ్ సహోటా రాజీనామా చేసే వరకు పీసీసీ బాధ్యతలు స్వీకరించబోనని సిద్ధూ మొండికేసిన సంగతి తెలిసిందే. -
TS High Court: దసరా వరకు ఆపుతారా.. లేదా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని సర్వే నంబర్ 301, 303, 327ల్లోని 18 ఎకరాల భూమి హక్కులపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. దసరా సెలవుల వరకు ఈ భూమి వేలం వేయకుండా ఆపుతారో.. లేదో.. ప్రభుత్వాన్ని అడిగి చెప్పాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను హైకోర్టు ఆదే శించింది. ఈ భూమిపై తమకు హక్కు లున్నాయని పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్ల ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ భూములపై పిటిషనర్లకు హక్కులు ఉన్నాయని, వేలం ప్రక్రియ నిలిపివేయాలని పిటిషన్ల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఈ భూములపై పిటిషనర్లకు హక్కులు ఉన్నాయని పేర్కొనేందుకు ఆధారాలు లేవని ఏజీ వెల్లడించారు. దీనికి స్పందించిన ధర్మాసనం... లోతుగా విచారణ చేయాల్సి ఉందని, వేలం ఆపే అవకాశం ఉందో.. లేదో.. గురువారంలోగా చెప్పాలని ఏజీకి సూచిస్తూ విచారణను 16కు వాయిదా వేసింది. చదవండి: ‘మంత్రి కేటీఆర్ ఒక అజ్ఞాని’.. ఆయన సవాల్ నేను స్వీకరించడమేంటీ.. -
నిష్ణాతులైన వారే నియామకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారుల నియామకంలో ఎలాంటి నిబంధనలు లేవని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, పరిపాలన వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న వారిని సలహాదారులుగా నియమించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సలహాదారులు నిర్వర్తించాల్సిన విధులను వారి నియామక జీవోల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు వివరించారు. వారి నియామకం తాత్కాలికమైనదని తెలిపారు. ఆ నియామకాలపై ఏ చట్టంలోనూ నిషేధం లేదని, ప్రభుత్వ అవసరాలను బట్టి వారి నియామకం ఉంటుందన్నారు. వీరి నియామకాన్ని ప్రజాధనం వృథా అనే కోణంలో చూడటానికి వీల్లేదని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ స్పందిస్తూ.. సలహాదారులను నియమించే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారా? వారు మీడియాతో మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. గతంలో ఎవరూ మీడియాతో మాట్లాడలేదన్నారు. ఏజీ వాదనలు వినిపిస్తూ.. గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడారని తెలిపారు. సాహ్ని నియామకం సరైనదే.. పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉండటం వల్ల ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమించడం సంప్రదాయంగా వస్తోందని శ్రీరామ్ కోర్టుకు వివరించారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం విషయంలో గవర్నర్కు ముఖ్యమంత్రి ఏ రకమైన సలహాలు ఇవ్వలేదని, సిఫారసు చేయలేదని తెలిపారు. ఒకవేళ సలహా ఇచ్చినా, సిఫారసు చేసినా దానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. పరిపాలనలో సమర్థత కలిగిన వారి పేర్లను ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని, అంతిమంగా గవర్నర్ తన విచక్షణాధికారం మేరకే నీలం సాహ్నిని నియమించారని వివరించారు. ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఆమె ఎస్ఈసీగా నియమితులయ్యారని చెప్పారు. ఆమె నియామకం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్రావు శుక్రవారం వాదనలు వినిపిస్తూ.. నీలం సాహ్ని ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించారని, ఆమె పేరును గవర్నర్కు సీఎం సిఫారసు చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ఎస్ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులే నియమితులు కావాలని నిబంధనలు చెబుతున్నప్పుడు, వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎస్ఈసీ నియామకం, పిటిషనర్ విచారణార్హత తదితరాలపై గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మాజీ ఏజీ దమ్మాలపాటి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ తన వాదనలు వినిపించారు. దర్యాప్తును సీబీఐ లేదా రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును లోతైన విచారణ జరిపేందుకు హైకోర్టుకు పంపాలని రాజీవ్ ధావన్ కోరారు. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. -
తప్పుకోమనడానికి కారణాలేంటి: హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తనను తప్పుకోవాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించడంపై జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరైన కారణాలు చెప్పకుండా విచారణ నుంచి తప్పుకోవాలనడం ఫోరం హంటింగ్ (అనుకూలమైన న్యాయమూర్తులు) చేయడమేనని మండిపడింది. ఇటువంటి పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ను అక్కడికి పంపాలని ఏజీ కోరారు. అయితే ఈ పిటిషన్ను తామే విచారించాలని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ ఇప్పుడే తమకు సమాచారం ఇచ్చారని జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు తెలిపారు. ఈ కేసును అత్యవసరంగా విచారణకు స్వీకరించిన తీరుపై తమకు అభ్యంతరం ఉందని, ఈ నేపథ్యంలో విచారణ నుంచి మీకు మీరుగా తప్పుకోవాలని ప్రసాద్ మళ్లీ కోరారు. ‘విచారణ నుంచి ఎందుకు తప్పుకోవాలి. ఏజీస్థాయి వ్యక్తి నుంచి ఇటువంటి అసమంజసమైన అభ్యర్థన రావడం సరికాదు. సహేతుకమైన కారణాలు లేకుండా ఇటువంటి అభ్యర్థన చేయడం ధర్మాసనంపై దాడిగా పరిగణించాల్సి ఉంటుంది. అత్యవసరంగా ఈ పిటిషన్ను విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉదయం కోర్టు ప్రారంభ సమయంలో కోరారు. కనీసం నేను కేసుకు సంబంధించిన పేపర్లను కూడా చూడలేదు, మా ముందు ఉంచనూ లేదు. భోజనం విరామం తర్వాత విచారణ చేస్తామని స్పష్టం చేశాం. తర్వాత ఈ కేసుకు సంబంధించిన పేపర్లను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు రిజిస్ట్రీ అధికారులు ఉంచారు. మా ధర్మాసనాన్ని విచారించాలని సీజే సూచించారు. తమకు అనుకూలమైన ధర్మాసనం కోసం తెలంగాణ ప్రభుత్వం (ఫోరం హంటింగ్) ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏజీ కార్యాలయం ఇటువంటి ట్యాక్టిక్స్ కోసం పాకులాడదని భావిస్తున్నాం. నన్ను తప్పుకోవాలనేందుకు సరైన కారణాలు చూపనందున ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం. పిటిషన్ను విచారిస్తాం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఏజీ ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ.. జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోర్టు ప్రారంభ సమయంలో అభ్యర్థించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మాత్రమే ఈ తరహా పిటిషన్లను విచారించాల్సి ఉందని, ఈ ధర్మాసనం విచారించడానికి లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచందర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలు ప్రతివాదులుగా ఉన్న పిటిషన్లను విచారించే పరిధి ఈ ధర్మాసనానికి మాత్రమే ఉందని వెంకటరమణ నివేదించారు. ఈ పిటిషన్ను భోజన విరామం తర్వాత విచారిస్తామని, అభ్యంతరాలుంటే అప్పుడు తెలియజేయాలని జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు స్పష్టం చేశారు. దీంతో వెంటనే జె.రామచందర్రావు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ముందు హాజరై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసుల విచారణ రోస్టర్కు విరుద్ధంగా జస్టిస్ రామచందర్రావు నేతృత్వంలోని ధర్మాసనం ఓ పిటిషన్ను భోజన విరామం తర్వాత విచారించేందుకు అనుమతి ఇచ్చిందని, ప్రస్తుత కేసుల విచారణ రోస్టర్ ప్రకారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మాత్రమే ఆ పిటిషన్ను విచారించాలని తెలిపారు. అయితే ఇదే విషయాన్ని జస్టిస్ రామచందర్రావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు చెప్పాలని సీజే స్పష్టం చేస్తూ ఏఏజీ అభ్యర్థనను తోసిపుచ్చారు. అంతర్రాష్ట్ర జల వివాదాల్లో ఈ పిటిషన్ ఎలా విచారణార్హం? అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఉన్నప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులు జలవివాదాలపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి వీల్లేదని రాజోలిబండ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని.. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగం ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ఎలా విచారణార్హమని హైకోర్టు ప్రశ్నించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 100 శాతం విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34ను సవాల్ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు శివరామకృష్ణ ప్రసాద్తోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం భోజన విరామం తర్వాత అత్యవసరంగా విచారించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 11 కింద ఈ పిటిషన్ ఎలా విచారణార్హం అని ధర్మాసనం వెంకటరమణను ప్రశ్నించింది. ఇటువంటి వివాదాల్లో ట్రిబ్యునల్స్ మినహా హైకోర్టు, సుప్రీంకోర్టులు పిటిషన్లను విచారించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొంది. ఈ సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచందర్రావు ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా.. ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరై వాదన లు వినిపిస్తున్నారని, ఆయనకు గౌరవం ఇవ్వాల ని ధర్మాసనం ఏఏజీకి సూచించింది. ‘రాజోలిబండ’కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి రావాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది, ఇరు రాష్ట్రాల ఏజీలకు సూచిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
సీఎం జగన్ కేసుల ఉపసంహరణపై హైకోర్టులో వాదనలు
సాక్షి, అమరావతి: సీఎం జగన్పై కేసుల ఉపసంహరణ అంశంపై ఏపీ హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. జ్యుడీషియల్ అధికారాలను హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ అతిక్రమించిందని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వ్యాఖ్యానించారు. హైకోర్టు పరిపాలనా విభాగం సుమోటోగా తీసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ మొత్తం సీఆర్పీసీకి విరుద్ధంగా నడుస్తోందని ఏజీ వాదించారు. హైకోర్టులో రోస్టర్ జ్యుడీషియల్ పరిధిలోని అంశమేనని ఆయన తెలిపారు. గతంలో అడ్మినిస్ట్రేటివ్ వివరాలతో జస్టిస్ రాకేశ్కుమార్ వ్యాఖ్యలు చేస్తే.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. మాకు నోటీసులు ఇవ్వకుండానే మీడియాలో చర్చ జరిగిందని అన్నారు. ఓ టీవీ ఛానల్ ఏకంగా పెద్ద కార్యక్రమాన్నే నడిపిందని ఏజీ శ్రీరాం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయాలు తీసుకుందని టీవీ కార్యక్రమంలో చర్చించారని, దిగువ కోర్టు ఆర్డర్స్పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని ఆయన కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు కేసును ఈనెల 25కు వాయిదా వేసింది. చదవండి: సీఎం జగన్ను కలిసిన జస్టిస్ వి.కనగరాజ్ -
హైకోర్టు ఏజీ పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్
సాక్షి, హైదరాబాద్: హైకోర్ట్ అడ్వకేట్ జనరల్ బీ.శివ ప్రసాద్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ సృష్టించినట్లు సైబర్ క్రైమ్స్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ అకౌంట్ నుంచి పలువురు ప్రముఖులకు ఫ్రెండ్స్ రిక్వెస్టులు, మెసేజ్లు చేస్తున్నారని అందులో తెలిపారు. తక్షణమే తన పేరు మీదున్న నకిలీ అకౌంట్ను తొలగించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఏజీ కోరారు. చదవండి: ఆన్లైన్ పోర్న్ సినిమాలకు బానిసై.. విపరీత చేష్టలు -
బురదజల్లడానికే నిమ్మగడ్డ పిటిషన్
సాక్షి, అమరావతి: గవర్నర్కు తాను రాసిన లేఖలు లీక్ అయ్యాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేశ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగంపై బురదజల్లడమేనని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ప్రతి ప్రభుత్వ యంత్రాంగం ప్రతిష్టను అపఖ్యాతి పాల్జేసేందుకే ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. ఈ పిటిషన్ను గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారించారు. ఈ సందర్భంగా ఏజీ తన వాదనలు వినిపిస్తూ.. లేఖల లీక్ జరిగిందంటున్న నిమ్మగడ్డ, అలా లీక్ కావడం ఏ చట్ట ప్రకారం నేరమో చెప్పడం లేదన్నారు. ఏ కేసులో పడితే ఆ కేసులో, ఎలా పడితే అలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి వీల్లేదని, న్యాయస్థానాలు అధికరణ 226 కింద తమ విచక్షణాధికారాలను చాలా జాగ్రత్తగా, అరుదుగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. తాను హైకోర్టు జడ్జితో సమానమంటూ చెప్పుకొన్న నిమ్మగడ్డ.. అదే రీతి హుందాతనాన్ని ప్రదర్శించలేకపోయారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటిషన్ వేశారని, ఇప్పుడు గౌరవ ప్రదమైన గవర్నర్ కార్యాలయంపై కూడా ఆరోపణలు చేస్తూ వివాదంలోకి లాగారని తెలిపారు. నిమ్మగడ్డ గతంలో కేంద్రానికి రాసిన లేఖ వాస్తవానికి ఓ రాజకీయ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిందని, దీనిపై ఓ ఎంపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేశారని చెప్పారు. దీనిపై నిమ్మగడ్డ, ఎన్నికల కమిషన్ కార్యాలయ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్కు రాసిన లేఖలు బయటకు రావడాన్ని ఏ చట్టం అడ్డుకుంటుందో నిమ్మగడ్డ ఎక్కడా చెప్పడం లేదన్నారు. గతంలో న్యాయశాఖ మంత్రి, ఢిల్లీ హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు సీజేకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు బహిర్గతం అయ్యాయని, అప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి వాటికి ఎలాంటి రక్షణ ఉండదంటూ తీర్పునిచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. లేఖల లీక్ వల్లే హక్కుల ఉల్లంఘన నోటీసులు వచ్చాయని నిమ్మగడ్డ చెబుతున్నారుగా? దీనిపై ఏమంటారని ప్రశ్నించారు. ప్రస్తుత కేసుకూ దానికి ఏ మాత్రం సంబంధం లేదని ప్రశాంత్ తెలిపారు. గవర్నర్కు రాసిన లేఖలే హక్కుల ఉల్లంఘన నోటీసులకు దారి తీశాయా? అన్న అంశంపై తాను తన కౌంటర్లో స్పష్టతనిస్తానని చెప్పారు. ప్రతివాదులైన మంత్రి బొత్స సత్యనారాయణ, మెట్టు రామిరెడ్డి తరఫు న్యాయవాదుల వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 6కి వాయిదా వేస్తూ జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీచేశారు. అదేరోజున నిమ్మగడ్డ తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తిరుగు సమాధానం ఇచ్చేందుకు సైతం అనుమతి ఇచ్చారు. చదవండి: చంద్రబాబు సర్కారులో వైద్య పరికరాల స్కామ్ -
లాయర్ దంపతుల హత్య బాధాకరం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: లాయర్ వామన్రావు దంపతుల హత్య చాలా బాధాకరమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశం మంత్రి మాట్లాడుతూ.. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తమ పార్టీ చెందినవాడేనని తెలిసి తక్షణమే తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నారని, న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామని హామీనిచ్చారు. వామన్రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది తెలంగాణ న్యాయవాదులేనని ప్రశంసించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. హైకోర్టు విభజన కోసం సీఎం కేసీఆర్ దాదాపు 10 సార్లు ప్రధాని మోదీని కలిశారని, విభజన జరిగాకే తెలంగాణకు తగిన న్యాయం జరిగిందన్నారు. ఆరున్నరేళ్లలో వ్యవసాయమే అబ్బురపడేలా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ పథకాలను ప్రధాని మోదీ కాపీ కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. పేదలు సంతోషంగా ఉండాలనే పెన్షన్లతో సహా ఎన్నో సంక్షేమ పథకాలు ఆమలు చేస్తున్నామన్నారు. కేజీ టూ పీజీ విద్యపై కొందరు అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని,సంక్షేమ గురుకులాల్లో ఈ పథకం ఇప్పటికే నడుస్తోందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్పై కొందరు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని, అది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నామన్నారు. కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వకుండా పరుష పదజాలంతో మాట్లాడటం బాధ కలిగిస్తోందన్నారు. కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ లేవని పేర్కొన్నారు. చదవండి: ‘ఎన్డీయే.. నో డేటా అవైలబుల్’ -
‘పుర’ఎన్నికల ప్రక్రియ కొనసాగనివ్వాలి
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల నిర్వహణ విషయంలో తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయ మూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కారణం గా గత ఏడాది పురపాలక ఎన్నికలు ఏ దశలో వాయిదా పడ్డాయో, తిరిగి ఆ దశ నుంచే మొదలవుతాయంటూ ఈ నెల 15న ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ను రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నక్కా యశోద, కంచు మధుసూధన్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన చిప్పిడి విష్ణువర్ధన్రెడ్డి, మరో ఆరుగురితో పాటు మరి కొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై మంగళవారం జస్టిస్ సోమయాజులు మరోసారి విచారణ జరిపారు. ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు.. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫు న్యాయ వాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో, అక్కడి నుంచి ఎన్నికలను పెట్టాలన్న నిర్ణయంపై దాఖలైన వ్యాజ్యాలకు అసలు విచారణార్హతే లేదన్నారు. కరోనా కారణంగానే గత మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేశామని, దీన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగింపులో భాగంగానే అప్పుడు నిలిచిపోయిన ఎన్నికలను ఇప్పుడు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఎన్నికల కమిషన్ది ఏకపక్ష నిర్ణయం కాదు.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వంతో సంప్రదించిన తరువాతే పురపాలక ఎన్నికల ప్రక్రి యను పునరుద్ధరిస్తూ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియను కొనసాగనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది ఎన్నికలను వాయిదా వేసేటప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పుడు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పిం దని గుర్తుచేశారు. ఈ ఉత్తర్వులను పిటిషనర్లు సవాలు చేయలేదన్నారు. ఎన్నికల్లో పోటీచేయడం, పాల్గొనడం చట్టబద్ధ హక్కు మాత్రమేనని తెలిపారు. గతంలో ఆపిన చోటునుంచే ఎన్నికలను కొనసాగించాలన్న కమిషన్ నిర్ణయం ఏకపక్షం ఎంతమాత్రం కాదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
వ్యక్తి స్వేచ్ఛను కాపాడారు..
సాక్షి, హైదరాబాద్: వ్యక్తులు అదృశ్యమైన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు దాఖలు చేసే హెబియస్ కార్పస్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అత్యవసరంగా విచారించి వ్యక్తి స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను కాపాడారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయిస్తే సత్వర న్యాయం లభిస్తుందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించారన్నారు. జస్టిస్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో న్యాయమూర్తులతో కూడిన ఫుల్కోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. దేశంలోనే తెలం గాణ రాష్ట్రం అభివృద్ధితోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని సీజే ఆకాంక్షించేవారని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చారని ప్రసాద్ పేర్కొన్నారు. ఎర్రమంజిల్ను కూల్చి అక్కడ సచివాలయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చి, చారిత్రక కట్టడాన్ని రక్షించాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తుచేశారని తెలిపారు. కష్టపడితేనే న్యాయవాదిగా గుర్తింపు: సీజే న్యాయవాద వృత్తిలో షాట్కట్స్ ఉండవని, కష్టపడిన వారికే మంచి గుర్తింపు లభిస్తుందని జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. యువ న్యాయవాదులు కష్టపడాలని, సీనియర్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో కూడా న్యాయమూర్తుల సహకారంతో కేసులను విచారించి ప్రజలకు సత్వర న్యాయం అందించామని తెలిపారు. న్యాయమూర్తిగా ఇక్కడ పనిచేయడం తనకెంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని వివరించారు. న్యాయమూర్తులతోపాటు హైకోర్టు రిజిస్ట్రార్లు, ఇతర న్యాయాధికారులు, తన కార్యాలయ సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ రాజశేఖర్రెడ్డి, ఇతర న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్రెడ్డి, లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి అనుపమా చక్రవర్తి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల బీమా పథకానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: న్యాయవాదుల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టిన లాయర్ల బీమా పథకం అమలుకు రాష్ట్ర బార్ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బార్ కౌన్సిల్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. మొదటి పాలసీని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్కు కంపెనీ ప్రతినిధులు గురువారం అందచేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, సభ్యుడు యర్రంరెడ్డి నాగిరెడ్డి, రవి గువేరా తదితరులు పాల్గొన్నారు. న్యాయవాది, వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల వరకు నగదు రహిత వైద్యసాయం, రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించాలని అడ్వొకేట్ జనరల్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ బీమా సౌకర్యం కోసం 15,552 మంది న్యాయవాదులు బార్ కౌన్సిల్ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ప్రీమియం కింద ఒక్కొక్కరు రూ.5,348 చొప్పున చెల్లించాల్సి ఉండగా, ఇందులో న్యాయవాది వాటా రూ.1000 కాగా, మిగిలిన మొత్తాన్ని(రూ.4,348) ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది. సంక్షేమ నిధికి ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి ఈ ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. 2020, డిసెంబర్ 30 నుంచి 2021, డిసెంబర్ 29 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుందని బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి రూ.25 కోట్లు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు గంటా రామారావు, నాగిరెడ్డి తదితరులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి కూడా ఇదే విషయంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
అభ్యంతరాలను తెలుపుతూ లేఖ రాయండి: హైకోర్టు
సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈక్రమంలో ఎన్నికల నిర్వహణపై తాము నివేదించిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ (ఏజీ) కోర్టుకు తెలిపారు. ఎన్నికల తేదీ పైనే కాదు ఎన్నికలు జరగాల్సిన నెల పైన కూడా చర్చించాలని అన్నారు. దీంతో ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు తెలుపుతూ మూడు రోజుల్లో ఎన్నికల కమిషనర్కు ఒక లేఖ రాయమని హైకోర్టు ఏజీని ఆదేశించింది. అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారులంతా ఎన్నికల కమిషన్తో చర్చించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక ఎన్నికల నిర్వహణా వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధంకాగా.. కరోనా పరిస్థితులు, ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ప్రభుత్వ వాదనలు వినకుండానే..
