Amrapali
-
AP: టూరిజం ఎండీగా ఆమ్రపాలి.. తెలంగాణ ఐఏఎస్లకు పోస్టింగ్లు
సాక్షి,విజయవాడ: తెలంగాణ నుంచి ఇటీవలే వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదివారం(అక్టోబర్ 27) ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఆమ్రపాలి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిమోహన్, వైద్య ఆరోగ్య కమిషనర్గా వాకాటి కరుణ, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఐఏఎస్ అధికారి రొనాల్డ్రోస్కు ఇంకా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా, ఏపీకి కేటాయించిన తమను తెలంగాణలోనే కొనసాగించాలని ఐఏఎస్ అధికారులు పెట్టుకున్న అభ్యర్థనను కేంద్ర డీఓపీటీ శాఖ తిరస్కరించడంతో వీరు ఏపీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా -
ఆమ్రపాలి.. ఆంధ్రాకే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఎవరికి కేటాయించిన రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని ఇటీవల డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ మరికొందరు ఐఏఎస్ అధికారులతోపాటు ఆమ్రపాలి కూడా క్యాట్ను ఆశ్రయించగా, బుధవారంలోగా ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆమె ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.క్యాట్ ఈ నిర్ణయంతో ఏపీకి వెళ్లాల్సిన వారు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. డీవోపీటీ ఆదేశాల కనుగుణంగా యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశించడంతో, హైకోర్డు ఎలాంటి ఆదేశాలిస్తుందో తెలియనందున ముందైతే ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల వరకు వేచి చూడనున్నారు. ఏపీకి వెళ్లినా, రెండు రాష్ట్రాల పరస్పర అవసరాలు, ఒప్పందాలతో తిరిగి తెలంగాణకు రప్పించే అవకాశాలూ ఉంటాయనే ప్రచారం మొదలైంది. బల్దియా బాస్ ఎవరో.. మరోవైపు, ఆమ్రపాలి స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఎవరిని నియమించనున్నారనేది జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. సీనియర్ ఐఏఎస్ను నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ గురించి, నగర నైసర్గిక స్వరూపం గురించి పూర్తిస్థాయి అవగాహన ఉన్నవారిని నియమించగలరనే ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీని మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఆ ప్రక్రియ జరిగేంతదాకా సీనియర్ ఐఏఎస్ అధికారి అవసరమని అర్బన్ప్లానింగ్ నిపుణులు అంటున్నారు.ఎక్కువ కార్పొరేషన్లుగా విభజన జరిగాక ఎవరున్నప్పటికీ, కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యేంత వరకు తగిన అనుభవమున్న సీనియర్ ఉండాలంటున్నారు. 2025 చివర్లో, లేదా 2026 ఆరంభంలో జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికలోగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యే అవకాశమున్నందున, అప్పటివరకు సీనియర్ అధికారి అవసరమంటున్నారు. ప్రస్తుతానికి.. కొంత కాలం వరకు ఎవరైనా సీనియర్ అధికారికి జీహెచ్ఎంసీ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలప్పగించవచ్చుననే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: ఆ ఐదుగురు ఐఏఎస్లకు బిగ్ షాక్ -
ఏపీలో మేం పని చేయలేం ఐఏఎస్ అధికారుల విముఖత
-
TG: ఆమ్రపాలికి కేంద్రం షాక్
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆమ్రపాలితో పాటు తెలంగాణ కేడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ 11 మంది ఐఏఎస్లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్రోస్ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరి విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఇదీ చదవండి: ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్కుమార్ -
Ghmc: పోస్టర్లు బ్యాన్..ఆమ్రపాలి కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో వాల్ పోస్టర్లు బ్యాన్ చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం(సెప్టెంబర్27) సర్క్యులర్ జారీ చేశారు. జీహెచ్ఎంసీలో వాల్ పోస్టర్లు,వాల్ పెయింటింగ్స్ పై సీరియస్గా వ్యవహరించాలని సర్క్యులర్లో పేర్కొన్నారు.సినిమాల పోస్టర్లు కూడా ఎక్కడా అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.ఒకవేళ ఆదేశాలను పట్టించుకోకుండా పోస్టర్లు వేస్తే మాత్రం జరిమానా విధించాలని సర్క్యులర్లో తెలిపారు.ఇదీ చదవండి: మూసీకి వరద..జీహెచ్ఎంసీ హై అలర్ట్ -
జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్గా ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లేందుకు సెలవు పొందడంతో ఆయన స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలిని నియమించారు. ఈ నెల 8,9 తేదీలు, తిరిగి 23వ తేదీ సెలవు దినాలను వినియోగించుకునేందుకు అనుమతితో పాటు 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోనాల్డ్ రాస్కు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 8వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆమ్రపాలికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వు జారీ చేశారు. -
ఐఆర్బీ టెండర్లపై సీఎం రేవంత్ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డు లీజు టెండర్లలో అక్రమాలపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించడంతో ఔటర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఔటర్ టోల్ లీజులో అక్రమాలకు బాధ్యులైన అధికారురులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఔటర్ లీజు వ్యవహారంపైన పూర్తి వివరాలను అందజేయాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ముఖ్యమంత్రి ఆదేశించారు. 158 కిలోమీటర్ల మార్గంలో టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఔటర్ రింగ్రోడ్డును గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఐఆర్బీ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు, పీసీసీ చీఫ్గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. కనీస ధర వెల్లడించకపోవడంతో ఔటర్లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపించారు. రేవంత్రెడ్డి ఆరోపణలపైన అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ ఆయనపైన పరువునష్టం దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పదంగా మారిన ఔటర్ లీజు అంశాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి సీరియస్గా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సమగ్రమైన విచారణ చేపట్టాలని ఆయన హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఓటీ పద్ధతిలో ఔటర్ లీజు... కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ (టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఔటర్ రింగ్రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు 2022 ఆగస్టు11వ తేదీన గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదే సంవత్సరం నవంబర్ 9వ తేదీన అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహా్వనించింది. గత సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి 11 బిడ్డర్లు ఆసక్తిని ప్రదర్శించారు. బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా మూడుసార్లు బిడ్ గడువును పొడిగించారు. 30 ఏళ్ల లీజుపైన బేస్ ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ వెల్లడించారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన బేస్ప్రైస్పైన మాత్రం గోప్యతను పాటించడంతో ఈ లీజు వ్యవహారం వివాదాస్పదమైంది. మొదట్లో 11 సంస్థలు పోటీ చేయగా, చివరకు 4 సంస్థలు మాత్రమే పోటీలో మిగిలాయి. ఆ నాలుగింటిలోనూ ఐఆర్బీ ఎక్కువమొత్తంలో బిడ్ వేసి లీజును దక్కించుకుంది. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్రోడ్డు మార్గంలో ప్రతి రోజు 1.5 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అప్పట్లో గత ప్రభుత్వం నిర్దేశించిన అంచనాల కంటే ఎక్కువ మొత్తంలో ఐఆర్బీ సంస్థకు టోల్ ఆదాయం లభిస్తున్నట్లు అధికారవర్గాల అంచనా. మరోవైపు ఏటా సుమారు రూ.550 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కామధేనువు వంటి ఔటర్ను ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం పట్ల ఇంజనీరింగ్ నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గడువు కంటే ముందే రూ.7380 కోట్లు చెల్లించిన ఐఆర్బీ... ఇలా వివాదాల నడుమ ఔటర్ టెండర్ను దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ నిర్ణీత 120 రోజుల గడువు కంటే ముందే రూ.7380 కోట్ల లీజు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించింది..దీంతో 2008 నుంచి 2023 వరకు వరకు సుమారు 15 సంవత్సరాల పాటు హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఔటర్రింగ్ రోడ్డు మొట్టమొదటిసారి ప్రైవేట్ సంస్థ నిర్వహణలోకి వెళ్లిపోయింది. నిబంధనల మేరకు రానున్న 30 ఏళ్ల పాటు ఈ లీజు కొనసాగవలసి ఉంటుంది. 8 వరుస లేన్లతో (1264 లేన్ కి.మీలు) కూడిన 158 కి.మీల ఔటర్ రింగ్రోడ్డుపైన ఉన్న సుమారు 120కి పైగా టోల్గేట్ల వద్ద ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్వే సంస్థ టోల్ వసూళ్లను కొనసాగిస్తోంది. ఔటర్ రింగురోడ్డు నుంచి టోల్ వసూలు చేయడంతో పాటు రహదారుల నిర్వహణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, తదితర ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతలను కూడా గోల్కొండ ఎక్స్ప్రెస్ వే చేపట్టవలసి ఉంటుంది. హెచ్జీసీఎల్ ఔటర్ను ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లు, ఔటర్ మాస్టర్ప్లాన్ అమలు, పచ్చదనం పరిరక్షణ వంటి బాధ్యతలకు పరిమితమైంది. -
ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
హైదరాబాద్: హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ ఉత్తర్వులు విడుదల చేశారు. హెచ్జీసీఎల్ ఇన్చార్జి ఎండీగా విధులు నిర్వహించిన అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తన పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమ్రపాలికి హెచ్జీసీఎల్ నిర్వహణ, పర్యవేక్షణపై ఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆమె ఔటర్రింగ్రోడ్డు ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్గా, స్పెషల్ కలెక్టర్గా కూడా విధులు నిర్వహించనున్నారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీకి ఎండీగా కూడా ఆమె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
IAS Amrapali: బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: డ్యాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్గా పేరున్న ఆమ్రపాలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్గా ఇవాళ సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. బదిలీ ద్వారా పదోన్నతితో హెచ్ఎండీఏకు ఆమె నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను అభినందించారు. హెచ్ఎండిఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆపై మూసి రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు. హెచ్ఎండీఏకు ఉన్నత పరిపాలనాధికారిగా కమిషనర్ మాత్రమే కొనసాగుతుండగా.. తాజాగా సంయుక్త కమిషనర్గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2019 నుంచి హెచ్ఎండీఏకు కమిషనర్గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కొనసాగుతున్నారు. హెచ్ఎండీఏను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో అర్వింద్ను హెచ్ఎండీఏలో కొనసాగిస్తారా.. ఆ స్థానంలో నూతన అధికారిని నియమించనున్నారా? అనే దానిపైనా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి
-
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీ.. ఆమ్రపాలికి ఆ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ జరిగింది. పదోన్నతుల బదిలీలుగా పేర్కొంటూ పలువురిని తన పేషీలో చేర్చుకుంది ప్రభుత్వం. ఊహించినట్లుగానే యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి బాధ్యతలు దక్కాయి. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఆమెను నియమించింది. డిప్యూటీ సీఎం ఓఎస్డీ(ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కృష్ణభాస్కర్, వ్యవసాయ కార్యదర్శిగా బి.గోపి, TSSPDCL (దక్షిణ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముషారఫ్ అలీ ఫరూకీని, ట్రాన్స్ కో జేఎండీ (జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్)గా సందీప్ కుమార్, TSNPDCL(ఉత్తర) వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్నాటి వరుణ్ రెడ్డి, ఎంపీడీసీఎల్కు సీఎండీగా క్రాంతి వరుణ్రెడ్డి, వైద్య..ఆరోగ్య శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ కమిషనర్గా శైలజా రామయ్యర్ను నియమించారు. విద్యుత్ డిపార్ట్మెంట్లోనే ఈ బదిలీలు ఎక్కువగా జరిగాయి. ఇంధన శాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమిస్తూ.. ట్రాన్స్కో చైర్మన్ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలూ అప్పజెప్పారు. ఇటీవలె డీ. ప్రభాకర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్రెడ్డిని కలిసి అభినందించాక.. ఆమ్రపాలికి ఏదో ఒక బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం విపరీతంగా జరిగింది. అందుకు తగ్గట్లే ఆమెకు హెచ్ఎండీఏ కమిషనర్ బాధ్యతల్ని అప్పజెప్పారు. -
ఆమ్రపాలి ఇన్ !..స్మితా సబర్వాల్ ఔట్
-
కొత్త సర్కార్ ప్లాన్!.. కేంద్ర సర్వీసులకు స్మితా.. రాష్ట్రానికి ఆమ్రపాలి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంలో కొత్త టీమ్పై ఫోకస్ పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇక, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. కాగా, తెలంగాణలో త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్లో మూడు కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇక, ఆయా శాఖల్లో పలువురు అధికారుల జాబితా కూడా సిద్దమైనట్టు తెలుస్తోంది. శాఖల సమీక్షలు పూర్తి కాగానే బదిలీలు ఉంటాయన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందనే చర్చ మొదలైంది. మరోవైపు.. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్ దరఖాస్తు పెట్టుకున్నట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం ఆమె.. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా సబర్వాల్ ఏ సమీక్షకు హాజరు కాకపోవడం గమనార్హం. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. తాజాగా స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన 23 ఏళ్ల కేరీర్ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఫొటోను షేర్ చేశారు. కొత్త ఛాలెంజ్కు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Some pics remind us how far we have come.. through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will! Thanks to all your love ♥️, ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv — Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023 ఇదిలా ఉండగా.. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి.. మహిళా ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం ఆఫీసుకు గుడ్ బై చెప్పాలనుకుంటే మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తుండగా.. ఇటు కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి.. రేవంత్ రెడ్డి టీమ్లో జాయిన్ కానున్నారు అనే చర్చ జరుగుతోంది. దీంతో, ఈ ఐఏఎస్ల అంశం ఆసక్తికరంగా మారింది. -
నేర్చుకున్నది ఎప్పటికీ వృధా కాదు!
ఇతిహాసాల్లోని పాత్రలకు తమ అభినయంతో వెండితెర మీద ప్రాణం పోయడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పరీక్షలో నెగ్గి.. సీతగా జీవించింది కృతి సనన్ ‘ఆదిపురుష్’లో! ఆ టాలెంట్కి ఫ్యాషన్ స్టయిల్ని క్రియేట్ చేసే చాన్స్ దక్కించుకున్న బ్రాండ్స్లో కొన్ని ఇక్కడ.. అర్పితా మెహతా... సాధారణంగా చాలా మంది తల్లులు .. కూతుళ్లకు చీరకట్టి.. ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. కానీ అర్పితాకు మాత్రం అమ్మకు చీరకట్టడమంటే ఇష్టం. పండుగలు, వేడుకలకు అమ్మ, అమ్మమ్మకు చక్కగా చీరకట్టి.. అలంకరించి సంబరపడేది. అలా బాల్యంలోనే.. తన ప్యాషన్ ఫ్యాషనే అని గ్రహించి, పెద్దయ్యాక ముంబైలోని ఎన్ఎన్డీటీ యూనివర్సిటిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. 2009లో సొంత లేబుల్ ‘అర్పితా మెహతా’ను ప్రారంభించింది. వైవిధ్యమైన, ఆధునిక డిజైన్స్ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే వీటి ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. ఆమ్రపాలీ జ్యూలరీ ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్లో ‘ఆమ్రపాలీ’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. ఇందులో నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలూ ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్లో ఆభరణాలను రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలీ జ్యూలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలోనూ, మామూలు పీస్ అయితే అమ్రపాలి జ్యూలరీలోనూ లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్కి ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూలరీ బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. బ్రాండ్: అర్పిత మెహత చీర ధర: రూ. 2,50,000 బ్లౌజ్ ధర: రూ. 40,000. (చదవండి: రోజ్ ఫెస్టివల్..ఎటు చూసి గూలబీ పూల గుత్తులే..!) -
ఆమ్రపాలి సక్సెస్ జర్నీ.. స్వగ్రామం.. కుటుంబ నేపథ్యం ఇదే..
ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్.అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్ కేడర్లో 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కలెక్టర్గా పనిచేశారు. 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్గా కూడా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో జాయింట్ సీఈఓగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. చిన్న వయసులో.. ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ఇటీవల నియమించారు. అపాయింట్మెంట్ ఆఫ్ కేబినెట్ సెలక్షన్ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. అతి చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్ 23 వరకు అంటే మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఆమ్రపాలి ఫ్యామిలీ గురించి.. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్.అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం ఆయన డయ్యూ, డామన్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి. ప్రస్తుతం కర్నాటక కేడర్లో ఇన్కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. తమిళనాడు క్యాడర్ ఐఏఎస్కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉప ఎన్నికకు రెండుసార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఆమ్రపాలి మనసులో మాట.. స్త్రీ జీవితం చుట్టూ పెనవేసుకున్న నిబంధనలు, ఆచార వ్యవహరాలపై ఆమ్రపాలి ఓ సందర్భంలో స్పందిస్తూ... పుట్టడం, పెరగడం, చదువు, పెళ్లి, ఉద్యోగం ఇలా అన్ని విషయాల్లో మహిళలు అనేక ఆంక్షల మధ్య జీవిస్తున్నారు. ఈ ఆంక్షల కారణంగా ఎంతో ప్రతిభావంతులు సైతం ఇంటికే పరిమితం అవుతున్నారు. భరించలేని బాధలను పంటి బిగువున అదిమి పెడుతున్నారు. అందరితో మంచి అనిపించుకోవాలనే ఆత్రుతతో తమని తాము కోల్పోతున్నారు..’ అంటారు. ఒక్క రోజులో ఈ ప్రపంచాన్ని మార్చలేమని, వ్యక్తిగత స్థాయిలో మార్పును ఆహ్వానిస్తే అతి త్వరలో సామాజిక మార్పు, తద్వారా మహిళల జీవితాల్లో మరింత వెలుగు తీసుకురావచ్చనేది ఆమె అభిప్రాయం. ఓ కలెక్టర్గా నా దగ్గరకు వివిధ సమస్యలతో వచ్చే మహిళలో చాలా మందిని గమనించా.. పెళ్లైన తర్వాత భర్త సరిగా చూసుకోవడం లేదు. ఇబ్బంది పెడుతున్నాడు, భర్త, అతని కుటుంబం నుంచి కష్టాలు వస్తాయని చెప్పిన వారే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం బయటి నుంచి చూపించడం కష్టం. తన కాళ్ల మీద తాను నిలబడగలను అనే ధైర్యం ఉన్నప్పుడు పరిష్కారం త్వరగా వస్తుంది. పెళ్లి చేసుకుంటే నా జీవితం సెట్ అయిపోతుంది, నా భర్తే అంతా చూసుకుంటారు అనే ఆలోచణ ధోరణి కంటే నా కాళ్ల మీద నేను నిలబడతాను అనే వైఖరి అమ్మాయిల్లో రావాలి. జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైనది. తల్లిదండ్రులు, బంధువులు.. అంతా కలిసి పెళ్లి విషయం చూసుకుంటారు. పెళ్లి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టే బదులు ఆర్థిక స్వాతంత్ర సాధించే దిశగా పదో తరగతి నుంచి అమ్మాయిలు ఆలోచించడం మేలు. తెలివితేటలు అభిరుచికి తగ్గ చదువు, నైపుణ్యం పెంచుకోవాలి. ఉద్యోగం లేదంటే కుట్లు,అల్లికలు.. ఇలా క్రియేటివ్ వర్క్ ఏదైనాచేస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడాలి. నా విషయానికి వస్తే కేరీర్ విషయంలో.. సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి కేరీర్ ఎంచుకోవాలనే అంశంపై చాలా మందికి స్పష్టత ఉండదు. మన వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, ఇష్టాఇష్టాలను బేరీజు వేసుకుని ఏ తరహా కెరీర్ ఎంచుకోవాలనేది తెలుస్తుంది. అందులో బెస్ట్గా ఉండేదాన్ని సాధించాలనే గోల్ పెట్టుకోవాలి. నా విషయానికి వస్తే కేరీర్ విషయంలో నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. నువ్వు అమ్మాయివి ఇలాంటి చదువే నీకు కరెక్ట్ అనలేదు. పని ప్రదేశాల్లో... ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల్లో మహిళలు పని చేస్తున్నారు. ఇక్కడ స్త్రీ, పురుషులకు ఒకే రకమైన సదుపాయాలు ఉంటున్నాయి. పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. ఉదాహరణకు కార్యాలయంలో పని చేసే ఓ మహిళ తన పసిబిడ్డకు పాలు పట్టించేందుకు ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. క్లీన్ అండ్ సేఫ్ టాయిలెట్స్ పెద్ద సమస్య. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. సామాజిక కట్టుబాట్లు, ఆచారాలకు అమ్మాయిలు లొంగి ఉండాలి అనేట్టుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం నేర్పుతుంది. దీంతో అమ్మాయిలు లొంగి ఉండటం, సర్థుకుపోవడం వంటివి వంటబట్టించుకుంటారు. ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, అందరితో మంచి అనిపించుకోవాలి. అణుకువగా ఉండాలి అంటే. బీ కూల్, బీ నైస్ అని చెబుతారు. అబ్బాయిల విషయంలో అగ్రెసివ్గా ఉండు, నువ్వు ఏం చేసినా ఏం కాదు.. భయపడకు అని చెబుతారు. ఇలా మొదటి నుంచి పిల్లల పెంపకం (కండీషనింగ్)లోనే తేడాలు ఉంటాయి. ప్రపంచంలో అందరికీ నచ్చేట్టు ఎవ్వరూ బతకలేరు. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం మంచిగా బతకడం ముఖ్యం, ఆ తర్వాత పక్కన వాళ్లు. లీగల్, సోషల్ కౌన్సిలర్లు ఈ అంశంపై మహిళలతో మాట్లాడి వారిలో మార్పును తీసుకువస్తున్నారు. తరతరాలు ఉన్న పద్ధతిని ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా మార్చలేము. నెమ్మదిగా అయినా మార్పు వస్తుంది. ఇక్కడ చాలా బెటరే...కానీ అమ్మాయిల రక్షణ విషయంలో దేశంలో మన హైదరాబాద్ నగరం ఎంతో ముందంజలో ఉంది. పాలన వ్యవహారాలు, వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ, బెంగళూరులకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది పరిశీలిస్తాను. ప్రభుత్వ పనులు పక్కన పెడితే నేను ఓ సాధారణ మహిళనే. ఈ రెండు పరిస్థితుల మధ్య తేడా ను పోల్చి చూసినప్పుడు ఢిల్లీ, బెంగళూరుల కంటే హైదరాబాద్ మహిళల రక్షణ విషయంలో మెరుగైన స్థితిలో ఉంది. బెంగళూరు, ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్ మాటలను బట్టి.. ఏదైనా ఆపద వచ్చినా ఇబ్బందుల్లో ఉన్నా.. వారికి న్యాయం జరగాలంటే ఎన్ని ఫోన్ కాల్స్ చేయాలి.. ఎంత మందిని కలవాలి అనేది బేరీజు వేస్తాను. మన రాష్ట్రంలో కలెక్టర్గా కాకుండా ఓ సాధారణ మహిళగా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు షీ టీమ్స్ వస్తాయి. ఇలాంటి రక్షణ దేశంలో ఇతర ప్రాంతాల్లో లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అమ్మాయిలను వేధించే, టీజ్ చేసే వాళ్లు అన్ని చోట్ల ఉంటున్నారు. వ్యక్తిగత స్థాయిలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే అమ్మాయి ప్రభుత్వ పాఠశాలల అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్పై శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం పీఈటీలకు స్వశక్తి టీమ్లతో ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. ప్రభుత్వ ఉద్యోగమే.. మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఈ క్రమంలో బయట పని చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అని కాకుండా ప్రైవేట్ రంగంలో అయినా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ పాఠశాల/ కాలేజీల్లో ఉన్న పిల్లలు హై స్పీడ్ ట్రాక్లో ఉన్నారు. కస్తూర్బా పాఠశాలల్లో మార్పు వస్తోంది. గతంలో టెన్త్తో చదువు ఆపేసే వారు. ఇప్పుడు ఇంటర్మీడియట్కు వెళ్లేలా వారిలో మార్పు తీసుకువచ్చాం. నైన్త్, టెన్త్లో చదువు ఆపేసిన వారు, అన్ స్కిల్ల్డ్ గల్స్ కోసం వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ర్యాగింగ్ చేసినా, టీజింగ్ చేసినా బయటకు చెప్పడానికి అమ్మాయిలు భయపడుతారు. ఇంట్లో సమస్యలు ఉంటే బయటకు చెబితే చుట్టు పక్కల అంతా చెడుగా అనుకుంటారెమో అని పెళ్ళైన వాళ్లు సందేహపడతారు. ఇలా సమస్యను బయటకు చెప్పకుండా ఉంటే పరిష్కారం లభించడం కష్టం. నువ్వు అక్కడెందుకు ఉన్నావ్, అలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, అలా ఎందుకు మాట్లాడవు... తప్పంతా నీదే అంటూ విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారని ముందుకు రారు. కానీ అమ్మాయిలు బయటకు చెప్పాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులు, రెవిన్యూ వాళ్లకి చెప్పండి.. మేము చూసుకుంటాం. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్.. గృహిణిగా ఉండడం అనేది ఓ గొప్ప విషయం. అయితే గృహిణి ఇంట్లో చేసి పనిని ఎవ్వరూ సరిగా గుర్తించరు. అండర్ వాల్యూ చేస్తారు. గృహిణిగా ఉంటూనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నించాలి. గంటా, రెండు గంటలా అనేది కాదు. పార్ట్టైం జాబ్, క్రియేటివ్ వర్క్ ఏదైనా పర్లేదు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి. మనం అవునన్నా.. కాదన్నా వరల్డ్ రన్స్ ఆన్ ఎకనామికల్. హౌజ్ వైఫ్గా ఉండటం తప్పు కాదు. కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంపల్సరీ. ఎంతో తెలివైన వాళ్లు, సృజనాత్మకత ఉన్న వారు వారి ప్రతిభను అంతా ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఉమన్ గో అవుట్ అండ్ వర్క్... దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. నా విషయంలో తల్లిదండ్రుల నుంచి ఇటువంటి ఒత్తిడులు లేవు. అంతేకాదు ఏం చదవాలనే విషయంలో అమ్మాయిలకు ఛాయిస్ ఉండడం లేదు. అమ్మాయిలు డాక్టర్, టీచర్, అబ్బాయిలు ఇంజనీరు అంటారు. అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివినా అందులో కంప్యూటర్స్ సెలక్ట్ చేసుకోమంటారు. మెకానికల్, సివిల్స్ వద్దంటారు. అమ్మాయిల తెలివి తేటలు, సామర్థ్యంతో పని లేకుండా శారీరక కష్టం లేని విధంగా చదువు సాగాలని అభిలాషిస్తారు. అన్ని రంగాల్లో ఆడవాళ్లు విజయం సాధిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇది అందరం బాధపడే విషయం...ఎందుకంటే..? మగ పిల్లలను కనాలి అనుకునే ప్రబుద్ధులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. ఇది మనమందరం బాధపడే విషయం, టెర్రిబుల్ ట్రాజిక్. రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే నమ్మకంగా ఉంటారు. తల్లిదండ్రులకు అండగా ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసినా మళ్లీ మగపిల్లలే కావాలంటారు. ఈ పద్దతిలో మార్పు రావాలి. -
Swapna Sundari: నాట్యభూషణం
‘వాగ్గేయకార’ గుర్తింపు పొందిన ఏకైక మహిళ. పద్మభూషణ్ అందుకున్న నాట్యవిలాసిని. ఆమ్రపాలి రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వ పురస్కారగ్రహీత. ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్లో ప్రదర్శనకారిణి. యంగ్ కల్చరల్ అంబాసిడర్గా భారత ప్రతినిధి. మూడు నాట్యరీతుల సాధన కర్త... నాట్యానికి స్వీయ గాత్ర సహకార ప్రత్యేకత. ఇన్నిటి సమ్మేళనం వక్కలంక స్వప్న సుందరి. ‘‘నా కళాప్రస్థానం గురించి చెప్పే ముందు మా అమ్మ గురించి చెప్పాలి. అమ్మమ్మ తరం వరకు మా గాత్రప్రతిభ ఇంటికే పరిమితం. అమ్మ వక్కలంక సరళ నేపథ్య గాయని. తెర ముందుకు రావడం మాత్రం నాతోనే మొదలు. అమ్మకు యామినీ కృష్ణమూర్తి నాట్యం ఇష్టం. నేను కడుపులో ఉండగానే అమ్మాయి పుడితే కళాకారిణిని చేయాలనుకుంది. తన మిత్రురాలైన బెంగాలీ గాయని గీతాదత్తో ‘బెంగాలీలో మంచి పేరు సూచించ’మని కూడా కోరిందట. గీతాదత్ సూచించిన పేర్లలో మా అమ్మమ్మ సుందరమ్మ పేరు అమరేటట్లున్న పేరు స్వప్న. అలా స్వప్నసుందరినయ్యాను. మా నాన్న ఆర్మీలో డాక్టర్. ఆ బదిలీల ప్రభావం నా మీద ఎలా పడిందంటే... మేము వెళ్లినచోట భరతనాట్యం గురువు ఉంటే భరతనాట్యం, కూచిపూడి గురువు ఉంటే కూచిపూడి... అలా సాగింది నాట్యసాధన. పదమూడేళ్లకు చెన్నైలో తొలి భరతనాట్య ప్రదర్శన, పద్నాలుగేళ్లకు ఢిల్లీలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. మూడవది నేను ఇష్టంగా సాధన చేసిన విలాసిని నాట్యం. రాజమండ్రి సమీపంలోని కోరుకొండ నరసింహస్వామి ఆలయంలో మా గురువు మద్దుల లక్ష్మీనారాయణమ్మ స్వయంగా తన గజ్జెలను నాకు కట్టి ఆరంగేట్రం చేయించారు. నేను మా సొంత ప్రదేశం కోనసీమను చూసింది కూడా అప్పుడే. మా ఇంటిపేరు, ఊరిపేరు ఒకటే. గోదావరి లంకల్లోని వక్కలంక. విలాసిని నాట్య తొలి ప్రదర్శన తర్వాత అనేక ప్రయోగాలు చేశాను. అంతరించి పోతున్న నాట్యరీతిని తర్వాతి తరాలకు అందుబాటులోకి తీసుకురావడానికి, ఆ నాట్యరీతి ప్రాచుర్యానికి నేను చేసిన ప్రయత్నాలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. బీఏ ఆగిపోయింది! నేను స్కూల్ ఫైనల్లో ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు నన్ను యామినీ కృష్ణమూర్తిగారి ప్రదర్శనకు తీసుకెళ్లారు. ఆమెను చూసిన తర్వాత నాట్యమే జీవితం అని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మాత్రం ఎంతటి కళాకారిణివి అయినా చదువులేకపోతే ఎలాగ అన్నారు. రోజూ కాలేజ్కెళ్లాలంటే డాన్సు అవకాశాలు ఒకదాని మీద మరొకటి వస్తున్నాయి. టీనేజ్లోనే లండన్లోని క్వీన్ ఎలిజిబెత్ హాల్లో ప్రదర్శన ఇచ్చాను. ప్రైవేట్గా బీఏలో చేరాను, కానీ సెకండియర్లో మూడు నెలల యూరప్ టూర్తో నా బీఏ ఆగిపోయింది. నాట్యం నేర్చుకున్నాను, నాట్యమే చదువుకున్నాను. నాట్యంలో పీహెచ్డీ స్కాలర్స్కి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వెళ్తుంటాను. చిన్న వయసులో నాట్యంలో స్థిరపడితే ప్రొఫెషన్లో కనీసం 30 ఏళ్లయినా రాణించవచ్చని ఇంట్లో వాదించాను. నేను అనుకున్నట్లే నలభై ఐదేళ్లుగా నాట్యంలో రాణిస్తున్నాను. పాటల విషయానికి వస్తే... నాట్యంలో నేపథ్యంగా వినిపించే ట్రాక్ నేనే పాడుతాను. బాలమురళి అంకుల్తో ఆల్బమ్ చేశాను, తమిళ్ గజల్స్ పాడాను. అమ్మతో కలిసి పాడడం, అమ్మ పాడిన పాటలను ఆమెకు నివాళిగా పాడడం గొప్ప అనుభూతి. నాట్యజ్ఞానకేంద్రం దిల్లీలో స్థాపించిన డాన్స్ సెంటర్ ద్వారా నాట్యానికి సంబంధించిన జ్ఞానాన్ని పంచడంతోపాటు ప్రచారంలోకి తెస్తున్నాను. నాట్యం, సంగీతం, ఆధ్యాత్మికం ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి. అన్నీ కలిపితేనే సంస్కృతి. అలా నేను సాంస్కృతిక వేత్తగా ఆవిష్కారమయ్యాను. నేడు హైదరాబాద్లో జరుగుతున్న ‘నైమిశం’ జిడ్డు కృష్ణమూర్తి ‘సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్’ కోసం సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన ప్రారంభించాను. కళాసాధనకు, కళాసేవకు... శిఖరాన్ని చేరడం, ప్రయాణం పూర్తవడం అనేది ఉండదు. పరిపూర్ణతను, కొత్త రూపునూ సంతరించుకుంటూ... కళాకారులకు, కళాభిమానులకు సాంత్వననిస్తూ కొత్త పుంతలు తొక్కుతూ సాగుతూనే ఉంటుంది’’ అన్నారు స్వప్నసుందరి. ప్రభుత్వం ఆమె నాట్యప్రతిభను పద్మభూషణ్తో గౌరవించింది. నిజానికి ఆమె నాట్యానికే భూషణం. కళల కలయిక ‘కూచిపూడి’ భాగవతం, యక్షగానం, నాటకం, పగటివేషం వంటి ప్రాచీన కళారూపాల నుంచి ఒక్కో ప్రత్యేకతను మమేకం చేస్తూ రూపొందిన నాట్యప్రక్రియనే మనం కూచిపూడి అని పిలుస్తున్నాం. నిజానికి కూచిపూడి అనే పేరు రావడానికి కారకులు గోల్కొండ పాలకుడు తానీషా. ఆ నాట్యకళాకారుల స్థిరనివాసం కోసం కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చారాయన. కూచిపూడి గ్రామంలోని నాట్యకారుల నాట్యరీతి కూడా ఆ ఊరిపేరుతోనే వ్యవహారంలోకి వచ్చింది. సిద్ధేంద్రయోగికంటే ముందు రెండు వందల సంవత్సరాల నుంచి వచ్చిన పరిణామక్రమాన్ని నేను నా తొలి రచన ‘ద వరల్డ్ ఆఫ్ కూచిపూడి డాన్స్’లో రాశాను. తెలుగు విలాసిని... విలాసిని నాట్యం మన తెలుగు వారి భారతం. భారతం అంటే మహాభారతం కాదు. భారతం– భాగవతం అని మన ప్రాచీన కళారూపాలు ఈ రెండూ. భారతం శాస్త్రీయంగా ఉంటే భాగవతం సామాన్యులకు అర్థమయ్యేటట్లు సరళంగా ఉండేది. భారతం సోలో డాన్స్, భాగవతం బృంద ప్రదర్శన. లాలిత్యం, సొగసుతో కూడిన ఈ తెలుగు నాట్యరీతిని రాజాస్థానాల్లో రాజదాసీలు, ఆలయాల్లో దేవదాసీలు ప్రదర్శించేవారు. రాజాస్థానాలు పోవడం, కొన్ని సామాజిక దురన్యాయాలను అడ్డుకునే క్రమంలో ఆలయాల్లో నాట్యాలను నిషేధిస్తూ చట్టం వచ్చిన తర్వాత ఆ నాట్యసాధన దాదాపుగా అంతరించి పోయే దశకు చేరుకుంది. ఆ సమయంలో నేను ఈ నాట్యం నేర్చుకుని, అందులో ప్రయోగాలు, విస్తరణ కోసం పని చేస్తున్నాను. నేను విలాసిని మీద పుస్తకం రాసే నాటికి ఆ నాట్యరీతికి తెలుగుభారతం అనే ప్రాచీన నామమే ఉంది. నిష్ణాతులైన కవులు, కళాకారులు, చరిత్రకారులు సంయుక్తంగా చర్చించిన తర్వాత ‘విలాసిని’ అనే పేరు ఖరారు చేశాం. – వక్కలంక స్వప్న సుందరి, సాంస్కృతికవేత్త – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు : నివేదా థామస్
నివేదా థామస్.. గ్లామర్ కన్నా అభినయతారగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా.. ఇక్కడ సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. అందం కన్నా అభినయం మీద ఆమెకున్న శ్రద్ధ అలాంటిది. తనలోని గ్లామర్ను ఆమె అశ్రద్ధ చేసినా ఈ బ్రాండ్స్ మాత్రం తీర్చిదిద్దుతున్నాయి.. సొబారికో దర్జా, విలాసం, సౌకర్యం .. ఈ మూడింటినీ ఒకేసారి ఆస్వాదించాలంటే సొబారికో బ్రాండ్ను ఎంచుకోవాలి. దేశంలోని ఏ మూలలో ఏ చేనేత ప్రత్యేకత ఉన్నా.. ఏ కళాకారుడి.. ఏ కళాకారిణి చేతిలో సృజన ఉన్నా అది ఈ బ్రాండ్లో ప్రతిబింబిస్తుంది. అందుకే సొబారికో అవుట్ ఫిట్స్ను ఇష్టపడని వాళ్లు లేరు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా. ఈ అభిమానాన్నే బ్రాండ్ వాల్యూగా స్థిరపరచుకుంది. దాన్నే వారసత్వంగానూ మలచుకుంది ఏళ్లుగా. ఫ్యాబ్రిక్, డిజైన్ను బట్టి ధరలు. ఆన్లైన్లోనూ లభ్యం. డ్రెస్ బ్రాండ్ : సొబారికో అనార్కలీ సెట్ ధర: 37,500 జ్యూయెలరీ బ్రాండ్: అమెథిస్ట్ అండ్ ఆమ్రపాలి ధర: డిజైన్పై ఆధారపడి ఉంటుంది. అమెథిస్ట్ ఇది కిరణ్ రావు మానస పుత్రిక. అమూల్యమైన కళాఖండాల నిలయం.. ఈ బ్రాండ్. 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దుస్తులు, జ్యూయెలరీ, ఫుట్ వేర్ నుంచి ఇంటి అలంకరణ వస్తువులు.. కాఫీ షాప్ వరకు అన్నిటికీ ఈ అమెథిస్ట్ కేరాఫ్. ఈ బ్రాండ్ రిచ్నెస్కు తగ్గట్టే ధరలు ఉంటాయి. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. -
ఎంపీలతో కలసి భోజనం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్ సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, బాలశౌరి తదితరులు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా అధికార నివాసం జన్పథ్–1కి చేరుకున్న ముఖ్యమంత్రిని పలువురు ఎంపీలు కలిసి మాట్లాడారు. ప్రధాని కార్యాలయ డిప్యూటీ సెక్రటరీ ఆమ్రపాలి కొద్దిసేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఎంపీలతో కలిసి జన్పథ్ –1 అధికారిక నివాసంలో భోజనం చేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం 4.15 గంటలకు లోక్ కల్యాణ్ రోడ్లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశం తరువాత తిరిగి అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం రాత్రికి కేంద్ర మంత్రులను కలిశారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మార్గాని భరత్రామ్, బాలశౌరి, నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ తదితరులున్నారు. -
సుప్రీం తీర్పులో ఏది ‘సంచలనం’?
