Ananya Nagalla
-
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది. కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ రచన, దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది.తాజాగా ఈ చిత్రం సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. కామెడీ, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఓటీటీలో ఓ లుక్కేయండి. షెర్లాక్ హోమ్స్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారంటే.. ఈ సినిమాలో డిటెక్టివ్ తల్లి పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, హీరో పేరు ఓం ప్రకాశ్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ అన్నీ కలిపి షెర్లాక్ హోమ్స్ అని పెట్టారు.(చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)కథేంటంటే?రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు (1991 మే 21న) శ్రీకాకుళం బీచ్లో మేరీ అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న సీఐ భాస్కర్ (అనీష్ కురివెళ్ల) వారం రోజుల్లో హంతకుడిని పట్టుకుంటానని, లేదంటే ఉద్యోగానికే రాజీనామా చేస్తానని శపథం చేస్తాడు. కానీ రాజీవ్ గాంధీ హత్య కేసు గురించి ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ పోలీస్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తుంది. కేసు పరిష్కరించకపోతే పరువు పోతుందని దాన్ని ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిషోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనక మేరీ స్నేహితులు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నాడు. వీరిలో మేరీని చంపిందెవరు? దానిక గల కారణమేంటి? షెర్లాక్ హంతకుడిని తనకిచ్చిన గడువులో పట్టుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి -
క్షమాపణ చెబితే సరిపోతుందా?.. హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉంది. గతేడాది పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్ను మెప్పించింది. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఓ ఈవెంట్కు వెళ్లాల్సిన అనన్య నాగళ్లకు ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. తన బ్యాగేజ్ ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మీరు ఇంత సింపుల్గా సారీ చెప్తే సరిపోతుందా అంటూ విమానసంస్థ కస్టమర్ కేర్ వారితో ఫోన్లో మాట్లాడింది. మీరు ఆలస్యం చేయడం వల్ల దాదాపు 2 వేల మంది విద్యార్థులు నాకోసం వేచి ఉండాల్సి వచ్చిందని ఓ వీడియోను షేర్ చేసింది.అనన్య తన ట్వీట్లో రాస్తూ..'నేను ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మధురైకి ఒక ఈవెంట్ కోసం వెళ్తున్నా. నా రెండు బ్యాగేజీలను చెక్ ఇన్ చేశా. కానీ వాటిలో ఒకటి 6 గంటలు ఆలస్యమైంది. నేను కస్టమర్ కేర్ను సంప్రదించినప్పుడు వారు సింపుల్గా క్షమించండి అని చెబుతున్నారు. నా బ్యాగ్ను తర్వాత అందుబాటులో ఉన్న విమానంలో పంపుతారట. ఇది ఆమోదయోగ్యం కాదు. మీకో రూల్, మాకో రూల్ ఎందుకు ఉన్నాయి. ప్యాసింజర్ ఒక నిమిషం ఆలస్యం అయితే.. అనుమతించలేమని మీరు చెబుతారు. ఇప్పుడేమో 6 గంటల లగేజీ ఆలస్యం జరిగింది. దీని కారణంగా దాదాపు 2000 మంది విద్యార్థులు నా కోసం వేచి ఉండాల్సి వచ్చింది. క్షమించండి అని చెప్పడం కరెక్ట్ కాదంటూ విమానయాన సంస్థ కస్టమర్ కేర్కు ఇచ్చిపడేసింది డార్లింగ్ బ్యూటీ'.కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది. I was travelling from Hyderabad to Madhurai today morning for an event . I have checked in two baggages and one of it got delayed for 6 hours. when i contacted the customer care they are simply saying sorry and they will send it in next available flight. @IndiGo6E this is… pic.twitter.com/WtbFgST7ff— Ananya Nagalla (@AnanyaNagalla) February 14, 2025 -
బీచ్లో అనన్య నాగళ్ల చిల్.. స్టన్నింగ్ లుక్లో సలార్ నటి!
బీచ్లో అనన్య నాగళ్ల చిల్..స్టన్నింగ్ లుక్లో సలార్ నటి శ్రియా రెడ్డి..పింక్ డ్రెస్లో సింగర్ మధు ప్రియ పోజులు..బ్లూ డ్రెస్లో కాజల్ అగర్వాల్ క్రేజీ అవుట్ఫిట్..లేటేస్ట్ పిక్ షేర్ చేసిన మిహికా బజాజ్.. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
అనన్య నాగళ్ల కొత్త ఫోటోలు చూశారా? ఆహా అనిపించేలా అందాలు
-
దుబాయ్లో కీర్తి సురేశ్.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న అనన్య..!
దుబాయ్లో కీర్తి సురేశ్ చిల్...సెల్ఫీ మోజులో శ్రద్ధాకపూర్..శారీలో లావణ్య త్రిపాఠి ఫోటో షూట్..పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సాక్షి అగర్వాల్...బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
కొంచెం కొత్తగా ఉందాం
క్యాలెండర్ మారితే సంతోషపడటం కాదు. మనం ఏం మారామనేది ముఖ్యం. అవే పాత అలవాట్లు.. పాత తలపోతలు పాత బలహీనతలు.. పాత అనవసర భారాలు... వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మీరు అదే పాత మనిషి అవుతారు. కొత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ చుట్టూ మిమ్మల్ని మబ్బులో పెట్టి పబ్బం గడిపే వారుంటారు. మబ్బు వీడండి.. కొత్త మనిషిగా ముందుకు అడుగు వేయండి. హ్యాపీ న్యూ ఇయర్.రొటీన్లో ఉండే పెద్ద ప్రమాదం ఏమిటంటే... మనం సత్యాన్ని కనుగొనలేము. అవే రక్తసంబంధాలు, బంధువులు, స్నేహితులు... మన చుట్టూ ఉంటారు. రొటీన్లో ఉంచుతారు. వారు చేసే మంచి, చెడు... మనం క్షమించుకుంటూ, బాధపడుతూ ముందుకెళ్లిపోతూ ఉంటాం. కాని ఆగాలి. దూరంగా జరగాలి. కొన్నాళ్లు కలవకుండా ఉండి, స్థిమితంగా ఆలోచించి, వీరిలో నిజంగా మీకు సంతోష ఆనందాలు ఇస్తున్నది ఎవరు, మీ అభిమానాన్ని ప్రేమని దుర్వినియోగం చేయకుండా ఉన్నది ఎవరు, మీకు అపకారం లేదా అవమానం చేస్తున్నది ఎవరు... అనేది మీరు గమనించి చూసుకుంటే, కాస్త కఠినంగా మారి, వీరితో ఎడంగా ఉండాలని ఈ సంవత్సరం మీరు నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు.⇒ మంచి ఆలవాట్లు చేసుకోవడం తర్వాత. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అవి మనకు తెలుసు. వాటి వల్ల ప్రమాదమూ తెలుసు. గిల్ట్ అనిపించడమూ తెలుసు. వాటిని వదిలించుకోవాలి. మీ ఎంపికే మీ ఫలితం. మీరు చెడు అలవాటు ఎంచుకుంటే చెడు ఫలితం వస్తుంది. దానిని వదిలించుకుంటే చెడు వదిలిపోతుంది. గట్టిగా నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా మారతారు.⇒ వాయిదా వేయడం వల్లే మనిషి జీవితంలో మంచి వాయిదా పడుతూ ఉంటుంది. రేపు చేద్దాం, తొందరేముందిలే, ఇవాళ బద్దకం అంటూ మీరు పోస్ట్పోన్ చేసిన ప్రతిదీ మీకు సరైన సమయంలో సరైన రైలు అందకుండా చేస్తుంది. రైలు మిస్సయ్యాక మరో రైలు కోసం స్టేషన్లో పడి ఉండే ధోరణి మీలో ఉన్నంత కాలం మీరు కొత్త మనిషిగా మారలేరు... ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా. రోజూ ఉదయం ఇవాళ చేయాల్సిన పనులు అని రాసుకోవడం... చేశాకే నిద్రపోవడం మీకో కొత్త జీవితాన్ని తప్పక ఇస్తుంది.⇒ మీ భౌతిక, మానసిక ఎదుగుదల గత సంవత్సరం ఎలా సాగింది? ప్రశ్నించుకోండి. మీ మేధస్సు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వీటిని ఎంతమేరకు పెంచుకున్నారో చూసుకోండి. చిల్లర విషయాలకు నెలలు నెలలు ఎలా తగలెట్టారో మీకే తెలుసు. మంచి పుస్తకాలు, సంగీతం, మంచి సినిమాలు, ఆధ్యాతికత, విహారం, కొత్త ప్రాంతాల... మనుషుల సాంగత్యం... ఇవి మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. డిసెంబర్ 31 పార్టీ చేసుకుని మళ్లీ డిసెంబర్ 31 పార్టీ మధ్యలో గతంలోలా ఉంటే న్యూ ఇయర్ రావడం ఎందుకు? పార్టీ చేసుకోవడం ఎందుకు?⇒ కుటుంబ సభ్యులను చూసుకోవడం వేరు. వారిని ‘తెలుసుకోవడం’ వేరు. వారి మనసుల్లో ఏముంది, ఆకాంక్షలు ఏమిటి, ఒకరితో మరొకరికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి, ప్రేమాభిమానాల కొలమానం ఎలా ఉంది... సరిగ్గా సమయం గడిపితే తెలుస్తుంది. షేర్లు, బంగారం పెరుగుదల తెలుసుకోవడం కంటే కూడా ఒక కుటుంబ సభ్యుడి మనసు తెలుసుకోవడం కుటుంబ వికాసానికి ముఖ్యం.⇒ చట్టాన్ని, నియమ నిబంధలను, ΄ûర బాధ్యతను, కాలుష్యం పట్ల చైతన్యాన్ని కలిగి ఉంటే రుతువులు గతి తప్పవు. ఎండా వానల వెర్రి ఇంట్లో జొరబడదు.కొత్త అంటే పాతను, పాతలోని చెడును తొలగించుకోవడమే.వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిజీవితం వరకు గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, కొత్త సంవత్సర లక్ష్యాలు మన వెండి తెర వెలుగుల మాటల్లో...జ్ఞాపకాల పునాదిపై స్వప్నాల మేడగతం అనేది జ్ఞాపకం. అలాగే భవిష్యత్ అనేది స్వప్నం. జీవితం ఎప్పుడూ జ్ఞాపకాలకు, స్వప్నాలకు మధ్యలో ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. గతానికీ, భవిష్యత్కు మధ్యలో ఉండేదే మన జీవితం. అయితే గతాల పునాదిపై భవిష్యత్ భవనాన్ని కట్టుకోవాలి. జ్ఞాపకాల పునాదిపైన స్వప్నాల మేడ నిర్మించుకోవాలి. జ్ఞాపకాలను కేవలం పునాదిలాగా మాత్రమే వాడుకోవాలి. పునాది ఎప్పుడూ మేడ కాదు.. పునాది ఎప్పుడూ భవనం కాదు. కాకపోతే ఆ భవనం పటిష్టంగా ఉండాలనే పునాది మాత్ర గట్టిగా ఉండాలి. అంటే గతమనేది గట్టిగా ఉండాలి. గతంలోని మంచి విషయాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలన్నింటిని కూడా పోగుచేస్తేనే భవిష్యత్ భవనం పటిష్టంగా ఉంటుంది. చాలా కాలం నిలిచి ఉంటుంది.మనల్ని నిలబెడుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే.. ఆత్రేయగారు ఒకమాట చె΄్పారు. ‘వచ్చునప్పుడు కొత్తవే వచ్చరాలు.. పాతబడిపోవు మన పాత పనుల వలన’ అన్నారు. అంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది. కానీ, మనం చేసే పాత పనుల వల్ల ఆ కొత్త సంవత్సరం కాస్తా పాతబడిపోతుంది. మనం కొత్త పనులు చేయాలి.. కొత్త ఆలోచనలు చేసుకోవాలి. కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు, కొత్త ధ్యేయాలను మనం పెట్టుకొని ముందుకెళ్లాలి. ముఖ్యంగా ఆ రోజుల్లోనే మంచిది, మా చిన్నప్పుడు బాగుండేది అంటూ గతంతో ఎప్పుడూ కాలయాపన చేయకూడదు.కొత్త విషయాలు ఏంటి? కొత్త పరిజ్ఞానం ఏంటి? కొత్త సాంకేతికత ఏంటి... వంటి వాటిని ఆమోదించాలి, ఆహ్వానించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. దాని ద్వారా మనం సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ కేవలం మనం గతాన్ని పొగుడుతూ.. ఈ తరాన్ని, ఈ కాలాన్ని నిందించకూడదు, నిరసన తెలియచేయకూడదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త ఆలోచనలతో, కొత్త తరాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎప్పుడూ విజేతలం కాగలం. ముందు ఆ విషయాన్ని మనం ఆమోదించాలి. అప్పుడే దానిద్వారా మనం ముందుకెళ్లేలా నిచ్చెనలాగా, వారధిలాగా పనికొస్తుంది. అప్పుడే జీవితం కొత్తగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు.. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు. కొత్తగా మనం జీవితాన్ని మలచుకొనే అవకాశం ఉంటుంది. కొత్త తరాన్ని, కొత్త భావజాలాన్ని మనం అర్థం చేసుకుని ఆమోదిస్తే గనక ఏ గొడవా ఉండదు, ఏ పేచీ ఉండదు.. చక్కగా ముందుకు వెళ్లొచ్చు.⇒ ప్రతి పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. అట్లాగే... ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించే కోణంలో నాదొక సూచన ఏంటంటే... నేడు పొందే ఆనందం.. రేపటి ఆనందాన్ని హరించకూడదు. ఈ రోజు ఎంత ఆనందాన్నైతే అనుభవిస్తున్నామో... ఈ ఆనందం వల్ల..రేపటి ఆ ఆనందానికి అది హాని కలుగ చేయకూడదు. రేపటి ఆనందానికి ఏ రకంగానూ ప్రభావం చూపకూడదు. రేపటి ఆనందాన్ని అనుభవించగలిగేలాగే ఉండాలి ఈ రోజుటి ఆనందం. అంటే ఓ హద్దులో.. పరిమితిలో.. ప్రతిరోజూ మనం పని చేస్తూ, ఆనందాన్ని అనుభవిస్తుంటే గనక రేపటి ని మరింత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. సంపాదన కోసం కొంత సమయం, సమాజం కోసం కొంత సమయం, నీ శరీరం కోసం కొంత సమయం, నీ సొంత కుటుంబం కోసం కొంత సమయం... ఇంతే..! – చంద్రబోస్హెల్త్... హార్డ్వర్క్మనం ప్రతి ఒక్కరం కెరీర్ కోసం చాలా కష్టపడతాం. హార్డ్వర్క్ చేస్తాం. ఆ కష్టం వృథా కాదు. మన కష్టమే మనల్ని ఓ స్థాయికి చేర్చుతుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఇంకా కష్టపడి పని చేద్దాం... అయితే కెరీర్ గ్రోత్ మాత్రమే కాదు... మన వ్యక్తిగత ఆనందానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. హార్డ్ వర్క్... హెల్త్... హ్యాపీనెస్... ఈ మూడూ ముఖ్యం. వీటికి అనుగుణంగా లైఫ్ని ప్లాన్ చేసుకుని పాజిటివ్గా ముందుకెళ్లడమే. కెరీర్ కోసం హ్యాపీగా కష్టపడదాం... మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండి... హ్యాపీగా ఉందాం.2024 గురించి చెప్పుకోవాలంటే... నేను ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించానన్నది పక్కనపెడితే, నాకు తెలియనివి అన్నీ నేర్చుకునేందుకు సహకరించిన సంవత్సరంగా అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో సహనమే కీలకం అనే విషయాన్ని నాకు నేర్పించింది. అంతేకాదు నేను గమనించిన మరో ముఖ్య విషయం ఏమిటంటే... ఎన్ని సినిమాలు చేశాం, నా తరువాత సినిమా ఏంటి, ఎప్పుడు అని ఎదురు చూడటం కన్నా, సెట్స్లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాం, షూటింగ్లో ఎంత సక్సెస్పుల్గా .. ఎంత టీమ్ స్పిరిట్తో.. ఎంత ఎఫర్ట్ఫుల్గా పనిచేశామన్నది ముఖ్యం.రేటింగ్ విషయానికొస్తే... 1 నుంచి పది పాయింట్లలో నేను 2024కు 6 పాయింట్లు ఇస్తాను. ఎందుకంటే, 2024 నాకెంతో నేర్పించింది. దాంతోపాటు అనేక సవాళ్లను కూడా ఇచ్చింది మరి!2024లో నాకు సంతోషం కలిగించిన విషయాలు... మొదటిసారిగా నేను నా ఫ్యామిలీతో యూఎస్ ట్రిప్కు వెళ్లడం, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగలగడం.2025 మీద నా అంచనాలు: షూటింగ్లతో బిజీగా ఉండటం, చాలా ఎగై్జటింగ్ స్టోరీస్, అద్భుతమైన టీమ్ నా చేతిలో ఉన్నాయి. వాటితో కనీసం రెండు మూవీస్ అయినా 2025లో రిలీజ్ కావాలి. ఇంకా కష్టపడటం, పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేయడం, నా గోల్స్. – ఆనంద్ దేవరకొండస్ట్రాంగ్గా... పాజిటివ్గా...మన ఎదుగుదలకు ఓ కారణం ‘సెల్ఫ్ లవ్’. ముందు మనల్ని మనం ఇష్టపడాలి... గౌరవించుకోవాలి. 2025 సౌండింగ్ చాలా బాగుంది. ఏదో పాజిటివిటీ కనబడుతోంది. ఓ పాజటివ్ ఫీలింగ్తో ఈ ఇయర్లో మనం హ్యాపీగా, హెల్దీగా, పాజిటివ్గా ముందుకు సాగుదాం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. అందుకని ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. యోగా చేయాలి... రోజూ కొంచెం సేపు ధ్యానానికి కేటాయించాలి. ఆరోగ్యంగా ఉండాలి... కష్టపడి పని చేయాలి. ఆత్యవిశాస్వంతో బతకాలి.నాకు డైరీ రాసే అలవాటు ఉంది. 2024లో పుషప్స్, ఫులప్స్, హ్యాండ్స్ట్రెంగ్త్పై దృష్టి పెట్టాలనుకున్నాను. కాని అది అవ్వలేదు. ఒక లవ్స్టోరీలో నటించాలనుకున్నాను. అఫ్కోర్స్ అది మన చేతుల్లో లేదనుకోండి. ఈ కొత్త సంవత్సరంలో నేను అనుకున్నవి ఫలించాలని కోరుకుంటున్నాను.ప్రొఫెషన్ విషయానికి వస్తే... ఈ సంవత్సరం నాలుగు సినిమాల్లో నటించాను. హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఇక పర్సనల్ విషయానికి వస్తే టఫ్ పరిస్తితులను ఎదుర్కొన్నాను. వాటి నుంచి బయటపడగలిగాను. టఫ్ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎమోషనల్గా ఇతరుల మీద ఆధారపడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది నేర్చుకున్నాను. ఒంటరితనంగా అనిపించే పరిస్థితులు కూడా వస్తుంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకున్నాను.కొత్త సంవత్సరం తీర్మానాల విషయానికి వస్తే... కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. యోగాను మరింత ప్రాక్ట్రిస్ చేయాలనుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ చేయాలనుకుంటున్నాను. 2023 చివరిలో కూడా కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ తీసుకున్నాను. వాటిలో చాలా వరకు ఈ సంవత్సరం పూర్తి చేశాను.ఆడియెన్స్ సినిమాను ఎలా చూస్తున్నారు, సినిమాల రిజల్ట్ నుంచి సినిమా మేకింగ్ ప్రాసెస్ వరకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం మెంటల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటాను. – అనన్య నాగళ్లప్రశాంతతకు ప్రాధాన్యంరోజు రోజుకీ నెగటివిటీ పెరిగిపోతోంది. అందుకే కొంచెం పాజిటివిటీ పెంచుకోవాలి. కెరీర్ కోసం పరుగులు... డబ్బు కోసం పరుగులు... ఈ పరుగులో ప్రశాంతత ఉందా? అని ఆగి ఆలోచించుకోవాలి. లేనట్లు అనిపిస్తే పరుగు కాస్త తగ్గించి ప్రశాంతతకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏం చేసినా కుటుంబం కోసమే కాబట్టి... కుటుంబంతో గడపడానికి వీలు లేనంత బిజీ అయిపోవడం సరి కాదు. అందుకే ఫ్యామిలీకి తగిన సమయం వెచ్చించండి... పాజిటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి... ప్రశాంతంగా ఉండండి.ప్రొఫెషన్గా, కెరీర్పరంగా కూడా 2024 నాకు చాలా మంచి సంవత్సరం అనే చెబుతాను నేను. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి నా పెళ్లి, రెండు నా సినిమా గ్రాండ్ సక్సెస్ కావడం. ఐదు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న మా ప్రేమ కాస్తా పెళ్లి పట్టాలెక్కింది 2024లోనే. సంవత్సరమున్నరపాటు నేను, మా టీమ్ అంతా ఎంతో హార్డ్వర్క్ చేసిన నా సినిమా బ్లాక్బస్టర్గా నిలవడం నా కెరీర్లో మెమరబుల్ మూమెంట్గా చెప్పుకుంటాను.1 నుంచి 10 పాయింట్లలో2024 కు నేను 9 పాయింట్లు ఇస్తాను. నా పెళ్లి చాలా గ్రాండ్గా జరగటం, ఆ పెళ్లికి పిలవడం కోసం చాలాకాలం నుంచి దూరంగా ఉన్న మా బంధువులందరినీ కలవడం, వారితో సంబం«ధాలు కలుపుకోవడం, అందరూ పెళ్లికి రావటం, అందరితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయగలగటం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే, మా పెళ్లి తర్వాత మా ఊళ్లో మేము ఆంజనేయస్వామి తిరునాళ్ల చేసుకున్నాం. అది మాకు చాలా ప్రత్యేకం. మా చిన్నప్పుడెప్పుడో చేశాం అది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పుడు చేశాం. ఇంక న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారా.. బీ గుడ్ టు అదర్స్. అంటే అందరితో ఇంకా మంచిగా ఉండటం. దాంతోపాటు 2024లో నేను రెండు సినిమాలు హిట్ కొట్టాలనుకున్నాను. అయితే అది చేయలేకపోయాను. 2025లో కచ్చితంగా రెండు మంచి సినిమాలు అందించాలి. ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాను. అదే నా గోల్. ఇంకా.. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మ్యారేజ్ తర్వాత ఇది మా ఫస్ట్ న్యూ ఇయర్. మేము ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం చేయలేకపోయినా, కనీసం అదే రిలేషన్షిప్ మెయిన్టెయిన్ చేయాలనుకుంటున్నాం. – కిరణ్ అబ్బవరంప్రతి టైమ్ మంచిదేజీవితంలో మనకు దక్కిన ‘మంచి’ని గ్రహించాలి. ఆ మంచికి కృతజ్ఞతగా ఉండాలి. మన ఉరుకు పరుగుల జీవితంలో మనకు జరిగే మంచిని పట్టించుకునే స్థితిలో కూడా కొందరం ఉండము. జరిగే చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించుకుని బాధపడుతుంటాం. అయితే మంచిని గ్రహించి, పాజిటివ్గా ముందుకెళ్లాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కసారి మనకు దక్కిన మంచి విషయాలను గుర్తు చేసుకుని, ఆనందంగా ముందుకెళదాం.2024లో మొత్తం చూస్తే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. వాటి ఫలితాలు 2025 అందుకోబోతున్నాను. 2024లో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా ఏ అంచనాలు పెట్టుకోకుండా సహనంతో వర్క్ చేశాను. నా వరకు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ని ఇచ్చాను. ప్రతి టైమ్ మంచిదే. ప్రతి సందర్భం నాకు విలువైన బెస్ట్ మూమెంట్ని ఇచ్చింది. ఏడాది మొత్తంలో చాలా గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నా మూవీస్కు డబుల్ షిఫ్ట్స్లో వర్క్ చేశాను. హార్డ్ వర్క్ ఉన్న ఆ రోజులన్నీ చాలా గొప్పవి. 2025లో కూడా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చేయదగిన వర్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలోనూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేయాలనుకుంటున్నాను. – నిధీ అగర్వాల్ -
థ్రిల్ ఇస్తోంది: అనన్య నాగళ్ల
‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమాకి, నా పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటం హ్యాపీగా ఉంది. మా మూవీ ఆడియన్స్కి మంచి థ్రిల్ ఇస్తోంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేశారు.ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘సినిమా స్క్రీన్ప్లే చాలా అద్భుతంగా ఉంది, చివరి 40 నిమిషాలు కట్టిపడేస్తోంది, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనే ప్రశంసలు వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘తొలి ప్రయత్నంగా నిర్మించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’తో సక్సెస్ సాధించాననుకుంటున్నాను’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు. -
శాంటా లుక్లో ఉప్పెన బ్యూటీ.. నా సామిరంగ హీరోయిన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్
శాంటాక్లాజ్ లుక్లో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి..క్రిస్మస్ సెలబ్రేషన్స్ నా సామిరంగ హీరోయిన్..ఆదిపురుష్ భామ క్రిస్మస్ లుక్..మరింత హాట్ హాట్గా పూనమ్ బజ్వా..బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రివ్యూ
టైటిల్: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: శ్రీగణపతి సినిమాస్నిర్మాత: వెన్నపూస రమణారెడ్డిదర్శకత్వం: రైటర్ మోహన్సంగీతం: సునీల్ కశ్యప్సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ ఎన్ఎడిటర్: అవినాష్ గుర్లింక్విడుదల తేది: డిసెంబర్ 25, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్ గాంధీ హత్య(1991 మే 21)జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీఐ భాస్కర్(అనీష్ కురివెళ్ల) సీరియస్గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ భాస్కర్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తోంది. వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని.. ఈ కేసు విచారణను ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్(వెన్నెల కిశోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనుక మేరి స్నేహితురాలు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు డిటెక్టివ్ షెర్లాక్ అనుమానిస్తాడు. వీరందరిని పిలిపించి తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు. వీరిలో మేరిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అసలు డిటెక్టివ్ షెర్లాక్ నేపథ్యం ఏంటి? అతను డిటెక్టివ్ వృత్తినే ఎందుకు ఎంచుకున్నాడు? మేరి హత్య కేసుతో షెర్లాక్కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..డిటెక్టివ్ కథలు టాలీవుడ్కి కొత్తేమి కాదు. చిరంజీవి ‘చంటబ్బాయ్’ మొదలు నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వరకు చాలా సినిమాలు ఈ కాన్సెప్ట్తో వచ్చాయి. కొన్ని కథలు సీరియస్గా సాగితే..మరికొన్ని కామెడీగా సాగుతూనే థ్రిల్లింగ్ గురి చేస్తాయి. కానీ అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన వచ్చిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం మాత్రం అటు కామెడీ పండించలేదు..ఇటు థ్రిల్లింగ్కు గురి చేయలేదు. హాలీవుడ్ రేంజ్ టైటిల్..దానికి జస్టిఫికేషన్ ఇచ్చే కథ ఎంచుకున్న దర్శకుడు మోహన్.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడం మాత్రం విఫలం అయ్యాడు. డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ మొదలు.. హత్య జరిగిన తీరు వరకు ఏది ఆసక్తికరంగా ఉండదు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజే ఈ హత్య జరిగినట్లు చూపించడానికి సరైన కారణం కూడా ఉండదు. సీఐ భాస్కర్ బిజీ కావడంతోనే ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్కి ఇచ్చినట్లుగా మొదట్లో చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు సీఐ భాస్కర్ ఇంత ఖాలీగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇక డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా లేకపోయినా.. కనీసం నవ్వుకునే విధంగా కూడా ఉండదు. మధ్యలో వచ్చే ఉప కథలు కూడా చాలా రొటీన్గా ఉంటాయి. రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసి శ్రీకాకుళం సీఐ అలర్ట్ అవ్వడంతో సినిమా ప్రారంభం అవుతుంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అర్థరాత్రంతా పోలీసులు పెట్రోలింగ్ చేయడం, ఘర్షనకు దిగిన ఇద్దరిని అరెస్ట్ చేయడం.. పోలీసులను చూసి ఓ కారు వెనక్కి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక హత్య జరగడం.. విచారణ కోసం డిటెక్టివ్ షేర్లక్ రంగంలోకి దిగడం వరకు కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత విచారణ భాగంగా వచ్చే ఉప కథలు బోరింగ్గా సాగుతాయి. ఒక్కోక్కరు చెప్పే స్టోరీ.. తెరపై చూడడం భారంగా ఉంటుంది. అలాగే ఝాన్సీ అనే పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే హంతకులు ఎవరనే విషయం చివరి వరకు ప్రేక్షకుడు కనిపెట్టకుండా చేయడం దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. మేరిని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. షెర్లాక్ ఫ్లాష్బ్యాక్ స్టోరీ కాస్త ఎమోషనల్గా ఉంటుంది. అయితే అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు.. ఆ ఎమోషనల్ సీన్కి కూడా అంతగా కనెక్ట్ కాలేకపోతాడు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ పాత్రకు వెన్నెల కిశోర్ కొంతవరకు న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలలో సహజత్వం కలిపించదు. కామెడీ కూడా అంతగా పండించలేకపోయాడు. అనన్య నాగళ్లకు ఓ మంచి పాత్ర లభించింది. భ్రమరాంభ పాత్రలో ఆమె చక్కగా నటించింది. ఆ పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టునే తిరుగుతుంది. అనీష్ కురివెళ్ల పాత్రకి వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం ఆ క్యారెక్టర్ స్థాయిని తగ్గించింది. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, నాగ్ మహేష్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ అవినాష్ గుర్లింక్ తన కత్తెరకు ఇకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కథ చాలా కొత్తగా ఉంది: బాబీ కొల్లి
‘‘నేను, మోహన్ కలిసి రైటర్స్గా పని చేశాం. తను ఈ సినిమాని వినోదంతో పాటు సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తీశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ బాబీ కొల్లి, కల్యాణ్ కృష్ణ అతిథులుగా హాజరయ్యారు. ‘‘ఈ సినిమా కంటెంట్ని బలంగా నమ్మాను. ఆ కథే నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘నా కెరీర్లో చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది’’ అని అనన్య నాగళ్ల పేర్కొన్నారు. ‘‘నటుడిగా ఈ చిత్రం నాకు చాలా కీలకం’’ అన్నారు రవితేజ మహాదాస్యం. ‘‘ఈ మూవీతో కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు. -
మెరిసే... మురిసే...
సిల్వర్ స్క్రీన్పై మెరుపులా మెరవడానికి మెరుపు తీగల్లాంటి కథానాయికలు జోరుగా హుషారుగా సినిమాలు చేస్తుంటారు. ఒకే ఏడాది మూడు ఆపై ఎక్కువసార్లు తెరపై మెరిసే చాన్స్ వస్తే వాళ్ల ఆనందం పట్టలేనంతగా ఉంటుంది. ఈ ఏడాది అలా మినిమమ్ మూడు చిత్రాలతో తెలుగులో మెరిసి, కెరీర్ బాగున్నందుకు మురిసిపొయిన కథానాయికల గురించి తెలుసుకుందాం.2024లో తెలుగు తెరపై మీనాక్షీ చౌదరి హవా కనిపించింది. మహేశ్బాబు ‘గుంటూరు కారం’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, వరుణ్ తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ చిత్రాలతో మీనాక్షీ చౌదరి వెండితెరపై కనిపించారు. అంతేనా... తమిళ హీరో విజయ్ ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ తెలుగులో అనువాదమై, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ ఓ లీడ్ రోల్ చేశారు మీనాక్షి. ‘లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాలు నెల రోజుల గ్యాప్లో విడుదల కావడం విశేషం. ఇక ‘గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, గోట్’ చిత్రాలు హిట్స్గా నిలిచాయి.మరోవైపు తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఈ ఏడాది మంచి జోరు కనబరిచారు. హారర్ మూవీ ‘తంత్ర’లో లీడ్ రోల్ చేసి, రూరల్ యాక్షన్ ఫిల్మ్ ‘΄÷ట్టేల్’లో గృహిణిగా భావోద్వేగభరితమైన పాత్ర చేశారు. ప్రియదర్శి–నభా నటేష్ లీడ్ రోల్స్లో నటించిన ‘డార్లింగ్’లోనూ డాక్టర్గా ఓ లీడ్ రోల్ చేశారీ బ్యూటీ. అలాగే నేడు విడుదలవుతోన్న ‘శ్రీకాకుళం షెర్లాక్హోమ్స్’ చిత్రంలోనూ ఓ లీడ్ చేశారు. ఇలా అనన్య ఈ ఏడాది నాలుగుసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లవుతుంది. ఇక ముంబై బ్యూటీ కావ్యా థాపర్ కూడా తెలుగు ప్రేక్షకులను ఈ ఏడాది తరచూ పలకరిస్తూ వచ్చారు.రవితేజ ‘ఈగిల్’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, గోపీచంద్ ‘విశ్వం’ చిత్రాల్లో కావ్యా థాపర్ కనిపించారు. ఓ మంచి కమర్షియల్ హీరోయిన్గా ఈ ఏడాది తెలుగు ఆడియన్స్ను అలరించారు కావ్యా థాపర్. మరోవైపు హీరోయిన్గా పరిచయమైన తొలి ఏడాదే మూడు సినిమాలతో సత్తా చాటారు యువ హీరోయిన్ నయన్ సారిక. ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాల్లో హీరోయిన్గా చేశారీ బ్యూటీ.నయన్ చేసిన ఈ మూడు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఆమె కెరీర్కు బలం చేకూరినట్లయింది. ఇక హీరోయిన్గా కాదు కానీ... కథను ఇంపాక్ట్ చేసే పాత్రల్లో రుహానీ శర్మ కనిపించారు. వెంకటేశ్ ‘సైంధవ్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, సుహాస్ ‘శ్రీరంగనీతులు’ చిత్రాల్లో రుహానీ మంచి పాత్రలు చేశారు. ‘లవ్ మీ’ చిత్రంలో ఓ చిన్న గెస్ట్ రోల్లో కూడా కనిపించారు రుహానీ. ఇలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను తరచూ పలకరించిన మరికొంతమంది హీరోయిన్లు ఉన్నారు.విలన్గానూ విజృంభించారు సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు స్క్వేర్’లో స్పై ఏజెంట్ లిల్లీ జోసెఫ్గా, రవితేజ ‘ఈగిల్’లో జర్నలిస్ట్ నలినీ రావుగా కనిపించారు అనుపమా పరమేశ్వరన్. అయితే ‘డీజే టిల్లు 2’లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనుపమ నటించడం విశేషం. ఈ తరహాలోనే మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న అప్సర ఆలియాస్ మాయ పాత్రను విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సిని మాలో చేశారు. ఈ బ్యూటీయే వెంకటేశ్ ‘సైంధవ్’లో మనోజ్ఞ అనే సెంటిమెంట్ రోల్లో కనిపించడం విశేషం. మహేశ్బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్గా చేసిన శ్రీలీల, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’లో స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’లో మెరిశారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగులో రష్మిక కనిపించిన చిత్రం ఇదొక్కటే. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో మృణాల్ ఠాకూర్ (‘కల్కి 2898 ఏడీ’లో ఓ గెస్ట్ రోల్ చేశారు), శర్వానంద్ ‘మనమే’లో ఐటీ ఉద్యోగిగా కృతీ శెట్టి, ఫ్యామిలీ డ్రామా ‘35: చిన్న కథ కాదు’లో గృహిణి సరస్వతిగా నివేదా థామస్ల నుంచి ఈ ఏడాది ఒక్క చిత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అనుష్క, సమంత, సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తీ సురేష్ వంటి హీరోయిన్లు ఇతర భాషల చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది తెలుగులో కనిపించలేదు. ఇక ఈ ఏడాది దీపికా పదుకోన్, భాగ్యశ్రీ భోర్సే, రుక్మిణీ వసంత్... ఇలా దాదాపు 20మంది హీరోయిన్లు తెలుగుకు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన అనన్య నాగళ్ల (ఫొటోలు)
-
‘శ్రీకాకుళం షెర్లాక్హోమ్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు: అనన్య
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ లో భ్రమరాంబ పాత్రలో నటించాడు. కథలో నా రోల్ చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్రలో నటించలేదు. ఇది చాలా డిఫరెంట్ మూవీ’ అంటున్నారు యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల. వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అనన్య తాజాగా మీడియాతో ముచ్చటించారు.⇢ ఇప్పటివరకూ ఇలాంటి కథ నేను వినలేదు. మోహన్ గారు కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది. ఒక సంఘటన జరిగినపుడు అందులో ఒకొక్కరి కోణం నుంచి ఒకొక్క పెర్స్ఫెక్టివ్ ఉంటుంది. ఇలా కథని తీసుకెళ్లడం నాకు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. కథ వినగానే ఓకే చెప్పాను. వందశాతం ఆడియన్స్ కి ఈ సినిమా మంచి క్రిస్మస్ గిఫ్ట్ అవుతుంది.⇢ ఇందులో డిటెక్టివ్ అమ్మ పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ తో షెర్లాక్ హోమ్స్ అని పెట్టడం జరిగింది. తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకు వస్తుంది. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా ఆ ట్యాగ్ ని పెట్టడం జరిగింది.⇢ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. అదే రోజు ఓ కేసు జరిగింది. ఆ కేసు తీగలాగితే డొంక కదిలినట్లుగా చాలా మలుపులతో కథనం ఎంగేజింగ్ గా ఉంటుంది. ⇢ తెలుగుతో పాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాను. నా సీనీ జర్నీ పట్ల హ్యాపీగా ఉన్నాను. నాకు కంటిన్యూ గా వర్క్ వస్తోంది. రీసెంట్ గా పోట్టేల్ సినిమాకి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత నా దగ్గరకి మంచి కథలు వచ్చాయి. ఓ రెండు సినిమాలు సైన్ చేశాను.⇢ ప్రస్తుతం తెలుగులో కథాకళి, లేచింది మహిళా లోకం సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. -
అనన్య నాగళ్ల పొట్టేల్ మూవీ.. ఓటీటీల్లో సడన్ ఎంట్రీ!
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు నెలలైనా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. దీంతో ఇంకెప్పుడొస్తుందా అని ఆడియన్స్ ఎదురు చూశారు.అయితే ఈ చిత్రం ఇవాళ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ ఫ్లాట్ఫామ్లో అడుగుపెట్టింది.(ఇది చదవండి: Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ)పొట్టేల్ సినిమాను తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1980ల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఇందులో చూపించారు. తన కూతురిని చదివించాలని తపన పడే ఓ తండ్రి, బలి ఇవ్వాలనుకున్న గొర్రె తప్పిపోవడం లాంటి కథనంతో రూపొందించారు. ఈ చిత్రంలో అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియాంక శర్మ, తనస్వి, చత్రపతి శేఖర్ కీలకపాత్రలు పోషించారు. -
రెడ్ కలర్ శారీలో ఎర్ర గులాబీల మెరిసిపోతున్న అనన్య నాగళ్ల (ఫొటోలు)
-
చీరలో అదరగొడుతున్న అనన్య నాగళ్ళ (ఫొటోలు)
-
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.. డిటెక్టివ్ టీజర్ చూశారా?
టాలీవుడ్ నటుడు వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చంటబ్బాయ్ తాలుకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు ప్రముఖ రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నెల కిశోర్ యాక్టింగ్ ఫర్మామెన్స్తో తెగ ఆకట్టుకుంటోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్పై వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. -
చంటబ్బాయ్ తాలూకా అంటోన్న వెన్నెల కిశోర్.. ఆసక్తిగా పోస్టర్
టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. చంటబ్బాయ్ తాలూకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వెన్నపూస రమణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. వచ్చే నెల క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు పోస్టర్ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన పోస్టర్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. పోస్టర్ చూస్తుంటే డిటెక్టివ్ అండ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. Agent with entertainment is coming ❤️🔥#SreekakulamSherlockHolmes In Theatres on December 25th#VennelaKishore pic.twitter.com/EhXaLFX3DK— Adnan369 (@Adnan3693) November 25, 2024 -
అనన్య నాగళ్ల గొప్పమనసు.. అలాంటి వారికోసం తానే స్వయంగా!
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవలే పొట్టేల్ మూవీతో అభిమానులను అలరించింది. సాహిత్ మోత్కూరి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మూవీలో అనన్య నటిస్తోంది. ఎస్డీటీ18 వర్కింగ్ టైటిల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.అయితే తెలుగమ్మాయి అయిన అనన్య సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటోంది. తాజాగా హైదరాబాద్లో అభాగ్యులకు అండగా నిలిచారు. అసలే చలికాలం.. రోడ్లపై ఎక్కడపడితే ఎంతోమంది నిరాశ్రయులు నివసిస్తున్నారు. అలాంటి వారికోసం తానే స్వయంగా దుప్పట్లు అందించింది. బస్టాండ్లో నిద్రిస్తున్న వారికి తన వంతుసాయంగా వారికి దుప్పట్లు అందజేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ అనన్య చేసిన మంచిపనికి అభినందిస్తున్నారు. కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అనన్య ప్రధాన పాత్రలో తంత్ర మూవీతో ఆకట్టుకుంది. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. A warm gesture by @AnanyaNagalla as she distributes blankets to those in need 😍Truly Heartwarming #Humanity 💫#AnanyaNagalla 🫶🏻pic.twitter.com/JQQsbxaYWU— #𝐒𝐫𝐢𝐧𝐢𝐯𝐚𝐬 (@srinureddypalli) November 12, 2024 -
Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ
టైటిల్: పొట్టేల్నటీనటులు: యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులునిర్మాణ సంస్థ: నిసా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగెదర్శకత్వం: సాహిత్ మోత్కూరిసంగీతం: శేఖర్ చంద్రసినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజుఈ మధ్యలో కాలంలో బాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్న చిన్న సినిమా ‘పొట్టేల్’. పెద్ద మూవీ స్థాయిలో ప్రమోషన్స్ చేపట్టారు. దానికి తోడు ఓ ప్రెస్మీట్లో అనన్య నాగళ్లను ఓ లేడి రిపోర్టర్ అడిగిన ప్రశ్న వివాదాస్పదంగా మారడంతో ‘పొట్టేల్’మూవీ గురించి పెద్ద చర్చే జరిగింది. మొత్తంగా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ‘పొట్టేల్’పైనే కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొట్టేల్ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..1970-80 మధ్యకాలంలో సాగే కథ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు గుర్రంగట్టు. అక్కడ పటేళ్లదే రాజ్యం. ఆ ఊరిలో 12 ఏళ్లకు ఒక్కసారి బాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండు సార్లు జాతర సమయానికి బలి ఇచ్చే పొట్టేల్ చనిపోవడంతో ఆ ఊర్లో కరువు తాండవిస్తుంది. అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోతుంటారు. ఈసారి జాతరకు ఎలాగైనా పొట్టేల్ని బలి ఇవ్వాలని, దాని కాపాడాల్సిన బాధ్యతను గొర్రెల కాపరి పెద్ద గంగాధరి (యువచంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. పటేల్(అజయ్) చేసే మోసాలన్నీ గంగాధరికి తెలుసు. తన అవసరాల కోసమే బాలమ్మ సిగం(పూనకం రావడం) వచ్చినట్లు నటిస్తున్నాడని.. ఆయన మాటలు నమ్మొదని చెప్పినా ప్రజలెవరు పట్టించుకోరు. భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) మాత్రం గంగాధరి మాటలను నమ్ముతుంది. పటేళ్ల పిల్లల మాదిరే తన కూతురు సరస్వతికి కూడా చదువు చెప్పించాలనుకుంటాడు. ఇది పటేల్కు నచ్చదు. దీంతో ఊరి బడి పంతులు(శ్రీకాంత్ అయ్యంగార్)ని బ్రతిమిలాడి కూతురికి రహస్యంగా చదువు చెప్పిస్తాడు. ఇంతలో ఊరి జాతర దగ్గర పడుతుందనగా బాలమ్మ పొట్టేల్ కనిపించకుండా పోతుంది. గాంగాధరి తప్పిదం వల్లే పొట్టేల్ పోయిందని.. దాని తీసుకురావాల్సిన బాధ్యత అతనిదే అని పటేల్ ఆదేశిస్తాడు. అంతేకాదు బాలమ్మ పూనినట్లు నటిస్తూ.. పొట్టేల్ని తీసుకురాకుంటే ఈసారి జాతరలో గంగాధరి కూతురు సరస్వతిని బలి ఇవ్వాలని చెబుతాడు. ఊరి జనాలు కూడా ఇది బాలమ్మ ఆదేశం అని నమ్ముతారు. అసలు పొట్టేల్ ఎలా మాయం అయింది? కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం గంగాధరి ఏం చేశాడు. చివరకు పొట్టేల్ దొరికిందా లేదా? పటేల్ నిజస్వరూపం తెలిసిన తర్వాత ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?ఎంత మంచి కథ అయినా సరే తెరపై ఆసక్తికరంగా చూపిస్తేనే విజయం సాధిస్తుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడు ఆ కథ గురించే ఆలోచించాలి. ఆ పాత్రలతో కనెక్ట్ కావాలి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తూ ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చేయాలి. ఇదంతా జరగాలంటే కథతో పాటు కథనాన్ని బలంగా రాసుకోవాలి. కథ బాగుండి.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించపోతే ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. పొట్టేల్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ.. ఇవ్వాలనుకున్న సందేశం చాలా బాగుంది. కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు.పేరుకు ఇది చిన్న సినిమానే కానీ కథ మాత్రం చాలా పెద్దది. 1970-80 కాలంలో ఉన్న పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేశాడు. సినిమా ప్రారంభంలోనే చాలా పాత్రలను పరిచయం చేశాడు. పటేల్ వ్యవస్థ బలంగా మారడానికి గల కారణాన్ని చూపించాడు. అలాగే బాలమ్మ జాతర నేపథ్యాన్ని కూడా ఓ యానిమేషన్ సీన్తో వివరించాడు. ఆ తర్వాత బుజ్జమ్మ, గంగాధరి లవ్స్టోరీ మొదలవుతుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకునే కథ పెద్దగా ఉండడంతో ప్రేమకథను త్వరగా ముగించి మళ్లీ అసలు కథను ప్రారంభించాడు. కూతురు చదవు కోసం హీరో పడే కష్టాలు ఎమోషనల్కు గురి చేస్తాయి. కథ ప్రారంభం నుంచి మొదటి 30 నిమిషాలు ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ నెరేషన్లో కథనాన్ని సాగిస్తూ ప్రేక్షకుడు కథపై శ్రద్ధ చూపించేలా చేశాడు. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్స్టోరీతో పాటు మరికొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో హింస ఎక్కువైనట్లు అనిపిస్తుంది. హీరో ప్రతిసారి పటేల్ చేతిలో దెబ్బలు తింటూనే ఉంటాడు. అలాగే కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హింసను తగ్గించి, కథనాన్ని మరింత వేగవంతంగా నడిపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించినవారంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. గొర్రెల కాపరి గంగాధరిగా యువచంద్ర కృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో బాగా నటించాడు. అనన్య నాగళ్ల పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సెకండాఫ్లో ఆమె పాత్ర నిడివి తక్కువనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో విలన్గా నటించిన అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పటెల్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. తెరపై ఓ డిఫరెంట్ లుక్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నోయల్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
ఐదేళ్ల కష్టం వృథా అయ్యింది.. ‘కమిట్మెంట్’ ప్రశ్నపై స్పందించిన అనన్య
‘పొట్టేల్’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో హీరోయిన్ అనన్య నాగళ్లకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ని ప్రస్తావిస్తూ.. ‘అవకాశాల కోసం హీరోయిన్లు కమిట్మెంట్ ఇవ్వాలట కదా .. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా?’అని ఓ మహిళా జర్నలిస్ట్ అనన్యను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు షాకైన అనన్య.. సున్నితంగా సమాధానం ఇచ్చి అక్కడితో ఆ ఇష్యూని ఆపేసింది. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. చాలా మంది అనన్యకు మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు.తాజాగా ఈ వైరల్ వీడియోపై అనన్య స్పందించింది. సంస్కారం ఉన్నవాళ్లు ఇలాంటి ప్రశ్నలు అడగరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతు..‘ఇంత డైరెక్ట్గా అలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారని ఇంటికి వెళ్లాక ఆలోచించాను. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు అడగరు. మీడియా వాళ్లు చాలా మంది నాకు కాల్ చేసి ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ..ఒక తెలుగమ్మాయిని అలా అడగడం బాధగా ఉందని చెప్పారు. వాళ్లు నా గురించి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఒక తెలుగమ్మాయిని వాళ్లు ఇంతలా సపోర్ట్ చేస్తుండడం సంతోషంగా ఉంది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. దాని కోసం ఐదేళ్లుగా ఇంట్లో వాళ్లతో ఫైట్ చేస్తున్నా. కానీ ఆ ఒక్క ప్రశ్నతో నా ఐదేళ్ల కష్టం వృథా అయిందనిపించింది. నేను ఇప్పుడు సక్సెస్ అయినా.. కమిట్మెంట్కు అంగీకరించాను కాబట్టి సక్సెస్ అయ్యానని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మళ్లీ బంధువులందరూ ఇదే విషయం మా అమ్మను అడుగుతారు. ఆ జర్నలిస్ట్ ప్రశ్న వేసినప్పుడు నాకు ఇన్ని ఆలోచనలు రాలేదు. ఆమెకు సంస్కారం లేదా? ఇలాంటి ప్రశ్న వేసిందనుకున్నా ఇంటికి వెళ్లాక దీని గురించి ఎంతో ఆలోచించా. ఇంకా నయం ఆ ప్రెస్ మీట్కి మా అమ్మను రమ్మని చెప్పారు. తనే రానని చెప్పింది. వచ్చి ఉంటే చాలా బాధపడేది’అని అనన్య అన్నారు. కాగా అనన్య, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ‘పొట్టేల్’చిత్రం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘పోటెల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అందుకు సంతోషంగా ఉంది: అనన్య నాగళ్ల
‘‘ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు సుదీర్ఘమైన ప్రయాణం ఉంటోంది. ఈషా రెబ్బా, చాందినీ చౌదరిలాంటి వారు ఎప్పట్నుంచో సినిమాలు చేస్తున్నారు. కొందరు హీరోయిన్లు టాప్ లీగ్లో ఉండి, కొంతకాలం తర్వాత వెళ్లిపోతున్నారు. కానీ, తెలుగువారికి మాత్రం కెరీర్ పరంగా ఎక్కువ కాలం ఉంటోంది. ఇందుకు సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ అనన్య నాగళ్ల అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా, అజయ్ కీలక ΄పాత్రలో నటించిన చిత్రం పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.ఈ సందర్భంగా అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల్లో అక్కడి స్థానిక హీరో యిన్లు 60–70 శాతం ఉంటే, మిగతావారు ఇతర పరిశ్రమలవారు ఉంటారు. కానీ మన దగ్గర 80 శాతం మంది ఇతర ఇండస్ట్రీ హీరోయిన్లు ఉన్నారు. కంటెంట్ బేస్డ్ చిన్న సినిమాలు, పరిమిత బడ్జెట్తో సినిమాలు చేసే దర్శక–నిర్మాతలు మాత్రమే తెలుగు హీరోయిన్లను ప్రిఫర్ చేస్తున్నారు.పొట్టేల్’ సినిమాలో బుజ్జమ్మ అనే బలమైన తల్లి ΄పాత్ర చేశాను. నటనకు అవకాశం ఉండి, నాకు నచ్చిన ΄పాత్రలు చేస్తున్నాను. తోటి హీరోయిన్లతో ΄పోటీ గురించి ఆలోచించే సమయం లేదు. నాకు ఓ మంచి కమర్షియల్ సక్సెస్ ఉండి ఉంటే నా కెరీర్ మరింత బాగుండేది. కోవిడ్ టైంలో నాకు పెద్దగా చాన్స్లు రాలేదు. ఉద్యోగాన్ని మానేసి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని అప్పుడు పశ్చాత్తాప పడ్డాను. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, ‘కథకళి, లేచింది మహిళా లోకం’ సినిమాలు చేస్తున్నా’’ అన్నారు. -
రెడ్ కలర్ శారీలో ఎర్ర గులాబీల మెరిసిపోతున్న అనన్య నాగళ్ల (ఫొటోలు)
-
పొట్టేల్ రియల్పాన్ ఇండియన్ మూవీ: సంయుక్తా మీనన్
‘‘పొట్టేల్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ కథ మీద డైరెక్టర్ సాహిత్ నాలుగేళ్లు పని చేయడం మామూలు విషయం కాదు. మంచి రైటింగ్, డైరెక్షన్ ఉంటేనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది. ఈ ట్రైలర్లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఒక రియల్పాన్ ఇండియన్ ఫిల్మ్లా అనిపించింది’’ అని హీరోయిన్ సంయుక్తా మీనన్ అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్లో అజయ్ కీలకపాత్రలో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన సంయుక్తా మీనన్ మాట్లాడుతూ– ‘‘నిశాంక్గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ΄ప్యాషన్నేట్ ప్రోడ్యూసర్ అనిపించింది. ఇలాంటి ΄ప్యాషన్ ఉన్న నిర్మాతలు పరిశ్రమకి కావాలి’’ అన్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘ట్రైలర్లో చూసింది ఒక శాతం మాత్రమే. ఈ చిత్రంలో గొప్ప కథ ఉంది’’ అని చెప్పారు. ‘‘చాలా ప్రేమించి ఈ చిత్రం చేశాం’’ అన్నారు యువ చంద్రకృష్ణ. ‘‘ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సాహిత్ మోత్కూరి పేర్కొన్నారు. ‘‘మంచి కంటెంట్తో నిర్మించిన ఈ చిత్రం పెద్ద సౌండ్ చేయబోతోంది. సాహిత్ అద్భుతంగా తీశాడు’’ అని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే తెలిపారు. -
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే?
అనన్య నాగళ్ల ప్రస్తుతం పొట్టేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తంత్ర, డార్లింగ్ సినిమాలతో అలరించిన అనన్య మరోసారి అభిమానులను అలరించనుంది. సాహిత్ మోతూకూరి డైరెక్షన్లో వస్తోన్న పొట్టేల్ మూవీలో అనన్య లీడ్ రోల్లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.అయితే ఈవెంట్కు హాజరైన అనన్య నాగళ్లకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు? ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడుగుతారని టాక్ ఉంది.. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అని అనన్యను ప్రశ్నించింది.(ఇది చదవండి: అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!)దీనిపై అనన్య మాట్లాడుతూ..'నాకైతే ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. మీరు తెలుసుకోకుండా వందశాతం ఉంటుందని ఎలా చెబుతున్నారు. ఇండస్ట్రీలో అలా జరుగుతుంది అని చెప్పడం వందశాతం తప్పు. అవకాశం రావడం కంటే ముందే కమిట్మెంట్ అనేది టాలీవుడ్లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్ అనేది సమానంగా ఉంటాయి. మీకు అనుభవం లేకపోయినా ఎలా అడుగుతున్నారు.. నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు' అని అన్నారు. కాగా.. అనన్య నటించిన పొట్టేల్ సినిమా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాస్టింగ్ కౌచ్ గురించి జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య 💥#AnanyaNagalla #Pottel #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/3hlxsVeu4c— Telugu FilmNagar (@telugufilmnagar) October 18, 2024 -
అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!
అనన్య నాగళ్ల, యువచంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం పొట్టేల్. 1980లోని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బందం రేగడ్, సవారీ చిత్రాల ఫేమ్ సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఆ కాలంలో మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కూతురికి చదివించాలని తండ్రిపడే తపన.. ఆ నాటి పరిస్థితులే కథాంశంగా తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో పొట్టేల్ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీమందించారు. అజయ్, నోయెల్, ప్రియాంక శర్మ కీలక పాత్రలు పోషించారు. -
ఫ్లైట్లోనూ వదల్లేదు.. ఇలా కూడా చేస్తారా!
టాలీవుడ్ హీరోయిన్, తెలుగుమ్మాయి అనన్య నాగళ్ల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ ఏడాదిలో ఇటీవలే తంత్ర, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్ను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పొట్టేల్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్నారు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ నిర్మించారు. కాగా.. పొట్టేల్ చిత్రాన్ని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు.అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో పొట్టేల్ చిత్రబృందం వచ్చినా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏకంగా వారు ప్రయాణించే ఫ్లైట్లోనే సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. ఫ్లైట్లో కూర్చుని ఉన్న ప్రయాణికులకు పొట్టేల్ మూవీ పోస్టర్లను అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాం' అంటూ అనన్య నాగళ్ల వీడియోను ట్విటర్లో పంచుకుంది. కాగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.(ఇది చదవండి: ఎందుకింత నెగెటివిటీ?.. నెటిజన్స్పై మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!)కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది.ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాంPottel promotions in flight #ananyanagalla #pottelonoct25th pic.twitter.com/TwftS1dxBn— Ananya Nagalla (@AnanyaNagalla) October 17, 2024 -
కన్ను కొట్టిన బుట్టబొమ్మ... ఫ్లవర్ డిజైన్ చీరలో తృప్తి!
ప్రకృతి ఒడిలో పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలుచీరలో అందాలన్నీ చూపించేస్తున్న తృప్తి దిమ్రిహాట్ బ్యూటీ ఆయేషా ఖాన్ చుడీదార్ లుక్గ్లామర్తో చంపేసేలా సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్గర్ల్స్ నైట్ అవుట్లో నిహారిక-వితిక షేరు-మహాతల్లిఎక్స్ప్రెషన్స్తో నవ్వించేస్తున్న కావ్య కల్యాణ్ రామ్జీన్ షర్ట్లో వయ్యారంగా చూస్తున్న పూజిత పొన్నాడ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Meghaa Shetty (@meghashetty_officiall) View this post on Instagram A post shared by Asmita Sood (@asmita_s) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by KiKo (@kiaankokken) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Parul Gulati 🤍 (@gulati06) View this post on Instagram A post shared by Rathika RavindeR (@rathikaravinder) -
ఎందుకింత నెగెటివిటీ?.. నెటిజన్స్పై మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!
టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అంతకుముందు తంత్ర అనే హారర్ మూవీతో మెప్పించింది. ప్రస్తుతం పొట్టేల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల అనన్య ఓ వీడియో షేర్ చేసింది. దానిపై ఓ రేంజ్లో నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి.దీంతో తన వీడియోపై వస్తున్న ట్రోల్స్పై అనన్య స్పందించింది. ఎందుకింత నెగెటివీటీ అంటూ మండపడింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించమని వీడియో షేర్ చేశా. దానిపై కొందరు విమర్శలు చేశారు. నేను చెప్పిన విషయం నచ్చితే చేయండి.. అంతేకానీ ఎందుకింత నెగటివిటీ ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించింది. అది ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.కాగా.. సోషల్మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే అనన్య.. ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు. అందులో స్ట్రా సాయం లేకుండా కొబ్బరిబొండం నీళ్లు తాగుతూ కనిపించారు. మాములుగా నేను స్టీల్ స్ట్రా వెంట తెచ్చుకుంటాను.. అది లేని పక్షంలో ఈ విధంగా కొబ్బరినీళ్లు తాగుతా. ప్లాస్టిక్ వాడకాన్ని కాస్త తగ్గిద్దాం. చిన్న చిన్న పనులే పెద్ద మార్పులకు శ్రీకారం చుడతాయి అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు.2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. తాజాగా ఆమె నటించిన పొట్టేల్ అక్టోబర్ 25న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
వయ్యారి భామలు.. చీర కట్టులో ఇంత అందమా!
చుడీదార్లో చూడ చక్కగా తెలుగమ్మాయి ఈషా రెబ్బాటర్కీలో చిల్ అవుతున్న 'బలగం' కావ్య కళ్యాణ్ రామ్చీరలో మల్లెపూలతో మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్దసరా శుభాకాంక్షలు చెప్పిన హీరోయిన్ అనన్య నాగళ్లఅహ్మదాబాద్లో నవరాత్రి సెలబ్రేషన్స్లో అప్సరరాణిపూల చీరలో బిగ్బాస్ స్రవంతి గ్లామర్ ట్రీట్అందానికే ఆధార్ కార్డ్లా కనిపిస్తున్న యాంకర్ రష్మీ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Gayathri Gupta (@gayathrigupta) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Apsara Rani (@apsararaniofficial_) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Anala Susmitha (@anala.susmitha) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by I am Kangna Sharma (@kangnasharma16) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Reshma Pasupuleti (@reshmapasupuleti) View this post on Instagram A post shared by RIYA SEN DEV (@riyasendv) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances) View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Gabriella (@gabriellacharlton_) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Hamida Khatoon (@hamida_khatoon_official) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) -
రిదా రేడియెన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో సందడి చేసిన అనన్య నాగళ్ళ (ఫొటోలు)
-
దసరాకి పొట్టేల్
దసరాకి థియేటర్స్లోకి ‘పొట్టేల్’ రానుంది. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్లో సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పొట్టేల్’. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె ఈ చిత్రాన్ని నిర్మించారు.గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని దసరా పండక్కి రిలీజ్ చేయనున్నట్లుగా గురువారం చిత్రయూనిట్ వెల్లడించింది. ‘‘పొట్టేల్’ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. దీంతో దసరాకు ఈ సినిమా రిలీజ్ అనేది అడ్వాంటేజ్ అవుతుందని ఆశిస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: మోనిష్ భూపతి రాజు. -
అప్సరసలు ఈర్ష్య పడేంత గ్లామర్.. అనన్య ఓ నిలువెత్తు అందాల రాశి (ఫొటోలు)
-
స్కూల్లో ఉన్నప్పుడే ఆ టాలీవుడ్ హీరో అంటే క్రష్: అనన్య నాగళ్ల
2019లో విడుదలైన ' మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం వకీల్ సాబ్ మూవీతో మరింత ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. తాజాగా ప్రియదర్శి నటించిన డార్లింగ్ చిత్రంలో మెరిసింది ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య.. టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ప్రభాస్తో నటించే ఛాన్స్ వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేస్తారు? అన్న ప్రశ్నకు అనన్య నాగళ్ల స్పందించింది. ఆయనతో నటించే అవకాశం వస్తే.. ఏ క్యారెక్టర్ అయినా ఎగిరి గంతేసి చేస్తానని చెప్పింది. ప్రభాస్ నటించిన వర్షం సినిమా చూసినప్పటి నుంచి ఆయనంటే క్రష్. ఆ సమయంలో నేను స్కూల్లోనే చదువుతున్నా. ఆ సినిమాను నేను థియేటర్లో చూడలేదు. టీవీల్లో వచ్చినప్పుడు నేను, మా ఫ్రెండ్ కలిసి వర్షం సినిమా చూశామని అనన్య నాగళ్ల నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాదిలో తంత్ర మూవీతో డిఫరెంట్ రోల్లో అనన్య నాగళ్ల మెప్పించారు. -
కృతి శెట్టి స్టైలిష్.. షాలినీ పాండే బ్లాక్ బస్టర్.. అలియా కూల్ లుక్
పెళ్లి ఫోటోలు అభిమానులతో పంచుకున్న వరలక్ష్మీ శరత్కుమార్స్టన్నింగ్ ఫోజులు ఇచ్చిన షాలినీ పాండేమీలోని అంతర్గత బలాన్ని స్వీకరించాలని కోరుతున్న కృతి శెట్టియాడ్ షూట్ కోసం బ్లాక్ డ్రెస్లో దుమ్మురేపిన అనన్య నాగళ్ల'పసుపు' ఇష్టమైన రంగు అంటూ ఇలా వివరణ ఇచ్చిన రష్మిక 'సూర్యరశ్మి, సన్ ఫ్లవర్స్, చిరునవ్వులు, ఆనందం వంటి దయ, సంతోషకరమైన అన్ని విషయాలను పసుపు రంగు సూచిస్తుంది.' View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ruhii Siingh (@ruhisingh12) -
ఫోన్ చేసి నన్ను బెదిరించారు.. ఇలాంటివి నమ్మకండి: టాలీవుడ్ హీరోయిన్
ప్రస్తుతం డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల బ్యాంక్ అకౌంట్స్ నుంచి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. చదవురాని వారితో పాటు అన్ని తెలిసి కూడా సైబర్ ఉచ్చులో పడుతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మభ్యపెట్టి దోచుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు సైతం వీరి బారిన పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల తనకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అసలేం జరిగిందో మీరు ఓ లుక్కేయండి.అనన్య మాట్లాడుతూ.. 'తన పేరుతో సిమ్ తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారని నాకు ఫోన్ చేశారు. మీ పేరుతో ఉన్న నంబర్ ద్వారా కొందరు మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారు. ముంబయిలోని ట్రాయ్ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నాం. మీ నంబర్పై దాదాపు 25 వరకు మనీలాండరింగ్ లావాదేవీలు జరిగాయి.. మీకు జైలు శిక్ష పడుతుందని బెదిరించారు. కొద్దిసేపు వీడియో కాల్ ఆన్లో ఉంచి.. ఆ తర్వాత ఆఫ్ చేశారు. దీనిపై మీరు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయండి.. అని వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయి నన్ను నమ్మించేందుకు కొన్ని డాకుమెంట్స్ చూపించారు. అంతేకాదు.. ఆర్బీఐకి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలని నన్ను అడిగారు. ఆ తర్వాత నాకు థర్డ్ పార్టీ అకౌంట్ నంబర్ పంపి డబ్బులు బదిలీ చేయాలని కోరాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చి.. నేను అతన్ని నిలదీశాను. దీంతో అతనే నాపై తిరిగి గట్టిగా మాట్లాడాడు. నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానడంతో వీడియో కాల్ కట్ చేశాడు' అని తెలిపింది. ఇలాంటివి సంఘటనలు చాలా జరుగుతున్నాయని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అనన్య నాగళ్ల సూచించారు. దయచేసి ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. కాగా..టాలీవుడ్లో మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. Please be careful guys!For full details https://t.co/XdpO2s7awh@cyberabadpolice @cpbbsrctc pic.twitter.com/d7EK5rVWAW— Ananya Nagalla (@AnanyaNagalla) June 24, 2024 -
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్
ఓటీటీలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాల్ని ఎక్కువగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లిస్టులో వెంకటేశ్, రానా, నాగచైతన్య, అంజలి లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు హీరోయిన్ చేరింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో)మల్లేశం, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల.. వీటితో పాటు ప్లే బ్యాక్, శాకుంతలం, మళ్లీ పెళ్లి, తంత్ర, అన్వేషి సినిమాలు చేసింది గానీ బ్రేక్ అందుకోలేకపోయింది. ఈ ఏడాది 'తంత్ర' అనే హారర్ మూవీతో వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'పొట్టేల్' అనే మూవీ ఉంది.మరోవైపు ఓటీటీలోకి కూడా అనన్య నాగళ్ల ఎంట్రీ ఇస్తోంది. 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్లో కీలక పాత్ర చేస్తోంది. అంజలి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత రెండేళ్ల నుంచి సెట్స్పై ఉన్న ఈ సిరీస్ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. అంజలికి పుట్టినరోజు విషెస్ చెబుతూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. అంజలి ఇప్పటికే ఓటీటీలో నవరస, ఫాల్, ఝాన్సీ సిరీస్ లు చేసింది. ఇకపోతే 'బహిష్కరణ' సిరీస్ ని త్వరలో సిరీస్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..) Happy Birthday @yoursanjaliWe cannot wait for the world to see your new avatar from #Bahishkarana#BahishkaranaOnZee5 Coming Soon!@PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @prasannadop@SidharthSadasi1 pic.twitter.com/YW4Stiidvy— ZEE5 Telugu (@ZEE5Telugu) June 16, 2024 -
బ్లాక్ డ్రెస్లో మెరిపిస్తున్న అనన్య నాగళ్ళ..(ఫొటోలు)
-
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్.. గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్!
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్ సందడి.. అలాంటి లుక్లో కనిపించిన టబు... అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న అనన్య నాగళ్ల... గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ హోయలు.. హోలీ వేడుకల్లో సందడి చేసిన మంచులక్ష్మి.. ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ పోజులు.. వేసవిలో చిల్ అవుతోన్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Tabu (@tabutiful) View this post on Instagram A post shared by Sushmita (@sushmitakonidela) -
Ananya Nagalla : నవ్వుతో పడేస్తున్న అనన్య నాగళ్ళ.. (ఫొటోలు)
-
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
Tantra Review: 'తంత్ర' సినిమా రివ్యూ
ఏ భాష తీసుకున్నా సరే హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సరిగ్గా తీయాలే గానీ హిట్ కొట్టడం పక్కా. ఈ మధ్య కాలంలో 'మసూద', 'విరూపాక్ష', 'మా ఊరి పొలిమేర' తదితర చిత్రాలు ఇలాంటి కథలతో వచ్చి అందర్ని భయపెట్టాయి. ఇప్పుడు అలాంటి కథతో తీసిన మూవీ 'తంత్ర'. ట్రైలర్తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అనన్య నాగళ్ల భయపెట్టిందా? హిట్ కొట్టిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథేంటంటే? రేఖ(అనన్య నాగళ్ల)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో నాన్న సంరక్షణలో పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన తేజూ (ధనుష్ రఘుముద్రి)ని ఇష్టపడుతుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ కథలో విగత ('టెంపర్' వంశీ), రాజేశ్వరి (సలోని) ఎవరు? వీళ్లకు రేఖకు సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఎలా ఉందంటే? హారర్ సినిమాల్లో లాజిక్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. భయపెట్టే, వణుకు పుట్టించే సీన్స్ కచ్చితంగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. 'తంత్ర' విషయంలో అదే జరిగింది. స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే మంచి పాయింట్. హారర్ కథకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ దాన్ని సినిమాగా తీసే విషయంలో పూర్తిగా తడబడ్డారు. చూస్తున్నంత సేపు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సరికదా బోర్ కొడుతుంది. 'తంత్ర' సినిమాలో రక్త దాహం, పాతాళ కుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, చిన్నామస్తా దేవి.. అని ఆరు భాగాలు ఉంటాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్లస్ కాలేదు. ఈ పేర్లు లేకుండా కథ చెప్పినా సరే ఇబ్బంది ఏం ఉండేది కాదు. తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజలు లాంటి వాటి గురించి ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. భయపెడితే చాలు. కానీ దర్శకుడు.. వాటి గురించి ఒక్కోటి వివరించుకుంటూ వెళ్లడం సాగదీతగా అనిపించింది. దీంతో 'తంత్ర'.. సీరియల్ కంటే స్లోగా సాగింది. సాధారణంగా హారర్ సినిమాలు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించే ఓ సీన్తో మొదలవుతాయి. 'తంత్ర'లో అలాంటిదేం లేకుండా చాలా ఫ్లాట్గా స్టోరీ వెళ్తుంది. సెకండాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. 'మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దు' అని.. మూవీ రిలీజ్కి కొన్నిరోజుల ముందు హడావుడి చేశారు. కాకపోతే ఒకటి రెండు సీన్లు తప్పితే పెద్దగా హారర్ ఎఫెక్ట్ అనిపించే సినిమా అయితే ఇది కాదు. ఎవరెలా చేశారు? రేఖగా ప్రధాన పాత్ర చేసిన అనన్య నాగళ్ల ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అయితే ఈమెకి తగ్గ సీన్స్ పడలేదు. క్లైమాక్స్లో కాస్త స్కోప్ దక్కింది. తేజూగా చేసిన ధనుష్ రఘుముద్రి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కాకపోతే ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాజేశ్వరిగా ప్రత్యేక పాత్ర చేసిన సలోని.. ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది. ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. కానీ ఆ పాత్రని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. మిగతా పాత్రధారులు తమ ఫరిది మేరకు నటించారు. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం ఉంది. కాకపోతే పేపర్ మీద రాసుకున్నది స్క్రీన్పైకి తీసుకొచ్చేసరికి అనుభవలేమి కనిపించింది. క్షుద్రపూజాల నేపథ్యంలో క్యూరియసిటీ పాయింట్ రాసుకున్నప్పటికీ.. తీసే విషయంలో తడబడ్డారు. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్.. పాటలు, నేపథ్య సంగీతం పెద్దగా ఎలివేట్ చేయలేకపోయాయి. అలా అని పూర్తి బాగోలేవని కూడా కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఓవరాల్గా చెప్పుకొంటే 'తంత్ర'.. ప్రేక్షకుల్ని భయపెట్టలేకపోయింది. -
5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లో సినిమాలు అనగానే చాలామందికి థ్రిల్లర్సే గుర్తొస్తాయి. ఎందుకంటే యాక్షన్, కామెడీ మూవీస్ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అదే థ్రిల్లర్ లేదా హారర్ చిత్రాలు మాత్రం ఓటీటీలో ఒంటరిగా చూసి ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఇలా తెలుగులో ఎప్పటికప్పుడు ఏదో ఓ మూవీ వస్తూనే ఉంటుంది. అలా గతేడాది నవంబరులో థియేటర్లలోకి వచ్చిన ఓ మూవీ.. ఇప్పుడు సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ల హీరోయిన్గా చేసిన సినిమా 'అన్వేషి'. విజయ్ ధరణ్, సిమ్రన్ గుప్తా హీరోహీరోయిన్గా చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం.. థియేటర్లలో పెద్దగా ఆడలేకపోయింది. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. త్వరలో ఫ్రీగా చూసే వీలు కల్పిస్తారు. 'అన్వేషి' కథేంటి? విక్రమ్(విజయ్ధరణ్ దాట్ల), అను(సిమ్రాన్ గుప్తా)తో తొలి చూపులో ప్రేమలో పడిపోతాడు. ఆమెని వెతుక్కుంటూ మారేడుకోన అనే ఊరికి వెళ్తాడు. అదే టైంలో ఆ గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అవన్నీ మూతపడిపోయిన అను ఆస్పత్రి ఎదుటే జరుగడంతో, అప్పటికే చనిపోయిన డాక్టర్ అను(అనన్య నాగళ్ల)నే ఊరి జనాలను చంపుతుందని గ్రామస్తులంతా నమ్ముతారు. ఈ క్రమంలో విక్రమ్.. ఈ హత్యల వెనకున్న మిస్టరీ ఛేదించే ప్రయత్నం చేస్తాడు. చివరకు ఏమైంది అనేదే మూవీ. (ఇదీ చదవండి: మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం) -
అవును, సర్జరీ చేయించుకున్నా: తెలుగు హీరోయిన్
అనన్య నాగళ్ల.. ఈ తెలుగందం త్వరలో భయపెట్టేందుకు రెడీ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ తంత్ర మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తోందీ బ్యూటీ. ఈ క్రమంలో రక్తం అమ్ముతూ ఓ హారర్ స్కిట్ చేసిన అనన్య నాగళ్ల ప్రస్తుతం ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ మధ్యే నిర్మొహమాటంగా తాను సర్జరీ చేసుకున్నట్లు వెల్లడించింది అనన్య. లిప్ ఫిల్లర్స్ వాడినట్లు తెలిపింది. లిప్ ఫిల్లర్స్.. తాజాగా మరోసారి ఈ ప్రశ్న ఎదురవడంతో.. అసలు ఎందుకు లీక్ చేసాన్రా దేవుడా అని తల బాదుకుంది. ఆమె మాట్లాడుతూ.. లిప్ ఫిల్లర్ అనే చిన్నపాటి సర్జరీ చేయించుకున్నాను. అయితే అదేమీ శాశ్వతంగా ఉండదు. ఒక ఏడాదిలో పెదాలు మళ్లీ మామూలైపోతాయి. అప్పుడప్పుడూ మనకు హెయిర్ స్టెయిల్ మార్చాలని ఉంటుంది కదా.. అలా ఊరికే ట్రై చేయాలనిపించింది. అందుకే లిప్ ఫిల్లర్ చేయించుకున్నాను. కానీ ఇప్పుడది పోయింది' అని చెప్పుకొచ్చింది. 2022లోనే సర్జరీ రూమర్స్ ఇకపోతే అనన్య నాగళ్ల తన పెదాలకు సర్జరీ చేయించుకున్న విషయాన్ని అభిమానులు ఎప్పుడో పసిగట్టారు. 2022లోనే తను లిప్స్కు సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వెలువడ్డాయి. ఇన్నాళ్లకు ఆ సర్జరీ నిజమేనని అంగీకరించింది అనన్య. చదవండి: ఇంట్లో సింపుల్గా మౌనిక సీమంతం.. వెన్నంటే మనోజ్.. -
ఇండస్ట్రీలో వివాహేతర సంబంధాలు ఎక్కువ.. అందుకే పెళ్లి చేసుకోను: అనన్య నాగళ్ల
-
వేణుస్వామిని కలిసిన అనన్య నాగళ్ల.. కారణం ఇదేనా?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ప్రముఖ జ్యోతిష్కుడిగా వేణుస్వామికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ, సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన చెప్పిన వాటిలో ఎక్కువ శాతం జరుగుతాయని కొందరు అభిప్రాయం. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా వేణుస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. వకీల్ సాబ్ చిత్రం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర' అనే హారర్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించాయి. మార్చి 15న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అనన్య కూడా వేణుస్వామిని కలవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఆయనతో పాటుగా దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గత కొన్నేళ్లుగా వేణు స్వామి ద్వారా పూజలు చేపించుకున్న హీరోయిన్ల లిస్ట్ చాలా ఎక్కువగానే ఉంది. రష్మిక మందన్న, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి, అషురెడ్డి వంటి వారు వేణు స్వామితో పూజలు చేపించారు. ప్రస్తుతం అనన్య నాగళ్ల కూడా ఆయన్ను కలవడంతో ఆమె కూడా ఏమైనా పూజలు చేపించారా అని పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ త్వరలో తను నటించిన తంత్ర సినిమా విజయవంతం కావాలని ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు ఏమైనా వెళ్లారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. రీసెంట్గా హీరోయిన్ డింపుల్ హయాతితో మరోసారి వేణు స్వామి పూజలు జరిపించారు. మద్యం సీసాలు ఉంచి పూజలో పాల్గొన్నారు. ఆ ఫోటోలు కూడా భారీగా నెట్టింట వైరల్ అయ్యాయి. తాను చేసే వామచార పూజలు, బాగాలమ్మకు,రాజ శ్యామల, తార, చిన్నమస్త.. ఇలా ప్రతి పూజకు లిక్కరే వాడతానని బహిరంగంగా చెప్పినట్లు బయట కథనాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by TantraTheMovie (@tantrathemovie) -
'ఆ తెలుగు హీరో నా మొదటి క్రష్'.. యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల..!
2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం అనన్య ప్రధాన పాత్రలో వస్తోన్న హారర్ మూవీ తంత్ర. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య తన కెరీర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. అంతే కాదు టాలీవుడ్ యంగ్ హీరో అంటే క్రష్ అని ఓపెన్ అయింది ముద్దుగుమ్మ. ఆ వివరాలేంటో చూద్దాం. (ఇది చదవండి: అనన్య నాగళ్ల కొత్త మూవీ.. సాంగ్ రిలీజ్ చేసిన మంగళవారం బ్యూటీ!) అనన్య మాట్లాడుతూ.. 'తనకు కాబోయేవాడు నిజాయితీగా ఉంటే చాలు. అలాంటి వాడైతే ఓకే. సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నా. ఇండస్ట్రీ వాళ్లయితే కొంచెం కష్టం. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావొచ్చు. సినిమా వాళ్లకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో నా ఫస్ట్ క్రష్ నాగశౌర్య. నా చిన్నప్పుడు అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్ను అంటే చాలా ఇష్టం. వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగా. నాకు ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఇండస్ట్రీ వాళ్లను చూస్తే కమిట్ అయి ఉంటారని అనుకుంటారు. కానీ నేను మాత్రం కమిటేడ్ కాదు. అంతేకాదు నాకు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురవ్వలేదు ' అని అన్నారు. -
అప్పుడేదో తెలీక అన్నాను, కానీ బోల్డ్ సీన్స్..: అనన్య
మల్లేశం మూవీతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది అనన్య నాగళ్ల. ఒక్క సినిమాతోనే పేరు తెచ్చుకున్న ఈ సుందరాంగి వరుస అవకాశాలు అందుకుంది. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో, మళ్లీ పెళ్లి.. ఇలా అనేక సినిమాలు చేసింది. అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈసారి తంత్ర అనే హారర్ మూవీతో భయపెట్టేందుకు రెడీ అయింది. ఈ సినిమాతో పాటు పొట్టేల్ అనే మూవీ కూడా పూర్తి చేసింది. ఇది రిలీజ్కు రెడీ అవుతోంది. ఇకపోతే బోల్డ్ సన్నివేశాలకు తాను దూరమని చెప్పిన అనన్య పొట్టేలు చిత్రంలో మాత్రం హద్దులు చెరిపేసి యాక్ట్ చేసింది. సినిమాకు అవసరం, అందుకే.. తంత్ర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనన్యకు 'పొట్టేల్'లోని ముద్దు సన్నివేశం గురించి ప్రశ్న ఎదురైంది. అలాంటి సన్నివేశాలు తంత్రలో కూడా ఉంటాయా? అని ఓ విలేఖరి ప్రశ్నించాడు. ఇందుకు అనన్య స్పందిస్తూ.. 'ముద్దు సన్నివేశమనేది ఆ సినిమాకు చాలా అవసరం. అందుకని చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో గ్లామర్, రొమాంటిక్ సీన్స్, హారర్.. అన్నీ ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనిషి ఆలోచనల్లో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పు లేకపోతే మన ఎదుగుదల ఆగిపోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నేను ఎలా ఉన్నా మంచి రోల్స్ నా దగ్గరకు వస్తాయనుకున్నాను. పర్ఫామెన్స్ చేస్తే చాలనుకున్నాను. కానీ.. పర్ఫామెన్స్లో ఈ తరహా రోల్స్ కూడా భాగమేనని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది' అని చెప్పుకొచ్చింది. అంటే కథ డిమాండ్ చేస్తే ఎటువంటి బోల్డ్ సీన్స్ చేయడానికైనా రెడీ అని చెప్పకనే చెప్పింది అనన్య. చదవండి: 'అవును.. ఊహించిందే జరిగింది'.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన దీపికా పదుకొణె! -
'అందమైన అమ్మాయిపై క్షుద్రపూజలు చేస్తే'.. ఆసక్తిగా ట్రైలర్!
అనన్య నాగళ్ల లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘తంత్ర’. ఈ హారర్ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా అనన్య నాగళ్ల కనిపించనున్నారు. హారర్ నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే క్షుద్రపూజలు నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ యువతిపై క్షుద్రపూజలు ప్రయోగిస్తే ఏమవుతుంది? అనే కోణంలో తంత్రను రూపొందించారు. ట్రైలర్ చూస్తే హారర్ జానర్లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చూపించనున్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ధనుష్ రఘుముద్రి, సలోని, ‘టెంపర్’ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఆర్ఆర్ ధృవన్ సంగీతమందించారు. -
మార్చిలో తంత్ర
అనన్య నాగళ్ల లీడ్ రోల్లో నటించిన ‘తంత్ర’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. మార్చిలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్ రఘుముద్రి, సలోని, ‘టెంపర్’ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మించారు. ఈ మూవీని మార్చి 15న విడుదల చేయనున్నట్లు పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘హారర్ నేపథ్యంతో రూపొందిన ‘తంత్ర’ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందనే నమ్మకం ఉంది. పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా అనన్య నాగళ్ల చక్కగా నటించారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తేజ్ పల్లి, కెమెరా: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్ఆర్ ధృవన్. -
'తంత్ర'.. పిల్లబచ్చాలు ఈ సినిమాకు రావద్దు!
హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ తంత్ర. ఈ సినిమాకు సెన్సార్వాళ్లు A సర్టిఫికేట్ ఇవ్వడంతో 'తంత్ర' టీమ్ డిఫరెంట్గా రియాక్ట్ అయింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ 'A' ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిం. నిజానికి ఇదొక సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ. తమ సినిమా కచ్చితంగా భయపెడుతుందన్న నమ్మకమున్న మేకర్స్ తమ సినిమాకి చిన్నపిల్లలు రావొద్దని వారిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లో హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా చూపించారు. అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి నటించాడు. మర్యాద రామన్న ఫేం సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి.. వాల్ట్డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి, సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని 'తంత్ర 'తో సాధించాడు. ఈ సినిమా ట్రైలర్ను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్ బాబు, రవిచైతన్య పేర్కొన్నారు. మనమంతా నిద్రపోయాక స్మశానంలో మరో ప్రపంచం మేల్కొంటుంది! ఆ ప్రపంచాన్ని చూసే ధైర్యం మీకుందా?.. థియేటర్లో కలుద్దాము!🔥#Tantra is coming to scare you all in cinemas from MARCH 15th❤️🔥#TANTRAOnMarch15 pic.twitter.com/5Yvz49GGKp — Eluru Sreenu (@IamEluruSreenu) February 20, 2024 చదవండి: షణ్ముఖ్ అన్న ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో.. -
సమంత అందాల జాతర.. నడుము ఒంపుసొంపులతో అనన్య!
మలేసియాలో గ్లామర్ గేట్లు ఎత్తేసేలా సమంత రచ్చ నవ్వుతో చంపేస్తున్న ముద్దుగుమ్మ ప్రియమణి క్యూట్ పోజులతో కిక్ ఎక్కిస్తున్న సురేఖావాణి కూతురు ఫన్నీ డ్యాన్స్తో ఆకట్టుకున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి బ్లాక్ చీరలో మరింతగా ముద్దొచ్చేస్తున్న మేఘా ఆకాశ్ నడుము అందాలతో కవ్విస్తున్న హీరోయిన్ అనన్య నాగళ్ల మూవీ సెట్లో ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా బర్త్ డే సెలబ్రేషన్స్ బీచ్లో సాయంత్రం అలా జలకాలాడుతున్న యాంకర్ అనసూయ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Salony Luthra (@salonyluthra) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by ELLE India (@elleindia) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) -
అనన్య నాగళ్ల కొత్త మూవీ.. సాంగ్ రిలీజ్ చేసిన మంగళవారం బ్యూటీ!
టాలీవుడ్లో 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో మెరిసింది. తాజాగా అనన్య నాగళ్ల హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం 'తంత్ర'. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా.. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, రవిచైతన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ధీరే ధీరే అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్, అనసూయ చేతుల మీదుగా విడుదల చేశారు. డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ.. 'గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్పుత్, అనసూయ ప్రత్యేక కృతజ్ఞతలు' అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ఫస్ట్-లుక్, టీజర్కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్, కుషాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ ఆర్ ధృవన్ సంగీతమందిస్తున్నారు. Happy to launch "Dheere-Dheere" song from @TantraTheMovie making visuals 😊 Very breezy and authentic! Best wishes to the entire team @AnanyaNagalla @srini_gopisetti @rrdhruvan @anuragkulkarni_ @veerapanenisc #DheereDheere #TantraFilm #AnasuyaBharathwajWishes #AnanyaNagalla… pic.twitter.com/BLpkZmdBSQ — Anasuya Bharadwaj (@anusuyakhasba) January 12, 2024 -
Ananya Nagalla: వైరల్ అవుతున్న ...అనన్య నాగళ్ల కొత్త ఫోజులు (ఫొటోలు)
-
Ananya Nagalla Photos: గ్లామర్ డోస్ పెంచి బ్లాక్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న అనన్య నాగళ్ల (ఫొటోలు)
-
పట్టుచీరలో అనన్య నాగళ్ల అందాల మాయాజాలం...ఈ ఫోజులు చూశారంటే!
-
Ananya Nagalla : చీరలో మెస్మరైజ్ చేస్తున్న అనన్య నాగళ్ల (ఫొటోలు)
-
అన్వేషి మూవీ రివ్యూ
టైటిల్: అన్వేషి నటీనటులు: అనన్య నాగళ్ల, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్ తదితరులు నిర్మాత: గణపతి రెడ్డి దర్శకుడు : వీజే ఖన్నా సంగీతం: చైతన్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: కెకె రావు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: నవంబర్ 17, 2023 అన్వేషి కథేంటంటే.. విక్రమ్(విజయ్ధరణ్ దాట్ల).. అను(సిమ్రాన్ గుప్తా)తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను వెతుక్కుంటూ మారేడుకోన అనే గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అవన్నీ మూతపడిపోయిన అను ఆస్పత్రి ఎదుటే జరుగడంతో..చనిపోయిన డాక్టర్ అను(అనన్య నాగళ్ల)నే ఊరి జనాలను చంపుతుందని గ్రామస్తులంతా నమ్ముతారు. ఆ మిస్టరీని కనిపెట్టేందుకు వచ్చిన ప్రముఖ డిటెక్టివ్ ప్రకాశ్ జాదవ్ కూడా అనూహ్యంగా ఆ ఆస్పత్రి ఎదుటే హత్యకు గురవుతాడు. దీంతో ఆ రహస్యాన్ని కనిపెట్టేందుకు విక్రమ్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? ఆ హత్యల వెనుక ఉన్నదెవరు? అను ఆస్పత్రి ఎందుకు మూతపడింది? డాక్టర్ అనుకి ఏమైంది? రాజకీయ నాయకుడు, ప్రైవేట్ ఆస్పత్రి యజమాని పెద్దిరెడ్డి(అజయ్ ఘోష్)తో ఈ హత్యలకు సంబంధం ఉందా? లేదా? మర్డర్ మిస్టరీని విక్రమ్ ఎలా ఛేదించాడు? అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. ఊరిలో వరుస హత్యలు.. దానికి కారణం ఒకటని అంతా నమ్మితే.. హీరో మాత్రం మరేదో ఉందని అనుమానిస్తాడు. దాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు.. చివరకు అసలు కారణాన్ని బయటపెడతాడు. దాదాపు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథలన్నీ ఇలానే సాగుతాయి. అయితే హీరో ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడనే దానిపైనే సినిమా ఫలితం ఆధారపడుతుంది. వరుస ట్విస్టులతో..క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్గా కథనం సాగితే.. ఆ మూవీ విజయం సాధిస్తుంది. ఇక అన్వేషి విషయానికొస్తే.. సస్పెన్స్ని చివరకు మెయిన్టైన్ చేస్తూ.. ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే భయపెట్టే సన్నివేశాలు తక్కువగానే ఉన్నాయి. ఫస్టాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్స్టోరీ రొటీన్గా ఉంటుంది. పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. హీరో ఎప్పుడైతే మారేడుకోన గ్రామానికి వెళ్తాడో అప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. హత్యల వెనుక రహస్యాన్ని ఛేదించే క్రమంలో వచ్చే సన్నివేశాలు..ప్రతి పాత్రపై అనుమానం కలిగించేలా చేస్తాయి. సెకండాఫ్లో డాక్టర్ అను ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. విక్రమ్గా విజయ్ధరణ్ దాట్ల చక్కగా నటించాడు. ఇక ఎస్సై కూతురు, విక్రమ్ ప్రియురాలు అనుగా సిమ్రాన్ గుప్తా తన పాత్ర పరిధిమేర నటించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల..డాక్టర్ అను పాత్రలో చక్కగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. రాజకీయ నాయకుడు, ప్రైవేట్ ఆస్పత్రి యజమాని పెద్దిరెడ్డి పాత్రకు అజయ్ ఘోష్ న్యాయం చేశాడు. ఈ తరహా పాత్రల్లో నటించడం అజయ్ ఘోష్కి కొత్తేమి కాదు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సాగదీత సీన్లను కట్ చేసి సినిమా నిడివి తగ్గించి ఉంటే బాగుండేదేమో. నిర్మాత గణపతి రెడ్డి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. -
భయపెట్టే అన్వేషి
విజయ్ ధరణ్, సిమ్రాన్ గుప్తా, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘అన్వేషి’. వీజే ఖన్నా దర్శకత్వంలో టి. గణపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు నటులు అశ్విన్బాబు, సోహైల్, చైతన్యారావు, సంపూర్ణేశ్ బాబు అతిథులుగా హాజరై, ఈ చిత్రం విజయం సాధించాలన్నారు. ఈ వేడుకలో హీరో విజయ్ ధరణ్ మాట్లాడుతూ– ‘‘హీరో కావాలని ఓ చిన్న పల్లెటూరు నుంచి మొదలైన నా ప్రయాణంలో అవమానాలు, బాధలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ మూవీ నిర్మాణంలోనూ కష్టాలు పడ్డాం. కొంతమంది సపోర్ట్ చేయడంతో బయటపడ్డాం. ఈ సినిమా బాగాలేకపోతే నేను గుండు కొట్టించుకుంటాను. వీజే ఖన్నా భవిష్యత్లో పెద్ద దర్శకుడు అవుతారు’’ అన్నారు. ‘‘అనన్యా నాగళ్ల పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది’’ అన్నారు వీజే ఖన్నా. ‘‘ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు గణపతి రెడ్డి. ‘అన్వేషి’ చిత్రం మెప్పిస్తుంది’’ అన్నారు సిమ్రాన్ గుప్తా. -
రీతూ బాత్రూం సెల్ఫీ.. లుక్ పూర్తిగా మార్చేసిన సమంత
విష్ణుప్రియ చెల్లితో బాత్రూంలో పోజులిచ్చిన రీతూ చౌదరి అందాల విందుతో కనువిందు చేస్తున్న అనన్య నాగళ్ల సినిమా ప్రమోషన్స్లో తెగ మెరిసిపోతున్న మెహ్రీన్ దీపావళి కోసం పూజాహెగ్డే రెడీ.. హాట్నెస్తో రెచ్చిపోయి మేకోవర్ బిజీలో హీరోయిన్ కేథరిన్ థ్రెసా క్యూట్ లుక్తో ఆకట్టుకుంటున్న శ్రుతిహాసన్ లుక్ మార్చి హాట్నెస్ పెంచేసిన సమంత పరువాలు చూపిస్తూ వావ్ అనిపిస్తున్న ప్రియా వారియర్ మెరుపుల డ్రస్సులో జిగేలు అనిపిస్తున్న మాళవిక View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Devika Jodhani (@devikajodhani) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
Actress Ananya Nagalla: అనన్య నాగళ్ల అందాలు..చూడకుండా అస్సలు ఉండలేరు!
-
ఆ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తానంటే: అనన్య నాగళ్ల
మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. అందం, అభినయంతో పాటు నటనలో మంచి టాలెంట్ ఉన్న బ్యూటీ అనన్య.. వకీల్ సాబ్ సినిమా అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది. దానికి ప్రధాన కారణం తెలుగమ్మాయి అనే ప్రశ్నలు రావడం సహజం. తను హీరోయిన్ మెటిరీయల్ అయినప్పటికీ సహాయనటిగానూ ప్రేక్షకులను మెప్పించింది. ప్రధాన కథాననాయకగా ఆమె నటించిన తాజా చిత్రం ‘అన్వేషి’. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇన్స్టా వేదికగా తరచూ గ్లామరస్ ఫొటోలు షేర్ చేయడానికి గల కారణాన్ని ఆమె తెలిపారు. 'వకీల్సాబ్’కు ముందు ఎక్కువగా ట్రెడిషనల్ ఫొటోలు షేర్ చేసేదాన్ని. శాకుంతలం చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక గ్లామర్ పిక్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. దానికి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫొటోలు షేర్ చేయడానికి అప్పట్లో ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. కాకపోతే ఆ ఫొటోలకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు సినిమా అనే రేస్లో నేను ఉండాలనుకుంటున్నా.. ఇక్కడ నువ్వు కొనసాగాలంటే అన్ని రకాలుగా కనిపించాలి. ఈ కారణంతో మాత్రమే నేను గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తున్నాను. అంతకుమించి ఎలాంటి కారణం లేదు. కమర్షియల్ సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి.. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు.' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇలా ఓపెన్గా ఉన్న విషయాన్ని చెప్పిన అనన్యపై నెటిజన్లు కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ అవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన 'అన్వేషి' చిత్రాన్ని వి.జె.ఖన్నా డైరెక్ట్ చేశాడు. నవంబర్ 17న ఇది విడుదల కానుంది. -
నాకు ఎన్టీఆర్, మహేష్ బాబు అంటే చాలా ఇష్టం
-
అన్వేషి విజువల్స్ బాగున్నాయి
‘‘అన్వేషి’ ట్రైలర్, విజువల్స్ చాలా బాగున్నాయి. సంగీతం, నేపథ్య సంగీతం కూడా చక్కగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. చిత్ర యూనిట్కి అభినందనలు’’ అని నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా వీజే ఖన్నా దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్వేషి’. టి.గణపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు రెండో వారంలో విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. గణపతి రెడ్డి పుట్టినరోజు(సోమవారం) సందర్భంగా ‘అన్వేషి’ మూవీ ట్రైలర్ను వరలక్ష్మి విడుదల చేశారు. టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ‘అన్వేషి’ నా తొలి చిత్రం. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వీజే ఖన్నా, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, సహ నిర్మాతలు హరీష్ రాజు, శివన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ మాట్లాడారు. -
డంప్ యార్డ్ ముందు నోట్ల కట్టలు.. సిగరెట్ తాగుతున్న హీరో
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ళ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'నవాబ్'. హరిహర క్రియేషన్స్ బ్యానర్పై ఆర్ఎం నిర్మాణ సారథ్యంలో రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ రా అండ్ రస్టిక్ లుక్తో సమ్థింగ్ స్పెషల్గా కనిపిస్తోంది. ముందు డబ్బుల కట్టలు, వెనుక డంప్ యార్డ్, మధ్యలో రక్తపు మరకలతో ఇంటెన్సివ్ గా సిగరెట్ తాగుతున్నాడు హీరో. ఈ చిత్రం ఒక డంప్ యార్డ్ చుట్టూ అల్లుకున్న కథ అని, ఆద్యంతం ఉత్కంఠ భరితమైన థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకుడికి 'నవాబ్' చిత్రం అందిస్తుందని మేకర్స్ తెలిపారు. యాక్షన్ డ్రామాతో పాటు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే హృదయాన్ని కదిలించే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో కీలకమని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం 'నవాబ్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని, త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం చేస్తామని తెలిపింది. వీలైనంత త్వరగా మూవీ విడుదలకు సంబంధించిన ప్రకటనను వెల్లడించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రేక్షక ఆధరణతో పాటు విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న 'నల్లమల' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రవి చరణ్ తన రెండవ చిత్రం అయిన 'నవాబ్' మూవీకి దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే నవాబ్ చిత్రానికి స్టైలిస్ట్ గా శోభారాణి పనిచేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. First look of #RaviCharan’s #Nawab 🔥 Written & directed by #RaviCharan Produced by #RM Music #PR Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam!@mukesh_gupta14 @AnanyaNagalla @Sandhya44245248 #PayalMukherjee#HariHaraCreations pic.twitter.com/3O65SY53Tr — Eluru Sreenu (@IamEluruSreenu) October 16, 2023 చదవండి: ఇంటికి వెళ్లి తల్లిని పట్టుకుని బోరున ఏడ్చేసిన నయని.. టాప్ 5లో ఉండాలనుకున్నా అంటూ. -
హీట్ పెంచేస్తున్న అనన్య.. కాజల్ సోయగాలు
చాలారోజులకు గ్లామర్ చూపించిన కాజల్ ఒంపుసొంపులు చూపిస్తూ పూజాహెగ్డే రచ్చ ఎప్పుడూ లేనంత హాట్గా తయారైన ఈషా రెట్రో లుక్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చీరకట్టులో అందంగా కనిపిస్తున్న జాన్వీ కపూర్ కుర్చీపై కూర్చుని కాక రేపే పోజుల్లో ప్రణీత రెడ్ డ్రస్ లో మిర్చి కంటే హాట్ గా అనన్య అనసూయ క్యూట్ పోజులు.. నవ్వుతూ మాయ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
సినిమా ఛాన్స్ల కోసం ఇంకెన్ని చేయాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల
-
హారర్ చిత్రంతో సలోని రీఎంట్రీ
హీరోయిన్ సలోని గుర్తుందా..? అదేనండి ‘మర్యాద రామన్న’లో హీరో సునీల్ సరసన నటించి, తనదైన అందంతో ఆకట్టుకుంది. ఈ ఒక్క చిత్రంతో సలోనికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘బాడీగార్డ్’చిత్రంతో పాటు పలు సినిమల్లో స్పెషల్ సాంగ్స్లో నటించి మెప్పించింది. చివరగా రేసుగుర్రం చిత్రంలో అతిథి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.. తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ‘తంత్ర’ చిత్రంతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ‘మల్లేశం’, ‘వకీల్సాబ్’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ‘మగధీర’లో షేర్ఖాన్ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ మేరకు దర్శనిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఫీమేల్ ఓరియెంటెడ్ లైన్తో రూపొందుతున్న హారర్ ఎంటర్టైనర్ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాఽథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా స?గుతుంది. తంత్ర శాస్ర్తానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాం. ఇందులో అనన్య నాగళ్లతోపాటు ‘మర్యాదరామన్న’ ఫేం సలోని కీ రోల్ పోషిస్తున్నారు. గాళ్ నెక్ట్స్ డోర్ రోల్తోపాటు గ్లామర్ పాత్రలతోనూ మెప్పించిన సలోని ఇందులో డిఫరెంట్గా కనిపిస్తారు. నటనకు ఆస్కారమున్న పాత్ర అది. ఇటీవల అనన్యా, సలోని, హీరోపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్పుట్బాగా వచ్చింది. ఈ చిత్రం టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావడంతోపాటు సలోనికి మంచి కమ్బ్యాక్ అవుతుంది’’ అని తెలిపారు. -
థియేటర్లలో మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తున్న సినిమాలు ఇవే..
హారర్ చిత్రాలంటే వెన్నులోంచి టెర్రర్ పుట్టాల్సిందే. అలా క్షణ క్షణం భయపడుతూ హారర్ చిత్రాలు చూడటంలో చాలామందికి ఓ కిక్ దొరుకుతుంది. ఆ భయమే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడలా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, వసూళ్లు రాబట్టడానికి కొందరు హారర్ చిత్రాలు చేస్తున్నారు. ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం. భ్రమ యుగంలో... సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో రకాల సినిమాల్లో నటించారు మమ్ముట్టి. ఈ ప్రయాణంలో ΄పొలిటికల్, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్.. ఇలా ఎన్నో జానర్స్ను టచ్ చేశారాయన. తాజాగా ‘భ్రమ యుగం’ అనే హారర్ ఫిల్మ్లో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథతో రాహుల్ సదా శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. హారర్ రాజా లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో సాగే చిత్రాలు చేస్తున్నప్పటికీ ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లోనే నటిస్తారు ప్రభాస్. అయితే తొలిసారి ప్రభాస్ హ్యూమర్తో కూడిన హారర్ అంశాలు ఉండే ఓ సినిమాలో నటిస్తున్నారు. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’, ‘వింటేజ్ కింగ్’, ‘అంబాసిడర్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని సమాచారం. మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీ రోల్లో సంజయ్ దత్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా టైటిల్, రిలీజ్లపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రముఖి తిరిగొస్తే.. హారర్ జానర్ను ఇష్టపడే ప్రేక్షకులు ‘చంద్రముఖి’ని అంత సులభంగా మర్చిపోలేరు. వెంకటపతి రాజుగా రజనీకాంత్, చంద్రముఖిగా జ్యోతిక వెండితెరపై ప్రదర్శించిన నటన అలాంటిది. ఇప్పుడు ‘చంద్రముఖి’ మళ్లీ వస్తోంది. కానీ రజనీ, జ్యోతికలు రావడం లేదు. ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్గా రూ΄పొందిన ‘చంద్రముఖి 2’లో రజనీ, జ్యోతికల స్థానాల్లో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే ‘చంద్రముఖి 2’ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. భైరవకోనలో ఏం జరిగింది? ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ప్రేక్షకులను భయపెడుతూ, కథలో వీలైనప్పుడు నవ్వించారు దర్శకుడు వీఐ ఆనంద్. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘ఊరుపేరు భైరవకోన’. ఇందులో సందీప్కిషన్ హీరోగా నటిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో హారర్ అండ్ సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. భైరవకోన అనే ఊర్లో జరిగే కొన్ని కల్పిత ఘటనల సమాహారంగా ఈ సినిమా కథనం సాగనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మంత్రం.. తంత్రం.. ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న తెలుగు కథానాయికల్లో అనన్య నాగళ్ల ఒకరు. అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్న ఈ బిజీ అమ్మాయి లిస్ట్లో ‘తంత్ర’ అనే ఓ హారర్ ఫిల్మ్ కూడా ఉంది. తాంత్రిక శాస్త్రం, పురాణ గాధల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఈ చిత్రదర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి పేర్కొన్నారు. ధనుష్ (దివంగత నటుడు శ్రీహరి తమ్ముడు కొడుకు) నటుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ మంచి దెయ్యం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’.. ఇలా హీరోయిన్ నందితా శ్వేతకు హారర్ జానర్లో నటించిన అనుభవం ఉంది. ఈ క్రమంలో నందితా శ్వేత చేసిన మరో హారర్ ఫిల్మ్ ‘ఓఎమ్జీ’. ‘ఓ మంచి ఘోస్ట్’ ఉపశీర్షిక. ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ఈ సినిమాలో ఇతర లీడ్ రోల్స్లో నటించారు. మార్తాండ్ కె. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరి.. మంచి దెయ్యంగా నందితా శ్వేత ఏ రేంజ్లో భయపెడతారో చూడాలి. కేరాఫ్ దెయ్యం గ్రామాల్లో ఒకప్పుడు మాతంగులుగా జీవించిన వారి జీవితాల ఆధారంగా రూ΄పొందుతున్న హారర్ ఫిల్మ్ ‘భయం కేరాఫ్ దెయ్యం’. ఈ చిత్రంలో ఓ మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా రవిబాబు, తాంత్రికుడిగా సత్యప్రకాష్ నటిస్తున్నారు. సీవీఎమ్ వెంకట రవీంద్రనాథ్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూ΄పొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తంతిరం హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథాచిత్రం ‘తంతిరం’. భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితం అవుతుందనేది ఈ సినిమా కథాంశం. మెహర్ దీపక్ దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ కేరళలో జరి గింది. శ్రీకాంత్, ప్రియాంక లీడ్ రోల్స్ చేశారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు.. హారర్ జానర్లో ప్రేక్షకులను భయ పెట్టే మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. -
రహస్యాలు ఏంటి?
‘మల్లేశం’ చిత్రం ఫేమ్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర చేస్తున్న చిత్రం ‘తంత్ర’. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పి. నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ‘‘హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం ‘తంత్ర’. భారత తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది!
'మల్లేశం', 'వకీల్సాబ్' చిత్రాల ఫేం అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘తంత్ర’. హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్ను మేకర్ రిలీజ్ చేశారు. అతి భయంకరమైన క్షుద్రశక్తులు.. అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. అనన్య నాగళ్ల పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది. టాలీవుడ్ స్టార్, దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మరో కీలక పాత్రలో ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. (ఇది చదవండి: ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు!) మన తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంతో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న హారర్ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఆర్ఆర్ ధృవన్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: నంది అవార్డ్స్ వివాదం.. ఆయన మధ్యలోకి ఎంటర్ కావడంతో!) View this post on Instagram A post shared by FIRSTCOPY MOVIES (@firstcopymovies) -
ఫోటోలు షేర్ చేసిన అనన్య నాగళ్ల.. బ్యాడ్ కామెంట్లతో నెటిజన్స్
టాలీవుడ్లో 2019 లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో అనన్య నాగళ్ల ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన నటనతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆమెకు అన్ని చిన్న చిన్న పాత్రలే వచ్చాయే కానీ లీడ్ రోల్లో నటించే పాత్ర దక్కలేదనే చెప్పాలి. సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ మంచి పాత్రలో కనువిందు చేసింది. తనలో మంచి టాలెంట్ ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం చెప్పుకోతగిన విదంగా రాలేదనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. నిహారిక,సమంత మాదిరే క్లూ ఇచ్చేసిందంటూ..) ఈ మధ్యే విడుదలైన 'బేబీ' సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా టాలెంట్ ఉన్నప్పటికీ తనకు సరైన గుర్తింపు దక్కేందుకు 8 ఏళ్లు పట్టింది. అదే విదంగా ఈ తెలుగు బ్యూటీకి కూడా ఏదో ఒకరోజు మంచి అవకాశం రాకపోతుందా..? అని తన సినీ ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదు. ఇందులో భాగంగానే సోషల్మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తన అందంతో ఫాలోవర్స్ను అలరిస్తుంటుంది. (ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?) తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలతో పాటు వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అందులో అనన్య గెంతులు వేస్తున్నట్లు కనిపించింది. అయితే ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు భారీగానే నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను పలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే అంత బరువును ఎలా మోస్తున్నారంటూ తన బాడీ గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తనుకు ఇలాంటి కామెంట్లు కొత్తేమీ కాదు. వీటిని తను పెద్దగా సీరియస్గా కూడా తీసుకోదని తెలుస్తోంది. ఎందుకంటే ఎవరెన్ని కామెంట్లు చేసినా తన పని తాను చేసుకుంటూ మళ్లీ రోజు సరికొత్త ఫోటోలతో తన అభిమానులను అలరిస్తుంది ఈ బ్యూటీ. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
చీరకట్టులో మెరిసిపోతున్న డింపుల్.. వర్షంలో ఆదిపురుష్ భామ!
►వర్షంలో ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ కృతి సనన్! ►బ్లాక్ డ్రెస్లో శాకుంతలం నటి అనన్య నాగళ్ల! ►వైట్ శారీలో మెరిసిపోతున్న డింపుల్ హయాతి! ►బ్లాక్ అవుట్ ఫిట్లో అతుల్య రవి పోజులు! ►ఫుల్గా చిల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్! ►కలర్ఫుల్ డ్రెస్లో తేజస్వీ ప్రకాశ్ లుక్స్! View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) -
శ్రీకాకుళం యాసతో...
రవి మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా చల్లా రాజా రామ్మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. బేబీ లాస్య రెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్పై వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా రాజా రామ్మోహన్ మాట్లాడుతూ– ‘‘కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలతో ఈ చిత్ర కథ ఆసక్తిగా ఉంటుంది. శ్రీకాకుళం యాస ఇతివృత్తంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, శియా గౌతమ్, ‘బాహుబలి’ ప్రభాకర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజేష్ రంబాల. -
Ananya Nagalla : అనన్య.. అందంతో చంపడం నీకు న్యాయమా? (ఫొటోలు)
-
అదే ప్రాబ్లమ్.. ఎవరూ ప్రపోజ్ చేయట్లేదు: అనన్య
‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. ‘వకీల్ సాబ్’తో మరింత ఫేమస్ అయింది. ఈ చిత్రం తర్వాత అనన్యకు వరుస అవకాశాలు లభించాయి. రీసెంట్గా విడుదలైన శాకుంతలం చిత్రంలోనూ ఓ మంచి పాత్ర పోషించింది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. తన ఫాలోవర్స్ని అలరిస్తుంది. తాజాగా ఈ నటి.. తన బాయ్ఫ్రెండ్, ప్రేమవ్యవహారం గురించి స్పందించింది. ఇన్స్టా లైవ్లోకి వచ్చిన అనన్యను.. ‘నీ బాయ్ఫ్రెండ్ పేరు, అతని ఇన్స్టా ఐడీ చెప్పు’ అని ఓ నెటిజన్ అడిగాడు. దీనిపై అనన్య స్పందిస్తూ.. ‘బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు భయ్యా.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అనుకుంటున్నారు. అందుకే ఎవరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. అదే ప్రాబ్లమేమో’ అంటూ అనన్య నాగళ్ల నవ్వేసింది. అలాగే మీ వాట్సాప్ డీపీ ఏంటని అడగ్గా.. ఆమె ఫోటో పెట్టింది. ఇక మరో నెటిజన్ ‘లాస్ట్ టైమ్ స్టేడియంలో మిమ్మల్ని బాటిల్తో కొట్టా.. చాలా బాధగా ఉంది’అని కామెంట్ చేయగా.. ‘మీరేనా కొట్టింది? తప్పు కదా? ఆ రోజు మీరు పిలిచినప్పుడు వెనక్కి తిరిగి హాయ్ కూడా చెప్పాను. అలా ఏ యాక్టర్తోనూ ప్రవర్తించకండి. మేము కూడా మనుషులమే కదా. నాకైతే ఆ రోజు చాలా భయమేసింది’ అని అనన్య రిప్లై ఇచ్చింది. -
అనన్య నాగళ్ల సోయగాలు (ఫోటోలు)
-
డంపింగ్ యార్డులో మూవీ సెట్ వేశాం : డైరెక్టర్
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘నవాబ్’. రవిచరణ్ దర్శకత్వంలో నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘నల్లమల’కు మంచి ఆదరణ లభించింది. ఆ ఉత్సాహంతో ‘నవాబ్’ తెరకెక్కిస్తున్నాం. పూర్తిగా డంపింగ్ యార్డ్లో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. దీని కోసం పదెకరాల్లో డంపింగ్ యార్డ్ సెట్ వేశాం. మా హీరో ముఖేష్ గుప్తా తెలుగు కాదు. ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఓ మంచి కథతో రూపొందుతున్న ‘నవాబ్’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ముఖేష్ గుప్తా.