సాక్షి, అమరావతి: పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోవడం, తమ ఉత్తర్వులపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంపై.. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా, లేదా అనేది తేలుస్తామంటూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ ఉత్తర్వుల్ని వెనక్కు తీసుకోవాలని (రీకాల్) ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కనీసం వాదనలు కూడా వినకుండానే కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని, అప్పటివరకు విచారణ వాయిదా వేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లినా తమకు అభ్యంతరం లేదని, విచారణను వాయిదావేసే ప్రసక్తేలేదని చెప్పింది. సోమవారం జరిగిన విచారణలో కనీసం అడ్వొకేట్ జనరల్ వాదనను వినిపించుకోకుండానే అనుబంధ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేస్తామని, రెండువారాలు వాయిదా వేయాలని అడిగినా పట్టించుకోకుండా బుధవారానికి వాయిదా వేసింది. ‘రాష్ట్రంలో పోలీసులు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం, తరువాత వారిని కోర్టు ముందు హాజరుపరచడమో లేదా విడుదల చేయడమో చేస్తున్నారు. దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరాం. ఇలాంటివి పునరావృత్తం కావని డీజీపీ కోర్టుకు హామీ ఇచ్చారు. అయినా పోలీసుల్లో పెద్ద మార్పేమీ రాలేదు. ఇదే సమయంలో హైకోర్టు ఉత్తర్వులపై సామాజిక మాధ్యమాల్లో పలువురు విమర్శలు, దూషణల దాడులకు దిగారు. ఇందులో అధికార పార్ట ఎంపీ కూడా ఉన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశాన్ని తేలుస్తాం’ అని న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఏజీగా కోర్టు నిష్పక్షపాతాన్ని కోరుకుంటున్నా.. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినకుండానే ధర్మాసనం.. ప్రభుత్వ అనుబంధ పిటిషన్ను కొట్టేసింది. తన వాదనలు వినాలని ఏజీ పలుమార్లు అభ్యర్థించినా జస్టిస్ రాకేశ్కుమార్ పట్టించుకోలేదు. తనకు వాదనలు చెప్పే అవకాశం, పలు న్యాయస్థానాల తీర్పులను ప్రస్తావించే అవకాశం ఇవ్వకపోవడం ఎంతమాత్రం సరికాదని శ్రీరామ్ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వాదనలు వినలేదన్న విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని ఏజీ కోరినా జస్టిస్ రాకేశ్కుమార్ సానుకూలంగా స్పందించలేదు. దీనిపై తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేసిన అడ్వొకేట్ జనరల్.. తాను చెప్పిన వివరాలను ఉత్తర్వుల్లో ప్రస్తావించడం ద్వారా కోర్టు నిష్పక్షపాతాన్ని ఏజీగా తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఏజీ నుంచి ఇలాంటి వాదనను ఆశించడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించగా, న్యాయస్థానం నుంచి తాము కూడా ఇలాంటి దానిని ఆశించడంలేదని ఏజీ ఘాటుగా బదులిచ్చారు. సుప్రీంకోర్టులో కేసు తేలిన తరువాతే ఈ కేసులో కోర్టుకు సహకరిస్తానని తేల్చిచెప్పారు. ఓ అడ్వొకేట్ జనరల్ ఇలా అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తంచేసే పరిస్థితిని న్యాయస్థానం కల్పించడం తెలుగు రాష్ట్రాల న్యాయవ్యవస్థ చరిత్రలో అరుదైన ఘటనగానే చెప్పాలి. ఇందుకనుగుణంగా మధ్యాహ్నం జరిగిన విచారణకు ఏజీ కాకుండా ప్రభుత్వ న్యాయవాది సుమన్ హాజరయ్యారు. ఫలానా కారణాల ఆధారంగా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న భావనతో కోర్టు విచారణ జరుపుతున్న పరిస్థితుల్లో, ఆ అంశాలపై కౌంటర్ దాఖలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని, అందువల్ల విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని సమన్ కోరారు. ఇందుకు సైతం నిరాకరించిన ధర్మాసనం ఏజీ ఎందుకు రాలేదని ప్రశ్నించింది. ఏజీ తాను మధ్యాహ్నం విచారణకు రాబోనని ముందే చెప్పారని, అందుకే తాను వచ్చానని సుమన్ చెప్పారు. వాదనలు వినిపించేందుకు ఏజీ కాకుండా మీరెలా వస్తారని సుమన్ను ధర్మాసనం ప్రశ్నించింది. తాను ఏజీకి అనుబంధ బృందంగా పనిచేస్తున్నానని, ఇదే ధర్మాసనం చాలా కేసుల్లో అడ్వొకేట్ జనరల్ తరఫున తాను హాజరయ్యేందుకు అనుమతినిచ్చి, వాదనలు కూడా విందని, ఇప్పుడు ఈ కేసులో మాత్రం అనుమతించబోమని చెప్పడం సరికాదని సుమన్ స్పష్టం చేశారు. అయినా ధర్మాసనం వినిపించుకోలేదు. సుమన్ వాదనలు వినిపిస్తుండగానే కోర్టువర్గాలు ఆయన మైక్ను మ్యూట్ (మాట వినిపించకుండా) చేసేశాయి. పిటిషనర్లు కోరనిదానిపై విచారణకు వీల్లేదు.. రాజ్యాంగం వైఫల్యం చెందిందని చెప్పేందుకు హైకోర్టు చూపిన కారణాలపై పోలీసుల తరఫున హాజరవుతున్న ప్రభుత్వ ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ ఎస్.ఎస్.ప్రసాద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాజకీయ అనిశ్చితి, న్యాయ అరాచకం, శాసనవ్యవస్థ వైఫల్యం వంటివి ఉన్నప్పుడే రాజ్యాంగం వైఫల్యం చెందినట్లు భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఓ తీర్పులో చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేనప్పుడు రాజ్యాంగం వైఫల్యంపై సుమోటో (తనంతట తాను)గా విచారణ చేపట్టే పరిధి హైకోర్టుకు లేదని చెప్పారు. హైకోర్టు ముందు విచారణకు ఉన్న కేసులకు, హైకోర్టు విచారిస్తామంటున్న అంశాలకు పొంతన లేదన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని కోర్టు తీర్పునిస్తే.. రాజ్యాంగం కల్పించిన రక్షణ కోర్టుకు ఉండదని, కోర్టుకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించే పరిస్థితి వస్తుందని తెలిపారు. రాజ్యాంగ వైఫల్యం చెందిందని ఓ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేస్తే దానికి ఎంత విలువ ఉంటుందో, కోర్టు తీర్పునకు కూడా అంతే విలువ ఉంటుందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని ప్రకటించాలని పిటిషనర్లు కోరలేదని, పిటిషనర్లు కోరని అంశంపై విచారణకు వీల్లేదని చెప్పారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశించాలని కోరుతూ పలువురు వ్యక్తులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రాజధాని ప్రాంతంలో తాము చేస్తున్న నిరసనలకు పోటీగా ఇతరులెవ్వరూ కార్యక్రమాలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత తెనాలి శ్రావణ్కుమార్ పిల్ వేశారు. ఈ వ్యాజ్యాలపై కొద్దికాలంగా విచారణ జరుపుతున్న జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం.. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామంటూ ఆ దిశగా విచారణ మొదలుపెట్టింది. -
ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ నిలుపుదలపై నిర్ణయం వాయిదా
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర ఉత్తర్వులపై న్యాయస్థానం సోమవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లోగా నిర్వహించాలని 2018లోనే హైకోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించిందన్నారు. ఎన్నికల వాయిదాకు అప్పటి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను హైకోర్టు తోసిపుచ్చిందన్నారు. అయితే న్యాయస్థానం ఆదేశించిన విధంగా ఎన్నికల నిర్వహణలో కమిషన్ విఫలమైందని నివేదించారు. అనంతరం 2020లో ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టిన ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేసిందని తెలిపారు. ఆ తరువాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికలు నిర్వహించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వద్దనేందుకు సహేతుకమైన కారణం ఉందని, ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, దీని తరువాతే మిగిలినవని తేల్చి చెప్పారు. షెడ్యూల్ రాకుండా ఎన్నికల ప్రక్రియ ఎలా మొదలవుతుంది? పరిపాలనాపరమైన కారణాల వల్ల గతంలో ఎన్నికలు నిర్వహించలేకపోయామని ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రమైనదని, ఫలానా సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎవరూ శాసించలేరన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు స్పందిస్తూ ఎన్నికల షెడ్యూల్ రాకుండా ప్రక్రియ ఎలా మొదలవుతుందని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఏజీ శ్రీరామ్ నివేదించారు. -
గత పాలకులది విశ్వాసఘాతుకం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్ల కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు బుధవారం ముగిశాయి. భూముల కొనుగోళ్ల డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ దీనిపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ప్రకటించారు. అంతకు ముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ రాజధానిపై తమకు కావాల్సిన వారికి లీకులివ్వడం ద్వారా గత పాలకులు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, సమాజాన్ని మోసగించారని హైకోర్టుకు నివేదించారు. రాజధాని నిర్ణయానికి సంబంధించి అధికారిక రికార్డులు లేవని, వీలునామా రాసినట్లుగా, కుటుంబ ఆస్తులు పంపకాలు చేసుకున్నట్లుగా నిర్ణయాలు తీసుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. రాజధాని నడిబొడ్డున, రింగ్రోడ్డు పక్కన, కీలక ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడం యాదృచ్ఛికం ఎలా అవుతుందన్నారు. దీని వెనుక భారీ కుట్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. రైతులను తప్పుదోవ పట్టించి భూములను కారుచౌకగా కొనేశారని, ఇదే విషయాన్ని పోలీసుల ఎదుట వాంగ్మూలం కూడా ఇచ్చారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రైవేట్ భూ కొనుగోళ్ల లావాదేవీలను నేర పరిధిలోకి తీసుకురావడం సబబేనా? అని ప్రశ్నించారు. నేరపూరిత కుట్ర ఉంది కాబట్టే కేసు నమోదు చేసినట్లు శ్రీరామ్ తెలిపారు. ఈ భూముల కొనుగోళ్లతో ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏముందని న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించడంతో నష్టం అన్నది ఆర్థిక రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదని ఏజీ చెప్పారు. రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని అధికార ప్రకటనకు ముందే కొందరికి మాత్రమే వెల్లడించడం వల్ల సమాజంలో మిగిలిన వారు నష్టపోయారన్నారు. ఇలాంటి చర్యలన్నీ ఆర్థిక నేరాల కిందకు వస్తాయని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ కోరితే ఇప్పటివరకు స్పందించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, కిలారు శ్రీహాస తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ అమరావతినే రాజధానిగా చేస్తారని 2014 మార్చి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని, పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని వివరించారు. నార్త్ఫేస్ హోల్డింగ్స్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ రాజధానికి 8 కిలోమీటర్ల అవతల భూములు కొనుగోలు చేస్తే తప్పుబడుతున్నారన్నారు. -
తీర్పు ఎందుకు ఇవ్వకూడదు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందంటూ తీర్పునిచ్చేందుకు ఉన్న అవకాశాలను హైకోర్టు పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు, శాసన మండలి రద్దు వివరాలు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టింగ్లపై సీబీఐ దర్యాప్తు తీర్పు, నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసులో సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పు.. ఇలా పలు అంశాల్లో ఇచ్చిన తీర్పులను, ఇతర వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. వీటితోపాటు రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని భావించేందుకు ఆస్కారం ఉన్న వివరాలన్నింటినీ తమ ముందు ఉంచవచ్చని పిటిషనర్లకు వెసులుబాటునిచ్చింది. అంతేకాకుండా రాజ్యాంగం వైఫల్యం చెందిందని ఎందుకు తీర్పునివ్వకూడదో చెప్పాలని పిటిషనర్లకు సూచించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యంపై తీర్పునిస్తామని పేర్కొంది. కాగా దీనిపై పోలీసుల తరఫున హాజరవుతున్న సీనియర్ స్పెషల్ కౌన్సిల్ సర్వా సత్యనారాయణ ప్రసాద్ అభ్యంతరం తెలిపారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో రాజ్యాంగం వైఫల్యం చెందిందంటూ తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. అలాంటి తీర్పునిచ్చే పరిధి హైకోర్టుకు లేదని, దీనిపై పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తామని నివేదించారు. ఏ అంశాల ఆధారంగా తీర్పునివ్వబోతున్నారో ముందే తమకు తెలియచేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టును కోరారు. తద్వారా ఆయా అంశాలపై తాము స్పష్టమైన వివరణలతో వాదనలు వినిపిస్తామన్నారు. పిటిషనర్ల వాదనల నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 10వతేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు 144 సెక్షన్ ప్రయోగిస్తున్నారని, తమకు పోటీగా ఎవరూ కార్యక్రమాలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత తెనాలి శ్రవణ్కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అలాగే వేర్వేరు అంశాలకు సంబంధించి పోలీసులపై ఆరోపణలు చేస్తూ పలువురు వ్యక్తులు వేర్వేరుగా పలు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది. ఇలా అయితే పోలీసులు పని చేసేదెలా? పోలీసుల తరఫున సీనియర్ స్పెషల్ కౌన్సిల్ సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ పోలీసులు అరెస్ట్ చేసింది తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడిన వారినని, పోలీసులపై పిటిషనర్లు చేసిన ఆరోపణలు ఏ దశలోనూ నిరూపితం కాలేదని తెలిపారు. ఇతర వివాదాస్పద అంశాల జోలికి న్యాయస్థానం వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. న్యాయస్థానం ఇలా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ, ప్రతి పనినీ తప్పుపడుతుంటే పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేరన్నారు. వ్యక్తుల అరెస్ట్పై పిటిషన్లు దాఖలు చేస్తే రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం లాంటి అంశాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆ వివరాలు ముందే తెలియచేయండి.. అంతకు ముందు ఇదే అంశంపై అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ ఏ అంశాల ఆధారంగా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని ఈ న్యాయస్థానం భావిస్తోందో ఆ వివరాలను ముందుగానే తమకు తెలియచేయాలని ధర్మాసనాన్ని కోరారు. తగిన సమయంలో వాదనలకు అవకాశం ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ముందుంచే వివరాలను ఏజీకి అందచేయాలని పిటిషనర్లకు సూచించింది. ఈ సందర్భంగా పాట్నా హైకోర్టు గురించి చర్చకు రావడంతో ధర్మాసనం స్పందిస్తూ వివాదాస్పద విషయాల గురించి తాము మాట్లాడబోమని పేర్కొంది. మహారాష్ట్రలో ఏం జరుగుతోందో (జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి విషయం) అందరం చూస్తూనే ఉన్నామని, మహారాష్ట్రతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంతో నయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
‘అగ్రి గోల్డ్’ చెల్లింపులకు అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: అగ్రి గోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసి నష్టపోయిన వారికి న్యాయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019–20 బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించిందని, ఈ డబ్బు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ తెలంగాణ హైకోర్టును అభ్యర్థించారు. అగ్రి గోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలని, అగ్రి గోల్డ్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 2015లో ఉమ్మడి హైకోర్టు ఉన్న సమయంలో డిపాజిటర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున ఆండాల్ రమేష్బాబు ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతివాదులుగా ఉన్న నేపథ్యంలో ఈ కేసును విచారించే పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంది. ఈ నేపథ్యంలో.. డబ్బు పంపిణీకి అనుమతి ఇవ్వడంతోపాటు మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ చల్లా కోదండరామ్లతో కూడిన ధర్మాసనాన్ని శ్రీరామ్ బుధవారం అభ్యర్థించారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం డిపాజిటర్లను గుర్తించి డబ్బు పంపిణీ చేస్తామని, మానవీయ కోణంలో ఆలోచించి డిపాజిటర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిందని తెలిపారు. డబ్బు పంపిణీకి అనుమతి కోరుతూ గత ఏడాది డిసెంబర్లో తాము రెండు పిటిషన్లు దాఖలు చేశామని, ప్రభుత్వమే డిపాజిటర్లను ఆదుకునేందుకు డబ్బు చెల్లిస్తున్న నేపథ్యంలో అనుమతించాలని కోరారు. తాము దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను విచారించాలని బాధితుల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఈనెల 9న ఈ పిటిషన్లను విచారించేందుకు ధర్మాసనం అనుమతించింది. హామీ నిలబెట్టుకున్న సీఎం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన అగ్రి గోల్డ్ డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్ జగన్ తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 2019–20 బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించారు. రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించేందుకు రూ.263.99 కోట్లు విడుదల చేయడంతోపాటు 94 శాతం మందికి చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి సైతం డబ్బు చెల్లించేందుకు వీలుగా హైకోర్టు అనుమతి తీసుకుని చెల్లింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అగ్రి గోల్డ్ సంస్థ 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు సేకరించి మోసం చేసింది. బాధితులకు ఏపీ ప్రభుత్వం ముందుగానే చెల్లింపులు చేసి.. హైకోర్టు నియమించిన జిల్లా స్థాయి కమిటీల ఆధ్వర్యంలో అగ్రి గోల్డ్ ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ప్రభుత్వం తిరిగి తీసుకునేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. -
బోండా ఉమకు నిన్న సాయంత్రమే ఎలా తెలిసింది?
సాక్షి, అమరావతి : ప్రతిపక్షం మీడియా స్వేచ్ఛను హరించడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియాలో కథనాలు ప్రసారం చేయకూడదని కోర్టుకు వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో అధికార పార్టీ మీడియా స్వేచ్ఛను హరించిందని విన్నాం, కానీ ఇప్పుడు ప్రతిపక్షమే మీడియాలో కథనాలు రాకూడదంటూ కోర్టుకెళ్లిందని అన్నారు. మాజీ అడ్వొకేట్ జనరల్ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని తెలిపిన సజ్జల ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వెల్లడించారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణలో తొందరపాటు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. చదవండి: (అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు ఆపండి ) సిట్ అనేది స్వతంత్ర విచారణ సంస్థ అని, నిన్న జరిగిన పరిణామాలు కొత్త పోకడగా అనిపిస్తున్నాయని మండిపడ్డారు. తప్పులపై విచారణ జరగకుండా కక్షసాధింపు పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారుని విమర్శించారు. మేధావులు కూడా నిన్నటి పరిణామాలపై విస్మయం చెందుతున్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి అడ్వకేట్ జనరల్గా అవకాశం ఇచ్చారన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తెచ్చుకుంటున్నారని, ఢిల్లీ నుంచి న్యాయవాదులను తెచ్చుకోవడానికి అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా వేసిన మరో పిటిషన్పై కూడా స్టే వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతుందని భావిస్తే సీబీఐ దర్యాప్తు కోరవచ్చు కదా అని ప్రశ్నించారు. చదవండి: (లోకేష్కు ఆ విషయం కూడా తెలియదా?: సజ్జల) సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం కోరితే ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం బాధాకరమన్నారు. హైకోర్టులో ఎప్పుడు ఏ కేసు వస్తుందో టీడీపీ నేతలకు ఎలా తెలుసని, ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ గురించి బోండా ఉమ నిన్ననే ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఎన్నికలకు ముందే తాము అధికారంలోకి వస్తే దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, అమరావతిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అలాగే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది) మీడియా స్వేచ్ఛను పరిరక్షించడానికి కోర్టులు పాటుపడేవి.. కానీ నిన్న రాత్రి అది వ్యతిరేకమయ్యిందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ‘సామాన్యులకు అండగా కోర్టులు నిలబడేవి.ఇప్పడు పెద్దలకు ఒక తీర్పు, సామాన్యులకు ఒక తీర్పు అనేలా పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థ నిష్పక్షికత ప్రశ్నార్ధకం అవుతోంది. రాజీవ్ ర్దేశాయ్ వంటి ప్రముఖ జర్నలిస్టులు కూడా దీనిపై స్పందించారు. తప్పు జరిగిందా లేదా అనే అంశాన్ని కక్ష సాధింపుగా మార్చడం దొంగలకు అవకాశం ఇచినట్లే. దొంగతనం ఆధారాలతో చూపినా కక్ష ఉంది కాబట్టి నీ పిర్యాదు చెల్లదు అంటే ఎలా. మేము సీబీఐ విచారణ కోరాం. అది కూడా వద్దంటారా. ఒక అడ్వకేట్.. అంతకు ముందు ఒక పార్టీ కార్యకర్త. అతనిపై ఆధారాలు ఉన్నాయని కేసు నమోదు చేశారు. మీడియా నోరు నొక్కేయడం కొంచెం ఓవర్ రియాక్షన్గా అనిపిస్తోంది. దీనిపై మా నాయకుడు మొదటి నుంచి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎప్పుడో చెప్పారు. దర్యాప్తు చేస్తామని ఎన్నికలకు ముందే చెప్పారు...దానిపైనే ప్రజలు 151 సీట్లతో తీర్పు ఇచ్చారు. అని పేర్కొన్నారు. చదవండి: (సభ్యసమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు) -
వైఎస్సార్ ఫొటో ఎందుకు పెట్టకూడదు: హైకోర్టు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టడంలో తప్పేముందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ తండ్రి అని, ఆయన గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని న్యాయస్థానం గుర్తుచేసింది. ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్సార్ ఫోటోను తొలగించాలని కోరుతూ టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆయన ఫోటోలను ఎందుకు పెట్టకూడదని, వైఎస్సార్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా? అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యాన్ని తాము విచారించబోమని, రెగ్యులర్ బెంచ్ వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. పిటిషన్పై సోమవారం విచారణ సందర్భంగా అడ్వకేట్ జరనల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇది పక్కా బినామీ పొలిటికల్ పిటిషన్ అని అన్నారు. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి చెందిన వ్యక్తి అని, ఆయన టీడీపీ సానుభూతి పరుడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘పిటిషనర్ టీడీపీతో విడదీయరాని అనుబంధం ఉన్న వ్యక్తి. టీడీపీతో రాజకీయ అనుబంధాన్ని ఇక్కడ తొక్కిపెడుతున్నారు. చంద్రబాబు హయాంలో పసుపురంగులో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినప్పుడు ఈయనకు చాలా సుఖంగా ఉంది. టీడీపీ అధికారానికి దూరంకాగానే పాపం ఈయన అంతరాత్మ క్షోభిస్తోంది.’ అని వాదించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించిన ప్రభుత్వ ప్రకటలను అడ్వకేట్ హైకోర్టుకు నివేదించారు. చంద్రబాబు, లోకేష్, నారాయణ, ఎన్టీఆర్ ఫొటోలు పెట్టారని తెలిపారు. మంత్రులు, ఇతర వ్యక్తుల ఫొటోలు ప్రకటనల్లో పెట్టుకోవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే తీర్పునిచ్చినిందని గుర్తుచేశారు. -
శంకర్కు భూమి: హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
శంకర్కు భూమి: హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : దర్శకుడు ఎన్. శంకర్కు భూమి కేటాయింపుపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రూ.2.5 కోట్ల విలువ చేసే భూమిని రూ. 25 లక్షలకు ఎలా కేటాయిస్తారని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైదరాబాదులో ఇప్పటికే అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఉందని, ఇతర వ్యక్తులకు స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా విలువైన భూములను సినీ ప్రముఖుల పేరు చెప్పి కట్టబెట్టి.. ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదని హైకోర్టు పేర్కొంది. కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. (భూములను పల్లీల్లా పంచిపెడతారా?) ఇక ధర్మాసనం వ్యాఖ్యలపై స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. కేబినెట్ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఏబీ వ్యాఖ్యలతో ఏకీభవించని హైకోర్టు.. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఇలాగే ఇస్తారా అని ప్రశ్నించించింది. దీనిపై మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి ఏజీ రెండు వారాల గడువు కోరాగా.. అనుమతించిన న్యాయస్థానం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా శంకర్కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
మాజీ అడ్వొకేట్ జనరల్ మృతి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండె నొప్పితో నేడు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నో సంచలన కేసులను ఆయన వాదించారు. రామచంద్రరావు మరణం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. -
తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ దురుద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టులో వాదించారు. కోవిడ్-19 నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని ఏజీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్ట్ పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటు పలువురు ఎంపీలు పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 12 పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పిటీషనర్ల తరపు న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. (సంతోష్ బాబు కుటుంబానికి భారీ సాయం: కేసీఆర్ ) జూన్ 1 నుంచి జూన్ 13 వరకు కాంగ్రెస్ నేతలను అరెస్టులతో పాటు గృహ నిర్బంధం చేస్తున్నారని పిటీషన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులపై ప్రభుత్వం కక్ష పూర్వకంగా వ్యవహరిస్తోందని కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ఏలాంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు కూడా నాలుగు సార్లు అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్కు సంబంధించి ఎక్కడ రీకార్డ్ నమోదు చేయలేదని న్యాయవాది రచనా రెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుతం కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏమైనా ఆందోళనలకు పిలుపునిచ్చారా అని హైకోర్టు పిటీషనర్ను ప్రశ్నించారు. అలాగే మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేయిర్ గైడ్ లైన్స్ పాటిస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి బదులుగా ఆందోళనలకు ఎలాంటి పిలుపు ఇవ్వలేదని, గైడ్ లెన్స్ ప్రకారం నడుచుకున్నామని రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. (వాడిలో నిన్ను చూసుకుంటాం.. వచ్చేయ్) పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీకి చేయడానికి వెళ్తున్న వారిని అడ్డుకున్నారా అని పిటీషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. గిరిజనులకు సాయం చేసిన ములుగు ఎమ్మెల్యేను హైకోర్టు ప్రశంసించగా.. ములుగు ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేసారని రచనా రెడ్డి పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ తరపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ జల దీక్ష కు పిలుపునిచ్చారని కోర్టుకు తెలిపారు. జలదీక్ష వలన ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా వారిని ప్రొటెస్ట్ చేశామని పేర్కొన్నారు. జలదీక్షకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలా అని అడ్వొకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో వచ్చే సోమవారంలోపు కౌంటర్ ధాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రోజుల్లో కాంగ్రెస్ నేతల కదలికలను అనుసరించొద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. (తెలంగాణ సర్కార్కు హైకోర్టు నోటీసులు) -
కరోనాతోనే మధుసూదన్ మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన అల్లంపల్లి మధుసూదన్ మే 1న కరోనా కారణంగా మరణించారని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ హైకోర్టుకు తెలియజేశారు. తన భర్త మధుసూదన్ కు పాజిటివ్ వచ్చిందని గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లాక అతని ఆచూకీ తెలియడం లేదని భార్య మాధవి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మధుసూదన్ మరణించిన సమాచారాన్ని తెలియజేద్దామంటే అప్పుడు ఆయన భార్య పిల్లలు క్వారంటైన్ లో ఉన్నారని ఏజీ తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులే అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు. అంత్యక్రియల వీడియో రికార్డు, చితాభస్మం, మరణ ధ్రువీకరణ పత్రాలను పిటిషనర్కు అధికారులు అందజేస్తారని తెలిపారు. వీటిని పిటిషనర్కు అందజేసిన సమాచారాన్ని ఈ నెల 9న జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
టెన్త్ పరీక్షలపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంటైన్మెంట్ జోన్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. (‘పది’పై హైకోర్టులో విచారణ) ఇప్పుడు పరీక్షలు రాయలేని విద్యార్థులకు సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం తెలపగా, సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు తిరిగి ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయాన్ని రేపు చెబుతామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. దీంతో శనివారం కంటైన్మెంట్ జోన్లు, సప్లిమెంటరీపై పూర్తి వివరాలను తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మళ్లీ రేపటికి(శనివారం) వాయిదా వేసింది. (ఏపీలో మరో 50 పాజిటివ్ కేసులు) -
‘ఆ విషయంలో ఏపీ ఏజీ ఓ సూచన చేశారు’
సాక్షి, విశాఖపట్నం: నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కోర్టు జడ్జిమెంట్ను క్షుణ్ణంగా చదివి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి ఓ సూచన చేశారని వెల్లడించారు. అధికార పార్టీని గూండాలు, రౌడీలు అంటూ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాశారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ రాసిన లేఖనే నిమ్మగడ్డ ఎందుకు పంపారని అడుగుతున్నా. ప్రజాస్వామ్య రక్షకులా లేక మీరు ప్రజాస్వామ్య హంతకులా. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్గా ఉండాలని చంద్రబాబు ఎందుకు పట్టుపడుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారు. (చదవండి: హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ నియామకమే చెల్లదు) హైకోర్టు తీర్పువచ్చిన కొన్ని గంటల్లోనే టీడీపీ శ్రేణులు ఎందుకు సంబరాలు చేసుకున్నాయి. కోర్టు తీర్పు పూర్తిగా రాకుండానే నిమ్మగడ్డ తనకు తానే ఎస్ఈసీగా ఎలా నియమించుకుంటారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొందరికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వైఎస్సార్ కార్యకర్తలకి న్యాయవ్యవస్దపై అపార నమ్మకం ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాపై తప్పుడు కేసులు పెట్టినా న్యాయవ్యవస్ధపై నమ్మకంతోనే మేము పదేళ్లుగా శాంతియుత మార్గాన్నే నమ్ముకున్నాం. నా పేరుతో తప్పుడు ఐడీ సృష్టించి ఫేక్ అకౌంట్లో ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్సించినట్టుగా పోస్టు పెట్టారు. నా సోషల్ మీడియా కార్యకర్తలకి నేను అండగా ఉంటా. సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేసిన వారంతా మా పార్టీ వారే కావచ్చు... ఇతరులు కూడా కావచ్చు. కోర్టులని తప్పుపట్టడం లేదు. న్యాయ వ్యవస్ధపై మాకు అపార నమ్మకం ఉంది. తప్పు చేసిన వారెవరైనా శిక్షించమనే చెబుతాం. టీడీపీ కవ్వింపులకే మా సోషల్ మీడియా కార్యకర్తలు స్పందించి పోస్టులు పెట్టారు. గత పదేళ్లగా టీడీపీ చేసిన అక్రమాలపై కేసులు పెట్టి ఉంటే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవు’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. (చదవండి: టీడీపీకి ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే) -
ఎస్ఈసీ అంశంపై సుప్రీంకు వెళ్తున్నాం: ఏపీ ఏజీ
-
ఆ అధికారం నిమ్మగడ్డకు లేదు: ఏపీ ఏజీ
సాక్షి, అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య వివాదంపై ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లుగా.. నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించుకున్నారని.. హైకోర్టు తీర్పును అనుసరించి ఇది చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యులర్ విడుదల చేసి హైదరాబాద్లోని తన ఇంటికి వాహనాలు పంపించాలన్నారు. ఎస్ఈసీగా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్కుమార్కు ..హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదు. నిమ్మగడ్డ మాత్రం తనంతట తానే .. బాధ్యతలు స్వీకరించినట్లుగా సర్క్యులర్ విడుదల చేశారు. సుప్రీంకోర్టు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేశాం. అప్పటి వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరాం. రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు అంటే.. నిమ్మగడ్డ రమేష్కుమార్కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది. అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ను ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? నిమ్మగడ్డ రమేష్కుమార్ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదు. నిమ్మగడ్డ రమేష్కుమార్ నియామకం కూడా చెల్లదు. హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. 2 నెలల కాలవ్యవధి ఉంటుంది. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదు. ఎస్ఈసీ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్న ప్రభాకర్ను రేపటిలోగా రాజీనామా చేయమని నిమ్మగడ్డ రమేష్కుమార్ ఆదేశించారు. ఈ విషయం ప్రభాకర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు కొంత సమయం కావాలని ప్రభాకర్ నిమ్మగడ్డను కోరారు. నిమ్మగడ్డ రమేష్కుమార్ మాత్రం రేపటిలోగా రాజీనామా చేయమని ఆదేశించారు. తాజా తీర్పుపై స్టే ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఎస్ఈసీ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్కుమార్ నియామకం కూడా చట్ట విరుద్ధం. సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారు. కానీ ఇది రాజ్యాంగ అంశాలు... హైకోర్టు తీర్పుతో కూడినందున మీడియా ముందుకు రావాల్సివచ్చింది. నిమ్మగడ్డ రమేష్కుమార్ స్వీయ ప్రకటితం చేసుకోవడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి చెప్పాను. ఎవరిని ఎస్ఈసీగా నియమించాలనే విషయంలో... రాష్ట్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునే అధికారం లేదని హైకోర్టు చెప్పింది. అదే విషయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంలోనూ వర్తిస్తుంది’ అని శ్రీరామ్ అన్నారు. (చదవండి: ఎన్నికల కమిషనర్ ‘ఆర్డినెన్స్’ రద్దు) -
'పదో తరగతి పరీక్షల వ్యాజ్యంపై విచారణ చేపట్టండి'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టును కోరారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ప్రసాద్ పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు కరోనా నివారణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు. అన్ని వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 19న పదో తరగతి వ్యాజ్యం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. -
గిరిజనుల ప్రయోజనాలు కాపాడతాం
సాక్షి, అమరావతి: గిరిజనుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీపడే సమస్యే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్తో ముఖ్యమంత్రి ఆదివారం తన నివాసంలో సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు నూరు శాతం రిజర్వేషన్లపై న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచన చేయాలని అడ్వొకేట్ జనరల్కు సూచించారు సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. ► గిరిజన ప్రాంతాల్లోని టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో 3ను జారీ చేశారు. ఈ జీవోను కొట్టేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ► జీవోను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తమకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన గిరిజన వర్గాల్లో నెలకొందని తెలిపారు. ► ఈ అంశంపై ఇప్పటికే దృష్టిసారించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్తో సమీక్షించి గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ► న్యాయస్థానం తీర్పును క్షుణ్నంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాలని పేర్కొన్నారు. ► ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కాబట్టి తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుని ముందడుగు వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. -
‘మూడు తీర్పులను పరిగణలోకి తీసుకోవాలి’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చెపట్టింది. విచారణలో భాగంగా.. ప్రభత్వుం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలను వినిపించారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో విద్యాహక్కు చట్టంలోని 29వ నిబంధనను ఉల్లంఘించలేదని తెలిపారు. భాషాపరంగా అల్ప సంఖ్యాకుల కోసం కొన్ని చర్యలను, వారి మాతృభాషా పరిరక్షణకోసం భద్రతా చర్యలను మాత్రమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ఇలాంటి అంశాల్లో ఆచరించదగ్గ మూడు తీర్పులను కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ముసాదా విధానాన్ని పరిశీలించాల్సిందిగా ఏజీ శ్రీరామ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాధ్యాసాధ్యాలను మాత్రమే ఈ ముసాదా విధానం చర్చించిందని ఏజీ శ్రీరామ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30లో పేర్కొన్న సంస్థలు (మైనార్టీ విద్యాసంస్థలు), ప్రైవేటు సంస్థలు ఎక్కడా ప్రభావితం కాలేదని శ్రీరామ్ కోర్టుకు చెప్పారు. తమకు ఇంగ్లిషు మీడియమే కావాలంటూ.. విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల్లో 97శాతం కోరుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచుతున్నామని ఆయన చెప్పారు. తమ పిల్లలు తెలుగు మీడియంలోనే చదువుతున్నారంటూ పిటిషనర్లు కోర్టు ముందు చెప్పడం లేదు.. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. పాఠ్య ప్రణాళకలో తెలుగును తప్పనిసరి చేస్తూ, మాతృభాషను అభివృద్ధి చేసే చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం తాజా జీవో జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారిచేత ఎన్నికైన ప్రభుత్వం తగిన రీతిలో విధానాలను రూపొందిస్తుందన్నారు. విధానాలను నిలువరించే అప్పిలేట్ అథారిటీ లా కోర్టులు వ్యవహరించజాలవని ఆయన అన్నారు. ఈ విధానం సరైందని.. మరొక విధానం కాదని కోర్టులు నిర్దేశించలేవని ఆయన తెలిపారు. విధానాల విషయంలో కోర్టులకు పరిమితమైన పాత్ర ఉంటుందని ఏజీ శ్రీరామ్ అన్నారు. -
ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేసిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్టీసీ అప్పులు పంపకాలు జరగలేదని కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర విభజన అనంతరం ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్.. ఆర్టీసీకి సంబంధించిన అంశాలు విభజన చట్టంలోని 9వ షెడ్యుల్లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీకి రూ. 4253 కోట్లు చెల్లించామని వివరించారు. దీనిపై ఘాటుగా స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పామనలేదని, బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ప్రశ్నించింది. రూ.4253 కోట్లు ఇస్తే.. బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమకు సమర్పించే నివేదికలో అధికారులు అతితెలివి ప్రదర్శిస్తున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా క్యాటగిరి చేశారని, బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధుల్లో డీ ఫాల్టర్ మీరే కదా అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు రూ. 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొంత గడువు ఇస్తే ప్రయత్నిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వ వాదనతో ఏకీభవించని ధర్మాసనం.. ఉపఎన్నిక జరిగే చోట రూ.100 కోట్ల వరాలు ప్రకటించడంపై సెటైర్లు వేసింది. ప్రభుత్వానికి ఒక్క నియోజకవర్గం ప్రజలు ముఖ్యమా? లేక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అని ప్రశ్నించింది. హుజూర్నగర్లో రూ.100 కోట్ల వరాలు ప్రకటించిన ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు తొలగించడానికి రూ.47 కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే ఆర్టీసీలో మొత్తం ఎన్ని బస్సులున్నాయి? ఇప్పుడు ఎన్నిబస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఇతర బలహీన వర్గాలు ప్రయాణం చెయ్యాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమ్మెపై ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజల ఇబ్బంది పడకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేశామని చెప్తూనే బస్సులు లేక ఇబ్బంది పడతారని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారని కోర్టు గుర్తుచేసింది. ఆర్టీసీ ఎండీ కోర్టు విచారణకు ఒక్కసారైనా హాజరు అయ్యారా? అని ప్రశ్నించింది. 75 శాతం బస్సులు తిరుగుతున్నాయని ప్రభుత్వ కోర్టుకు తెలపగా.. ఇప్పటికీ మూడో వంతు బస్సులు నడవడం లేదని హైకోర్టు పేర్కొంది. ఇదిలావుండగా.. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరూర్ నగర్లో రేపు 2గంటల నుంచి 6 గంటల వరకు అనుమతి కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె వలన కార్మికులు చనిపోయారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సరూర్ నగర్ సభ ద్వారా కార్మికులకు ఆత్మ స్టైర్యం కల్పించడం కోసం సభ ను ఏర్పాటు చేశామని వివరించారు. దీనిపై విచారించిన హైకోర్టు సరూర్ నగర్ లో కాకుండా ఎక్కడ అనుమతి ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై మంగళవారం సాయంత్రం లోపు తమ నిర్ణయాన్ని తెలపాలని ప్రభుత్వానికి గడువు విధించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
చంద్రబాబుకున్న ‘జెడ్ ప్లస్’ను కుదించలేదు
సాక్షి, అమరావతి: చంద్రబాబుకున్న భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయలేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆయనకున్న జెడ్ ప్లస్ కేటగిరినీ కూడా తగ్గించలేదని, కాన్వాయ్కు జామర్ సదుపాయం కూడా కల్పించామని పునరుద్ఘాటించారు. చంద్రబాబు నిర్ధిష్టంగా ఫలానా వ్యక్తినే ప్రధాన భద్రత అధికారి (సీఎస్ఓ)గా నియమించాలని కోరుతున్నారని, అది ఆచరణ సాధ్యం కాదని ఏజీ చెప్పారు. ఒకవేళ చంద్రబాబు కోరిన అధికారినే సీఎస్ఓగా నియమిస్తే భవిష్యత్తులో మరికొందరు ఇదే రకమైన అభ్యర్థనలు చేసే అవకాశం ఉందని, దీనివల్ల పలు సమస్యలు వస్తాయన్నారు. చంద్రబాబుకు ఏర్పాటు చేసిన సీఎస్ఓ విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న భద్రతను కుదించిందని, గతంలో ఉన్న విధంగానే తనకు భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్ మరోసారి విచారించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి.కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు భద్రతను కేంద్రం పునః సమీక్షించిందని, ప్రస్తుతం ఆయనకున్న ఎన్ఎస్జీ భద్రతను అలాగే కొనసాగించాలని నిర్ణయించిందని చెప్పారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. మూడు షిప్టుల్లో ఐదుగురు చొప్పున కానిస్టేబుళ్లను ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లనే ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. సీఎస్వోలను ఇద్దరిని ఇవ్వాల్సి ఉండగా, ఒక్కరినే ఇచ్చారని చెప్పారు. ఈ వాదనలను ఏజీ తోసిపుచ్చారు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ భద్రతే ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో జామర్ సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు. -
ఏపీ అడిషనల్ ఏజీగా పొన్ననోలు సుధాకర్
-
ఏపీ అడిషనల్ ఏజీగా పొన్నవోలు నియామకం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అడిషనల్ ఏజీ (అడ్వొకేట్ జనరల్)గా సీనియర్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పొన్నవోలు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. అడిషనల్ ఏజీగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు పలువురు పొన్నవోలుకు అభినందనలు తెలిపారు. కాగా రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. -
బాధ్యతలు స్వీకరించిన కల్లం, శ్రీరామ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా అజేయ్ కల్లం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లోని బాధ్యతలు చేపట్టిన ఆయనకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు. అంతకు ముందు అజేయ్ కల్లం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజీగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం శ్రీరామ్ మరోవైపు ఆంధ్రపద్రేశ్ హైకోర్టు అడ్వకేట్ జనరల్గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన తన ఛాంబర్లో కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అడ్వొకేట్ జనరల్గా శ్రీరామ్ను నియమించాలని నిర్ణయించారు. శ్రీరామ్ 1969లో జన్మించారు. -
ఏపీ అడ్వొకేట్ జనరల్గా శ్రీరామ్
-
అడ్వొకేట్ జనరల్గా శ్రీరామ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో టీడీపీ హయాంలో ఏజీగా వ్యవహరించిన దమ్మాలపాటి శ్రీనివాస్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం ఉదయం హైకోర్టులో ఏజీగా శ్రీరామ్ బాధ్యతలు స్వీకరిస్తారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అడ్వొకేట్ జనరల్గా శ్రీరామ్ను నియమించాలని నిర్ణయించారు. శ్రీరామ్ 1969లో జన్మించారు. 1992 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆయన మొదట న్యాయవాది సి.వి.రాములు వద్ద పనిచేశారు. రాములు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తరువాత శ్రీరామ్ స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అనతి కాలంలోనే రాజ్యాంగపరమైన కేసులతో పాటు, సివిల్ కేసులు, సర్వీసు వివాదాల కేసులు, విద్యా రంగానికి సంబంధించిన కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2009 నుంచి 2011 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా శ్రీరామ్ వ్యవహరించారు. -
ఏపీ అడ్వొకేట్ జనరల్గా సుబ్రమణ్యం శ్రీరామ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన అడ్వొకేట్ జనరల్గా సుబ్రమణ్యం శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. న్యాయవ్యవస్థలో అడ్వొకేట్ జనరల్(ఏజీ) పోస్టుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, వివిధ కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిళ్లుగా వ్యవహరిస్తున్న న్యాయవాదులు తమ తమ పోస్టులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరి స్థానంలో కొత్త అడ్వొకేట్ జనరల్ అవసరాన్ని బట్టి ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులను నియమించుకుంటారు. ఈ నియామకాల విషయంలో అడ్వొకేట్ జనరల్కు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిసింది. ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ఏజీకి జగన్మోహన్రెడ్డి దిశా నిర్ధేశం చేసినట్లు సమాచారం. -
‘రఫేల్ ఒప్పంద పత్రాలు భద్రం’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పంద పత్రాలు గల్లంతు వ్యవహారం కలకలం రేపడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. రఫేల్ ఒప్పంద పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురికాలేదని, వాటి నకళ్లను మాత్రమే పిటిషనర్లు తమ దరఖాస్తుల్లో వాడారని మాత్రమే తాను సుప్రీం కోర్టు ఎదుట పేర్కొన్నానని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. రఫేల్ యుద్ధ విమాన ఒప్పంద పత్రాలు చోరీ అయ్యాయని బుధవారం సర్వోన్నత న్యాయస్ధానంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సున్నితమైన సమాచారం కలిగిన ఈ పత్రాలు మాయం కావడంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్లు తమ దరఖాస్తులో అనుబంధంగా ఒరిజినల్ పత్రాల ఫోటోకాపీలను వాడారని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా అటార్నీ జనరల్ చోరీ అనే పదాన్ని వాడకుండా ఉండాల్సిందని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానించాయి. మరోవైపు ఈ పత్రాల ఆధారంగా కథనాలను ప్రచురించినందుకు అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని ప్రభుత్వం ది హిందూ వార్తాపత్రికను హెచ్చరించింది. -
ఏజీగా బాధ్యతలు చేపట్టిన బీఎస్ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా నియమితులైన బండా శివానందప్రసాద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైకోర్టులోని తన కార్యాలయంలో సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు న్యాయవాదులు అభినందించారు. అనంతరం తెలంగాణ, హైకోర్టు న్యాయవాదుల సంఘాలు బీఎస్ ప్రసాద్ను ఘనంగా సన్మానించాయి. తనను ఏజీగా నియమించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇరు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఈ బాధ్యత అప్పగించినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించారని ఆయన అన్నారు. శనివారం సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు చెందిన తనను ఏజీగా నియమించటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకంతోనే ఈ వృత్తిని ఎంచుకున్నానని స్పష్టం చేశారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించటానికి కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత కేసును సైతం చట్టపరంగా ఎదుర్కొనేందుకు అందరి సహకారంతో ముందుకెళ్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న కోర్టు చిక్కుల్ని పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం న్యాయపరంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. -
అడ్వొకేట్ జనరల్గా బీఎస్ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న ఏజీ పదవిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు భర్తీ చేసింది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్ను నియమించింది. బీసీ (పద్మశాలి) వర్గానికి చెందిన బండా శివానంద ప్రసాద్ (బీఎస్ ప్రసాద్)ను ఏజీగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో అడ్వొకేట్ జనరల్గా నియమితులైన తొలి బీసీ న్యాయవాదిగా బీఎస్ ప్రసాద్ చరిత్ర సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1956 నుంచి 2014 వరకు 17 మంది అడ్వొకేట్ జనరల్స్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో అత్యధికం శాతం రెడ్డి, బ్రాహ్మణ వర్గాలకు చెందిన న్యాయవాదులే ఉన్నారు. ఒక్క బీసీ న్యాయవాది కూడా ఏజీగా నియమితులు కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఇద్దరు అడ్వొకేట్ జనరల్స్ పనిచేశారు. ఈ ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. 30 ఏళ్లు న్యాయవాదిగా.. వరంగల్ జిల్లా జనగామకు చెందిన బీఎస్ ప్రసాద్ గత 30 ఏళ్లుగా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పలు ఆర్థిక సంస్థలకు, జాతీయ బ్యాంకులకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. తొలుత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ)గా కొన్నేళ్లు సేవలు అందించిన బీఎస్ ప్రసాద్, తర్వాత కొన్ని సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించాల్సి వచ్చింది. 8 నెలలకే తప్పుకున్న ప్రకాశ్రెడ్డి ఏపీ విభజన తర్వాత కొలువు దీరిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డిని నియమించింది. ఆయన 3 ఏళ్లపాటు ఏజీగా బాధ్యతలు నిర్వర్తించి 2017 జూలై 12న రాజీనామా చేశారు. ఆ తర్వాత మరో సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి జూలై 17న ఏజీగా నియమితులయ్యారు. ఎనిమిది నెలల తర్వాత ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది మార్చి 26న ఏజీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల బహిష్కరణకు దారి తీసిన అసెంబ్లీ ఘటనల తాలూకు రికార్డులను కోర్టు ముందుంచుతానని హైకోర్టుకు ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆగ్రహం తెప్పించింది. హామీపై ప్రభుత్వ పెద్దలు వివరణ కోరడంతో నొచ్చుకున్న ప్రకాశ్రెడ్డి ఏజీ పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఏజీ పోస్టు భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదుల పేర్లను పరిశీలించింది. అయితే వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఆ పేర్లను పక్కన పెట్టేశారు. ఇదే సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావును ఏజీ పోస్టులో కూర్చోబెట్టేందుకు కొందరు పెద్దలు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే అందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపలేదు. అప్పటి రాజీనామాకు ఇప్పుడు ఆమోదం మార్చి నుంచి రాష్ట్రానికి ఏజీ లేరు. ఏజీని నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి, హైకోర్టు న్యాయవాది సతీశ్ కుమార్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. శశిధర్రెడ్డి వ్యాజ్యంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఏజీ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏజీ నియామకంపై కసరత్తు చేసిన కేసీఆర్.. ఈసారి బీసీకి ఆ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందిస్తున్న బీఎస్ ప్రసాద్ను ఎంపిక చేశారు. ఆ మేరకు ఆయనను ఏజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ప్రకాశ్రెడ్డి సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆమోదం మార్చి 26 నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఏజీ లేని రాష్ట్రం!
సాక్షి, హైదరాబాద్ : అడ్వొకేట్ జనరల్ (ఏజీ).. రాజ్యాంగబద్ధ పదవుల్లో కీలకమైనది.. న్యాయపర వ్యవహారాల్లో అమూల్యమైన సలహాలతో రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమైన వ్యక్తి.. శాసనసభలో ఆయనకు ఎప్పుడూ ఓ ప్రత్యేక సీటు కేటాయించి ఉంటుంది.. అంతటి కీలక పదవి ఇప్పుడు రాష్ట్రంలో ఖాళీగా ఉంది.. అదీ 3 నెలలుగా.. దేశంలో ఏజీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణే. ఏజీని నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విశ్రాంత, సిట్టింగ్ న్యాయమూర్తుల్లోనూ ప్రభుత్వ తీరుపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగి ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే తెలంగాణ తొలి ఏజీ నియామకం జరిగింది. తొలి ఏజీగా కె.రామకృష్ణారెడ్డిని నియమిస్తూ జూన్ 21న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయన మూడేళ్లు పదవిలో కొనసాగారు. 2017 జూలై 12న రాజీనామా చేశారు. సరిగ్గా 5 రోజులకు (జూలై 17న) కొత్త ఏజీగా దేశాయ్ ప్రకాశ్రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో ఏడాది తిరగక ముందే ఏజీ పదవికి రాజీనామా చేశారు. ఎసరు తెచ్చిన హామీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం విషయంలో ప్రభుత్వం, శాసనసభ తరఫున హైకోర్టుకు హామీ ఇవ్వడం ప్రకాశ్రెడ్డి పదవికి ఎసరు తెచ్చింది. కోమటిరెడ్డి విసిరిన హెడ్ఫోన్ వల్ల మండలి చైర్మన్ గాయçపడ్డారన్న ఆరోపణలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించిన రికార్డులను కోర్టు ముందుంచుతానని ఏజీ హామీ ఇవ్వడం ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. అప్పటికే ప్రకాశ్రెడ్డి వ్యవహారశైలిపై ఐఏఎస్ అధికారులు ఫిర్యాదులు చేయడం, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా కోర్టుకు హామీ ఇవ్వడంతో ఇక ఆయన్ను సాగనంపాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. తమను సంప్రదించకుండానే హామీ ఇవ్వడంపై ప్రకాశ్రెడ్డిని గట్టిగానే నిలదీశారు. దీంతో ఈ ఏడాది మార్చి 26న ఏజీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే ప్రకాశ్రెడ్డి రాజీనామా ఇచ్చి 3 నెలలైనా ఇప్పటివరకు ప్రభుత్వం ఆమోదించకపోవడం విశేషం. రాజీనామాను ఆమోదించాలంటూ ప్రభుత్వానికి ప్రకాశ్రెడ్డి లేఖ రాసినట్లు కూడా ఓ దశలో ప్రచారం జరిగింది. ప్రభుత్వం తన రాజీనామాను ఆమోదించకపోవడంతో సీనియర్ న్యాయవాదిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కేసుల్లోనూ ఆయన హాజరు కాలేకపోతున్నారు. సీఎం మల్లగుల్లాలు ప్రకాశ్రెడ్డి రాజీనామా తరువాత ఎవరిని ఏజీగా నియమించాలన్న విషయంలో సీఎం కేసీఆర్ పెద్ద కసరత్తే చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఏజీ పదవి అప్పగించాలన్న కృతనిశ్చయంతో ఉన్న సీఎం.. పోస్టుకు అర్హులైన వారి గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఏజీ తరువాతి స్థానంలో ఉంటూ వ్యవహారాలు చక్కబెడుతున్న వ్యక్తి కొందరి పేర్లను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆ పేర్లు పరిశీలించిన సీఎం.. ఇంటెలిజెన్స్ ద్వారా వారికి సంబంధించి పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. ఏజీ స్థాయి పదవిని నిర్వహించే సామర్థ్యం వారికి లేదని ఇంటెలిజెన్స్ సీఎంకు నివేదించడంతో ఏజీ ఎంపిక ఆయనకు తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో ఏజీ తరువాత స్థానంలోని వ్యక్తి ఏజీ పదవి తమకివ్వాలంటూ ఒకరిద్దరు నేతల ద్వారా సీఎంపై ఒత్తిడి తెచ్చారు. అతని శక్తి, సామర్థ్యాలు మొదటి నుంచి తెలిసిన సీఎం కేసీఆర్.. ఇలాంటి సిఫార్సులు చేయొద్దంటూ ఆ నేతలకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. మరోవైపు ఏజీ లేక న్యాయ వ్యవహారాల్లో ప్రభుత్వానికి దిశానిర్దేశం కరవుతోంది. ఆయన సలహా మేరకే ప్రభుత్వం విధానాపర నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. అధికారులు, ప్రభుత్వ పెద్దలకు అందుబాటులో ఉంటూ ఏజీ తగు సలహాలు ఇవ్వాలి. ఏజీ లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు చెప్పింది ఇదీ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ గోపాల్చంద్ర మిశ్రా కేసు (1978)లో సుప్రీంకోర్టు ఓ తీర్పునిచ్చింది. రాజ్యాంగ పదవుల్లోని వ్యక్తులు ఏ తేదీన పదవికి రాజీనామా చేస్తారో ఆ రోజు నుంచే అమల్లోకి వస్తుందని ఆ తీర్పులో స్పష్టం చేసింది. రాజీనామా లేఖపై నిర్దిష్ట తేదీ రాసి సమర్పించి ఉంటే ఆ తేదీన ఆ వ్యక్తి రాజీనామా చేసినట్లేనని పేర్కొంది. ఇలాంటి సమయంలో ఆ రాజీనామా లేఖను ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రాజీనామా లేఖపై భవిష్యత్ తేదీ ఉంటే ఆ రాజీనామా పరిపూర్ణమైంది కాదని పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం ప్రకాశ్రెడ్డి రాజీనామా చేసిన తేదీ నుంచే ఆయన రాజీనామా అమల్లోకి వచ్చినట్లు అవుతుంది. -
వీడియో ఫుటేజీకి సభ తీర్మానం అవసరం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఈ నెల 12న గవర్నర్ ప్రసంగం నాటి వీడియో ఫుటేజీలను తీసుకునేందుకు శాసనసభ తీర్మానం అవసరమని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) గురువారం హైకోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో వీడియో ఫుటేజీలను సమర్పించేందుకు మరింత గడువు కావాలని కోరారు. ఈ నెల 22న ఫుటేజీని తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్రెడ్డి ఈ విషయంపై అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారని ఆయన తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు వీడియో ఫుటేజీల సమర్పణకు ఈ నెల 27 వరకు గడువునిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు, నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎ.సంపత్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
‘వక్ఫ్’ రికార్డుల డిజిటైజేషన్కే సీలు
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించే చర్యల్లో భాగంగానే వక్ఫ్ బోర్డు కార్యాలయంలో రికార్డులున్న గదులకు సీల్ వేశామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. మొత్తం కార్యాలయానికి సీల్ వేయలేదని, రికార్డులున్న గదులకే వేశామని వివరించింది. కార్యాలయంలో రికార్డులను సీజ్ చేసి, కార్యాలయానికి సీలు వేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎం.ఎ.కె. ముఖీద్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. వక్ఫ్ కార్యాలయం మొత్తానికి సీలు వేయలేదని, రోజువారీ విధుల నిర్వహణకు ఇబ్బంది లేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి చెప్పారు. రికార్డుల డిజిటైజేషన్ నిమిత్తం ఈ చర్యలు తీసుకున్నామని, రికార్డుల క్రమబద్ధీకరణ, డిజిటైజేషన్ల కోసం ఆరుగురు అధికారులు పనిచేస్తున్నారని, రెండు వారాలపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. వక్ఫ్ అధికారులతో ప్రభుత్వం చర్చించి, విధులకు ఆటంకం లేకుండా 14న మెమో ఇచ్చామని చెప్పారు. దేవుడి ఆస్తులకు రక్షణ కరువు వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘వక్ఫ్, దేవాదాయ ఆస్తులకు రక్షణ కొరవడుతోందని, వీటి రక్షణలో ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యం లో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలుంటే మంచిదేనని పేర్కొంది. మణికొండలో ఆక్రమణలకు గురైంది వక్ఫ్ ఆస్తులేనని ధర్మాసనం గుర్తు చేసింది. రోజువారీ విధుల నిర్వహణకు సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకు రావాలని పిటిషనర్కు సూచన చేసింది. విచారణ వచ్చే మంగళవారానికి (21వ తేదీకి) వాయిదా పడింది. -
తప్పించరూ..!
♦ అడ్వకేట్ జనరల్ రాజీనామా ♦ ప్రభుత్వానికి, గవర్నర్కు లేఖ ♦ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కొత్త చర్చ సాక్షి, చెన్నై : ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ ముత్తుకుమార స్వామి హఠాత్తుగా పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలను వివరిస్తూ, తనను పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వానికి, గవర్నర్కు ఆయన మంగళవారం లేఖ రాశారు. గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమయాజులు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ముత్తుకుమార స్వామిని దివంగత సీఎం జయలలిత నియమించారు. ప్రభుత్వం తరపున కోర్టుల్లో అన్ని రకాల వాదనలు ఉంచడమే కాదు, కీలక నిర్ణయాలను సైతం ఆయన అనేక సందర్భాల్లో తీసుకున్నారు. ప్రభుత్వానికి అనేక న్యాయపర అంశాలతో కూడిన సిఫారసులు కూడా చేశారు. రాజీవ్ హత్య కేసు నిందితుడు పేరరివాలన్కు పెరోల్ ఇచ్చేందుకు సైతం ఆయన సిఫారసు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అడ్వకేట్ జనరల్తో చర్చించకుండా ప్రభుత్వ వర్గాలు ఎలాంటి నిర్ణయాలను ప్రస్తుతం తీసుకోవడం లేదని చెప్పవచ్చు. తాజాగా, ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ పాత్ర ప్రభుత్వానికి న్యాయపరంగా తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నానని ముత్తుకుమార స్వామి ప్రకటించడం చర్చకు దారితీసింది. హఠాత్తుగా తనను తప్పించరూ..! అంటూ ప్రభుత్వానికి, గవర్నర్కు ఆయన లేఖ పంపించడంతో బలమైన కారణాలు ఏవో ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుతం అనేక పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇందులో గుట్కా, అసెంబ్లీ రగడ వంటివి ప్రధానంగా> పరిగణించవచ్చు. ప్రస్తుతం గుట్కా వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే సభ్యులపై సస్పెన్షన్ వేటుకు ప్రభుత్వం సిద్ధం కూడా అవుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు డీఎంకే సభ్యులు కసరత్తుల్లో ఉన్నారు. ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ ముత్తుకుమార స్వామి రాజీనామా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేనా అన్న ప్రశ్న బయలుదేరింది. అదే సమయంలో సీఎం పళని స్వామి ఆదేశాల మేరకే ఆయన తప్పుకున్నట్టుగా కూడా ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో సీనియర్ న్యాయవాది విజయనారాయణను నియమించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో అడ్వకేట్ జనరల్ పాత్ర కీలకంగా ఉంది. ఈ సమయంలో కొత్త వారిని నియమిస్తే, ఏ మేరకు ఫలితాలు ఉంటాయో అన్న అనుమానం వ్యక్తంచేసే వాళ్లూ ఉన్నారు. ఈ దృష్ట్యా, సీఎం ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసి ఉంటారా..? లేదా, మరెవైనా బలమైన కారణాలు ఉన్నాయా..? అనే చర్చ ఊపందుకుంది. -
అడ్వొకేట్ జనరల్గా దేశాయ్ ప్రకాశ్రెడ్డి
- గవర్నర్ ఆమోదముద్ర.. సర్కారు ఉత్తర్వులు - ప్రకాశ్రెడ్డి స్వగ్రామం వనపర్తి జిల్లా అమరచింత - 1977లో న్యాయవాద వృత్తి ప్రారంభం - 1998లో ఉమ్మడి ఏపీలో అదనపు అడ్వొకేట్ జనరల్గా నియామకం సాక్షి, హైదరాబాద్/ అమరచింత/ ఆత్మకూరు (కొత్తకోట): రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దేశాయ్ ప్రకాశ్రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఆ మేర న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విశ్వాసం ఉన్నంత వరకు ఆయన ఏజీగా కొనసాగుతారు. రాష్ట్రానికి ఆయన రెండో అడ్వొకేట్ జనరల్గా ఆయన కొనసాగనున్నారు. మొన్నటి వరకు ఏజీగా ఉన్న రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రకాశ్రెడ్డిని ప్రభుత్వం ఏజీగా నియమించింది. ప్రకాశ్రెడ్డి వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలో 1955 డిసెంబర్ 31న మురళీధర్రెడ్డి, అనుసూ యాదేవి దంపతులకు జన్మించారు. 1977లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. అదే ఏడాది డిసెంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్రెడ్డి వద్ద జూనియర్గా న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1986 నుంచి సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన ప్రకాశ్రెడ్డి 1990లో తన ప్రాక్టీస్ను సుప్రీం కోర్టుకు మార్చారు. 1998 వరకు సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేసి తర్వాత తిరిగి హైకోర్టుకు వచ్చారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా నియమితులయ్యారు. 2004 మే వరకు ఆ పోస్టులో కొనసాగారు. 2000 సంవత్సరంలో హైకోర్టు ఆయ నకు సీనియర్ హోదా ఇచ్చింది. అలాగే హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. తన తండి మరణాంతరం ప్రకాశ్రెడ్డి స్వగ్రామంలో సొంత ఖర్చుతో అనేక సేవా కార్య క్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రకాశ్రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఇదీ కుటుంబ నేపథ్యం.. అమరచింతకు చెందిన దేశాయ్ మురళీధర్రెడ్డి, అనసూయమ్మకు ప్రకాశ్రెడ్డి మొదటి కుమారుడు. ఈయనకు తమ్ముడు కరుణాకర్రెడ్డి, అక్క సౌజన్యారెడ్డి, చెల్లెళ్లు నలిని, స్వర్ణ ఉన్నారు. మురళీధర్రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా రాజకీయాల జోలికి వెళ్లకుండా న్యాయవృత్తిని ఎంచుకుని అంచలం చెలుగా ఎదిగారు. ఆయనకు భార్య గీతారెడ్డి, ఇద్దరు కుమారులు సుధాంశ్రెడ్డి, అభినాష్రెడ్డి ఉన్నారు. సుధాంష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అభినాశ్రెడ్డి న్యాయవాదిగా కొనసాగుతు న్నారు. కాగా, అడ్వొకేట్ జనరల్గా తమ గ్రామానికి చెందిన ప్రకాశ్రెడ్డి నియమితులు కావడంతో అమరచింత గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నియామకం ప్రకటన వెలువడగానే గ్రామస్తులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. -
తెలంగాణ ఏజీగా దేశాయి ప్రకాశ్రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్గా దేశాయి ప్రకాశ్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఏజీ పదవిలో ఉన్న రామకృష్ణారెడ్డి.. తన పదవీ కాలం ముగియడంతో ఇటీవలే రాజీనామా చేసిన విషయం విదితమే. -
మీడియాపై హైకోర్టుకు ఏజీ ఫిర్యాదు
► సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే ఇచ్చినట్లుగా రాశాయని వెల్లడి ► అటువంటి ఉత్తర్వులేవీ ఇవ్వలేదన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత అంశంలో మీడియా తీరుపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి బుధవారం హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చినట్లు కొన్ని పత్రికలు (సాక్షి కాదు) ప్రచురించాయని ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. స్టే ఇచ్చినట్లు పతాక శీర్షికల్లో ప్రచురించాయంటూ కొన్ని పత్రికల పేర్లను ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... తాము ఎటువంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు సచివాలయ భవనాలను కూల్చబోమని మీరు (అడ్వొకేట్ జనరల్) ఇచ్చిన హామీనే రికార్డ్ చేసి, కౌంటర్ దాఖలు చేయాలని మాత్రమే ఆదేశించామని తెలిపింది. ఇందులో తాము ఇచ్చిన ఉత్తర్వులేమీ లేవని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను యథాతథంగా ప్రచురిస్తుండటంపై కూడా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్టే ఇచ్చినట్లు వచ్చిన కథనాలకు సంబంధించి రాతపూర్వకంగా పిటిషన్ దాఖలు చేస్తే పరిశీలిస్తామని అడ్వొకేట్ జనరల్కు సూచించింది. -
రెండేళ్లలో రెండు కోట్ల సంపాదన!
ఏడాదికి దాదాపు కోటి రూపాయల సంపాదన సాధ్యమేనా? అది కూడా ఒక న్యాయవాదికి! గోవా అడ్వకేట్ జనరల్ ఆత్మారామ్ నదకర్ణి మాత్రం ఇలా సంపాదించారు. గడిచిన రెండేళ్లలో గోవాతో పాటు వివిధ రాష్ట్రాల్లో కేసులు వాదించినందుకు ఆయనకు ముట్టిన ఫీజు అక్షరాలా రూ. 1.86 కోట్లు. ఈ విషయాన్ని గోవా అసెంబ్లీలో శనివారం నాడు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి.. ఆయన సిబ్బందికి ఇచ్చిన జీతాలు ఇంకా అదనం. అవి దాదాపు రూ. 77.96 లక్షలు ఉన్నాయని న్యాయ శాఖ కూడా చూస్తున్న ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా తెలిపారు. 2013-14 సంవత్సరంలో నదకర్ణికి రూ. 68.65 లక్షలు ఫీజుగాను, రూ. 18.90 లక్షలు ఇతర ఖర్చులుగాను చెల్లించారు. కొన్ని కేసుల్లో ఆయనకు చెల్లించిన మొత్తాన్ని గౌరవ వేతనం గాను, మరికొన్ని సందర్భాల్లో వృత్తిపరమైన ఫీజుగాను పేర్కొన్నారు. నెలకు 8 లక్షలు సంపాదిస్తూ, దేశంలోనే అత్యధిక సంపాదనపరుడైన న్యాయాధికారిగా ఆయన పేరొందారంటూ ఆర్టీఐ కార్యకర్త ఎయిరెస్ రోడ్రిగ్స్ పలు ఆర్టీఐ దరఖాస్తులు సంధించారు. ఇది రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వచ్చే వేతనం కంటే ఎక్కువన్నారు. -
ఆ విద్యార్థులకు మరో కౌన్సెలింగ్?
ఇంజనీరింగ్లో ఆప్షన్లు సరిగా ఇవ్వకుండా నష్టపోయిన విద్యార్థులపై సర్కారు తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో వెబ్ ఆప్షన్లు సరిగ్గా ఇచ్చుకోకుండా నష్టపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. సోమవారం డిప్యూటీ సీఎం, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దీనిపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్లో సీటు వచ్చినా ఫీజు చెల్లించకుండా చివరి విడత ప్రవేశాల కోసం వేచి చూసి.. ఆప్షన్లు సరిగ్గా ఇవ్వని కారణంగా కొందరు విద్యార్థులు ఉన్న సీటును కోల్పోయారు. ఆప్షన్ల ప్రాధాన్య క్రమాన్ని సరిగ్గా ఇవ్వలేక, మొదటి, తుది విడత కౌన్సెలింగ్లలో ఎందులోనూ సీటు దక్కనివారూ ఉన్నారు. ఇలా నష్టపోయిన విద్యార్థులు దాదాపు 3,430 దాకా ఉన్నట్లు తేల్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తేనే ఇంజనీరింగ్ చదవగలమని, నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు న్యాయం చేయాలని అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరో కౌన్సెలింగ్ నిర్వహించకుండా.. స్పాట్లో యాజమాన్యాలే మిగిలిన సీట్లను భర్తీ చేస్తే ఫీజు రీయింబర్స్మెంట్కు దూరమవుతామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీరికి ఎలా న్యాయం చేయాలన్న అంశంపై మంత్రి కడియం శ్రీహరి.. ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తదితరులు సమావేశమై చర్చించారు. న్యాయ నిపుణులతో చర్చించాకే..! స్పాట్ ద్వారా యాజమాన్యాలే ఆ విద్యార్థులను భర్తీ చేస్తే రీయింబర్స్మెంట్ ఇవ్వాలా..? ఒకవేళ అలా చేస్తే యాజమాన్యాలు తప్పిదాలకు పాల్పడే అవకాశం ఉంటుందా అన్న అంశాలపై భేటీలో చర్చించారు. ఇలా కాకుండా మరో కౌన్సెలింగ్ను నిర్వహించాలన్న ఆలోచన కూడా చేశారు. అయితే అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు అడ్డంకిగా మారొచ్చని అభిప్రాయపడ్డారు. నిర్ణీత గడువులోనే మొదటి దశ ప్రవేశాలను పూర్తి చేసి, తరగతులు ప్రారంభించినందున.. ఆ సమస్య ఉండకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఏదేమైనా మరోసారి అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. భేటీ అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇతర అధికారులు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని కలిసి చర్చించినట్లు తెలిసింది. అయితే ఆయన కూడా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సుప్రీంకోర్టు అడ్వొకేట్, అక్కడి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
సుప్రీం తీర్పు వరకూ ఆగమనండి
పదో షెడ్యూల్ అంశాలపై కేంద్ర హోంశాఖకు ఏపీ లేఖ సాక్షి, హైదరాబాద్: పదో షెడ్యూల్లోని అన్ని సంస్థలు తమకే చెందుతాయంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు అందుకు చెందిన నిధులన్నీ తమవేనని స్పష్టం చేయడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పదో షెడ్యూల్ వ్యవహారంపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినందున అక్కడినుంచి తీర్పు వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం పదో షెడ్యూల్ సంస్థల విషయంలో ఎలాంటి చర్యలను తీసుకోరాదని అడ్వొకేట్ జనరల్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు పదో షెడ్యూల్లోని సంస్థలు, నిధులు విషయంలో యధాతథస్థితిని కొనసాగించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖను కోరింది. ఈ మేరకు ఒక లేఖ రాసింది. -
’సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది’
-
ఆడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో క్వశ్చన్ టైమ్
-
పదిమందిని కొంటే ప్రభుత్వమే పడిపోయేది!
ఓటుకు కోట్లు కేసు కేవలం ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కాదని, ఇది ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేసే కుట్ర అని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలో లేకపోయినా.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పాటు, కేంద్రంలో కూడా అధికారంలో ఉందని ఆయన తెలిపారు. పది మంది ఎమ్మెల్యేలను కొని ఉంటే.. తెలంగాణలో ప్రభుత్వమే పడిపోయి ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో కుట్ర ఉందని ఆయన చెప్పారు. కాగా, దీనికి తగ్గట్లే.. గురువారం ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో ఒక కేసు నమోదైంది. కొంతమంది న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టులో చంద్రబాబు నాయుడిపై 'రాజద్రోహం' ఫిర్యాదు చేశారు. తనను అరెస్టు చేస్తే అదే తెలంగాణ ప్రభుత్వానికి ఆఖరి రోజు అవుతుందని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు అనడాన్ని ప్రస్తావించారు. దాంతోపాటు, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు మంత్రులు గవర్నర్పై చేసిన వ్యాఖ్యల మీద కూడా వేరే ఫిర్యాదు కోర్టులో దాఖలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఎల్బీనగర్ పోలీసులను కేసు నమోదు చేయాల్సిందిగా సూచించింది. ఆమేరకు చంద్రబాబు, మంత్రులపై ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్లో రాజద్రోహం కేసు నమోదైంది. -
బడుగుకు భరోసా
* ప్రభుత్వ స్థలాల్లోని పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు * ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణపై కేసీఆర్ సమీక్ష * ఉత్తర్వులు వచ్చిన 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి * 25 గజాలు మించితే రిజిస్ట్రేషన్ ధరలో ముందుగా 25 శాతం డీడీ రూపంలో చెల్లించాలి * గత జూన్ 2 లోపు ఉన్న నివాసాలకే వర్తింపు, నివాస ధ్రువీకరణ తప్పనిసరి.. 90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తికి కేసీఆర్ నిర్దేశం సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాల(125 గజాల్లోపు)ను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్రావు తాజాగా ఆదేశించారు. క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను రూపొందించేందుకు మంగళవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. భూముల క్రమబద్ధీకరణపై ఇటీవల అసెంబ్లీలో చేసిన తీర్మానం, అఖిలపక్ష భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నిబంధనలు ఉండాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్టవేయడం, ప్రతి భూమికి టైటిల్ కలిగి ఉండడం వంటి లక్ష్యాలను సాధించడమే క్రమబద్ధీకరణ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నిరుపేదలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చి తల దాచుకోవడానికి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, షెడ్లు, ఇళ్లు నిర్మించుకున్నారని, ఆక్రమిత భూములకు పట్టాలు లేకపోవడంతో వారు నిత్యం అవస్థలు పడుతున్నారని సీఎం పేర్కొన్నారు. అలాంటి వారు నివాసముంటున్న స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, రాజ్యసభ సభ్యుడు కేశ వరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్మీనా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్, సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ జి.డి.అరుణ తదతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరచాల్సిన మార్గదర్శకాలను అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు. ఇవీ మార్గదర్శకాలు.. * ఈ ఏడాది జూన్ 2లోపు ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి మాత్రమే క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలి. దీనికి సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలను జతపరచాలి. * పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాల ఆదా య పరిమితిని రెండు లక్షలకు పెంచినందున, ఆలోపు ఆదాయమున్న వారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలుగా గుర్తించాలి. * దరఖాస్తు చేసుకోవడానికి 20 రోజుల గడవు ఇవ్వాలి. దరఖాస్తుతోపాటు భూమికి నిర్ణయించిన ధరలో 25 శాతాన్ని డీడీ రూపంలో చెల్లించాలి. * ఆసుపత్రులు, విద్యా సంస్థలను కూడా వ్యాపార సంస్థలుగానే పరిగణించాలి. * జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన, ఫిర్యాదులపై విచారణ తదితరాలను చేపట్టాలి. * క్రమబద్ధీకరణను 90రోజుల్లో పూర్తి చేయాలి. * ఎటువంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వేలం నిర్వహించాలి. విచారణ సందర్భంలో ఏ ప్రాంతంలో, ఎంత స్థలంలో, ఏ ఇంట్లో, ఎవరు నివాసముంటున్నారో గుర్తించి ఫొటోలను కూడా అధికారులు తీసుకోవాలి. * రెగ్యులరైజేషన్ ప్రక్రియలో సహకరించడానికి పదవీ విరమణ చేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలి. * క్రమబద్ధీకరణ చేసిన తర్వాత ఆ కుటుంబంలోని మహిళల పేరిటే పట్టాలు ఇవ్వాలి. భూముల వేలానికి ఓకే జిల్లాల్లోని ప్రభుత్వ భూముల వేలానికి సం బంధించి కూడా సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్న చిన్న బిట్లుగా ఉన్న భూమిని ప్రభుత్వం వినియోగించుకోలేకపోతున్నందున అవి కబ్జాకు గురవుతున్నాయని, అలాంటి వాటిని వేలం వేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లో కలెక్టర్లు ప్రతిపాదించిన భూములను వేలం వేసేందుకు అనుమతించారు. అలాగే హైదరాబాద్ నగరంలో నాలాల నిర్వహణ సరిగా లేదని, అవి ఆక్రమణకు గురవుతున్నాయని సీఎం ప్రస్తావించారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపై ప్రవహించడానికి ఇదే కారణమన్నారు. నాలాలపై ఆక్రమణలను తొలగించే విషయంలో, వాటిని సక్రమంగా నిర్వహించే విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. -
సీఐల పదోన్నతిపై ఏజీతో చర్చించి నిర్ణయం
సీనియర్ ఐపీఎస్లకు కేసీఆర్ ఆదేశం రంజాన్, బోనాలు బందోబస్తుపై సూచనలు హైదరాబాద్: పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ల పదోన్నతిపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అడ్వకేట్ జనరల్ (ఏజీ)తో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సీనియర్ ఐపీఎస్అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఫ్రీజోన్గా ఉన్నసమయంలో పదోన్నతులకు సంబంధించి రూపొం దించిన జాబితా రూపకల్పనలో తమకు అన్యాయం జరిగిందని కొందరు ఇన్స్పెక్టర్లు సుప్రింకోర్టుకు వెళ్లగా వీరందరికి పదోన్నతులను కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం అప్పటి ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయనిపక్షంలో కోర్టు ధిక్కరణకు తగిన చర్యలు తప్పవని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు ఈనెల 7న రాష్ట్రం తరఫున హాజరుకావలసిన విషయమై మంగళవారం డీజీపీ అనురాగ్శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిసనర్ మహేందర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సత్య నారాయణ తదితరులతో కేసీఆర్ చర్చించారు. నిజానికి ఈ వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని. అయితే హైదరాబాద్ కు సంబంధించిన అధికారులు కూడా ఈ వివాదంలో ఉన్నారు కాబట్టి దీనిపై అడ్వకేట్ జనరల్ రామ కృష్ణా రెడ్డితో చర్చించి నిర్ణయించాలని కేసీఆర్ ఆదేశించారు. సిఐల పదోన్నతుల జాబితా రూపకల్పన క్రమ పద్దతిలో జరగక పోవడం వలన యాబై మందికి పైగాడీఎస్పీల పదోన్నతులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సీఎం దృస్టికి తీసుకు వచ్చారు. కాగా, హైదరాబాద్లో, తెలంగాణా జిల్లాలలో బోనాలు, రంజాన్ పండుగల సందర్భంగా అవాంఛనీయ సంఘటనల నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. -
తెలంగాణ అడ్వకేట్ జనరల్గా రామకృష్ణారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా రామకృష్ణారెడ్డిని నియమించారు. శనివారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్గా రామచంద్రారావు పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.