సాక్షి, న్యూఢిల్లీ : నోయిడా, గ్రేటర్ నోయిడాలలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్న ప్రముఖ భవన నిర్మాణ సంస్థ ‘ఆమ్రపాలి గ్రూప్’కు వ్యతిరేకంగా మంగళవారం సుప్రీం కోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. తామూ ఓ ఇంటి వాళ్లమవుదామనే ఓ జీవితకాల స్వప్న సాఫల్యం కోసం కష్టపడి సంపాదించిన సొమ్మే కాకుండా, బ్యాంకుల నుంచి అరువు తెచ్చికొని మరీ సొమ్ము చెల్లిస్తే నిర్దాక్షిణ్యంగా దాన్ని మరో వ్యాపారానికి తరలించి, అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని ఆలస్యం చేయడం దారుణమంటూ ఆ రియల్ ఎస్టేట్ గ్రూప్పై సుప్రీం కోర్టు మండి పడడం, ఆ గ్రూప్ రిజిస్ట్రేషన్నే రద్దు చేయడం మనకు ఎంతో సబబుగాగా అనిపిస్తుంది. సుప్రీం కోర్టు అంతటితో అగకుండా ఆమ్రపాలి చేపట్టిన అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ‘నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్’కు అప్పగించడం, అదనపు నిధులు అవసరమైతే సేకరించేందుకు వీలుగా అపార్ట్మెంట్ల భూమి హక్కులను ఓ కోర్టు రిసీవర్కు అప్పగించడం మరీ అద్భుతమని కొంత మంది సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. భవన నిర్మాణ రియల్టర్లు కస్టమర్ల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేయడం, భవన నిర్మాణాలను పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేయడం లాంటి సమస్యలు ఒక్క నోయిడాకు, ఒక్క ఆమ్రపాలి గ్రూపునకే పరిమితం కాలేదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఆగిపోయి లేదా ఆలస్యమవుతున్న నిర్మాణాలు 1.50 లక్షలని ఓ అంచనా కాగా, దేశవ్యాప్తంగా అలా ఏడున్నర లక్షల నిర్మాణాలు ఉన్నాయి ? ఇలాంటి సమయంలో ఒక్క నోయిడాకే పరిమితమై సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం అన్నది చట్టంలోని ‘అందరికి సమాన న్యాయం’ సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆమ్రపాలి గ్రూప్ రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం వరకు సుప్రీం కోర్టు తీర్పు సబబే! ఆ నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ సంస్థను తానే ఎంపిక చేయడం, డబ్బుల సేకరణకు భూమిపై కోర్టు రిసీవర్కు హక్కులు కల్పించడం కచ్చితంగా ప్రభుత్వ కార్యనిర్వహణలో జోక్యం చేసుకోవడమే అవుతుందన్న వాదన నిపుణుల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇలా సుప్రీం కోర్టు ప్రభుత్వ కార్యనిర్వహణలో జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అస్సాంలో పౌరసత్వం చట్టాన్ని ఎలా అమలు చేయాలో, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి బస్సులు కొనాలో నిర్దేశించడమే కాకుండా భారత క్రికెట్ బోర్డు కార్యకలాపాలను చూసుకునేందుకు నలుగురు సభ్యుల ప్యానెల్ను కూడా నియమించింది. కార్య నిర్వహణా రంగం ప్రభుత్వానికి సంబంధించినది. అది నిస్తేజమైతే చికిత్సకు ఆదేశాలు జారీ చేయవచ్చు. కింది స్థాయి నుంచి సుప్రీం కోర్టు వరకు కొన్ని కోట్ల కేసులు అపరిష్కృతంగా మూలుగుతున్నాయి. ఆ విషయంలో సుప్రీం కోర్టు కార్యనిర్వహణ రంగంలోకి దూసుకుపోయి ఉంటే లేదా క్రియాశీలకంగా వ్యవహరించి ఉంటే ఈపాటికి అన్ని కేసులు పరిష్కారమయ్యేవన్నది కూడా నిపుణుల వాదన. -
‘ఆమ్రపాలి’ గ్రూప్ నుంచి మనోహర్కు రూ.36 లక్షలు!
న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్ కేసులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ శశాంక్ మనోహర్ పేరు బయటకు వచ్చింది. గ్రూప్ సీఎండీ అనిల్ కుమార్ శర్మ... గృహ కొనుగోలుదారులు చెల్లించిన నిధుల నుంచి రూ.36 లక్షలను దారిమళ్లించి మనోహర్ ఖాతాలో వేసినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘ఆమ్రపాలి’ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లు కుమ్మక్కై నిధులను దుబారా, దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సుప్రీం ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఆదేశించింది. సుప్రీం తీర్పులో... దారిమళ్లిన నిధులను పొందినట్లు, అనిల్కుమార్ శర్మ చెల్లింపులు చేసినవారి జాబితాలో మనోహర్ పేరు రెండుసార్లుంది. దీనిపై ఆయన స్పందిస్తూ... ఈ కేసులో నాలుగేళ్ల క్రితమే తాను పట్నా హైకోర్టులో హాజరైనట్లు తెలిపారు. తనకేం సంబంధం లేదని పేర్కొన్నారు. -
ఆమ్రపాలి కుంభకోణం : ధోనీపై సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ నకు రెరా రిజిస్ట్రేషన్ను సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఇంటి కొనుగోలుదార్లకు చెందిన డబ్బును ఆమ్రపాలి గ్రూప్ అక్రమ పద్ధతుల్లో దాళి మళ్లించిన కుంభకోణం భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధమున్న వార్త కలకలం రేపుతోంది. ధోని భార్య సాక్షికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్తో ఆమ్రపాలి గ్రూప్ చీకటి ఒప్పందాలను కుదుర్చుకుందని కోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలో పేర్కొనడం గమనార్హం. రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆమ్రపాలి మాహి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పవన్ కుమార్ అగర్వాల్, రవీందర్ భాటియా సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక తేల్చింది. ఈ నివేదికను సుప్రీం కోర్టు అంగీకరించింది. 2009 - 2015 మధ్య రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ .42.22 కోట్లు చెల్లించినట్లు కోర్టుకు తెలిపింది. ఈ మొత్తంలో రూ .6.52 కోట్లు అమ్రపాలి నీలమణి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించింది. మాహిగా పేరొందిన ధోనికి రితి స్పోర్ట్లో ప్రధాన వాటా ఉండగా, సాక్షి అమ్రపాలి మాహికి డైరెక్టర్. మూడేళ్ల క్రితం వరకు ధోని ఈ బృందానికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. గ్రూప్ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి చాలా లావాదేవీలను నిర్వహించారని, ఇతర గ్రూప్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు కూడా ధోనీ జోక్యం చేసుకున్నాడని తమ ఆడిట్ రిపోర్టులో పవన్ కుమార్ అగర్వాల్, రవీందర్ భాటియా పేర్కొన్నారు. రాంచీలో ఓ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఈ సంస్థ (ఆమ్రపాలి మహి) విలీనం చేశారని, దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఎంవోయూ కూడా కుదిరిందన్నారు. కానీ ఈ ఒప్పంద పేపర్లు తమ దగ్గర అందబాటులో లేవని పేర్కొన్నారు. ఆడిట్ నివేదిక ప్రకారం, నవంబర్ 22, 2009 తేదీన సంతకం చేసిన ఎండార్స్మెంట్ ఒప్పందం ప్రకారం, ధోని తనను తాను అమృపాలి గ్రూప్ ఛైర్మన్కు రితి స్పోర్ట్స్ ప్రతినిధితో పాటు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండాల్సి ఉంది. దీనికి ధోనీ అంగీకరించినట్టుగా ఎలాంటి రికార్డు అందుబాటులో లేదు. అలాగే మార్చి 20, 2015 నాటి మరో స్పార్సర్షిప్ ఒప్పందం ప్రకారం ఐపిఎల్ 2015 ఎడిషన్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కోసం వివిధ ప్రదేశాలలో "లోగో స్పేస్" ను ప్రకటించే హక్కును అమ్రపాలి గ్రూప్ సొంతం చేసుకుంది. అ ప్పుడు ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నారు. అయితే ఈ ఒప్పందం సాదా కాగితంపై ఉందని , అమ్రపాలి, రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మాత్రమేఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందానికి చెన్నై సూపర్ కింగ్స్ తరపున సంతకాలు లేవని నివేదిక తెలిపింది. 42వేలకు పైగా గృహకొనుగోలుదారుల డబ్బులను అక్రమంగా మళ్లించారని తాము భావిస్తున్నామని, వాటిని రికవరీ చేయాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా, యూయూ లలిత్లతో కూడిన ధర్మాసనం జూలై 23న జారీ చేసిన ఆర్డర్లో అభిప్రాయపడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతని ప్రభుత్వరంగ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ (ఎన్బీసీసి)కి అప్పగించింది. రితి స్పోర్ట్స్ పేరుతో పలు ప్రాంతాల్లో ఆమ్రపాలికి అధికారులు మంజూరు చేసిన ఆస్తుల లీజును కూడా సుప్రీం కోర్టు రద్దు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో గ్రూప్ సీఎండీ అనిల్ శర్మ, ఇతర డైరెక్టర్లను, సీనియర్ అధికారులను విచారించాలని ఆదేశించింది. ఇది ఇలా వుంటే ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్టులో పదేళ్ల కింద బుక్ చేసుకున్న 5,500 చ.అ.పెంట్హౌస్కు సంబంధించిన యాజమాన్య హక్కులకు రక్షణ కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్లో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన సర్వీసులకు చెల్లించాల్సిన సొమ్ముతో పాటు, పెట్టుబడిగా పెట్టిన రూ.25 కోట్లు కంపెనీ ఎగవేసిందని ఆరోపించారు. అలాగే కంపెనీ తమకు 115 కోట్ల రూపాయల మేర బకాయి పడిందని రితి స్పోర్ట్స్, ధోని సంయుక్తంగా సుప్రీంను కోరాయి. మరోవైపు ఈ వార్తలపై రితి స్పోర్ట్స్ గానీ, క్రికెటర్ ఎంఎస్ ధోనీ గానీ అధికారికంగా స్పందించాల్సి వుంది. చదవండి : ‘ఇల్లు’ గెలిచింది..! -
ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అనేకసార్లు ఆమ్రపాలి గ్రూప్పై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం తాజా సంచలన తీర్పును వెలువరించింది. సంస్థ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) నమోదుతోపాటు అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అలాగే కంపెనీ డైరెక్టర్లు అందరిపైనా మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ను ఆదేశించింది. సంస్థ లావాదేవీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఈడీని ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది. తద్వారా సుమారు 42వేల గృహ కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాదు కోర్టు రిసీవర్గా ఆర్ వెంకట్రామన్ను నియమించింది. భారతదేశం అంతటా అన్ని ప్రాజెక్టుల ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని, అవి సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని, ప్రమోటర్లందరి ఉల్లంఘనలపై నివేదికను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సంబంధిత మంత్రిత్వ శాఖలను కోర్టు కోరింది. ఇద్దరు ఆడిటర్లలో ఒకరైన అనిల్ మిట్టల్పై విచారణ జరిపి ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీం చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని సుప్రీం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఆ నిర్మాణాలను చేపట్టాల్సిందిగా నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ను సుప్రీం ఆదేశించింది. నిర్మాణాలు పూర్తైన తర్వాత వినియోగదారులకు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా గృహనిర్మాణాల కోసం వినియోగదారుల నుంచి సేకరించిన నిధులను ఇతర సంస్థల్లోకి మళ్లించారన్న కుంభకోణంలో ఆమ్రపాలి చిక్కుకుంది. అలాగే ఆమ్రపాలి గ్రూప్నకు ప్రచారకర్తగా వ్యవహరించిన తనను మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి : అవినీతికి మరణశిక్ష విధించలేం: సుప్రీం నన్ను రూ.40 కోట్లకు ముంచారు : ధోని -
గ్రేటర్కు మూడు కోట్ల మొక్కలతో ‘హరితహారం’
సాక్షి, హైదరబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘హరితహారం’ కార్యక్రమం ఐదో విడత ఈ నెలలో చేపట్టనున్నారు. గత నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలను నాటిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది హరిత హారంలో భాగంగా 83.30 కోట్ల మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే మూడు కోట్ల మొక్కలను నాటేందుకు వీలుగా జీహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్, అడిషనల్ కమిషనర్లు అమ్రపాలి కాటా, కృష్ణలు భారీ ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా మొక్కలను పెంచడానికి రాజేంద్రనగర్, కొంగరకలాన్లోని నర్సరీలకు అప్పగించి వాటి పని తీరును పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతానికి కోటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన కోటిన్నర మొక్కలను ప్రైవేటు నర్సరీలకు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం టెండర్లు వేసి అందులో ఎంపికైన ప్రైవేటు నర్సరీలకు మొక్కల పెంపకాన్ని అప్పగించి.. మరో పది రోజుల్లో కోటిన్నర మొక్కలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
అవినీతికి మరణశిక్ష విధించలేం: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో రియల్టర్లు ప్రజలను మోసం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులు, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కైన బిల్డర్లు నిబంధనలను తుంగలో తొక్కి ఆకాశహర్మాలు నిర్మిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని అభిప్రాయపడింది. వినియోగదారుల్ని ఆమ్రపాలి గ్రూప్ మోసం చేసిందన్న సుప్రీంకోర్టు, అవినీతికి పాల్పడినవారికి మరణశిక్ష విధించలేమని స్పష్టం చేసింది. -
ధోనీతో లావాదేవీల వివరాలు కోరిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీతో జరిపిన అన్ని లావాదేవీల వివరాలను బుధవారంలోగా తమకు నివేదించాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆమ్రపాలి గ్రూప్ను ఆదేశించింది. ఆమ్రపాలి గ్రూప్ తనను మోసం చేసిందని ధోని సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. రాంచీలోని ఆమ్రపాలి సఫారిలో పెంట్హౌస్ను తాను బుక్ చేసుకున్నానని, ఇంతవరకూ పెంట్హౌస్ను తనకు అప్పగించలేదని పిటిషన్లో ధోని ఆరోపించారు. మరోవైపు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు తనకు చెల్లించాల్సిన బకాయిలను సైతం ఆమ్రపాలి గ్రూప్ చెల్లించలేదని ధోనీ కోర్టుకు నివేదించారు. 2006 నుంచి 2009 మధ్య కంపెనీని ప్రమోట్ చేసినందుకు తనకు రూ 40 కోట్లు రావాలని ధోని కోరుతున్నారు. కాగా ధోనీతో జరిగిన లావాదేవీల వివరాలను పూర్తిగా తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆమ్రపాలి గ్రూప్ను ఆదేశించింది. మరోవైపు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నఆమ్రపాలి గ్రూప్పై పెద్దసంఖ్యలో గృహాల కొనుగోలుదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాము అడ్వాన్స్లు చెల్లించినా తమకు ఇస్తామన్న ఇళ్లను ఇంకా ఇవ్వలేదని పిటిషన్లలో పేర్కొన్నారు. కాగా గృహ కొనుగోలుదారులు చెల్లించిన డబ్బుతో నిర్మించిన ఫైవ్స్టార్ హోటల్, మాల్, కార్పొరేట్ కార్యాలయాలతో పాటు లగ్జరీ కార్లు, ఎఫ్ఎంసీజీ కంపెనీని అటాచ్ చేసి వాటిని విక్రయించి బకాయిపడిన వారికి చెల్లింపులు చేపట్టాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించింది. -
నన్ను రూ.40 కోట్లకు ముంచారు : ధోని
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ తనను మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆమ్రపాలి గ్రూప్ తరఫున ప్రచారం చేసినందుకుగానూ తనకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని చెల్లించలేదని పేర్కొన్నాడు. అదే విధంగా ఆమ్రపాలి ప్రాజెక్టులో తాను బుక్ చేసుకున్న పెంట్హౌజ్ను కూడా స్వాధీనం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. రియల్టీ కుంభకోణంలో చిక్కుకున్న ఆమ్రపాలి గ్రూపు ప్రస్తుతం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్రపాలి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు తనకు చెల్లిస్తానన్న రూ. 40 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని ధోని పేర్కొన్నాడు. ఈ మొత్తం తనకు చెల్లించాల్సిందిగా ఆమ్రపాలిని ఆదేశించాలని ధోని అత్యున్నత స్థానానికి విఙ్ఞప్తి చేశాడు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో ఉన్న పెంట్హౌజ్ను తనకు స్వాధీనపరచాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. చదవండి : కోర్టురూమ్లోనే ‘అమ్రపాలి’ డైరెక్టర్లు అరెస్ట్ కాగా ఈ రియల్టీ గ్రూప్నకు ధోని 2009 నుంచి 2016 వరకు అంబాసిడర్గా వ్యవహరించాడు. పెట్టుబడిదారులను ఆకర్షించేలా నిర్మించిన పలు ప్రకటనల్లో కనిపించాడు. అంతేగాక ఈ గ్రూపు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో ధోనితో పాటు అతడి భార్య సాక్షి కూడా భాగస్వామ్యమయ్యారు. ఆమ్రపాలి గ్రూపునకు చెందిన చారిటబుల్ వింగ్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఇక ఇన్వెస్టర్ల నుంచి రూ.2,765 కోట్లను వసూలు చేసి వాటిని దారి మళ్లించినట్టు ఆమ్రపాలి గ్రూప్పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్నకు చెందిన 16 ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా వచ్చిన నిధులను... నిలిచిపోయిన ప్రాజెక్టుల పని ప్రారంభించడానికి ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) వినియోగించుకోడానికి కూడా వీలు కల్పించింది. ఈ క్రమంలో నిలిచిపోయిన 15 హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 46,575 ఫ్లాట్స్ను 36 నెలల్లో దశల వారీగా నిర్మించి ఇవ్వగలమని.. ఇందుకు రూ.8,500 కోట్ల నిధులు కావాలని సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో ఎన్బీసీసీ ప్రతిపాదించింది. -
ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఓటేయాలి
సాక్షి, హైదరాబాద్: ఓటు భవిష్యత్తును నిర్ణయించే ఆయుధమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ఆయనతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్కుమార్, ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 90 శాతానికి ఓటింగ్ పెరగాలని ఆకాం క్షించారు. ‘ఓటు అనేది చాలా శక్తిమంతమైనది. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనాలి. సెలవున్నా పోలింగ్లో పాల్గొనకపోవడం ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటింది. యథా రాజా తథా ప్రజాలాగా కాకుండా.. యథా ప్రజా తథా రాజా అన్న చందంగా మారాలి. యువత తప్పక ఓటింగ్లో పాల్గొనాలి..’అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించారని రజత్కుమార్ను గవర్నర్ ప్రశంసించారు. దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అభినందించారు. లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటింగ్ పెరిగేలా ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఓటును నమోదు చేసుకోవాలి: సీఈఓ అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించామని.. పోలింగ్ శాతం పెంచామని సీఈఓ రజత్కుమార్ చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని.. రిపోలింగ్ జరపాల్సిన పరిస్థితి రాలేదని తెలిపారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 4 వరకు ఓటును నమోదు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఏకంగా 90 శాతం ఓట్లు పోలవుతుంటే.. జీహెచ్ఎంసీలో కనీసం 50 శాతం కూడా పోలవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో అన్ని సౌకర్యాలున్నప్పటికీ జనాలు ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా గవర్నర్.. అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆబ్కారీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, అదనపు సీఈఓ బుద్ధ ప్రకాశ్, జాయింట్ సీఈఓ అమ్రపాలికి అవార్డులను ప్రదానం చేశారు. -
ఓటర్ల జాబితాలో మళ్లీ లోపాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణలో తప్పులు దొర్లాయి. దాదాపు 25వేల మంది ఓటర్ల పేర్లు జాబితాలో పునరావృతమయ్యాయి. అయితే.. సాంకేతిక కారణాలతోనే తుది జాబితాలో తప్పులు చోటుచేసుకున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ శనివారం వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈఆర్వో నెట్ వెబ్సైట్లో ఈ జాబితాను ప్రచురించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయన్నారు. ‘వెబ్సైట్లో ఓటర్ల వివరాలను నమోదు చేసి ‘సబ్మిట్’బటన్ నొక్కినా.. ఆ కమాండ్ పూర్తి కాలేదు. దీంతో డీటీపీ ఆపరేటర్లు రెండు, మూడు సార్లు మళ్లీ సబ్మిట్ బటన్ను నొక్కారు. దీంతో ఓటర్ల పేర్లు జాబితాలో పునరావృతమయ్యాయి. దాదాపు 25 వేల మంది ఓటర్ల పేర్లు రిపీట్ అయినట్లు గమనించాం. ఈ విషయాన్ని సుమోటోగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో పునరావృతమైన పేర్లను తొలగించి వారం రోజుల్లో అనుబంధ ఓటర్ల జాబితాను మళ్లీ ప్రచురిస్తాం’అని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంయుక్త అధికారి ఆమ్రపాలితో కలసి ఆయన శనివారం రాత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో తుది ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఉర్దూలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, మరాఠీలో 3 నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను ప్రచురించాల్సి ఉందని, మరో నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్త ఓటర్లు 11,81,827 గత నెల 10న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,61,36,776గా ఉండగా, తాజాగా ప్రకటించిన తుది జాబితాలో ఈ సంఖ్య 2,73,18,603కు పెరిగింది. రెండో సవరణ అనంతరం విడుదల చేసిన తుది జాబితాలో 1,37,87,920 మంది పురుషులు, 1,35,28,020 మంది మహిళలు, 2,663 మంది ఇతర ఓటర్లున్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 17,68,873 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోగా.. వివిధ కారణాలతో 5,87,046 మంది పేర్లను తొలగించారు. మార్పులు, చేర్పులు పూర్తయిన తర్వాత.. తుది జాబితాలో సరాసరిగా 11,81,827 మంది ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలో వందేళ్లకు పైబడిన ఓటర్లు 2472 మంది ఉండటం గమనార్హం. నమోదులో మహిళలదే ఆధిక్యం! ఓటర్ల జాబితాలో మొత్తంగా పోల్చితే.. పురుషుల కన్నా మహిళల సంఖ్య తక్కువగా ఉన్నా, కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని రజత్కుమార్ పేర్కొన్నారు. 9,36,969 మంది మహిళలు, 8,31,472 మంది పురుషులు, 432 మంది ఇతరులు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. అదే విధంగా 18–19 ఏళ్ల వయసున్న వారిలో 3,22,141 మంది యువకులు, 2,53,247 మంది యువతులు, 112 మంది ఇతరులున్నారు. తుది ఓటరు జాబితాలో 3,01,723 మంది మరణించిన, 1,93,586 మంది పునరావృతమైన 91,737 మంది చిరునామా మారిన ఓటర్ల పేర్లను తొలగించారు. దీంతో తొలగించిన ఓటర్ల సంఖ్య 5,87,046గా నమోదైంది. బెల్ట్షాపులపై కఠినంగా.. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టుషాపులను మూసివేయాల్సిందేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖను ఆదేశించినట్లు రజత్కుమార్ తెలిపారు. మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో ఇటీవల కొకైన్, గంజాయి సరఫరా ఎక్కువైందని.. వాటిపై ఉక్కుపాదం మోపాలని సూచించామన్నారు. అమల్లో ఉన్న పథకాలపై ఎన్నికల ప్రవర్త నియమావళి ప్రభావం ఉండదన్నారు. అయితే, సంక్షేమ పథకాలకు.. కొత్త లబ్ధిదారుల ఎంపిక జరపరాదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ వర్తింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని, అవసరమైతే ఈసీ వివరణ కూడా కోరతామన్నారు. కొండగట్టు బస్సు ప్రమాద మృతులు, క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియా చెల్లింపుకు అనుమతుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరముందని.. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రజత్ కుమార్ తెలిపారు. -
అనూహ్యం : కోర్టురూమ్లోనే ‘అమ్రపాలి’ డైరెక్టర్లు అరెస్ట్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు రూమ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ అమ్రపాలి ప్రమోటర్ అనిల్ శర్మను, డైరెక్టర్లను కోర్టు రూమ్లోనే అరెస్ట్కు జారీచేసింది సుప్రీంకోర్టు. మీ దాగుడు మూతలు ఆపాడంటూ... అమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లపై సుప్రీంకోర్టు బెంచ్ మండిపడింది. వెంటనే వారిని కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, ఉదయ్ యూ లలిత్ల నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గంట పాటు జరిగిన విచారణలో, ఫోరెన్సిక్ ఆడిట్ కోసం అమ్రపాలి గ్రూప్ సమర్పించాల్సిన పలు డాక్యుమెంట్లను ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడుతుందని డైరెక్టర్లపై మండిపడింది. డాక్యుమెంట్లను సమర్పించకపోవడానికి పలు కారణాలను చెబుతూ తప్పించుకుంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గృహదారులు పెట్టుబడిగా పెట్టిన నగదును, మరో అవసరాల కోసం తరలించారా? అని కోర్టు ప్రశ్నించింది. వెంటనే శర్మకు, ఇద్దరి డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది. అన్ని డాక్యుమెంట్లు ఆడిటర్లకు సమర్పించేంత వరకు మీరు కస్టడీలోనే ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. అది ఒక్క రోజు పట్టవచ్చు లేదా నెల అవ్వొచ్చు అని బెంచ్ పేర్కొంది. గ్రూప్కు సంబంధించిన పత్రాలన్నింటిన్నీ సీజ్ చేయాలని ఢిల్లీ పోలీసులను, నోయిడా పోలీసులను కోర్టు ఆదేశించింది. డాక్యుమెంట్లను రికవరీ చేసుకోవడానికి, ఈ ముగ్గురిని పోలీసులు ఆమ్రపాలి ఆఫీసుల చుట్టూ తిప్పాలని పేర్కొంది. అన్ని డాక్యుమెంట్లను ఆడిటర్లు పొందినట్టు తెలిశాకనే వారిని వదిలి వేయాలని బెంచ్ స్పష్టం చేసింది. ఈ ముగ్గురి పాస్పోర్టులను కూడా కోర్టు రద్దు చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 24కు వాయిదా వేసింది. ఇలా నిందితులను కోర్టు రూమ్లోనే అరెస్ట్ చేయడం ఇది మూడోది. సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ను, మరో వ్యక్తిని కూడా సుప్రీంకోర్టు, కోర్టురూమ్లోనే అరెస్ట్ చేసింది. -
‘అమ్రపాలి’పై ఎన్సీఎల్టీకి వెళ్లండి!
న్యూఢిల్లీ: రియల్టీ కుంభకోణంలో చిక్కుకున్న అమ్రపాలి గ్రూప్నకు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీని (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆశ్రయించడానికి కార్పొరేషన్ బ్యాంక్కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అమ్రపాలి గ్రూప్నకు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియంకు కార్పొరేషన్ బ్యాంక్ నేతృత్వం వహిస్తోంది. అయితే సుప్రీం ఆదేశాలు లేకుండా ఈ కేసులో తదుపరి ప్రొసీడింగ్స్ చేపట్టకూడదని ఎన్సీఎల్టీకి జస్టిస్ అరుణ్ మిశ్రా, యూయూ లలిత్ల ద్విసభ్య ధర్మాసనం నియంత్రణలు విధించింది. అమ్రపాలి గ్రూప్నకు కార్పొరేషన్ బ్యాంక్ రూ.270 కోట్ల రుణాలు ఇచ్చింది. వేలానికి 16 ఆస్తులు..: గ్రూప్నకు చెందిన 16 ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా వచ్చిన నిధులను... నిలిచిపోయిన ప్రాజెక్టుల పని ప్రారంభించడానికి ప్రభుత్వ రంగ ఎన్బీసీసీ వినియోగించుకోడానికి కూడా వీలు కల్పించింది. నిలిచిపోయిన 15 హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 46,575 ఫ్లాట్స్ను 36 నెలల్లో దశల వారీగా నిర్మించి ఇవ్వగలమని.. ఇందుకు రూ.8,500 కోట్ల నిధులు కావాలని సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో ఎన్బీసీసీ ప్రతిపాదించింది. సీఎండీ ఆస్తులపైనా ఆదేశాలు.. ఈ కేసులో గ్రూప్ సీఎండీ అనిల్ శర్మ.. తన ఆస్తుల విలువ రూ.67 కోట్లు అని ఇప్పుడు డిక్లేర్ చేయడాన్ని ప్రస్తావిస్తూ, 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ సందర్భంగా రూ.847 కోట్ల ఆస్తులున్నట్లు శర్మ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనడాన్ని సుప్రీం ప్రస్తావించింది. నాలుగేళ్లలో ఈ ఆస్తులు ఎలా కరిగిపోయాయని ప్రశ్నించింది. శర్మ, ఇతర డైరెక్టర్లు వారి కుటుంబ సభ్యుల ఆస్తుల జాబితా నాలుగురోజుల్లో సమర్పించాలని ఆదేశించిన న్యాయస్థానం కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. 46 గ్రూప్ కంపెనీలు, వాటి డైరెక్టర్లు, ప్రమోటర్లు, వారి జీవిత భాగస్వాములు, పిల్లల ఆస్తులకు సంబంధించి రెండు నెలల్లో ఫోరిన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
స్త్రీలోక సంచారం
చట్ట విరుద్ధంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఉప్పల్లోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య దంపతులు డాక్టర్ సిగిరెడ్డి ఉమామహేశ్వరి, డాక్టర్ ఎ.చంద్రశేఖర్లను వలపన్ని (డీకాయ్ ఆపరేషన్) పోలీసులు అరెస్టు చేసి, వారి దగ్గర్నుంచి ఒక ప్రింటర్, స్కానర్, రెండు సెల్ఫోన్లు, లింగ నిర్ధారణ పరీక్ష ఫీజుగా వారే ఇచ్చిన 7,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గర్భిణి అయిన ఒక లేడీ కానిస్టేబుల్ను వెంటబెట్టుకుని మఫ్టీలో వెళ్లి, ఫీజు కట్టి, లింగనిర్ధారణ పరీక్ష చేయించి, రిపోర్ట్స్ తమ చేతికి అందిన వెంటనే డాక్టర్ దంపతులైన గైనకాలజిస్టు, జనరల్ సర్జన్లను అరెస్టు చేసిన పోలీసులు.. 2000 సంవత్సరంలో ప్రారంభం అయిన ఈ ఆసుపత్రి ఏడాది నుంచీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరుగా ప్రస్తుతం పూర్తిస్థాయి అదనపు బాధ్యలు నిర్వహిస్తున్న వాకాటి కరుణ స్థానంలోకి బదిలీ అవగా, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి స్థానంలోకి కుమురంభీం అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్ బదలీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముందస్తు ఎన్నికలకు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 11 మంది జిల్లా కలెక్టర్ల బదిలీలో భాగంగా ఆమ్రపాలిని కూడా బదిలీ చేసిన ప్రభుత్వం ఆమెకు ఎక్కడికి బదిలీ చేస్తున్నది మాత్రం వెంటనే వెల్లడించలేదు! క్టోబర్లో పంపిణీ కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తున్న బతుకమ్మ చీరలను భద్రపరిచేందుకు గోదాములను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెల్లకార్డులలో ఉన్న వివరాలను బట్టి రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటీ 8 లక్షల మంది ఉండగా వారందరికీ 280 రూపాయల ఖరీదైన చీరను బతుకమ్మ కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం కొన్ని నెలలుగా భారీ ఎత్తున చీరలు నేయిస్తోంది. రెండు ప్రపంచ యుద్ధాలను, బొలీవియా విప్లవాలను, 3,000 మంది మాత్రమే ఉండే తన సకాబా గ్రామ జనాభా 1,75,000 అవడాన్ని కళ్లారా చూసి, ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీకి 118 ఏళ్లను పూర్తి చేసుకోబోతున్న జూలియా ఫ్లోర్స్ కోల్కే తన దేశమైన బొలీవియాలోనే, బహుశా ప్రపంచంలోనే అతి వృద్ధురాలైన మహిళగా రికార్డు నెలకొల్పబోతున్నారు. అయితే ఆమె తరఫున రికార్డు కోసం తమకు దరఖాస్తు వంటిదేదీ అందలేదని గిని ్నస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటుండగా.. అలాంటి బుక్ ఒకటి ఉందా అని కోల్కే బోసినవ్వులు నవ్వుతున్నారు. బిహార్లోని ముజఫర్పూర్లో ఇటీవల బాలల సంరక్షణాలయాలలో జరిగిన లైంగిక అకృత్యాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో, ఆ సంరక్షణాలయాల తీరుతెన్నులపై అధ్యయనం జరిపి ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్.సి.పి.సి.ఆర్) ఇచ్చిన తాత్కాలిక నివేదిక వెల్లడించిన విషయాలపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,874 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లను (సి.సి.ఐ.లు) తనిఖీ చేయగా వాటిలో కేవలం 54 మాత్రమే చట్టబద్ధంగా నడుస్తున్నట్లు ఎన్.సి.పి.సి.ఆర్. కోర్టుకు అందించిన తన నివేదికలో తెలిపింది! తాగి డ్రైవ్ చేస్తున్నాడని ఒక యువతి తన బాయ్ఫ్రెండ్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం కోర్టు అతడికి జరిమానా విధించడంతో పాటు, 17 నెలలు డ్రైవింగ్ చెయ్యకుండా నిషేధించింది. బ్రిటన్లో ఉంటున్న కమల్జీత్ సాగూ అనే ఒక ప్రవాస భారతీయుడు తన 44వ పుట్టినరోజు సందర్భంగా గత జూన్ 18న గర్ల్ ఫ్రెండ్ను కారులో ఎక్కించుకుని తిప్పుతూ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యా గొడవ మొదలై, అతడు కారు దిగి సిగరెట్ కోసం ఓ షాపు దగ్గరికి వెళ్లినప్పుడు ఆ గర్ల్ఫ్రెండ్ ఉత్తిపుణ్యానికి పోలీసులకు ఫోన్ చేసి ‘తన బాయ్ఫ్రెండ్ తాగి డ్రైవ్ చేస్తున్నాడని’ చెప్పడంతో ఇన్నాళ్లూ నడిచిన ఆ కేసులో ఇప్పుడు తీర్పు వచ్చింది. ఏషియన్ గేమ్స్తో దేశానికి తొలిసారి రజత పతకం సాధించుకు వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధుపై ఒక వైపు ప్రశంసల జల్లు కురుస్తుండగా, మరోవైపు.. ఆమె ఏ ఫైనల్స్లోనూ స్వర్ణపతకం సాధించలేకపోతోందనీ, ఫైనల్స్లో ఆడేందుకు ఆమె భయపడుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! దీనిపై సింధు తండ్రి రమణ స్పందిస్తూ, ‘‘ఇప్పటి వరకు ఎంతో మంది బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఇండియా తరఫున ఆడారు. వారిలో ఎంతమంది ఒలింపిక్స్ ఫైనల్కు వెళ్లారు? ఎంతమంది అంతర్జాతీయ పతకాలు గెలుచుకొచ్చారు?’’ అని ప్రశ్నించారు. 918లో సరిగ్గా ఇదే రోజున ఫ్యానీ కప్లాన్ అనే 28 ఏళ్ల రష్యన్ యువతి, ‘సోషలిస్ట్ రివల్యూషనరీ పార్టీ’ సభ్యురాలు.. ‘బోల్షెవిక్’ పార్టీ నేత వ్లాదిమిర్ లెనిన్పై హత్యాయత్నం చేశారు. రివల్యూషనరీ పార్టీని రద్దు చేసిన లెనిల్.. విప్లవ ద్రోహి అంటూ.. ఆగస్టు 30న మాస్కో ఫ్యాక్టరీ నుంచి బయటికి వస్తున్న లెనిన్పై కప్లాన్ అతి సమీపం నుంచి జరిపిన మూడు రౌండ్ల కాల్పులలో లెనిన్ చావు తప్పి, తీవ్రమైన గాయాలతో బయటపడగా.. ఆ తర్వాత మూడు రోజులకే పోలీసులు హడావుడిగా విచారణ జరిపించి సెప్టెంబర్ 3న ఆమె మెడ వెనుకభాగంలో తుపాకీ పెట్టి కాల్చి చంపేశారు. -
‘ఆమ్రపాలి’పై సుప్రీం మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఎండీ, డైరెక్టర్లపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 రోజుల్లోగా కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బుధవారం హెచ్చరించింది. ఇన్వెస్టర్ల నుంచి ఆమ్రపాలి గ్రూపు కంపెనీలు రూ.2,765 కోట్లను వసూలు చేసి వాటిని దారి మళ్లించినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యూయూ లలిత్తో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించకుండా కోర్టుతో ఆటలాడుకుంటున్నారని మండిపడింది. మరీ ఇంత తెలివిగా ప్రవర్తించడం సరికాదన్న ధర్మాసనం.. ఇన్వెస్టర్లకు న్యాయం చేసేందుకు మీ ఇళ్లను అమ్మడానికి కూడా కోర్టు వెనకాడబోదని ఎండీని హెచ్చరించింది. 15 రోజుల్లోగా ఆమ్రపాలి సంస్థ ఎండీ, డైరెక్టర్లకు సంబంధించిన స్థిర, చరాస్తుల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి సొమ్ము సేకరించి.. ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. వేల మందిని నిరాశ్రయులను చేయాలని చూస్తున్న మిమ్మల్ని నిరాశ్రయులను చేసేందుకు.. వడ్డీతో సహా సొమ్మును వసూలు చేసేందుకు కోర్టు ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా సిద్ధంగా ఉందని ఘాటుగా హెచ్చరించింది. మీరు ఎలా పూర్తి చేయగలరు? ఆమ్రపాలి గ్రూప్ చేపట్టిన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) ఆగస్టు 2న కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... 30 రోజుల్లోగా నిర్మాణ పనులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. నిర్మాణ పనులకు ఆటంకం కలిగించకుండా విద్యుత్ సరఫరాను యథావిథిగా కొనసాగించాలని ఆమ్రపాలి గ్రూప్తో జతకట్టిన పవర్ కంపెనీలను కోర్టు కోరింది. -
అతి తెలివి వద్దు... మీకూ ఇళ్లు లేకుండా చేస్తాం!
న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ, ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్న రియల్టీ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లకు అత్యున్నత న్యాయస్థానం తీవ్ర హెచ్చరికలు చేసింది. అతితెలివి ప్రదర్శించవద్దని, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆటలాడవద్దని స్పష్టంచేసింది. అలా చేస్తే డైరెక్టర్లకూ ఇళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించింది. గ్రూప్ పెండింగ్ రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణకు మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్ల ప్రతి ఒక్క ఆస్తినీ అమ్ముతామని, తద్వారా డబ్బును రికవరీ చేయిస్తామని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యూయూ లలిత్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘కొనుగోలుదారులు వారి గృహాలను సొంతం చేసుకునే విషయంలో మీ నుంచి జరుగుతున్న ఆలస్యమే ప్రస్తుతం సమస్య. అతి తెలివి ప్రవర్తించవద్దు. మీ ప్రతి ఒక్క ఆస్తినీ విక్రయిస్తాం. మిమ్మల్నీ ఇళ్లు లేని వారిని చేస్తాం. మీరు గృహ కొనుగోలుదారుల విషయంలో చేసినట్లే, మీ ఆస్తికోసం మీరూ ఎదురుచూసేలా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది. రూ.4,000 కోట్లకు రూ. 400 కోట్లేమిటి? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.4,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా. అయితే ఇందుకు సంబంధించి రూ.400 కోట్ల విలువైన కమర్షియల్ ఆస్తుల విక్రయానికి ఆమ్రపాలి గ్రూప్ చేసిన ప్రతిపాదన పట్ల ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008లో ఒక ప్రాపర్టీకి ఒక గృహ కొనుగోలుదారు రూ.50 లక్షలు వెచ్చిస్తే, ఇప్పుడు దాని విలువ రూ.2.5 కోట్లవుతుందనీ, రూ. కోటి వెచ్చిస్తే, దాని విలువ ఇప్పుడు రూ. 4 కోట్లని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఆస్తుల వివరాలకు ఆదేశం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు అందరూ తమ స్థిర, చర ఆస్తుల వివరాలను 15 రోజులలోపు సమర్పించాలని ఈ సందర్భంగా బెంచ్ స్పష్టం చేసింది. వాటి విలువల రిపోర్ట్నూ న్యాయస్థానం ముందుంచాలని పేర్కొంది. అలాగే రూ.4,000 కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సుస్పష్టమైన ప్రతిపాదనలనూ ఆగస్టు 14వ తేదీలోపు తన ముందు ఉంచాలని గ్రూప్నకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 2008 నుంచి నిర్వహణలో ఉన్న గ్రూప్ కంపెనీలు, డైరెక్టర్ల బ్యాంక్ అకౌంట్ల వివరాలతో ఒక అఫిడవిట్ను సమర్పించాలని కూడా గ్రూప్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 14వ తేదీన తదుపరి విచారణ ఇళ్ల కొనుగోలుదారుల నుంచి రూ.6,119 కోట్లను గ్రూప్ సమీకరించగలదని ఆమ్రపాలి తరఫు న్యాయవాది గౌరవ్ భాటియా చేసిన వాదనపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇందుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఫ్లాట్స్ అందజేతలో ఆలస్యం అవుతున్నందుకుగాను ఆమ్రపాలినే గృహ కొనుగోలుదారులకు డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదాపడింది. ఆమ్రపాలి గ్రూప్ 42,000 మందికి ఫ్లాట్లను బదలాయించాల్సి ఉంది. గ్రూపునకు చెందిన పనులను నిర్వహించేందుకు ప్రభుత్వరంగంలోని ఎన్బీసీసీకి ఇప్పటికే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు ఆమ్రపాలి గ్రూప్ నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. -
ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలోని ఆమ్రపాలి గ్రూపుపై సుప్రీంకోర్టు కొరఢా ఝుళిపించింది. గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలను తమ ముందుంచాలన్న కోర్టు ఆదేశాలను పాటించకుండా మోసం చేయడం, ఆటలాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూపు కంపెనీలకు చెందిన అన్ని బ్యాంకు ఖాతాలు, చరాస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. 42,000 మందికి ఫ్లాట్లను స్వాధీనం చేయాల్సి ఉన్న ఈ గ్రూపు తాలూకు బ్యాంకు ఖాతాల వివరాలను 2008వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా గురువారంలోపు కోర్టు ముందుంచాలని ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా, ఆమ్రపాలి గ్రూపులోని 40 కంపెనీల డైరెక్టర్ల బ్యాంకు ఖాతాల జప్తునకూ ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి ఆమ్రపాలి గ్రూపు కంపెనీలు రూ.2,765 కోట్లను వసూలు చేసి వాటిని దారి మళ్లించినట్టు వచ్చిన ఆరోపణలను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యూయూ లలిత్తో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంటూ విశ్వాస ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. -
స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేయాలి
కరీమాబాద్ : స్మార్ట్ సిటీ పథకం కింద.. రూ.88 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయం(కుడా)లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2017–18 సంవత్సరాలకు గానూ ఇప్పటికే రూ.33 కోట్ల పనులు ప్రారంభించామని తెలిపారు. రూ.2.5 కోట్లతో లైబ్రరీ ఆధునీకరణ, రూ.6.50 కోట్లతో గుండ్లసింగారం, వంగపహాడ్, ఎరుకలవాడ, 13వ డివిజన్ జీప్లస్ వన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రూ.7.2 కోట్లతో స్మృతి వనం, అంబేడ్కర్ భనం ఆధునీకరణ, రూ.8.3 కోట్లతో వడ్డేపల్లి చెరువు, బంధం చెరువు, ఉర్సు చెరువుల పునరుద్ధరణ, రూ.11.2 కోట్లతో డ్రెయినేజీ, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడతామని కలెక్టర్ వివరించారు. రూ.50 కోట్లతో ప్రతిపాదించిన 292 పనులకు త్వరగా టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే ప్లానెటోరియం అభివృద్ధి, 18 బస్టాపులను నిర్మిస్తామని చెప్పారు. ఇక 2018–19లో రూ.100 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోరారు. వరంగల్ మునిసిల్ కమిషనర్ వీపీ.గౌతమ్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పనులన అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో మునిసిపల్, ఆర్అండ్బీ ఇంజినీర్లు, టైన్ ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, స్మార్ట్ సిటీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
‘అమ్రపాలి’పై ధోని ఫిర్యాదు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలి గ్రూప్పై న్యాయపోరాటానికి దిగారు. అమ్రపాలి గ్రూప్, తనకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తూ ధోని దావా దాఖలు చేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న తనకు ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని ధోని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అంతేకాక పలు నగరాల్లో హౌజింగ్ ప్రాజెక్ట్లను కూడా పూర్తి చేయలేకపోతోంది. కేవలం ధోని మాత్రమే కాక, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్ డుప్లెసిస్పై కూడా అమ్రపాలిపై ఢిల్లీ హైకోర్టులో రికవరీ దావా వేశారు. బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకాలపాల్లో కోసం అమ్రపాలి గ్రూప్ తమకు ఎలాంటి నగదు చెల్లించలేదని అమ్రపాలి గ్రూప్కు క్రికెట్ స్టార్లను మేనేజ్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ మొత్తం క్రికెటర్లకు రూ.200 కోట్లు బకాయి పడిందని చెప్పారు. ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయడం లేదని ఆ ప్రాజెక్ట్ తరుఫు గృహ వినియోగదారులు పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో, 2016 ఏప్రిల్లో ఇక ఆ బ్రాండు అంబాసిడర్గా ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది రెసిడెంట్లు తమ ట్వీట్లను ధోని కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి అమ్రపాలి గ్రూప్ అధికార ప్రతినిధి నిరాకరించారు. -
వరంగల్లో అమ్రపాలిని అడ్డుకున్న విద్యార్థులు
-
భద్రకాళి ఆలయంలో అమ్రపాలి దంపతులు
-
భద్రకాళి ఆలయంలో అమ్రపాలి దంపతులు
సాక్షి, వరంగల్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలి దంపతులు శుక్రవారం భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నూతన వధూవరులు, కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు అమ్రపాలి దంపతులకు ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. కాగా ఈ నెల 18 జమ్ములో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో అమ్రపాలి వివాహం జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం అమ్రపాలి దంపతులు నిన్న (గురువారం) వరంగల్ విచ్చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా అమ్రపాలి పెళ్లి
-
ఒక్కటైన అమ్రపాలి, సమీర్ శర్మ
హన్మకొండ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, జమ్మూకు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్శర్మ ఒక్కటయ్యారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు జమ్మూలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ నెల 21 వరకు కలెక్టర్ దంపతులు జమ్మూలోనే ఉంటారు. ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. 23న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోనూ విందు కార్యక్రమం ఖరారైంది. ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు ఈ నూతన దంపతులు టర్కీలో పర్యటించనున్నారు. -
పెళ్లికూతురైన కలెక్టర్ ఆమ్రపాలి
-
నేడు కలెక్టర్ అమ్రపాలి వివాహం
సాక్షి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట, డామన్ ఎస్పీ సమీర్శర్మతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. నేడు (ఆదివారం) సమీర్శర్మ, అమ్రపాలిల వివాహం జమ్మూలో జరగనుంది. ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి నిశ్చితార్థం, ఐపీఎస్ ఆఫీసర్ సమీర్శర్మతో జమ్మూకాశ్మీర్లో శనివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బంధువులు, కొందరు సన్నిహితుల సమక్షంలో వైభవంగా ఈ వేడుక నిర్వహించారు. అమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కాగా, సమీర్ శర్మ 2011 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించారు. నేడు వివాహ బంధంతో ఒక్కటవనున్నారు. ఇప్పటికే వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి వివాహ నేపథ్యంలో సెలవులో వెళ్లారు. వివాహం అనంతరం ఈ నెల 22న వరంగల్లో, 25 న హైదరాబాద్లో అమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఆమ్రపాలి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాట వెంకటరెడ్డి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్షిప్ బ్యాంకర్గా పని చేశారు. 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్లో ఐఏఎస్గా ఎంపికయ్యారు. సోదరితో వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి 2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్ అర్బన్ కలెక్టర్గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్ను ఓడీఎఫ్( ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ)గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నారు. -
తల్లిదండ్రుల పెంపకంలో మార్పు రావాలి
-
23న కలెక్టర్ పెళ్లి విందు
హన్మకొండ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి విందు ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 18న జమ్మూలో వివాహం అనంతరం వరంగల్, హైదరాబాద్లో విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వరంగల్కు సంబంధించిన ఆహ్వాన పత్రిక జిల్లాలోనే ముద్రించారు. కలెక్టర్ అమ్రపాలి కాటకు 2011 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్శర్మతో వివాహం నిశ్చమైన నేపథ్యంలో సెలవులో వెళ్లనున్నారు. 21 రోజుల సెలవు కాలంలో.. ఈ నెల 16 నుంచి 21 వరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సందర్శన, 22 నుంచి 25 వరకు హైదరాబాద్, వరంగల్లలో, 26 నుంచి మార్చి 7 వరకు టర్కీ దేశాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న జమ్ముకశ్మీర్లో సమీర్శర్మతో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. అనంతరం 22న వరంగల్, 25 న హైదరాబాద్లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నట్టు తెలుస్తోంది. -
ఆమ్రపాలి మన ఆడపడుచే!
ఒంగోలు సబర్బన్: ఆమ్రపాలి.. రెండు మూడేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంలో ఉన్న డైనమిక్ లేడీ. టెలివిజన్ చానళ్లలోనూ తరచూ దర్శనమిచ్చే యువ కలెక్టర్ మన ఆడపడుచే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్.అగ్రహారం గ్రామం. తెలంగాణ రాష్ట్రం వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్గా తనదైన శైలిలో విధులు నిర్వహిస్తున్న కాటా ఆమ్రపాలి ఒంగోలు వాసికావడం గర్వకారణం. 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్గా, జాయింట్ కలెక్టర్గా, నగర కమిషనర్గా పనిచేసి ప్రస్తుతం వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి కాటా వెంకటరెడ్డి ఫ్రొఫెసర్.. ఎన్.అగ్రహారానికి చెందిన ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలోనే జరిగింది. హైస్కూలు విద్య టంగుటూరు, ఇంటర్మీడియేట్, డిగ్రీ సీఎస్ఆర్ శర్మ కళాశాలలో, పీజీ విద్య విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్గా ఉద్యోగంలో చేరారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్.అగ్రహారంలో ఉంది. ఎన్.అగ్రహారంలోని ఆమ్రపాలి కుటుంబానికి చెందిన ఇల్లు, ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి కుటుంబమంతా ఉన్నతాధికారులే.. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి కూడా ఐఆర్ఎస్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపికయిన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్లో ఇన్కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. మానస గంగోత్రి 2007 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన అధికారిణి. ఐఆర్ఎస్లో 184వ ర్యాంక్ సాధించింది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్కు చెందిన ఐపీఎస్. తమిళనాడు ఐఏఎస్ కేడర్కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్లో డైరెక్టర్గా చేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉపెన్నికకు రెండు సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఫిబ్రవరి 18న వివాహం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్గా పనిచేస్తున్న అమ్రపాలికి ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన వివాహం నిశ్చయమయింది. ఆమ్రపాలి చేసుకోబోయే వ్యక్తి కూడా ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన షమీర్ శర్మ జమ్మూ పట్టణానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన డయ్యూ–డామన్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. జమ్మూలో ఫిబ్రవరి 18న వివాహం జరగనుంది. ఫిబ్రవరి 25న సికింద్రాబాద్లోని సికింద్రాబాద్ క్లబ్లో రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. -
ఆమ్రపాలి తెలుగు తిప్పలు..
సాక్షి, వరంగల్ : వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక ఐఏఎస్ అధికారిగా, జిల్లా పరిపాలనాధికారిగా హూందాగా ఉండాల్సిన కలెక్టర్ గతితప్పారు. హన్మకొండలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెండా వందనం చేశాక హూందాగా ఉండాల్సిన కలెక్టర్ ప్రసంగం మాత్రం అదుపు తప్పింది. ఈ విషయం వరంగల్ జిల్లా అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఇపుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జెండా వందనం అనంతరం ఆమె తన ప్రసంగం మధ్యలో అదే పనిగా అకారణంగా, అసందర్భంగా నవ్వడం, గణాంకాల దగ్గర తడబడడం, అంతేకాకుండా ‘ఇట్స్ ఫన్నీ’ అంటూ వ్యాఖ్యానించారు. తెలుగులో రాసిన ప్రసంగాన్ని చదువుతూ పలుమార్లు తడబడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి ప్రస్తావన వచ్చినపుడు ఏకంగా వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తనలో తాను ‘ఇట్స్ ఫన్నీ’ అంటూ వ్యాఖ్యానించారు. ఈతతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన భారీ మైకుల ద్వారా అందరికీ వినిపించింది. అంతే కాదు ఆమ్రపాలి తడబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ఆమ్రపాలి తెలుగు తిప్పలు..
-
జూనియర్ ఐపీఎస్తో లవ్ మ్యారేజ్!
-
జూనియర్ ఐపీఎస్తో లవ్ మ్యారేజ్!
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి ఢిల్లీకి చెందిన 2011 బ్యాచ్కు చెందిన సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆమ్రపాలి ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఫిబ్రవరి 18న వీరి పెళ్లి ఢిల్లీలో జరగనుందని సమాచారం. సమీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని చేస్తున్నారు. ఆమ్రపాలి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాట వెంకటరెడ్డి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్షిప్ బ్యాంకర్గా పని చేశారు. 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్లో ఐఏఎస్గా ఎంపికయ్యారు. 2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్ అర్బన్ కలెక్టర్గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్ను ఓడీఎఫ్( ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ)గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం రూరల్ జిల్లాకు కూడా ఇన్ఛార్జి కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
అద్దె చెల్లించలేదని..అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
-
కలెక్టర్ అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం ఉన్న ప్రైవేటు భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయం కోసం వాడుకుంటూ.. రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని, అద్దె బకాయిలు రూ.3 లక్షల చెల్లించాలని నోటీసులు జారీచేసినా కలెక్టర్ స్పందించలేదని పేర్కొంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి.. జిల్లా కలెక్టర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బకాయిలు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఫార్చున్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సిబ్బంది కలెక్టరేట్కు వచ్చారు. -
సాక్షి ఎఫెక్ట్: ఎమ్మార్వో సస్పెండ్
సాక్షి, వరంగల్ రూరల్: పర్వతగిరి తహసీల్దార్ తోట విజయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అమ్రపాలి కాట శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్వతగిరి మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో తహసీల్దారు విజయలక్ష్మి రైతుల నుంచి డబ్బులు తీసుకున్నట్టు సాక్షి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశం మేరకు వరంగల్ రూరల్ ఆర్డీఓ సీహెచ్.మహేందర్జీ విచారణ నిర్వహించి నివేదిక సమర్పిం చారు. నివేదక ఆధారంగా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు సీసీఎల్ఏ నుంచి సైతం రాటిఫికేషన్ తీసుకున్నారు. -
విగ్రహంపై కలెక్టర్ అమ్రపాలి మండిపాటు
-
అమ్రపాలి ఒళ్లో వినాయకుడు; వైరల్
-
అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్లు
-
అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్లు
మహబూబాబాద్: వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రీతిమీనాలు ఆటవిడుపు కోసం బయ్యారం అడవుల్లో కాలి నడకన ప్రయాణించారు. దాదాపు 12 కిలోమీటర్ల పాటు అడవిలో నడిచిన ఇరువురు అధికారులు అడవిలో ఉన్న చెరువును సందర్శించారు. అనంతరం పక్కనే ఉన్న పెద్ద గుట్ట ఇనుప ఖనిజం టూరిజం ప్రాంతాన్ని చూశారు. కలెక్టర్లు ఇద్దరూ ఉల్లాసంగా ఉత్సాహంగా నడుస్తూ ఉంటే.. వారితో పాటు నడవలేక మిగిలిన అధికారులు ఆపసోపాలు పడ్డారు. -
అమ్రపాలి వివాదాస్పద వ్యాఖ్యలు
-
అమ్రపాలి వివాదాస్పద వ్యాఖ్యలు
జాబ్ మేళా సందర్భంగా నిరుద్యోగులకు వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి చేసిన సూచన వివాదాస్పదంగా మారింది. జిల్లాలోని ములుగు వద్ద బుధవారం జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన అమ్రపాలి.. ఉద్యోగం రావాలంటే కొన్ని అబద్దాలు ఆడాల్సివుంటుందని అయితే వాటిని సర్వీసులోకి వచ్చిన తర్వాత నిజం చేయాలని ఉద్యోగార్థులకు సూచించారు. అమ్రపాలి వ్యాఖ్యలతో జాబ్ మేళాకు హాజరైన మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలు కంగుతిన్నారు. వెంటనే స్పందించిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కలెక్టర్ వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వూల్లో అబద్దాలు ఆడితే వెంటనే దొరికిపోతారని అన్నారు. తెలివైన వారు ఎంపిక బోర్డులో ఉంటే వచ్చే ఉద్యోగం కూడా చేజార్చుకోవాల్సి వస్తుందని హితవు పలికారు. కేసీఆర్ సర్కార్ ఉన్నంత వరకు ఎవరూ అబద్ధాలాడి ఉద్యోగం తెచ్చుకోవాల్సి అవసరం ఉండదన్నారు. అయితే కలెక్టర్ స్థాయి ఉద్యోగి అబద్ధాలాడమని చెప్పడం సంచలనంగా మారింది. -
ఫలితాల ఆధారంగా ట్రెండ్
ఎస్బీఐ, హిందుస్తాన్ యూనీలివర్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ వారం తమ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తుండటంతో షేర్ల వారీ కదలికలే ప్రాధాన్యం సంతరించుకుంటాయని నిపుణులంటున్నారు. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్పై ఉంటుందని వారంటున్నారు. ఇప్పటికే మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉందని, కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటే మరింత ముందుకు దూసుకుపోతుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు చెప్పారు. అంతర్జాతీయంగా ప్రధాన సంఘటనలేవీ లేనందున షేర్ల వారీ కదలికలే కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో లాభాల స్వీకరణ, మందగమనం చోటు చేసుకున్నాయని, అయితే పెద్దగా క్షీణత ఉండబోదని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఆర్థిక ఫలితాలు నిరాశకు గురిచేస్తే లాభాల స్వీకరణ కొనసాగుతుందని కోటక్ సెక్యూరిటీస్కు చెందిన ఎనలిస్ట్ టీనా వీర్మాణి అంచనా వేస్తున్నారు. కీలక కంపెనీల క్యూ4 ఫలితాలు..: ఈ వారంలో పలు ప్రధాన కంపెనీలు తమ తమ గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను వెల్లడించనున్నాయి. నేడు వేదాంత, మంగళవారం(ఈ నెల 16న) పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా స్టీల్, బుధవారం(ఈ నెల 17న) హిందుస్తాన్ యూనీలివర్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గురువారం(ఈ నెల18న) బజాజ్ ఆటో, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునైటెడ్ బ్యాంక్, శుక్రవారం(ఈ నెల19న) ఎస్బీఐ, టాటా పవర్ కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి. ఏప్రిల్ నెల వాణిజ్య గణాంకాలను కేంద్రం నేడు(సోమవారం) వెల్లడించనున్నది. -
రెండు రోజుల సెలవులో కలెక్టర్
హన్మకొండ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలి రెండు రోజుల సెలవులో వెళ్తున్నారు. వ్యక్తిగత కారణాలతో శని, ఆదివారం సెలవుపెట్టారు. శనివారం జరిగే మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు హాజరుకానున్నందున ఆ కార్యక్రమాలు చూడాలని జాయింట్ కలెక్టర్ దేవానంద్ను కలెక్టర్ ఆదేశించారు. ఆమె తిరిగి సోమవారం విధుల్లో చేరనున్నట్లు సమాచారం. -
నయా బాస్లెవరో..?
అవిభక్త రంగారెడ్డి జిల్లా విడిపోవడం ఖాయమైంది. విజయదశమి రోజున ఉదయం 10:31 గంటలకు కొత్త జిల్లాల ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ తరుణంలో మంగళవారం పురుడు పోసుకునే జిల్లాలకు కొత్త బాస్లెవరనేది ఉత్కంఠగా మారింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఐఏఎస్లను భారీగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతనంగా ఏర్పడుతున్న 21 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల నియామకానికి రంగం సిద్ధం చేసింది. ఇదే సమయంలో ఇప్పటికే పనిచేస్తున్న అధికారులకు కూడా స్థానచలనం కలిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. – సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రస్తుత రంగారెడ్డి జిల్లా దసరా నుంచి మూడు జిల్లాలు కానుంది. రంగారెడ్డి సహా కొత్తగా వికారాబాద్, మేడ్చల్ పేరిట కొత్త జిలా ్లలు ఏర్పడనున్నాయి. దీంతో ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు మొదలు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల వరకు బదిలీలు తప్పకపోవచ్చు. ఇద్దరు జేసీలు సహా సబ్కలెక్టర్, నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు సీటు మార్పిడి అనివార్యంగా కనిపిస్తోంది. రఘువైపే మొగ్గు! ప్రస్తుత కలెక్టర్ రఘునందన్ రావు సీటుకు ఢోకా లేనట్లే. వివాదరహిత, సమర్థ అధికారిగా గుర్తిం పు పొందిన ఆయననే రంగారెడ్డి జిల్లాకు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ను కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా రఘునందన్ రావు పనితీరు పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. ఆయనను కొనసాగిస్తేనే బాగుం టుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘మీ అభిమానాన్ని చూరగొన్న కలెక్టర్ను మీ జిల్లాలోనే ఉంచుతానని’ సీఎం భరోసా ఇచ్చారు. మరోవైపు తాజాగా జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. కీలకమైన ఈ జిల్లాలో సమర్థపాలనాధికారి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమీకరణల్లో భాగంగా రఘునందన్ రావును కొనసాగించాలనే దృఢనిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జాయింట్ కలెక్టర్ –1 రజత్కుమార్ సైనీని మహబూబ్నగర్ లేదా నల్లగొండ జిల్లా కలెక్టర్గా పంపించే అవకాశాలున్నాయి. ముక్కుసూటి అధికారిగా పేరున్న రజత్కు ప్రాధాన్యత గల పోస్టు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మేడ్చల్ రేసులో ఎంవీ రెడ్డి ప్రతిపాదిత మేడ్చల్ జిల్లాకు తొలి కలెక్టర్ ఎవరనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొత్తగా ఏర్పడే ఈ జిల్లా కలెక్టర్ కుర్చీ రేసులో రాష్ట్ర ఎస్సీల అభివృద్ధి సంస్థ ఎండీ ఎంవీ రెడ్డి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జిల్లాలో పశుసంవర్థకశాఖ ఆర్జేడీగా, జేసీగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయనను కలెక్టర్గా నియమించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. దీంతో ఆయన నియామకానికి ఆమోదముద్ర పడవచ్చనే ప్రచారంవిస్తృతంగా జరుగుతోంది. ఎంవీ రెడ్డితోపాటు వరంగల్ కలెక్టర్ వాకాటి కరుణ పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వికారాబాద్కు ఆమ్రపాలి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా కాట ఆమ్రపాలి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ సబ్కలెక్టర్గా.. ప్రస్తుతం జేసీగా పనిచేస్తున్న ఆమెకు సమర్థ అధికారిగా పేరుంది. ఈ నేపథ్యంలో తొలి కలెక్టర్గా ఆమెకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ చివరి నిమిషంలో సమీకరణలు మారితే తప్ప... ఆమ్రపాలికే అవకాశాలెక్కువ. ఇదిలా ఉండగా, ఇక్కడ సబ్కలెక్టర్గా పనిచేస్తున్న శృతి ఓజాను బదిలీ చేయాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. రెవెన్యూ డివిజన్ పరిధి తగ్గినందున.. సబ్కలెక్టర్ స్థాయి అధికారి అవసరం లేదని భావిస్తున్న సర్కారు.. శృతిని కొత్త జిల్లాల్లో జేసీగా నియమించే అవకాశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. ఇక సరూర్నగర్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్ ఆర్డీఓలు, డీఆర్ఓల బదిలీకి సంకేతాలు అందాయి. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్న వీరికి జేసీలుగా పోస్టింగ్లు ఇవ్వాలని యోచిస్తోంది. -
'ధోనికి అలా జరగడం దురదృష్టకరం'
న్యూఢిల్లీ: పలు ఆరోపణల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గుడ్ బై చెప్పాల్సి రావడం నిజంగా దురదృష్టకరమని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలంగా చట్టసమ్మతి ఉన్న కంపెనీపై ఒక వ్యక్తి ప్రభావం ఎంతమాత్రం ఉండదన్నాడు. 'రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అన్ని సందర్బాల్లో ఒకే రకంగా ఉండదు. కొన్ని సందర్బాల్లో అదే వ్యాపారం చాలా నిజాయితీగా సాగినా.. మరికొన్ని సందర్భాల్లో అంచనాలకు తగ్గట్టుగా ఉండదు. ఒక వ్యక్తి యావత్ సంస్థనే ప్రభావితం చేయలేడు. అటువంటప్పుడు ఆ సంస్థ నుంచి ధోని వైదొలగాలని డిమాండ్ రావడం దురదృష్టమే. ఒక సంస్థ ఇచ్చిన హామీలకు క్రికెటర్ ను టార్గెట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. గతంలో మ్యాగీ నూడుల్స్ వ్యవహారంలో కూడా అమితాబ్ బచ్చన్, మాధూరీ దీక్షిత్, ప్రీతి జింటాలపై కూడా ఇదే తరహాలో విమర్శలను చవిచూడాల్సి వచ్చింది'అని అనిల్ కపూర్ తెలిపాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ధోని వైదొలగాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. నోయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం మానుకోవాలని ధోనికి సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేయడంతో పాటు, ఆ సంస్థ ధోనీని దుర్వినియోగం చేసింది (#AmrapaliMisuseDhoni) అనే హ్యాష్ట్యాగ్తో ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అమ్రాపాలి సంస్థ నుంచి ధోని ఆకస్మికంగా వైదొలిగాడు. -
వెల్డన్ ధోనీ.. మంచి పని చేశావు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ శుక్రవారం రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలి బ్రాండ్ అంబాసిడర్గా వైదొలగడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నోయిడాలోని సదరు రియల్ ఎస్టేట్ సంస్థ బాధితులే కాకుండా సహచర టీమిండియా క్రికెటర్లు కూడా ధోనీ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. ఈ విషయంలో ధోనీకి స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. 'వెల్డన్ ధోనీ. అమ్రాపాలి బిల్డర్ బ్రాండ్ అంబాసిడర్ వైదొలిగావు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెటర్లకు విల్లాలు ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. కానీ ఇవ్వలేదు' అని భజ్జీ ట్వీట్ చేశారు. నోయిడాలోని అమ్రాపాలి రియల్టీ ప్రాజెక్టులో పెండింగ్ పనులు ఎంతకూ పూర్తికాకపోవడంతో విసుగుచెందిన ఆ కాలనీ వాసులు ట్విట్టర్లో ఈ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. తమ సమస్యలు విన్నవించుకుంటూ.. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ధోనీ తీరును కూడా తప్పుబట్టారు. ఈ వివాదం నేపథ్యంలో ధోనీ అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్గా తప్పుకొన్నాడు. Well done @msdhoni for dropping #Amarpali builders s brand ambassadorship..they didn't gave us VILLAS they announce after 2011 worldcup win — Harbhajan Singh (@harbhajan_singh) 16 April 2016 నోయిడా సెక్టర్ 45లోని అమ్రాపాలి 'షప్పైర్' ప్రాజెక్టులో 800 కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, తొలిదఫా ప్రాజెక్టులో ఇప్పటికీ విద్యుత్ సదుపాయం కల్పించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ వివాదంపై గతంలో స్పందించిన ధోనీ బిల్డర్తో మాట్లాడి.. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ధోనీ తప్పుకొన్నా.. సాక్షి కొనసాగుతోంది!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ శుక్రవారం రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలికి గుడ్బై చెప్పాడు. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ పదవికి రాజీనామా చేశాడు. అయితే, ధోనీ భార్య సాక్షి మాత్రం ఇప్పటికీ ఆ కంపెనీతో అనుబంధం కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అమ్రాపాలి మహి డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్లో సాక్షి డైరెక్టర్గా కొనసాగుతున్నట్టు ఆంగ్ల మీడియా ఒకటి వెల్లడించింది. నోయిడాలోని అమ్రాపాలి రియల్టీ ప్రాజెక్టులో పెండింగ్ పనులు ఎంతకూ పూర్తికాకపోవడంతో విసుగుచెందిన ఆ కాలనీ వాసులు ట్విట్టర్లో ఈ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. తమ సమస్యలు విన్నవించుకుంటూ.. ధోనీ ఇకనైన ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం మానుకోవాలని వారు సూచించారు. ఈ అంశం ట్విట్టర్లో హల్చల్ చేసిన నేపథ్యంలో ధోనీ రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, జార్ఖండ్లో పలు స్వచ్ఛంద సేవా పనులు నిర్వహిస్తున్నట్టు చెప్తున్న అమ్రాపాలితో సాక్షి అనుబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. పెండింగ్ పనుల వివాదం నేపథ్యంలో ధోనీతో కలిసి తాము ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయన బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి వైదొలిగారని అమ్రాపాలి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వివాదంలో ధోనీని లాగడం దురదృష్టకమరని, అందుకే ఆయనను దూరంగా ఉండాల్సిందిగా తాము కోరామని పేర్కొంది. నోయిడా సెక్టర్ 45లోని అమ్రాపాలి 'షప్పైర్' ప్రాజెక్టులో 800 కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, తొలిదఫా ప్రాజెక్టులో ఇప్పటికీ విద్యుత్ సదుపాయం కల్పించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ వివాదంపై గతంలో స్పందించిన ధోనీ బిల్డర్తో మాట్లాడి.. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
'అమ్రాపాలికి' ధోని గుడ్ బై
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్ గా భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ధోని వైదొలగాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్రాపాలికి ధోని గుడ్ బై చెప్పాడు. అయితే దీనిపై అమ్రాపాలి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ శర్మ స్పందించాడు. ' గత 6-7 సంవత్సరాల నుంచి ధోని మాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోని ప్రతిష్టను తగ్గించాలనేది మా ఉద్దేశం కాదు. పరస్పర ఒప్పందంలో భాగంగా ధోని అమ్రాపాలి నుంచి బయటకొచ్చాడు' అని అనిల్ శర్మ తెలిపారు. గతవారం నోయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం మానుకోవాలని ధోనికి సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. నోయిడా సెక్టర్ 45లోని 'షప్పైర్' ప్రాజెక్టు మొదటి దశను 2009లో అమ్రాపాలి కంపెనీ ప్రారంభించింది. ఇందులో వెయ్యి ఫ్లాట్లు ఉండగా.. నిర్మాణాలు పూర్తికావడంతో 800 కుటుంబాలు ఇందులోకి మారాయి. అయితే ఈ ప్రాజెక్టులోని చాలా టవర్లకు ఇప్పటివరకు విద్యుత్, సివిల్ పనులు పెండింగ్లో ఉన్నాయని సొసైటీ వాసులు చెప్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ వారు ఆందోళన దిగారు. ఇందులోభాగంగా అమ్రాపాలి ధోనీని దుర్వినియోగం చేసింది (#AmrapaliMisuseDhoni) అనే హ్యాష్ట్యాగ్తో ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ధోనీ వెంటనే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం మానుకోవాలని, తమ సొసైటీలోని పెండింగ్ పనులను పూర్తిచేసేలా కంపెనీపై ఒత్తిడి తేవాలంటూ ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్ గా ధోని తప్పుకోకతప్పలేదు. -
ధోనీ.. నువ్వు ఆ బ్రాండ్ను వదిలేయ్!
న్యూఢిల్లీ: నోయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీ వాసులు ఇప్పుడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆశ్రయించారు. రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం మానుకోవాలని ఆయనకు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తడంతో అమ్రాపాలి కంపెనీ దిగొచ్చింది. హౌసింగ్ సొసైటీలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చింది. నోయిడా సెక్టర్ 45లోని 'షప్పైర్' ప్రాజెక్టు మొదటి దశను 2009లో అమ్రాపాలి కంపెనీ ప్రారంభించింది. ఇందులో వెయ్యి ఫ్లాట్లు ఉండగా.. నిర్మాణాలు పూర్తికావడంతో 800 కుటుంబాలు ఇందులోకి మారాయి. అయితే ఈ ప్రాజెక్టులోని చాలా టవర్లకు ఇప్పటివరకు విద్యుత్, సివిల్ పనులు పెండింగ్లో ఉన్నాయని సొసైటీ వాసులు చెప్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ వారు ఆందోళన దిగారు. ఇందులోభాగంగా అమ్రాపాలి ధోనీని దుర్వినియోగం చేసింది (#AmrapaliMisuseDhoni) అనే హ్యాష్ట్యాగ్తో ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ధోనీ వెంటనే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం మానుకోవాలని, తమ సొసైటీలోని పెండింగ్ పనులను పూర్తిచేసేలా కంపెనీపై ఒత్తిడి తేవాలంటూ ట్విట్టర్, ఫేస్బుక్లో కాలనీవాసులు ఉద్యమాన్ని చేపట్టారు. సొసైటీ వాసుల ఆందోళనతో దిగొచ్చిన అమ్రాపాలి కంపెనీ ఓ ప్రకటన చేసింది. ప్రాజెక్టులో 4 నుంచి 5శాతం పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా 90 రోజుల్లో పూర్తిచేస్తామని హామీ ఇచ్చింది. -
జేసీకి ఊరట
♦ తెలంగాణకే ఆమ్రపాలి కేటాయింపు ♦ టీఎస్ కేడర్లో కొనసాగింపునకు క్యాట్ అనుమతి కేడర్ అలాట్మెంట్పై తుది నిర్ణయం వెలువడింది. ఇకపై రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా. - ఆమ్రపాలి, జేసీ -2 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జాయింట్ కలెక్టర్-2 కాట ఆమ్రపాలికి ఊరట లభించింది. తెలంగాణ కేడర్లో ఆమె కొనసాగడానికి క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) అనుమతి ఇచ్చింది. రాష్ర్ట విభజనలో భాగంగా అఖిల భారత సర్వీసుల అధికారులను విభజించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్ను ఖరారు చేసింది. అయితే, తెలంగాణలో పనిచేసేందుకు ఆసక్తిచూపిన ఆమె.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్ను ఆశ్రయించారు. గతేడాది మార్చి 5న ఆమ్రపాలి పిటిషన్ను విచారించిన క్యాట్.. తుది నిర్ణయం వెల్లడించేవరకు ఆమెను తెలంగాణ లోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆమెకు తెలంగాణ కేడర్ను కేటాయించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో గత 14 నెలలుగా జిల్లాలో సేవలందిస్తున్న ఆమెకు క్యాట్ తాజా నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. -
'ఆమె’కు వందనం ..
ఆమె.. అడ్డంకులను అధిగమించింది.. అభివృద్ధివైపు అడుగులు వేసింది.. అన్నింటా తానై నిలిచింది.. లక్ష్యాలను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. మహిళలు పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారనేది నిన్నటి మాట. పురుషుల కంటే రెట్టింపు స్థాయిలో అవకాశాల్ని అందిపుచ్చుకుని తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారనేది నేటిమాట. రాజకీయం, వ్యాపారం, పాలనాపరమైన రంగాల్లో మహిళలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. జిల్లాలోనూ మహిళలు అత్యున్నత స్థాయిలో కొనసాగుతూ ఆదర్శప్రాయంగా నిలిచిన విజయగాధలెన్నో ఉన్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా రాజకీయాల్లో మహిళలు తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి తీర్పే అభ్యర్థుల భవిష్యత్తును మార్చింది. జిల్లాలో స్థానిక సంస్థల్లో 771 స్థానాలున్నాయి. వీటిలో అత్యధికంగా మహిళలు 424 మంది ఉండడం గమనార్హం. స్థానిక సంస్థల్లో ప్రభుత్వం మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించగా.. అంతకు మించి 55శాతం స్థానాల్లో సీట్లు దక్కించుకున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రజాప్రతినిధుల ఓట్లే ఇద్దరు అభ్యర్థుల గెలుపును నిర్దేశించాయి. జెడ్పీ చైర్మన్గా సునీతారెడ్డి రెండోసారి ఎన్నికై విజయవంతంగా పాలన సాగిస్తున్నారు. కీలకవిభాగాల్లో.. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లోనూ మహిళలు అగ్రభాగాన నిలిచారు. ఎస్పీగా రాజేశ్వరి కొనసాగుతున్నారు. జేసీగా ఆమ్రపాలి విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా నీటి యాజమాన్యసంస్థ, జిల్లా పంచాయతీ శాఖ, పౌరసంబంధాల శాఖ, డీఆర్డీఏ ఏపీడీలుగా ఇద్దరు మహిళలే ఉన్నారు. ఇందిరాక్రాంతి పథంలో 5 మేనేజర్ పోస్టులకుగాను నలుగురు మహిళలు కొనసాగుతున్నారు. మండలాల్లోనూ ‘మహిళా రాజ్యం’ జిల్లాలో పాలనా పరమైన అంశాల్లోనూ మహిళలు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మండల అభివృద్ధికి మూలమైన ఎంపీడీఓ పోస్టుల్లోనూ ఎక్కువగా మహిళలే ఉన్నారు. మొత్తం 33 ఎంపీడీఓలకు గాను 17 మంది మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆరు మండలాల్లో తహసీల్దార్లుగా మహిళలే ఉన్నారు. స్వయం ‘శక్తి’ జిల్లాలో 33,761 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో దాదాపు 3.25లక్షల వరకు మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఏటా కోట్ల రూపాయల రుణాలు తీసుకుని స్వయం ఉపాధిలో విజయవంతమయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14వేల సంఘాలకుగాను రూ. 250కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ రుణాలతో మహిళలు వ్యవసాయం, పాడి పరిశ్రమతో పాటు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. సేవకు నీరాజనం.. బతుకు ‘చక్రం’ తిప్పుతూ ఒకరు.. సాహితీ వనంలో విరిసిన కుసుమం మరొకరు. ఒకరు ఆటో నడుపుతూ కుటుంబాన్ని లాగుతుంటే.. మరొకరు మహిళా సమస్యలను తన రచనలతో లోకానికి చాటుతున్నారు. విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు అందుకుంటున్న తారాబాయి, శ్యామలమ్మలపై ప్రత్యేక కథనం.. బతుకు ‘చక్రం’ తిప్పుతూ.. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన ఆటోడ్రైవర్ తారాబాయి ఇబ్రహీంపట్నం: పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మారుమూల తండాకు చెందినఓ గిరిజన మహిళ. స్టీరింగ్ పట్టి కుటుంబ భారాన్ని నెత్తినవేసుకుంది. 18 ఏళ్లుగా సెవెన్ సీటర్ ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైంది. మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన దుద్లమ్మ, బిక్యానాయక్ దంపతులకు తారాబాయి జన్మించింది. ఆమెకు తోడు అక్క, తమ్ముడు ఉన్నారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబం. తారాబాయి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ నాలుగో తరగతి వరకు చదువుకుంది. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలిచేది. కరువుతో కుటుంబం అప్పుల పాలైంది. బ్యాంకు రుణం తీసుకొని గేదెలను కొనుగోలు చేసి పాడి ఉత్పత్తితో జీవనం సాగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆరుట్లలోని కో-ఆపరేటివ్ బ్యాంకులో సూపర్వైజర్గా పనిచేసే పూర్ణానంద్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 1985లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహానంతరం మౌలాలికి అక్కడి నుంచి ఉప్పల్కు మకాం మార్చారు. కుమారుడు పుట్టి మృతి చెందాడు. భర్త పూర్ణానంద్ ఆనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం చేయించేందుకు సైతం చేతిలో చిల్లిగవ్వ లేకపోయింది. ఓ రోజు ఆటోలో ప్రయాణిస్తుండగా ఆమె మదిలో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే డ్రైవర్ను రోజుకు ఎంత గిట్టుబాటవుతుందని ప్రశ్నించగా రూ.400 వరకు వస్తాయని చెప్పాడు. దీంతో వెంటనే బ్యాంకులో రుణం తీసుకొని 1998లో ఆటో కొనుగోలు చేసింది. మొదట్లో డ్రైవర్ ఆటో నడిపిస్తుంటే ప్రయాణికుల నుంచి కిరాయి వసూలు చేసేది తారాబాయి. డ్రైవర్ను పెట్టుకుంటే గిట్టుబాటు కావడంలేదని స్వయంగా తానే డ్రైవింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రెండుమూడు రోజుల్లోనే డ్రైవింగ్ నేర్చుకొని స్వయంగా సికింద్రాబాద్, ఉప్పల్, హయత్నగర్, కర్మన్ఘాట్, దిల్సుఖ్నగర్ రూట్లలో ఆటో నడపడం ప్రారంభించింది. 1999లో భర్త పూర్ణానంద్ అనారోగ్యంతో కన్నుమూశాడు. తనకు తోడుగా అక్క కుమారున్ని, తమ్ముని ఇద్దరు కూతుళ్లను తెచ్చుకుంది. వారి బాధ్యతలను సైతం స్వీకరించింది. ఐదేళ్ల క్రితం ఇబ్రహీంపట్నంకు మకాం మార్చింది. బ్యాంకు రుణంతో ఇల్లు ఖరీదు చేసింది. ప్రస్తుతం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఆటో నడుపుతోంది. అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉంది.. ఎవరి సొమ్మును ఆశించకుండా కష్టపడి సంపాదించిన దాంట్లో ఎంతో తృప్తి ఉంటుంది. స్వయం కృషితో కుటుంబ భారాన్ని మోస్తున్నా. ఎవరెన్ని రకాలుగా మాట్లాడిన అధైర్యపడకుండా ముందుకు సాగుతున్నాను. ప్రభుత్వం గుర్తించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ మహిళ అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇది నాలాంటి వారెందరో ప్రేరణ అవుతుంది. -తారాబాయి -
ఆరోగ్యశ్రీ కేసులపై ప్రత్యేక శ్రద్ధపెట్టండి
వికారాబాద్: ఆరోగ్యశ్రీ కేసులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని సబ్ కలెక్టర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో కొనసాగుతున్న ఆరోగ్య శ్రీ సేవలను పరిశీలించారు. పలు రికార్డులను క్షుణ్నంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కేసులు గతేడాది కంటే తక్కువగా నమోదు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందన్నారు. ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ లేకపోవడం, సరైన పరికరాలు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కేసుల సంఖ్య తగ్గినట్లు వైద్యులు వివరించారు. వెంటనే ఈ విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అయితే మే నెలలో ఒక ఆరోగ్యశ్రీ కేసు కూడా నమోదు కాకపోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఈ కేసులకు సంబంధించి నిర్లక్ష్యం వహించొద్దని వైద్యులకు సూచించారు. అనంతరం కంటి పరీక్షల విభాగాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ రితేష్సింగ్, డివిజన్ టీంలీడర్ వీరేశం, నెట్వర్క్ టీంలీడర్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్ సీడింగ్ చేస్తేనే రేషన్ సరుకులు
తాండూరు రూరల్: గ్రామాల్లో రేషన్ సరుకులు అందాలంటే లబ్ధిదారుల నుంచి డీలర్లు ఆధార్ కార్డులు సేకరించి సీడింగ్ చేస్తేనే సరుకులు వస్తాయని వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలోని ఠాగూర్హాల్లో నియోజకవర్గ స్థాయి ఆహార సలహా సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్డు ఉన్న లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలన్నారు. గతంలో అనేకసార్లు ఆధార్ జిరాక్స్లు సేకరించాలని డీలర్లకు చెప్పినా పట్టించుకోలేదని, పది రోజుల్లో డీలర్లు లబ్ధిదారుల నుంచి సేకరించాలన్నారు. అవసరమైతే ఇంటింటింకి వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకోవాలన్నారు. దీని ద్వారా గ్రామాల్లో బోగస్ కార్డులను కూడా గుర్తించవచ్చన్నారు. బోగస్కార్డుల ఏరివేత వేగిరం చేయాలన్నారు. చనిపోయిన, పెళ్లి చేసుకొని వెళ్లిన వారి పేర్లను త్వరగా తొలగించాలన్నారు. గత ప్రభుత్వ రచ్చబండ కార్యక్రమంలో కూపన్లు ఇచ్చిన వారికి కూడా ఆధార్ కార్డుల జిరాక్స్ ఇస్తే త్వరలో బియ్యం ఇస్తామని ఆమె చెప్పారు. రేషన్ డీలర్లు ప్రతి నెలా 18వ తేదీలోపు డీడీలు కట్టాలన్నారు. సీడింగ్ చేయకపోతే డీలర్ను తొలగిస్తాం.. గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డుల జిరాక్స్లు సేకరించి సీడింగ్ చేయకపోతే సదరు రేషన్ డీలర్ను తొలగిస్తామని సబ్కలెక్టర్ హెచ్చరించారు. పూర్తిస్థాయిలో కార్డులు సేకరించాలన్నారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి, పాషాపూర్ గ్రామాల్లో డీలర్లు ఆధార్ కార్డుల సీడింగ్ తక్కువ శాతం నమోదు చేశారన్నారు. వారం రోజుల్లో ఎక్కువ మొత్తంలో సీడింగ్ చేయకపోతే డీలర్ను తొలగిస్తామని హెచ్చరించారు. ఇప్పట్లో కొత్త కార్డులు లేవు.. ఇప్పట్లో కొత్త కార్డులు వచ్చే పరిస్థితి లేదని సబ్ కలెక్టర్ వెల్లడించారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో గ్రామానికి ఎన్ని రేషన్కార్డులు అవసరం ఉంన్నాయనే విషయాలను డీలర్ నుంచి నివేదిక తెప్పిస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు డుమ్మా.. ఆహార సలహా సంఘం సమావేశానికి నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు హాజరుకలేదు. ఆయా మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీ, పార్టీల ప్రతినిధులు హాజరు కవాల్సి ఉన్నా ఎవరూ కూడా హాజరు కాలేదు. యాలాల ఎంపీపీ సాయిలుగౌడ్ మాత్రమే కార్యక్రమానికి వచ్చారు. దీంతో ప్రజల సమస్యలు అధికారులకు విన్నవించే నాయకుడు కానరాలేదు.కార్యక్రమంలో పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ తహసీల్దార్లు, పౌరసరఫరశాఖ అధికారులు, రేషన్ డీలర్లు, ఆహార సలహా సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
ఊరేగింపులు, ర్యాలీలు నిషేధం
ఆలంపల్లి, న్యూస్లైన్: ఈనెల 16 వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సోమవారం ఎస్పీ వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌం టింగ్ను పర్యవేక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ పట్టణంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10:30 గంటలకు ముగిసిందని ఎస్పీ పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు అనుమతి లేదని ఆమె చెప్పారు. ఈనెల 16 తర్వాత అనుమతులు పొంది ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. వికారాబాద్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ.. వికారాబాద్లోని 27 వార్డులకు కౌం టింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. కౌం టింగ్కు సహకరించిన అధికారులకు, నాయకులకు ఆమె అభినందనలు తెలిపారు. నెలకు పైగా ఉత్కం ఠతో ఎదురు చూసిన మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో టెన్షన్కు తెరపడింది. అంతా సవ్యంగా జరగడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
భద్రత డొల నీళ్లలో ఈవీఎంలు
వికారాబాద్, న్యూస్లైన్: ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు)ల భద్రత డొల్లేనని తేలింది. అధికారుల నిర్లక్ష్యానికి వికారాబాద్ స్ట్రాంగ్రూం ఘటన నిలువుటద్దంగా నిలిచింది. బుధవారం కురిసిన ఆకాల వర్షానికి అందులోని ఓటింగ్ యంత్రాలు తడిసిముద్దయ్యాయి. మోకాల్లోతు నీరు గది లోపలికి చేరడంతో ఈవీఎంలు నీటిలో మునిగాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు తాపీగా అక్కడకు చేరుకొని.. తడిసిన ఈవీఎంలను అరబెట్టడం కొసమెరుపు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్లోని మహావీర్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 580 బ్యాలెట్ యూనిట్లు, 520 కంట్రోల్ యూనిట్లను ఇక్కడి గదుల్లో ఉంచారు. వీటిని కంటికిరెప్పలా కాపాడేందుకు సాయుధ పోలీసులు, అసిస్టెంట్ రిటర్నింగ్ స్థాయి అధికారిని నియమించారు. అయితే, భారీ వర్షం కురిసిన సమయంలో ఇక్కడ వీరెవ్వరూ లేనట్లు ఉన్నతాధికారుల విచారణలో స్పష్టమైంది. తాపీగా వచ్చారు.. బుధవారం సాయంత్రం ఎడతెరిపిలేకుండా వాన కురిసింది. గాలి కూడా తోడుకావడంతో వాన ఉధృతి పెరిగింది. ఈ క్రమంలోనే ఈవీఎంలను భద్రపరిచిన మహావీర్ ఆస్పత్రి గదుల ను వర్షపు నీరు ముంచెత్తింది. స్ట్రాంగ్ రూంలోకి నీరొచ్చిన విషయాన్ని అర్ధరాత్రి తెలుసుకున్న సబ్కలెక్టర్/ రిటర్నింగ్ అధికారి ఆమ్రపాలి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తడిసిన ఈవీఎంలను ఆమెతో సహా ఎన్నికల సిబ్బంది శుభ్రపరిచారు. గురువారం మధ్యాహ్నం వరకు అక్కడే తిష్టవేసిన ఆమ్రపాలి ఈవీఎంలను అరబెట్టడాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలావుండగా, స్ట్రాంగ్రూంలకు కాపలా ఉండాల్సిన పోలీసులు/ ఏఆర్ఓ సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంతో ఈవీఎంలు నీటమునిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. సాయంత్రం వర్షంకురిస్తే అర్ధరాత్రి ఒంటి గంటవరకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వర్షంపడే సమయంలో వీరు అక్కడలేకపోవడంతో సమాచారం చేరవేయలేదని, ఈవీఎంల భద్రతను చూడాల్సిన సిబ్బంది నిర్లిప్తంగా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని రిట ర్నింగ్ అధికారిని ఆదేశించినట్లు తెలిసింది. -
మున్సి‘పోల్స్’కు గట్టి నిఘా
ఆలంపల్లి, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ప్రత్యేక బృందాలతో గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు సబ్ కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందంలో ఫారెస్టు, ఎక్సైజ్, పీఆర్ అధికారులు, ఇతర శాఖల గెజిటెడ్ అధికారులను నియమిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి టీంలో పోలీసు, రెవెన్యూ ఎక్సైజ్ అధికారులతో పాటు ఓ వీడియోగ్రాఫర్ ఉంటారని, వారికి ప్రత్యేక వాహనం కేటాయించినట్లు ఆమ్రపాలి తెలిపారు. తాండూరు, వికారాబాద్ అతి దగ్గరలో కర్ణాటక సరిహద్దు ఉంటడం కారణంగా జిల్లాకు మద్యం వచ్చే ప్రమాదం ఉందని, దీనిపై నిఘా వేయాలని అధికారులకు సూచించారు. వికారాబాద్ డీఎస్పీ నర్సింలు మాట్లాడుతూ.. ప్రవేటు వాహనాలే కాకుండా అంబులెన్సులు, పోలీసు వాహనాలను కూడా తనిఖీ చేస్తామన్నారు. రూ.40 వేలకు మించి నగదుకు తగిన వివరాలు లే కుంటే ఐటీకింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ‘మీ కోసం’ అనే సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు.. సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చన్నారు. రాంగ్ కాల్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆరు వాహనాలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని మర్పల్లి, మోమిన్పేట్, ధారూరు, బంట్వారం, వికారాబాద్లో ప్రత్యేకంగా నిఘా పెంచుతున్నామన్నారు. అనుమతులు లేకుండా వాహనాలకు బ్యానర్లు, పోస్టర్లు అంటిచరాదని సూచించారు. గ్రామాల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తాండూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరీష్, వికారాబాద్ సీఐ లచ్చిరాంనాయక్, ఎక్సైజ్ సీఐ సుధాకర్, గోపీనాథ్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
ఓటరు కార్డుల జారీకి ప్రాధాన్యం ఇవ్వండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటరు గుర్తింపు కార్డుల జారీకి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వి రెడ్డి మీ సేవా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. మీ సేవా కేంద్రాల ద్వారా ఎపిక్ కార్డుల జారీ, ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, పోలింగ్ సిబ్బంది వివరాలు తదితర అంశాలపై తహసీల్దార్లు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో జేసీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ..పెద్ద ఎత్తున నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డుల జారీకి మీ సేవా కేంద్రాలు ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఓటర్ల నమోదు, జాబితాపై వచ్చిన అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లను జేసీ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. వారం రోజుల తర్వాత ఓటర్లకు కలర్ ఎపిక్ కార్డులు జారీ చేయనున్నట్లు జేసీ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 35 వేల మంది సిబ్బంది అవసర ం ఉంటుందని, పూర్తిస్థాయి వివ రాలు వెంటనే అందజేయాలని తహసీల్దార్లను జేసీ ఆదేశించారు.కాన్ఫరెన్స్లో వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, డీఐఓ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ సరుకులు పక్కదారి పట్టొద్దు
వికారాబాద్, న్యూస్లైన్ : చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకట్రెడ్డి ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్నికలు తదితర అంశాలపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రేషన్ డీలర్లు సరుకులను బ్లాక్మార్కెట్ తరలిస్తున్నారన్న ఫిర్యాదులు తరచూ తన దృష్టికి వస్తున్నాయని, అధికారులు ఎప్పటికప్పుడు దుకాణాలను తనిఖీ చేస్తూ సరుకులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిత్యావసర సరుకులు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కొందరు డీలర్లు బియ్యం, పంచదార, పామాయిల్ను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాలని సూచించారు. స్టాక్ పాయింట్లో అక్రమాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తనిఖీలకు అధికారులు ఉపక్రమించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందని, తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని జేసీ హెచ్చరించారు. వికారాబాద్లో వంట గ్యాస్ కనెక్షన్ల మంజూరు, సిలిండర్ల సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీలర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలకు సిద్ధం కండి.. త్వరలో ఎన్నికలు జరుగనున్నందున అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేసి అధికారులు సిద్ధంగా ఉండాలని జేసీ సూచించారు. ఓటరు జాబితాలు సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, అవసరమైన సిబ్బంది నియామకంపై దృష్టి సారించాలన్నారు. వికారాబాద్లో సబ్ కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల కొత్త భవనాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సబ్కలెక్టర్ ఆమ్రపాలిని జేసీ ఆదేశించారు. అల్ట్రా మోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి 30 ఎకరాలు.. వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలో ఆర్టీసీ ఏర్పాటు చేయదలచిన అల్ట్రా మోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి 30ఎకరాల ప్రభుత్వ భూమిని త్వరలోనే అందజేయనున్నట్టు జేసీ ఎంవీరెడ్డి తెలిపారు. ఈ భూమిలో కొందరు ప్రైవేట్ పట్టాదారులకు 4.35 ఎకరాలు ఉన్నందున వారికి పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోనున్నట్టు వివరించారు. సమీక్ష సమావేశంలో సబ్కలెక్టర్ ఆమ్రపాలి, డీఎస్వో నర్సింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ప్రభుదాస్, భూ సర్వే అసిస్టెంట్ డెరైక్టర్ అనంతరెడ్డి, తహసీల్దార్లు గౌతంకుమార్, రాములు, డిప్యూటీ తహసీల్దార్ అమరలింగం గౌడ్, ఆర్ఐలు పాల్గొన్నారు. -
పెద్దేముల్లో సబ్కలెక్టర్ పర్యటన
పెద్దేముల్, న్యూస్లైన్: పెద్దేముల్లో బాలిక మెడలో వృద్ధుడు తాళి కట్టాడని వచ్చిన వార్తలపై మంగళవారం వికారాబాద్ సబ్కలెక్టర్ ఆమ్రపాలి బహిరంగ విచారణ చేపట్టారు. సబ్కలెక్టర్, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారులు గ్రామానికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముందుగా సబ్కలెక్టర్ బాలిక నానమ్మ మొగులమ్మతో మాట్లాడుతూ వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. జరిగిన విషయం చెప్పాలని..ఎవరికీ భయపడొద్దని చెప్పారు. అయితే బాలికకు పెళ్లి జరగలేదని కుటుంబ సభ్యులు ముక్తకంఠంతో చెప్పారు. గ్రామస్తులను కూడా ఆమ్రపాలి ప్రశ్నించారు. ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని కోరగా..ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె వెనుదిరిగారు. సబ్కలెక్టర్ వెంట రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు. కాగా బాలికను మంగళవారం రాత్రి తాండూరు నుంచి నగరంలోని నింబోలిఅడ్డ బాలికల హోంకు తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం
యాలాల, న్యూస్లైన్: రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని అగ్గనూరు వీఆర్వో మునియప్ప దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని రసూల్పూర్ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బషీరాబాద్ మండ లం మంతన్గౌడ్ గ్రామానికి చెందిన మునియప్ప(45) మండల పరిధిలోని అగ్గనూరు గ్రామ క్లస్టర్ వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన తోటి ఉద్యోగులతో కలిసి తాండూరుకు వచ్చా రు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఆయన తన బైకుపై స్వగ్రామానికి వెళ్తుండగా రసూల్పూర్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మునియప్ప అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో యాలాల నుంచి తాండూరుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం గమనించి కుటుంబీకులకు, పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబీకులు, యాలాల రెవెన్యూ సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య అంబమ్మతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. శనివారం సస్పెన్షన్ వేటు.. బషీరాబాద్ మండలం మంతన్గౌడ్ గ్రామ వీఆర్ఏ(కావలికారు)గా విధులు నిర్వహిస్తున్న మునియప్ప రెండేళ్ల క్రితం పదోన్నతిపై అగ్గనూరు వీఆర్వో బాధ్యతలు స్వీకరించారు. మునియప్ప అందరితో కలివిడిగా ఉండేవారని బంధువులు, గ్రామస్తులు, నాయకులు తెలిపారు. కాగా శనివారం ఇసుక మేటలను పరిశీలించడానికి వచ్చిన వికారాబాద్ సబ్కలెక్టర్ ఆమ్రపాలి ఆధార్ సీడింగ్ ప్రక్రియలో వెనుకబడ్డారనే కారణంతో మునియప్పతో పాటు మరో వీఆర్వో వెంకటయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయమై ఆదివారం ఉదయం నుంచి తన తోటి ఉద్యోగులు, మిత్రుల వద్ద చెబుతూ మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలోనే ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఉండొచ్చని తోటి ఉద్యోగులు అనుమానిస్తున్నారు.