amjad basha
-
వక్ఫ్ బోర్డు కమిటీ రద్దు దుర్మార్గం: అంజాద్ బాషా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లో ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కారంటూ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే చంద్రబాబు సర్కార్లో కనిపిస్తోందని.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.‘‘నిధులు లేవంటూ వైఎస్ జగన్పై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా 2023లో జీవో 47 కింద వక్ఫ్ బోర్డు నియామకం చేశాం. దాన్ని నిన్న ఆ జీవోను ఉపసంహరించుకోవడం దుర్మార్గం. పూర్తి నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు నియామకం జరిపాం. ఎమ్మెల్యేలు, ముత్తవలీలు, స్థానికసంస్థలు.. ఇలా అన్ని కేటగిరీలో నియామకాలు జరిగాయి. బోర్డు సభ్యులు చైర్మన్ ఎన్నిక చేసుకుంటే ఆనాడు టీడీపీ వారు కోర్టులో కేసు వేసి నిలుపుదల చేశారు. చైర్మన్ ఎన్నిక కాకుండా ఆనాడు నాలుగు పిటిషన్లు వేశారు. ఈ అంశం ఇంకా కోర్టులోనే ఉంది.. మరి కమిటీని ఎలా రద్దు చేస్తారు..?’’ అంటూ ప్రశ్నించారు.‘‘కేవలం టీడీపీ వారిని నియమించుకుని వక్ఫ్ ఆస్తులకు దురాక్రమణ చేయాలనే ఆ జీవో రద్దు చేశారు. బోర్డు చాలా కాలంగా పని చేయడం లేదంటూ రద్దు చేశామని చెప్తున్నారు. కోర్టులో కేసులు వేసి పని చేయకుండా చేసింది మీ టీడీపీ వారు కాదా..?. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో రిట్లను ఉపసంహరించుకోవాలి.. కానీ బోర్డు రద్దు చేయడం ఏమిటి..?..2014-19 మధ్యలో చంద్రబాబు అసలు వక్ఫ్ బోర్డు వేయనే లేదు. 2018లో చంద్రబాబు కమిటీ వేస్తే దాని కాలం 2023 వరకూ ఉంది. మేము అధికారంలోకి వచ్చాకా చంద్రబాబులా ఆ బోర్డును మేము రద్దు చేయలేదు.. ఆ రోజు జలీల్ ఖాన్, అమీర్ బాబు వంటి వారు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ బోర్డు కాలపరిమితి ముగిసిన తర్వాత మాత్రమే మేం కొత్త బోర్డు వేశాం. కానీ మీరు మేము వేసిన బోర్డు కాలపరిమితి ముగియకముందే రద్దు చేయడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చింది.. దాన్ని ముస్లింలంతా అంతా వ్యతిరేకిస్తున్నారువైఎస్ జగన్ ఆదేశాలతో పార్లమెంటులో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. వక్ఫ్ ఆస్తులకు అన్యాక్రాంతం చేసేందుకే ఈ చట్టం తెస్తున్నారు. దీనివల్ల ముస్లింల హక్కులు దెబ్బతింటున్నాయి.. అందుకే వైఎస్సార్సీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంది. జమాతే ముస్లిం నేతలు కూడా జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. జీవో 47 రద్దుపై మేము కచ్చితంగా చట్టప్రకారం పోరాడతాం. మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ తరపున పోరాడతాం’’ అని అంజాద్ బాషా స్పష్టం చేశారు. -
చంద్రబాబుపై అంజాద్ బాషా ఫైర్
-
సోషల్ మీడియా యాక్టివిస్టులకు YSRCP అండ
-
సోషల్మీడియా కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్సీపీ నేతల భరోసా
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: కడపలో సోషియల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ నాయకులు భరోసా ఇచ్చారు. సోషియల్ మీడియా కో కన్వీనర్ నిషాంత్, దుర్గా ప్రసాద్తో పాటు పలు కుటుంబాలను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు ఆదివారం(నవంబర్17) పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ‘ గత కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను నోటీసుల పేరుతో పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు అర్థరాత్రి సమయాల్లో ఇళ్లకు వస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం’అని తెలిపారు. -
పెట్రోల్ దాడి పై YSRCP అంజాద్ బాషా రియాక్షన్
-
దళితులంటే ఎందుకంత ద్వేషం.. బాబు, పవన్ క్షమాపణ చెప్పాలి.. అంజాద్ బాషా ఫైర్
-
షర్మిల వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం అంజాద్ భాష కౌంటర్
-
షర్మిల ఆత్మ పరిశీలన చేసుకోవాలి
కడప కార్పొరేషన్: పీసీపీ అధ్యక్షురాలు షర్మిల ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్బాషా హితవు పలికారు. గతంలో జగనన్న చెల్లిగా ఈ జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారని, ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే కనీస స్పందన కూడా లేదన్నారు. రాజన్న రాజ్యం స్థాపిస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె అక్కడి ప్రజలను, నాయకులను నట్టేట ముంచి ఎన్నికల్లో పోటీచేయకుండా అస్త్ర సన్యాసం చేసిందన్నారు. ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో శనివారం అంజద్బాషా మీడియాతో మాట్లాడుతూ.. రెండ్రోజులుగా షర్మిల వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారని, ఈ సందర్భంగా ఆమె సీఎం వైఎస్ జగన్ని, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్పై అభాండాలు దారుణం.. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ను రెండుసార్లు ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొస్తే ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి షర్మిల మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్పై సంబంధంలేని కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిన విషయాన్ని ఆమె మర్చిపోవచ్చేమోగానీ ప్రజలు మర్చిపోలేదన్నారు. షర్మిల పరిస్థితి చూస్తే తమకే బాధేస్తోందని, జనాలు లేక చాలాచోట్ల మాట్లాడకుండానే ఆమె వెళ్లిన పరిస్థితి ఉందన్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం బాబు మాయలో పడి వైఎస్ జగన్పై అభాండాలు దారుణమన్నారు. ఇష్టానుసారంగా సీఎం జగన్, అవినాష్రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు హర్షించలేదన్న సత్యాన్ని ఆమె గ్రహించాలన్నారు. కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి అవినాష్రెడ్డిని హంతకుడని మాట్లాడటం అనైతికమని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని అంజద్బాషా చెప్పారు. టీడీపీ, బీజేపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలతో వేదికను పంచుకుంటూ బాబు స్క్రిప్టును చదవడం దారుణమన్నారు. షర్మిల, సునీత గతంలో ఏం మాట్లాడారో, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసన్నారు. -
టీడీపీపై డిప్యూటీ సీఎం ఫైర్
-
బీజేపీతో పొత్తు ?..యాంకర్ ప్రశ్నకు డిప్యూటీ సీఎం సూపర్ రిప్లై
-
బీజేపీతో పొత్తు ?..యాంకర్ ప్రశ్నకు డిప్యూటీ సీఎం సూపర్ రిప్లై
-
రాజంపేట.. జనంతోట
సాక్షి రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకొన్న బడుగు, బలహీన వర్గాలు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సాధికారతను ప్రదర్శించాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మంగళవారం రాజంపేటకు తరలివచ్చారు. వేలాది మంది జై జగన్ నినాదాలు చేస్తుండగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర సాగింది. మధ్యాహ్నం మన్నూరు వద్దగల యల్లమ్మ ఆలయంలో నేతలు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి యాత్ర పాత బస్టాండ్ వరకు సాగింది. వేలాది ప్రజలు హాజరైన సభలో నేతలు ప్రసంగించారు. బడుగు, బలహీనవర్గాలను వెన్ను తట్టి నడిపించిన నాయకుడు జగన్: డిప్యూటీ సీఎం అంజాద్బాష రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారిని వెన్నుతట్టి నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్బాష చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, సామాజిక న్యాయంతో సాధికారత సాధించిన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు. కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచారని, రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో 17 పదవులిచ్చారని, ఇతర పదవులు, నామినేటెడ్ పదవుల్లోనే అధికశాతం ఈ వర్గాలకే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరింతగా అభివృద్ధి సాధించాలంటే జగన్ను మరోసారి సీఎంను చేసుకోవాలన్నారు. మనకు, పిల్లల భవిష్యత్తుకు వైఎస్ జగన్ అవసరం: మంత్రి మేరుగు మనతోపాటు మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరికొంత కాలం సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో బడుగులకు అండగా నిలుస్తున్న నాయకునికి మద్దతు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారంటే అది సీఎం జగన్ చలవేనని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను అడుగడుగునా అవహేళన చేసి, అవమానించిన చంద్రబాబు ఓ దురహంకారి అని అభివర్ణించారు. రాష్ట్రంలో బడుగులకే పెద్దపీట: మాజీ ఎంపీ బుట్టా రేణుక రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకే సీఎం జగన్ పెద్దపీట వేసి, వారిని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలను ఉన్నత స్థానాల్లో నిలుపుతోందని తెలిపారు. ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్ : ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ఈ వర్గాలన్నింటినీ అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగనన్న ఒక్కరేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ కొనియాడారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసి, బడుగు బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారన్నారు. ఇంగ్లిష్ చదువులతో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్నను 2024లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురే‹Ùబాబు, ఎమ్మెల్సీ రమే‹Ùయాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థనాయక్ పాల్గొన్నారు. -
కమలాపురం.. జనసంద్రం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి డప్పుల దరువులు, ఆటపాటలతో ప్రజానీకం ర్యాలీగా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇలా వేలాది మంది తరలి రావడంతో సభాస్థలిలో అందరూ కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. వెరసి చెన్నూరులో ఎటు చూసినా, ఏ వీధిలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ కనిపించారు. కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు తమ ప్రసంగాల్లో సీఎం జగన్ పేరును ఉచ్ఛరించగా.. సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలు అమలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ పూలే, కొమురం బీమ్ వంటి మహానీయుల ఆలోచనలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అణగారిన వర్గాలకు అండగా, భావి తరాల ఉన్నతికి దూరదృష్టితో పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్ను మరోమారు మన కోసం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కామెడీ యాక్టర్ పవన్, నయవంచకుడు చంద్రబాబు కలిసికట్టుగా వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని సూచించారు. సామాజిక సాధికారత మా విధానం : డిప్యూటీ సీఎం అంజద్బాషా స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయిందని, అయితే వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతను తన విధానంగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్బాషా చెప్పారు. 2014–19 వరకు సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదని, వైఎస్సార్సీపీ.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా చేసిందని, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిందన్నారు. తనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. ఏపీలోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు సామాజిక న్యాయం అనేది ఏపీలోనే, వైఎస్ జగన్ నాయకత్వంలోనే సాకారమైందని సాంఘిన సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా బడుగులకు రావాల్సిన హక్కులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై, బీసీలపై దాడులు చూశామని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న నాడే చంద్రబాబు దళితద్రోహి అని తేలిపోయిందని, బీసీల తోకలు కత్తిరిస్తానన్న నాడే బీసీ వ్యతిరేకి అని వారు పసిగట్టారని చెప్పారు. సన్నిధి గొల్ల కొనసాగింపు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల సన్నిధి గొల్లను తిరిగి కొనసాగించి రాష్ట్రంలోని యాదవుల ఆత్మగౌరవాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిపారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాయలసీమలో తొలిసారి యాదవులకు ఎమ్మెల్సీ దక్కిందని, మేయర్ పదవులను యాదవులకు అప్పగించి గౌరవించిన చరిత్ర సీఎం జగన్దేనన్నారు. ఆచరణలో చూపిన సీఎం: ఎంపీ అవినాష్రెడ్డి సామాజిక సాధికారిత కాగితాలకే పరిమితమయ్యేదని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే దానిని ఆచరణలో చూపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చెప్పారు. కేబినెట్ కూర్పు నుంచి నామినేటెడ్ పదవులు.. చివరకు ఆలయాల పాలక మండళ్లలో సైతం చిత్తశుద్ధి ప్రదర్శించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం పాటించిన చరిత్ర జగనన్నదేనని మాజీ ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, రామచంద్రారెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
బనగానపల్లెలో జనసునామీ
సాక్షి, నంద్యాల: బనగానపల్లె నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వారు సాధించిన సామాజిక సాధికారతను చాటి చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతో తాము సమాజంలో ఎదిగిన తీరును, తలెత్తుకొని తిరగగలుగుతున్న వైనాన్ని తెలుపుతూ బుధవారం భారీగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత, వృద్ధులు అధిక సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలతో పట్టణంలోని రోడ్లన్నీ కిక్కిరిశాయి. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన బనగానపల్లె పట్టణంలో జరిగిన బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు పోటెత్తారు. జై జగన్.., మళ్లీ జగనే కావాలి అంటూ ప్రజలు చేసిన నినాదాలతో సభాప్రాంగణం హోరెత్తింది. అభివృద్ధి పథంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చేయి పట్టుకొని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు అంతర్జాతీయ స్థాయి విద్య, అధునాతన వైద్యం అందిస్తూనే, అనేక పథకాలతో, కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్ని పదవుల్లో అధిక శాతం ఈ వర్గాలకే ఇస్తూ సీఎం జగన్ అందిస్తున్న చేయూత మరెవరికీ సాధ్యం కాదని తెలిపారు. సీఎం జగన్ వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దక్కిందని, ఈ వర్గాలే ప్రభుత్వానికి వెన్నెముక అని అన్నారు. మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా అడుగుతున్న సీఎం దేశంలో జగన్ మాత్రమేనన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఏనాడూ మైనార్టీలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ శాఖను ఇతర వర్గాలకు కేటాయించిన ఘనుడు చంద్రబాబేనన్నారు. చంద్రబాబు దళితులను అవమానించారు: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దళిత, బలహీన వర్గాలను సీఎం జగన్ గుండెల్లో పెట్టుకొని చూసుకొంటున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు. దళితుడిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి గౌరవించారన్నారు. అన్ని పథకాలు, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లను, ఆస్పత్రులను సీఎం జగన్ కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలకు పైగా లబ్ధి చేకూర్చారని గుర్తు చేశారు. చంద్రబాబు దళితులను తీవ్రంగా అవమానించారని, స్నానం చేయరని, శుభ్రంగా ఉండరని, వారికి రాజకీయాలెందుకంటూ టీడీపీ నేతలు నీచంగా మాట్లాడినా చంద్రబాబు ఖండించలేదని తెలిపారు. సొంత సామాజిక వర్గమే ఎప్పటికీ అధికారం చెలాయించాలనుకునే వ్యక్తి చంద్రబాబు మాత్రమేనన్నారు. ధన, కుల, అవినీతి దాహమే బాబు అజెండా అని మండిపడ్డారు. వెన్నుపోట్లకు కేరాఫ్ అడ్రస్ బాబు అని చెప్పారు. అవినీతికి తలుపులు బార్లా తెరిచిన ఘనత ఒక్క చంద్రబాబుదేనని అన్నారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను నమ్ముకుంటే.. సీఎం వైఎస్ జగన్ ప్రజలను మాత్రమే నమ్ముకున్నారన్నారు. దళితులకు పెద్దపీట వేసిన సీఎం జగన్: ఎంపీ డాక్టర్ గురుమూర్తి రాజ్యాధికారంలో భాగస్వాములైనప్పుడే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని నమ్మి, ఆచరణలో పెట్టిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు నామినేషన్ కింద ఇచ్చే పనుల్లోనూ దళితులకు పెద్దపీట వేశారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పదవీకాలంలో 34 వేల ఉద్యోగాలే ఇచ్చారని, ఈ నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని కొనియాడారు. ఈ సమావేశంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పాల్గొన్నారు. -
సీఎం జగన్ నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ పట్టం
సాక్షి, నంద్యాల: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా సముచితస్థానం ఇచ్చి, సామాజిక న్యాయం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకే ఆయన కేటాయించారని చెప్పారు. అలాగే, మంత్రివర్గంలో దాదాపు 70 శాతం పదవులు బడుగు, బలహీన వర్గాలకే కేటాయించి రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన ఘనత జగన్దేనన్నారు. దేశంలోనే మైనార్టీల పక్షపాత ప్రభుత్వం జగనన్నదేనన్నారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో అంజాద్ బాషా మాట్లాడారు. నా పాలన చూడండి, నా పథకాలు చూసి ఓటు వేయండి అని అడిగే ధైర్యం 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు లేదన్నారు. పేదలకు, పెత్తందార్లకు జరిగే మహా సంగ్రామంలో ప్రజలంతా పేదల ప్రభుత్వమైన వైఎస్సార్సీపీ వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో నాలుగేళ్ల పాటు మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే కల్పించలేదని అంజాద్ బాషా గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పాలించిన పార్టీలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలను ఓటు బ్యాంకుగానే చూశాయని.. కానీ, మొట్టమొదటిసారి వీరందరికీ సంపూర్ణ రాజ్యాధికారం ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కొనియాడారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే అదే వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి సమున్నత స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. నా అక్క, చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అంటూ ఎస్సీలను తన కుటుంబ సభ్యులుగా వైఎస్ జగన్ భావిస్తున్నారని చెప్పారు. నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతీ పేదవారు ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి రాష్ట్రంలో ఉన్నప్పుడు వరుణ దేవుడు ఇటువైపు తొంగిచూసేందుకు కూడా భయపడ్డాడని, వారంతా హైదరాబాద్కు వెళ్లగానే మళ్లీ వర్షాలు పడుతున్నాయన్నారు. బీసీల విలువ జగన్ పెంచుతున్నారు.. ఇక సామాజిక సాధికార యాత్రలో పాల్గొంటున్న బీసీ ప్రజాప్రతినిధులను టీడీపీ నాయకులు సున్నాతో పోలుస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్కుమార్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో బీసీలంతా సున్నాగానే ఉండిపోయారని.. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక సున్నా ముందు ఒకటి అనే సంఖ్య పెట్టి బీసీల విలువ పెంచుకుంటూ వెళ్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు బీసీలను నీచంగా చూస్తున్నారని.. గొర్రెలు, బర్రెలు కాసుకునే వారికి పదవులు ఇచ్చారని అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు అవమానిస్తే సీఎం జగన్ మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటున్నారన్నారు. మీ తోకలు కట్ చేస్తానని నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు అవమానిస్తే అదే వర్గానికి చెందిన వారిని పాలకమండళ్ల సభ్యునిగా చేసి సీఎం జగన్ గౌరవించారన్నారు. ఒళ్లు ఎలా ఉందని మత్స్యకారులను చంద్రబాబు బెదిరిస్తే అదేవర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభ్యకు పంపి గౌరవించిన ఘనత జగన్కు దక్కుతుందని అనిల్ చెప్పారు. మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధంలో మనమంతా మంచి కోసం పోరాడుతున్న జగన్ వైపు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఏకమై జగన్ను సీఎం చేసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14కి 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చి వైఎస్సార్సీపీకి అండగా నిలబడ్డారని.. 2024 ఎన్నికల్లో క్లీన్స్వీప్తో పాటు బంపర్ మెజార్టీలు ఇవ్వాలని అనిల్ అభ్యర్థించారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి సీఎం జగన్ న్యాయం చేస్తున్నారన్నారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా చేయూతనిస్తున్న వైఎస్సార్సీపీకి ప్రజలంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. జోరు వానలోనూ ప్రభం‘జనం’.. ఇక మంగళవారం నంద్యాల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. కనుచూపు మేర ఎటుచూసినా ప్రజలే కనిపించారు. ఇసుకేస్తే రాలనంత జనం సభకు తరలివచ్చారు. జై జగన్.. జైజై జగన్.. జోహార్ వైఎస్సార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే తామంతా నిలుస్తామని నినదించారు. మరోవైపు.. అట్టహాసంగా ప్రారంభమైన సభకు వరుణ దేవుడు స్వాగతం పలికాడు. నాయకులంతా సభా ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. అంతటి వర్షంలోనూ కార్యకర్తలు, ప్రజలు నాయకుల కోసం నిరీక్షించారు. సభకు మహిళలు, యువకులు, వృద్ధులు పోటెత్తారు. వర్షంవల్ల సభ ఆలస్యమైనా ఓపికతో వారంతా ఎదురుచూశారు. తొలుత యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. -
బడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచారు..
సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, అందుకే ఈ వర్గాలకు అన్ని పథకాలు, పదవుల్లో పెద్ద పీట వేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ ఒక వరమని అన్నారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచారని తెలిపారు. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, మైనార్టీలకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడంతోపాటు ఓ మహిళకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారని కొనియాడారు. టీడీపీ హయాంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలిపారు. బీసీల సత్తా చాటుదాం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల సామాజిక సాధికారతకు కృషి చేసి, ప్రజల్లో చైతన్యం తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్దేనని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పారు. సీఎం జగన్కు మద్దతిచ్చి బీసీల సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి కులానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్ పదవులు కట్టబెట్టి గుర్తింపు తెచ్చారన్నారు. రాజ్యసభలో నలుగురు బీసీలకు సభ్యత్వం కల్పించారన్నారు. జగనన్న చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక.. చంద్రబాబు అండ్ కో అనేక కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీసీలందరూ ఏకతాటిపై నిలిచి వైఎస్సార్సీపీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘కులగణన’ సాహసోపేత నిర్ణయం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం సాహసోపేత నిర్ణయమన్నారు. కులగణన పూర్తయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రస్తుతం కల్పించిన ప్రాధాన్యం రెట్టింపు అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్నారాయణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు. బీసీలకు స్వర్ణయుగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి సీఎం వైఎస్ జగన్ అవిరళ కృషి చేస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు.మంత్రి వర్గం, నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ప్రతి ఇంటికీ పెద్ద కుమారుడిలా పింఛన్, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలతో పాటు ఇంటి స్థలం ఉచితంగా ఇచ్చారని, ఇంటి నిర్మాణానికి కూడా తోడ్పడుతున్నారని వివరించారు. జగన్ పాలన బీసీలకు స్వర్ణ యుగమని అన్నారు. మరోసారి జగన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ ఉందన్నారు. -
బడుగులకు రాజ్యాధికారం సాకారమైంది
సాక్షి, నరసరావుపేట: భారత దేశ చరిత్రలో నినాదాలుగానే మిగిలిపోయిన సామాజిక సాధికారత, బడుగులకు రాజ్యాధికారాన్ని సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. ఇది బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగన్ అందించిన ఫలమని అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లా మాచర్లలోని పార్క్ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఎలా మేలు చేసిందో వివరించారు. 70 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంక్గా చూసిన సీఎంలను గతంలో చూశామని, సీఎం వైఎస్ జగన్ మాత్రమే ఈ వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించి వృద్ధిలోకి తెస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క మైనార్టీకి మంత్రిగా అవకాశం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో తనను డిప్యూటీ సీఎంగా చేశారని, నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఓ మైనార్టీ మహిళను మండలి డిప్యూటీ చైర్పర్సన్గా చేసిన ఘనత జగనన్నదేనని తెలిపారు. నాలుగున్నరేళ్లలో మైనార్టీలకు రూ.23,176 కోట్ల లబ్ధి కలిగించారని చెప్పారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న సీఎంకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసి జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని, వెన్నెముక వంటి బ్యాక్బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్ బీసీలను అక్కున చేర్చుకొని, అన్నింటా పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులతో పాటు పూర్తి అధికారాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో చరిత్రలో మరే సీఎం చేయని విధంగా అధిక శాతం పదవులు ఇచ్చారన్నారు. నలుగురు బీసీలను సీఎం జగన్ రాజ్యసభకు పంపడం విశేషమన్నారు. నందిగం సురేష్ వంటి పేదింటి వ్యక్తిని పార్లమెంట్కు పంపిన ఘనత జగనన్నదేనని అన్నారు. బీసీలకు జడ్జి పోస్టులు వద్దని లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. సీఎం జగన్ పేదింటి పిల్లలను అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. రాజధాని ప్రాంతంలో బడుగు, బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, వారికి గూడు కల్పించాలని జగనన్న కలలు కన్నారన్నారు. వీటన్నింటినీ ఓర్వలేని చంద్రబాబు కోర్టులకు వెళ్లి వాటిని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా ద్వితీయ శ్రేణి మనుషులుగా బతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నా వాళ్లు అంటూ ఆప్యాయంగా పిలిచి, వారి ఉన్నతికి పాటు పడుతున్న సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఎస్టీలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. జగన్ డిప్యూటీ సీఎం ఇవ్వడంతోపాటు, ట్రైబల్ కమిషన్ ఏర్పాటు చేశారని, ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలో ఏకంగా 3.26 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం గిరిజనులకు అందజేసిందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాలు కుల గణన చేస్తామని కాకమ్మ కథలు చెప్పాయని, సీఎం జగన్ దాన్ని ఆచరణలో పెడుతున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. సీఎం జగన్ పల్నాడుకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని, వరికపూడిసెలకు అనుమతులు సాధించారని, రూ.3 వేల కోట్లతో హైలు అభివృద్ధి చేయించారని, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తన్నారని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే పల్నాడు రూపురేఖలే మారుస్తామని చెప్పారు. వెల్లివిరిసిన సామాజిక చైతన్యం ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సాయంత్రం 5 గంటలకు రెంటచింతల నుంచి వందలాది వాహనాలతో బైక్ ర్యాలీ ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీలు లావు శ్రీకష్ణదేవరాయలు, నందిగం సురేష్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. యాత్రకు వేలాది ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మాచర్ల శివారు నుంచి పాదయాత్రగా పట్టణంలోని పార్క్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. మాచర్ల నేతలు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం భారీ జన సందోహం మధ్య సభ ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఇతర వర్గాల పేదలకు చేస్తున్న మేలును నేతలు వివరిస్తున్నప్పుడు ప్రజలు పెద్దపెట్టున జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ‘మా నమ్మకం నువ్వే జగన్.., జగన్ రావాలి– జగనే కావాలి’ ‘వై నాట్ 175 ’ అంటూ నినదించారు. నేడు సత్యసాయి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో సామాజిక సాధికార యాత్ర సాక్షి, అమరావతి: గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ యాత్ర ఏడో రోజు శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది. -
బాబుకి అంజాద్ బాషా కౌంటర్...
-
బాబు బెయిల్ పై అంజాద్ బాషా కామెంట్స్..
-
బడుగుల ఆత్మగౌరవం సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కడప: బడుగుల పట్ల నాడు చంద్రబాబు వివక్ష చూపగా, నేడు సీఎం జగన్ అదే బడుగుల ఆత్మగౌరవాన్ని పెంచారని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా చెప్పారు. బీసీలు తమ పేటెంట్ అని చెప్పుకునే చంద్రబాబు వారికి చేసింది శూన్యమని అన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామా జిక సాధికార యాత్రలో భాగంగా శనివారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో జరగిన బహిరంగ సభ లో అంజాద్ బాషా ప్రసంగించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఎన్నికల్లో వాడుకొని, ఆ తర్వాత అవమానించిన వ్యక్తి అని ఆయన చెప్పారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరనుకుంటారంటూ హేళన చేశారని, బీసీలను తోక కత్తిరిస్తానని హెచ్చరించిన ఘనత కూడా బాబుదేనన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు అన్ని రంగాల్లో, అన్ని పద వుల్లో అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని, దేశంలోనే సామాజిక విప్లవాన్ని తీసుకువచ్చిన ఏకైక సీఎం అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లంతా ఆత్మగౌరవంతో బతకాలంటే జగన్ను మళ్లీ సీఎంని చేసుకోవాలన్నారు. బీసీల బలం, ధైర్యం వైఎస్ జగనే : మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ వెనుకబడిన వర్గాల బలం, ధైర్యం సీఎం వైఎస్ జగనే అని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల పేటెంట్ హక్కు వైఎస్ జగనే అని తెలిపారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఎంతో మందిని ఆయన రాజకీయంగా ఉన్నత స్థితికి తెచ్చారన్నారు. 2019కి ముందు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పదవులు ఉన్నాయి?, ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయో బేరీజు వేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు అండగా ఉన్నంతవరకు వైఎస్ జగన్ను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. జగనన్న సామాజిక న్యాయానికి రోల్ మోడల్ : ఎంపీ మస్తాన్రావు దేశంలో సామాజిక న్యాయానికి రోల్ మోడల్ సీఎం వైఎస్ జగన్ అని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు అన్నారు. 8 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలు ఉండటమనేది సీఎం జగన్తోనే సాధ్యమైందన్నారు. బీసీ గణన కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు వేయాలని తమకు సూచించి, అందుకోసం రాష్ట్రంలో ఒక కమిటీ వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, రూ.లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్ కోసం పార్లమెంటులో పోరాడాలని సూచించారన్నారు. సీఎం వైఎస్ జగన్ అండతోనే మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కోసం పార్లమెంటులో పోరాడామని చెప్పారు. కుట్రలు చేసే వారికి గుణపాఠం చెప్పాలి : ఎంపీ గురుమూర్తి పేదలకు మేలు జరగకుండా కుట్రలు, కుతంత్రాలు చేసే వారికి గుణపాఠం చెప్పాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి పిలుపునిచ్చారు. పేదలైన దళిత, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ సంపన్నులుగా చేస్తున్నారని చెప్పారు. పేదరిక నిర్మూలనను సీఎం వైఎస్ జగన్ ఒక యజ్ఞంలా చేస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. సామాజిక సాధికారతకు నిజమైన అర్థం చెప్పారన్నారు. చిన్న పిల్లలు తినే తిండి మొదలుకొని వారి చదువు, వేసుకునే దుస్తులు, పుస్తకాలు, ట్యాబ్ల వంటివన్నీ ముఖ్యమంత్రే వ్యక్తిగతంగా పరిశీలించడం గతంలో ఎన్నడూ లేదన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న స్వేచ్ఛ, గౌరవం మరే పార్టీ లో ఉండదని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇంటి వద్దకే పాలన అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్దేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ అన్నారు. లంచాలు లేకుండా సంక్షేమం అందిస్తున్నారని చెప్పారు. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటే ఏమిటో ఇప్పుడు మనం చూస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీ లకు 4 ఎమ్మెల్సీలు, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన చరిత్ర కూడా వైఎస్ జగనన్నదేనన్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. మంచి చేసిన వైఎస్ జగన్కి అందరూ అండగా నిలవాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు మునుపెన్నడూ ఈ స్థాయిలో పదవులు దక్కలేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మేయర్ సురేష్బాబు అన్నారు. జిల్లాలో 372 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దేనని చెప్పారు. ఈ సమావేశంలో సాధికార యాత్ర రాయలసీమ ఇన్చార్జి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం అనేది గతంలో మాటలకే పరిమితమైంది
-
మన బిడ్డల భవిష్యత్ కోసం జగన్ కావాలి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇన్నేళ్లూ ప్రభుత్వాలన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశాయి. వాడుకుని వదిలేశాయి. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక మన బిడ్డలకు ఇంగ్లిష్ చదువులు చెబుతున్నారు. వారి రక్షణకు భరోసా కల్పిస్తున్నారు, అక్కచెల్లెమ్మలకు చేయూతనిస్తున్నారు. అవ్వా తాతలను మనవడిలా వెంట ఉండి నడిపిస్తున్నాడు. మన బిడ్డల ఉన్నత చదువులకు, వారి భవిష్యత్కు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పలువురు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం భారీ జన సందోహంమధ్య పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం 5 గంటలకు బుక్కరాయసముద్రం సభా వేదిక వద్దకు చేరుకుంది. సాధికారత అంటే ఏంటో చేసి చూపించారు: మంత్రి ఉషశ్రీ సామాజిక సాధికారత అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. మహిళా సాధికారత కోసం రూ.25 వేల కోట్లు వెచ్చించారని తెలిపారు. జనరంజక పాలన అందించారని, ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన పేరు చెప్పుకుని గర్విస్తున్నామన్నారు. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు: అంజాద్ బాషా సీట్లు, ఓట్లతో పాటు మంత్రి పదవులు, ఇతర పదవుల్లోనూ సామాజిక న్యాయం కల్పించిన సీఎం జగన్ అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. జగన్ హయాంలో 11 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు మంత్రులయ్యారన్నారు. 2024లో పేదలకు–పెత్తందార్లకు మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందని, పేదల పక్షాన మనందరం జగన్కు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పారు. స్వాతంత్య్రం ఇప్పుడే వచ్చింది: మంత్రి జయరాం భారత స్వాతంత్య్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఇప్పుడే అసలు సిసలు స్వాతంత్య్రం వచ్చిందని కార్మిక శాఖ మంత్రి జి.జయరాం చెప్పారు. పదవుల్లో, ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల లబ్ధిలో అన్నింటా స్వేచ్ఛ వచ్చిందన్నారు. పల్లెల్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రీ జగన్ను కొడుకుగా భావిస్తున్నారని, చదువుకునే చిన్నారులతో మేనమామగా పిలిపించుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఎస్సీలకు మేలు జరగకుండా బాబు అడ్డుకున్నారు: ఎంపీ సురేష్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే మురికివాడ అవుతుందని చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకొన్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత వైఎస్ జగన్దేనని అన్నారు. 14 ఏళ్ల సీఎం అనుభవం నలభై ఏళ్ల కుర్రాడి ముందు వెలవెల పోయిందని అన్నారు. శింగనమల సెంటిమెంటు పనిచేస్తుంది: జొన్నలగడ్డ శింగనమల నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, మీరందరూ ఇక్కడ మళ్లీ వైఎస్సార్సీపీకి ఓటేసి జగన్ను సీఎం చెయ్యాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. నియోజకవర్గంలో 40 చెరువులను లోకలైజ్ చేసి రైతులకు జగన్ అండగా నిలిచారని, ఈ నియోజకవర్గంపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. జగన్ అన్నట్టు 175కు 175 సీట్లు సాధ్యమే అని తెలిపారు. ఈ యాత్రలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, సిద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, బీసీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా వార్నింగ్
-
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
-
అలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?: మంత్రి అంజాద్ బాషా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతానికి నీళ్లొస్తున్నాయంటే ఆ ఘనత వైఎస్సార్దేనన్నారు. రాయలసీమలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టయినా చంద్రబాబు ప్రారంభించారా? ఏ మొహం పెట్టుకుని రాయలసీమలో చంద్రబాబు తిరుగుతాడు’’ అని మంత్రి దుయ్యబట్టారు. ‘‘రాయలసీమ ప్రాంతానికి సీఎం జగన్ మంచి చేస్తుంటే బాబు అడ్డుకుంటున్నాడు. ప్రాజెక్ట్ల గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు. రాయలసీమలో రైతన్నలకు ఏం చేస్తావో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు హయాంలో రాయలసీమ అభివృద్ధి చెందలేదు’’ అని మంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి భేటీ -
హజ్ యాత్రికులకు ఏపీ ప్రభుత్వ సహకారం
సాక్షి, న్యూఢిల్లీ/చిత్తూరు కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారిపై పడే అధిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉప ముఖ్యమంత్రి, మైనారిటీశాఖ మంత్రి అంజాద్ బాషా చెప్పారు. ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. అనంతరం అంజాద్ బాషా ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల సమస్యపై పౌరవిమానయాన శాఖ మంత్రితో చర్చించామని, బుధవారం కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో సమావేశం అవుతామని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులలోని ఎంబార్కేషన్ పాయింట్ల కన్నా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ధరలు అధికంగా ఉన్నాయని, ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఒక్కొక్కరికీ హైదరాబాద్ నుంచి రూ.3.05 లక్షలు, బెంగళూరు నుంచి రూ.3.04 లక్షలు ఉండగా.. విజయవాడ నంచి రూ.3,88,350 ఉందని తెలిపారు. ఒకవేళ ధర తగ్గించడం సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే అదనపు భారం భరిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంబార్కేషన్ పాయింటును హైదరాబాద్ లేదా బెంగళూరుకు మార్చాలని మంత్రిని కోరామన్నారు. మైనారిటీల ఓట్ల కోసం హజ్ యాత్రికుల సమస్యను టీడీపీ రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్లాజమ్, సభ్యులు ఉన్నారు. -
రామోజీ.. మీ ప్రేమ మాకు అక్కర్లేదు.. అప్పుడెక్కడ దాక్కున్నావు?
కడప కార్పొరేషన్: ఈనాడు అధినేత రామోజీరావు ముస్లిం, మైనార్టీలపై ఒలకబోస్తున్న ప్రేమాభిమానాలు తమకు అక్కర్లేదని ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ బాషా అన్నారు. కడపలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి సమీపంలోని పెద్దకూరపాడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఘర్షణ జరిగితే శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో పోలీసులు తీసుకున్న చర్యల్లో ఒక ముస్లిం యువకుడు గాయపడ్డాడని ఈనాడులో ప్రచురించడం హాస్యాస్పదమన్నారు. రెండు వర్గాలు ఘర్షణకు దిగినప్పుడు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చర్యలు తీసుకోవడం వారి వృత్తి ధర్మమన్నారు. ఆ సమూహంలో ఏ కులం, ఏ మతం వారున్నారో వారికెలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఈ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రాయడం బాధాకరమన్నారు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలను అణగదొక్కి, ఒక్క ముస్లింకు కూడా కేబినెట్లో చోటు కల్పించకపోతే ఈనాడు ఎందుకు రాయలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు వినతిపత్రాన్ని ఇవ్వాలనుకున్న తనను హౌస్ అరెస్టుచేశారని, అది కూడా రామోజీకి కనిపించలేదన్నారు. నిజంగా ముస్లిం యువతపై దాడులు జరిగితే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అంజద్ బాషా స్పష్టంచేశారు. మైనార్టీలపై చంద్రబాబు, రామోజీలది కపట ప్రేమ అన్నారు. టీడీపీ దేశద్రోహం కేసు పెట్టినా రాయలేదు టీడీపీ హయాంలో.. నారా హమారా సభలో ముస్లిం యువకులు ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశద్రోహం కేసులు పెట్టినప్పుడు ఇది అన్యాయమని అప్పట్లో రామోజీ తన ఈనాడులో రాయలేదని.. అప్పుడు రామోజీరావు ఎక్కడ దాక్కున్నారని ఆయన ప్రశ్నించారు. అలాగే, బాబు పాలనలో ముస్లిం మైనార్టీలపై ఎన్నో దౌర్జన్యాలు, జరిగినా రాయలేదన్నారు. ఇప్పుడు చిన్న సంఘటన జరిగితే అందులో ముస్లిం యువకుడు గాయపడ్డాడని భూతద్దంలో చూపడం అన్యాయమన్నారు. చదవండి: మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ కీలక నిర్ణయం అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, 12 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక డిప్యూటీ చైర్మన్ పదవులిచ్చి మంచి చేస్తున్నా రాయలేదన్నారు. ఇవన్నీ రామోజీరావుకు ఎందుకు కనిపించవని అంజద్ బాషా ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ ఉండగా ఏ ముస్లిం, మైనార్టీకి అన్యాయం జరగదని ధీమా వ్యక్తంచేశారు. -
చంద్రబాబు అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి: అంజాద్ భాషా
సాక్షి, తాడేపల్లి: లోకేష్కు పాదయాత్ర చేయడానికి ఏ అర్హత ఉందని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోయి దొడ్డిదారిన లోకేష్ మంత్రి అయ్యాడని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి. మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనుబడిన మైనార్టీలకు సీఎం జగన్ అండగా నిలిచారు’’ అని మంత్రి అన్నారు. ‘‘వైఎస్సార్సీపీతోనే మైనార్టీలకు ఆత్మగౌరవం. త్వరలోనే లక్ష మంది మైనార్టీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం. మైనార్టీలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత విద్య అభ్యసిస్తున్నారంటే దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్లతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్. తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్ మైనార్టీలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించారు. మైనార్టీలకి డిప్యూటీ సీఎం ఇచ్చారు.. 75 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పే ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్’’ అని మంత్రి అంజాద్ భాషా పేర్కొన్నారు. చదవండి: టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి -
24 గంటలు గడవక ముందే బాధితునికి అందిన సాయం
సాక్షి, వైఎస్సార్ కడప: కడప జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం రోజున భూమయ్యపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు తన కుమారుని అనారోగ్య సమస్యను సీఎం దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణమే లక్ష రూపాయలు మంజూరు చేయడంతో పాటు వైద్య ఖర్చులు భరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఈ రోజు (శనివారం) ఉదయం బాధితుల కుటుంబానికి డిప్యూటీ సీఎం అంజాబాద్, కడప నగర మేయర్ సురేష్ బాబు, జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సిద్ధవటం యానాదయ్య లక్ష రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ఉద్యానశాఖ వ్యవసాయ సలహాదారులు ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్లు&డివిజన్ ఇంఛార్జిలు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: (మరోమారు సీఎం జగన్ మానవత్వం) -
YSRCP: డిసెంబర్ 5న కర్నూలులో సీమ గర్జన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: డిసెంబర్ 5న కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీమ గర్జనను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఇన్చార్జ్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ కడపలో రాయలసీమ గర్జన పేరుతో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీమ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ సలహా మండలి ఛైర్మన్ తిరుపాల్రెడ్డి హాజరయ్యారు. చదవండి: (అనంతలో ఎల్లో కుట్రలు.. ఆ ఇద్దరే 22 కేసులు వేశారు) -
మైనార్టీ పథకాలపై ఎల్లో మీడియా కథనాన్ని ఖండించిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
-
ముస్లిం మైనార్టీలపై బాబు మొసలి కన్నీరు
కడప రూరల్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియా ముస్లిం మైనార్టీలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని డిప్యూటీ సీఎం అంజద్ బాçషా ధ్వజమెత్తారు. బుధవారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కపట రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి చంద్రబాబు అభద్రతా భావంతో లాస్ట్ఛాన్స్ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో మైనార్టీలు ఒక్కరికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక్క చంద్రబాబు పాలనలోనే మైనార్టీలకు మంత్రి పదవి దక్కలేదని, మరి ఆనాడు రామోజీ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రన్న తోఫాలంటూ హెరిటేజ్లో బూజుపట్టిన బెల్లం అంటగట్టి గొప్పలు చెప్పుకున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైనార్టీల కోసం కేవలం రూ.2,665 కోట్లు ఇవ్వగా మూడున్నరేళ్లలో సీఎం జగన్ రూ.20 వేల కోట్లకు పైగా వెచ్చించారని తెలిపారు. డీబీటీ ద్వారా రూ.10,309 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.10,020 కోట్లు మైనార్టీలకు అందించారన్నారు. కోవిడ్ సమయంలో రూ. 81 కోట్లు మైనార్టీల ఖాతాల్లోకి పంపిన ప్రభుత్వం తమదేనన్నారు. ఇమామ్, మౌజన్ల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకుని ప్రతినెల గౌరవ వేతనం అందిస్తున్నారన్నారు. నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా, మండలిలో మరో నలుగురికి అవకాశం కల్పించారన్నారు. ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించడంతోపాటు చట్టం చేసి పూర్వ వైభవాన్ని కల్పించారన్నారు. ఒక్కసారి మేలు చేస్తే జీవితాంతం గుర్తుంచుకునే వర్గాలు ముస్లిం మైనార్టీలని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు జహీర్, షఫీ, అజ్మతుల్లా, సుబ్బారెడ్డి, సుభాన్బాషా తదితరులు పాల్గొన్నారు. -
‘అప్పుడు మైనార్టీలకు అన్యాయం జరిగినా ఎల్లో మీడియా సైలెంట్గా ఉంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. కాగా, అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కేబినెట్లో మైనార్టీకు స్థానం కూడా ఇవ్వలేదు. మైనార్టీలను చంద్రబాబు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. అప్పట్లో మైనార్టీలకు అన్యాయం జరిగినా ఎల్లో మీడియా సైలెంట్గా ఉంది. ఇప్పుడు చిలవలు పలవలుగా తప్పుడు ప్రచారం చేస్తోంది. రోజురోజుకు అభద్రతా భావంతో చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అని ప్రజలను అడుక్కుంటున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ మభ్యపెడుతున్నారు. మైనార్టీలపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ దొంగ ప్రేమ చూపిస్తుంటే బాధగా ఉంది. మైనార్టీలను అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ హయంలో చంద్రబాబు.. మైనార్టీలకు ఎం చేశాడో, ఏం ఇచ్చాడో ప్రజలకు బాగా తెలుసు. మైనార్టీల సంక్షేమం కోసం 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత మా ప్రభుత్వానిది. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎల్లో మీడియా కథనాలను ప్రచురించాలి. ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మాది’ అని స్పష్టం చేశారు. -
‘చంద్రబాబును నమ్మరు.. 14 ఏళ్లలో ఏం చేశారో అందరూ చూశారు’
సాక్షి, నంద్యాల జిల్లా: చంద్రబాబును ఎవరూ నమ్మరని, 14 ఏళ్లలో ఏం చేశారో అందరూ చూశారని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని మండిపడ్డారు. చంద్రబాబుకు రాయలసీమలో పర్యటించే హక్కులేదని, రైతులు గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు తలకిందులు తపస్సు చేసిన ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు మాటలకు, పనులకు పొంతన ఉండదని అంజాద్ బాషా ధ్వజమెత్తారు. చదవండి: ‘చంద్రబాబు కోరిక తప్పక తీరుతుంది.. దేవుడు తథాస్తు అంటాడు’ -
చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఫైర్
-
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం
కడప కార్పొరేషన్: యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్ జిల్లా కడపలోని ప్రభుత్వ ఐటీ కళాశాలల ఆవరణలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ను శనివారం ఆయన ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో స్కిల్ హబ్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు(స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ) చల్లా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా సీఎం జగన్ రెండు స్కిల్ వర్సిటీలు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ హబ్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సజ్జల సిద్దవటం: అన్నమయ్య జిల్లా సిద్దవటం మండలంలోని నేకనాపురానికి సమీపంలో డాక్టర్ సంజీవమ్మ, డాక్టర్ తక్కోలి మాచిరెడ్డి దంపతులు నిర్మించిన జీవని వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆశ్రమానికి తన వంతుగా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, ఎమ్మెల్సీ రమేష్యాదవ్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓబులేసు పాల్గొన్నారు. -
జంబలకిడిపంబ పార్టీగా టీడీపీ
యర్రగొండపాలెం: తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్లు తొడలు కొడతారు, మగాళ్లు ఏడుస్తారని.. అది జంబలకిడిపంబ పార్టీలా తయారైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించటానికే రైతుల పేరుతో టీడీపీ పాదయాత్ర చేయిస్తోందని.. రైతులు ఎక్కడైనా వాకీటాకీలు, ఐఫోన్లు పెట్టుకుని తొడలు కొట్టడం చూశారా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.2కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ క్రీడా వికాస కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షత వహించారు. ఉప ముఖ్యమంత్రి షేక్ అంజాద్బాషా, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను సీఎం జగన్ నిజాయితీగా నెరవేరుస్తుంటే దుష్టచతుష్టయం జగనన్నపై విషం చిమ్ముతోందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నీచరాజకీయాలు మాని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆమె హితవు పలికారు. పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు చంద్రబాబుకు, లోకేశ్కు వత్తాసు పలుకుతూ, ప్రజలకు మేలుచేస్తున్న జగన్మోహన్రెడ్డిని ఇంటికి పంపించాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పగటి కలలు కంటున్నాయని విమర్శించారు. వారి కలలకు ఫుల్స్టాప్ పెట్టాలంటే చంద్రబాబుకు అక్కాచెల్లెళ్లు కొట్టే దెబ్బ వారికి అబ్బా అనిపించేలాగా ఉండాలన్నారు. ఈసారి కుప్పంలో కూడా టీడీపీ గెలిచే పరిస్థితిలేదని రోజా అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్సార్సీపీ జెండానేనని ఆమె అన్నారు. బాబు చేయలేనిది జగన్ చేశారు ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్ జగన్ సుపరిపాలన చేశారు కాబట్టే తాము కాలర్ ఎగరేసి వెళ్తున్నామని రోజా ధీమాగా చెప్పారు. ‘రాబోయే ఎన్నికల్లో నీవు నెగ్గేదిలేదు, జగనన్న తగ్గేదిలేదని’’ ఆమె చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 30 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది మూడేళ్లలో జగన్ చేసిచూపించి దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచారన్నారు. ఇక 29 గ్రామాల కోసం 26 జిల్లాలకు అన్యాయం చేయటానికి జగనన్న ఒప్పుకోరని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని రోజా స్పష్టంచేశారు. సభలో కలెక్టర్ దినేష్కుమార్తోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
బాలిక లివర్ మార్పిడికి సీఎం సహాయ నిధి సాయం
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని డిప్యూటీ సీఎం అంజద్బాషా సోదరుడు, హరూన్ గ్రూప్ సంస్థల ఎండీ ఎస్బి అహ్మద్బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన కడప నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక సయ్యద్ షబానా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సీఎం సహాయ ని«ధి నుంచి మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి అందజేశారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న సయ్యద్ షబానా చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారని చెప్పారు. అంత ఖర్చు భరించలేని బాలిక కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం అంజద్బాషాను ఆశ్రయించడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడి సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స వ్యయం రూ.17.50 లక్షలు మంజూరు చేయించారన్నారు. డిప్యూటీ సీఎం అందుబాటులో లేనందున ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి తాను అందిస్తున్నట్లు వివరించారు. షబానా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తన లివర్ను దానం చేస్తున్న బాధితురాలి తల్లితోపాటు శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలియచేశారు. -
షుక్రియా.. సీఎం సార్
కడప కార్పొరేషన్/సాక్షి, విశాఖపట్నం: పేదింటి యువతుల వివాహాలను గౌరవంగా జరిపించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కడపలో మహిళలు ‘కృతజ్ఞతా ర్యాలీ’ నిర్వహించారు. ‘షుక్రియా సీఎం సార్.. థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ నినాదాలు చేస్తూ.. సీఎం జగన్పై తమ అభిమానాన్ని చాటుతూ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ ఆడిటోరియం వద్ద ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా దీనిని ప్రారంభించారు. అలాగే విశాఖలోని లక్ష్మీటాకీసు వద్ద సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. పేదల పెన్నిధి సీఎం క్షేమం కోరుతూ శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ సింహాచలం కొబ్బరికాయలు కొట్టారు. -
మానసిక వ్యాధులకు ఆరోగ్యశ్రీ
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): గతంలో ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే మానసిక వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా చెప్పారు. విజయవాడలో డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి నిర్వహిస్తున్న ఇండ్లాస్ విమ్హాన్స్ మానసిక వైద్యశాలను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంత వాసులు మానసిక వ్యాధులకు చికిత్స పొందేందుకు ఇప్పటి వరకు ఆస్పత్రి అందుబాటులో లేదన్నారు. దీంతో కడప రిమ్స్లో రూ.50 కోట్లతో 100 పడకల మానసిక వ్యాధుల ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందన్నారు. తమ జిల్లాకు చెందిన డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్రెడ్డి నాలుగు దశాబ్దాల కిందటే విజయవాడలో మొదటి మానసిక వ్యాధుల ఆస్పత్రి స్థాపించి, ఈ ప్రాంతం వారికి సమర్థమైన సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తాను రచించిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రికి అందచేశారు. -
కులాల మధ్య చిచ్చుకే.. పవన్ పర్యటన
కడప కార్పొరేషన్: తన స్వప్రయోజనాల కోసం వైఎస్సార్ జిల్లాలో కులాల మధ్య చిచ్చు రేపేందుకే పవన్కళ్యాణ్ పర్యటించారని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ కె. సురేష్బాబుతో కలిసి శనివారం అంజద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా వైఎస్ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారన్న విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నామని, రైతులు విత్తు వేసినప్పటి నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందన్నారు. పద్యం పుట్టిన చోట మద్యం ఏరులై పారుతోందని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అంజద్ బాషా ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45వేల బెల్టుషాపులను రద్దుచేసిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ వారసత్వ రాజకీయాలు చేయడంలేదని, కాంగ్రెస్ ఇచ్చిన కేంద్రమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారన్నారు. ఇక పవన్ ఎవరి పేరు వాడుకుని రాజకీయాలు చేస్తున్నాడో గుర్తుచేసుకోవాలని చెప్పారు. 14 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ కేవలం ఒక్క ఎమ్మెల్యేనే గెలిపించుకున్నావని.. అందుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. అప్పుడెందుకు ప్రశ్నించలేదు.. ప్రశ్నించడానికే వచ్చానని చెప్పుకుంటున్న పవన్ 2014కు ముందు ఎంతోమంది రైతులు అప్పులపాలై చనిపోతే ఎందుకు ప్రశ్నించలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కులాల ప్రస్తావన తేవడం బాబు, పవన్ ఆడుతున్న నాటకంలో భాగమేనన్నారు. కులాల మధ్య చిచ్చురేపేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని అంజద్ బాషా హెచ్చరించారు. తన వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా చంద్రబాబుకు బదిలీచేసి ఆయన్ను సీఎం చేయడమే పవన్ ఎజెండా అని ఆరోపించారు. పవన్కళ్యాణ్ రాయలసీమకు ఏం చేశారో, ఈ ప్రాంత అభివృద్ధిపై ఆయన ప్రణాళిక, వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒంటరిగా పోటీచేసే దమ్ముందా పవన్.. మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ తన సామాజిక వర్గం వారున్నారనే పవన్ సిద్ధవటంలో సభ పెట్టారన్నారు. టక్కోలు పంచాయతీ, డేగల వాండ్ల పల్లెలో శిరిగిరెడ్డి సాంబశివారెడ్డి అనే వ్యక్తి అప్పులతో చనిపోయాడని, వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.7లక్షల పరిహారం ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా, ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేయడం అవివేకమన్నారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు మెచ్చుకుని, అక్కడ అమలుచేస్తుంటే ఇక్కడి ప్రతిపక్షాలకు కడుపుమంటగా ఉందన్నారు. ఇక జగన్ వారసత్వంగా సీఎం కాలేదని, సొంతంగా పార్టీ పెట్టి, సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకొచ్చారన్నారు. ఒంటరిగా పోటీచేసే దమ్ము, ధైర్యం పవన్కు ఉందా అని సురేష్బాబు సవాల్ విసిరారు. -
'ప్రజలు తరిమి తరిమి కొడతారు.. ఖబడ్దార్ పవన్ కల్యాణ్'
సాక్షి, వైఎస్సార్ కడప: చంద్రబాబు దత్తపుత్రుడు రైతులకు మేలు చేయడానికి రాలేదని, కులాల మధ్య చిచ్చు పెట్టడానికే వచ్చారంటూ పవన్ కల్యాణ్పై డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో కులాలు, మతాలు లేవు అందరూ ఒకటే అన్న విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రైతుల కోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ.. రైతు విత్తనం మొదలు గిట్టు బాటు ధర వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రైతులు అత్మహత్యలు చేసుకున్నా, నీళ్ళు లేకపోయినా ఎందుకు ఆ రోజు ప్రశ్నించ లేదు. ప్యాకేజీ నాయకుడు పవన్ కళ్యాణ్. ప్యాకేజీ కుదిరాక ఏదో పర్యటన చేసి విమర్శిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 45 వేల బెల్టు షాపులు పెట్టి, మద్యం ఏరులై పారినపుడు.. పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బెల్టు షాపులు రద్దు చేసింది. ఇది తెలియక పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. చదవండి: (బీసీ-డీగా మున్నూరు కాపులు.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు) ఖబడ్దార్ పవన్ కల్యాణ్ వారసత్వ రాజకీయాలు చేస్తున్నాడని చెబుతున్నారు ఇది సరైంది కాదు. కాంగ్రెస్ కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని పార్టీ పెట్టి, ప్రజాబలంతో అధికారంలోకి వస్తే వారసత్వ రాజకీయాలు అనడం ఏమిటి. నువ్వు ఏం రాజకీయాలు చేస్తున్నావు.. అన్న పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నావు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైఎస్సార్సీపీ. మా ప్రభుత్వంలో కరుడు గట్టిన టీడీపీ కార్యకర్తలకు కూడా మంచి చేస్తున్నారు. నువ్వు, చంద్రబాబు కలిసి వైసీపీకి కులం, మతం అంట గడుతున్నారు. షర్మిల ఎప్పుడైనా జగన్ అన్యాయం చేసారని చెప్పారా. కానీ మీ భార్య మీపై బహిరంగంగా విమర్శలు చేసిన విషయం మర్చిపోవద్దు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఈ జిల్లా ప్రజలు తరిమి తరిమి కొడతారు. ఖబడ్దార్.. పవన్ కల్యాణ్ అంటూ హెచ్చరించారు. చదవండి: (మంత్రి ఆర్కే రోజాని మర్యాదపూర్వకంగా కలిసిన పీవీ సింధు) సవాల్కు సిద్ధమా? ఒక కులానికి, వర్గానికి కొమ్ము కాస్తున్నావు. నీకు ఒక హిడెన్ అజెండా ఉంది. చంద్రబాబుకు గంప గుత్తగా నీ కులం ఓట్లు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నావు. ఆత్మాభిమానం అని మోసపు మాటలు వద్దు. వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు వెడల్పు చేశాకే రాయలసీమకు నీళ్ళు వస్తున్నాయి. కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తూ న్యాయం చేసిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ. కౌలు రైతులకు కార్డు ఉండి, ప్రభుత్వ సాయం అందక పోయినట్లు నిరూపిస్తే నువ్వు ఏం చెబితే అది చేస్తాం.. నిరూపించేందుకు సిద్ధమా అంటూ అని పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎం అంజాద్ భాషా సవాల్ విసిరారు. -
కదం తొక్కిన ముస్లింలు
కడప కల్చరల్: మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ)పై బీజేపీ నేతలు నుపుర్శర్మ, నవీన్కుమార్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్బాషా అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో పలు ముస్లిం సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేక్నామ్ఖాన్ కళాక్షేత్రంలో బహిరంగసభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం అంజాద్బాషా మాట్లాడుతూ ఏ మతాన్ని ఇతర మతాల వారు కించపరచడం ధర్మం కాదని, అన్ని ధార్మిక గ్రంథాలు ఇతర మతాలను గౌరవించాలని సూచిస్తున్నాయన్నారు. నుపుర్శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలు దేశంలోని కోట్లాది మంది ముస్లింలను ఆవేదనకు గురి చేశాయన్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అహ్మదుల్లా, రాజకీయ ప్రముఖులు ఎస్బీ అహ్మద్బాషా, సుభాన్బాషా, అమీర్బాబు, నజీర్ అహ్మద్, ఆధ్యాత్మికవేత్తలు హజరత్ వలీవుల్లా హుసేనీ సాహెబ్, హుసేనీ బాషా షహమీరి సాహెబ్, హజరత్ ముఫ్తీ మహమ్మద్ అలీ బొగ్దాది సాహెబ్, ముస్లిం మతగురువులు పాల్గొన్నారు. కడపలోని అల్మాస్పేట నుంచి ప్రారంభమైన ర్యాలీ నేక్నామ్ఖాన్ కళాక్షేత్రం వరకు సాగింది. -
ఈ పాపం బాబుది కాదా?
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/కడప కార్పొరేషన్: ‘గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారులన్నీ దెబ్బతిన్నాయి. వాస్తవానికి నాడు ఎన్ని లోపాలున్నా, రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నా, పచ్చ పత్రికలు ఏమాత్రం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే దశల వారీగా రహదారుల నిర్మాణం, మరమ్మతుల పనులు చేపట్టింది. ఇది చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు, వారికి బాకా ఊదే ఈనాడుకు గిట్టడం లేదు. వాస్తవానికి రహదారులు ఇంత దారుణంగా ఉండటానికి కారణం గత చంద్రబాబు ప్రభుత్వమే. ఆ విషయాన్ని విస్మరించి.. అదే పనిగా ఉన్నవీ, లేనివీ కల్పించి ఈనాడు తప్పుడు కథనాలు రాస్తూ ప్రజల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేస్తోంది’ అని విశాఖ, కడపలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, అంజద్ బాషా, ఇతర ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ‘నగర రోడ్లపై నరక యాతన’ శీర్షికన శుక్రవారం ఈనాడులో ప్రచురితమైన అవాస్తవాలతో కూడిన కథనాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. విశాఖలో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ శ, ఆర్డీవో డి.హుస్సెన్ సాహెబ్, వివిధ శాఖల అధికారులతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, కడపలో మేయర్ సురేష్ బాబు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్వర్మ, కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్చంద్లతో కలిసి అంజాద్బాషాలు ఆయా కలెక్టరేట్లలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అవి పాత ఫొటోలు.. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రహదారులన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తోంది. విశాఖలో అవసరమైన మేరకు నిధులు కూడా కేటాయించాం. కానీ ఈనాడు పత్రిక పాత ఫొటోలు వేసి తప్పుగా ప్రచారం చేసింది. ద్వారకానగర్లో జూన్ 6వ తేదీలోపు రహదారులు వేశాం. ఇక్కడే మరమ్మతులు కూడా చేపట్టాం. మరమ్మతులు జరిగిన రహదారుల్లో పాత ఫొటోలతో వార్తలు రాయడం దారుణం. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా రాత్రికి రాత్రి రోడ్లు వేయడం జరగదు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ రహదారులన్నీ ఛిద్రంగా మారాయి. దాని వల్లే ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయి. అవన్నీ సరిచేయిస్తున్నాం. జీవీంఎసీ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్లు సూచనలు, సలహాల మేరకు పనులు చేపడుతున్నాం. అన్ని వార్డుల్లో మొత్తం 6,900 గుంతలను, రహదారులను గుర్తించాం. ఇందులో సుమారు 3,200 గుంతలను రూ.9 కోట్లతో మరమ్మతులు చేశాం. మిగిలిన 3,700 గుంతలు జూలై 15 నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రహదారుల నిర్మాణం చేపట్టాం’ అని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు వివరించారు. ఓర్వలేని రాతలవి.. ‘కడప నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఈనాడు ఓర్వలేకపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే.. మంచి చేస్తున్నారని మాట మాత్రమైనా చెప్పని పచ్చ పత్రికలు నాణేనికి ఒకవైపు మాత్రమే చూపిస్తూ దుష్ప్రచారం చేస్తుండటం అన్యాయం. రాష్ట్రంలో రూ.2300 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. కడపలో 74 రోడ్లను రూ.124.14కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. అందులో రూ.103.44 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కడపలో నిర్మిస్తున్న రాజీవ్ మార్గ్ రహదారి మొదట రూ.3.08 కోట్లతో మంజూరైంది. ఆ తర్వాత ఆ నిధులు చాలవని డీఎంఏ నిధుల నుంచి రూ.1.10 కోట్లు, కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి రూ.1.04 కోట్లు ఖర్చు చేసి సుమారు రూ.6కోట్లతో ఆ రోడ్డును అభివృద్ధి చేస్తున్నాం. కోవిడ్ కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి. ఈ రోడ్డులో 37 ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయి. వారందరినీ ఒప్పించి పనులు చేయడం కూడా ఆలస్యానికి కారణం. ఇప్పటికే 790 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించారు. అటువైపు ఫొటో తీయకుండా, మరో వైపు ఫొటో తీసి దుష్ప్రచారానికి తెరతీశారు. వైఎస్సార్ జిల్లాలో ఇప్పుడు జరుగుతున్నంత అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదు. టీడీపీ ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా రూపాయి నిధులివ్వలేదు. కార్పొరేషన్ సాధారణ నిధులు, కేంద్ర నిధులతోనే రోడ్లు నిర్మించాం’ అని అంజాద్ బాషా పేర్కొన్నారు. -
చంద్రబాబు కుట్రలను మీరే తిప్పి కొట్టాలి: ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా
-
సింగిల్గా వస్తాం.. విజయ ఢంకా మోగిస్తాం: అంజాద్ బాషా
-
మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి
కడప కల్చరల్: మూడు రాజధానుల ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్బాషా పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు ఒనగూరే ప్రయోజనాల గురించి నగరాలు మొదలుకుని మండల స్థాయి వరకు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం కడప నగరంలోని మానస ఇన్ హోటల్లో ఫోరం రాయలసీమ అధ్యక్షుడు లయన్ కె.చిన్నపరెడ్డి అధ్యక్షతన డాక్టర్ గాజులపల్లె రామచంద్రారెడ్డి రాసిన భావితరాల భవిత–మూడు రాజధానులు పుస్తక పరిచయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి ఇత ర అతిథులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోనే మిగతా ప్రాంతాలు ఎంతో వెనుకబడి రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి స్థితిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకేలా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులతో పాలనా వికేంద్రీకరణ జరగాలన్నారు. ∙నగర మేయర్ కె.సురేష్బాబు మాట్లాడుతూ దశాబ్దాలుగా మన ప్రాంతం అలసత్వానికి గురైందని, డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలను కూడా లెక్క చేయకుండా పోరాడారన్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని ప్రాంతాలు, వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పాలనా వికేంద్రీకరణ వల్లనే మన జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ వస్తున్నాయన్నారు. వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం రాయలసీమ అధ్యక్షుడు లయన్ కె.చిన్నపరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ విజన్కు మారుపేరుగా నిలిచారని కొనియాడారు. ఫోరం ఆధ్వర్యంలో మండల స్థాయిలో కూడా మూడు రాజధానుల వల్ల కలిగే మేలు గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కావడం సీమ వెనుకబాటు తనానికి కారణమన్నారు. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు శాంతమూర్తి మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే సుపరిపాలన సాధ్యమని చెప్పారు. ఫోరం సభ్యుడు డాక్టర్ జాన్బాబు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లాంటి పథకంతో డాక్టర్ వైఎస్సార్ తెలుగు ప్రజలకు దేవుడయ్యాడని, నేడు జగన్ అంతకుమించిన పథకాలు చేపట్టి విజన్ గల నాయకుడిగా పేరు పొందారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి రత్నకుమారి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలకు తగిన గౌరవం ఈ ప్రభుత్వంలోనే లభిస్తోందన్నారు. డాక్టర్ తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సీమకు అన్యాయం జరిగినా ఈ ప్రాంత వాసులు ప్రశ్నించకపోవడం బాధాకరమన్నారు. ఫోరం సభ్యుడు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ జగన్ లాంటి నేతను దూరం చేసుకోవద్దని సూచించారు. జోజిరెడ్డి, రాయలసీమ టూరిజం సంస్థ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన్రాజు ప్రసంగించారు. -
AP New Cabinet: అంజద్బాషాను రెండోసారి వరించిన మంత్రిపదవి
కడప కార్పొరేషన్: కడప గడపకు మరోమారు మంత్రి హోదా దక్కింది. సమర్థత, విశ్వాసం, సామాజిక సమతుల్యత నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్బాషాకు రెండోసారి అరుదైన అవకాశం లభించింది. ఈయనను మంత్రివర్గంలోకి తీసుకొని ముస్లీం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రపీఠం వేశారు. శనివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా, రాష్ట్ర రాజధానికి ఎమ్మెల్యే అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివెళ్లాయి. వ్యాపారవేత్తగా కడప వాసులకు సుపరిచితుడైన అంజద్బాషా 2005లో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, వైఎస్ కుటుంబాన్ని అనుసరిస్తూ వైఎస్సార్సీపీ పార్టీలో క్రియాశీలక భూమిక పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. కడప నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికై వైఎస్సార్సీపీ ఉన్నతికి కృషి చేశారు. అనంతరం 2014లో శాసనసభకు పోటీచేసే అవకాశం దక్కింది. కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్రంలో ఆపార్టీ అధికారం చేజేక్కించుకోలేకపోయింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, ప్రత్యక్ష పోరాటాల్లో తనవంతు పాత్రను పోషించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. తర్వాత వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా ఎంపికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల మేనిఫేస్టో కమిటీ మెంబర్గా అంజద్బాషా నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన ఆయన మరోమారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆనక ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆయనకు రెండవసారి మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విధేయుత..విశ్వాసం..సమర్థత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల విశ్వాసం, ముస్లీం మైనార్టీ వర్గీయుడైనా అత్యంత సమర్థత కల్గిన నాయకుడుగా ఎస్బి అంజద్బాషా గుర్తింపు దక్కించుకున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకపోగా, వైఎస్సార్ జిల్లాలో ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే దిశగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టిన అటువైపు మొగ్గు చూపకుండా విశ్వాసంగా ఉండడం, పార్టీ కోసం శక్తికి మించి శ్రమించడం ఇవన్నీ కలిసివచ్చాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పాతవారిని తొలగించి కొత్తవారిని మంత్రులుగా తీసుకుంటారని ప్రచారం సాగినా సామాజిక సమీకరణల నేపథ్యంలో అంజద్బాషాను మళ్లీ మంత్రిపదవి వరించిందని పరిశీలకులు భావిస్తున్నారు. చేపట్టిన పదవులు అంజద్బాషా మదీనా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్గా,బుఖారియా విద్యాసంస్థ ఉపాధ్యక్షుడిగా, అల్ హజ్ ఎస్బి అబ్దుల్ ఖాదర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి, హరూన్ ఛారిటబుల్ ట్రస్టు, నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూల్ అల్యూమిని అసోషియేట్లకు అధ్యక్షుడిగా ఉన్నారు. హౌస్ మసీదు కమిటీ కోశాధికారిగా, ఏపీ ముస్లిం కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా, ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్కు గౌరవాధ్యక్షుడిగా, కడప మున్సిపల్ కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2005లో కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్గా పోటీ చేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్సీపీ కడప సమన్వయకర్త. 2014లో వైఎస్ఆర్సీపీ తరుపున పోటీ చేసి 45వేలపైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2016లో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు. 2018లో జనరల్ సెక్రెటరీ,2019 ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్. సార్వత్రిక ఎన్నికల్లో 54వేల మెజార్టీతో విజయం సాధించారు. కుటుంబ నేపథ్యం కడప జిల్లా సిద్దవటంకు చెందిన జనాబ్ ఎస్బి హరూన్ సాహెబ్ 1935 నుంచి 1953 వరకు సుమారు 18 సంవత్సరాలు సిద్దవటం సర్పంచ్గా పనిచేశారు. సిద్దవటంలో హరూన్ సాహెబ్ అందించిన సేవలకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది. హరూన్ సాహెబ్ కుమారుడైన అబ్దుల్ ఖాదర్ పెద్ద కుమారుడే ఎస్బి అంజద్బాషా. 1963లో వారి కుటుంబం వ్యాపార పరమైన సౌకర్యాల కోసం కడప నగరంలో స్థిరపడ్డారు. కడప, కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వీరికి వ్యాపారాలు ఉన్నాయి. నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూలులో ఆయన విద్యాభ్యాసం కొనసాగించారు. సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు, సేవాగుణంతో అంజద్బాషా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరి సేవా తత్పరతను గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 2005లో కాంగ్రెస్ తరపున కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పించారు. కడపకు మరో అవకాశం.. కడప ఎమ్మెల్యే అంజద్బాషాకు మంత్రిహోదా దక్కడంతో కడప నియోజకవర్గానికి మరోసారి అవకాశం దక్కింది. ఇదివరకు కడప నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రి హోదా దక్కించుకున్న వారి జాబితాలో అంజద్బాషా రెండోసారి చేరారు. ఎస్ రామమునిరెడ్డి(1983), సి రామచంద్రయ్య(1985), డాక్టర్ ఎస్ఏ ఖలీల్బాషా(1999), ఎస్ఎండీ అహమ్మదుల్లా (2009), ఇదివరకు మంత్రి పదవులు అలంకరించారు. తాజాగా 2019లో అంజద్బాషాకు ఆ హోదా దక్కింది. ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ మంత్రిగా అవకాశం దక్కింది. కడప నుంచి మంత్రి హోదా దక్కించుకున్న వారిలో ఈయన ఐదో ఎమ్మెల్యే కాగా, గడిచిన 3 పర్యాయాలు పరిశీలిస్తే పదేళ్లకు ఓమారు కడప నియోజకవర్గానికి మంత్రి హోదా దక్కుతూ రావడం మరో విశేషం. -
డిప్యూటీ సీఎం అంజాద్బాష కూతురు వివాహ వేడుకలకు హాజరైన సీఎం జగన్
-
డిప్యూటీ సీఎం అంజాద్బాష కూతురు వివాహ వేడుకల్లో సీఎం జగన్
మధ్యాహ్నం 12.50: వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప పర్యటన ముగిసింది. కడప విమానాశ్రయం నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. 12:20PM ►డిప్యూటీ సీఎం అంజాద్బాష కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. 11:50AM ►పుష్పగిరి కంటి ఆస్పత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. 11:45AM ►పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్కు చేరకున్న సీఎం జగన్ 11:30AM ►సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాకు చేరుకున్నారు. కాసేపట్లో పుష్పగిరి కంటి ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 10:00AM సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కడప బయల్దేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అలాగే రిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపధ్యంలో అధికారులకు సూచనలిస్తున్న జిల్లా కలెక్టర్ విజయరామరాజు 08:50AM సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఆదివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఏర్పాట్లను పరిశీలించారు. మొదట కడప విమానాశ్రయం, రిమ్స్లోని జీజీహెచ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు, వీఐపీ, వీవీఐపీ గ్యాలరీ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన పుష్పగిరి కంటి ఆస్పత్రికి చేరుకుని అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను, అనంతరం ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాష కుమార్తె వివాహం జరిగే జయరాజ్ గార్డెన్స్ వద్దకు చేరుకుని పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, బందోబస్తుకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీలు గౌతమి, సాయికాంత్వర్మ, ధ్యానచంద్ర, శిక్షణ కలెక్టర్ కార్తీక్, ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకట రమణ, డ్వామా పీడీ యదుభూషణరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వర్రెడ్డి, ఐసీడీఎస్, ఏపీఎంఐపీ పీడీలు పద్మజ, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన నేపధ్యంలో విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బు రాజన్ ఆదేశించారు. శనివారం జయరాజ్ గార్డెన్స్లో పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి పర్యటన ముగించుకుని వెళ్లే వరకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ అధికారులకు పలు సూ చనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్, కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి, ఏఆర్ డీఎస్పీ రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు వెంకట కుమార్, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎస్పీ కడప విమానాశ్రయం తదితర ప్రదేశాల్లో జిల్లా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కడపకు పలువురు మంత్రుల రాక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాష కుమార్తె వివాహం ఆదివారం జరగనున్న నేపథ్యంలో పలువురు మంత్రులు జిల్లాకు చేరుకోనున్నట్లు కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. వివరాలు.. ►స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి తానేటి వనిత ఆదివారం రేణిగుంట నుంచి రోడ్డు మార్గాన కడపకు చేరుకుంటారు. జయరాజ్ గార్డెన్స్లో వివాహానికి హాజరవుతారు. రాత్రికి కడపలో బస చేస్తారు. 21వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు పరీడానగర్, నిరంజన్నగర్, శివానందపురంలలో ఏర్పాటు చేసిన స్థానిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం కడపలోని బాయ్స్ చిల్డ్రన్ హోం, దిశా పోలీసుస్టేషన్, రిమ్స్లోని సఖి వన్స్టాప్ సెంటర్లో జరిగే కార్య క్రమాల్లో పాల్గొంటారు. అలాగే స్వధార్ హోం, భారతరత్న మహిళా మండలిని సందర్శిస్తారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి ఆ రోజు రాత్రి తిరుపతికి బయలుదేరి వెళతారు. సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది (ఇన్సెట్) మాట్లాడుతున్న ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ►రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శనివారం రాత్రి కర్నూలు నుంచి రోడ్డు మార్గాన కడపకు చేరుకుంటారు. ఆదివారం జరిగే వివాహ కార్యక్రమంలో పాల్గొని అనంతరం నెల్లూరు మీదుగా విజయవాడకు వెళతారు. ►రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆదివారం ఉదయం కడపకు చేరుకుని డిప్యూటీ సీఎం అంజద్బాష కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం ఆయన పోరుమామిళ్ల, గిద్దలూరు మీదుగా నరసరావుపేటకు బయలుదేరి వెళతారు. ►మంత్రి శంకరనారాయణ తిరుమల నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు కడపకు చేరుకుంటారు. వివాహం వేడుకల్లో పాల్గొని 3 గంటలకు పెనుగొండకు బయలుదేరుతారు. ►మంత్రి అనికుమార్ యాదవ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కడపకు చేరుకుని వివాహ వేడుకల్లో పాల్గొని రాత్రి 8 గంటలకు నెల్లూరుకు బయలుదేరుతారు. జయరాజ్ గార్డెన్స్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ సురేష్ బాబు ఏర్పాట్ల పరిశీలన కడప నగర శివార్లలోని జయరాజ్ గార్డెన్స్లో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్బాషా, మేయర్ సురేష్ బాబు పరిశీలించారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రామమోహన్రెడ్డి, యల్లారెడ్డి, శివకేశవ పాల్గొన్నారు. -
కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 20వ తేదీన ఆదివారం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జేసీలు గౌతమి, సాయికాంత్వర్మ, ధ్యానచంద్ర, డీఆర్వో మాలోల, ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కడప నగరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలు అప్పగించామన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ రామ్మోహన్, డ్వామా, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు యదుభూషణరెడ్డి, మధుసూదన్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, డీఎంహెచ్ఓ నాగరాజు, సీపీఓ వెంకట్రావు, టూరిజం అధికారి రాజశేఖర్రెడ్డి, అడిషనల్ ఎస్పీ మహేష్కుమార్, డీఎస్పీ శివారెడ్డి, సమగ్ర శిక్ష పీడీ ప్రభాకర్రెడ్డి, ఆర్టీఓ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. టౌ చదవండి: (సీఎం వైఎస్ జగన్ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి) పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చింతకొమ్మదిన్నె: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 20న డిప్యూటీ సీఎం అంజద్బాషా కుమార్తె వివాహ వేడుకకు కడపకు రానున్న నేపథ్యంలో నగర సమీపంలోని జయరాజ్ గార్డెన్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ బి.వెంకట శివారెడ్డి తెలిపారు. మంగళవారం బందోబస్తు విషయమై కింది స్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు అశోక్రెడ్డి, సదాశివయ్య, శ్రీరాం శ్రీనివాసులు, సీకేదిన్నె ఎస్ఐ ఎం.మంజునాథ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు
సాక్షి, అమరావతి: అట్టడుగు వర్గాలను గుర్తించి వారికి అభివృద్ధి ఫలాలను అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే సరికొత్త చరిత్రకు నాంది పలికారని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్బాషా అన్నారు. రాష్ట్రంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డులతోపాటు 9 మందికి జీవిత సాఫల్య పురస్కారాలు, 27 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లకు, 28 మంది ఉత్తమ విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం విజయవాడలో బుధవారం జరిగింది. ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ హెచ్.నదీం అహ్మద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ జహీర్ అహ్మద్ రహీఫైదయ్కు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జాతీయ పురస్కారాన్ని, డాక్టర్ ఎస్ఏ సత్తార్ సాహెబ్కు డాక్టర్ అబ్దుల్ హక్ పురస్కారాన్ని ఉప ముఖ్యమంత్రి అందజేశారు. జీవిత సాఫల్య పురస్కారాలలో హజరత్షా కమల్ అవార్డు(కవిత్వం)ను రఫత్ అసియా షాహీన్, అల్లం యాసీర్ కర్నూలీ అవార్డు(కవిత్వం) షేక్ అబ్దుల్ సత్తార్ ఫైజీ, సులేమాన్ జావీద్ అవార్డు(పరిశోధన) కె.బషీర్ అహ్మద్, దుర్వేష్ ఖాద్రీ జాకీ అవార్డు(విద్యా బోధన విభాగం) ముస్తఫా హస్సన్, నజీర్ అహ్మద్ అవార్డు(జర్నలిస్ట్ విభాగం) సయద్ ఖుద్ర ఖాద్రీ, మిజఫైక్ తుర్కమని అవార్డు(ఉర్దూ అభివృద్ధి) హఫీజ్ షేక్ అహ్మద్, యుసఫ్ సఫీ అవార్డు(ఉర్దూ అభివృద్ధి) షేక్ మెహబూబ్ బాషా, ఉర్దూ ఎక్స్లెన్సీ అవార్డు షేక్ మహ్మద్ హనీఫ్ అయాజ్, స్పెషల్ అవార్డు(ఉర్దూ భాషాభివృద్ధి) మహ్మద్ అబ్దుల్ ఫరూఖీలకు అందజేసి సత్కరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, ఎమ్మెల్యేలు హాఫీజ్ ఖాన్, మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పి.గౌతంరెడ్డి, అడపా శేషు, సమీమ్ అస్లాం, అసిఫా, బండి పుణ్యశీల, తోలేటి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. -
కడపలో మాంగళ్య షాపింగ్ మాల్
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఏర్పాటైన మాంగళ్య షాపింగ్ మాల్ను సినీ తార సమంత ఆదివారం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మాంగళ్య షాపింగ్ మాల్ తక్కువ కాలంలోనే నాణ్యమైన, మన్నికైన వస్త్రాలకు మారుపేరుగా నిల్చిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఇది తమకు 11వ షోరూమ్ అని, ఆంధ్రప్రదేశ్లో మొదటిదని సంస్థ వ్యవస్థాపకులు పీఎన్ మూర్తి, చైర్మన్ కాసం నమఃశివాయ వివరించారు. 25000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో, 4 అంతస్తులలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిటైల్ ఫ్యాషన్ స్టోర్గా 1942లో ప్రారంభమైన కాసం గ్రూప్లో మాంగళ్య షాపింగ్ మాల్ భాగమని, ప్రస్తుతం గణనీయంగా కార్యకలాపాలు విస్తరించిందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా, మేయర్ సురేష్ బాబు, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్లు ముంతాజ్బేగం, నిత్యానందరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎం. రామలక్ష్మణ్రెడ్డి హాజరయ్యారు. -
వక్ఫ్ భూములు ఉఫ్..తొలుత లీజుకు ఇచ్చి.. ఆపై కబ్జా
వితరణ శీలురైన కొందరు ముస్లిం సంపన్నులు తమ స్థిరాస్థిలో కొంత భాగాన్ని, లేదా మొత్తం ఆస్తిని ‘అల్లా’ పేరున రాశారు. ఈ ప్రక్రియను ఇస్లాం సంప్రదాయంలో వక్ఫ్ చేయడం అంటారు. ఒకసారి వక్ఫ్ చేసిన ఆస్తిని తిరిగి తీసుకోవడం కుదరదు. అమ్మడమూ కుదరదు. దాత సంతతికి చెందిన వారికి కూడా దాని మీద ఎలాంటి హక్కులు వుండవు. ఇలాంటి భూముల్ని గత సర్కారు పెద్దలు అయిన వారికి యథేచ్ఛగా కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో ఆసూర్ ఖానాకు చెందిన రెవెన్యూ సర్వే నంబరు 287–1లో 11.34 ఎకరాలు, సర్వే నంబరు 287–5లో 2.6 ఎకరాలు.. మొత్తం 13.94 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఈ భూమి విలువ రూ.130 కోట్ల పైమాటే. ఈ అక్రమాన్ని అధికారికంగా సక్రమం చేయాలని గత టీడీపీ పెద్దలు ప్రయత్నించారు. కృష్ణా జిల్లా నిడమానూరులో సర్వే నంబర్ 201, 202, 203లో ఖాజీ (ముస్లింల వివాహాలు చేసే గురువు) సర్వీసు కోసం కేటాయించిన మాన్యం భూమి 39.16 ఎకరాలు టీడీపీ దన్నుతో ఏడుగురు బినామీలు చేజిక్కించుకున్నారు. విజయవాడ భవానీపురంలో కోట్లాది రూపాయల విలువైన దర్గా మాన్యం 40 ఎకరాల భూమిని మార్బుల్ స్టోన్ వ్యాపారులకు నామమాత్రపు లీజుకు ఇచ్చేశారు. కొండపల్లి శాంతినగర్ సర్వే నంబర్ 212ఎ, 212బిలో 18.30 ఎకరాలు, 293/1లో 18 సెంట్లు, ఇబ్రహీంపట్నంలో సర్వే నంబర్ 240లో 26 ఎకరాల ఖాజీ మాన్యం ఆక్రమణల పాలైంది. ఆ భూముల్లో భారీ భవంతులు నిర్మించారు. ఇలా వెయ్యి కాదు.. పది వేలు కాదు.. ఏకంగా 31,584 ఎకరాల వక్ఫ్ (ధార్మిక దానం ఇచ్చినవి) భూములు అక్రమార్కుల వశమయ్యాయి. దీంతో దాతల లక్ష్యం, ఔదార్యం నీరుగారిపోతోంది. అనంతపురం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి. బాబు జమానాలో అక్రమాలకు ఊతం ► చంద్రబాబు పాలించిన రోజుల్లో వక్ఫ్ భూముల్లో అక్రమాలకు ఊతమిచ్చారని ముస్లిం సమాజం ఆవేదన చెందుతోంది. విశాఖపట్నంలో హజ్రత్ ఇషాక్ రహనతుల్లాలై దర్గాకు చెందిన 3,500 ఎకరాల భూమి కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టింది చంద్రబాబే. ► వక్ఫ్ భూముల అన్యాక్రాంతానికి గత ప్రభుత్వం అధికారిక ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయడంతో న్యాయపరమైన వివాదాలు రేగాయి. నిరర్థక ఆస్తుల పేరుతో టీడీపీ అనుయాయులకు, బడాబాబులకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ► కాజా భూముల వ్యవహారం ఈ కోవలోకే వస్తుంది. 2018 నవంబర్ 13న అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్, ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశంలో వారికి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమిని నిరర్థక ఆస్తిగా చూపిస్తూ తీర్మానం చేశారు. ► రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమణల చెర నుంచి విడిపించడం మానేసి, అన్యాక్రాంతం పేరుతో అయినకాడికి తెగనమ్మి సొంత మనుషులకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలు జరిగాయి. గత ప్రభుత్వ పెద్దలు ఆడిన ఆటలో పావులుగా మారిన ముగ్గురు సీఈవోలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే బదిలీ వేటుకు గురయ్యారు. ► కాజా భూముల వ్యవహారంలో ఫైల్ నంబర్ ఎస్ /19/జిఎన్టీ/2018 లేఖ ద్వారా 2017 డిసెంబర్ 3న సచివాలయానికి అనుకూల తీర్మానం చేసి పంపగానే సీఈవో ఎండీ సుభానీని 2018 జనవరిలో అక్కడి నుండి బదిలీ చేశారు. మరో సీఈవోను నియమించుకుని అనుకూల పనులు చేయించుకున్న గత ప్రభుత్వం మళ్లీ ఆయన్ను కూడా బదిలీ చేసింది. 2018 ఫిబ్రవరిలో షేక్ అహ్మద్ను కొత్త సీఈవోగా నియమించారు. వాటికే వక్ఫ్ ఆస్తుల వినియోగం ► స్థిరాస్తుల్ని పరిరక్షిస్తూ ఇస్లామిక్ ధార్మిక కార్యక్రమాలకు, ముస్లిం సమాజంలోని నిరుపేదల సంక్షేమానికి ఆ భూములను వినియోగించాలనేది వక్ఫ్ లక్ష్యం. మసీదు, ఆషూర్ ఖానా, దర్గా, ముషాఫిర్ ఖానా, ఖాజీ, అంజుమన్, మొహర్రం నిర్వహణ వ్యయం కోసం ఈ భూములు ఉపయోగపడాలన్నది దాతల మహోన్నత ఆశయం. ► ఈ రకంగా మన దేశంలో దాదాపు 3 లక్షల ముస్లిం ధార్మిక సంస్థలు తమ ఆస్తులను వక్ఫ్ బోర్డు కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక సంస్థలు వక్ప్ బోర్డు కింద రిజిష్టర్ చేయడం విశేషం. చట్టాన్ని ఆసరా చేసుకుని అక్రమాలు ► వాస్తవానికి వక్ఫ్ చట్టం–1995 (సెంట్రల్ యాక్ట్) ప్రకారం వక్ఫ్ ఆస్తుల క్రయ విక్రయాలు, అన్యాక్రాంతం, అసలు లక్ష్యానికి తూట్లు పొడిచేలా వినియోగం కుదరదు. కానీ అదే చట్టంలోని సెక్షన్–97ను ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వం అనేక ప్రాంతాల్లోని వాటిని నిరర్థక ఆస్తులుగా చూపి చేతులు మారేలా వెసులుబాటు కల్పించడంతో న్యాయ వివాదాలు రేగాయి. ► వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం తగదని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు సైతం అనేక తీర్పులు చెప్పినప్పటికీ ఆ ఆస్తులను కాపాడేందుకు గత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. రానురాను ముస్లిం సమాజపు నిస్సహాయత, గతంలో వక్ఫ్ బోర్డు బాధ్యుల అవినీతి తదితర కారణాలతో వేలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కాజా వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై 2018లో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీకి అప్పటి వక్ఫ్ సీఈవో ఇచ్చిన నివేదిక ముందు లీజు.. ఆపై కైంకర్యం.. ► దాతలు ఇచ్చిన విలువైన భూములను ధర్మకర్తల(ముతవల్లీ)కు, ఖాజాలు తదితర ముస్లిం సమాజానికి చెందిన వారి బతుకుదెరువు కోసం కేవలం 11 నెలల లీజుకు ఇస్తారు. అయితే అక్రమార్కులు వక్ఫ్ బోర్డులో ఉన్న వెసులుబాటును సాకుగా తీసుకుని మూడేళ్లపాటు లీజు ఒప్పందాన్ని పొడిగించుకుంటున్నారు. ► తొలుత ముస్లింలతోనే ఆక్రమణ చేయించి, ఆపై బయటి వ్యక్తుల చేతిలోకి ఆ ఆస్తి వెళ్లేలా చక్రం తిప్పారు. ఇంకో విధంగా.. లీజు పేరుతో ముందుగా విలువైన భూములను ఆక్రమించి ఆపై కైంకర్యం చేసేసుకున్నారు. ► ఎవరైనా ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తే చట్టంలో ఉన్న అవకాశాలను అనుకూలంగా మలుచుకుని న్యాయ పరమైన వివాదాలు సృష్టిస్తూ ఏళ్ల తరబడి ఆస్తులను అనుభవిస్తున్నారు. కృష్ణా జిల్లా నిడమానూరులో వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై 2019లో అప్పటి కలెక్టర్ ఇంతియాజ్ వక్ఫ్ సీఈవోకు ఇచ్చిన నివేదిక వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనార్టీలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 502 వక్ఫ్ సంస్థలకు చెందిన 65,783 ఎకరాల్లో గతంలో 31,584 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాం. వక్ఫ్ బోర్డుల పరి«ధిలోని ఆస్తుల రక్షణకు, ముస్లింలకు కొత్త శ్మశానాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వక్ఫ్ ఆస్తుల వివాదాలపై తక్షణ చర్యలు తీసుకునేలా ఏపీలో త్వరలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. – అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి ముస్లిం దాతల స్ఫూర్తి నిలపాలి ముస్లిం సమాజం కోసం విలువైన భూములను త్యాగం చేసిన దాతల స్ఫూర్తిని నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వక్ఫ్ ఆస్తుల పరరిక్షణ కోసం లీజు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. వీటిపై క్షేత్ర స్థాయిలో సర్వే చేసి, అన్యాక్రాంతమైన వాటిని పరక్షించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి. అక్రమార్కుల చెర నుంచి వాటిని కాపాడాలి. ముస్లిం సమాజానికి ఆ ఆస్తులు ఉపయోగపడేలా చట్టపరమైన చర్యలు త్వరగా తీసుకోవాలి. – మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ -
ఓట్లడిగే అర్హత బీజేపీ, కాంగ్రెస్కు లేదు
బద్వేలు అర్బన్: రాష్ట్ర విభజనకు కారకులై, విభజన హామీలను నెరవేర్చకుండా ప్రస్తుతం రాష్ట్రం ఎ దుర్కొంటున్న అనేక సమస్యలకు కారణమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని డిప్యూటీ సీఎం అంజాద్బాషా చెప్పారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంపైన అవగాహన లేని సోము వీర్రాజు ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివి విమర్శలు చేయడం సరికాదన్నారు. మహానేత వైఎస్రాజశేఖర్రెడ్డి బ్ర హ్మంసాగర్ను పూర్తిచేసి జాతికి అంకితం ఇ వ్వడం వల్లే రైతులకు సాగు, తాగునీరు అం దుతోందని చెప్పారు. 173 చెరువులు నింపిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనన్నారు. -
వారికి ఓట్లు అడిగే అర్హత లేదు: అంజాద్ బాషా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం నేరుగా ప్రజలకు అందుతోందన్నారు. రైతుల కోసం అనేక పథకాలు పెట్టామని తెలిపారు. ప్రజల ముందుకెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతాం. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశాం. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అవగాహన లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు.. ప్రభుత్వం మీద నిందారోపణలు చేస్తున్నారని అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: డీఎల్పై మండిపడ్డ మైదుకూరు దళిత ప్రజాప్రతినిధులు -
డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను సన్మానించిన మైనార్టీ నాయకులు
-
డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను సన్మానించిన మైనార్టీ నాయకులు
-
వై ఎస్ ఆర్ జిల్లాలో వై ఎస్ ఆర్ కి ఘన నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం
-
ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్లోని ఇమామ్లు, మౌజన్లకు మే, జూన్, జూలై మాసాలకు సంబంధించిన గౌరవ వేతనం విడుదల చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇమామ్లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు, మౌజన్లకు నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచిన గౌరవ వేతనం ప్రకారం మే, జూన్ మాసాలకు గాను రూ.14.74 కోట్లు మసీదుల కమిటీల జాయింట్ అకౌంట్లలో జమ చేశామన్నారు. అలాగే, జూలై నెలకు సంబంధించిన గౌరవ వేతనం రూ.7.98 కోట్లు కూడా జమ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై ఇమామ్లు, మౌజన్లకు ప్రతి నెలా గౌరవ వేతనం జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అంజాద్ బాషా తెలిపారు. విడుదలయ్యే మొత్తాలను మసీదు కమిటీలు ఇమామ్లు, మౌజన్లకు ప్రతినెలా కచ్చితంగా చెల్లించాలని ఆదేశించారు. -
కులాలు,మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ దే : అంజాద్ బాషా
-
వక్ఫ్ ఆస్తుల జియో మ్యాపింగ్
సాక్షి, అమరావతి: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అధునాతన సాంకేతిక పద్ధతిలో జియో మ్యాపింగ్ (జీపీఎస్, జీఐఎస్) చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎస్బీ అంజాద్ బాషా తెలిపారు. బుధవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్ నిర్వహించిన సమావేశానికి అన్ని జిల్లాల అధికారులు, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీలు, ఉర్దూ అకాడమీ అధికారులు, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ తదితర విభాగాల అధిపతులు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే రీ సర్వే చేసి వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నట్లు అంజాద్ బాషా చెప్పారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వక్ఫ్ బోర్డు రెండో విడత సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. 3,674 వక్ఫ్ ఆస్తులను సర్వే చేసి 3,295 ఆస్తుల గెజిట్ నోటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సుమారు 223 వక్ఫ్ భూములు, 3,772 మసీదులు, దర్గాలకు అనుబంధంగా ఉన్న ఆస్తులను జియో మ్యాపింగ్ చేశామన్నారు. మరో 1,206 వక్ఫ్ భూములు, 69 వక్ఫ్ సంస్థల అనుబంధ ఆస్తులను మ్యాపింగ్ చేయాల్సి ఉందన్నారు. వక్ఫ్ బోర్డుకు ఆదాయం కోసం బహిరంగ వేలం ద్వారా 1,204 ఎకరాల వ్యవసాయ భూమిని 2021–22 సంవత్సరానికి రూ.78.81 లక్షలకు లీజుకు ఇచ్చామన్నారు. అన్యాక్రాంత భూములు స్వాధీనం.. రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన సుమారు 495.80 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోగలిగిందన్నారు. 2,346 పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేసినట్లు చెప్పారు. -
భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదు
రాజంపేట టౌన్: ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదని తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా హితవు పలికారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని ఆకేపాటి భవన్లో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్బాబు, వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డిలతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కాని నాగార్జునసాగర్ నుంచి కాని తమకు కేటాయించిన నీటికంటే ఒక బొట్టు కూడా అదనంగా తాము వాడుకోవడం లేదని స్పష్టం చేశారు. దొంగతనంగానో, తప్పుడు మార్గంలోనో నీళ్లు తీసుకునే తక్కువ స్థాయి ఆలోచనలు తమ ప్రభుత్వానికి లేవన్నారు. నీటి వినియోగంపై తెలంగాణ మంత్రులకు సందేహాలుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా నివృత్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తమ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. -
ఏపీలో వక్ఫ్ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు: అంజాద్ బాషా
-
ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్ బాషా హర్షం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో అర్చకులు, పాస్టర్లు, మౌజన్లు, ఇమామ్లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారని ఆయన తెలిపారు. ‘‘పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ప్రణాళిక ప్రకారం పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని’’ మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని వివరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి -
ఇళ్లల్లోనే రంజాన్ జరుపుకోండి
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ను కొనసాగుతున్నందున రంజాన్ పండుగ నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెలవంక సమయాన్ని బట్టి ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో నిర్వహించుకునే రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈద్ ఉల్ ఫిత్రా, సామూహిక నమాజ్లను పూర్తిగా నిషేధించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రంజాన్ ప్రార్థనల సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలను మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ విడుదల చేశారు. ఇదిలావుండగా.. కరోనా కట్టడికి సామాజిక బాధ్యతగా ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లల్లోనే చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలివీ.. ► రంజాన్ రోజున మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో 50 మందికి మించి పాల్గొనకూడదు. ► ప్రార్థనల్లో పాల్గొనే వారు మాస్క్ ధరించి కనీసం ఆరు అడుగుల చొప్పున భౌతిక దూరం పాటించాలి. ► ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య రెండు విడతల్లో 50 మంది చొప్పున ప్రార్థనలు చేసుకోవచ్చు. ► మాస్క్ లేని ఏ ఒక్కరినీ మసీదుల్లోకి అనుమతించకూడదు. ప్రార్థనలకు ముందు నిర్వహించే వాదును ఇళ్ల వద్దే పూర్తి చేసుకోవాలి. నేలపై కూర్చునేందుకు మేట్లను ఇంటినుంచి తెచ్చుకోవాలి. ► మసీదు ప్రవేశ ద్వారం వద్ద తగిన సంఖ్యలో శానిటైజర్స్ను అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరి చేతులు శానిటైజర్తో శుభ్రం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి. ► వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, హై బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలి. ► ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునేందుకు చేతులు కలపడం, ఆలింగనం చేసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి. -
ఊపందుకున్న తిరుపతి పార్లమెంట్ ఉపపోరు ప్రచారం
-
ముస్లిం మైనారిటీలు సీఎంకు రుణపడి ఉంటారు: అంజాద్ భాష
-
మరి రీకౌంటింగ్ ఎందుకు కోరలేదు బాబు: మంత్రి బొత్స
-
‘బాబు ఎందుకు కేంద్రానికి లేఖ రాసే ధైర్యం చేయడం లేదు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఆడలేక మద్దెల ఓడు అన్న రీతిలో మాట్లాడుతున్నాడని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో టీడీపీ కాదు ప్రజాస్వాయ్యం ఓడిపోయిందనడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందన్నారు. తమ నాయకుడు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే కుప్పంలో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కుప్పంలో ఎక్కడ రిగ్గింగ్ జరిగిందో బాబే చెప్పాలన్నారు. కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఆయన మరీ రీకౌంటింగ్ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో, ఏజెన్సీలో కూడా గెలిచామని చెప్తున్న చంద్రబాబు ఎక్కడ గెలిచారో నిరూపించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ గెలవలేదని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన సలహాలను ఆయన తప్పుబడుతున్నారని చెప్పారు. మీ హయాంలోనే కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంకురార్పణ జరిగిందని, అప్పుడేందుకు మీరు మాట్లాడలేదని మండిపడ్డారు. కనీసం ఇప్పుడైనా కేంద్రానికి లేఖ రాసే ధైర్యం ఎందుకు చేయడం లేదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడం చంద్రబాబుకు ఇష్టమేనని, అందుకే ఆయన హయాంలో దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని బొత్స పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే చంద్రబాబు గెలవలేని పరిస్థితి వచ్చిందని ఎద్దెవా చేశారు. ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని, ఓటమికి నైతిక భాధ్యత వహిస్తూ బాబు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లాంటి నాయకత్వం అవసరమా అని తెలుగుదేశం నాయకులు ఆలోచించుకోవాలన్నారు. దివంగత నేత ఆశయాలు పుణికి పుచ్చుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివ అధికారం చేపట్టిన 18 నెలల్లోనే ఇచ్చిన హామీలను 100 శాతం పూర్తి చేశారని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చిన పరిస్థితులు లేవని, ఆ ఘనత సీఎం జగన్కే సొంతమని ఆయన అన్నారు. -
‘సుబ్బయ్యపై 14 కేసులు ఉన్నాయి’
సాక్షి, కడప : ప్రొద్దుటూరు టీడీపీ నేత సుబ్బయ్య హత్య విషయంలో ఆ పార్టీ దిగజారుడు రాజకీయం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పారదర్శకమైన, జనరంజకమైన పాలన అందిస్తుంటే ఓర్వలేక టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. హత్యకు గురైన సుబ్బయ్యకు నేరచరిత్ర టీడీపీ హయాంలోనే ఉందని,14 కేసులు నమోదయ్యాయని అన్నారు. హత్యను ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పైకి నెట్టేందుకు టీడీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని , రాచమల్లు దేవునిపై ప్రమాణం చేసి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారని అంజాద్ బాష తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరు లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి, రఘురామి రెడ్డి.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, అమర్నాధ్ రెడ్డి కలిశారు. ఇటీవల ప్రొద్దుటూరు లో టీడీపీ నేత హత్య నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ప్రతిపక్ష టీడీపీ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే రాచమల్లుకు మద్దతు తెలిపారు. జరిగిన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు నాపై ఆరోపణలు చేస్తున్నాయని వివరించారు. భూముల కొనుగోళ్లు, ఇతర వ్యవహారాల్లో నాకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. నాకున్న ఆస్తులు, ఇల్లు, భూములు అన్నీ తన అన్న సంపాదనే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉందని నేను ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. -
హత్యా రాజకీయాలకు టీడీపీ పేటెంట్
కడప అగ్రికల్చర్: హత్యా రాజకీయాలు చేయడంలో టీడీపీ పేటెంట్ పొందిందని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా విమర్శించారు. బుధవారం కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ప్రొద్దుటూరుకు చెందిన నందం సుబ్బయ్య హత్యకు గురైతే.. చంద్రబాబు, లోకేశ్, ఎల్లో మీడియా కలిసి ప్రభుత్వం హత్య అనడం తగదన్నారు. ‘నందం సుబ్బయ్య టీడీపీ నాయకుడు కావచ్చు. కానీ.. అతనిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో 14 కేసులున్నాయి’ అని గుర్తు చేశారు. అదీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదైనవేనన్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో సుబ్బయ్య జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. అన్ని తెలిసి కూడా చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులోని ముద్దాయిలను చంద్రబాబు తన ఇంట్లో ఉంచుకున్నది నిజం కాదా అని ప్రశి్నంచారు. అయినప్పటికీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ హంతకులను కూడా క్షమించి వదిలేశారన్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిజం ఉండకూడదని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలన్న లక్ష్యంతో ప్రాజెక్టులు నిర్మించి పనులు కలి్పంచాలని రాజశేఖరరెడ్డి కలలుగన్నారని తెలిపారు. ఆయన తనయుడు సీఎం జగన్ కూడా ప్యాక్షనిజం ఉండకూడదనే లక్ష్యంతో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓర్వలేక రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని ప్రభుత్వానికి, సీఎంకు అంటగట్టడం బాబుకు, లోకే‹Ùకు నిత్యకృత్యమై పోయిందన్నారు. -
'సుబ్బయ్య హత్యపై శవరాజకీయం చేస్తున్నారు'
సాక్షి, కడప : ప్రొద్దుటూరులో జరిగిన టీడీపీ నేత సుబ్బయ్య హత్య పై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పందించారు. 'హత్యా రాజకీయాలు అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని చంద్రబాబు, లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. ఈ హత్య పై వారిద్దరు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. చెరుకులపాడు నారాయణను ఎవరు హత్య చేశారు. ఈ హత్యపై లోతైన విచారణ జరిపిస్తాం. ఆ హత్య ఎవరు చేశారో అప్పటి ప్రజలతో పాటు నాయకులకు తెలుసు. దివంగత రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు క్షమాభిక్ష పెట్టారు. కులాలను ,మతాలను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు కుల రాజకీయాలు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ నేత సుబ్బయ్య పై మొత్తం 14 క్రిమినల్ కేసులు ఉన్నాయి. గత టీడీపీ హాయంలో ఇదే సుబ్బయ్య పై 4 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇవన్నీ టీడీపీ నాయకులకు తెలియదా...? బాధ్యతాయుమైన ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం తగదు. రాష్ట్రంలో ఏ మూలన ఏ చిన్న గొడవ జరిగినా అధికార పార్టీ పై వేయాలని చూడటం దారుణం. మా ప్రభుత్వం అధికారంలోకి జిల్లాలో వచ్చాక కేవలం 51 హత్యలు వివిద కారణాలు వల్ల జరిగాయి.. పారదర్శకంగా పాలన సాగిస్తుంటే విమర్శలు చేయడం దుర్మార్గం. సుబ్బయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య చేశారని భావిస్తున్న వ్యక్తి గతంలో సుబ్బయ్య కు స్నేహితుడు. ఇప్పుడు మాట్లాడుకోవడం లేదని హత్య ను వైసీపీ నేతలపై వేయడం ఎంతవరకు సమంజసమంటూ' ఆయన పేర్కొన్నారు. -
చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి
-
కఠిన చర్యలు తీసుకుంటాం: అంజాద్ బాషా
-
నంద్యాల: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం
సాక్షి, కర్నూలు: నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులను సోమవారం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం అంజాద్బాషా హామీ ఇచ్చారు. అన్యాయంగా, అక్రమంగా ప్రజలపై ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించిన చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. (సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్) అబ్దుల్ సలామ్ ఘటనపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రత్యేక అధికారుల ద్వారా సమగ్ర దర్యాప్తు చేపడుతుంది. వీరిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలకుండా దర్యాప్తు జరుగుతంది అని డిప్యూటీ సీఎం అంజాద్బాషా వెల్లడించారు. కాగా గతంలోనే సామూహిక ఆత్మహత్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలున్న సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ గంగాధర్లను ఇప్పటికే సస్పెండ్ చేస్తూ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య) -
‘ఏడాది కాలంగా నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోంది’
సాక్షి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన స్ఫూర్తితో గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా రాష్ట్రం పయనిస్తోంది. మహాత్ముడు కన్న కలలు సాకారమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు పేదల ఇంటిముంగిటికి చేరుతున్నాయి. గ్రామసచివాలయ వ్యవస్థపై ఇతర రాష్ట్రాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్కు నీరాజనాలు పలుకుతున్నారు. ఉపాధితో పేదలకు సేవలచేసే భాగ్యం కల్పించిన సీఎం జగన్కు వాలంటీర్లు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని చేధిస్తామంటూ వలంటీర్లు ప్రతినబూనారు. గాంధీజీ చిత్రపటానికి, దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. (గ్రామ స్వరాజ్యం సాకారం చేశాం: సీఎం జగన్) గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో 30 అడుగుల సీఎం కటౌట్ ఏర్పాటు చేశారు. క్రేన్ సహాయంతో సీఎం కటౌట్కి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో పదిహేను వేలకు పైగా సచివాలయాలను ఏర్పాటు చేశారు. దాదాపు నాలుగు లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఉపాధి పొంది పేదలకు సేవచేస్తున్నారు. సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలో అవినీతి రహిత పాలనకు అడుగులు పడ్డాయి. కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పేదల ముంగిటికి పథకాలు అందుతున్నాయి. సీఎం ఆలోచనలకు అనుగుణంగా వలంటీర్లు సైనికుల్లా పనిచేయాలి. సీఎం వైఎస్ జగన్ స్పూర్తితో రాష్ట్రం గ్రామస్వరాజ్యం వైపు పయనిస్తోంది. గాంధీజీ కలలు సాకారం చేస్తున్న ఏపీ వైపు అన్నిరాష్ట్రాలు చూస్తున్నాయి' అని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా పేర్కొన్నారు. (ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి: దేవినేని అవినాష్) బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్దాది విష్ణు మాట్లాడుతూ.. ‘లక్షల్లో ఉద్యోగాలు కల్పించి.. కోట్లలో సేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. దళారీ వ్యవస్థని సమూలంగా నిర్మూలించేందుకే సచివాలయ వ్యవస్థ. పేదల చెంతకే ఫలాలు అందించేందుకు ఏడాది కాలంగా నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోంది. బాపూజీ కలలు సాకారం చేసే దిశగా గ్రామస్వరాజ్య స్థాపన జరుగుతోంది' అని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగరాధ్యక్షులు బొప్పన భవకుమార్, పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. -
తోలుబొమ్మల సిత్రాలు
‘‘సినిమా పుట్టుకకి బీజం తోలుబొమ్మలాట. ఈ కళ పేరుతో తోలుబొమ్మల సిత్రాలు అనే బ్యానర్ నెలకొల్పినందుకు యూనిట్ని అభినందిస్తున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ బ్యానర్ పెద్ద సంస్థగా ఎదగాలని, ఈ బ్యానర్లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’’ అని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. తోలుబొమ్మల సిత్రాలు బేనర్లో కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు ఓ సినిమా నిర్మించారు. తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ వీడియో, లోగోని ఎస్.బి. అంజాద్ బాషా విడుదల చేశారు. ఈ సందర్భంగా కొమారి జానకిరామ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా కథాంశాన్ని తెలుసుకున్న అంజాద్ బాషాగారు తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడం ఎంతో సంతోషం. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా టైటిల్, నటీనటుల వివరాలను త్వరలో చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం యు.వి. నిరంజన్. -
‘వారంతా చంద్రబాబు బినామీలే’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. ఆదివారం ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘అమరావతిలో రైతుల ఉద్యమమే లేదు. అక్కడ ఉన్నది అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే. వారంతా చంద్రబాబు కోసం పనిచేస్తున్న ఆయన బినామీలే. అమరావతిలో చంద్రబాబు డ్రామానే నడుస్తోంది. అదంతా కృత్రిమ ఉద్యమమే. చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తోందని’’ ఆయన దుయ్యబట్టారు. (చదవండి: రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసిన చంద్రబాబు) రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి చేసుకుందన్నారు. 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలన్న తలంపుతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘‘వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. ఐదేళ్లలో ఒక్క నిరుపేదకు కూడా గత టీడీపీ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన సందర్భం లేదు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధానికి చంద్రబాబు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని’’ అంజాద్ బాషా మండిపడ్డారు. -
ఆందోళన వద్దు.. మాటకు కట్టుబడి ఉన్నాం
సాక్షి, తాడేపల్లి: సీఏఏకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత్రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముస్లిం మైనార్టీల ఆందోళన విషయంలో ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని పేర్కొన్నారు. వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వివాదస్పద ఎన్ఆర్సీ,ఎన్పీఆర్ బిల్లులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, గతంలో పేర్కొన్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. (ఏపీ సర్కార్ మరో కీలక ఒప్పందం) ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ద్వారకానాథ్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ముక్కాల ద్వారకానాథ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య ప్రముఖులు సీఎం వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. (ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్ విజయమ్మ) -
ఎన్పీఆర్, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం
సాక్షి, అమరావతి: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. గతంలో ప్రకటించిన విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఎన్పీఆర్లో కేంద్రం కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళన నెలకొని ఉందని పేర్కొంది. 2010 నాటి ఫార్మాట్ అమలు చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ► కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్పీఆర్, ఎన్ఆర్సీలపై ముస్లింలలో అభద్రతా భావముంది. ► రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలోనూ ఎన్పీఆర్ను అమలు చేయబోమని సీఎం వైఎస్ జగన్ గతంలో స్పష్టం చేశారు. ► ఎన్పీఆర్లో కొన్ని కాలమ్స్ ముస్లింలకు ఆందోళన కలిగించేవిగా, భయపెట్టేవిగా ఉన్నాయి. ► తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలున్నాయి. ► 2010లో ఎన్పీఆర్ నిర్వహించారు. అయితే ఇప్పుడు నిర్వహిస్తున్న ఫార్మాట్లో అభ్యంతరాలున్నాయి. ► 2010 ఫార్మాట్ ప్రకారమే ఎన్పీఆర్ను కొనసాగించాలని తీర్మానంలో చెప్పాం. ► మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఎన్పీఆర్, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేశాం. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముస్లింలకు భరోసా వచ్చింది. -
ఎన్ఆర్సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్)ని అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భోజన విరామం తర్వాత సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్పీఆర్–2020 (నేషనల్ పాపులేషన్ ఆఫ్ రిజిస్టర్)లో కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళనలు పెరిగాయని అన్నారు. అందువల్ల 2010 నాటి ఫార్మట్ ప్రకారమే ఎన్పీఆర్ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆ మేరకు ఎన్పీఆర్–2020లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయాలని స్పష్టం చేశారు. మైనారిటీలలో నెలకొన్న అభద్రతా భావం తొలగించి, వారిలో మనోధైర్యం నింపేందుకు సీఎం వైఎస్ జగన్ ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అంజాద్బాషా కొనియాడారు. అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీని అమలు చేయబోమని గతంలో సీఎం అన్నారని ఆయన ప్రస్తావించారు. అభ్యంతరకర అంశాలు గతంలో కూడా 2010, 2015లో ఎన్పీఆర్ నిర్వహించారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. అయితే ఇప్పుడు 2020లో నిర్వహిస్తున్న ఫార్మట్లో కొన్ని అభ్యంతర అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వివరాలు, వారు పుట్టినతేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు, ఇంకా మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అంజాద్బాషా అన్నారు. అందుకే మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా తీర్మానం చేశామని అంజాద్బాషా తెలిపారు. దాని ఆధారంగా ఇప్పుడు సభలో మరో తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. -
వైద్యుల సేవలు వెల కట్టలేనివి: అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కరోనా వ్యాప్తి నివారణలో వైద్యుల సేవలు వెల కట్టలేనివని కడప ఎంపీ అవినాష్రెడ్డి అన్నారు. మంగళవారం లీగల్ అవేర్నెస్ డవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి పెనుబాల విజయ్కుమార్ ఆధ్వర్యంలో కడప రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులకు, సిబ్బందికి పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్లు పంపిణీ చేశారు. సుమారు 11 లక్షల విలువైన సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ మేయర్ సురేష్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ సేవాభావంతో ముందుకొచ్చి వైద్యులకు కిట్లను అందజేయడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో నూతనంగా 16 మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల స్ఠలాలు
-
వాహన మిత్ర చెక్కులను పంపిణి చేసిన అంజద్ బాషా
-
'కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం'
సాక్షి, వైఎస్సార్ : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలో పర్యటించిన ఆయన పాత కడప మున్సిపల్ హైస్కూల్లో రైతులకు విత్తనాలు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు సాంబటూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కరోనా నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండేదుకు ఈ నెల 15న రైతు భరోసా పంపీణీ చేపడతామన్నారు. అలాగే మే18 నుంచి వేరుశనగ విత్తనాలను కూడా పంపీణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. -
కడపలో నాలుగు రెడ్ జోన్ల గుర్తింపు
సాక్షి, వైఎస్సార్ కడప: కరోనా తీవ్రత ఆధారంగా కడపలో నాలుగు ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా రెడ్జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్తో పాటు వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సోమవారం ఆయన జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంజాద్ భాషా మాట్లాడుతూ.. దాదాపు 2 వేలకు పైగా ర్యాపిడ్ కిట్స్ జిల్లాకు అందాయన్నారు. నగరంలో ఇప్పటివరకు స్వాప్ టెస్ట్ ద్వారా 1000 మందికి పరీక్షలు చేశామని వెల్లడించారు. ఐదు రోజుల క్రితం సరోజిని నగర్లో కరోనా పాజిటివ్ వచ్చిన కానిస్టేబుల్కు తాజా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందన్నారు. మరోవైపు కరోనా నివారణకు ముందుండి పోరాడుతున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. "నగరంలో దాదాపు 25 ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు గుంపులుగా రావడం లేదు. సామాజిక దూరం పాటిస్తూనే ప్రజలు మందులు, నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలు చేయాలి. మరోవైపు మార్కెట్ యార్డులో రైతుల నుంచి పసుపు కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం. టోకెన్ల ద్వారా వీటి కొనుగోలు జరుగుతుంది. అలాగే హార్టికల్చర్లో రైతులు పండించిన బొప్పాయి, అరటి, జామకాయలను కిట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈనెల 29 నుంచి మూడో విడత రేషన్ సరుకుల పంపిణీ చేస్తాం. రంజాన్ ప్రార్థనలు ఇళ్లలో నుంచే చేసుకోవాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను ముస్లింలు తప్పక పాటించాలి. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలి" అని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా కోరారు. (అందరూ ఇళ్లలోనే నమాజ్...) -
నిబంధనలు పాటిస్తూ రంజాన్ జరుపుకోవాలి
-
ఇళ్ల వద్దే ప్రార్ధనలు చేసుకోవాలి..
-
వాటికి ప్రభుత్వం అనిమతించింది: అంజాద్ బాషా
సాక్షి, వైఎస్సార్ కడప: పవిత్రమైన రంజాన్ పండుగ కరోనా వైరస్ సమయంలో వచ్చినందున్న.. ముస్లిం సోదరులంతా ప్రభుత్వానికి సహకరించాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా రానున్న రంజాన్ దీక్షల తరుణంలో అందరూ ఇళ్లలోనే నమాజ్ నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు. ఇక కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. రంజాన్ ఉపవాస దీక్షలలో 5 పూటలా నమాజ్ చేయడానికి ఇమామ్, మౌజన్లకు అనుమతిని ఇస్తున్నామని, నమాజ్కు సంబంధించిన అజా సమయంలో సైరన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఇనుమతించిందన్నారు. (వైన్ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి) ఇక సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించే సమయంలో ఎవరూ బయటకు రావోద్దని, ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకొని ఇఫ్తార్ జరుపుకోవాలన్నారు. నమాజ్ సమయంలో సామాజిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల దుకాణౠలు ఉదయం 10 వరకు అనుమతి ఇస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే ఉపవాస దీక్ష విరమణ సమయంలో పండ్లు, ఫలాల కోసం సాయంత్రం వేళ దుకాణాలకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. పేద ముస్లిం వాళ్లకు దాతలు చేసే ఉచిత అన్నదాన కార్యక్రమం అనుమతితో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇఫ్తార్ సమయంలో పోలీసులు అనుమతిని ఇచ్చిన కొన్నిహోటల్స్కు మాత్రమే టెక్ అవెతో వేసులు బాటు కల్పించామన్నారు. క్వారంటైన్లో ఉన్న ముస్లిం సోదరులకు ప్రభుత్వ యంత్రాంగం తరపున వారికి పౌష్టికాహారం అందిస్తున్నామని, అన్ని ప్రాంత్రాల్లో ప్రభుత్వ నిబంధనల బ్యానర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
అలాంటి వారిని ఉపేక్షించొద్దన్నారు: అంజాద్ బాషా
సాక్షి, తాడేపల్లి: అన్ని జిల్లాల ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి పరిస్థితుల్లో రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాల్సి రావడం బాధాకరం. శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి పండుగలూ ఇదే సమయంలో జరుపుకోవాల్సి వచ్చింది. అందరూ ఇళ్లకే పరిమితమై ప్రార్థనలు చేసుకోవాలని మత పెద్దలను సీఎం కోరారని’ ఆయన వెల్లడించారు. (ఏపీ ప్రభుత్వ బాటలో కేంద్ర ప్రభుత్వం) మత పెద్దలు ఈ విషయాన్ని సీఎం మాటగా ప్రతి సోదరుడికి తెలపాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కరోనా సమయంలో మనకున్న ఒకే ఒక్క ఆయుధం భౌతిక దురమేనని సీఎం చెప్పారని.. ఈ నియమాన్ని పాటిస్తూ అందరూ రంజాన్ మాసాన్ని జరుపుకోవాలని సీఎం సూచించారని ఆయన తెలిపారు. ఫేక్ మెసేజ్ ద్వారా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కొంతమంది మత పెద్దలు సీఎం దృష్టికి తీసుకువచ్చారని.. అటువంటి వారిని ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ డీజీపీకి ఆదేశాలిచ్చారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. -
కరోనా.. వైఎస్సార్ జిల్లాలో 13 మంది డిశ్చార్జ్
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో 13 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ రావడంతో వారిని డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో 17 రోజులుగా కోవిడ్ ఆస్పత్రిలో చికిత్సపొందిన వీరు గురువారం డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 13 మందికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పౌష్టికాహార సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంజాద్ బాషాతోపాటు జిల్లా కలెక్టర్ హరి కిరణ్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. చికిత్స అనంతరం 13 మంది కరోనా బాధితులు కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంపై అధికార యంత్రాంగం ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు జిల్లాలో 36 కరోనా కేసులు నమోదుకాగా.. నేడు 13 మంది డిశ్చార్జ్ కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 23కు తగ్గింది. చదవండి : క్వారంటైన్ నుంచి వెళ్లేటప్పుడు రూ. 2,000 సాయం ఏపీ : రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభం -
అసలు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్నారా..?
సాక్షి, వైఎస్సార్ కడప : దేశం, సమాజం బాగుండాలంటే మే3 వరకు లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయట పడాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ఆయన సూచించారు. మంగళవారం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. సామాజిక దూరంతోనే కరోనా నివారణ సాధ్యమతుందన్నారు. ముస్లిం సోదరుల వల్లే కరోనా పెరిగిందని ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబు ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు. ‘అసలు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్నారా..? కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు తెలుసా’ అని ప్రశ్నించారు. హైదరాబాద్లో కూర్చుని బాబు రాజకీయాలు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నిజాముద్దీన్కు విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం ముందే ఎలా తెలుస్తుందని, ముందే తెలిస్తే ముస్లిం సోదరులు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. (‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’ ) కరోనా వ్యాప్తిని ఒక మతానికి, కులానికి అంటగట్టడం ఎంతవరకు సమంజసమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చంద్రబాబును నిలదీశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారని, ఒక మతానికి అపాదించడం భావ్యం కాదని నిక్కచ్చిగా తేల్చి చెప్పారన్నారు. మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని, పాజిటివ్ వచ్చిన వారిపై జాలి చూపాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా ద్వారా ముస్లిం సోదరులపై దుష్ప్రచారం చేశారని, ఆ వీడియోలు నకిలీవి అని జాతీయ మీడియా తేల్చిందని అన్నారు. వారికి రాష్ట్ర ప్రజల తరవున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముస్లింలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలకు కట్టుబడి తక్షణమే ఆయన వారికి క్షమాపణ కోరారని మంత్రి గుర్తు చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పినా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమని ఖండించారు. (బంగారం నెక్ట్స్ టార్గెట్ ఇదేనా..?) ముస్లింలపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని, బాబు ముస్లింల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ముస్లింలకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే దేశ ద్రోహం కేసులు నమోదు చేయడం వాస్తవమా కదా అని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేయాల్సిన సమయం ఇదేనా అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.100 అసత్యపు వార్తలను ఎల్లో మీడియా ప్రసారం చేస్తే నిజం అవుతాయా అని మండిపడ్డారు. భారతీయులమంతా ఒక తాటి పైకి వచ్చి కరోనాపై యుద్ధం చేయాల్సిన సమయమిదని పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా రైతులు నష్ట పోకూడదని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చులు పెట్టొద్దని మంత్రి అంజాద్ బాషా హెచ్చరించారు. (లాక్డౌన్ ఉల్లంఘన: 5600 కేసులు నమోదు ) -
కరోనా కట్టడికి ప్రజలు భౌతిక దూరం పాటించాలి
-
ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దు
-
ఒక్క పేద కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు
-
పేద కుటుంబాలకు చేయూత: అంజాద్ బాషా
సాక్షి, వైఎస్సార్ కడప: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద కుటుంబాలకు చేయూత అందిస్తున్నామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పేద కుంటుంబానికి రూ. 1000 పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు) బాబు, పవన్ విమర్శలు మానుకోవాలి: వెల్లంపల్లి విజయవాడలోని పలు ప్రాంతాల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం పర్యటించారు. కరోనా నియంత్రణపై అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి ఇంటి వద్దకే రూ.1000 పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది కొనియాడారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి ఆయన సూచించారు. ప్రభుత్వ అధికారులకు ప్రజలు సహకరించాలి మంత్రి కోరారు. కరోనాతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు, పవన్ మాత్రం ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్కళ్యాణ్ విమర్శలు మానుకోవాలి హితవు పలికారు. (తొలి మరణం విజయవాడలో జరగడం బాధాకరం) -
ఎల్లోమీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు
-
అందుకే ఢిల్లీ వెళ్లా : అంజాద్ బాషా
సాక్షి, అమరావతి : గత నెల మార్చి 2న ముస్లింలకు సంబంధించిన 4 శాతం రిజర్వేషన్ల కేసు విషయమై తాను ఢిల్లీ వెళ్లానని, మార్చి 5 నుంచి 26 వరకు కడపలోనే ఉన్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. తాను మర్కజ్ జమాత్లో జరిగిన ఇస్తమాకు వెళ్లినట్లు ఎల్లోమీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలకు తెరలేపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని, తనపై దుష్ప్రచారం చేసిన ఛానల్పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఢిల్లీ సభలకు వెళ్లలేదని నిరూపిస్తే ఛానల్ను మూసేస్తారా? అని సవాల్ విసిరారు. తప్పుడు ప్రచారం చేసిన ఎల్లోమీడియాపై.. వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ను కలిసి ఫిర్యాదు చేశానని చెప్పారు. కాగా, గత నెలలో ఢిల్లీలోని నిజామొద్దీన్ ప్రాంతంలోని మర్కజ్లో జరిగిన ప్రార్థనలు కరోనా వైరస్ వ్యాధి సోకడానికి కారణమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంనుంచి ఈ ప్రార్థనలకు దాదాపు 700పైగా మంది హాజరయ్యారు. సామాజిక దూరం పాటించకపోవటమే వైరస్ వ్యాప్తికి కారణమని తెలుస్తోంది. చదవండి : ‘ఇంకా 85 మంది ఆచూకీ తెలియాలి’ -
‘ఇంకా 85 మంది ఆచూకీ తెలియాలి’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ జమాత్ లో ఇస్తమా జరగ్గా, ఏపీ నుంచి 711 మంది ఆ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా రెండు వేల మంది ప్రార్థనల్లో పాల్గొనగా, ఏపీ నుంచి ఏడు వందలకు పైగా అక్కడకు వెళ్లారన్నారు. ఆ ప్రార్థనల్లో సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లే అక్కడికి వెళ్లిన వారికి కరోనా వైరస్ సోకిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అనేక మంది ప్రార్థనల్లో పాల్గొన్నారన్నారు. దాదాపు అందరికీ రక్త పరీక్షలు జరిపి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచామన్నారు. కాగా, వీరిలో ఇంకా 85 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. (‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’) ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనకు వెళ్లిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, వారు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే అధికారులు నేరుగా వచ్చి పరీక్షలు చేస్తారన్నారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని, ప్రజలందరి ఆరోగ్యం కోసం మీరంతా బయటకు రావాలన్నారు. దేవుడి దయవల్ల కరోనా వైరస్ వల్ల మన రాష్ట్రంలో ఎవరూ మరణించలేదని, జిల్లా వ్యాప్తంగా 138 మంది శ్యాంపిల్స్ ల్యాబ్కు పంపగా, 65 మందికి నెగిటివ్ రావడం జరిగిందన్నారు. ప్రొద్దుటూరులో ఏడుగురు స్వచ్ఛందంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చారన్నారు. తెలంగాణా లో 77 మంది పాజిటివ్ కేసులు నమోదు కాగా 6 మంది మరణించిన విషయాన్ని అంజాద్ బాషా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా సమాచారం ఢిల్లీ వెళ్లిన వారికి అందేలా చూడాలన్నారు. (సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్) -
కడపలో టీడీపీకి మరో బిగ్షాక్
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో టీడీపీకి మరో గట్టిషాక్ తగిలింది. కడపకు చెందిన టీడీపీ సీనియర్ మైనార్టీ నేత, మాజీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సుబాన్ బాషా శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ల తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుబాన్ బాషాతో తరలివచ్చిన ఆయన అనుచరులకు అంజద్ బాషా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆ పార్టీని వీడి తన కుటుంబ సభ్యులు, పలువురు నేతలు, కార్యకర్తలతో బుధవారం వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పాటు టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న సతీష్ రెడ్డి కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కడప జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి కనబడుతోంది. (టీడీపీకి సతీష్రెడ్డి రాజీనామా) (బాబు మాకు అన్యాయం చేశాడు: రామసుబ్బారెడ్డి) -
పేదల కళ్లలో ఆనందమే సీఎం జగన్ లక్ష్యం
సాక్షి, వైఎస్సార్ కడప: పేదల కళ్లలో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులోని ఉక్కాయపల్లి లేఅవుట్ను శనివారం ఆయన మాజీ మేయర్ సురేష్బాబు,అధికారులతో కలిసి పరిశీలించారు. పేదలకు పంపిణీ చేయడానికి స్థలాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. (దాదాపు 30 లక్షల మందికి.. గృహ యోగం!) ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాదికి కడపలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో 22 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. రూరల్ ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కూడా 1.5 సెంటును అందజేసేందుకు కేబినెట్లో చర్చించామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. -
పరిపాలన వికేంద్రీకరణను ప్రజలు స్వాగతిస్తున్నారు
-
‘సొంత ప్రయోజనాల కోసమే బాబు దొంగ యాత్రలు’
సాక్షి, వైఎస్సార్ కడప: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 8నెలల్లోనే అనేక హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి లబ్ధిదారులకు పథకాల అమలుకు వాలంటీర్ల వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇప్పటి వరకు 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. నవత్నాల పథకాల అమలు లక్ష్యమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని సాహసోపేత నిర్ణయాలు సీఎం జగన్ తీసుకున్నారన్నారు. కేవలం మాటలకే గత ప్రభుత్వాలు పరిమితం అయ్యాయని, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి సీఎం కంకణం కట్టుకున్నారన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలు సాకులు వెత్తుకుంటున్నాయని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రజా చైతన్య యాత్రపై ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబు తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ దొంగ యాత్రలు చేస్తున్నారని బాషా విమర్శించారు. బినామీలను కాపాడటానికి మాత్రమే టీడీపీ యాత్రలు చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేసిన ప్రతి అవినీతిపై పక్కా విచారణ జరుగుతుందని, కొద్దీ రోజుల్లో అవినీతి కేసుల్లో చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. ఒక ప్రాంతానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరిస్తూన్నారని, మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. రాజధాని పేరుతో చంద్రబాబు, లోకేష్ బినామీలు లక్షల ఎకరాల భూములు కొనుగోలు చేశారని, దాదాపు 40 వేల కోట్ల రూపాయల భారీ స్కాంకు టీడీపీ నేతలు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రైతుల భూములను బలవంతంగా అప్పటి పాలకులు లాక్కున్నారని, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తమ ప్రభుత్వంపై మోపారని అంజాద్ బాషా అన్నారు. -
చంద్రబాబు,లోకేష్ జైల్లుకు వెళ్లడం ఖాయం
-
కడపలో NRC, CAA, NPR బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన
-
‘బాబు అవినీతిపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది’
సాక్షి, వైఎస్సార్/కర్నూలు/అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రతి పనిలో అవినీతి జరిగిందని విమర్శించారు. బాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ప్రతి పనిలో చిన్నబాబుకు కమిషన్లు వెళ్ళేవని విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ఐటీ అధికారులు నిగ్గు తేల్చారని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పడంతో అవినీతి చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు.(చదవండి : చంద్రబాబు అవినీతి బట్టబయలు) అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ : గడికోట ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు మిగిలిపోతారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగల ఘనుడు చంద్రబాబు అని తెలిపారు. దేశ చరిత్రలో స్వాతంత్ర్యం తర్వాత ఇటువంటి భారీ స్కామ్ ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి బాగోతాన్ని ఐటీ అధికారులు బట్టబయలు చేశారని చెప్పారు. గతంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని గుర్తుచేశారు. బాబు అక్రమ ఆస్తులపై దర్యాప్తు సంస్థ నిఘా పెట్టాలని కోరారు. టీడీపీ హయాంలో రూ. 3లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఈ అవినీతి బాగోతంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ తప్పుదోవ పట్టించేందుకు అమరావతి అంశంపై బాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. (చదవండి : ‘బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు’) ఆ డైరీలో బాబు బాగోతం ఉంది : తోపుదుర్తి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. అవినీతికి కేరాఫ్ చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభ్యమైన డైరీలో చంద్రబాబు బాగోతం ఉందన్నారు. పీఎస్ ఇంట్లోనే రూ. 2వేల కోట్ల లావాదేవీలు వెలుగు చూస్తే.. బాబు ఇంట్లో ఎంత ఉంటుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ బినామీ ఆస్తులపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారందరిపైనా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ పాలనలో చేసిన అప్పులు.. చంద్రబాబు అండ్ కో జేబుల్లో నింపుకున్నారని మండిపడ్డారు. విద్యావంతుల ద్వారా వాస్తవాలు తెలుసుకోవాలి : ఆమంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రజాధనాన్ని దోచుకునే ఓ సంస్థ అని విమర్శించారు. రాజధాని భూముల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. అచ్చెన్నాయుడు, బొండా ఉమాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఫోర్త్ ఎస్టేట్గా నిలువాల్సిన మీడియా విలువలను ఎల్లో మీడియా నాశనం చేసిందన్నారు. ఇంట్లో ఉన్న విద్యావంతులైన పిల్లల ద్వారా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం డ్రామా కంపెనీ మూసివేసే టైమ్ వచ్చిందని అభిప్రాయపడ్డారు. బాబు అవినీతి మరోసారి రుజువైంది : బీవై రామయ్య వైఎస్సార్సీపీ నేత బీవై రామయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి పరుడని ఆధారాలతోపాటు మరొక్కసారి రుజువైంది. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడని గుర్తుచేశాడు. వాటిపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఈ కేసు నుంచి చంద్రబాబు, లోకేశ్లు తప్పించుకోలేరని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇళ్లపై కూడా దాడులు నిర్వహించి లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును బయటకు తీయాలని డిమాండ్ చేశారు. చదవండి : లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో! -
‘చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు బాధాకరం’
సాక్షి, అనంతపురం: నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు దేశంలో ఎక్కడా లేవని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. ఆయన గురువారం మీడియాతో మట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఆయన కొనియాడారు. మహిళలకు సాధికారత కల్పించిన ఘనత సీఎం జగన్దని అన్నారు. వ్యవసాయానికి రూ. 35 వేల కోట్లు కేటాయించి రైతులను ఆదుకున్నారని అంజాద్ బాషా అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేయటం బాధాకరమన్నారమని అంజాద్ బాషా అన్నారు. హజ్ యాత్రకు సబ్సిడీ కింద రూ. 60 వేలు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఒక్క మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను ఏపీలో అమలు చేయమని ఆయన అన్నారు. ముస్లిం మైనారిటీలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అంజాద్ బాషా చెప్పారు. ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా ఉంటారని అంజాద్ బాషా అన్నారు. -
‘టీడీపీ పాలనలో ఇళ్లు ఇస్తామని మోసం’
సాక్షి, విజయవాడ: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర పాలక సంస్థ కమీషన్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారమే ప్రజలకు మౌలిక సదుపాయాలు, రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాల పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. నగరంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంజాద్ బాషా పేర్కొన్నారు. 52వ డివిజన్లో రూ.13.5 కోట్లతో శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా సీఎం వైఎస్ జగన్ పాలన అందిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమనికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని అంజాద్ బాషా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 14వ ఆర్థిక కమీషన్ నుంచి రూ.140 కోట్లు, బడ్జెట్ నుంచి రూ. 25 కోట్లు, సీఎం వైఎస్ జగన్ డివిజన్ల అభివృద్ధికి కేటాయించిన రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రూ. 250 నుంచి రూ. 300 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ పాలనలో సెంట్రల్ నియోజకవర్గం నిర్లక్ష్యనికి గురైందని విమర్శించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సిప్ అనే సంస్థ పేరుతో శిలాఫలకాలు, కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేశారని మల్లాది విష్ణు అన్నారు. అన్ని డివిజన్లలోని త్రాగు నీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు 80శాతం ప్రజలకు చేరువ చేశామని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో నియోజకవర్గంలో ఇళ్ళు ఇస్తామని 15 వేల మందిని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. వేల మందికి కేవలం 600 ఇళ్లు చూపి.. ప్రజలను మోసం చేసారని ఆయన విమర్శించారు. వాటిలో రివర్స్ టెండరింగ్తో రూ. 25 కోట్లు ఆదాచేశామని ఆయన అన్నారు. టీడీపీ కార్పొరేటర్లు ఇళ్ల అప్లికేషన్లకు రూ. 25, రూ. 50 వేలకు అమ్ముకున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేశారని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థతో ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు మతి భ్రమించడంతో మొన్నటి వరకు ఈవీఎంలు అని.. ఇప్పుడు ఓటర్లు డబ్బులకు అమ్ముడు పోయారంటున్నారని దుయ్యబట్టారు. రాష్టంలోని అన్ని మున్సిపాలిటీలను గెలిచి ప్రజలకు జవాబుదారితనంగా తాము పాలన అందిస్తున్నట్లు నిరూపిస్తామన్నారు. అర కేజీ టమాటా, ఒక కేజీ బియ్యం ఇచ్చి ‘జై తెలుగుదేశం’అనిపించే దుస్థితికి టీడీపీ నాయకులు దిగజారారని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో మీరు అందించిన పాలన, ఎనిమిది నెలల్లో తాము అందించిన పాలనపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో 34,500 మందికి అమ్మఒడి ఇచ్చామని తెలిపారు. ఐదేళ్లలో ఇలాంటి కార్యక్రమం జరిగిందా అని ప్రశ్నించారు. 24 గంటలు అమరావతి పేరుతో అధికారులను ఫైల్స్ పట్టుకుని సచివాలయం చుట్టు తిరిగేలా చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్ ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేలా పాలన అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. సీఎం జగన్ సాచురేషన్ పద్ధతిలో అర్హులందిరికీ ఫలాలు అందేలా చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో 35 వేలమంది ఇల్లు లేనివారిని గుర్తించామని తెలిపారు. అధికారం అడ్డం పెట్టుకుని ఐదేళ్లలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విష్ణు విమర్శించారు. తన కోటరికే మేలు జరిగేలా పాలన అందించారని మండిపడ్డారు. ఐటీ దాడులే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. అమరావతి ఎక్కడికి తరలిపోదని.. శాసనసభ అమరావతిలోనే ఉంటుందన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుష్పచారం చేస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. -
రాష్ట్రమంతా ‘వికేంద్రీకరణ’ కోరుకుంటోంది
సాక్షి, తాడేపల్లి: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రమంతా సమర్థిస్తుందని డిప్యూటీ సీఎం అంజాద్బాషా అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంశంపై ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా, మైనార్టీ శాసనసభ్యులు, 13 జిల్లాల అధ్యక్షులు, నగర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంపై సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చర్చించడం జరిగిందన్నారు. అనేక దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్ర, వెనుకబడిన రాయలసీమ ప్రాంతాలకు సమాన న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, నాయకులు కూడా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు సమర్థిస్తున్నారని చెప్పారు. ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో వికేంద్రీకరణ నిర్ణయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. అదే విధంగా రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించడం జరిగిందన్నారు. (ఏపీలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేవలు.. ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షపాతిగా ఉంది. ఇప్పటికీ, ఎప్పటికీ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బిల్లుల విషయంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని వర్గాల ప్రజలు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరుల్లో అభద్రతా భావం ఏర్పడిందని, వీటిపై కూడా సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్లో ఉండే మైనార్టీలు అక్కడ ఇమడలేకపోతున్నారో.. వారికి రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం ఇస్తామని వారు చెప్పిన తీరును బట్టి వైఎస్సార్ సీపీ ఆ రోజున మద్దతు ఇచ్చిందని, ఇవాళ కేంద్రం వైఖరి వేరే విధంగా ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. లోక్సభలో ఎంపీ మిథున్రెడ్డి కేంద్ర బిల్లులను పూర్తిగా వ్యతిరేకించారన్నారు. ('తాను, కొడుకు బాగుంటే చాలు.. ఇంకేం అవసరం లేదు') ప్రజలకు అన్యాయం చేసే ప్రతీ చట్టాన్ని వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. ఎన్ఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని సీఎం వైఎస్ జగన్ కడప బహిరంగ సభలో చెప్పారని గుర్తు చేశారు. అదే విధంగా ఎన్పీఆర్ను కూడా వ్యతిరేకిస్తున్నామని, 2010, 2015 సంవత్సరాల్లో ఎన్పీఆర్ చేశారని, కానీ.. వాటికి భిన్నంగా 2020లో చేస్తోందని.. 13ఏ, 13బీ రెండు కాలమ్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారని, కేంద్రం ప్రస్తుతం తెచ్చిన ఫార్మట్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మైనార్టీ నాయకుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్తామని, ఎవరికీ హాని జరగకుండా సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. -
రాష్ట్రమంతా ‘వికేంద్రీకరణ’ కోరుకుంటోంది
-
వైఎస్ఆర్ జిల్లలో దిశ స్టేషన్ ప్రారంభం
-
‘రాయలసీమలో జేసీ పుట్టడం దురదృష్టకరం’
సాక్షి, వైఎస్సార్ కడప: అనేక సంవత్సరాలుగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాజధానులు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల విషయంలో ప్రముఖ సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెప్పించుకున్నారని గుర్తు చేశారు. నివేదికలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక ఏమైందని ఆయన ప్రశ్నించారు. అప్పట్లోనే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని కమిటీల నివేదిక స్పష్టం చేశాయని అన్నారు. కానీ, గత టీడీపీ ప్రభుత్వంలో కమిటీల నివేదికను బుట్ట దాఖలు చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల అభివృద్ధి టీడీపీకి ఇష్టం లేదని అంజాద్ బాషా మండిపడ్డారు. ముందుగా టీడీపీ నేతలు వారి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గల్లీ నాయకుడి కన్నా హీనంగా తయారయ్యారని ఆయన దుయ్యబట్టారు. అమరావతి విషయంలో చంద్రబాబు తీరు దుర్మార్గమని అన్నారు. కమిటీల నివేదికను గౌరవిస్తూ సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అమరావతిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు సంతోషంగా మద్దతిస్తున్నారని తెలిపారు. పెద్దల సభ అంటే ప్రభుత్వ నిర్ణయాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. కానీ, మండలిలో బలం ఉందని.. ప్రభుత్వ బిల్లును అడ్డుకోవడం దారుణమన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ నేతలు మండలిని వాడుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజలకు అవసరం అయ్యే బిల్లులను అడ్డుకోవడమే పరమావధిగా టీడీపీ నేతలు తయారయ్యారని అంజాద్ బాషా మండిపడ్డారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ బిల్లులపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని అంజాద్ బాషా అన్నారు. ఎన్పీఆర్ అనేది పదేళ్లకు ఒకసారి చేస్తారని చెప్పారు. గతంలో 2010లో చేశారని, మళ్లీ ఇప్పుడు చేస్తున్నారని గుర్తు చేశారు. 2019 ఆగస్టు 16న ఎన్పీఆర్పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్ఆర్సీపై ప్రధానంగా ముస్లిం ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. వెంటనే సీఎం వైఎస్ జగన్ ఈ బిల్లులకు పూర్తి వ్యతిరేకమని ఆయన బహిరంగంగా ప్రకటించారని అంజాద్ బాషా తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణపై రాయలసీమ వాసిగా స్వాగతిస్తున్నానని రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అమరావతి ప్రాంతాల రైతులే కావాలి, మిగతా జిల్లాల రైతులు అవసరం లేదనే ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీక్షల పేరుతో కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకు తిన్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నీరు నిల్వ చేయలేకపోతున్నామంటే టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని అన్నారు. గతంలో హైకోర్టు బెంచ్ కావాలని రాయలసీమ లాయర్లు చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని ఆయన తప్పుపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణను రాయలసీమ నేతలు అడ్డుకోవడం సిగ్గు చేటని శ్రీకాంత్రెడ్డి దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాంత ప్రజలు టీడీపీ నేతలను కచ్చితంగా అడ్డుకుంటారని హెచ్చరించారు. ఫ్యాక్షనిస్టులు, కడప రౌడీలు అని చంద్రబాబు అంటే.. ఎందుకు టీడీపీ నేతలు నోరు మెదపటంలేదని శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. 70 ఏళ్ల క్రితం శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వందల ఏళ్లుగా రాయలసీమ ప్రాంత రైతులు, ప్రజలు అనేక విషయాల్లో త్యాగం చేశారని తెలిపారు. అమరావతి ప్రాంత రైతులకు ప్రజలు మెచ్చిన ప్యాకేజి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. భవిష్యత్లో రాయలసీమ ప్రాంత ప్రజలను రౌడీలు, గుండాలు అంటే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కుటుంబ కార్యక్రమం లాగా చేశావని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన ప్రశంసించారు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని 13 జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కల్లు తాగే, పొగరు వ్యక్తి జేసీ దివాకర్రెడ్డి రాయలసీమలో పుట్టి ఇక్కడి ప్రజలను అవమానరీతిలో మాట్లాడటం దారుణమని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమలో ఇలాంటి వారు పుట్టడం దురదృష్టకరమన్నారు. గత ఐదు ఏళ్ల టీడీపీ హయాంలో రాయలసీమకు ఏం చేసారో చంద్రబాబు స్పష్టం చేయాలని శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు’
సాక్షి, తాడేపలి: ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావు కమిటీ విశాఖపట్నంలో రాజధాని వద్దని చెప్పిందని తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటీవ్ రాజధాని విశాఖలో పెట్టాలని కమిటీ సూచించిందని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాతనే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో చంద్రబాబు అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని డిప్యూటీ సీఎం తిప్పికొట్టారు. అదే సీఎం జగన్ అభిమతం ‘అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని, జీఎన్రావు, బోస్టన్ కమిటీ, హైపర్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమతం. అయితే అభివృద్ది వికేంద్రీకరణపై కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ది వికేంద్రీకరణకు వ్యతిరేకమని టీడీపీ మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని చేయలంటున్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి తనకు అనుకూల నివేదికను ఇచ్చే నారాయణ కమిటీని ఏర్పాటు చేశారు. అమరావతిలో వరదలు రావా? జీఎన్ రావ్ కమిటీ నివేదికను చంద్రబాబు భోగి మంటల్లో వేశారు. మళ్లీ జీఎన్ రావు కమిటీపై చంద్రబాబుకు ఎందుకు ప్రేమ పెరిగిందో అర్థం కావడం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో, ప్రజలను మోసం చేయడంలో దేశంలోనే చంద్రబాబు నంబర్ వన్. విశాఖలో వరదలు, తుఫాను వస్తాయని ప్రచారం చేస్తున్నారు. అమరావతిలో వరదలు రావా అని ప్రశ్నిస్తున్నాను. ముంబై, చెన్నై సముద్రం ఒడ్డున లేవా? ఆ నగరాలు అభివృద్ది చెందలేదా? వీటికి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా గతంలో చంద్రబాబు విశాఖను దేశానికి రెండో రాజధాని చేయాలని లేకుంటే ఆర్థిక రాజధాని చేయాలని మాట్లాడలేదా? అప్పుడెలా జరిగిందో ఇప్పుడలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రపై బాబు విషం కక్కుతున్నారు. ఈ రెండు ప్రాంతాల ద్రోహిగా చిరస్థాయిలో నిలిచిపోతారు. మీడియాను అడ్డంపెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోంది. మండలి రద్దు నిబంధనలకు విరుద్దంగా జరగడం లేదు. ఎన్టీఆర్ హయాంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతోంది’అని డిప్యూటీ సీఎం అంజద్ బాషా పేర్కొన్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం మెట్రోపాలి టన్ ఏరియాలో సముద్రానికి దూరంగా ఉన్న వాయవ్య ప్రాంతం సరిగ్గా సరిపోతుందని రాజధాని ప్రాంతంపై సిఫారసుల కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీకి నేతృత్వం వహిస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చదవండి: బాలకృష్ణకు సెగ.. ‘గోబ్యాక్’ నినాదాలు విశాఖే ఉత్తమం నేను మేనేజ్ చేస్తాగా! -
అందుకే ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం..
సాక్షి, అనంతపురం: సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. శనివారం జిల్లాలోని ఉరవకొండలో జరిగిన మైనార్టీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మత ప్రాతిపదికన విభజిస్తున్నారని.. తమ పౌరసత్వానికే ముప్పు ఉందని ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని అందుకే కేంద్రం తెచ్చిన బిల్లులను వ్యతిరేకిస్తున్నామని’ ఆయన తెలిపారు. ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు నిర్మించింది కేవలం తాత్కాలిక రాజధాని మాత్రమే అని.. ఏపీ లోని అన్ని జిల్లాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని వివరించారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని అంజాద్ బాషా పేర్కొన్నారు. -
‘ముస్లింల గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు’
సాక్షి, తాడేపల్లి : శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ టీడీపీ నాయకుడిగా వ్యవహరించారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టారని.. పెద్దల సభలు సలహాలు, సూచనలు ఇవ్వాలే కానీ, బిల్లులు చర్చకు రాకుండా రూల్ 71ను తీసుకు వచ్చారన్నారు. 51 శాతం ఓట్లు 86 శాతం సీట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సభలో మండలి ఛైర్మన్ అనైతికంగా వ్యవహరించారని, ఆయన చైర్ను గౌరవించలేదని విమర్శించారు. సభలో నిబంధనలను అతిక్రమించారని, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపి చైర్మన్ తప్పు మీద తప్పు చేశారన్నారు. ఛైర్మన్ తీరుపై అన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు.సభ నిబంధనలకు విరుద్ధంగా సభలో వీడియోలు తీశారని, చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. కాలయాపన చేయడం కోసమే సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. సభలో టీడీపీ సభ్యులు గూండాలు, రౌడీలుగా వ్యవహరిస్తే చంద్రబాబు వారిని శెభాష్ అని మెచ్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబుకు కుల రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించినవారు దేశంలో మరొకరు ఉండరని అన్నారు. ఛైర్మన్ను మంత్రులు కులంపేరుతో తిట్టారని టీడీపీ నేతలు అంటుంటే... ఛైర్మనే స్వయంగా తనను ఎవరూ తిట్టలేదని చెబుతున్నారన్నారు. టీడీపీ నేతలు కావాలనే మతం, కులంతో రాజకీయాలు చూస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఈ సందర్భంగా తనను మంత్రులు తిట్టలేదని శాసనమండలి ఛైర్మన్ చెప్పిన వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని, ఆ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. కర్నూలులో హైకోర్టు రాయలసీమ ప్రజల హక్కు అని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు... కనీసం సీమలో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 13 జిల్లాల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారన్నారు. కర్నూలు అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు. -
మండలిలో టీడీపీ సభ్యుల వ్యవహార తీరు బాధాకరం
-
బిల్లుపై తొలి నుంచి కుట్రపూరితంగానే...
సాక్షి, అమరావతి : వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలని ప్రతిపక్ష టీడీపీ తొలి నుంచి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే మండలికి పంపామని అన్నారు. మండలిలో బిజినెస్ రూల్స్ ప్రకారం వెళ్లకుండా బిల్లును అడ్డుకోవాలని కొత్తగా రూల్ 71ని తెచ్చారని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో చర్చలో భాగంగా అంజాద్ బాషా ప్రసంగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రాధాన్యత ఇవ్వాలని చైర్మన్ను తాము కోరామని, కానీ ఆయనకు దానికి విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. రూల్ ప్రకారం వెళ్లాలని సభలో బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు సూచించినా, ఆయన కనీస మర్యాద పాటించలేదని అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారితనంలా సభా కార్యక్రమాలు ఉండాలని, కానీ చైర్మన్ సభను టీడీపీ వ్యవహారంలా నడిపారని విమర్శించారు.ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజల సమస్యలపక్ష కనీస చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. మండలిలో బలం ఉందని టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
స్వగ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. తన స్వగ్రామమైన తాళ్లపూడిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్ది.. సకల సదుపాయాలు కల్పించేందుకు రూ.15 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి అనిల్కుమార్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దుర్గాప్రసాద్.. ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ? -
'చంద్రబాబు చరిత్ర హీనులవడం ఖాయం'
సాక్షి, అమరావతి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నంకు పాల్పడిన ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూశారని డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ దుర్మార్గాన్ని ప్రోత్సహించడం దారుణమని పేర్కొన్నారు.రైతుల రూపంలో టీడీపీ గూండాలను ప్రేరేపించి ఒక ప్రజాప్రతినిధిపై హత్యాయత్నంకు పాల్పడడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇటువంటి చర్యలపై ప్రజలే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఆయన బుద్ధి మారలేదని విమర్శించారు. చంద్రబాబు అప్పటి నుంచి మరింత దిగజారి ఇలాంటి సిగ్గుమాలిన పనులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ రోజు దేశంలో నెంబర్ వన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ చంద్రబాబేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనే దుష్ర్పచారంతో చంద్రబాబు ముందుకు వెడుతున్నారన్నారు. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆయన గన్ మెన్లపై కూడా దాడులు చేయడం, అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా జరిగిన సంఘటనను వక్రీకరించి చూపుతున్నారని అంజద్ బాషా వెల్లడించారు. అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు ఎవరూ రాలేని పరిస్థితిని చంద్రబాబు సృష్టించారు. అమరావతి ప్రాంతంలో లెజిస్లేచర్ క్యాపిటల్ ఉండకూడదనే చంద్రబాబు ఇలాంటి కుట్రలను చేస్తున్నారని విమర్శించారు.( ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం) ఒకప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కూడా చంద్రబాబుకు ఆవేశం రాలేదని, ఈ రోజు మాత్రం మూడు రాజధానులు అంటే ఎందుకు అంత ఆవేశం వస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు ఆవేశం వెనుక ఆయన బినామీలకు చెందిన భూముల విలువలు తగ్గిపోతున్నాయనే బాధ తప్ప వేరేవి పట్టించుకోరని ఎద్దేవా చేశారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీలను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బీసీజీ నివేదికను వివరించిన అధికారుల తీరును తప్పుబట్టిన చంద్రబాబు ప్రస్తుతం ఏ రకమైన బాషను మాట్లాడుతున్నారనేది ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అంజద్ వెల్లడించారు. దళిత ఐఎఎస్ అధికారి పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారని, ఈ వ్యవహారంపై దళిత సంఘాలు చంద్రబాబును ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు. మూడు రాజధానులు వద్దు... అమరావతి ముద్దు అని విజయవాడలో బెబుతున్న చంద్రబాబు ఇదే మాటను రాయలసీమ, ఉత్తరాంధ్రకు వెళ్లి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపి ప్రజలకు భ్రమలు కల్పించారని తెలిపారు. అమరావతిని నిర్మించాలంటే రూ. 1.10 లక్షల కోట్లు కావాలని చెప్పారు. ప్రస్తుతం అంత డబ్బు ఖర్చు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని, ఆయన చెప్పిన విషయాలను పరిగణలోకి చూస్తే బయటి నుంచి అప్పులు తేవాలన్నారు. అందుకు ప్రతిఏటా వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వుంటుందని, ఇవన్నీ సాధ్యపడుతాయా అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చామని అంజద్ పేర్కొన్నారు. రాజధాని కోసమే రైతులు చనిపోతున్నారంటూ చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని, ఏ కారణంతో చనిపోయినా రాజధాని కోసమే అంటూ దుష్ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి, సమన్యాయం కోసమే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు చరిత్ర హీనులుగా నిలవడం ఖాయమని దుయ్యబట్టారు. -
ఏపీలో ఎన్ఆర్సీ అమలు చేయం
కర్నూలు (సెంట్రల్) : ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను అమలు చేయబోమని ఉప ముఖ్యమంత్రి (రాష్ట్ర మైనార్టీ సంక్షేమం) అంజాద్బాషా తెలిపారు. శనివారం కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో ఎమ్మెల్యే హఫీజ్ఖాన్తో కలసి ముస్లిం పెద్దలు, ప్రజా సంఘాల నాయకులకు ఎన్ఆర్సీపై గల సందేహాలను నివృత్తి చేశారు. మొదట రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేయబోమని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజాద్బాషా మాట్లాడుతూ ఎన్ఆర్సీపై దేశంలోని ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు తీవ్ర ఆందోళనతో ఉన్నారన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేయాలన్నారు. ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలు ఎన్ఆర్సీని అడ్డుపెట్టుకుని అలజడి సృష్టించేందుకు చూస్తున్నాయని, అలాంటి వారిపై నిఘా ఉంచామని చెప్పారు. ఎన్ఆర్సీని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు శాంతియుతంగా నిరసన తెలపడం అభినందనీయమన్నారు. కాగా, కొందరు ముస్లిం పెద్దలు ఎన్పీఆర్ని వ్యతిరేకించాలని కోరగా.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు వైఎస్సార్ సీపీకి వెన్నెముక అని, వారికి అన్యాయం జరిగే ఏ పనికీ ప్రభుత్వం మద్దతు తెలపదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి, నాయకుడు ఆదిమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
‘దర్గా ఉర్సు ఉత్సవాలకు సహకారమందిస్తాం’
సాక్షి, కడప: జిల్లాలో జరగబోయే దర్గా వార్షిక ఉర్సు ఉత్సవాలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా గురువారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్లతో సమావేశమయ్యారు. జనవరి 8 నుంచి 15వరకు జరిగే దర్గా వార్షిక ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ దర్గా ఉర్సు ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో దర్గా పీఠాధిపతితో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డీఎస్సీ–2018 అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి : డీఎస్సీ–2018లో అర్హత సాధించి మెరిట్లో నిలిచిన అభ్యర్థులకు ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్ ద్వారా వారు కోరుకున్న స్కూళ్లలో నియమిస్తూ ఆదివారం పోస్టింగ్లు ఇచ్చారు. కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్లు.. ఎంపికైన అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు అందజేశారు. డీఎస్సీ–2018లో 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో ఎలాంటి న్యాయ వివాదాలు లేని వివిధ కేటగిరీల్లోని 2,654 పోస్టులకు ఆదివారం ఈ నియామక ఉత్తర్వులిచ్చారు. మిగిలిన పోస్టులకు సంబంధించిన వ్యాజ్యం త్వరలో హైకోర్టులో విచారణకు రానుంది. ఇది పరిష్కారమైతే ఆ పోస్టులకూ వెంటనే నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికార వర్గాలు వివరించాయి. బీసీ గురుకులాల్లో 322 టీచర్ పోస్టులు భర్తీ మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 322 టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయి. గురుకుల సొసైటీ కార్యదర్శి ఎ కృష్ణమోహన్ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. 2018 డీఎస్సీలో 404 ఖాళీల భర్తీకి సంబంధించి గురుకుల సొసైటీ ప్రభుత్వానికి వివరాలు ఇవ్వగా అందులో 322 పోస్టులు భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందులో పీజీటీ, టీజీటీ, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. జోన్–1 (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) నుంచి 78 మంది, జోన్–2 (తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, కృష్ణా జిల్లాలు)నుంచి 26 మంది, జోన్–3 (గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు) నుంచి 56 మంది, జోన్–4 (చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప) 162 మంది ఎంపికయ్యారు. మొత్తం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు 132 మంది, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 148 మంది, డ్రాయింగ్ టీచర్లు 18 మంది, క్రాఫ్ట్ టీచర్లు 12 మంది, మ్యూజిక్ టీచర్లు 12 మంది ఉన్నారు. బీసీ గురుకులాల్లో సుమారు 20 సంవత్సరాల నుంచి శాశ్వత టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2018 డీఎస్సీ అభ్యర్థుల విషయంలో ఉన్న కోర్టు అభ్యంతరాలను పరిష్కరించి అడుగులు ముందుకు వేసింది. -
అవి రెండూ ఒకటి కాదు
-
అవి రెండూ ఒకటి కాదు : డిప్యూటీ సీఎం
సాక్షి, తాడేపల్లి : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)లు ఒకటి కాదని, రెండూ వేర్వేరని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఏఏ అనేది ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాల్లోని మైనార్టీలకు పౌరసత్వం ఇచ్చే చట్టమని, ఎన్నార్సీపై కేంద్రం ఇంకా చట్టం చేయలేదని పేర్కొన్నారు. కొంతమంది అవగాహన లేక ఇవి రెండూ ఒకటేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నార్సీపై మైనార్టీల్లో నెలకొన్న ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశామని, ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరిగినా జగన్మోహన్రెడ్డి ఒప్పుకోరని వ్యాఖ్యానించారు. తమను గుండెల్లో పెట్టుకున్న వైఎస్సార్ కుటుంబం మైనార్టీల పక్షపాతి అని వివరించారు. మైనార్టీలకు అన్యాయం జరిగే పని వైఎస్సార్సీపీ చేయదని, ఒకవేళ ఎన్నార్సీ వస్తే వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నార్సీ చట్టాన్ని అమలుపరిచేందుకు ఒప్పుకోమని స్పష్టం చేశారు. దేశ రక్షణ అవసరాల నేపథ్యంలో సీఏఏకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపిందని, ముస్లిం సోదరులు ఈ తేడాను గమనించాలని కోరారు. -
మైనార్టీలకు అండగా ఉంటాం: అంజాద్ బాషా
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన నిలుస్తుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా భరోసా ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం, మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. బుధవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనార్టీలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లింను డిప్యూటీ సీఎం చేశారన్నారు. గత ఎన్నికల్లో అయిదుగురు ముస్లింలకు టికెట్ ఇచ్చారని, హిందూపురంలో ఇక్బాల్ ఒడినా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, హమారా సమావేశాల్లో మైనార్టీలపై దేశ ద్రోహం కేసు పెడితే సీఎం జగన్ వాటిని ఎత్తివేశారని గుర్తుచేశారు. అలాగే హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు రూ.60 వేల రూపాయలు అందించేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. మౌజమ్లకు మార్చి 1 నుంచి రూ. 15 వేల గౌరవ వేతనం ఇ్వబోతున్నామని, వక్ఫ్ భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎన్నార్సీపై ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ముస్లింలకు అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఏ అన్యాయం జరిగినా తాము వ్యతిరేకిస్తామని, పోరాటంలో ముందుంటామని పేర్కొన్నారు. దీనిపై రాజ్యసభ, లోక్సభలోనూ పోరాడుతామన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఆంధ్రరాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కోరుకుంటారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. ముస్లిం సోదరుల ఆందోళనలు సీఎం దృష్టికి తీసుకెళ్లామని, ఏ ఒక్క ముస్లిం, మైనార్టీలకు ఇబ్బంది కలిగినా తాము ముందుంటామన్నారు. గతంలో వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా గుర్తు చేశారు. ఈ బిల్లు ఏపీ రాష్ట్రానికి వర్తించదని, వైఎస్సార్ సీపీ మైనార్టీలకు అండగా ఉంటుందని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. -
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మామ మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మామ, ప్రముఖ వ్యాపారవేత్త మహమ్మద్ హనీఫ్ ఆదివారం మృతిచెందారు. ఆయన పార్దీవ దేహం వద్ద డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. 80 ఏళ్ల వయసులోనూ మునిసిపల్ కౌన్సిలర్గా సేవలందించిన హనీఫ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి చర్యలు
సాక్షి, పల్లంపేట: ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుమలకు అన్నమయ్య నడిచిన కాలిబాటను అభివృద్ధి చేసి భక్తులకు సులువైన మార్గం ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. కాలిబాట మార్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేపట్టిన తిరుమల మహా పాదయాత్రలో శనివారం ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా పల్లంపేట మండలం అప్పయ్యరాజు పేట వద్ద ఆకేపాటి పాదయాత్ర చేరుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం.. ఆకేపాటిని కలిసి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల మహా పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 17 వ సారి మహా పాదయాత్ర చేపట్టిన ఆకేపాటి దంపతులకు ఏడుకొండల స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్ బాబు ఆకాంక్షించారు. -
మండలిలో రాజేంద్రప్రసాద్ అసభ్య వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో గ్రామ సచివాలయాలపై వాడీవేడి చర్చ సాగింది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కొమ్ములొచ్చాయని అన్నారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ది టీవీ చర్చల్లో అరే.. ఒరే అని బూతులు తిట్టించుకునే సంస్కృతి అని ఎద్దేవా చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రులు డిమాండ్ చేశారు. అనంతరం మండలిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా 4లక్షల 50వేల పైగా ఉద్యోగాలు ఇవ్వడం దేశంలో ఇదే ప్రథమం అని అన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత భారీస్థాయిలో ఉద్యోగాలు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. గ్రామ సచివాలయాలను ఎప్పుడో ఏర్పాటు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. మరి సచివాలయ వ్యవస్థను ఎందుకు అమలు చెయ్యలేదు. గ్రామ సచివాలయాల వ్యవస్థల వల్ల సర్పంచ్ల అధికారాలు దెబ్బతింటాయని టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీల అధికారాలను జన్మభూమి కమిటీలు హరిస్తే ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు. హజ్ భవన్ స్థలం కోసం అన్వేషణ: డిప్యూటీ సీఎం మండలిలో డిపప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఇమాంలు, మౌజన్లకు 2020 మార్చిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ‘ 9వేలమంది ఇమాంలు, 9వేల మంది మౌజన్ లు ఉన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులను తీసుకుంటున్నాం. విజయవాడలో హజ్ భవన్ పేరుతో చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. తర్వాత పట్టించుకోలేదు. చంద్రబాబు శంఖుస్థాపన చేసిన హజ్ భవన్ కు రెండు వైపులా శ్మశానాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హజ్ భవన్ కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం 5వేలమంది ఇమాంలు, మౌజన్ లకే గౌరవ వేతనం అందించారు. మేము అర్హులైన అందరికీ గౌరవ వేతనం ఇస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం’ అని అన్నారు. -
డిప్యూటీ సీఎంపై తప్పుడు ప్రచారం..వ్యక్తి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా సందేశాలు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్పీ సూర్యనారాయణ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ నేతలపై ఫేస్బుక్, వాట్సాప్లలో కడపకు చెందిన న్యూరుల్లా అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కఠినచర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు. -
రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి..
సాక్షి, వైఎస్సార్ : ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా రైతన్నకు పోలీసు రక్షణ కల్పించేలా ఏర్పాటు చేసింది. ఈ మేరకు కడప జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా డీఎస్పీ కార్యాలయంలో రైతన్నకు రక్షణ కల్పించేందుకు ఫిర్యాదు విభాగం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిలు కలిసి ప్రారంభించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటారు. వీటితో పాటు మహిళలకు సంబంధించి ప్రత్యేక కౌన్సిలింగ్ విభాగాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అన్బురాజన్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులపై సీఎం జగన్కు అపార గౌరవం ఉందని.. ఆయనలోనూ ఓ జర్నలిస్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు ప్రమాదకరంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనాథ్రెడ్డి... జర్నలిస్టులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవలసిన అవసరం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంత విలేకరుల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆయనను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ... పాత్రికేయ రంగంలో శ్రీనాథ్రెడ్డి సేవలను గుర్తించి సీఎం జగన్.. ఆయనను ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించారని పేర్కొన్నారు. శ్రీనాథ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ మరింతగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కూడా శ్రీనాథ్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ‘గతంలో ఏ ప్రభుత్వాలు జర్నలిస్టులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే సీఎం జగన్ మాత్రం ఆరుగురు సీనియర్ జర్నలిస్టులకు తన ప్రభుత్వంలో పలు పదవులు ఇచ్చారు’ అని హర్షం వ్యక్తం చేశారు. ‘1996 లో ప్రెస్ అకాడమీ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ శిక్షణ ఇచ్చేది. గత కొంత కాలంగా ప్రెస్ అకాడమీలు నామమాత్రంగా మారాయి. ప్రెస్ అకాడమీకి స్థలం, నిధులు ఇచ్చి జర్నలిస్టులను ప్రోత్సహించాలి’ అని విఙ్ఞప్తి చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్, సీనియర్ పాత్రికేయులు ఆర్. దిలీప్రెడ్డి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కాగా శ్రీనాథ్రెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామం. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. -
మతపరమైన దుష్ప్రచారం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి : ఇచ్చిన హామీలన్నింటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తుండడంతో ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా జెరూసలేం, మక్కా యాత్రలకు వెళ్లేవారికి ఆర్థిక సహాయం చేస్తూ వచ్చాయని గుర్తు చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టు ఆర్థిక సహాయం పెంచితే దానిని టీడీపీ, పచ్చ మీడియాలు వక్రీకరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఉనికి కోసం, విమర్శించడానికి ఏ విషయాలు లేక ఇలా మతపరమైన దుష్ప్రచారానికి దిగి, అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. -
రాష్ట్రంలో మత కల్లోలానికి టీడీపీ కుట్రలు : డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి : మతాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా రాష్ట్రంలో కల్లోలం రేపాలని టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా ఆరోపించారు. పవిత్రయాత్రలకు రాయితీలు ఇవ్వడం దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ విధానమంటూ.. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాన్ని అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో.. ‘రాష్ట్రంలో మత ఘర్షణలకు ప్రతి పక్ష తెలుగదేశం పార్టీ, కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయి. కులాలకు, మతాలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు, దాని అనుకూల మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల ముసుగులో విద్వేషకారులు రాష్ట్రంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి అలజడి సృష్టించానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని మతాల వారిని సమానంగా చూసుకుంటూ ఆయా వర్గాల మేలుకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటిని కూడా వక్రీకరించి, అల్పబుద్ధితో గౌరవ ముఖ్యమంత్రిగారి మీద, ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారు. ఈ కుయత్నాల్లో కొన్ని మీడియా సంస్థలు భాగస్వాములు కావడం దురదృష్టకరం. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవిత్ర యాత్రలకోసం ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న కార్యక్రమం కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈకార్యక్రమాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. గత అక్టోబరు 30 జరిగిన మంత్రివర్గ సమావేశంలో పవిత్ర యాత్రలకు వెళ్తున్న క్రైస్తవ, మైనార్టీ సోదరులకు రాయితీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. హజ్, జెరూసలేంలకు వెళ్తున్న యాత్రికుల వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారికి ఇప్పుడు ఇస్తున్న సహాయాన్ని రూ.40వేల నుంచి రూ.60వేలకు, రూ. 3లక్షలకు పైబడి ఉన్నవారికి ఇప్పుడు ఇస్తున్న సహాయాన్ని రూ.20వేల నుంచి రూ.30వేలకూ పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పై నిర్ణయాలకు సంబంధించి ఆయా ప్రభుత్వ విభాగాలు జీవోలు జారీచేస్తున్నాయి. ఈ జీవోలను పట్టుకుని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాలను అంటుగడుతూ చేస్తున్న ప్రచారం అత్యంత దుర్మార్గమైనది. రాష్ట్రంలో మతాలమధ్య చిచ్చు పెట్టే పన్నాగమిది. వీటిని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దు. ఈ ప్రభుత్వానికి అన్ని మతాలూ సమానమే. అందరి సంక్షేమం మా లక్ష్య’మంటూ ముగించారు. -
సర్కారు బడి సౌకర్యాల ఒడి
సాక్షి, కడప: ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నేడు తొలి అడుగు వేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ఇంజినీరింగ్ అధికారులు సిద్ధం చేశారు. పాఠశాలలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి.. భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయనేది కళ్లకు కట్టినట్టుగా చూపేందుకు ప్రణాళిక రూపొందించారు. గతంలో పాఠశాలల స్థితిగతులపై అధికారులు ఇప్పటికే ఫొటోలు తీసి ఒక ప్రత్యేక యాప్(సూ్కల్ ట్రాన్సఫర్మేషన్ సిస్టమ్)లో భద్రపరిచారు. తొలి దశలో పాఠశాలలను అభివృద్ధి చేశాక ప్రజలకు వివరించాలనేది ప్రభుత్వ సంకల్పం. దీంతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. సూ్కళ్లలో చేపట్టే అభివృద్ధి పనుల పథకాన్ని నాడు– నేడుగా వ్యవహరిస్తున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి గురువారం నాంది పలుకుతోంది. కడపలోని మున్సిపల్ హైసూ్క ల్ మెయిన్లో జిల్లా అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం అంజద్బాషా, జిల్లా కలెక్టర్ హరికిరణ్తోపాటు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ యాజమాన్యాల పరిధిలో 3253 పాఠశాలలున్నాయి. ఇందులో 2,18, 912 మంది చదువుతున్నారు. జగన్ ప్రభుత్వం ఆరంభం నుంచి విద్యకు పెద్దపీట వేస్తోంది. ఈ స్కూళ్లను బలోపేతం చేయడానికి వివిధ చర్యలు చేపట్టింది. అందులో భాగమే అమ్మ ఒడి పథకం. ఈ పథకం మార్గదర్శకాలు వెలువడగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది మున్నెన్నడూ లేనంతగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. మరోపక్క సర్కారు బడులలో మెరుగైన వసతులు కల్పించనుండటంతో ఇవి కార్పొరేట్ స్కూల్స్ను తలదన్నెలా తయారుకానున్నాయి. పేరెంట్ కమిటీ, గ్రామస్తులు, ఉపాధ్యాయులు సమక్షంలో పాఠాశాలలోనే సమావేశమై చర్చించి ప్రణాళికలను సిద్దం చేయనున్నారు. పేరెంట్ కమిటితో పనులను చేయట్టనున్నారు. నాడు నేడు అమలుకు తొలి విడతలో 50 మండలాల్లోని 1059 పాఠశాలలను గుర్తించారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 718, ప్రాథమికోన్నత పాఠశాలలు 161, ఉన్నత పాఠశాలలు 180 ఉన్నాయి. ప్రతి మండలంలోని పాఠశాల తొలివిడతలో కచ్చితంగా ఉండేలా ఎంపిక చేశారు. మౌలిక వసతుల కల్పన పర్యవేక్షణ బాధ్యతలను సర్వశిక్ష అభియాన్, సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. ఈ శాఖల అధికారులు వచ్చే ఏడాది మార్చిలోగా ప్రతిపాదిత పనులు, సౌకర్యాల కల్పన పూర్తి చేశాలాషెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఏర్పాట్లను పూర్తి చేశాం... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. గురువారం కడపలోని మున్సిపల్ హైసూ్కల్ మెయిన్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్బాష, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎమ్మెల్యేలు హాజరై కార్యక్రమాన్నిప్రారంభించనున్నారు. – పొన్నతోట శైలజ, జిల్లా విద్యాశాకాధికారి అట్టహాసంగా నాడు నేడు ప్రారంభ కార్యక్రమం కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నాడు నేడు కార్యక్రమాన్ని గురువారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. మున్సిపల్ హైసూ్కల్లో (మెయిన్) కార్యక్రమం నిర్వహించేందుకు విద్యాశాకాధికారులు ఏర్పాట్లును సిద్దం చేశారు. ఏర్పాట్లను బుధవారం డీఈఓ పొన్నతోట శైలజ, సమగ్ర శిక్ష అడిషినల్ ప్రాజెక్టు కోర్డినేటర్ అంబవరం ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. ఎస్ఎస్ఏ ఈఈ, ఏపీఈడబ్లూడీసీ ఈఈలతోపాటు డిప్యూటీ డీఈఈఓ, ఎంఈఓలతో సమీక్షించారు. డీఈఓ శైలజ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాల పరిస్థితులను ఫొటోలు, వీడీయోలను తీసి సిద్ధం చేశామన్నారు. వీటి ఆధారంగా 9 రకాల వసతులను కల్పించి స్థితిగతులను మారుస్తామన్నారు. సమగ్ర శిక్ష అడిషినల్ ప్రాజెక్టు కోర్డినేటర్ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో భాగంగా 1059 స్కూల్స్ను ఎంపిక చేయడం జరిగిందన్నారు. డిప్యూటీ డీఈఓ జిలానీబాష, ఎంఈఓ పాలెం నారాయణ, సమగ్ర శిక్ష అభియాన్ ఈఈ కాంతయ్య, ఏపీఈడబ్లూఐడీసీ ఈఈ జనార్థన్రెడ్డి, వీసీఆర్ కోర్డినేటర్ రెహమాన్, హెచ్ఎం నాగమని తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం.. 1. బాల బాలికల నిష్పత్తి మేరకు మరుగుదొడ్లను నిర్మించడంతోపాటు నీరు అందుబాటులో ఉంచుతారు. 2. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సిబ్బందికి అవసరమైన çఫర్నీచర్ సమకూర్చుతారు. 3. తరగతి గదిలో విద్యుత్ సౌకర్యముంటుంది. ట్యూబ్ౖ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తారు 4. విద్యార్థులకు తాగునీరుగా మినరల్ వాటర్ అందించనున్నారు. 5. తరగతి గదులను ఆహ్లాదంగా రంగులతో తీర్చిదిద్దుతారు. 6. అవసరం ఉన్న మేర భవనాలకు మరమ్మతులు చేపడతారు. 7. విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులుంటాయి. 8. బ్లాక్ బోర్డులు సుందరంగా కనిపించేలా చర్యలు తీసుకుంటారు. 9. పాఠశాల భద్రతకు ప్రహరీ తప్పనిసరిగా నిర్మిస్తారు. -
‘ఆయన ఇంగ్లీషులో మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిందే’
సాక్షి, విజయవాడ : జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ ప్లస్ కన్వెన్షన్లో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. భారత మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యాదినోత్సవం నిర్వహిస్తున్నాం. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రోజునే అభివృద్ధి సాధ్యం. మా ప్రభుత్వం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మైనారిటీ విద్యార్థులకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇమామ్లకు రూ.10 వేలు, మౌజీలకు రూ.ఐదు వేలకు సీఎం జగన్ పెంచారు. దేశంలోనే తొలిసారిగా హజ్ యాత్రికలకు పూర్తి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. జెరూసలెం యాత్రికులకు కూడా ఆదాయాన్ని బట్టి అరవై, ముప్పై వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. చర్చి ఫాదర్లకు నెలకు ఐదువేలు ఇస్తున్నాం’అన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘విద్యాశాఖ, మైనారిటీ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. విద్యాభివృద్ధితోనే సమానత్వం వస్తుందని అంబేద్కర్ చెప్పారు. ఆయన స్పూర్తి తో సీఎం జగన్ అందరికీ విద్యను అందేలా కృషి చేస్తున్నారు. మైనారిటీలకు మంచి విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. వైఎస్ జగన్.. అంజాద్ బాషాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి.. గుర్తించారు. కార్పొరేట్ విద్యా సంస్థల కు పోటీగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యార్దులకు ప్రోత్సాహం అందించాలని జగన్ నిర్ణయించారు. వైఎస్ ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చి పేదలకు ఉన్నత విద్యను దగ్గర చేశారు. సీఎం జగన్ కూడా దళితులు, మైనారిటీ లకు మెరుగైన విద్యను అందించేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధి నిదర్శనం. దీనిపై కొందరు అవాకులు, చవాకులు పేలుతున్నారు. వైఎస్ జగన్ ఇంగ్లీషులో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయి. నారా వారు కూడా మాట్లాడతారు.. మనం చూశాం.. బ్రీఫ్ డ్ మీ అని. కమిషన్ల కోసం వందల, వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింద’అని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి, వెల్లపల్లి శ్రీనివాస్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి పాల్గొన్నారు. -
‘మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తాం’
సాక్షి, విజయవాడ: జనాబ్అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి ఏర్పాట్లను శనివారం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనాబ్అబుల్ కలాం ఆజాద్ జయంతిరోజు విద్యాదినోత్సవాన్ని, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. డాక్టర్ అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారానికి జాబితా సిద్ధమైనట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై జేసీ మాధవీలతకు అంజాద్ బాషా పలు సూచనలు ఇచ్చారు. -
‘జగన్ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఐదేళ్ల తర్వాత వైఎస్సార్ జిల్లాలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నా.. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. అసత్యాలు రాస్తే చట్టపరమైన చర్యలు.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఎల్లో మీడియా అసత్యాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇసుక ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలందరికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.. రెండు నెలలకొకసారి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. సమీక్షలు ద్వారా జిల్లా సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు నెలల పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేవుడి ఆశీర్వాదం వల్ల రాష్ట్రంలో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని.. తెలిసి కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఇసుక కొరత తీర్చేందుకు సీఎం ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారని వివరించారు. రోబో స్యాండ్ వినియోగంపై క్యాబినెట్లో చర్చించామన్నారు. ప్రతి ఒక్కరికి ఇసుక అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు డైరెక్షన్.. పవన్ యాక్షన్.. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని అంజాద్ బాషా ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో హోదాపై కానీ, ఇతర సమస్యలపై కూడా పోరాడలేదని.. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత పవన్కు లేదన్నారు. ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తుంటే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని దుష్ఫ్రచారాలు చేసినా.. వైఎస్ జగన్ పరిపాలన పట్ల ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని పేర్కొన్నారు. -
'కలాం పేరిట అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఫిలాన్తరోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలామ్ అవార్డ్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అటువంటి వ్యక్తి పేరు మీద అవార్డులు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవార్డు అందుకొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారు. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేన్లు కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదేనని మంత్రి వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నా సామాన్య జీవితం గడిపిన అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. కలాం ఆశయాలను జగన్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజికి న్యాయానికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడే ఉన్నారని పేర్కొన్నారు. -
ప్రభుత్వాల జోక్యం సరికాదు: అంజాద్ బాషా
సాక్షి, విజయవాడ : మనోభావాలకు సంబంధించిన మత ఆచార వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యం సరికాదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. మతాలకు అతీతంగా అభివృద్ధి జరిగి, అవకాశాలు మెరుగు పరిచినపుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని కె హోటల్లో జరిగిన మిల్లి కౌన్సిల్ 20వ జాతీయ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. భారతదేశంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్యపరమైన సమస్యలపై ప్రజాసామ్య పద్ధతులలో పరిష్కరించడం, భిన్నత్త్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ పనిచేయడం ఈ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యానికై ప్రాణ త్యాగాలు చేసిన వారిలో ముస్లిం మేధావులు, మత పెద్దలు, సామాన్య ప్రజలు సైతం ఉన్నారన్నారని తెలిపారు. అదే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాసామ్య దేశమైన భారతదేశంలో ప్రతీ ఒక్కరు తమ మతాచారాలు, సంప్రదాయాలను స్వేఛ్చగా ఆచరించుకొనే వెసలుబాటు ఉందన్నారు. అయితే కొన్ని ప్రభుత్వాలు ముస్లింల షరియత్, ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ముస్లింలను రెండవ శ్రేణి పౌరులుగా భావించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఇక దేశంలోని ముస్లింలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలలో నిరక్షరాస్యత, పేదరికం, వరకట్న దురాచారం, నిరుద్యోగం ముఖ్యమైనవన్నారు. ప్రభుత్వాలతో కలసి ప్రజాసామ్య పద్ధతులలో సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు.. భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాషా పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ముస్లిం మేధావులతో పాటు కర్నూలు ఎమ్యెల్యే హఫీస్ ఖాన్, ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు, మత పెద్దలు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ రైతుభరోసా విప్లవాత్మకమైన మార్పు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి వైస్సార్ రైతు భరోసా కార్యక్రమ అమలుకు శ్రీకారం చుట్టారని డిప్యూటి సీఎం ఆళ్లనాని అన్నారు. మంగళవారం ఆయన ఏలూరులో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు అధ్యాయంలో వైఎస్సార్ రైతుభరోసా విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఈ పథకాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు రెండు లక్షల 23వేల మంది రైతులుకు వైస్సార్ రైతు భరోసా సాయం అందుతుందని వెల్లడించారు. వైస్సార్ కంటి వెలుగు ఒక చారిత్రత్మమైన కార్యక్రమమని ఈ పథకానికి ప్రభుత్వం సుమారు రూ. 560 కోట్లను కేటాయించిందన్నారు. రైతులుకు 9గంటలు విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతులు ఆత్మహత్యలుకు పాల్పడకూడదని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదని నాని పేర్కొన్నారు. కడప: ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రడ్డి అమలు చేస్తున్నారని డిప్యూటి సీఎం అంజాద్ బాషా అన్నారు. ఆయన మైదుకూరు మండలలోని తెలుగు గంగ ప్రాజెక్టు కాలనీలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో 2020 మే నెల నుంచి ఇస్తామన్న రైతు భరోసాను ఎనిమిది నెలల ముందే చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నామని తెలిపారు. కౌలు రైతులతో సహా రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, రైతులు పాల్గొన్నారు. విజయవాడ: రైతు కళ్లల్లో ఆనందం నింపేందుకు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం ఆయన కుందా వారి కండ్రికలో వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కర్షకుల కష్టాలు చూసి మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రైతులకి చంద్రబాబు ద్రోహం చేస్తే.. రైతు సంక్షేమంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ నమ్మారని పేర్కొన్నారు. పెనమలూరు: దేశంలోనే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందచేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదే అని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. మంగళవారం ఆయన ఉయ్యూరులో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం తమదేనని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. సీఎం జగన్ ఒక అడుగు ముందుకేసి పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ.13,500 పెంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేతోపాటు సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్, అధికారిలు, రైతులు పాల్గొన్నారు. పెడన: కృష్ణాజిల్లా పెడన పట్టణంలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని మంగళవారం ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేకు వేలాది మంది రైతులు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళావారం మర్కెట్ యార్డులో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మర్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ స్టాల్స్ను పరిశీలించారు. ప్రకాశం: జిల్లాలోని సంతనూతలపాడు మార్కెట్ యార్డులో నిర్వహించిన వైఎస్సార్ రెైతు భరొసా పథకాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మొదటి విడత చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన వ్యవసాయ శాఖకు సంబంధించిన స్టాల్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గోన్నారు. విశాఖప్నం: జిల్లాలోని చీడికాడలో నిర్వహించిన వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పభకాన్ని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సందీప్, రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు కిలపర్తి భాస్కరరావు, రాజారాం, కర్రి సత్యం, బూరే బాబురావు, ఎర్రా అప్పారావు, రాజుబాబు పాల్గొన్నారు. రైతు శ్రేయస్సు కోసమే నిరంతరం పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి అని పాడేరు ఎమ్మెల్యే కోటగెళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం జిల్లాలోని చింతపల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఐటీడీఏ పీఓ బాలాజీ, ఎంపీడీఓ ప్రేమకర్ పాల్గొన్నారు. ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని చెప్పిన గడువుకు ముందే ప్రారంభించడం తన చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుల రుణమాఫీ పేరుతో ఐదేళ్లు రైతులను మభ్యపెట్టిందని విమర్శించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. చోడవరం: విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు, ఎమ్మెల్యే కరణం ధర్మ, రైతులు, అధికారలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అరకు: గిరిజన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీటి వేస్తుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. మంగళవారం ఆయన అరకులో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 56 వేల మంది రైతులకు రైతు భరోసా ద్వారా వ్యవసాయ పెట్టుబడి సాయం అందుతుందని తెలిపారు. రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం: జిల్లాలోని శింగణమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధికారులు, రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు భరోసా పథకం కింద అదనంగా రూ. వేయి పంపుపై రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి రైతులకు కృతజ్ఞతగా వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. చిత్తూరు: రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, రైతులు, అధికారులు, వైఎస్సార్పీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాప్తాడు: అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. రైతుల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్న రోజని కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నిర్వహించని వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిపాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన నాలుగు నెలల కాలంలో ఏ సీఎం అమలు చేయని పధకాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని తెలిపారు. హిందూపురం: దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రైతులను తన భుజాల మీద మోసి వ్యవసాయం అంటే పండుగ అని తెలియచేశారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆయన మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన అసత్య హామీలతో మోసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎం ఆయినాక వానలు వచ్చి చెరువులు నిండి రాష్ట్రమంతా జలకళలో నిండి ఉందని మాధవ్ తెలిపారు. ప్రకాశం: జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో నిర్వహించిన వైస్సార్ రైతు భరోసా పథకాన్ని ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. 37 వేల 925 మంది రైతుకలు రైతు భరోసా పధకం ద్వారా 51 కోట్ల రుణాలను ఎమ్మెల్యే అందజేశారు. -
‘సీఎం జగన్ వల్లనే ముస్లింల స్వప్నం నెరవేరింది’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన తరువాత విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లాలనుకున్న ముస్లింల చిరకాల స్వప్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వల్లనే నెరవేరిందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. 2020 ఏడాదికిగాను హజ్ యాత్ర తొలి దరఖాస్తును డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గురువారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 13 జిల్లాకు చెందిన ముస్లిం మత పెద్దలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమం, అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. 2020 హజ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులకు నవంబర10 చివరి తేదీ అని చెప్పారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం తరఫును అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. రూ. 3 లక్షలలోపు ఆదాయం ఉన్న యాత్రికులకు రూ. 60వేలు, అంతకు మించి ఆదాయం ఉన్నవారికి రూ. 30వేలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. క్యాబినేట్ ఆమోదం పొందిన తరువాత ఈ సాయం యాత్రికులకు అందజేస్తామని పేర్కొన్నారు. విజయవాడకు ఎంబార్క్ పాయింట్ కేటాయించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వికి ఏపీ ప్రభుత్వం తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని పథకం ఇది
సాక్షి, వైఎస్సార్ జిల్లా : దేశంలోని ఏరాష్ట్రం కూడా ఆటో డ్రైవర్లను గుర్తించలేదని కానీ మన ముఖ్యమంత్రి వారి కష్టాలను తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం పదివేల రూపాయలను వారి ఖాతాల్లో వేసారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 8536 మంది డ్రైవర్లకు ఆర్ధిక సహాయం విడుదల చేశారని వెల్లడించారు. ప్రభుత్వం తరపున మొట్టమొదటి కార్యక్రమంగా వైఎస్సార్ వాహనమిత్ర నిలవడం సంతోషకరమనం వ్యాఖ్యానించారు. త్వరలో అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలను అందించబోతున్నామని తెలిపారు. గత పాలన మొత్తం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని విమర్శించారు. అవినీతి రహిత పాలన దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు. -
‘దద్దమ్మల పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీనే’
సాక్షి, కడప : క్రిమినల్ కేసులు నమోదైన టీడీపీ కార్యకర్తకు మాజీ సీఎం చంద్రబాబు వంత పాడటం విడ్డురంగా ఉందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా దుయ్యబట్టారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, పార్లమెంటరీ అధ్యక్షుడు సురేశ్బాబులతో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మైదుకూరు బి.మఠంకు చెందిన టీడీపీ కార్యకర్త ముద్దు కృష్ణంనాయుడుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడులు చేశారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ముద్దు కృష్ణంనాయుడుపై ఎన్నో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అలాంటి వ్యక్తికి బాబు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన కృష్ణంనాయుడిని మైదుకూరు టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ముద్దు కృష్ణంనాయుడుపై ఉన్న ఆరోపణలు రుజువు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామంలో జరిగిన చిన్న ఘర్షణపై సీఎం స్పందించాలని కోరడం విడ్డురంగా ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్గా టీడీపీ వ్యవహరించిందని.. దద్దమ్మల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమేని అంజాద్ బాషా విమర్శించారు. టీడీపీ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. గతంలో టీడీపీలో ఉన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని అన్నారు. సచివాలయ ఉద్యోగాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని, సీఎం జగన్కు పెరిగిపోతున్న ప్రజాదరణ ఓర్వలేకే టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. -
‘గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన’
సాక్షి, కడప : గాంధీ జయంతి సందర్భంగా ఆయన కన్న కల ‘గ్రామ స్వరాజ్యాన్ని’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేశారని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెత్తం 1.60 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతి గ్రామ సచివాలయంలో 10మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామ సచివాలయం ద్వారా ప్రజల వద్దకే పాలన వెళ్లనుందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో నవరత్నాల పథకాలు అమలు చేయాలని కృషి చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్ ఒక్కరేనని పేర్కొన్నారు. కౌలు రైతులకు మేలు కలిగేలా ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని, భూ చట్టం ద్వారా రీ సర్వే చేయించనున్నామని, దీని ద్వారా భూ సమస్యలను తగ్గించడానికి సులభంగా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. మానిఫేస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని 100 రోజుల్లో అమలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ ఉగాదికి 25 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసిన భూములను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్ర చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి కూడా మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకుని చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్నారని అన్నారు. గాంధీ కలలు కన్న స్వరాజ్యాన్ని సీఎం జగన్ నేరవేరుస్తున్నారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో పేజీ పేజీలు లేదని... రెండు పేజీల మ్యానిఫెస్టో మాత్రమే ఇచ్చామన్నారు. మూడు నెలల లోపే 85 శాతం మానిఫెస్టోని అమలు చేసామని, జగన్ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తన పచ్చమీడియా ద్వారా దుష్పచారం చేస్తున్నారని.. బాబు అక్రమ ఇంట్లో ఉంటూ ఇప్పటి వరకు దానిపై నోరు తెరవలేదని అన్నారు. చంద్రబాబు కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రాడని విమర్శించారు. ఇప్పటికిప్పుడు జగన్ పేరు, చంద్రబాబు పేరు మీద ఓటింగ్ పెడితే 99 శాతం ఓట్లు జగన్కే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన మధ్యపాలసీ అమలు చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక అందించాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు. -
'ఏపీలోనూ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్'
సాక్షి, విజయవాడ: తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో సైతం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. గురువారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల జీవన శైలిలో మార్పుకు కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని, మైనార్టీలకు పెద్ద పీట వేసేలా ఆయన పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. పేద ప్రజలకు సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే పాస్టర్లకు 5 వేలు గౌరవ వేతనం, మౌజన్, పేషమామ్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 8 వేల నుంచి 15 వేలకు పెంచామని అన్నారు. అంతేకాక జెరుసలేం, హజ్ యాత్రకు వెళ్లే వారికి సైతం 3లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుని 60వేలు, ఆపైన వారికి 30వేలు ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇప్పటికే 80 శాతం నెరవేర్చామని ఆయన తెలిపారు. మైనార్టీ శాఖలో ఉన్న అన్ని శాఖలను ఒకే దగ్గరికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వమిచ్చే వైఎస్సార్ షాది-కా-తోఫాను 50 వేల నుంచి లక్షకు పెంచామని పేర్కొన్నారు. మైనార్టీ, క్రిస్టియన్లకు వైఎస్సార్ బీమా కింద 5 లక్షలు అందజేస్తున్నామని గుర్తుచేశారు. మైనార్టీ శాఖలో ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ నిర్వహించి, సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటి క్యాబినేట్లోనే ఏపీ సీఎం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు కేటాయించారని అన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని.. గ్రామ, వార్డు సచివాలయాలలో లక్షా 26 వేల శాశ్వత ఉద్యోగాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఈడీలు, వివిధ విభాగాల హెచ్ఓడీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలంటే విద్య చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను తెలంగాణ తరహాలోనే ఏపీలో సైతం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు హాస్టల్స్తో పాటు అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండీ ఇలియస్ రిజ్వీ, స్పెషల్ కమిషనర్ శారదాదేవి, మైనార్టీ కార్పొరేషన్ ఎండీ ఏసురత్నం, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ముస్లింల ఆత్మ బంధువు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లతో నిరుపేద ముస్లిం కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యావంతులుగా ఎదిగారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్ బాషా పేర్కొన్నారు. పొన్నూరురోడ్డులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో బుధవారం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ‘‘మైనార్టీ యువత ఉన్నత విద్య–నైపుణ్యాభివృద్ధి’’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి పాటుపడిన నేత ఎవరైనా ఉన్నారంటే ఆది వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని స్పష్టం చేశారు. నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన తీసుకున్న మహత్తరమైన చర్యలతో ముస్లిం సమాజం విద్య, ఉద్యోగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి బాటలో ముందుకు వెళ్తూ ముస్లిం, మైనార్టీ వర్గాల సంక్షేమానికి శాశ్వతరీతిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కేబినెట్లో 50 శాతం పదవులను బడుగు, బలహీన వర్గాలకు కేటాయించడంతో పాటు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఉప ముఖ్యమంత్రులుగా పదవులు కట్టబెట్టారన్నారు. ఆంధ్ర ముస్లిం కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందిస్తామని చెప్పారు. కర్నూలులోని ఉర్దూ యూనివర్శిటీ స్టడీ సెంటర్ను గుంటూరులో ఏర్పాటు చేస్తామని చెప్పారు.గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ముస్లింలకు ఉన్నత పదవులు కట్టబెట్టిన ఘనత సీఎం జగనమోహన్ రెడ్డికే చెందిందని అన్నారు. కళాశాల కరస్పాండెంటు షేక్ సుభాని మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో ముస్లిం, మైనార్టీలు సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నారని చెప్పారు. అనంతరం కళాశాల యాజమాన్యం అంజాద్ బాషాను ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్గాంధీ, మహ్మదీయ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు సమీవుల్లా షరీఫ్, ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర ఎండీ మస్తాన్వలీ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్కుమార్, షేక్ గౌస్ పాల్గొన్నారు. లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వ శాఖల్లో ఒకేసారి 1.26 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తూ దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి షేక్ అంజాద్ బాషా అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల్లో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కరకట్టను ఆనుకుని అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల పరిపాలనలో ఎల్లో మీడియా అండతో అవాస్తవాలను ప్రచారం చేస్తూ చంద్రబాబు పాలన సాగించారని మండిపడ్డారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని నదులు పొంగి వరదలు సంభవిస్తే అందులోనూ బురద రాజకీయాలు చేశారన్నారు. -
జగన్తోనే మైనారిటీల అభివృద్ధి
ఏపీ చరిత్రలో మొదటిసారిగా మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. విశాఖలో మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముస్లింల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీల సంక్షేమానికి అధిక నిధులు కేటయించా మని చెప్పారు. జిల్లాలో వక్ఫ్బోర్డు ఆస్తులు, మసీద్, దర్గాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ముస్లింలను ఇబ్బందులకు గురిచేశారని, ప్రశ్నించిన వారిపై అక్రమకేసులు పెట్టి వేధించారని గుర్తుచేశారు. రాబోయే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతునిచ్చి గెలిపించాలని కోరారు. ముస్లింలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం : మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా చెప్పారు. వుడాచిల్డ్రన్ థియేటర్లో ఆదివారం వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ పరూఖీ ఆధ్వర్యంలో ఆత్మీయ సభ నిర్వహించారు. అంతక ముందు మైనారిటీల సమస్యలపై ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం మంత్రి అంజాద్బాషా మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్బోర్డుల ఆస్తులపై ఉన్న వివాదాలతో పాటు మసీదులు, దర్గాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్తో జరిగిన సమావేశంలో మైనారిటీ సబ్ ప్లాన్పై చర్చించినట్టు చెప్పారు. అలాగే హజ్ యాత్రకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటా యించారని వివరించారు. నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని .. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ రెట్టి పథకాలు అమలు చేస్తూ మైనారిటీలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. హామీల అమలు దిశగా కార్యాచరణ ప్రజాసంకల్పయాత్రలో ముస్లింలకు ఇచ్చిన హామీ అమలు చేసేవిధంగా సీఎం జగనన్న చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ముస్లింల కు ఏ సమస్యలొచ్చినా పరిష్కారానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. అదే సందర్భంలో త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి మైనారిటీలంతా శక్తి వంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నా«థ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన మైనారి టీలు ఉత్తరాంధ్రలోనే ఉన్నారని, వారి అభివృద్ధికి తోడ్పడాలని ఉపముఖ్యమంత్రిని కోరారు. ఎక్కువ శాతం నిధులు ఉత్తరాంధ్రలో వెచ్చించా లని కోరారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ సిటీ స్టేక్హోల్డర్స్ ముస్లింలని.. వారి అభివృద్ధికి సీఎం జగన్ ముందుంటారని చెప్పారు. విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేయాలని ఆలోచనలో సీఎం ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి అంజాద్ బాషాను సన్మానిస్తున్న పార్టీ నాయకులు, ముస్లిం నేతలు ముస్లింలను వంచించిన టీడీపీని నమ్మవద్దని నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్ మాట్లాడు తూ వెనకబడిన ఉత్తరాంధ్రలో ముస్లింలకు అత్యధికంగా నిధులు వెచ్చించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు మా ట్లాడుతూ ముస్లింలకు ఐదు సీట్లు ఇస్తే నాలుగు గెలిచారని, ఓడిపోయిన ఆ ఒక్కరికీ ఎంఎల్సీ ఇచ్చారంటే ఆ వర్గంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. సమన్వయకర్త కేకేరాజు, అధికార ప్రతినిధి ప్రసాదరెడ్డి, ఎంఏ ఖాన్, పార్టీ మైనా రిటీ విభాగం విశాఖ పార్లమెంట్, నగర అధ్యక్షుడులు బర్కత్ అలీ, షరీఫ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి, పార్లమెం ట్ జిల్లా మహిళా అధ్యక్షరాలు పీలా వెంకటలక్ష్మి, ముఖ్యనేతలు బాబా, అజంఅలీ, షేక్బాబ్జి పాల్గొన్నారు. -
'డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుంది'
సాక్షి, విశాఖపట్నం : ఏపీ చరిత్రలో మొదటిసారి ఓ మైనార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. విశాఖలో ఆదివారం జరిగిన మైనారిటీ సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో ముస్లింలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కేవలం ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించి వైఎస్సార్ మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. వైఎస్సార్ సాధికారత కింద పేద ముస్లింలకు హజ్ యాత్ర కింద ప్రత్యేక నిధులు కేటాయించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకు నిధులు కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు.