-
అమలాపురం సీటు కోసం సిగపట్లు
సాక్షి, అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ బరిలో ఈసారి టీడీపీకి అవకాశం లేదనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై జనసేన పార్లమెంటరీ ఇన్చార్జి శేఖర్తోపాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ ఆదివారం పవన్ కళ్యాణ్ను కలిశారు. అమలాపురం ఆత్మగౌరవానికి సంబంధించిందని వదులుకోవద్దని ఆయనకు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే సీటును జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ నేత ఆనందరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీడీపీ నేతలు వాసంశెట్టి సుభాష్ , గంధం పల్లంరాజు పేరుతో ఆనందరావుకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సుభాష్, పల్లంరాజులు కోనసీమకు అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిన సమయంలో జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్నారని, వారి పేరిట ప్రచారం చేపడితే ఉన్న కాస్త అవకాశాలనూ కోల్పోతామని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలు అవేనా..!
హిందీ మాతృభాష గల మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీశ్గఢ్ రాష్ట్రాలో కాంగ్రెస్ ఘెర పరాజయాన్ని చవిచూసింది. బీజేపికి గట్టి పోటీ ఇచ్చేలా ధీటుగా ప్రచారాలు చేసింది. పలు గ్యారంటీ హామీలతో ముందుకొచ్చింది. కానీ ఓటర్లు అత్యంత విభిన్నంగా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షడు మల్లికార్జున్ ఖర్గే వంటి వ్యూహ చతురతలతో ప్రచారం చేసినా.. ఓటర్ల మనసును గెలుచుకోలాదా? బీజేపీ స్ట్రాటజీ ముందు కాంగ్రెస్ గ్యారంటీల గేమ్ వర్క్ ఔవుట్ అవ్వలేదా? అంటే..ఔననే చెప్పాలి. రాష్ట్రాల వారిగా కాంగ్రెస్ వైఫల్యానికి దారితీసిన కారణాలు? ప్రముఖులు ఏమంటున్నారు? రాజస్థాన్... రాజస్తాన్లో కాంగ్రెస్ ఎన్నికల సాంప్రదాయాన్ని తిరగరాయాలని ఎంతో వ్యూహాంతో ముందుకొచ్చింది. ఆఖరికి రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గ విభేధాలను పక్కన పెట్టి ఐక్యతను చాటుకుంది. తాము ఒక్కటేనని చెప్పింది. ఏడు గ్యారంటీ హామీలతో ముందుకొచ్చింది. ఇవేమి రాజస్థాన్ ప్రజల మనసును గెలుచుకోలేకపోయాయి. గత కొన్నేళ్లుగా పాలనలో చూసిని అవినితీ, అల్లర్లు, పేపర్ లీకేజ్లు కాంగ్రెస్ పార్టీకి పాలన పరంగా మాయని మచ్చలుగా ఉన్నాయి. ఇవే కాంగ్రెస్కి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోకపోవడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అదీగాక బీజేపీ ప్రచార వ్యూహంలో కాంగ్రెస్ మైనస్లను హైలెట్ చేస్తూ ప్రజల్లో వెళ్లింది. అలాగే రాజస్థాన్లో ఆనవాయితీగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదనే సెంటిమెంట్ను బీజేపీ నమ్ముతూ.. విజయావకాశాలపై ధీమాతో ఉంది. పైపెచ్చు.. తాము అధికారంలో ఉండగా రాజస్థాన్కి చేసిన నిధుల కేటాయింపు ఓటర్లకు గుర్తుచేస్తూ.. వాళ్లను ప్రసన్నం చేసుకుంది. అన్నింటికంటే ముఖ్యంగా.. కాంగ్రెస్లోని ఐక్యత లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని సత్తా చాటింది. మధ్యప్రదేశ్.. మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పకడ్బంధీగా వ్యూహాన్ని రచించింది. కర్ణాటకలో తాము చేసిన హామీలకు ప్రజలు బ్రహ్మరధం పట్టడంతో అదే తరహాలో మధ్య ప్రదేశ్లో కూడా కొన్ని ఉచిత పథకాలను ప్రకటించింది. ఉచితాలను ప్రధానాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వ అవినీతిని కూడా లక్ష్యం చేసుకుని ప్రచారానికీ శ్రీకారం చుట్టింది. గానీ మధ్యప్రదేశ్ అధికార పార్టీ బీజేపీ కాంగ్రెస్ని ఢీ కొనేలా సరికొత్త హామీలతో ముందుకొచ్చింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్’ స్కూల్ను ఏర్పాటు చేస్తామని ఓటర్లను ఆకర్షించారు. అలాగే లాడ్లీ బెహనా యోజన, కేంద్ర ఉజ్వల యోజన వంటి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అదీగాక బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చింది. అలాగా ప్రచార ర్యాలీలో రానున్న కాలంలో మధ్యప్రదేశ్ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ప్రజల నమ్మకాన్ని పొందింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ మధ్యప్రేదేశ్లో అత్యధిక ఓట్లతో ప్రభంజనం సృష్టించి విజయం సాధించింది. చత్తీస్గఢ్.. చత్తీస్గఢ్లో ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత తోపాటు ఆ రాష్ట్రా సీఎం భూపేష్ బఘేల్, అతని మంత్రులపై వచ్చిన ఆరోపణలు కాంగ్రెస్ మైనస్ అయ్యాయి. అందువల్లే కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని అందుకుంది. ముఖ్యమంత్రి భూపేష్ తన నియోజకవర్గం నుంచి గెలిచినప్పటికీ అతని పార్టీ మ్రాతం ఘోరంగా ఓడిపోయింది. ఇవన్నీ బీజేపీ కలిసోచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలోని అనేక్యత, పాలనాలోపాలే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యతకు కారణాలని చెప్పాలి. ఐదు రాష్ట్రాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్యంగా ప్రభంజనం సృష్టించి విజయం సొంతం చేసుకుంది. దశాబ్దంగా పాలిస్తున్న కేసీఆర్ పాలననె గద్దె దింపి అందర్నీ ఆశ్చర్యపరిచేలా విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కేవలం ఒక్క రాష్ట్రంలోనే తన హవా చూపించగలిగింది కాంగ్రెస్. ఉత్తరాది రాష్ట్రాలైన చత్తీస్గఢ్, రాజస్థాన్, మద్యప్రదేశ్లో తన పట్టును పూర్తిగా కోల్పోయింది. బీజేపీ మాత్రం ఈ మూడు రాష్ట్రాల గెలుపుతో అనూహ్యంగా తన ఆధిక్యం బలాన్ని పెంచుకుంది పలువురు ఏమన్నారంటే.. ►ఇది బీజేపీ విజయం కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ వైఫల్యమే అంటూ పశ్చిమ బెంగాల్ తృణమాల్ కాంగ్రెస్ ఆరోపించింది. ముందు కాంగ్రెప్ తన జమిందారీ మనస్తత్వం నుంచి బయటపడాలని మమతా బెనర్జీ వంటి ప్రముఖు అనుభవాన్ని పంచుకోవాలి అమలు చేయాలని అన్నారు. ►కాంగ్రెస్ సిండ్రోమ్ నుంచి బయటపడాలని సీనియర్ జనతాదళ్ యునైటెడ్ నాయకుడు కేసిఆర్ త్యాగా అన్నారు. ఇక కాంగ్రెస్ ఎప్పటికీ బీజేపీతో పోలీపడలేదని తెలుసుకోవాలని అన్నారు. ఇప్పటికే అన్ని నియోజక వర్గాలకే కాంగ్రెస్ దూరమైంది. పైగా కాంగ్రెస్ డిసెంబర్ 6న పిలుపునిచ్చిన కూటమిని కూడా అపహాస్యం పాలు చేసిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సినయర్ నేత శరద్ పవార్ మాత్రం ఈ తీర్పు భారత కూటమిపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. తాము ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం అవుతాం. ఈ వైఫల్యాలకు గత కారణాలపై తమ నేతలతో విశ్లేషిస్తామని అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్ర ప్రభావమేనని చెప్పారు. ఇక హిందీ హార్ట్ ల్యాండ్ అయినా ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి, కులగణన వ్యూహాం ఫలించకపోవుటానికి కారణం తదితరాలపై తమ నేతలతో చర్చించి విశ్లేషిస్తామని చెప్పుకొచ్చారు. (చదవండి: ఆధిక్యంలో ఉన్న వసుంధర రాజే..ముచ్చటగా మూడోసారి సీఎం ఆమెనా..?) -
Telangana Election Results 2023 : తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
-
రిజల్ట్స్ టెన్షన్ అందరిలో..!
-
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద హై సెక్యూరిటీ
-
మహబూబాబాద్ లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి
-
మధ్యాహ్నం తర్వాత క్రమంగా ఊపందుకుంటున్న పోలింగ్ అని అంటున్న పోలీస్
-
గ్రేటర్ హైదరాబాద్ లో 20శాతం కూడా నమోదు కాని పోలింగ్
-
మధ్యప్రదేశ్లో అక్కడ మళ్లీ పోలింగ్!
మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు నవంబర్ 17న(శుక్రవారం) ఒకే దశలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసింది. సుమారు 71.16 శాతం ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే మధ్యప్రదేశ్లోని భింద్లోని కిషుపురాలో పోలింగ్ కేంద్రం నెంబర్ 71 బూత్లో కొందరు అధికారులు ఓటింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు నవంబర్ 20న(మంగళవారం) ఆ ప్రాంతంలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటలకు ఈ ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రశాంతంగ సాగుతోందని, కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ జరుగుతోందని కలెక్టర్ సంజీవ్ శ్రీ వాస్తవ్ అన్నారు. ఇదిలా ఉండగా, మునపటి పోలింగ్లో పాల్గొన్న ఆ నలుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో ముగ్గర్ని విధుల నుంచి సస్పెండ్ చేయగా, నాల్గవ వ్యక్తి పర్మినెంట్ వర్కర్ అని అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదే నవంబర్ 17వ తేదిన చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ ముగిసింది. ఇక ఆ ఇరు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. (చదవండి: కాంగ్రెస్కు అవినీతే పరమావధి) -
Rajasthan Elections 2023: ఫేక్ అని మహిళలను అవమానిస్తారా?
పాలి (రాజస్థాన్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పేదలకు, రైతులకు, మహిళలకు వ్యతిరేకమని, గెహ్లాట్ హయాంలో మహిళలపై నేరాల్లో ఆ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని ఆరోపించారు. రాజస్థాన్లోని పాలీలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళలపై నేరాల్లో కాంగ్రెస్ రాజస్థాన్ను నంబర్ వన్గా నిలిపిందని, పైగా మహిళలు ఇచ్చిన ఫిర్యాదులే ఫేక్ అని సీఎం గెహ్లాట్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నరాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు త్వరితగతిన, సమర్థంగా అమలవుతన్నాయని మోదీ పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అదనంగా రూ. 6,000 అందిస్తున్నాయని, రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడ కూడా రూ.6 వేలు అదనంగా అందిస్తామన్నారు. ఇక సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విపక్షాల కూటమిపైనా ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అది ‘దురహంకార కూటమి’ అని అభివర్ణించారు. వారు సనాతన ధర్మాన్ని అవమానించడం ఇది మొదటిసారి కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ ప్రయోజనాల కోసం దళితులను వాడుకుంటోందన్నారు. దళితులు, మహిళలపై కాంగ్రెస్ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మీరూ చూస్తున్నారు కదా అక్కడి మహిళలకు గుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే 'నారీశక్తి వందన్ చట్టం' ఆమోదించినప్పటి నుంచి మహిళలపై వారి దురహంకారం మరింత ఎక్కువైందన్నారు. ఆ దురహంకార కూటమి నాయకులు మహిళల గురించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనన నియంత్రణపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కాంగ్రెస్ మళ్లీ వస్తే మహిళలకు ఏటా రూ.15 వేలు’
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తాజాగా హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో నవంబర్ 17న అసెంబ్లీ రెండోదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు. రాష్ట్రంలో గృహిణులైన మహిళందరికీ సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి కౌంటర్గా సీఎం భూపేష్ బఘేల్ రూ.15,000 ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో మహిళా సాధికారత కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు రాయ్పూర్లో విలేకరులతో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మహిళలకు ‘ఛత్తీస్గఢ్ గృహలక్ష్మి యోజన’ కింద ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని బఘేల్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 20 స్థానాలకు తొలి దశ పోలింగ్ నవంబర్ 7న ముగిసింది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. -
మహదేవున్నీ వదల్లేదు!
దుర్గ్: దుబాయ్కి చెందిన మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్కు ముడుపుల అంశంలో కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సదరు యాప్తో తనకున్న సంబంధాలేమిటో బఘేల్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. యాప్ నిర్వాహకుల నుంచి ఆయనకు ఇప్పటిదాకా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందినట్టు ఈడీ శుక్రవారం ప్రకటించడం, అది దేశవ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్లో శనివారం దుర్గ్ నగరంలో బీజేపీ ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ‘‘దోపిడీకి ఏ ఒక్క అవకాశాన్నీ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు వదల్లేదు. చివరికి మహదేవుని పేరును కూడా వాళ్లు వదిలిపెట్టలేదు. బెట్టింగ్ కంపెనీకి చెందిన భారీ మొత్తాలను రెండు రోజుల క్రితం రాయ్పూర్లో పట్టుకున్నారు. అదంతా రాష్ట్ర పేదలు, యువత నుంచి దోచిందే. అలాంటి డబ్బుతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందలమెక్కుతున్నారు. పట్టుబడ్డ డబ్బును సీఎం బఘేల్కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. దుబాయ్లోని యాప్ నిర్వాహకులతో తమకున్న బంధమేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం, బఘేల్ బయట పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. ఉచిత రేషన్ మరో ఐదేళ్లు దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్న ప్రధాన్మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను మరో ఐదేళ్ల పాటు పొడిగించనున్నట్టు మోదీ ప్రకటించారు. దేశంలో అతి పెద్ద కులం పేదరికం మాత్రమేనన్నారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్కు సుతరామూ ఇష్టముండదని ఆరోపించారు. -
‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్లోని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను బెంగళూరుకు తరలించుకెళ్లేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందన్న ప్రచారంపై రాష్ట్ర అధికారులు దృష్టి పెట్టి తెలిసింది. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ దూసుకెళ్తుండటం, ఐటీ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతుండటం, పారిశ్రామికంగానూ దెబ్బతిన్న క్రమంలో కర్నాటక ప్రభుత్వం ఈ వ్యవహారానికి తెరలేపిందన్న ప్రచారంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫాక్స్కాన్ సహా పలు ప్రముఖ కంపెనీలకు లేఖ రాసినట్టుగా ఆ రాష్ట్రంలోని పలు ఆంగ్ల, స్థానిక పత్రికల్లో కథనాలు రావడం, ఈ అంశాలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయమే అదనుగా.. బెంగళూరులో మౌలిక వసతుల కల్పనలో పురోగతి లేకపోవడం, ట్రాఫిక్, సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం, రహదారులు అస్తవ్యస్తంగా మారడం, తీవ్ర కరెంటు సంక్షోభంపై బడా పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్షా, ఖాతాబుక్ స్టార్టప్ సీఈవో రవీశ్ నరేశ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్దాస్ తదితరులు బెంగళూరు మౌలిక వసతులపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇదే సమయంలో హైదరాబాద్లోని వసతులను ప్రశంసించారని అంటున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కీన్స్ కంపెనీ సీఈవో రాజేశ్ శర్మ.. బెంగళూరులో ఏర్పాటు చేయతలపెట్టిన తమ కంపెనీని హైదరాబాద్ను మార్చాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్–బెంగళూరు వసతులను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని అంటున్నాయి. గతంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. గతంలోనూ కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ నుంచి కంపెనీలను తమ వైపు తిప్పుకొనేలా ప్రయతి్నంచిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 1న టీ–వర్క్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సీఎం కేసీఆర్తో భేటీ అయిన ఫాక్స్కాన్ సీఈవో యంగ్లీ యూ.. త్వరలో తెలంగాణలో రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, తద్వారా ఇక్కడ లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ మరునాడే ఫాక్స్కాన్ తెలంగాణలో కాకుండా బెంగళూరులో పెట్టుబడులు పెట్టబోతోందంటూ సోష ల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. ఫాక్స్కాన్తో సీఈవోతో మాట్లాడటంతో, తెలంగాణలోనే పెట్టుబడులు పెడుతున్నామంటూ మార్చి 6న ఫాక్స్కాన్ సీఈవో లేఖ రాశారని గుర్తు చేస్తున్నాయి. కోడై కూస్తున్న కన్నడ పత్రికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాయని.. దీన్ని సావకాశంగా తీసుకుని పరిశ్రమలను బెంగళూరుకు తరలించుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని కన్నడ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని అంటున్నారు. బెంగళూరు కోల్పోయిన ప్రభను తెచ్చేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు లేఖలు రాశారని సదరు పత్రికలు పేర్కొంటున్నాయని చెప్తున్నారు. బెంగళూరుకు వస్తే అనేక ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఆశచూపుతున్నా రని.. తెరపై ఫాక్స్కాన్కు రాసిన లేఖ కనిపిస్తు న్నా, ఇలా మరెన్ని కంపెనీలకు లేఖలు రాశారన్నది తెలియాల్సి ఉందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోందని అంటున్నారు. ఊహకందని రీతిలో పురోగతితో.. హైదరాబాద్ గత పదేళ్లలో ఐటీ, ఐటీఈఎస్తోపాటు పారిశ్రామికంగానూ ఊహించని రీతిలో పురోగతి సాధిస్తోందని.. టీఎస్ ఐపాస్తో పరిశ్రమల ఏర్పాటు సరళీకృతమై బడా కంపెనీలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. మౌలిక వసతుల కల్పన, 24 గంటల కరెంటు, పుష్కలమైన నీటి సరఫరా, రవాణా వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల చర్యలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు ఇక్కడ కొలువుదీరాయని అంటున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్లను ఏర్పాటు చేసుకున్నాయని.. తెలంగాణ ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని వివరిస్తున్నారు. పదేళ్లలో ఐటీ ఎగుమతులు సుమారు రూ.53 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.2.41 లక్షల కోట్లకు.. ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి దాదాపు పది లక్షలకు చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక తాజా కుట్రలకు తెరతీసినట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొంటున్నారు. -
వేగు చుక్కలే..తోకచుక్కౖలై
బొల్లోజు రవి: కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగాయి. ఆ పార్టీల నేతృత్వంలోని సాయుధ పోరాటంతో తెలంగాణలో ఊరూరా ఎర్రజెండా రెపరెపలాడింది. కమ్యూనిస్టుల ఉద్యమాలంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. వాళ్ల పాటలు ప్రజలను ఉర్రూత లూగించేవి. మార్క్సిస్ట్ సాహిత్యం లక్షలాది మంది యువతను వామపక్ష భావజాలం వైపు తీసుకెళ్లింది. ఇక చట్టసభల్లోనూ కమ్యూనిస్టుల గళం బలంగా వినిపించేది. అలాంటి కమ్యూనిస్టు పార్టీల కోటలు ఇప్పుడు బీటలువారాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోగా, తాజాగా ఒంటరిగా బరిలో దిగేందుకు సీపీఎం సిద్ధం కాగా, సీపీఐ కూడా అదే దారిలో పయనిస్తుందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య నుంచి జీరో స్థాయికి దిగజారి.. 1952 ఎన్నికల నాటికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీకి ఎక్కువ సీట్లే వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి 1953లో ప్రకాశం పంతులు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, తెలంగాణ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో కలిపి హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. తెలంగాణలో భాగంగా 1952లో కాంగ్రెస్కు 38 సీట్లు రాగా, పీడీఎఫ్ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులకు 36 సీట్లు వచ్చాయి. ఇక 1957లోనూ గణనీయమైన సంఖ్యలోనే సీట్లు సాధించి ప్రతిపక్ష స్థానం పొందింది. ఆ తర్వాత 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ 177 సీట్లు సాధిస్తే, సీపీఐ (అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ) 51 సీట్లతో ప్రతిపక్ష స్థానం సంపాదించింది. ఇక ఆ తర్వాత సీపీఐలో చీలిక వచ్చి సీపీఐ, సీపీఎంలుగా విడిపోయాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు మూడు, నాలుగో స్థానానికి చేరుకున్నాయి. అప్పుడు సీపీఐకి 10, సీపీఎంకు 9 స్థానాలు దక్కాయి. 1972 ఎన్నికల్లో సీపీఐకి 7, సీపీఎంకు ఒక స్థానం లభించింది. ఎనీ్టఆర్ అసెంబ్లీ రద్దు చేశాక 1985లో జరిగిన ఎన్నికల్లో చెరి 11 స్థానాలు దక్కించుకొని మళ్లీ తమ సత్తా చాటాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 8, సీపీఎంకు 7 స్థానాలు రావడం గమనార్హం. 1989లో మళ్లీ సీట్లు తగ్గాయి. అయితే 1994లో కమ్యూనిస్టు పార్టీలు మళ్లీ పూర్వవైభవం దిశగా ముందుకొచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ భారీ మెజారిటీ సీట్లు సాధించారు. కాంగ్రెస్ రెండో స్థానంలో 26 సీట్లు సాధించగా, సీపీఐ, సీపీఎంలు కలిపి కాంగ్రెస్ కంటే ఎక్కువగా 34 సీట్లు సాధించడం విశేషం. విడివిడిగా సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు సాధించాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో సీపీఐకి 13, సీపీఎంకు 8 సీట్లు రావడం విశేషం. 1999లో జరిగిన ఎన్నికల్లో సీపీఎంకు రెండు స్థానాలే దక్కగా, సీపీఐకి ఒక్కటీ రాలేదు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాలు సాధించాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 6, సీపీఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇక సీపీఐ, సీపీఎంల పరిస్థితి దిగజారుతూ పోయింది. అంటే 20 ఏళ్లుగా ఆ రెండు పార్టీలు చతికిలపడి పోయాయి. 2018 ఎన్నికల్లో ఒక్క సీటూ రాని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పుంజుకోని వైనం.. రాష్ట్రం ఏర్పాటయ్యాక తిరిగి కీలకమైన స్థానంలోకి రావాల్సిన సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు దారుణమైన పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. ఒక రకంగా తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర ప్రకారం చూస్తే ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సి ఉండేదని ఆ పార్టీల సానుభూతిపరులు చెబుతుంటారు. ఎందుకీ దుస్థితి అంటే.. కమ్యూనిస్టు పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చిన కారణాలు అనేకమనే చెప్పాలి. కొత్త తరం కమ్యూనిస్టు భావజాలం వైపు రావడం లేదని, మారుతున్న కాల పరిస్థితులను బట్టి నాయకత్వం నిర్ణయాలు తీసుకోవడంలేదన్న విమర్శలూ ఉన్నాయి. నాడు నాయకుల త్యాగాలు కేడర్లో ఉత్సాహం నింపగా, నేటి నాయకుల తీరుపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు చెబుతున్న కారణాలు కమ్యూనిస్టు పార్టీలు ఎదగకపోవటానికి ప్రధాన కారణం ఎన్నికల్లో ఇతర పార్టీలు డబ్బు కుమ్మరించడం, కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు చేయడం. గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుండటం వల్ల ప్రజాపోరాటాలు లేకుండా పోయాయి. వ్యవసాయ కార్మిక, రైతు పోరాటాలు పెద్దగా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల ప్రజలు, కమ్యూనిస్టులకు మధ్య కొంత గ్యాప్ పెరిగింది. బూర్జువా పార్టీల నాయకులు వ్యాపారాలు చేస్తూ కార్యకర్తలను తమతో తిప్పుకుంటున్నారు. తమ తమ ప్రాంతాల్లో పెళ్లిళ్లయినా, ఏ ఇతర శుభకార్యాలైనా వెళ్లి వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల నాయకులు ఎన్ని తప్పు పనులు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రజలను ఇలా పక్కదారి పట్టిస్తున్నారు. కమ్యూనిస్టులు ఇలాంటివి చేయకపోవడం వల్ల ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. బూర్జువా పార్టీల నాయకులు డబ్బులు ఖర్చు చేస్తూ ప్రజలను తమ వెంట తిప్పుకుంటున్నారు. కార్యకర్తలకు డబ్బులు ఇస్తూ కాపాడుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారు. కానీ కమ్యూ నిస్టులు ఇవేవీ చేయకుండా త్యాగాలు చేయాలని కోరడం ఎవరికీ నచ్చడం లేదు. సిద్ధాంతపరమైన రాజకీయాలు ఇప్పుడు లేకుండాపోయాయి. ధనమే అన్నింటికీ మూలంగా మారింది. రాజకీయ విశ్లేషకుల మాట... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించడంలో కమ్యూనిస్టులు విఫలం అవుతున్నారు. తమ బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించడం లేదు. ప్రజలకు దగ్గర కావడానికి అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. కొందరు నాయకుల తీరు, వారి వ్యవహార శైలి ప్రజలను ఆకట్టుకోవ డం లేదు. కమ్యూనిస్టు ఆదర్శాలను పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి నేతలు తమ సాధారణ జీవన శైలితో కార్యకర్తలు గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పుడు అలాంటి నేతలు లేరన్న విమర్శలు ఉన్నాయి. -
ఎన్నికల హీట్..!
-
బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదేళ్లలో శాంతియుత వాతావరణం నెలకొల్పామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. ‘‘గత మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం. సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ► తెల్లరేషన్కార్డుదార్లుకు త్వరలో కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా ► రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా ► కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి ►జూన్ నుంచి కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తాం ►తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్కార్డుదారుడికి సన్న బియ్యం అందజేస్తాం ►ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఇచ్చే హామీలన్నింటిని అమలు పరుస్తాం ►తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ ►సామాజిక పెన్షన్లు రూ.5వేల వరుకూ పెంచుతాం ►దశవారిగా పెన్షన్లు పెంచుతాం ►పెన్షన్లు ఏడాదికి రూ.500 పెంచుతూ వెళతాం ►ఏపీ సీఎం జగన్ పాలనపై సీఎం కేసీఆర్ ప్రశంసలు ►ఏపీలో పెన్షన్ స్కీం చాలా విజయవంతంగా జరుగుతోంది ►వికలాంగుల పెన్షన్ రూ.6వేల వరుకూ పెంచుతాం ►వికలాంగుల పెన్షన్ మార్చి తర్వాత రూ.5 వేలు ►రైతు బంధు రూ.16 వేల వరుకూ పెంచుతాం ►అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ►సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి ►అర్హులైన లబ్ధిదారులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంచుతాం ►జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షల వరుకూ పెంచుతాం ►కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో హెల్త్ స్కీమ్ ►జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీమ్ ►హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ►అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం ►మహిళా స్వశక్తి గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు ►అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ ►ఓపీఎస్ డిమాండ్పై కమిటీ నియామకం.. కమిటీ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం చదవండి: ఏపీ సీఎం జగన్ పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసలు -
కశ్మీర్లో ‘సరైన సమయం’లో ఎన్నికలు: ఈసీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) రాజీవ్ కుమార్ సోమవారం చెప్పారు. ఏది సరైన సమయం అని తాము భావిస్తామో అప్పుడే అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ ఎన్నికలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. -
TS Election 2023: టికెట్ పోరు..‘నర్సాపూర్’పై కొనసాగుతున్న ఉత్కంఠ!
మెదక్: బీఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై నెలకొన్న సస్పెన్స్ ఒకటెండ్రోజుల్లో వీడే అవకాశం ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ పెండింగ్లో పెట్టారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఈ టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం మెదక్లో ప్రగతి శంఖారావం బహిరంగ సభ జరిగిన మరుసటిరోజైన గురువారమే ఎమ్మెల్యే మదన్రెడ్డి తన అనుచరులతో హైదరాబాద్ తరలివెళ్లి హరీశ్రావును కలిశారు. టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించాలని మంత్రి నివాసం ముందు అనుచరులు బైఠాయించడం చర్చనీయాంశమైంది. దీంతో సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక శాఖ మంత్రి సముదాయించి పంపారు. ఇప్పటికే ఇద్దరితో మాట్లాడిన అధినేత మెదక్లో జరిగిన ప్రగతి శంఖారావం బహిరంగ సభ వేదికపై కేసీఆర్, మదన్రెడ్డితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన అడిగిన వెంటనే నర్సాపూర్కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సునీతా లక్ష్మారెడ్డి కూడా గురువారం మంత్రి హరీశ్రావును కలిసేందుకు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిసింది. అంతకు ముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశా రు. ఈనెల 21న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రక టించక ముందే వీరిద్దరితో నర్సాపూర్ టిక్కెట్ విషయమై ముఖ్యమంత్రి మాట్లాడినట్లు సమాచారం. ఇద్దరు కలిసే పార్టీ వ్యవహారాలు.. ప్రగతి శంఖారావం బహిరంగ సభకు కార్యకర్తలు, అనుచరులను తరలించే ప్రక్రియను మదన్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరు చేపట్టారు. ఏర్పాట్లు పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి వీరితో చర్చించారు. అయితే బహిరంగ సభకు ముందు.. ఈనెల 14న మెదక్లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రులు హరీష్రావు, కేటీఆర్ ఇద్దరూ హాజరుకావడంతో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అప్పుడే అభ్యర్థిత్వంపై కొంతమేరకు సంకేతాలు అందడంతోనే సునీతా లక్ష్మారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ నియోజకవర్గం అభ్యర్థిత్వం విషయంలో నెలకొన్న ఉత్కంఠ, రోజుకో పరిణామం ఆసక్తికరంగా మారుతోంది. -
TS Election 2023: కరీంనగర్ అసెంబ్లీ బరిలో.. ‘బండి’ నో..?
కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ బరిలో ఎంపీ బండి సంజయ్ ఈసారి ఉండేది అనుమానమే. ఇక్కడి నుంచి గత పార్లమెంటు ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆయన ఈసారి లోక్సభ బరికే మొగ్గుచూపుతున్నారని సమాచారం. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి, తన ప్రత్యర్థి, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్పై హోరాహోరీగా పోరాడారు. మొత్తం బీజేపీకి 66,009 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్కు 80,983 ఓట్లు వచ్చాయి. 14,974 ఓట్ల మెజారిటీతో గంగుల విజయబావుటా ఎగురవేశారు. ప్రతి రౌండ్లోనూ గట్టి పోటీ ఇచ్చి, కొన్ని సందర్భాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బండితో విజయం దోబూచులాడింది. ఆ సానుభూతి 2019 పార్లమెంటు ఎన్నికల్లో బాగా పని చేసింది. ఆ సమయంలో పుల్వామా దాడులు, పాకిస్తాన్పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్, సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం వెరసి.. జాతీయభావం ఎన్నికపై బాగా ప్రభావం చూపింది. దీనికితోడు బండి సంజయ్కి స్థానికుల నుంచి సానుభూతి వెల్లువెత్తడంతో ఎంపీగా ఘన విజయం సాధించారు. మొత్తం 4,98,276 ఓట్లు సాధించి, సమీప ప్రత్యర్థి బి.వినోద్కుమార్పై 89,508 ఓట్ల తేడాతో గెలుపొందారు. కేంద్ర కేబినెట్ పక్కా అన్న హామీతోనే.. మొన్నటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ సంజయ్ తన హయాంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు తెప్పించారు. మునుగోడు బైపోల్లోనూ చివరికి వరకు బీజేపీ పోరాడింది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ఉన్న 7 శాతం ఓటుబ్యాంకును 32 శాతానికి తీసుకురావడంలో సఫలీకృతుడయ్యారు. ఒక దశలో బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరగగా అనూహ్య పరిస్థితుల మధ్య రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనూ తాను కరీంనగర్ నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని సన్నిహితులతో, మీడియాతో చెబుతూ వచ్చారు. అసలు ఆ ఉద్దేశంతోనే పార్టీలో నగరంపై ఎవరికీ పట్టు చిక్కకుండా వ్యూహాత్మకంగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ అంటూ ఐదు భాగాలుగా విభజించారు. కానీ, ఇప్పుడు ఆకస్మికంగా కరీంనగర్ అసెంబ్లీ రేసు నుంచి సంజయ్ వైదొలగబోతున్నారన్న ప్రచారంపై ఆయన అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేంద్రంలో మూడోసారి కూడా మోదీ ప్రభుత్వమే కొలువుదీరనుందని, ఈసారి పార్లమెంటుకు ఎన్నికై తే బండికి కేంద్ర కేబినెట్లో స్థానం పక్కా అన్న హామీ మేరకే ఆయన లోకసభపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈ ప్రచారంపై మరో రెండు రోజుల్లో బండి సంజయ్ నుంచి ప్రకటన రానుంది. అసెంబ్లీ, పార్లమెంటు సీట్లకు తీవ్ర పోటీ.. ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకున్నాక కరీంనగర్ అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో పోటీకి ఆశావహులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఒకవేళ నిజంగానే ఆయన పోటీ చేయకపోతే.. ఎవరిని రంగంలోకి దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ బీజేపీలో చేరి, అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈసారి తనకు కరీంనగర్ లోకసభ నుంచి అవకాశం ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత పొల్సాని సుగుణాకర్రావు ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి విన్నవించారు. మొన్నటిదాకా సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ, పార్లమెంటు రెండు సీట్లకూ పోటీ చేస్తారన్న ప్రచారంతో వీరెవరూ ముందుకు వచ్చే సాహసం చేయలేదు. కానీ, తాజా ప్రచారంతో బీజేపీలోని ఆశావహులంతా ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. -
TS Election 2023: సొంత మేనల్లుడే ప్రత్యర్థిగా.. మారి..
మహబూబ్నగర్: సొంత మేనల్లుడే ప్రత్యర్థిగా మారి సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే స్థాయిలో వారి మధ్య రాజకీయ వైరం ఏర్పడింది. ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికపై హైకోర్టు తీర్పు సంచలనం రేపగా.. డీకే వర్సెస్ బండ్ల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్టాపిక్గా మారింది. మాజీ ఎమ్మెల్యే డీకే భరత్సింహారెడ్డికి సొంత అక్క కొడుకే బండ్ల కృష్ణమోహన్రెడ్డి. డీకే భరత్సింహారెడ్డి 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మేనల్లుడైన బండ్ల కృష్ణమోహన్రెడ్డిని చేరదీశారు. ఈ క్రమంలో ఆయన అటు రాజకీయంగా, ఇటుఅధికార వ్యవహారాల్లో అన్నీ తానై చక్రం తిప్పారు. ఒకానొక దశలో గద్వాలలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తు న్నాడనే గుసగుసలు సైతం విన్పించాయి. అయితే 1999లో గద్వాల పట్టణంలో కరాటే శ్రీను హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించగా.. రాజకీయ దుమారం చెలరేగింది. 1999లో శాసనసభ ఎన్నికల్లో గట్టు భీముడి చేతిలో డీకే భరత్సింహారెడ్డి భార్య డీకే అరుణ ఓటమిపాలు కాగా.. రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. తన ఓటమికి బండ్ల కృష్ణమోహన్రెడ్డే కారణమని భావించి.. డీకే కుటుంబం ఆయనను రాజకీయాల నుంచి దూరం పెట్టడంతో విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
TS Election 2023: 'పద్మా నా బిడ్డ' : సీఎం కేసీఆర్
మెదక్: అభివృద్ధిలో మెదక్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. పట్టణం చుట్టూ రింగ్రోడ్డు నిర్మిస్తాం.. రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా మారుస్తాం.. కౌడిపల్లి, రామాయంపేటలో డిగ్రీకళాశాలు ఏర్పాటు చేస్తాం.. టూరిజం అభివృద్ధికి రూ.100 కోట్లతో పాటు పలు వరాలు కురిపించారు సీఎం కేసీఆర్. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రగతి శంఖారావం సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ, ఎస్పీ, సమీకృత కలెక్టరేట్ భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మెదక్ పట్టణం చుట్టూ రింగ్రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను తీరుస్తామన్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తానని, కౌడిపల్లికి, రామాయంపేటకు డిగ్రీకళాశాలలను మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టు, మెదక్ ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, కొల్చారం మండల కేంద్రంలోని జైనమందిరం తదితర ప్రదేశాల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తునట్లు వెల్లడించారు. అలాగే మెదక్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున రూ.125 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ధరణిని తీసి వేద్దామంటున్నారు. మీరేమంటారని సీఎం ప్రశ్నించడంతో వద్దూ వద్దూ అంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పద్మా నా బిడ్డ.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నా కూతురులాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే విన్నవించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రగతిలో మెదక్ జిల్లాను మెరిపిస్తామన్నారు. మరి మీరు మాత్రం గతంలో కన్నా అధిక మెజార్టీతో పద్మాదేవేందర్రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. దీంతో సభ ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మారుమోగింది. -
TS Election 2023: '108' ఇది ఎమర్జెన్సీ నంబర్ కాదు!
కరీంనగర్: 108.. ఇది ఎమర్జెన్సీ అంబులెన్స్ నంబర్ కాదు.. అదేదో వ్రతం కోసం గుడి చుట్టూ చేసే ప్రదక్షిణలు కావు.. వచ్చే డిసెంబర్లో జరిగే ఎన్నికలకు కాస్త అటూ ఇటుగా ఉన్న రోజులు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుంటున్న అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు తమ కళ్ల ముందు మెదులుతున్న ఖర్చుల కొండను తలుచుకొని, బెంబేలెత్తుతున్నారు. అధికార బీఆర్ఎస్ ఎన్నికలకు సమరశంఖం పూరించడం, మరోవైపు మిగిలిన పార్టీల్లోనూ ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ ఎన్నికల్లో రానురాను ఖర్చులు పెరుగుతుండటం అభ్యర్థులను కలవరపెడుతోంది. నామినేషన్, ప్రచారం, పోలింగ్ ఇవన్నీ ఒక ఎత్తయితే, దానికి ముందే ఎన్నికల వాతావరణం రావడంతో ఇటు కేడర్ను, అటు ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు రూ.లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఓటర్లు మొదలుకొని కార్యకర్త, నాయకుల వరకు ఇప్పటికే మర్యాదలు మొదలయ్యాయి. వెళ్లాల్సిందే.. కట్నాలు చదివించాల్సిందే.. ప్రతీ నియోజకవర్గంలో అన్ని రకాల కులాలు, మతాల ఓటర్లు ఉంటారు. మహిళలు, వృద్ధులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, దివ్యాంగులు, వితంతువులు.. ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఆశావహులదే. ఇందుకు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు ఎవరూ అతీతులు కారు. దీంతో ఇకపై నియోజకవర్గంలో జరిగే ప్రతీ పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చావు, పుట్టుక, పుట్టిన రోజు, పెళ్లిరోజు, సారీ ఫంక్షన్, సంతాప సభ, సన్మానాలు, కులసంఘాల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు, ఉద్యోగ విరమణల నుంచి గృహ ప్రవేశాల వరకు ప్రతీ సందర్భానికి వెళ్లాల్సిందే.. కట్నకానుకలు చదివించాల్సిందే. డజన్కు పైగా పండుగలు ఈ నెల 25న వరలక్ష్మీ వ్రతం, 31న రాఖీ, సెప్టెంబర్ 6న కృష్ణాష్టమి, 18న వినాయక చవితి, 28న వినా యక నిమజ్జనం/మిలాద్–ఉన్–నబీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి, 23న సద్దుల బతుకమ్మ, 24న దసరా, నవంబర్ 13న దీపావళి, 14న బాలల దినోత్సవం, 27న కార్తీక పౌర్ణమి.. ఇలా ఎన్నికలు ముగిసేలోగా.. డజన్కు పైగా పండుగలను ప్రజలు గుర్తుంచుకునేలా జరిపే బాధ్యత లీడర్లదే. ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధం జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలనుకునేవా రు, ఈసారి కాకుంటే ఇంకెప్పటికీ కాలేమన్న ఆలోచనలో ఉన్నవారు ఈసారి సర్వశక్తులు ఒడ్డేందుకు ముందుకొస్తున్నారు. చివరికి పార్టీలో, నలుగురిలో తాము ధనవంతులమే అని చాటుకునేందుకు తమ ఆస్తులు అమ్మేందుకు, కుదవపెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ రోజుల్లో నాయకుడు బయటికి వ చ్చాడంటే.. కనీసం నాలుగైదు కార్లు తప్పనిసరి. వాటిలో పెట్రోలు కొట్టించాలి. ఒక్కో కారులో ఐదారుగురు అనుచరులు, కాన్వాయ్ రాగానే జిందాబాద్కొట్టేందుకు యువత, జెండాలతో తిరిగే కార్యకర్తలు, మంగళహారతులు ఇచ్చేందుకు మహిళలు ఉండాలి. ప్రతీ నాయకుడు కనీసం 100 మందికి ఈ మూడు నెలలపాటు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలు ఇవ్వాల్సిందే. వారి వాహనాల్లో పెట్రోలు కొట్టించడం, భోజనాలు, చేతి ఖర్చులు, రాత్రిపూట రాచమర్యాదలు సరేసరి. ఎంత లేదన్నా రూ.2, 3 కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ‘కోడ్’ కూశాక అసలు ఆట ఈ 108 రోజుల్లో కేడర్ను చూసుకునేందుకు రోజుకు రూ.లక్ష అయినా ఖర్చవుతుంది. ఇక దసరాకు కాస్త అటూఇటుగా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలున్నాయి. అధికార పార్టీకి అంతోఇంతో పార్టీ నుంచి, వివిధ వర్గాల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. కానీ, ప్రతిపక్షాలకు ఆ అవకాశాలు చాలా తక్కువ. పోస్టర్లు, ప్రచారం, సభలు, సమావేశాలు, యాడ్స్, ఫ్లెక్సీలు, ఇంటింటి ప్రచారాలు, పాదయాత్రలు అంటూ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆశావహుల జేబులకు చిల్లులు పడేది ఈ సమయంలోనే. అటు తర్వాత చేసే ఖర్చు లెక్కలను ఎన్నికల సంఘానికి చెప్పాల్సి ఉంటుంది. బయటకు కనబడకుండా ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు పరిమితికి మించి ఖర్చు చేయాలి. అదే సమయంలో పక్కనే ఉంటూ వైరిపక్షాలకు సాయపడే వెన్నుపోటుదారులను తలచుకొని, నేతలు గుబులు పడుతున్నారు. -
TS Election 2023: కాంగ్రెస్లోకి కీలక నేత ఎవరు..?
మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా రాజకీయాల్లో పరిస్థితులు మారుతున్నాయి. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఏ పార్టీలో ఉంటే మంచిదనే సమాలోచనలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే పార్టీ, ప్రాధాన్యత ఇచ్చే చోటు కోసం వెతుకుతున్నారు. బీఆర్ఎస్లో టికెట్ల కేటాయింపు పూర్తవడంతో మిగిలిన పార్టీ ల్లో అవకాశాల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఇక కింది స్థాయి నాయకులు సైతం ఎక్కడ తమకు అన్ని రకాల బాగుంటుందో బేరీజు వే సుకుని కండువాలు మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇచ్చి మూడు నెలల ముందుగానే ఎన్నికల కదనరంగంలోకి దూకింది. తర్జనభర్జనలో మాజీ ఎంపీ.. జిల్లా పరిధిలో ప్రాతినిధ్యం వహించిన ఓ మాజీ ఎంపీ పార్టీ మారేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పుడున్న పార్టీతో జిల్లాలో ఎదుగూ బొదుగు లేదని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు పార్టీ మారిన ఆయన మళ్లీ వేరే పార్టీలో చేరడంపై ప్రజలు, అటు అనుచరుల్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనే కోణంలో ఆలోచనలు చేస్తున్నారు. ఇక తనకు ఆ పార్టీలో ఎలాంటి హామీలు ఇస్తారనే దానిపైనా సంప్రదింపులు జరిపి ఓ కొలిక్కి వచ్చాక పార్టీ మార్పు జరగొచ్చని సమాచారం. ప్రాంతీయ పార్టీ తన రాజకీయ భవిష్యత్ను కష్టాల్లో నెట్టడంతో జాతీయ పార్టీలో చేరారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎస్సీ రిజర్వు స్థానాల్లో పోటీ చేస్తారని తన అనుచరులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ తన స్థానంపై స్పష్టత ఇవ్వకపోవడంతో కార్యకర్తలు, నాయకులు అయోమయంలో ఉన్నారు. ఈ క్రమంలో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇప్పటికీ స్పష్టం కావడం లేదు. దీంతో సదరు నాయకుడు మళ్లీ ఏ పార్టీలో చేరి, ఎక్కడి నుంచి పోటీ చేయాలనే కోణంలో సుదీర్ఘంగా ఆలోచించి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అధికార పార్టీ నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే సైతం పార్టీలో ఉండాలా వద్దా అనే ఆలోచనలో పడినట్లు సమాచారం. టికెట్ కోసం పోరాటం.. జిల్లాలో జనరల్ సీటుగా ఉన్న మంచిర్యాలపై అనేకమంది ఆశలు పెట్టుకున్నారు. ఓసీ, బీసీ నేతలు టికెట్ ఇచ్చే పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని పట్టుదలతో ఉన్న నాయకులు టికెట్ దక్కించుకునేందుకు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో వేచి చూస్తున్నారు. కొందరు బీజేపీ, తర్వాత బీఎస్పీ వంటి పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నా యి. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ‘ముందుగా చేరండి’ అని స్వాగతం పలుకుతున్నప్పటికీ టికెట్ ఇస్తామనే నమ్మకం ఇవ్వకపోతున్నాయి. సీటు రాకపోయినా.. వచ్చే ఎన్నికల్లో తాము కచ్చితంగా పోటీ చేస్తామని ప్రజల్లో తిరుగుతున్న నేతలు సీటు రాకపోతే ఇప్పుడున్న పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయా పార్టీలో ఇద్దరు, ముగ్గురు నాయకులు సీటు కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకరికి మాత్రమే సీటు దక్కే అవకా శం ఉంది. మిగతా వారంతా వెనక్కి తగ్గి పని చేసే తీరు కనిపించడం లేదు. కొందరు రెబెల్గానైనా పోటీ చేస్తామని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల సమయం వరకు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తేలనుంది. -
TS Election 2023: మూడు పార్టీలు కుట్ర పన్నుతున్నాయి.. : పుట్ట మధు
పెద్దపల్లి: పేద కుటుంబం నుంచి వచ్చిన తాను పేదల కష్టాలు తీర్చుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి తనపై కుట్ర చేస్తోందని, అయినా ప్రజల్లో తనపై విశ్వాసం ఉందని మంథని బీఆర్ఎస్ అభ్యర్థి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. ఆయన బుధవారం మంథనికి రాగా.. కమాన్పూర్ మండలం గొల్లపల్లి నుంచి మంథని వరకు మంగళహారతులు, బైక్ర్యాలీతో స్వాగతం పలికారు. మంథని వద్ద భారీ గజమాలతో సన్మానించారు. అంబేద్కర్ కూడలిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీలోని కొందరు అసమ్మతివాదులతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు కసాయి కాంగ్రెస్ను నమ్మితే మోసపోతారని తెలిపారు. ఆత్మగౌరవం, పేదల ఆకలితీర్చేందుకు అనేకమంది అడవిబాట పడితే ఈ ప్రాంత నాయకత్వం కారణంగా వందలాది మంది నేలకొరిగారని గుర్తు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానని, 2014 కంటే రెట్టింపు ఉత్సాహం కార్యకర్తలో కనిపిస్తోందని, వంద రోజులు తన కోసం కష్టపడితే ఐదేళ్లు కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మధు తెలిపారు. జయశశంకర్భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ జక్కుశ్రీహర్షిణి, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
TS Election 2023: కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం: అభిలాష్రావు
మహబూబ్నగర్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్రావు కాంగ్రెస్ను వీడి గులాబీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలతో చర్చలు జరిగినట్టు ప్రచారం సాగుతోంది. మంగళవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ‘ఆత్మీయ సమావేశం’ నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం అభిలాష్రావు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అభిలాష్రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తిలో బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న మంత్రి నిరంజన్రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గ టికెట్ ఆశిస్తూ రెండేళ్ల కిందటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్లోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరడం, వారి వర్గానికే ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అభిలాష్రావు తిరిగి గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ కోసం బీఆర్ఎస్లో చేరితే ఏదైనా కీలకమైన పదవి దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యే హర్షవర్దన్రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలతో అభిలాష్రావు కలసి చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు అభిలాష్రావు అండగా నిలుస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ వీడుతున్నట్టుగా ప్రచారం సాగుతుండటం ఆసక్తికరంగా మారింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: మహిళలు 10 శాతమైనా లేరు!
- Lok Sabha Election 2024: ఇద్దరికీ కీలకమే
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement