bus services
-
సమ్మర్ ఎఫెక్ట్: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: సిటీలో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్ పడింది. ఎండల తీవ్రతతో హైదరాబాద్ నగర పరిధిలో బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ తగ్గించనుంది. మధ్యాహ్నం 12 గంటల 4 గంటల వరకు గతం కంటే తక్కువ బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు వెల్లడించారు. అయితే సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సిటీలో బస్సులను యధావిధిగా నడపనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి సిటీలో మధ్యాహ్నం వేళల్లో బస్సులు తగ్గనున్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ఇదీ చదవండి.. తెలంగాణకు వర్ష సూచన.. 10 రోజుల పాటు -
Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు!
ఢిల్లీ: అయోధ్య బాలక్ రామ్ మందిర్కు ఎగబడుతున్న భక్తులకు, సందర్శకులకు పెద్ద షాకే తగిలింది. అయోధ్య వైపు వెళ్లే బస్సులను రద్దు చేస్తున్నట్లు బుధవారం అక్కడి రవాణా శాఖ ప్రకటించింది. తిరిగి బస్సులు ఎప్పుడు నడుస్తాయనేది ఇప్పట్లో చెప్పలేమని స్పష్టం చేసింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత ‘బాలక్ రామ్’ దర్శనం కోసం భక్తులు ఎగబడి పోతున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య వైపు అడుగులేస్తున్నారు. తొలిరోజే ఏకంగా ఐదు లక్షల మంది దర్శించుకునేందుకు వచ్చినట్లు ఓ అంచనా. అందులో 3 లక్షల మందిదాకా దర్శించుకోగా.. మరో రెండు లక్షల మంది బయట ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో నిన్న అధికారులకు భక్తుల నియంత్రణ కష్టతరంగా మారింది. ఇదీ చదవండి: బాలక్ రామ్ కోసం.. ఈ నిరీక్షణ చూశారా? దీంతో ఇవాళ కేంద్ర బలగాలను సైతం మోహరించారు. మొత్తం అయోధ్యలో 8 వేలమంది సిబ్బందిని భద్రత కోసమే మోహరించారు. అదే సమయంలో లక్నో, ఇతర ప్రాంతాల నుంచి అయోధ్యకు బస్సుల్లో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో రద్దీని నిలువరించేందుకు బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే తిరిగి సర్వీసులు నడుపుతామని ఓ అధికారి మీడియాకు వివరించారు. ఇక.. దైవదర్శనం కోసం తొందరపడొద్దని.. రెండు వారాల తర్వాత రద్దీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని భక్తులకు, సందర్శకులకు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు నిదానంగా రావాలని కోరుతున్నారాయన. -
ఏపీ, కర్ణాటక మధ్య మరిన్ని బస్ సర్వీసులు
సాక్షి, అమరావతి: కర్ణాటకకు మరిన్ని బస్ సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్ సర్వీసుల నిర్వహణ అంశంపై కర్ణాటక ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ గురువారం ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, కేఎస్ ఆర్టీసీ ఎండీ వి అంబుకుమార్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కేఎస్ ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ తొలిసారిగా గురువారం ఈ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఏపీఎస్ ఆర్టీసీ కర్ణాటకలో అదనంగా రోజూ 327 బస్ సర్వీసులను 69,284 కి.మీ. మేర నడుపుతుంది. దీంతో మొత్తమ్మీద ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 1,322 బస్సులు కర్ణాటకలో రోజూ 2,34,762 కి.మీ. మేర నడుస్తాయి. ఇక కేఎస్ ఆర్టీసీ ఏపీలో అదనంగా రోజూ 496 బస్ సర్వీసులను 69,372 కి.మీ. మేర నడపాలని నిర్ణయించారు. దీంతో మొత్తమ్మీద కేఎస్ ఆర్టీసీకి చెందిన 1,489 బస్సులు ఏపీలో రోజూ 2,26,044 కి.మీ. నడుస్తాయి. ఆర్టీసీ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, పి.కృష్ణమోహన్, కేఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రశాంత్కుమార్ మిశ్రా, ఆంథోని జార్జ్, ఎస్.రాజేశ్ పాల్గొన్నారు. -
Hyderabad: సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం..
భీమవరం (ప్రకాశంచౌక్): సంక్రాంతికి నగరం మొత్తం పల్లెబాట పట్టింది. దీంతో హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే జనాల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన పండగ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి జిల్లాల్లోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం డిపోలకు నడుస్తాయి. ఈ నెల 10 నుంచి హైదరాబాద్ నుంచి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. హైదారాబాద్ నుంచి జిల్లాకు ఏర్పాటు చేసిన ఆర్టీసి బస్సులు దాదాపు కిక్కిరిసి ఉంటున్నాయి. 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు హైదారాబాద్ నుంచి జిల్లాలో పలు ప్రాంతాలకు పండుగకు వచ్చే ప్రయాణికులను తీసుకురావడానికి ఆర్టీసీ 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు నడుపుతోంది. గతేడాది మాదిరిగానే సాధారణ ధరలకే ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సూపర్ లగ్జరీ టిక్కెట్ రూ.750, ఇంద్ర రూ.950, అల్ట్రా రూ.710 చొప్పున వసూలు చేస్తున్నారు. రిజర్వేషన్ కూడా 90 శాతం మేర పూర్తయ్యింది. బస్సుల సంఖ్య పెంచుతాం సంక్రాంతి పండుగకు ముందు, తర్వాత కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నాం. పండగకు ముందు 105, పండగ తర్వాత తిరుగు ప్రయాణానికి 84 ప్రత్యేక బస్సులు తిప్పుతాం. ప్రయాణికుల రద్దీ మేరకు బస్సుల సంఖ్య పెంచుతాం. «టిక్కెట్ చార్జీ పెంచకుండా సాధారణ చార్జీలకే సర్వీసులు నడుపుతున్నాం. ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. పండగకు ప్రజలు ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. – ఏ.వీరయ్య చౌదరి, ప్రజా రవాణా అధికారి, భీమవరం -
ఫేస్బుక్లో అభ్యర్థన.. ఆర్టీసీ బస్సు ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఫేస్బుక్లో పోస్టు ద్వారా అభ్యర్థించిన వెంటనే ప్రయాణికులకు ఓ బస్సు సర్వీసును ఏర్పాటు చేసి ప్రజా సేవే తమ లక్ష్యమని ఆర్టీసీ నిరూపించిన ఆసక్తికరమైన ఘటన కృష్ణాజిల్లాలోని పామర్రులో జరిగింది. 40 మంది ప్రయాణికులు మంగళవారం రాత్రి పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్ల వెళ్లాల్సి ఉంది. వీరిలో ఒకరు తమకు బస్సు ఏర్పాటు చేయగలరా అని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డిని ఫేస్బుక్ పోస్టు ద్వారా అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన బ్రహ్మానందరెడ్డి గుడివాడ బస్ డిపో మేనేజర్తో మాట్లాడి ఆ ప్రయాణికులకు పామర్రు నుంచి నెల్లిమర్లకు ప్రత్యేకంగా బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. ఆ 40 మంది ప్రయాణికులు ఆ బస్సులో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానమైన నెల్లిమర్లకు బుధవారం ఉదయం చేరుకున్నారు. అడగంగానే సాయం చేసిన ఆర్టీసీ సేవలను అభినందించారు. -
టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి
సాక్షి, అమరావతి: తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచడం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి అనుకూలంగా మారుతోంది. మన రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ రాబడి గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ ఆర్టీసీ.. డీజిల్ సెస్ పేరుతో జూన్ 9న రెండోసారి చార్జీలు పెంచింది. దీంతో కనీసం రూ.5 నుంచి గరిష్టంగా రూ.170 వరకు ఆ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెరిగాయి. ప్రధానంగా 100 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణంపై చార్జీల పెంపు భారం అధికంగా ఉంది. ఈ పరిణామం ఏపీఎస్ఆర్టీసీకి కలసివస్తోంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉండే హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పెరుగుతోంది. విజయవాడ–హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ మరింతగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ముందస్తు రిజర్వేషన్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ రాబడి కూడా గణనీయంగా వృద్ధి చెందుతోంది. చదవండి: (AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి) బస్ సర్వీసులు పెంచడంపై దృష్టి జూన్ 9 కంటే ముందు విజయవాడ –హైదరాబాద్ రూట్లో ఆర్టీసీకి రోజుకు గరిష్టంగా రూ.కోటి రాబడి వచ్చేది. కానీ తెలంగాణ ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచాక ఏపీఎస్ఆర్టీసీ రాబడి పెరుగుతోంది. జూన్ 9న రూ.1.19 కోట్ల రాబడి రాగా.. జూన్ 10న రూ.1.21 కోట్లు వచ్చింది. జూన్ 11న రూ.1.26 కోట్లు, జూన్ 12న రూ.1.24 కోట్లు రాబడి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న రోజుల్లో విజయవాడ –హైదరాబాద్ రూట్తోపాటు తిరుపతి– హైదరాబాద్ రూట్,రాష్ట్రంలోని తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ రాబడి మరింతగా పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా బస్ సర్వీసులు పెంచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనపై దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ చార్జీలు ఇలా.. ►ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్కు సూపర్ లగ్జరీ చార్జీ తెలంగాణ ఆర్టీసీలో రూ.505. కానీ ఏపీఎస్ఆర్టీసీలో రూ.470 మాత్రమే. ►ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర బస్లో హైదరాబాద్ (కేపీహెచ్బీ)కి చార్జీ రూ.610 ఉండగా.. అదే రీతిలో ఉండే తెలంగాణ ఆర్టీసీ రాజధాని ఎక్స్ప్రెస్లో చార్జీ రూ.642. ►ఏపీఎస్ఆర్టీసీ గరుడ సర్వీసులో హైదరాబాద్ (కేపీహెచ్బీ)కి చార్జీ రూ.690 ఉండగా.. తెలంగాణ ఆర్టీసీలో చార్జీ రూ.783గా ఉంది. -
అదనపు ఛార్జీలు లేకుండా బస్సు సర్వీసులు: సజ్జనార్
-
Sankranthi: రైళ్లు, బస్సులు ఫుల్..
సాక్షి, అమరావతి బ్యూరో: సంక్రాంతికి ఇంటికెళదామనుకునే వారికి కష్టాలు తప్పని పరిస్థితి తలెత్తింది. జనవరి 7 నుంచి 14 వరకు రైళ్లు, బస్సుల్లో బెర్తులు, సీట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఈ రూట్లో జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు రైళ్లలో బెర్తులు దొరకని పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ చేయించుకుందామంటే చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటోంది. కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలో ఇప్పటికే ‘రిగ్రెట్’ అని వస్తోంది. విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా నిత్యం 85 రైళ్లకు పైగా వెళ్తుంటాయి. వీటిలో రోజూ నడిచే రెగ్యులర్ రైళ్లు 27 కాగా, వీక్లీ, బై వీక్లీ రైళ్లు 58 వరకు ఉన్నాయి. సెకండ్ సిట్టింగ్తో నడిచే విజయవాడ–విశాఖ (రత్నాచల్), గుంటూరు–విశాఖ (సింహాద్రి), లింగంపల్లి–విశాఖ(జన్మభూమి) రైళ్లలో మాత్రమే ప్రస్తుతానికి కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన అన్ని రైళ్లలో.. అన్ని క్లాసులూ వెయిటింగ్ లిస్టులతోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీరంతా సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లడానికి ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకోవడంతో రైళ్లలో సీట్లు, బెర్తులు లభ్యం కావడం లేదు. బస్సులదీ అదే దారి మరోవైపు బస్సుల్లోనూ విజయవాడ–విశాఖపట్నం రూటుకే అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది. విశాఖపట్నం మీదుగా విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల వైపు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో నూరు శాతం రిజర్వేషన్లు అయిపోయాయి. ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ దూరప్రాంతాలకు రోజూ 463 రెగ్యులర్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఇప్పటివరకు సంక్రాంతి సమయంలో (జనవరి 8–14 మధ్య) అధిక శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెగ్యులర్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయ్యాక స్పెషల్ సర్వీసులకు రిజర్వేషన్లు తెరుస్తారు. హైదరాబాద్ వైపు రైళ్లలో ఖాళీలు కాగా, సంక్రాంతి సీజన్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లలో సీట్లు, బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ రూట్లో 36 ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తుండగా రోజువారీ 19, వీక్లీ/బైవీక్లీ ట్రైన్లు 17 వరకు నడుస్తున్నాయి. వీటిలో శాతవాహన, గోల్కొండ, జన్మభూమి, ఇంటర్సిటీ రైళ్లు సెకండ్ సీటింగ్వి కాగా.. మిగిలినవి స్లీపర్ క్లాసులున్న ఎక్స్ప్రెస్ రైళ్లే. ప్రస్తుతం ఈ రైళ్లలో దాదాపు అన్ని క్లాసుల బెర్తులు, సీట్లు పదులు, వందల సంఖ్యలో ఖాళీలున్నాయి. సంక్రాంతికి 1,266 స్పెషల్ బస్సులు ఈ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి 1,266 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. వీటిలో విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, హైదరాబాద్కు 362, చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 120 బస్సులను నడపాలని నిర్ణయించినట్టు రీజనల్ మేనేజర్ ఎంవై దానం ‘సాక్షి’కి చెప్పారు. ప్రయాణికుల డిమాండ్ను బట్టి మరిన్ని స్పెషల్ సర్వీసులను నడపనున్నట్టు తెలిపారు. కాగా కోవిడ్ ప్రభావం వల్ల గత సంక్రాంతికి ఈ రీజియన్ నుంచి 1,093 స్పెషల్ బస్సులు నడిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 173 సర్వీసులు ఎక్కువ. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ సంక్రాంతికి స్పెషల్ సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. -
పరుగందుకుంటున్న ప్రగతి రథ చక్రాలు
రాష్ట్రంలో ప్రగతి రథ చక్రం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనా రక్కసిని దాటుకొని జనజీవనాన్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు పదపదమని ప్రయాణిస్తోంది. సగానికిపైగా సర్వీసులు నిలిచిపోయిన పరిస్థితి నుంచి ముప్పావు శాతం బస్సులు కదిలాయి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మరింత చేరువవుతోంది. – సాక్షి, అమరావతి రోజుకు 7,800 సర్వీసులు.. రోజుకు 10,600 షెడ్యూల్ బస్ సర్వీసులు నిర్వహించే సామర్థ్యం ఆర్టీసీకి ఉంది. వాటిలో 8,200 ఆర్టీసీ సొంత బస్సులు కాగా 2,400 అద్దె బస్సులు. ప్రస్తుతం ఆర్టీసీ సొంత బస్సుల్లో రోజుకు 7,800 సర్వీసులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పల్లె వెలుగు, డీలక్స్, సూపర్ డీలక్స్ సర్వీసులతోపాటు అంతర్రాష్ట్ర సర్వీసులను నిర్వహిస్తోంది. తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులోనూ, దూరప్రాంత, అంతర్రాష్ట్ర ఏసీ సర్వీసుల్లోనే దాదాపు 1,600 బస్సులు మినహా మిగిలిన అన్ని బస్సులు యథాతథంగా నిర్వహిస్తోంది. ఈ నెలాఖరుకు ఆ 1,600 బస్ సర్వీసులనూ క్రమంగా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తోంది. అద్దె బస్సులను బుధవారం నుంచి క్రమంగా ప్రవేశపెడుతోంది. అద్దె బస్సుల యజమానులు తమ వాహనాల బీమా సర్టిఫికెట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది. పత్రాలను పరిశీలించి ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు అద్దె బస్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇస్తారు. పది రోజుల్లో మొత్తం 2,400 అద్దె బస్సుల సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. పుంజుకున్న ఆక్యుపెన్సీ జనజీవనం క్రమంగా గాడిలో పడుతుండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పుంజుకుంది. ప్రస్తుతం సగటున దాదాపు 70 శాతానికి చేరడం విశేషం. ఆక్యుపెన్సీ రేటులో అనంతపురం జిల్లా (76 శాతం) మొదటి స్థానం, కర్నూలు జిల్లా (74 శాతం) రెండోస్థానంలో ఉండగా.. కృష్ణా జిల్లా (60 శాతం) చివరి స్థానంలో ఉంది. సంస్థకు రాబడి కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు సగటున రూ.10 కోట్ల వరకు రాబడి వస్తోంది. ఈ నెల రెండోవారం ముగిసేసరికి సాధారణ లక్ష్యం రోజుకు రూ.15 కోట్ల రాబడి వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో ఆర్టీసీకి దాదాపు రూ.2,300 కోట్లు, ఈ ఏడాది రెండో వేవ్ తీవ్రంగా ఉన్న ఏప్రిల్–జూలైలలో రూ.1,200 కోట్ల వరకు ఆర్టీసీ రాబడికి గండిపడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గి ఆర్టీసీ పూర్తిస్థాయి సర్వీసులను ప్రవేశపెడుతుండటంతో పూర్వవైభవం సాధించవచ్చని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా పూర్తిస్థాయి సేవలు ఆర్టీసీ బస్సు సర్వీసులను క్రమంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూనే ప్రజలకు విస్తృత స్థాయిలో ఆర్టీసీ సేవలు అందిస్తాం. సంస్థను మళ్లీ పుంజుకొనేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ -
నేటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించనుండగా, మంగళవారం నుంచి మహారాష్ట్రలోని ప్రాంతాలకు మొదలుకానున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్డౌన్ సడలింపు అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల తర్వాత ఏపీ సరిహద్దు దాటి, సాయంత్రం 6 లోపు తిరిగి తెలంగాణ సరిహద్దులోకి బస్సులు రాకపోకలు సాగించేలా ప్రణాళిక రూపొందించారు. ఇక కర్ణాటకకూ సోమవారం నుంచే బస్సులు ప్రారంభం అవుతున్నా.. పరిమితంగానే తిరగనున్నాయి. ఎన్ఈకేఆర్టీసీ (కర్ణాటకలోని ఈశాన్య ఆర్టీసీ) మాత్రమే పచ్చజెండా ఊపింది. దాని పరిధిలోని యాద్గిర్, రాయచూర్, బీదర్, గుల్బర్గాలకు సోమవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకు ఆ ప్రాంతంలో లాక్డౌన్ మినహాయింపు ఉండటంతో ఆ సమయాల్లో బస్సులు వెళ్లి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక కర్ణాటక ఆర్టీసీ పరిధిలోని బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలకు ఇంకా అనుమతి రాలేదు. మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రాపూర్, నాందేడ్ తదితర ప్రాంతాలకు మంగళవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ముంబై, పుణే లాంటి దూరప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు తిప్పే అవకాశం లేదు. -
TSRTC: ఆర్టీసీ.. చతికిల!
మిర్యాలగూడ టౌన్: కార్మికుల సమ్మె, మొదటి విడత కరోనా లాక్డౌన్.. సెకండ్ వేవ్ లాక్డౌన్తో నల్లగొండ జిల్లా ఆర్టీసీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆదాయం లేక కోలుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆ.. నాలుగు గంటల మినహాయింపు సమయంలో అరకొర బస్సులు నడుపుతున్నా ప్రయాణికులనుంచి పెద్దగా స్పందన ఉండడం లేదు. దీంతో ఆదాయం అంతంతే సమకూరుతోంది. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2019 అక్టోబర్లో సమ్మెలోకి దిగిన విషయం తెలిసిందే. మొత్తం 55 రోజులపాటు సమ్మె చేశారు. దీంతో కొంతవరకు ఆర్టీసీ సంస్థ నష్టాల్లోకి వెళ్లింది. ఆ సమ్మెనుంచి తేరుకోకముందే కరోనా వైరస్ విజృంభించడంతో కేంద్రం జనత కర్ఫ్యూ విధించడంతో ఆర్టీసీ బస్సులు 59రోజులపాటు డిపోకే పరి మితమయ్యాయి. సంస్థకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. కార్గో సర్వీసులను ప్రారంభించి మెయింటనెన్స్ వరకు ఖర్చులు వచ్చాయి. ప్రధాన రూట్లలో సర్వీసులు రెండో దశ విజృంభణలో భాగంగా లాక్డౌన్ మినహాయించిన ఆ నాలుగు గంటలు ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ పూర్తిగా కరువైంది. లాక్డౌన్ వి«ధించడంతో సర్వీసులన్నీ తగ్గించారు. కొన్ని బస్సులు మాత్రమే ప్రధాన రూట్లల్లో నడిపిస్తున్నారు. కరోనా ఉధృతికి పలు డిపోలలో బస్సులకు శానిటైజేషన్ చేయించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ప్రతి డిపోలలో ఉద్యోగులకు ఉదయాన్నే టెంపరేచర్ చెక్ చేసి విధులకు పంపిస్తున్నారు. ప్రతి ఉద్యోగి మాస్క్లను ధరిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజర్ను వాడుతున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రయాణీకుల సౌకర్యార్ధం బస్సులను నడిపిస్తున్నప్పటికి ఎవరు కూడా బస్సులను ఎక్కకపోవడంతో బస్టాండ్లన్నీ వెలవెలబోతున్నాయి. నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఏడు డిపోలు యాదగిరిగుట్ట, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో సాధారణ సమయంలో పెద్ద సంఖ్యల్లో ప్రయాణికులు ఉంటారు. లాక్డౌన్ సమయంలో కనీసం 10 మంది కూడా బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా ప్రయాణికులు సొంత వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరికొందరు ప్రయాణాలను మానుకొని ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో జిల్లా ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయి సంస్థ నష్టాల్లోకి వెళ్తోంది. రీజియన్ పరిధిలో 57శాతం ఓఆర్ నల్లగొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల పరిధిలో మొత్తం 735 బస్సులున్నాయి. ఆర్టీసీ బస్సులు 448 ఉండగా, అద్దె బస్సులు 286 ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా అద్దె బస్సులన్నీ బస్టాండ్లకే పరిమితం అయ్యాయి. 448 ఆర్టీసీ బస్సులకు రోజు 130 నుంచి 153 బస్సుల వరకు ప్రయాణికుల రద్దీని నడిపిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏడు డిపోలలో రూ.57,30,309 ఆదాయం సమకూరింది. 57 ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థ్యం సర్వీసులు ప్రయాణికుల సౌకర్యార్థ్యం కోసం లాక్డౌన్ మినహాయింపు సమయమైన ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే బస్సులను నడిపిస్తున్నాం. ప్రధాన రూట్లలో సర్వీసులు నడుస్తున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ బస్సులను శానిటైజేషన్ చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగుకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆదరించి అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరుకుంటున్నాం. - రాజేంద్రప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం, నల్లగొండ చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు -
ఏపీకి వెళ్లే బస్సులు నిలిపేసిన టీఎస్ ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను టీఎస్ ఆర్టీసీ నిలిపివేసింది. ఏపీలో కర్ఫ్యూ దృష్ట్యా తాత్కాలికంగా తెలంగాణ బస్సులను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, తెలంగాణ, ఏపీ మధ్య మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాహనాలకు అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిబంధనలు వర్తించనున్నాయని తెలిపింది. నిన్న హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్లను కూడా అధికారులు రద్దు చేశారు. చదవండి : TSRTC: ఏపీకి వచ్చే బస్సులు రద్దు -
50% ప్రయాణికులతోనే ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను ఆర్టీసీ అమల్లోకి తీసుకువచ్చింది. బస్సుల్లో గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే మంగళవారం నుంచి అనుమతిస్తోంది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఈ నెలలో రోజుకు సగటున 57 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. సోమవారం ఆక్యుపెన్సీ రేటు 50 శాతానికే పరిమితమైంది. దాంతో ఆర్టీసీ ఆదాయంపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. సగటున రోజుకు రూ.14 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.7 కోట్లే వస్తోంది. దాంతో ఆర్టీసీ తమ బస్సు సర్వీసులను తగ్గించింది. డిమాండ్ అంతగాలేని రూట్లలో సర్వీసుల్లో కోత విధించింది. ఆర్టీసీ రోజూ 10,553 షెడ్యూళ్లలో బస్సు సర్వీసులు నిర్వహించాలి. కానీ వాటిలో 25 శాతం సర్వీసులను తగ్గించింది. ఆర్టీసీ బస్ స్టేషన్లు, కార్యాలయాల్లో కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు. -
ఆర్టీసీ వింత నిర్ణయం.. ‘కరోనా’ముప్పున్నా రాకపోకలు షురు..
సాక్షి, బోధన్: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోన్న తరుణంలో.. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. పొరుగు రాష్ట్రంలో నిత్యంవేలాది కేసులు నమోదవుతుండగా, ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. సోమవారంనుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు బస్సులునడుపుతోంది. అయితే, వైరస్ వ్యాప్తి ఎక్కువగాఉన్న ఆయా ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది. ‘మహా’ ప్రభావంకారణంగా ఇప్పటికే సరిహద్దుల్లోని మన పల్లెల్లోపాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ రాష్ట్రానికి సర్వీసులను పునరుద్ధరించడం విమర్శలకు తావిస్తోంది. ఏడాదికి పైగా నిలిపివేత.. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 24 నుంచి ఆర్టీసీ పొరుగు రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపి వేసింది. మహారాష్ట్రలో మొదటి నుంచి వైరస్ ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. ఇటీవల అది మరింత ఎక్కువైంది. నిత్యం వేల సంఖ్యలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రంలో కర్ఫ్యూతో పాటు కొన్ని నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరింత అప్రమత్తంగా మన ఆర్టీసీ అధికారులు వింతనిర్ణయం తీసుకున్నారు. కాగా,గత సోమవారం నుంచి బస్సుసర్వీసులను పునరుద్ధరించారు. పొంచి ఉన్న ‘మహా’ ముప్పు.. తెలంగాణ–మహారాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది.జిల్లాలోని బోధన్ రెవెన్యూ డివిజన్ మండలం పరిధిలోని కోటగిరి, బోధన్ రెవెన్యూ, రెంజెల్ మండలంలోని అనేక గ్రామాలు మహారాష్ట్ర ప్రాంత సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. బోధన్ మండలంలోని సాలూర గ్రామం నుంచి 80 కిలో మీటర్ల దూరంలోగల మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా కేంద్రం ఉండగా, ఇదే జిల్లా పరిధిలోని బిలోలి,దెగ్లూర్, కొండల్వాడీ, ధర్మాబాద్ పట్టణ కేంద్రాలు,అనేక పల్లెలు తెలంగాణ ప్రాంత సరిహద్దు పల్లెలకు ఆనుకుని ఉన్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుపట్టణ కేంద్రాలు, పల్లెల నుంచి రాకపోకాలు సాగుతున్నాయి. గతంలో నిత్యం 10–12 బస్సు సర్వీసులలు నడిపే వారు. కరోనా కారణంగా వాటిని నిలిపి వేయగా, తాజాగా సోమవారం నుంచి ఐదు సర్వీసులను నడుపుతున్నారు. ప్రస్తుతానికి నాందెడ్, దెగ్లూర్ పట్టణాలకు బస్సులు నడుస్తున్నాయి.కార్లు, ప్యాసింజర్ ఆటోలు ఎప్పడి నుంచో తిరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో కేసులు.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర వద్ద చెక్పాయింట్ను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రం నుంచివస్తున్న ప్రయాణికులకు టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనాకేసులు సరిహద్దు ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రాంతానికి సరిహద్దులోగల సాలూర క్యాంప్ గ్రామంలోపాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు. ఐదు సర్వీసుల పునరుద్ధరణ.. కరోనా నేపథ్యంలో మార్చి 24 నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి బస్సు సర్వీసులను నిలిపివేశాం. అయితే, సోమవారం నుంచి నాందేడ్, దెగ్లూర్లకు ఐదుబస్సు సర్వీసులు పునరుద్ధరించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులునడుపుతున్నాం. సిట్టింగ్సీట్ల మేరకే ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నాం. రమణ, బోధన్ డిపో మేనేజర్ -
గాడిన పడుతున్న ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా గత ఏడాది భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఏడాది ఆరంభం నుంచి రాబడి క్రమంగా పెరుగుతుండటంతో గాడిన పడుతోంది. గతేడాది మార్చి 22 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రూ.2,603 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి పుంజుకోవడంతో రోజువారీ సగటు ఆదాయం రూ.12 కోట్లకు చేరింది. గత ఏడాది జనవరిలో 69 శాతం ఆక్యుపెన్సీతో రూ.420 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఏడాది జనవరిలో 64 శాతం ఆక్యుపెన్సీతో రూ.360 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ నెలలో 12వ తేదీ వరకు లభించిన ఆదాయం రూ.145 కోట్లకు చేరింది. మార్చి నాటికి టికెట్ రెవెన్యూ రూ.400 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దూరప్రాంత సర్వీసులపై ప్రత్యేక దృష్టి దూర ప్రాంత సర్వీసులను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణతో అంతర్ రాష్ట్ర సర్వీసుల ఒప్పంద సమయంలో.. కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే తెలంగాణకు నడిపే 1,60,999 కిలోమీటర్ల మేర సర్వీసులను 2,08,856 కిలోమీటర్లకు పెంచుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ దిశగా దృష్టి సారించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి వచ్చే సర్వీసులకు డిమాండ్ పెరిగింది. ఎక్కువమంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తుండటంతో స్పెషల్ సర్వీసులను నడుపుతున్నారు. శుక్రవారం ఏపీలోని అన్ని ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి 81 స్పెషల్ సర్వీసులు తిప్పారు. మరోవైపు తిరుపతికి కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ ప్రవేశపెట్టిన తిరుమల శీఘ్రదర్శనం టికెట్ ఆఫర్కు మంచి స్పందన వస్తోంది. రోజుకు సగటున 20 వేల మంది తిరుపతి వెళ్లేందుకు ఆర్టీసీ టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. దూరప్రాంత సర్వీసుల్లో 10 శాతం రాయితీ విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకు వెళ్లే డాల్ఫిన్, అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ సర్వీసులలో ప్రయాణించే వారు 48 గంటల ముందే టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటే టికెట్ ధరలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. అయితే బస్సులో నాలుగైదు సీట్లకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుంది. డాల్ఫిన్ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి.. అమరావతి బస్సులోలో 49 సీట్ల కెపాసిటీకి గాను ఐదుగురికి, ఇంద్రలో 40 సీట్లుంటే నలుగురికి, సూపర్ లగ్జరీలో 35 సీట్లకు గాను నలుగురికి, అల్ట్రా డీలక్స్లో 39 సీట్లకు గాను నలుగురు, ఎక్స్ప్రెస్ బస్సులో 49 సీట్లకు ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మార్చి నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ ఐటీ అధికారులు సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. -
ఆర్టీసీలో మెరుగైన స్క్రాపేజీ పాలసీ!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో 15 ఏళ్లు పైబడిన బస్సులు కేవలం 19 మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా అర్బన్ ప్రాంతాల్లో 12, గ్రామీణ ప్రాంతాల్లో 9 మాత్రమే తిరుగుతున్నాయి. ఆర్టీసీలో కాల వ్యవధితో సంబంధం లేకుండా కి.మీ. ప్రాతిపదికగా బస్సుల్ని మార్చేస్తున్నారు. వీటి స్థానంలో ఏటా వెయ్యి కొత్త బస్సుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన ఏపీఎస్ ఆర్టీసీలో మెరుగైన స్క్రాపేజీ పాలసీని అమలు చేస్తున్నారు. ఇటీవలే కేంద్రం బడ్జెట్లో.. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కచ్చితంగా తుక్కుగా మార్చేయాలని కేంద్రం పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ గత రెండు రోజుల కిందట సంస్థలో బస్సుల పరిస్థితిపై సమీక్షించింది. కేంద్రం ప్రకటించిన స్క్రాపేజీ పాలసీతో ఏపీఎస్ ఆర్టీసీపై ప్రభావం ఉండదని సంస్థ అధికారులు నిర్ణయానికొచ్చారు. ఆర్టీసీలో కేవలం 19 బస్సులే 15 ఏళ్లు పైబడి ఉన్నట్టు గుర్తించారు. ఆర్టీసీ గతం నుంచి స్క్రాపేజీకి సంబంధించి విధాన పరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. ఆర్టీసీ అధికారులు డిపోల్లో వినియోగించే వ్యక్తిగత, ఇతర వాహనాల విషయంలోనూ కాల వ్యవధితో సంబంధం లేకుండా కి.మీ. పూర్తయితే వాటిని స్క్రాప్ కింద తీసేసి అద్దెకు వాహనాలు తీసుకుని నడుపుతున్నారు. ఆ బస్సులు ఇతర అవసరాలకు.. ఆర్టీసీలో ఓ బస్సు 12 లక్షల కి.మీ. తిరిగితే ఆ బస్సును ప్రజా రవాణాకు అసలు వినియోగించడం లేదు. గూడ్స్ వాహనంగానో, లేకుంటే ఆ బస్సును టాయిలెట్గా మార్చి వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీలో బస్సులు నిత్యం 41.73 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి. ఆర్టీసీలో అధిక శాతం బస్సులు పది నుంచి పన్నెండేళ్ల కాల వ్యవధిలోనే 12 లక్షల కి.మీ. పూర్తి చేసుకుంటున్నాయి. 12 లక్షల కి.మీ. దాటితే ఆ బస్సును స్క్రాప్ కింద మార్చేస్తున్నారు. అంతేకాకుండా ఏటా ఆర్టీసీ కొత్త బస్సుల్ని సంస్థలో ప్రవేశపెట్టి పాత బస్సుల్ని మారుస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ అమలు చేస్తున్న స్క్రాపేజీ విధానం కేంద్రం ప్రకటించిన పాలసీ కంటే సమర్థంగా ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
తిరుగు ప్రయాణానికి ‘ప్రత్యేక’ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: స్వగ్రామాల్లో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకున్నవారంతా మళ్లీ ‘నగర’బాట పట్టారు. వీరందరితో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు 2,057 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక సర్వీసులు తిప్పుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతాలకు ఆర్టీసీ రెగ్యులర్గా 3 వేల సర్వీసులు నడుపుతోంది. ఇప్పుడు 2,057 సర్వీసులు అదనంగా చేరాయి. హైదరాబాద్కు అత్యధిక సర్వీసులు.. ఆర్టీసీ ఈనెల 19 వరకు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్కు అత్యధికంగా 954 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఆ తర్వాత బెంగళూరుకు 409, చెన్నైకి 131 ప్రత్యేక సర్వీసులు కేటాయించింది. ఆదివారం(17వ తేదీ) ఒక్క రోజే ఏకంగా 359 సర్వీసులు అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్కు తిప్పనున్నారు. ఇక బెంగళూరుకు 142, చెన్నైకి 51 సర్వీసులు నడుపుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్పై 816 కేసులు నమోదు.. ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ కట్టడి చేయడంతో ఈ ఏడాది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలంతా తమ సొంతూళ్లలో పండుగ జరుపుకోగలిగారు. ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుందామని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రైవేటు ట్రావెల్స్కు రవాణా శాఖ అధికారులు మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే పర్మిట్ రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. పండుగ నేపథ్యంలో ఇప్పటికే అధిక టికెట్ రేట్లు వసూలు చేసిన ప్రైవేట్ ట్రావెల్స్పై అధికారులు 816 కేసులు నమోదు చేశారు. -
సంక్రాంతి నుంచే ఆంధ్రాకు సర్వీసులు!
ప్రయాణికుల ఆదరణ లేక సంస్థకు భారంగా మారిన హైదరాబాద్ సిటీ సర్వీసుల్లోని మెట్రో లగ్జరీ బస్సులను రాజధాని సర్వీసులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు రాజధాని కేటగిరీ సర్వీసుల్లో వోల్వో లాంటి ప్రీమియం బస్సులు లేవు. ప్రస్తుతం సిటీ సర్వీసుల్లోంచి ఉపసంహరించుకుంటున్న లగ్జరీ బస్సులన్నీ వోల్వో కంపెనీవే. దీంతో తొలిసారి రాజధాని కేటగిరీలో ప్రీమియం మోడల్ బస్సులు చేరనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రో లగ్జరీ కేటగిరీలో 80 వోల్వో బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇవి డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించినా, వీటిని మాత్రం బయటకు తీయలేదు. ఇటీవలే వీటిని సిటీ సర్వీసు నుంచి తప్పిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వీటిని రాజధాని బస్సులుగా మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో 40 బస్సులను విజయవాడ రూట్కు కేటాయించింది. సంక్రాంతి పండుగ నుంచి ఇవి తిరిగే అవకాశం ఉంది. – సాక్షి, హైదరాబాద్ మళ్లీ రూ.లక్షన్నరకుపైగా ఖర్చుతో మార్పులు.. వోల్వో కంపెనీ బస్సులు అయినప్పటికీ సిటీ సర్వీసు కావటంతో వీటిల్లో కుషన్ లేని సాధారణ సీట్లే అమర్చారు. కొత్తగా విజయవాడ మార్గంలో 40 బస్సులు కేటాయించిన నేపథ్యంలో వీటిల్లో సీట్లను మార్చాల్సి ఉంది. దాదాపు నాలుగున్నర గంటల ప్రయాణం అయినందున పుష్ బ్యాక్ సీట్లే అవసరం ఉంటుంది. రాజధాని బస్సుల్లో అలాంటి సీట్లే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సీట్లపై అంత సేపు ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. దీంతో వీటిల్లో రూ.లక్షన్నర వ్యయం చేసి పుష్ బ్యాక్ సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇవి లోఫ్లోర్ మోడల్ బస్సులు కావడంతో వీటిల్లో 32 సీట్లు మాత్రమే ఉంటాయి. కానీ సాధారణ రాజధాని బస్సుల్లో సీట్ల సంఖ్య 40 ఉంటుంది. తాజా మార్పుల్లో సీట్లను నలభైకి పెంచుతున్నారు. అలాగే ఈ బస్సుల రంగు మార్చి, మధ్యలో డబుల్ డోర్ను మూసి ఆ ఖాళీలో 8 సీట్లు కొత్తవి అమరుస్తున్నారు. ముందునుంచీ అంతంతే.. మెట్రో లగ్జరీ సర్వీసుల కింద 80 వోల్వో కంపెనీ బస్సులను జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 2015లో రాష్ట్రానికి మంజూరు చేశారు. కోటి జనాభాతో ఉన్న నగరం కావటంతో హైదరాబాద్లో ప్రీమియం స్థాయి బస్సులుండాలన్న ఉద్దేశంతో అప్పట్లో కేంద్రం మంజూరు చేసిన ఈ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం సిటీ సర్వీసుల్లో చేర్చింది. కానీ వీటికి తొలి నుంచీ ఆదరణ అంతంత మాత్రంగానే ఉండటంతో అప్పటినుంచే తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. పలు మార్లు వాటి రూట్లు మార్చి చివరకు సాఫ్ట్వేర్ కంపెనీ లు ఎక్కువగా ఉండే మాదాపూర్ వైపు ఎక్కువ సర్వీసులు ఏర్పాటు చేశారు. వీటిల్లో ప్రయాణం సౌకర్యంగా ఉండటంతో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీటి పాస్లు కొనటం వల్ల కాస్త ఆదాయం పెరిగింది. కానీ మెట్రో రైలు సర్వీసు ప్రారంభంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా మెట్రోరైలు వైపు మొగ్గు చూపడంతో మళ్లీ ఇవి ఖాళీగానే తిరగాల్సి వచ్చింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె సుదీర్ఘకాలం కొనసాగటం కూడా తీవ్రంగా నష్టాలు రావడానికి కారణమైంది. ఇక సిటీ బస్సులుగా వీటిని నడపటం వృథా ప్రయాస అన్న ఉద్దేశంతో ఆర్టీసీ తాజాగా ఈ బస్సులను సిటీ సర్వీసు నుంచి ఉపసంహరించుకుంది. కొత్త బస్సుల్లేక.. అంతర్రాష్ట్ర ఒప్పందం తర్వాత ఏపీకి తిప్పే తెలంగాణ సర్వీసుల సంఖ్య పెంచారు. కానీ చాలినన్ని కొత్త బస్సుల్లేక సిటీ లగ్జరీ వోల్వో బస్సులను విజయవాడకు తిప్పాలని నిర్ణయించారు. ఈ మార్గంలో స్పందన బాగుంటే మరిన్ని వోల్వో బస్సులను కేటాయించాలని యోచిస్తున్నారు. లేకుంటే వాటిని హైదరాబాద్–రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల మధ్య తిప్పాలని భావిస్తున్నారు. -
వైజాగ్ రూట్
సాక్షి, అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్– తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ.. తెలంగాణలో 1.03 లక్షల కి.మీ. బస్సులు నడపే అవకాశం కోల్పోయింది. అలాగే తెలంగాణకు సర్వీలు తగ్గించడంతో మరో 80 వేల కి.మీ. కోల్పోయింది. అంటే మొత్తం 1.83 లక్షల కి.మీ.లను తిప్పడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసుకొనేందుకు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో రూట్ల వారీగా బ్లూ ప్రింట్ రూపొందించింది. సోమవారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఈడీల) కమిటీకి దీన్ని అందించనున్నారు. కమిటీ ఆమోదించగానే, గుర్తించిన 223 డిమాండ్ రూట్లలో ఆర్టీసీ బస్సులను నడపనుంది. తెలంగాణతో ఏపీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా గతం కంటే 371 బస్సులు తగ్గించుకుంది. దీంతో ఏపీకి ఏటా రూ.265 కోట్లు నష్టం వాటిల్లుతోంది. ప్రజా రవాణాలో బస్సులు తగ్గించుకోకుండా డిమాండ్ ఉన్న పట్టణాల నుంచి చెన్నై, బెంగళూరు, ఏపీలోని అన్ని ముఖ్య నగరాలకు బస్సు సర్వీసులు తిప్పనున్నారు. జిల్లాల్లో అంతర్గత రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే పూర్తి చేశారు. నగరాల నుంచి పగటిపూట విశాఖకు సర్వీసులు – ఏపీలోని అన్ని పట్టణాల నుంచి నగరాలకు, ముఖ్య మండల కేంద్రాల నుంచి పొరుగు జిల్లాలకు సర్వీసులు తిప్పేందుకు నిర్ణయించారు. – మొత్తం 223 డిమాండ్ రూట్లు గుర్తించారు. ప్రతి పట్టణం నుంచి విశాఖపట్నానికి సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు. – ఇతర నగరాల నుంచి పగటి పూట సైతం విశాఖకు బస్సులు నడవనున్నాయి. – విజయవాడ నుంచి తిరుపతికి మినహాయిస్తే, రాయలసీమకు కనెక్టివిటీ తక్కువగా ఉంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఏసీ సర్వీసులు మరీ తక్కువగా ఉన్నాయి. – కడప, కర్నూలుకు ఏసీ సర్వీసులు మూడు చొప్పున మాత్రమే నడుస్తున్నాయి. అనంతపురానికి అసలు ఏసీ సర్వీసు లేదు. – నాన్ ఏసీ సర్వీసులు కూడా రాయలసీమ జిల్లాలకు పెద్దగా లేవు. దీంతో విజయవాడ నుంచి కడప, కర్నూలు, అనంతపురానికి మరిన్ని ఎక్కువ సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించారు. ఏసీ సర్వీసులు పెంచేందుకు నిర్ణయం.. – ప్రస్తుతం ఏసీ బస్సులు 243 ఉండగా, కేవలం 84 మాత్రమే నడుస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఏసీ సర్వీసులకు ఆదరణ లభించనందున ఏసీ సర్వీసులు తగ్గించారు. జనవరి నుంచి ఏసీ సర్వీసులు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. – సిటీ సర్వీసులు విజయవాడ, విశాఖపట్నంలో కలిపి 1,009 వరకు ఉండగా, 740 వరకు సిటీ సర్వీసుల్ని తిప్పుతున్నారు. – అద్దె బస్సులను పెంచి డిమాండ్ ఉన్న రూట్లలో తిప్పేందుకు నిర్ణయించారు. -
త్వరలో సిటీలో డబుల్ డెక్కర్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్ : త్వరలో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగుపెట్టే అవకాశం ఉంది. గత నెల ఓ వ్యక్తి ట్వీట్కు స్పందించిన మంత్రి కేటీఆర్ సూచనతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సర్వే చేసిన అధికారులు డబుల్ డెక్కర్ బస్సులను నడిపించగలిగే 5 మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. ఈ మార్గాల్లో తొలుత పది డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దూరప్రాంతాలకు నడిపేలా.. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు మార్గాలను నిర్మించడంతో డబుల్ డెక్కర్ బస్సులు ఆయా మార్గాల్లో తిరగటం సాధ్యం కాదు. ఇవి అడ్డురాని మార్గాల్లో మాత్రమే తిప్పాల్సి ఉంటుంది. ఇందుకు వాటితో ఇబ్బంది లేని మార్గాలను గుర్తించారు. నగరంలో 2004 వరకు డబుల్ డెక్కర్ బస్సులు తిప్పారు. వాటిని రద్దు చేసే సమయానికి మెహిదీపట్నం–సికింద్రాబాద్, మెహిదీపట్నం–చార్మినార్, సికింద్రాబాద్–చార్మినార్, సికింద్రాబాద్–జూపార్కు మార్గాల్లో నడిపారు. మళ్లీ పటాన్చెరుకు సర్వీసులు.. నగరం నుంచి పటాన్చెరు వరకు మళ్లీ నడపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, కోఠి నుంచి ప్రస్తుతం పటాన్చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. ఆ మార్గానికి మంచి డిమాండ్ ఉండటంతో ఆయా మార్గాల్లో వీటిని తిప్పితే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే మేడ్చల్ రూట్లో ఉండే సుచిత్ర, కొంపల్లి వరకు మంచి రద్దీతో బస్సులు తిరుగుతున్నాయి. ఆ మార్గంలో కూడా తిప్పితే బాగుంటుందని యోచిస్తున్నారు. పాత బస్తీ నుంచి మెహిదీపట్నం, అక్కడి నుంచే జీడిమెట్ల వైపు కూడా సర్వీసులు తిప్పితే బాగుంటుందని భావిస్తున్నారు. దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడా లని భావిస్తున్నారు. త్వరలో మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్శర్మలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే కొత్త బస్సుల తయారీకి ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదివరకు నడిచిన డిజైన్లోనే కొత్త బస్సులు కూడా రూపొందించాలని నిర్ణయించారు. -
25 నుంచి తమిళనాడుకు బస్సులు
సాక్షి, అమరావతి: తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల 25 నుంచి బస్సు సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సంసిద్ధమయ్యింది. కోవిడ్ కారణంగా మార్చి 21 నుంచి బస్సు సర్వీసులను ఆపేసిన విషయం విదితమే. ఏపీ నుంచి చెన్నైకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని ఇటీవల ఏపీ ప్రభుత్వం కోరడంతో తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది. లాక్డౌన్ ప్రారంభానికి ముందు చెన్నైకి ప్రతిరోజూ ఏపీ నుంచి 273 సర్వీసులు తిరిగేవి. ఇప్పుడు వీటిని దశల వారీగా తిప్పేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. తిరుమల, తిరుపతి నుంచి సర్వీసులు ఎక్కువగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
పంచారామాలకు 1,750 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: కార్తీక మాసంలో రాష్ట్రంలో ఐదు పంచారామాలైన పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతికి అన్ని జిల్లాల నుంచి 1,750 బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. భక్తులకు అసౌకర్యం లేకుండా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల రీజనల్ మేనేజర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒక్కరోజే పంచారామాలు దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. దీనికి అనుగుణంగా ఆర్టీసీ రవాణా సదుపాయం కల్పిస్తోంది. మొదటి సోమవారం ఆర్టీసీ తొమ్మిది జిల్లాల నుంచి పంచారామాలకు, నాలుగు జిల్లాల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడిపింది. మొదటివారం 106 సర్వీసులు ► పంచారామాలకు మొదటివారం తొమ్మిది జిల్లాల నుంచి 106 ప్రత్యేక సర్వీసులు, శ్రీశైలం, కోటప్పకొండకు కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 16 బస్సులు నడిపారు. ► దూరాన్ని బట్టి ఆదివారం అర్ధరాత్రి నుంచి బస్సులు బయలుదేరి సోమవారం రాత్రికల్లా పంచారామాల్లో దర్శనాలు చేసుకుని తిరుగు పయనమయ్యేందుకు వీలుగా శీఘ్ర దర్శనాలు చేయించనున్నారు. -
ఇక్కడ తగ్గించి.. ఏపీకి మళ్లించి!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ సర్వీసులు నడపాల్సిరావడంతో చాలినన్ని బస్సులు లేక హైదరాబాద్ నుంచి ఇతర పట్టణాలకు నడిచే ట్రిప్పులను తగ్గించి వాటిని సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏపీతో ఇటీవల అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం ఖరారు కావటంతో, లాక్డౌన్ సమయం నుంచి 7 నెలలపాటు నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఇంతకాలం తెలంగాణతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీ 1.03 లక్షల కి.మీ. మేర ఎక్కువగా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పుతోంది. అంతమేర ట్రిప్పుల్లో కోత విధించుకోవాలని, అప్పటి వరకు ఒప్పందం చేసుకోబోమని తెలంగాణ తేల్చిచెప్పడంతో ఏపీఎస్ఆర్టీసీ అంతమేర తగ్గించుకుంది. ఈ ఒప్పం దంలో భాగంగా టీఎస్ఆర్టీసీ ఏపీకి 826 బస్సు లు తిప్పాల్సి వస్తోంది. ఇది అంతకుముందు కంటే దాదాపు 85 బస్సులు ఎక్కువ. ఇప్పుడు ఈ పెరిగిన సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ వద్ద అదనపు బస్సుల్లేవు. ఇప్పటికే ఏపీకి నడుస్తున్న బస్సుల్లో 30% పాతవే. వీటి స్థానంలో కొత్తవి తీసుకోవాల్సి ఉంది. కొత్తవి కొనేందుకు డబ్బు లేక అలాగే నడుపుతున్నారు. ఈ తరుణంలో అదనంగా 85 బస్సులు తిప్పాల్సి రావడం ఆర్టీసీకి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. గత్యంతరం లేని పరిస్థితిలో హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ఇతర పట్టణాలకు తిరిగే సర్వీసులకు సంబంధించి కొన్ని ట్రిప్పులను తగ్గించి ఆ బస్సులను ఏపీకి తిప్పాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, హన్మకొండ.. ఇలా ఎక్కువ ట్రిప్పులున్న మార్గాల్లోంచి కొన్నింటిని తగ్గించనున్నారు. ఆయా మార్గాల్లో ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఏయే ట్రిప్పులు తగ్గించాలో తేల్చారు. (చదవండి: ఆర్టీసీపై ‘పోలవరం’ భారం) ఎక్స్ప్రెస్లే ఎక్కువ.. కొత్త ఒప్పందం ప్రకారం.. హైదరాబాద్–విజయవాడ మార్గంలో 107 బస్సులు కొత్తగా తిప్పాలి. విజయవాడ–ఖమ్మం మార్గంలో కొన్ని పల్లెవెలుగు సర్వీసులు తగ్గించనున్నారు. ఇలా విజయవాడ మార్గంలో వందకు పైగా అదనంగా తిప్పాల్సి రావడం, ఖమ్మం–విజయవాడ మార్గంలో పల్లెవెలుగు బస్సుల సంఖ్య తగ్గించడం వెరసి కొత్తగా 85 బస్సులు అవసరం. విజయవాడ మార్గంలో డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువ అవసరమవుతున్నాయి. ఎక్స్ప్రెస్ల సంఖ్య పెం చాల్సి రావడంతో వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న ఎక్స్ప్రెస్లలోనే కోతపెట్టి మళ్లిస్తున్నా రు. ఆరు నెలల తర్వాతే.. కొత్త బస్సులు కావాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించనుంది. వేయి కొత్త బస్సులు కావాలంటూ గతంలోనే ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు పూచీకత్తు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి, రుణం మంజూరై, కొత్త బస్సులు కొని, బస్ బాడీ సిద్ధం చేసుకుని నడిపేందుకు ఆరు నెలల సమయం పట్టనుంది. అప్పటి వరకు ఇతర ప్రాంతాల నుంచి తగ్గించిన బస్సులతోనే నెట్టుకురానుంది. -
ఏపీ–తెలంగాణ బస్సు రూట్లు ఖరారు
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే బస్సు రూట్లను ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 13 జిల్లాల్లోని 12 రూట్లలో మొత్తం 638 బస్సులు తిప్పనుంది. ఇందులో ఒక్క హైదరాబాద్కే 534 బస్సులు నడపనుంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 104 బస్సులు తిప్పేలా ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్లే రూట్లో బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో 264 బస్సుల్ని నడపగా.. ఇప్పుడు 166కు పరిమితమైంది. ఇక 1,60,999 కిలోమీటర్లలో హైదరాబాద్కు 1,49,998 కిలోమీటర్లు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 11,001 కిలోమీటర్ల మేర నడిపేందుకు సిద్ధమైంది. గతంలో ఏపీఎస్ఆర్టీసీ 2,65,367 కిలోమీటర్ల మేర తెలంగాణ భూ భాగంలో బస్సులు తిప్పేది. కాగా, ఖరారైన బస్సు రూట్లను టీఎస్ఆర్టీసీకి ఏపీఎస్ఆర్టీసీ పంపించింది. టీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణ నుంచి ఏపీకి ఇవే రూట్లలో తమ సర్వీసులు నడపనుంది. ఈ నెల 2న ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఖరారైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఏపీఎస్ ఆర్టీసీ 452 బస్సులు తెలంగాణకు నడుపుతుండగా.. ఆక్యుపెన్సీ 67 శాతంగా నమోదవుతోంది. 452 బస్సుల్లో 389 హైదరాబాద్కు, 63 తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నారు. వీటి ద్వారా ఏపీఎస్ ఆర్టీసీకి రోజుకు రూ.68.17 లక్షల ఆదాయం వస్తోంది. ఒక్క హైదరాబాద్ రూట్ ద్వారా రూ.59.30 లక్షల ఆదాయం వస్తోంది. -
రాష్ట్రంలో మరో లక్ష కి.మీ. లక్ష్యం
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో కోల్పోయిన లక్ష కిలోమీటర్లను రాష్ట్రంలో పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న అంతర్గత రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే ప్రారంభించారు. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో డిమాండ్ ఉన్న కర్ణాటక, తమిళనాడుకు సర్వీసులు పెంచనున్నారు. దీన్లో భాగంగా విజయవాడ–విశాఖపట్టణం మధ్య ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేషన్స్పై సర్వే చేసిన అధికారులు ఈ మార్గంలో బస్సులు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. డిమాండ్ ఉన్న తిరుపతికి బస్సులు పెంచడంపై దృష్టి సారించారు. విశాఖపట్నం–బెంగళూరు, విశాఖపట్నం –చెన్నైలకు సర్వీసుల పెంపుపై అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల నుంచి తెలంగాణకు 440 బస్సులు నడిపిన ఏపీఎస్ఆర్టీసీ వీటిని క్రమంగా పెంచనుంది. ఈ నెల రెండు నుంచి తెలంగాణకు ప్రారంభమైన బస్సుల్లో ఆక్యుపెన్సీ 80 శాతం వరకు ఉంది. విజయవాడ–హైదరాబాద్కు ఏపీఎస్ఆర్టీసీ 45 సర్వీసులు నడిపితే, టీఎస్ఆర్టీసీ ఈ రూట్లో 39 సర్వీసులు నడిపింది. మొత్తం కర్ణాటక, తెలంగాణ అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఆక్యుపెన్సీ 65 శాతం ఉంది. తమిళనాడుకు త్వరలో సర్వీసులు నడిపేందుకు తమిళనాడు ఆర్టీసీకి సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే చెన్నైకి బస్సులు నడపనున్నారు. విజయవాడ–విశాఖ మధ్య 107 సర్వీసులు ► విజయవాడ–విశాఖ మధ్య ఆర్టీసీ నిత్యం 107 సర్వీసులు నడుపుతోంది. అదే ప్రైవేటు ట్రావెల్స్ వారు 117 సర్వీసులు తిప్పుతున్నారు. ► ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు పగటిపూట సైతం విజయవాడ నుంచి విశాఖకు బస్సులు నడుపుతున్నారు. అయితే కాంట్రాక్టు క్యారేజీలకు అనుమతి తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్నారు. ► నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ను కట్టడిచేయాలని ఆర్టీసీ ఇప్పటికే రవాణాశాఖకు లేఖ రాసింది. ► విజయవాడ–తిరుపతి రూట్లో ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు గతంలో నిర్వహించిన విధంగానే తిరుమల దర్శనసేవలను పునరుద్ధరించనుంది. ► మిగిలిన ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీకే ప్రజాదరణ ఉంది. ఆక్యుపెన్సీ రేషియో కూడా అధికంగా ఉంది. ఆదరణ ఉన్న అన్ని రూట్లు సర్వే చేస్తాం ప్రయాణికుల ఆదరణ ఉన్న అన్ని రూట్లను సర్వే చేస్తాం. డిమాండ్ను బట్టి బస్సులు నడిపి ప్రైవేటుకు పోటీగా సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఆర్టీసీలో ప్రమాదరేటు తక్కువ. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. – బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) -
రైట్.. రైట్..
అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ 371 సర్వీసుల్ని తగ్గించుకుంది. అంతకుముందు ఏపీ నుంచి తెలంగాణకు 1,009 సర్వీసులు నడిచేవి. ఇప్పుడు 638 సర్వీసులకు పరిమితం కావాల్సి ఉంది. టీఎస్ఆర్టీసీకి 76 సర్వీసులు పెరగనున్నాయి. గతంలో టీఎస్ఆర్టీసీ ఏపీకి 750 సర్వీసులు నడిచేవి. ఒప్పందం ప్రకారం ఇప్పుడు 826 సర్వీసులు తిరుగుతాయి. సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య ఎట్టకేలకు అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరింది. గత ఏడు నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల ఎండీలు ఎంటీ కృష్ణబాబు, సునీల్శర్మ హైదరాబాద్లో సంతకాలు చేశారు. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కి.మీ మేర బస్సు సర్వీసులను నడపనుంది. తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీ 1,60,999 కి.మీ నడపనుంది. ఇకపై ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణకు 638 బస్సులు నడపనుంది. టీఎస్ఆర్టీసీ 826 బస్సులు తిప్పనుంది. అంతర్రాష్ట్ర ఒప్పందంపై సంతకాల అనంతరం తక్షణమే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని ఇరు రాష్ట్రాల ఎండీలు వెల్లడించారు. ఒప్పందం కుదిరిన వెంటనే విజయవాడ నుంచి హైదరాబాద్కు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు 36 మంది ప్రయాణికులతో సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి వెళ్లింది. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల మధ్య అంతర్రాష్టఒప్పందం ఇదే.. ► టీఎస్ఆర్టీసీ 826 బస్సులతో ఏపీలో 1,61,258 కి.మీ, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 638 బస్సులతో 1,60,999 కి.మీ. బస్సులు తిరుగుతాయి. ► విజయవాడ మార్గంలో, టీఎస్ ఆర్టీసీ 273 బస్సులతో 52,944 కి.మీ. రోజూ తిప్పుతుంది. ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 192 బస్సులతో 52,524 కి.మీ. నడపనుంది. ► కర్నూలు–హైదరాబాద్ మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఏపీలో 213 బస్సులతో 43,456 కి.మీ. నడుపుతుంది. అదే ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 146 బస్సులతో 43,202 కి.మీ. నడుపుతుంది. ► పిడుగురాళ్ల–గుంటూరు మార్గంలో వాడపల్లి మీదుగా టీఎస్ఆర్టీసీ ఏపీలో 67 బస్సులతో 19,044 కి.మీ., ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 88 బస్సులతో 20,238 కి.మీ. తిప్పుతుంది. ► మాచర్ల మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఏపీలో 66 బస్సులతో 14,158 కి.మీ. నడపనుంది. ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 61 బస్సులతో 16,060 కి.మీ. నడపనుంది. ► నూజివీడు, తిరువూరు, భద్రాచలం–విజయవాడ మార్గంలో టీఎస్ఆర్టీసీ అదే కిలోమీటర్లు నడిపేందుకు సిద్ధం. అంటే తెలంగాణ ఆర్టీసీ ఏపీలో 48 బస్సులతో 12,453 కి.మీ. ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 65 బస్సులతో 14,026 కి.మీ. నడుస్తాయి. ► ఖమ్మం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మార్గంలో టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఏపీలో 35 బస్సులతో 9,140 కి.మీ. నడుపుతుంది. ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 58 బస్సులతో 11,541 కి.మీ. తిప్పనుంది. ► హైదరాబాద్–శ్రీశైలం మార్గంలో టీఎస్ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 1,904 కి.మీ. కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ ఈ మార్గంలో బస్సులు నడపబోదు. సత్తుపల్లి–ఏలూరు, భద్రాచలం ఇంకా కుంట వయా మార్గాల్లో కల్లుగూడెం, సత్తుపల్లి– విజయవాడ మార్గంలో, ఇతర మార్గాల ద్వారా టీఎస్ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 8,159 కి.మీ., ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 28 బస్సులతో 3,408 కి.మీ. బస్సులు నడపనున్నాయి. ఏపీఎస్ఆర్టీసీకి ఆర్నెల్లలో రూ.2,400 కోట్లు నష్టం ఏపీఎస్ఆర్టీసీకి గత ఆర్నెల్లలో రూ.2,400 కోట్లు నష్టం వాటిల్లింది. త్వరలోనే అంతర్రాష్ట్ర ట్యాక్స్ చెల్లింపుల కోసం ఇరు రాష్ట్రాల రవాణా మంత్రుల భేటీ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు లక్ష కిలోమీటర్లు తిప్పాలంటే కష్టమే. కరోనా పరిస్థితుల కారణంగా లక్ష కిలోమీటర్లు తిప్పకపోతే పునరాలోచన చేయాల్సి ఉంటుంది. ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ఉండాలనే ఒప్పందం చేసుకున్నాం. – కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ -
సరిహద్దులు దాటి రయ్.. రయ్
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల తర్వాత తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. సోమవారం ట్రాన్స్పోర్టు భవన్లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో అంతర్రాష్ట్ర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ఆ వెంటనే ఆర్టీసీ బస్సులు సరిహద్దులు దాటి ముందుకు వెళ్లటం విశేషం. కొత్త ఒప్పందం ప్రకారం.. తెలంగాణకు వచ్చే ఏపీ బస్సుల కంటే, ఏపీకి వెళ్లే తెలంగాణ బస్సులే ఎక్కువ. సరిహద్దు నుంచి పరిశీలిస్తే తెలంగాణ భూభాగమే ఎక్కువగా ఉన్నందున టీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్య ఎక్కువగా నిర్ధారించారు. 826 టీఎస్ఆర్టీసీ బస్సులు ఏపీలో 1,61,258 కి.మీ.లు.. 638 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర తిరగనున్నాయి. తెలంగాణ ప్రతిపాదన ప్రకారమే.. రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రప్రాంత భూ భాగంలో వెసులుబాటు ఆధారంగా సింహ భాగం ఆ ప్రాంత డిపో బస్సులే తిరిగేలా షెడ్యూల్స్ రూపొందించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒప్పందం జరగకపోవడంతో అవి అలాగే కొనసాగాయి. ఫలితంగా ఏపీ పరిధిలో టీఎస్ఆర్టీసీ బస్సులు తక్కువగా, తెలంగాణ పరిధిలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఎక్కువగా తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు దాన్ని మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సూచించారు. ఆ మేరకే అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దా ని ప్రకారం.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 1.03 లక్షల కి.మీ. మేర తెలంగాణలో తక్కువగా తిరగాల్సి వస్తోంది. దీనికి బదులు టీఎస్ ఆర్టీ సీ కూడా అంతమేర ఎక్కువగా బస్సులు తిప్పుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ కోరింది. కానీ అది నష్టమే తెస్తుందని గట్టిగా పేర్కొన్న తెలంగాణ, ఏపీ కూడా అంతమేర తగ్గించడమే రెండు ఆర్టీసీలకు మంచిదని వాదించింది. ఇప్పుడు ఆ మేరకే రెండు ఆర్టీసీలు ఒప్పం దం చేసుకున్నాయి. ఈ సమావేశంలో తెలంగాణ ఈడీలు వినోద్కుమార్, వెంకటేశ్వర్లు, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఏపీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే బస్సులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఒప్పందంపై ప్రజలకు అవగాహన లేకపోవటంతో బస్టాండ్లకు పెద్దగా ప్రయాణికులు రాలేదు. దీంతో పరిమిత సంఖ్యలో సర్వీసులు నడిపారు. రాత్రి సర్వీసులకు కొంత రద్దీ పెరిగింది. మంగళవారం నుంచి ప్రయాణికుల సంఖ్య ఆధారంగా సర్వీసుల సంఖ్య పెంచుతామని అధికారులు పేర్కొన్నారు. కాస్త ఆలస్యమైనా.. మంచి ఒప్పందం కోవిడ్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందంలో కొంత జాప్యంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగలేదు. కాస్త ఆలస్యమైనా ఇప్పుడు మంచి ఒప్పందం కుదిరింది. ఇది రెండు ఆర్టీసీలకు మేలు చేస్తుంది. ఈ ఒప్పందం సామరస్యపూర్వకంగా కుదరడంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఏపీ రవాణా మంత్రి పేర్నినాని, ఏపీ–తెలంగాణ ఎండీలు కృష్ణబాబు, సునీల్శర్మ, ఈడీలు ఎంతో కృషి చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. – మంత్రి పువ్వాడ అజయ్కుమార్ -
ఏపీఎస్ఆర్టీసీకే ఆదరణ!
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని ప్రజా రవాణా వ్యవస్థకే ఆదరణ దక్కుతోంది. ఆయా రాష్ట్రాల ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీనే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఏపీలో 50% మాత్రమే బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆక్యుపెన్సీ 62% వరకు ఉంటోంది. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా రోజు వారీగా 22 లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్లోనూ ఇతర ఆర్టీసీల కంటే ఏపీఎస్ఆర్టీసీ మెరుగ్గా ఉంది. దూర ప్రాంత సర్వీసుల్లో ఏపీఎస్ఆర్టీసీలో రోజుకు దాదాపు 70 వేల టికెట్లు బుకింగ్ జరుగుతోందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో మే 21 నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసుల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 50% సర్వీసులు తిప్పుతున్న ఏపీఎస్ఆర్టీసీ వంద శాతం సర్వీసులు తిప్పేందుకు సిద్ధంగా ఉంది. ► ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీ శాతం పెంచుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్తో పోటీ పడనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర పరిధిలోని అంతర్గత రూట్లపై ఇటీవలే ఆర్టీసీ అధికారులు సర్వే చేశారు. ► డిమాండ్ ఉన్న విశాఖ–హైదరాబాద్ రూట్లో ప్రైవేట్ బస్సులు పగటి పూట తిప్పుతున్నాయి. అదే ఆర్టీసీ రాత్రి వేళల్లో మాత్రమే తిప్పుతోంది. ఆర్టీసీ కూడా పగటి పూట బస్సుల్ని నడిపేందుకు యోచిస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీలోనే కోవిడ్ వ్యాప్తి తక్కువ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో కోవిడ్ వ్యాప్తి అతి తక్కువగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ పేర్కొంది. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందని తేల్చింది. వంద శాతం బస్సుల్ని నడిపేందుకు సిద్ధం రాష్ట్రంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం కోవిడ్ నిబంధనలను అనుసరించి వంద శాతం బస్సుల్ని నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన ఆర్టీసీల కంటే ఏపీఎస్ఆర్టీసీకే ఆదరణ ఎక్కువగా ఉంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల మెరుగైన సామర్థ్యంతో పనిచేసే అవకాశం దక్కింది. – కె.బ్రహ్మానందరెడ్డి, ఈడీ (ఆపరేషన్స్), ఏపీఎస్ఆర్టీసీ -
నేడు అంతర్రాష్ట్ర ఒప్పందం కొలిక్కి!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం గురువారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దసరాకు ముందే అంతర్రాష్ట్ర ఒప్పందం ఖరారు కావాల్సి ఉండగా, టీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులో లేనందున వాయిదా పడింది. దీంతో తెలంగాణ సరిహద్దు చెక్పోస్టుల వరకు ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ సరిహద్దు వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్ని నడిపింది. సరిహద్దుల్లో ‘దసరా’ ట్రిప్పులిలా.. ► టీఎస్ఆర్టీసీ.. కర్నూలు సరిహద్దు పంచలింగాల వరకు ఎక్కువగా బస్సుల్ని తిప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ కేవలం 15 బస్సుల్ని మాత్రమే తిప్పగా, టీఎస్ఆర్టీసీ 211 బస్సుల్ని నడిపింది. ► గరికపాడు, వాడపల్లి, ఓహ్లాన్, కల్లుగూడెం, జీలుగుమిల్లి, పంచలింగాల, ఎంఎస్వీ పాలెం, పలకలగూడెం చెక్పోస్టుల వద్ద నుంచి ఏపీఎస్ఆర్టీసీ 11,255 మందిని, టీఎస్ఆర్టీసీ 6,828 మందిని వారి స్వస్థలాలకు చేర్చింది. -
దసరా తర్వాతే బస్సులు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవకుండా తొలిసారి దసరా జరుగుతోంది. లాక్డౌన్తో 7 నెలల క్రితం నిలిచిపోయిన బస్సులు.. అంతర్రాష్ట్ర ఒప్పందం లేదన్న కారణంతో ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. దీనిపై 2 నెలలుగా అభిప్రాయ భేదాలు నెలకొన్నా.. దసరా ముంగిట అవి సమసిపోయాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదించిన మేరకు బస్సు సర్వీసులు, తెలంగాణ పరిధిలో తమ బస్సులు తిరిగే కి.మీ. సంఖ్య తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సమ్మతించింది. అయితే, ఒప్పందానికి సంబంధించిన భేటీ నిర్వహించలేదు. దీంతో తొలిసారి దసరా వేళ ఆర్టీసీ బస్సులు సరిహద్దులు దాటలేదు. గతేడాది దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ప్రారంభం కావటంతో పండక్కి టీఎస్ఆర్టీసీ బస్సులు పెద్దగా నడవలేదు. అదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ముమ్మరంగా నడవడంతో పాటు అదనంగానూ తిరిగాయి. ఇక, ఈ దసరాకు రెండువైపులా బస్సులు సరిహద్దులు దాటలేదు. దీంతో తెలంగాణ పరిధిలో ఉండే ఏపీ ప్రయాణికులు, ఆంధ్రా ప్రాంతంలో ఉండే తెలంగాణవాసులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక, రైళ్లు కూడా పరిమిత సంఖ్యలోనే నడుస్తుండటంతో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల్లో ఊళ్లకు పయనమయ్యారు. పండుగ తర్వాతే.. తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదన మేరకు.. తెలంగాణ భూభాగంలో ఏపీ బస్సులు తిరిగే పరిధిని 1.04 లక్షల కి.మీ.మేర తగ్గించుకోవటంతోపాటు, 322 బస్సులు తగ్గించుకునేందుకు ఏపీ సమ్మతించింది. అత్యంత లాభదాయకమైన హైదరాబాద్–విజయవాడ మధ్య దాదాపు 51 వేల కి.మీ. మేర తిరిగే నిడివి తగ్గించుకునేందుకూ ఏపీ సిద్ధమైనట్టు తెలిసింది. దీనిపై పండగ తర్వాత మంగళ, బుధవారాల్లో తుది భేటీ జరిగే అవకాశం ఉంది. ఇందులో అవగాహన కుదిరితే రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు మార్గం సుగమమవుతుంది. -
అంతర్ రాష్ట్ర ఒప్పందంపై టీఎస్ఆర్టీసీ దోబూచులాట
సాక్షి, అమరావతి: దసరా సీజన్ ప్రారంభమైనా.. హైదరాబాద్ నుంచి ఏపీకి, ఏపీ నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. గత రెండ్రోజుల్నుంచీ టీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందంపై ముందుకొస్తున్నట్లు ప్రకటిస్తూనే ఉంది తప్ప ఏమీ తేల్చడం లేదు. ఈ నెల 21న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సమాన కిలోమీటర్ల ప్రాతిపదికన అంగీకారం తెలుపుతూ అధికారికంగా లేఖ ఇచ్చినా టీఎస్ఆర్టీసీ కాలయాపన చేస్తోంది. 1.61 లక్షల కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు తిప్పుదామని ప్రతిపాదించింది. దీని మేరకే ఏపీఎస్ఆర్టీసీ అంగీకారం తెలుపుతూ లేఖ పంపింది. (జనం సొమ్ముతో హైదరాబాద్లో ఇల్లా?) అయితే లేఖ అందలేదంటూ టీఎస్ఆర్టీసీ పేర్కొనడం గమనార్హం. కాగా తెలంగాణ ఆర్టీసీ అధికారుల తీరును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థించరని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గురువారం మచిలీపట్నంలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కిలోమీటర్లు తిప్పాలి? ఏయే రూట్లలో తిప్పాలనే అంశంపై దాదాపు మూడు నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య చర్చలుజరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణతో ఒప్పందం కుదరకపోవడంతో రాష్ట్రం నుంచి బస్సులు నడపలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. -
దసరా టూర్కు ‘ఆర్టీసీల’ బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకొనే వేడుక. ఈ పండుగ వేళ హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారు. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి వారి ప్రయాణాలు మొదలవుతాయి. ఆర్టీసీకి కూడా దసరా సీజన్ కలెక్షన్లు కురిపిస్తుంది. పెద్దెత్తున ఆదాయం వస్తుంది. ఈ సమయంలో చార్జీలు అధికారికంగా 50 శాతం పెంచినా ప్రజలు దాన్ని అంతగా పట్టించుకోరు. అయితే.. ఈసారి తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలకు పెద్ద సమస్యే వచ్చిపడింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరకపోవడంతో బస్సులు సరిహద్దులు దాటడం లేదు. రెండు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నా సయోధ్య కుదరలేదు. పండుగలోపు కుదురుతుందో.. లేదో.. తెలియని పరిస్థితి. దీంతో ఈసారి ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ప్రయాణం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ నిబంధనలతో రైళ్లు కూడా తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. వాటిల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విధిలేక ప్రజలు ప్రైవేటు బస్సుల కోసం పరుగుపెట్టాల్సి వస్తోంది. దొరికిందే అదునుగా వారు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ చార్జీ రూ.290 ఉంటే.. ప్రైవేట్లో రూ.500కుపైగా వసూలు చేస్తున్నారు. ఆదాయ నష్టం ఐదారు కోట్లు.. ప్రతీ సంవత్సరం పండుగ వేళ తిరిగే అదనపు బస్సుల్లో 50 శాతం చార్జి ఎక్కువ ఉంటుంది. దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీకి ఏపీకి తిప్పే స్పెషల్ బస్సుల ద్వారా రోజుకు అదనంగా రూ.70 లక్షల ఆదాయం వస్తుంది. ఒప్పందం కుదరక ఈ సారి బస్సులు తిరిగే అవకాశం లేకపోవడంతో దాదాపు రూ.ఐదారు కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఈ సంవత్సరం ఇలా ఉంటే.. గతేడాది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దసరా వేళ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో టీఎస్ఆర్టీసీ బస్సులు సరిగాలేక ప్రజలు అప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు. లాక్డౌన్కు ముందు.. ►తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సులు తిరిగే కి.మీ.: 2.64 లక్షలు ►తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో తిరిగే కి.మీ.: 1.61 లక్షలు తెలంగాణ వాదన: తెలంగాణ పరిధిలో ఏపీ బస్సు లు.. ఏపీలో తిరిగే తెలంగాణ బస్సుల పరిధి కంటే 1.03 లక్షల కి.మీ. ఎక్కువ తిరుగుతున్నాయి. దాన్ని తగ్గించుకోవాలి. ఏపీ వాదన: తెలంగాణతో పోలిస్తే ఏపీ బస్సులు ఎక్కువ తిరుగుతున్న మాట వాస్తవమే. కాలం గడిచేకొద్దీ సర్వీసుల సంఖ్య పెంచుకోవాలి కాబట్టి.. టీఎస్ ఆర్టీసీ కూడా ఏపీలో అంతమేర పెంచుకుంటే సరిపోతుంది. కాదంటే మేం 50 వేల కి.మీ. తగ్గించుకుంటాం.. తెలంగాణ అంతమేర పెంచుకున్నా చాలు. పెంచుకోవడం సాధ్యం కాదు.. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది. బస్సులు పెంచుకోవడం సాధ్యం కాదు. ఇక లాభదా యకంగా ఉండే విజయవాడ–హైదరాబాద్, కర్నూలు–హైదరాబాద్, గుంటూరు–హైదరాబాద్, ఒంగోలు–హైదరాబాద్ తదితర ప్రాంతాల మధ్య ఏపీ బస్సులను తగ్గించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఆదాయం కోల్పోవడమే సమస్య... తెలంగాణకు పెద్ద సంఖ్యలో బస్సులు తిప్పడం ద్వారా ఏపీ ఆర్టీసీ సాలీనా రూ.575 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. తెలంగాణ వాదన మేరకు సంఖ్య తగ్గించుకుంటే దాదాపు రూ.260 కోట్ల ఆదాయం తగ్గుతుంది. అసలే నష్టాల్లో ఉండే ఆర్టీసీలు ఇంత ఆదాయం కోల్పోవటం పెద్ద సమస్యనే. కానీ ఏపీ బస్సులు ఎక్కువ తిరగటం వల్ల టీఎస్ ఆర్టీసీకి 250 కోట్ల కంటే ఎక్కువ నష్టమొస్తోందని తెలంగాణ వాపోతోంది. ఇద్దరికి రూ.1,100... దసరా వేళ హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్లాలంటే ప్రైవేట్ బస్సులో ఇద్దరికి కలిపి టికెట్ ధర రూ.1,100 అడిగారు. రైళ్లు ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లేవు. దీంతో మాలాంటోళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. – సీతారామ్, యశ్వంత్, గుడివాడ మేం సిద్ధమే.. కానీ.. దసరాకి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా బస్సులు తిప్పేందుకు మేం సిద్ధం. కానీ.. ఏపీఎస్ ఆర్టీసీ మా ప్రతిపాదనకు అంగీకరించాలి. మా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రతిపాదన చేశారు. బస్సులు, కిలోమీటర్లు, రూట్లు.. ఈమూడింటిలో రెండు ఆర్టీసీలు సమంగా అనుసరించాలన్నారు. దాని ప్రకారమే మేం ప్రతిపాదించాం. మా ప్రతిపాదనతో రెండు ఆర్టీసీలు సమంగా లాభపడతాయి. – పువ్వాడ అజయ్కుమార్, రవాణాశాఖ మంత్రి -
ఏపీ నుంచి తెలంగాణకు 322 ఆర్టీసీ బస్సుల తగ్గింపు!
సాక్షి, అమరావతి: తెలంగాణ ఆర్టీసీ డిమాండ్ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఆ రాష్ట్రానికి 322 బస్సులను తగ్గించనుంది. లాక్డౌన్ ముందు వరకు ఏపీ నుంచి తెలంగాణకు రోజుకు 1,009 బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ నడిపింది. ఇకపై 687 బస్సులను మాత్రమే తిప్పనుంది. తెలంగాణ భూభాగంలో ఇంతకుముందు వరకు 2.65 లక్షల కి.మీ.లలో బస్సులను తిప్పగా ఇక నుంచి 1.61 లక్షల కి.మీ.కే పరిమితం కానుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు త్వరలో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. తెలంగాణ ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకుందామని ప్రతిపాదించగా ఏపీ మాత్రం వచ్చే ఏడాది మార్చి వరకే సిద్ధమంది. ఒప్పందంపై చర్చలకు ఈ దఫా టీఎస్ఆర్టీసీ అధికారుల్ని విజయవాడకు రావాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీ ఆహ్వానించింది. ఈ అంశంపై సోమ లేదా మంగళవారాల్లో స్పష్టత రానుంది. తెలంగాణ డిమాండ్ మేరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని, కి.మీ.లను తగ్గించి ప్రతిపాదనలు రూపొందించింది. కృష్ణా జిల్లా నుంచి అధికంగా బస్సుల తగ్గింపు టీఎస్ఆర్టీసీ అధికారులు మొదట్నుంచీ హైదరాబాద్–విజయవాడ రూట్లోనే బస్సులు పెంచుకుంటామని చెబుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీని తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచే 85 బస్సుల్ని తగ్గించింది. విజయవాడ రూట్లోనే టీఎస్ఆర్టీసీ సర్వీసులు పెంచుకోనుంది. టీఎస్ఆర్టీసీకి హైదరాబాద్–బెంగళూరు లాభదాయకమైన రూట్. రోజూ 70 సర్వీసుల వరకు బెంగళూరుకు తిప్పుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి బస్సుల్ని తిప్పడం లేదు. ఎందుకంటే బెంగళూరుకు వెళ్లాలంటే ఏపీ నుంచే వెళ్లాలి. దీంతో ఇప్పుడు బస్టాండ్లలోకి రాకుండా బెంగళూరుకు బస్సుల్ని తిప్పుకుంటామని టీఎస్ఆర్టీసీ కోరుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. -
క్లియర్ కాని ‘తెలంగాణ–ఏపీ రూట్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంకా రూట్ క్లియర్ కాలేదు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. బుధవారం ఆ రెండు ఆర్టీసీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయిలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. గతంలో పేర్కొన్న విషయాలకే ఇరువైపులా కట్టుబడి ఉండటంతో చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పటివరకు(లాక్డౌన్కు పూర్వం) ఆంధ్రప్రదేశ్ భూభాగంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరుగుతున్న 1.61 లక్షల కిలోమీటర్లకు సమంగా ఏపీ ఆర్టీసీ బస్సులు కూడా తెలంగాణ ప్రాంతంలో తిప్పేవిధంగా షెడ్యూళ్లను మార్చుకోవాల్సిందేనని తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో తమ ఎండీతో మాట్లాడి రెండు రోజుల తర్వాత మళ్లీ సమావేశానికి వస్తామని ఏపీ అధికారులు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ కోసం తాజాగా జరిగిన భేటీ నాలుగోది కావటం విశేషం. ఇంకా ఎంత తగ్గగలరో చెప్పండి.. లాక్డౌన్కు పూర్వం తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సుల 2.64 లక్షల కిలోమీటర్ల మేర తిరిగేవి. ఇప్పుడు కూడా అంతమేర తాము తిప్పుతామని, కావాలంటే తెలంగాణ ఆ మేరకు తమ సర్వీసుల పరిధిని పెంచుకోవాలని ఏపీ కోరుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు అంగీకరించటం లేదు. ఇప్పటికే తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని, కొత్తగా పరిధి పెంచుకోవటం వల్ల నష్టాలు పెరగటం తప్ప ఉపయోగం ఉండదని వాదిస్తున్నారు. మూడో దఫా చర్చకు వచ్చిన సందర్భంలో, ఏపీ అధికారులు ఓ మెట్టు దిగి 2.64 లక్షల కిలోమీటర్లకు బదులు 2.08 లక్షల కిలోమీటర్లకు తగ్గించుకుంటామని, తెలంగాణ అంతమేరకు పెంచుకుంటే సరిపోతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. దానికి కూడా తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. తాము సూచించినట్టుగా ఏయే మార్గాల్లో ఎంత మేర తగ్గించగలుగుతారో చెప్పాలని, అది తమకు ఆమోదయోగ్యం ఉంటుందో లేదో ఆలోచించి చెబుతామని తెలంగాణ అధికారులు చెప్పారు. ఆ విషయం చెప్పకుండా పాత ప్రతిపాదనతో రావడం వల్ల కాలయాపన తప్ప ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ సూచనలపై తమ ఎండీతో చర్చించి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందని ఏపీ అధికారులు అన్నారు. రెండు రోజుల తర్వాత కొత్త ప్రతిపాదనతో వస్తామంటూ వారు సమావేశం నుంచి వెళ్లిపోయారని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి, ఇంజనీరింగ్ విభాగం ఈడీ వినోద్, సీటీఎం మునిశేఖర్, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఆర్ఎంలు పాల్గొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి ఆపరేషన్స్ విభాగం ఈడీ బ్రహ్మానందరెడ్డి, ఇంజనీరింగ్ విభాగం ఈడీ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు మరోసారి ఇరురాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం
-
మరోమారు చర్చలు.. బస్సులు నడిచేనా?
కరోనా లాక్డౌన్లు ముగిశాయి. దాదాపు అన్నిటికీ కేంద్ర సర్కార్ లాకులెత్తింది. నిబంధనలకు లోబడి ప్రజా రవాణా చేసుకోచ్చని తెలిపింది. ప్యాసెంజర్ రైళ్లు మినహా, ప్రత్యేక, మెట్రో రైలు సేవలు అందుబాటులోకొచ్చాయి. అన్ని రాష్ట్రాల మధ్య బస్సులు తిరుగుతున్నాయి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునురద్ధరణ ప్రక్రియ మాత్రం ముందుకు కదలడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య ఈ విషయమై చర్చలు జరిగినప్పటకీ ఎటుంటి పురోగతి లేదు. బస్సు సర్వీసులు మీరే ఎక్కువ నడపాలి, అంటే మీరే తక్కువ నడపాలి అనే రెండు రాష్ట్రాల పంచాయితీ నడుమ ప్రైవేటు బస్సులు లబ్ది పొందుతున్నాయి. హైదరాబాద్లోని బస్ భవన్లో నేడు మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల ఈడీల సమావేశం జరుగనుంది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాదనలు ఇలా... ఆంధ్రప్రదేశ్ వాదన తమ రాష్ట్రంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నడిపే విషయంలో తెలంగాణ ఆర్టీసీ మొండికేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రాలతో అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణకు సిద్ధమైన టీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్తో ఒప్పందానికి మాత్రం ససేమిరా అంటోంది. లాక్డౌన్కు ముందు కర్ణాటక, మహారాష్ట్రకు తిప్పుతున్న బస్సుల్ని కిలోమీటర్ల ప్రకారం నడిపేందుకు టీఎస్ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కిలోమీటర్లు ప్రాతిపదికన బస్సులు తిప్పే అంశంపై తమ భూభాగంలో ఏపీఎస్ ఆర్టీసీ లక్షా10 వేల కిలోమీటర్ల మేర తగ్గించుకోవాలని తెలంగాణ పట్టుబడుతోంది. తాము 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తామని, టీఎస్ఆర్టీసీని 50 వేల కిలోమీటర్లు పెంచుకోవచ్చని సూచిస్తూ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు లేఖలు రాసినా స్పందించడంలేదు. మిగిలిన రూట్లలో బస్సుల్ని పెంచకుండా హైదరాబాద్–విజయవాడ రూట్లో పెంచుతామనడం సరికాదు. టీఎస్ఆర్టీసీ తీరు వల్ల ప్రైవేటు బస్సులు పెరిగాయి. ఆపరేటర్లు ఒకే పర్మిట్తో రెండు వైపులా బస్సుల్ని తిప్పుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం భారీ ఆదాయం కోల్పోతుంది. గతంలో ప్రైవేటు బస్సుల వల్ల రూ.వెయ్యి కోట్లు ఆదాయం కోల్పోతున్నామన్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ప్రైవేటు బస్సులు పెరిగినా.. తెలంగాణ ఆదాయం కోల్పోతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థకావడం లేదు. (చదవండి: అద్దె మాఫీ!) తెలంగాణ వాదన రూట్లవారీగా రెండు రాష్ర్టాలు సమాన కిలోమీటర్లు బస్సులు నడపాలని తెలంగాణ ప్రతిపాదించింది. రూట్లవారీగా కొన్ని ప్రతిపాదనలను ఏపీ అధికారులకు ఇచ్చింది. వాటిపై అధ్యయనం చేశాక ఎగ్జిక్యూటివ్ అధికారుల స్థాయిలో మరోసారి భేటీ అవుతాం. తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడున్న దానికంటే 50 శాతం మేర కిలోమీటర్లు పెంచుకుంటే.. తాము 52 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ఒప్పందం జరిగేవరకు 70 వేల కిలోమీటర్ల మేర రెండు రాష్ర్టాలు నడుపుదామని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. ఒప్పందం పూర్తయితేనే బాగుంటుందని తెలంగాణ అధికారులు స్పష్టంచేశారు. రెండు రాష్ర్టాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. (చదవండి: కొత్త ప్రాజెక్టులను అపెక్స్ ఆపమంది..!) అయితే, దసరా పండుగ సమీపిస్తుండటంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థల మధ్య ఈ దఫా జరుగుతున్న చర్చలు ఫలప్రదమవుతాయని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు. -
టీఎస్ఆర్టీసీతో తెగని పంచాయితీ
సాక్షి, అమరావతి: తెలంగాణ, ఏపీ మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసులను నడిపే విషయంలో టీఎస్ఆర్టీసీ మొండికేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలతో అంతర్ రాష్ట్ర ఒప్పందం పునరుద్ధరించుకునేందుకు రెడీ అయిన టీఎస్ఆర్టీసీ ఏపీతో ఒప్పందానికి మాత్రం ససేమిరా అంటోంది. లాక్డౌన్కు ముందు కర్ణాటక, మహారాష్ట్రకు తిప్పుతున్న బస్సుల్ని కిలోమీటర్ల ప్రకారం సోమవారం నుంచి నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఏపీతో మొండి వాదన ► తెలంగాణ, ఏపీ మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసులు నడిపే విషయంలో టీఎస్ఆర్టీసీ మొండి వాదనకు దిగుతోంది. ► ఏపీఎస్ఆర్టీసీ లక్ష కిలోమీటర్లు కచ్చితంగా తగ్గించుకోవాలని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. ► ఏపీకి బస్సులు తిప్పకపోవడం వల్ల టీఎస్ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ► అయినా ఏపీతో మాత్రం ఒప్పందం చేసుకునేందుకు తెలంగాణ అధికారులు అంగీకరించడం లేదు. ఆ ఒప్పందం సాంకేతికంగా కుదరదు ► కర్ణాటక, మహారాష్ట్రలతో టీఎస్ఆర్టీసీ కుదుర్చుకున్న అంతర్ రాష్ట్ర ఒప్పందం సాంకేతికంగా కుదరదని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేస్తోంది. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదు. ► అందువల్ల ఇతర రాష్ట్రాలతో అంతర్ రాష్ట్ర ఒప్పందం ఏపీఎస్ఆర్టీసీ పేరు మీదే ఉంది. ► ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కర్ణాటక, మహారాష్ట్రలతో ఏపీఎస్ఆర్టీసీ పేరు మీదే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుందని ఏపీ స్పష్టం చేస్తోంది. ► తెలంగాణ మాత్రం రెండు రాష్ట్రాల కార్యకలాపాలు వేర్వేరుగా జరుగుతున్నాయి కాబట్టి.. సాంకేతికంగా అడ్డు పెట్టినా కుదరదని టీఎస్ఆర్టీసీ వాదిస్తోంది. ఏపీ వాదన ఇదీ.. ► టీఎస్ఆర్టీసీ తగ్గించుకోవాలంటున్న లక్ష కిలోమీటర్లలో 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటాం. ► మిగిలిన 50 వేల కిలోమీటర్లు టీఎస్ఆర్టీసీ పెంచుకుంటే సామరస్యంగా ఉంటుంది. ► మిగిలిన రూట్లలో బస్సుల్ని పెంచకుండా హైదరాబాద్–విజయవాడ రూట్లో పెంచుతామనడం సరికాదు. ► టీఎస్ఆర్టీసీ తీరు వల్ల ప్రైవేటు బస్సులు పెరిగాయి. ఆపరేటర్లు ఒకే పర్మిట్తో రెండు వైపులా బస్సుల్ని తిప్పుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం భారీ ఆదాయం కోల్పోతుంది. ► గతంలో ప్రైవేటు బస్సుల వల్ల రూ.వెయ్యి కోట్లు ఆదాయం కోల్పోతున్నామన్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ప్రైవేటు బస్సులు పెరిగినా.. తెలంగాణ ఆదాయం కోల్పోతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదు. -
ఆంధ్రప్రదేశలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
-
అంతరాష్ట్ర బస్సులు: మంత్రుల భేటీ లేదు
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం ఎలాంటి మంత్రుల స్థాయి సమావేశం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం ఫిక్స్ చేయలేదు. కిలోమీటర్ బేసిస్లో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల సమావేశం జరుగుతుంది. అప్పటిదాకా కేవలం అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతాయి’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడపడానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించే లక్క్ష్యంతో ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్ ఈనెల 14న (సోమవారం) హైదరాబాద్లో సమావేశం కానున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ఇటీవల లాక్డౌన్ ఎత్తివేడంతో ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమైనప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మాత్రం ప్రారంభం కాలేదు. దీనిపై ఇరు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇరు రాష్ట్రాల నుంచి సమానంగా సర్వీసులు నడపాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో నిలిచిపోయిన చర్చలను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు మరోసారి సిద్ధమవుతున్నాయి. (రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి..) -
వైద్య శాఖ అనుమతి రాగానే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. లాక్డౌన్ 4.0లో భాగంగా ప్రజా రవాణాపై ఆంక్షలు ఎత్తేయడంతో సిటీ బస్లు తిప్పేందుకు వైద్య ఆరోగ్య శాఖను ఏపీఎస్ ఆర్టీసీ సంప్రదించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం సిటీ సర్వీసులు నడుపుతామని అందులో పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే విజయవాడ, విశాఖలో సిటీ సర్వీసులు మొదలు కానున్నాయి. మిగిలిన బస్ సర్వీసులు కూడా 50 శాతం వరకు తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. కాగా, గత నెలలో రోజుకు 8 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని తిప్పిన ఆర్టీసీ.. గత వారం నుంచి రోజుకు 12 లక్షల కిలోమీటర్ల వరకు నడుపుతోంది. ఇక సర్వీసుల్ని 2,200 నుంచి 2,746కు పెంచింది. హైదరాబాద్కు ప్రైవేటు బస్సులు ► అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలలకు పైగా ఖాళీగా ఉన్న ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. ► రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్కు బస్సులు తిప్పుతున్నారు. ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ఇవి ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులకు ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ విధానాన్ని ఆపరేటర్లు మొదలుపెట్టారు. ► మరోవైపు హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు గానూ అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ దీనిపై తెలంగాణ సర్కార్ ఇంకా స్పందించలేదు. ► సర్వీసుల పెంపునకు టీఎస్ ఆర్టీసీ ససేమిరా అంటోంది. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో తిప్పే కిలోమీటర్లు తగ్గించాలని.. తాము ఎట్టి పరిస్థితిలోనూ ఏపీ భూ భాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్ ఆర్టీసీ తెగేసి చెబుతోంది. -
కొలిక్కిరాని ఆర్టీసీ చర్చలు
సాక్షి, అమరావతి: ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం హైదరాబాద్లోని బస్భవన్లో ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ ఏడాది జూన్ 18న టీఎస్ఆర్టీసీ అధికారులు విజయవాడకు వచ్చి చర్చలు జరిపిన సందర్భంలో కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సుల్ని నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లో భేటీకి హాజరైన అధికారులు తెలంగాణకు నడిపే సర్వీసులు, కి.మీ.ల ప్రతిపాదనను టీఎస్ఆర్టీసీ అధికారులకు అందించారు. అయితే టీఎస్ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను, లేదా కి.మీ.లను తగ్గించుకోవాలని ఏపీకి సూచించారు. ఈ సూచన ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, తర్వాత నిర్ణయం చెబుతామని ఏపీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణకు ఏపీఎస్ఆర్టీసీ రోజూ 2.65 లక్షల కి.మీ. బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు అందించింది. అయితే టీఎస్ఆర్టీసీ ఏపీకి 1.16 లక్షల కి.మీ. బస్సు సర్వీసులు నడుపుతోంది. ఈ మేరకే ఏపీఎస్ఆర్టీసీ కూడా తగ్గించాలని సూచించింది. -
ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ బుకింగ్ గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు 30 రోజులు ముందుగానే సీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి రోజు (శనివారం) నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులిచ్చింది. కోవిడ్–19 కారణంగా ఇంతకుముందు ఏడు రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్కు బస్ సర్వీసులు తిప్పడంపై ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ బస్ భవన్లో సోమవారం భేటీ కానున్నారు. ► ఇప్పటివరకు ఏపీఎస్ఆర్టీసీ కర్ణాటకకు మాత్రమే సర్వీసులు నడుపుతోంది. తమిళనాడు, తెలంగాణలకు సర్వీసులు లేవు. ఈ రాష్ట్రాలకు ప్రైవేటు బస్సులు కూడా తిరగడం లేదు. ► కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించడంతో సెప్టెంబర్ 1 నుంచి ప్రైవేటు ఆపరేటర్లు తమ బస్సులను తిప్పనుండటంతో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటి నుంచి సర్వీసులు తిప్పాలనే అంశంపై సోమవారం నిర్ణయం వెలువడనుంది. ► రెండు రాష్ట్రాల మధ్య సమానంగా అంతరాష్ట్ర బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలు గతంలోనే అవగాహనకు వచ్చాయి. -
ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు లేనట్లే!
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు బుధవారం హైదరాబాద్లో అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం, టీఎస్ఆర్టీసీలో ఆపరేషన్స్ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్ తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడటంతో బస్సు సర్వీసులను నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది. ► కాగా, ఈ నెల 1 నుంచి 20 వరకు ఏపీఎస్ఆర్టీసీ రోజుకు సగటున 3,266 బస్సు సర్వీసుల్ని నడిపింది. 11.03 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. ► గత 20 రోజులుగా రోజుకు రూ.2.43 కోట్లు ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. కిలోమీటరుకు రూ.22.06 మాత్రమే పొందింది. కరోనాకు ముందు రోజుకు రూ.12 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చేది. త్వరలో సిటీ సర్వీసులు ► ఏపీఎస్ఆర్టీసీ త్వరలో సిటీ సర్వీసులు ప్రారంభించేందుకు నిర్ణయించింది. ► విజయవాడ, విశాఖలో నడిపే సిటీ సర్వీసుల్లో ఎక్కడ్నుంచి ఎక్కడకు వెళ్లినా ఒకే రేటు వసూలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. -
ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు
సాక్షి, విజయవాడ: అంతర్రాష్ట బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఈ నెల 17 నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. తొలుత పరిమిత సంఖ్యలో బస్సులను నడపనుంది. ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభించి అనంతరం నాలుగు దశల్లో మొత్తం 500 బస్సు సర్వీసులకు పెంచనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రేపట్నుంచి (సోమవారం) ఆన్లైన్లో రిజర్వేషన్లను ప్రారంభించనుంది. apsrtconline.in ద్వారా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించింది. బస్సుల్లో భౌతిక దూరం, విధిగా మాస్కులు, శానిటైజర్ వాడకం తప్పనిసరి. (2 రోజుల్లో 4 లక్షల మందికి పైగా ప్రయాణం) అలాగే కర్ణాటక నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే ప్రొటోకాల్ పాటించాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ కారణంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేసింది. అయితే లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే. బస్సు సర్వీసుల పునరుద్ధరణపై తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. (ఆర్టీసీ.. ఆన్లైన్ దూకుడు) -
ఏపీలో పెరగనున్న ఆర్టీసీ బస్సు సర్వీసులు
-
చార్జీలు వసూలు చేయకండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల నుంచి రైళ్లలోగానీ, బస్సుల్లోగానీ చార్జీలు వసూలు చేయరాదని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల ప్రయాణానికి వారి వంతు వచ్చే వరకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో రాష్ట్రాలు వలస కార్మికులకు ఆహారం, నీరు అందించాలనీ, రైళ్లలో రైల్వే శాఖ భోజనం, మంచినీరు సరఫరా చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వేలాది మంది వలస కార్మికులు అష్టకష్టాలు పడుతూ రోడ్లపై నడిచి వెళ్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం.. వలస కార్మికుల సమస్యను మే 26న సుమోటోగా స్వీకరించి, గురువారం విచారణ చేపట్టింది. కాలినడకన వెళుతోన్న వలస కార్మికులకు రవాణా సదుపాయాలను కల్పించాల్సిందిగా రాష్ట్రాలను కోరాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన సూచనలను కోర్టు గుర్తించింది. వలస కార్మికులు ఎందరున్నారు, వారి తరలింపు, వారి రిజిస్ట్రేషన్ విధానం తదితర పూర్తి సమాచారం రికార్డు చేయాలని సూచించింది. పేరు నమోదు చేసుకున్న తర్వాత వారిని ఎన్ని రోజులకు సొంత రాష్ట్రాలకు చేరుస్తామనే విషయంలో నిర్దిష్టత ఉండాలంది. తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటిదాకా 3,700 రైళ్లలో వలస కార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చినట్టు సొలిసిటర్ జనరల్ మెహతా తెలిపారు. -
లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవేనా..!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం విధించిన లాక్డౌన్ మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ను పొడిగిస్తుందా లేక ఆంక్షల నుంచి పూర్తిగా సడలింపులు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమచారం మేరకు.. ఓ వైపు లాక్డౌన్ కొనసాగిస్తూనే మరో వైపు ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కరోనా ప్రభావం తక్కువున్న ప్రాంతాల్లో వీలైనన్నీ సడలింపులు ఇవ్వాలని నిర్ణయించినట్లు హోంమంత్రిత్వశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి సడలింపులతో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కాగా లాక్డౌన్ 4.0లో కొత్త నిబంధనలు కలిగి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం పేర్కొన్న విషయం తెలిసిందే. (దేశంలో మరో 3,967 పాజిటివ్ కేసులు ) ఆటోలు, ట్యాక్సీలు కూడా.. లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలను తరలించేందుకు రైలు సర్వీసులు ఇప్పటికే ప్రారంభించగా.. దేశీయ విమాన, బస్సు సర్వీసులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు సీనియర్ అధికారి వెల్లడించారు. ఇటీవల ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్య డిమాండ్లలో హాట్స్పాట్లను నిర్వహించే అధికారం తమకు అప్పగించాలని కోరినట్లు, దీనికి అనుమతి లభించవచ్చని ఆయన తెలిపారు. హాట్స్పాట్ ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో తిరిగి కార్యకలాపాలు కొనసాగించాలని సీఎంలు కోరినట్లు పేర్కొన్నారు. అలాగే హాట్స్పాట్లు మినహా మిగతా ప్రాంతాల్లో పరిమిత సామర్థ్యంతో స్థానిక బస్సులు నడపడం ప్రారంభమవుతుందన్నారు. అంతేగాక ఆటోలు, ట్యాక్సీలు కూడా అనుమతించనున్నట్లు తెలిపారు. అయితే ప్రయాణీకుల సంఖ్యపై పరిమితులు ఉంటాయని, ఇవన్ని నాన్ కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే అమలవుతుంటాయని ఆయన అన్నారు. (లాక్డౌన్ పొడగింపు : 200 పాయింట్లు పతనం ) వలస కార్మికుల వల్ల కరోనా కేసులు ట్రావెల్ పాస్ అనుమతితో అంతరాష్ట్ర రవాణా కూడా అనుమతించనున్నట్లు వెల్లడించారు. కేవలం అత్యవసరమైన వస్తువులు మాత్రమే కాకుండా అన్ని రకాల వస్తువులను డోర్ డెలివరీ చేయడానికి కూడా అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. మెట్రో సర్వీసులు, లోకల్ రైళ్లు, దేశీయ విమానాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తిరిగి ప్రారంభించాలని కేరళ కోరుకుంటున్నట్లు ఓ అధికారి తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. వలస కార్మికులు తిరిగి రావడం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నందున బిహార్, జార్ఖండ్, ఒడిశాలో కఠినమైన లాక్డౌన్ కొనసాగాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మే 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ 4.0కు సంబంధించిన నూతన మార్గదర్శకాలపై కేంద్రం అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. (తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం.. కానీ ) -
సిటీ శివార్లకు ఆర్టీసీ దూరం..
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నానికి 16 కి.మీ. దూరంలో ఉన్న ఆరుట్ల సహా మంచాల, జాపాల్ తదితర గ్రామాల్లో కూరగాయల సాగు ఎక్కువ. రైతులు తమ పంటను ఆర్టీసీ బస్సుల ద్వారా నగరంలోని మాదన్నపేట మార్కెట్, ఎనీ్టఆర్ నగర్లోని రైతు బజార్కు తరలించేవారు. ఈ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారి సంఖ్యా ఎక్కువే. వీరికి ఆర్టీసీ బస్సులు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. కానీ ఆర్టీసీ సమ్మె తర్వాత సీన్ మారిపోయింది. నష్టాలకు కళ్లెం వేసే పేరుతో అధికారులు ఇలాంటి గ్రామాలకు ఉన్న బస్సులను దాదాపు నిలిపివేశారు. ఆర్టీసీలోని కొన్ని అద్దె బస్సులు తప్ప సొంత బస్సులను బాగా తగ్గించేశారు. దీంతో రైతులు, ఇతర ప్రయాణి కులు ఆటోల్లో ఇబ్రహీంపట్నం వరకు వచ్చి, అక్కడి నుంచి బస్సులెక్కాల్సి వస్తోంది. ఇది ఈ ఒక్క ప్రాంతంలోని గ్రామాల కథే కాదు. నగరం చుట్టూ 30 కి.మీ. పరిధిలో విస్తరించిన దాదాపు 250 గ్రామాల వ్యథ. ఆటోలు, జీపులమయం.. రెండు దశాబ్దాల క్రితం నగరం నుంచి సిటీ బస్సులు శివారు గ్రామాలకు తప్ప అంతకుమించి ముందుకు వెళ్లేవి కాదు. కానీ, సిటీ విస్తరిస్తుండటంతో 30–40 కి.మీ. దూరంలో ఉన్న గ్రామాల ప్రజలు నిత్యం నగరానికి రాకపోకలు సాగిస్తుండటంతో క్రమంగా అంత పరిధిలో విస్తరించిన ఊళ్లకూ సిటీ బస్సు సర్వీసులు మొదలయ్యాయి.ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఉప్పల్, రాజేంద్రనగర్, కుషాయిగూడ, మిధాని, చెంగిచెర్ల, మేడ్చల్, మెహిదీపట్నం తదితర డిపోల నుంచి నగరం చుట్టూ ఉన్న గ్రామాలకు వందల సంఖ్యలో బస్సులు తిరిగేవి. సమ్మె తర్వాత ఖర్చుల నియంత్రణ పేరుతో అధికారులు భారీగా బస్సులు తగ్గించారు. ఒక్క హైదరాబాద్ జోన్ పరిధిలోనే దాదాపు వెయ్యి బస్సులు తొలగించారు. ఇదే సమస్యకు కారణమైంది. నగరానికి కాస్త దూరంగా ఉన్న గ్రామాలకు నడుస్తున్న బస్సుల్లో సింహభాగం తొలగించేశారు. సిటీకి 40 కి.మీ. పరిధిలో ఉన్న ఊళ్లలో ఎక్కువగా కూరగాయల సాగు ఉంది. వాటిని నగరంలోని రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లకు తరలిస్తారు. పెద్ద రైతులు ప్రైవేటు వాహనాలను ఎంగేజ్ చేసుకోగా, చిన్న రైతులు ఆర్టీసీ బస్సులనే నమ్ముకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా రైతుబజార్ల వేళలకు సరిపడే సమయాల్లో సరీ్వసులు నడిపేది. ఇప్పుడు బస్సులు రద్దు కావడంతో వారు గత్యంతరం లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. సాధారణ ప్రజలూ ఆటోలు, జీపులపై ఆధారపడాల్సి వచి్చంది. ఇప్పుడు ఒక్కసారిగా వాటిసంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. బస్సులున్నప్పుడు ఆర్టీసీ ఛార్జీలకు దాదాపు సమంగా వీరు వసూలు చేసేవారు. ఇక బస్సుల్లేవని తేలిపోవటంతో ఒక్కసారిగా రేట్లను పెంచేశారు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో వాటి వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదీ కారణం.. నగరం నుంచి గ్రామాలకు తిప్పుతున్న ఆర్టీసీ బస్సులకు కి.మీ.కు నిర్వహణ వ్యయం రూ.55గా ఉంటోందని ఆర్టీసీ లెక్కలు తేలి్చంది. కానీ ఆదాయం రూ.35 లోపే ఉంటోంది. అంటే కి.మీ.కు రూ.20కి పైగా నష్టం వస్తోందని అంటోంది. ఇందులో సిబ్బంది జీతాల వాటా రూ.27 దాకా అవుతోంది. డీజిల్ రూ.18గా ఉంది. మిగతాది ఇతర నిర్వహణ వ్యయం. గ్రామీణాభివృద్ధిలో బస్సు.. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజా రవాణాతో అనుసంధానమై ఉండటం కూడా ముఖ్యం. నగరానికి చేరువగా ఉన్న వాటికి ఇది మరింత కీలకం. ఇప్పుడు దాన్ని చెరిపేసినట్లయింది. గ్రామీణాభివృద్ధి నిధుల నుంచి నష్టాన్ని భర్తీ చేయాలనే వాదన చాలా కాలంగా ఉంది. మెట్రో రైలుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచి్చనట్లుగానే ఆర్టీసీ గ్రామీణ సరీ్వసులకు కూడా ఇవ్వాలన్న సిఫారసు ఉంది. డీజిల్పై పన్ను తగ్గించడం ద్వారా గానీ.. సిటీ ఆపరేషన్స్ రెవెన్యూలో 5 శాతం, జిల్లా రెవెన్యూలో 7 శాతం చొప్పున వసూలు చేస్తున్న మోటారు వాహన పన్నులో కొంత మినహాయింపు ఇవ్వడం ద్వారా గానీ ఈ సాయం చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం సర్వీసులు రద్దు దిశగా.. అద్దె బస్సుల్లో సిబ్బంది జీతాల భారం చాలా తక్కువగా ఉండటం, కండక్టర్ జీతాన్ని ఆరీ్టసీనే భరిస్తుండటంతో అద్దె బస్సుల నిర్వహణ వ్యయం తక్కువగా ఉండి వాటిని నడపగలుగుతున్నారు. క్రమంగా ఆర్టీసీ తన మొత్తం గ్రామీణ సరీ్వసులను రద్దు చేసే దిశగా యోచిస్తోంది. బస్సుల రద్దుతో మిగిలిన కండక్టర్లను బదిలీ చేస్తున్నారు. తాజాగా ఒక్క ఇబ్రహీంపట్నం డిపో పరిధిలోనే 25 మంది కండక్టర్లు దూర ప్రాంతాల డిపోలకు బదిలీ అయ్యారు. ఇందులో మహిళా కండక్టర్లను దూరంగా ఉన్న హెచ్సీయూ డిపోకు మార్చారు. అంత దూరం వెళ్లి రావడానికి వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. -
ఆర్టీసీ బస్సుల అద్దె పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే కిలోమీటరుకు 20 పైసలు చొప్పున బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ, తాజాగా సొంత బస్సులను ప్రైవేటు కార్యక్రమాలకు అద్దెకు ఇచ్చేందుకు గాను చార్జీలను పెంచింది. పెంచిన రవాణా చార్జీలను పరిగణనలోకి తీసుకుని ఈ ధరలను సవరించింది. పల్లెవెలుగు మొదలు స్లీపర్ సర్వీసు వెన్నెల వరకు అన్ని కేటగిరీల బస్సు హైర్ చార్జీలను పెంచింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, యాత్రలు, ప్రైవేటు కార్యక్రమాలకు బల్క్ గా బుక్ చేసుకుంటే ఆర్టీసీ సొంత బస్సులను కేటాయిస్తోంది.వీటికి శ్లాబ్ పద్ధతిలో ఛార్జీలు విధిస్తుంది. కనిష్టంగా 8 గంటలు–200 కి.మీ.లు. గరిష్టంగా 24 గంటలు–480 కి.మీ. పద్ధతిలో ఆ ధరలు ఉంటాయి. ఆక్యుపెన్సీ రేషియో ఆధారంగా సాధారణ సమయాలు, పీక్ సమయాలుగా పేర్కొంటూ వేరువేరు రేట్లు ఉంటాయి. ఇప్పు డు వాటిని ఆర్టీసీ పెంచింది. కిలోమీటరుకు పల్లెవెలుగుకు సాధారణ సమయాల్లో రూ.40, కీలక (పీక్) వేళల్లో రూ.44, ఎక్స్ప్రెస్ రూ.47, రూ.49, డీలక్స్ (దీనికి ఒకటే ధర) రూ.49, సూపర్లగ్జరీ రూ.50 గా నిర్ధారించింది. వజ్ర బస్సులను తొలగించాలని నిర్ణయించినప్పటికీ, అవి కొనసాగినన్ని రోజులు అమలుచేసేలా వాటి ధరలను కూడా సవరించింది. సిటీ బస్సులకు విడిగా ధరలు కేటాయించింది. కనిష్టంగా 6 గంటలు–90 కి.మీ., గరి ష్టంగా 16 గంటలు–240 కి.మీ. ప్రాతిపదికన ఉన్నాయి. అన్ని బస్సుల కాషన్ డిపాజిట్మొత్తాలను పెంచింది. మిగతా నిబంధనలు యథావిధిగా ఉంచింది. ఇలా భారీ ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ భావిస్తోంది. ఆదివారం నుంచే కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. -
యాత్రల పేరిట ఆర్టీసీపై మరో పిడుగు..
సాక్షి, అమరావతి : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (ఏపీఎస్ఆర్టీసీ) పోలవరం ప్రాజెక్టు యాత్రలు పెనుభారంగా మారాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరం యాత్రకు ఉచిత సర్వీసులను నడిపిస్తుండడంతో నష్టాలు రెట్టింపువుతున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రతిరోజూ పోలవరానికి వందకు పైగా సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. ఇందుకు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటిదాకా పైసా కూడా ఇవ్వలేదు. బకాయిలు చెల్లిస్తే తప్ప పోలవరం యాత్రకు బస్సులు నడిపించలేమని యాజమాన్యం తేల్చి చెబుతోంది. జలవవనరుల శాఖ నుంచి బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ అది అతీగతీ లేకుండా పోయిందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులను రద్దు చేసి మరీ పోలవరం యాత్రకు బస్సులు నడిపిన ఆర్టీసీ ఇటీవలి కాలంలో ప్రజా రవాణాలో తన వాటా కొంత కోల్పోయినట్లు సమాచారం. గతంలో ప్రజా రవాణాలో ఆర్టీసీకి 38 శాతం వాటా ఉండేది. ఇప్పుడది 35 శాతానికి పరిమితమైనట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పోలవరం యాత్రలను సైతం లెక్కల్లో చూపించి ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగిందని అధికారులు నమ్మబలుకుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం విధిస్తున్న మోటార్ వాహన పన్ను, డీజిల్పై విధిస్తున్న వ్యాట్ వంటివి ఆర్టీసీకి పెను శాపంగా మారాయి. ఆర్టీసీలో ప్రతి టిక్కెట్ ఆదాయంపై 7 శాతం పన్నును ప్రభుత్వం వసూలు చేస్తోంది. గుజరాత్ మాదిరిగా దీన్ని 1 శాతానికి తగ్గించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. డీజిల్పై 17 శాతం‘వ్యాట్’ను వసూలు చేస్తోంది. పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా రాయితీ ఇవ్వడం లేదని ఆర్టీసి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రు.1000 కోట్లకు పైగా చేరిన నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ నష్టాలు రూ.1000 కోట్లు దాటాయి. అసలే అప్పుల్లో ఉన్న ఆర్టీసీని పోలవరం యాత్రలు మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. ప్రభుత్వం నుంచి రూ.35 కోట్ల బకాయిలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో పోలవరం యాత్రలకు బ్రేకులు వేయాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. -
ఉచిత సైబర్ బస్సు సర్వీసులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైబరాబాద్ పరిధిలో ఉచిత సైబర్ బస్సు సర్వీసులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ బస్సు సర్వీసులను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్ర మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత సైబర్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్ల ఆయన తెలిపారు. మూడు మార్గాల్లో ఈ సైబర్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్, కాలుష్యం నియంత్రణ కోసం ఈ బస్సు సర్వీసులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. -
ఔటర్ మార్గంలో బస్సు సర్వీసులు
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి రాకపోకలు సాగించడానికి ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రవేశ పెట్టింది. ఈ రూట్లో రెండు బస్సు సర్వీసులు తిరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలకు కొంత వరకు ఇబ్బందులు తప్పాయి. పదేళ్ల క్రితం ఔటర్ రింగు రోడ్డు అందుబాటులోకి రాగా.. ఇప్పటి వరకు ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించలేదు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి రూట్లో రోజూ వేల సంఖ్యలో జనం వివిధ అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా ఔటర్ రింగు రోడ్డు మీద వెళ్లే క్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తుంది. శంషాబాద్ నుంచి మెహిదీపట్నం, నానల్నగర్ మీదుగా గచ్చిబౌలికి చేరుకునేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఈ మార్గంలో బస్సు సర్వీసులు నడుస్తుండడంతో ప్రయాణికులకు దూర భారం తగ్గిపోయింది. కేవలం గంటలోపు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ రూట్లోని గ్రామాలు, వివిధ ప్రాంతాల వారు సైతం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల వారు శంషాబాద్, గచ్చిబౌలి చేరుకోవడానికి పోలీస్ అకాడమీ వద్ద బస్సుల్లో ఎక్కుతున్నారు. ఇటు షాద్నగర్ వైపు నుంచి వచ్చే వారు శంషాబాద్ వద్ద బస్సుల్లో ఎక్కి నేరుగా గచ్చిబౌలి చేరుకుంటున్నారు. ప్రతి అరగంటకు ఈ రూట్లో బస్సు సర్వీసు నడుస్తుండడంతో ప్రయాణికులకు వెసులుబాటు కలిగింది. అయితే ఈ బస్సు శంషాబాద్ నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్, పోలీస్ అకాడమీ, నార్సింగి, నానక్రామ్గూడ మీదుగా ఔటర్ సర్వీసు మార్గంలో గచ్చిబౌలికి రాకపోకలు సాగిస్తుంది. దీంతో ఈ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వారు ఈ బస్సు సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. -
బస్సులు తిప్పుతాం : ఆర్టీసీ ఆర్ఎం
అనంతపురం న్యూసిటీ : అఖిలపక్ష పార్టీలు సోమవారం బంద్కు పిలుపునిచ్చినా ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిప్పుతామని ఆర్ఎం చిట్టిబాబు ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
సిరొంచాకు బస్సు ట్రయల్ రన్
వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు కాళేశ్వరం : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచాకు ఆర్టీసీ బస్సు ట్రయల్ రన్ను భూపాలపల్లి డిపో మేనేజర్ రఘు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెన మీదుగా సిరొంచాకు భూపాలపల్లి బస్సును నడిపారు. సిరొంచా నగర పంచాయతీ మేయర్ రాజీవ్ పెద్దపల్లి ఆర్టీసీ అధికారులకు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆనందం వ్యక్తంచేశారు. అనంతరం డీఎం రఘు మాట్లాడుతూ.. అధికారుల ఆదేశాలతో హైదరాబాద్ నుంచి సిరొంచాకు నడిపేందుకు ట్రయల్రన్ నిర్వహించామన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ అధికారి సరస్వతి, సూపరింటెండెంట్ శ్రీహరి, టీఎంయూ నాయకులు తిరుపతి, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
రాత్రిళ్లూ బస్సు సర్వీసులు
ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి గుంటూరు (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులు, ఉచిత బస్సుల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయనే దానిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి శనివారం స్వయంగా పుష్కర్నగర్లోని బస్సుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రయాణీకులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి పది గంటల నుంచి సత్తెనపల్లి, పెదకూరపాడుతోపాటు ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేందుకు బస్సులు అందుబాటులో ఉండటం లేదని వారు చెప్పారు. రాత్రి వేళల్లో కూడా పుష్కరనగర్ల వద్ద అన్ని ప్రాంతాలకు బస్సులను అందుబాటులో ఉంచాలని కోరారు. దీంతో స్పందించిన ఆర్ఎం శ్రీహరి రాత్రి వేళల్లో 50 బస్సులు అదనంగా ఉంచి అవసరమైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రి వేళల్లో కూడా పుష్కరనగర్ వద్ద కంట్రోలర్ను ఏర్పాటు చేశామన్నారు. -
మరికల్ నుంచి పుష్కరాలకు బస్సు సర్వీసులు
ధన్వాడ : కష్ణా పుష్కరాల సందర్భంగా నారాయణపేట ఆర్టీసీ అధికారులు శనివారం మరికల్ బస్టాండ్ నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది శ్రీశైలమ్మ, కేఆర్ గౌడ్, కేవీఆర్గౌడ్ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్ధం మరికల్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి 12రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. కష్ణ, పస్పుల, జూరాల ఘాట్లతో పాటు అధిక శాతం ప్రయాణికులు కోరుకున్న పుష్కర ఘాట్లకు తీసుకెళ్లేందుకు కూడా అవకాశం కల్పించారని తెలిపారు. -
పుష్కరాలకు 905 బస్సులు
అదనంగా అందుబాటులో మరో 500 బస్సులు 3,500 మంది సిబ్బందితో విధులు నిర్వహణ ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి వెల్లడి కృష్ణా పుష్కరాల్లో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి నది పరీవాహక ప్రాంతాలకు బస్సు సర్వీసులను నడపనున్నది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సంస్థ అధికారులు పూర్తి చేశారు. పట్నంబజారు (గుంటూరు) : పుష్కరాల సందర్భంగా 905 బస్సులతో సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ రీజియన్ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. అదనంగా రీజయన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి 500 బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. గుంటూరు రీజియన్లోని డిపో 1, సత్తెనపల్లి, క్రోసూరు, మంగళగిరి నుంచి అమరావతికి 193 బస్సు సర్వీసులు నడపనున్నారు. అన్ని డిపోల నుంచి విజయవాడకు 140 బస్సులు, విజయపురి సౌత్కు 110, తాళ్ళాయపాలెంకు 26, కష్ణా గోదావరి సంగమ ప్రదేశానికి 20, శ్రీశైలానికి 79, పెనుమూడికి 10, చిన్న చిన్న ఘాట్ల వద్దకు 201 బస్సులను నడపనున్నారు. నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, కడప రీజియన్ల నుంచి మరో 300 బస్సులు రానున్నాయి. 3,500 మంది సిబ్బంది సేవలు.. బస్సు సర్వీసులను నడిపేందుకు 3,500 మంది సిబ్బందిని సంస్థ కేటాయించింది. దీంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించటానికి మరో 500 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే సిబ్బందికి ఎక్కడికక్కడ పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక బస్స్టేషన్లు.. ప్రయాణికులకు మార్గ సూచన, మరుగుదొడ్లు వినియోగం, తాగునీటి సౌకర్యాలు, విశ్రాంతి కోసం ఆర్టీసీ రీజియన్ అధికారులు తాత్కాలిక బస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. గుంటూరు నగరంలోని పాత ఆర్ఎం కార్యాలయం, ఉల్ఫ్ హాల్ గ్రౌండ్స్, గోరంట్ల, అమరావతిలో 3, విజయవాడలో 3, సత్తెనపల్లిలో 3 తాత్కాలిక బస్ స్టేషన్లు ఉంటాయి. వీటితో పాటుగా తాత్కాలిక కంప్యూటర్ కేంద్రాలు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అప్పటికప్పుడు టిక్కెట్ ఇచ్చే విధంగా ఆంధ్ర ముస్లిం కళాశాల, పెదకాకాని, చినకాకానితో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషానికో బస్సు సర్వీసు.. గుంటూరు జిల్లాలోని కష్ణా పరీవాహక ప్రాంతాలకు 12 రోజుల పాటు నిమిషాల వ్యవధిలో బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. విజయవాడ, అమరావతి, విజయపురిసౌత్, సీతానగరాలకు ప్రతి నిమిషానికి ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది. గుంటూరు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి రోజుకు సగటున 2 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాలకు సిద్ధంగా ఉన్నాం.. ఈ నెల 12న ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాలకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని కష్ణా పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాం. ఆయా ఘాట్లకు ఉన్న రద్దీలను బట్టీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి ఘాట్ వద్ద ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుని ముందుకు సాగుతాం. సిబ్బందికి సైతం శిక్షణా తరగతులు నిర్వహించాం. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సన్నద్ధమయ్యారు. – జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ ఆర్ఎం -
రైట్..రైట్
12.5 శాతం వేతన పెంపునకు సర్కార్ అంగీకారం సమ్మె విరమించిన ఆర్టీసీ ఉద్యోగులు కదిలిన బస్సులు బెంగళూరు: అటు రాష్ట్ర రవాణాశాఖ ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం పట్టు సడలించడంతో బుధవారం ‘బస్సు’ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో మూడు రోజులుగా ప్రభుత్వ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 35 శాతం వేతన పెంపు ప్రధాన డిమాండ్గా ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర రవాణాశాఖలోని నాలుగు విభాగాలకు చెందిన 1.25 లక్షల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. మొదట్లో 8 శాతం అటుపై 10 శాతం కంటే వేతన పెంపు సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వం.,. బుధవారం సాయంత్రం ఉద్యోగుల సంఘం నాయకులతో జరిపిన చర్చల అనంతరం 12.5 శాతం పెంచడానికి అంగీకరించింది. 35 శాతం కంటే తక్కువకు ఒప్పుకునేది లేదని చెబుతూ వస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు కూడా పట్టు సడలించి ప్రభుత్వ సూచనకు ఒప్పుకున్నారు. దీంతో మూడు రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరపడింది. ఫలితంగా బెంగళూరు సీటీ సర్వీసులైన బీఎంటీసీ బస్సులు బుధవారం సాయంత్రం నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా మిగిలిన మూడు విభాగాలకు చెందిన బస్సులు గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇక మూడు రోజులుగా విధులకు గైర్హాజరైన ఉద్యోగుల జీతాల్లో కోత వేస్తున్నట్లు కేఎస్ఆర్టీసీ ఎం.డీ రాజేంద్రకుమార్ కటారియా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమ్మె వల్ల రోజుకు సగటున రూ.21 కోట్ల లెక్కన మూడు రోజులకు దాదాపు రూ.63 కోట్ల ఆదాయానికి గండిపడినట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆర్టీసీకి మాయరోగం!
- నాలుగున్నర వేల మంది కార్మికులకు అనారోగ్యమట - ఆ పేరుతో మూకుమ్మడి సెలవులు - 19న కార్మిక సంఘం ఎన్నికలుండటంతో ప్రచారంలో కార్మికులు.. సెలవు కోసం ‘అనారోగ్యం’ పేరుతో డ్రామా - జబ్బు పడ్డట్టు ఆర్టీసీ ఆసుపత్రి నుంచే సర్టిఫికెట్లు - అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్టిఫికెట్లు ఇప్పిస్తున్న కార్మిక సంఘాల నేతలు.. చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు - రాష్ట్రవ్యాప్తంగా 15% వరకు నిలిచిపోయిన బస్సు సర్వీసులు - ఇబ్బందుల్లో ప్రయాణికులు.. ఆదాయం కోల్పోతున్న ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి ఒక్కసారిగా జబ్బు చేసింది! ఎంతగా అంటే కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగున్నర వేల మంది కార్మికులు ‘సిక్’ అయ్యేంత!! తాము అనారోగ్యంతో బాధపడుతున్నందున విధులకు హాజరు కాలేమంటూ వారంతా డిపో మేనేజర్లకు లేఖలు పంపారు. వారు నిజంగానే అనారోగ్యానికి గురయ్యారంటూ హైదరాబాద్లోని ఆర్టీసీ ఆసుపత్రి, జిల్లాల్లో దానికి అనుబంధంగా ఉన్న డిస్పెన్సరీలు సర్టిఫై చేసేశాయ్. దీంతో డిపోల్లో ఒక్కసారిగా డ్రైవర్లు, కండక్టర్లకు కొరత వచ్చి పడింది. ఉన్న సిబ్బందితో డబుల్ డ్యూటీలు చేయించినా సరిపోక దాదాపు 15%బస్సులు డిపోల్లేనే ఉండిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాక ఆర్టీసీకి ఆదాయం కూడా పడిపోయింది. ఇంతకూ అంతమంది కార్మికులు ఒక్కసారిగా ఎందుకు జబ్బు పడ్డారో తెలుసా? ఈ నెల 19న ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలున్నాయి. వాటికి ప్రచారం చేయటం కోసం అన్ని యూనియన్ల నేతలు వారితో సెలవు పెట్టించారు. అదీ ఆర్టీసీకి పట్టుకున్న ‘మాయరోగం’ కథ! అనారోగ్యం లేకుండానే సర్టిఫికెట్లెలా? తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంఘాలు ప్రచారంలో మునిగిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో సంయుక్తంగా గుర్తింపు పొందిన టీఎంయూ, ఈయూలు ఈసారి విడిగా పోటీచేస్తుండగా, చీలికతో రెండు వర్గాలుగా ఉన్న ఎన్ఎంయూ ఒక్కటిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మిక సంక్షేమ నిధులను ఆర్టీసీ వాడుకుని కార్మికులకు బకాయిపడింది. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావటంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గతంలో ఎన్ఎంయూ కీలక నేతగా ఎదిగిన మహమూద్ అవినీతి ఆరోపణలతో అరెస్టయ్యారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఎటుమొగ్గుతారో తెలియని గందరగోళం నెలకొంది. దీంతో సంఘాలు ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. ఇందుకు కార్మికుల అవసరం కావటంతో ఆయా సంఘాలు తమకు అనుకూలంగా ఉన్నవారిని గుర్తించి సెలవులు పెట్టించి ప్రచారంలోకి దింపాయి. దీంతో అనారోగ్యానికి గురయ్యామంటూ లీవులు పెట్టారు. సంస్థ కార్మికులు అనారోగ్యానికి గురైతే ఆర్టీసీ ఆసుపత్రి వైద్యులు నిర్ధారిస్తూ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. యూనియన్ నేతలు ఆర్టీసీ ఆసుపత్రి, జిల్లాల్లో దానికి అనుబంధంగా ఉండే కేం ద్రాలపై ఒత్తిడి తెచ్చి కార్మికులకు సిక్ సర్టిఫికెట్లు జారీ చేయిస్తున్నా రు. నాలుగైదు రోజుల్లో ఏకంగా 4500 మంది ఇలా ప్రచారం బాటపట్టారు. ఆగిపోయిన బస్సులు సాధారణంగా ప్రతి డిపోలో సిబ్బంది సెలవులు, ఇతర కారణాలతో నిత్యం ఐదారు బస్సులు నిలిచిపోతుంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఒక్కో డిపోలో రోజూ 15 నుంచి 20 వరకు బస్సులు నిలిచిపోవాల్సి వస్తోంది. నగరంలోని ఓ డిపోలో గురువారం సాయంత్రానికి వంద మంది కార్మికులు సెలవులో వెళ్లిపోయారు. దీంతో గురువారం 30 మంది కార్మికులతో డబుల్ డ్యూటీ చేయించినా 15 బస్సులు ఆగిపోవాల్సి వచ్చింది. మిగతా డిపోల్లో కూడా కాస్త అటూఇటూగా ఇదే పరిస్థితి నెలకొంది. అటు గ్రామాల్లో కూడా కొన్ని ఊళ్లకు బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సెలవు పెట్టే వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇది ఆదాయంపైనా ప్రభావం చూపుతోంది. చోద్యం చూస్తున్న యాజమాన్యం ఇలా ఎన్నికల వేళ ప్రచారం కోసం సెలవులు పెట్టడం కొత్తకాదు. గతంలో ఎన్నికల సమయంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలా మూకుమ్మడి సెలవులు రాకుండా చూసేవారు. ముందుగానే తార్నాక ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేసేవారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొందరు కార్మికులకు సర్టిఫికెట్లు ఇవ్వటానికి నిరాకరిస్తే ఓ యూనియన్ నేత బస్భవన్కు వెళ్లి ఉన్నతాధికారి ఒకరితో ఆసుపత్రికి ఫోన్ చేయించి మరీ సర్టిఫికెట్లు ఇప్పించాడని ప్రచారం జరుగుతోంది. -
బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రులు
గోదావరిఖని(కరీంనగర్): కరీంనగర్ జిల్లా గోదావరిఖని బస్డిపోలో నూతన బస్సు సర్వీసులను మంత్రులు ప్రారంభించారు. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో డిపోనకు కొత్తగా మంజూరైన 10 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులతోపాటు తిరుపతికి ఏసీ బస్సును మంత్రులు ఈటల రాజేందర్, పట్నం మహేందర్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు. -
అదనపు బస్సుల కోసం విద్యార్థుల ధర్నా
కూడేరు: సకాలంలో మరిన్ని ఆర్డినరీ బస్సులను నడపాలని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు అనంతపురం జిల్లా కూడేరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతపురం, ఉరవకొండల మధ్య మరిన్ని ఆర్డినరీ బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. సకాలంలో బస్సులు రాక, మోతాదుకు మించి బస్సులలో ప్రయాణం చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోయారు. ఆలస్యంగా కాలేజీలకు వెళ్లడం వల్ల క్లాసులు నష్టపోతున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ ధర్నాలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్రీశైల క్షేత్రానికి మరిన్ని సర్వీసులు
శ్రీశైల మహాక్షేత్రానికి మరిన్ని బస్సు సర్వీసులను కొనసాగిస్తామని ఆత్మకూరు ఆర్టీసీ డిపో నూతన డీఎం హుసేన్ సాహెబ్ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో సోమవారం నంద్యాల నుంచి ఆత్మకూరుకు బదిలీపై వచ్చిన ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు డిపో నుంచి గతంలో ఉన్న శ్రీశైలం - బెంగుళూరు, శ్రీశైలం - చెన్నై బస్సులతో పాటు నంద్యాల - శ్రీశైలం, కర్నూలు - శ్రీశైలం బస్సు సర్వీసులతో పాటు అదనంగా మరిన్ని పల్లె వెలుగు బస్సుసర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. -
'అన్ని డిపోల నుంచి అమరావతికి బస్సులు'
కోవెలకుంట్ల (కడప): కొత్త రాజధాని అమరావతికి రానున్న రోజుల్లో అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.రామారావు తెలిపారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రెండు నెలల్లో కడప ఆర్టీసీ రీజియన్కు 40 కొత్త బస్సులు రానున్నట్లు తెలిపారు. కర్నూలు, అనంతపురం రీజియన్లకు 60 కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే అనంతపురం రీజియన్ రూ.23 కోట్లు, కర్నూలు రీజియన్ రూ.19 కోట్లు, కడప రీజియన్ రూ.15 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షితుల్ని చేసేందుకు కర్నూలు జిల్లాలో 70, కడప జిల్లాలో 45, అనంతపురం జిల్లాలో 60 ప్రయాణికుల కూడళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ నరసింహులు, ఈడీ పర్సనల్ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ బంద్..నిలిచిపోయిన బస్సులు
-
రోడ్డెక్కని ఆర్టీసీ
సమ్మెకు దిగిన 6400 మందికి పైగా కార్మికులు,ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన 1100 బస్ సర్వీసులు రోజుకు రూ.కోటికి పైగా నష్టం ఆందోళనలో అధికారగణం పట్నంబజారు (గుంటూరు) : సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఇచ్చిన పిలుపునకు అన్ని యూనియన్లు మద్దతు ఇవ్వడంతో జిల్లాలోని ప్రగతి చక్రాలకు బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సమ్మెకు ఎన్ఎంయూ సైతం మద్దతు ప్రకటించింది. దీంతో బుధవారం తెల్లవారు జాము నుంచి జిల్లాలోని ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలం కావటంతో సమ్మె అనివార్యమైందని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మంగళవారం తెలిపారు. ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బాసటగా నిలవటంతో, డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. రోజుకు రూ. కోటి నష్టం... గుంటూరు రీజియన్ పరిధిలోని ఉద్యోగులు, కార్మికులు మొత్తం 6400 మందికి పైగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె కారణంగా సంస్థకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ భవిష్యత్ దృష్ట్యా తప్పటం లేదని యూనియన్ నాయకులు చెబుతున్నారు. రీజియన్ పరిధిలో ఆర్టీసీకి రోజుకు రూ. కోటి మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పలు సంఘాల మద్దతు ... నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న కార్మికుల విషయంలో యాజమాన్యం, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈయూ సమ్మెకు పిలుపునిచ్చింది. మరో ప్రధాన యూనియన్ నేషనల్ మజ్దూర్ (ఎన్ఎంయూ)తో పాటుగా అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిత్యం రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి 1275 సర్వీసులు తిరుతున్నాయి. కార్మికులు సమ్మెకు దిగుతుండటంతో సుమారు 1100 పైగా బస్సులు నిలిచిపోతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 6,400 మంది కార్మికుల్లో ఈయూలో 2, 800 మంది, ఎన్ఎంయూలో 2,700 మంది ఉండగా, మిగిలిన వారు వివిధ సంఘాల్లో ఉన్నారు. ఈయూ నాయకులు గత నెల 2వ తేదీన సమ్మె నోటీసులు జారీ చేశారు. సమ్మెలో 13 డిపోల కార్మికులు, నాయకులు పాల్గొనాలని తీర్మానించారు. దీంతో పూర్తి స్థాయిలో బస్సులు నిలిచిపోయే అవ కాశం కూడా ఉంది. ప్రత్యామ్నాయం కోసం అధికారుల ప్రయత్నాలు...? కార్మికులు సమ్మెకు సిద్ధం కావడంతో బస్సులు నడపటం కోసం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కార్మిక సంఘాల నేత లు మాత్రం ఒక్క బస్సును కూడా డిపోల నుంచి కదలనివ్వబోమని తేల్చిచెప్పారు. -
తమిళనాడుకు తిరిగి ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు
చిత్తూరు: ఆర్టీసీ ఎట్టకేలకు ఆంధ్రా నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ప్రారంభించింది. తమిళనాడు ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీ జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సు సర్వీసులని తిరిగి పునరుద్ధరించింది. శేషాచలం ఎన్కౌంటర్ ఫలితంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గత కొంత కాలంగా ఎక్కువవుతూ వచ్చాయి. తమిళనాడులో ఏపీ బస్సులపై తరచు దాడులు జరుగుతుండటం, దాంతో ఏపీఎస్ ఆర్టీసీ తన సర్వీసులను నిలిపివేయడం తెలిసిందే. అయితే.. తమిళనాడు బస్సులు మాత్రం యథేచ్ఛగా తిరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట తమిళనాడు బస్సులను ఏపీ గ్రామాల్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ అధికారులు కూడా గత కొన్ని రోజులుగా తమిళనాడు ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నించినా సానుకూల స్పందన కరువైంది. గ్రామస్తుల ఆగ్రహం, ఆర్టీసీ అధికారుల విన్నపాల నేపథ్యంలో శనివారం తమిళనాడు ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీ జరిపిన చర్చలు సఫలం కావడంతో తిరుమల వచ్చి వెళ్లే భక్తులకు ఊరట కలిగినట్లయింది. ఆర్టీసీ చాలా రోజుల నుంచి తమిళనాడుకు వెళ్లే సర్వీసులను రద్దుచేసింది. దాంతో సంస్థకు ఇప్పటికే దాదాపు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. -
మోడల్ స్కూళ్లకు బస్సు సర్వీసులు
అనకాపల్లి-విశాఖ మధ్య 7 ఏసీ బస్సులు కాంప్లెక్స్ల్లో ప్రతి నెలా స్వచ్ఛభారత్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎ.రామకృష్ణ అనకాపల్లి/చోడవరం: జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన మోడల్ స్కూళ్లు ఉన్న ప్రాంతాల మీదుగా బస్సు సర్వీసులు వేస్తున్నామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎ.రామకృష్ణ చెప్పారు. అనకాపల్లి, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్లను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడు తూ, మోడల్ స్కూళ్లు ఉన్న మరుపాక, తేగాడ, నర్సీపట్నం నుంచి వ యా శరభవరం, వ డ్డిప, తోటకూరపాలెం-తట్టబంద రూట్లలో బస్సు సర్వీసులు వేస్తున్నామన్నారు. ఆ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులతోపాటు వారి కుటుంబ సభ్యుల రాకపోకలను దృష్టిలో పెట్టుకొని ఈ సర్వీసులు నడుపుతున్నామని చెప్పా రు. అనకాపల్లి-విశాఖ మధ్య ఏడు ఏసీ వాల్వో బస్సులను నడపనున్నట్లు తెలి పారు. అనకాపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ గతనెలలో విజయనగరంజోన్కు రూ.2.5 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాకినాడ నుంచి చెన్నైకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కడప, పొద్దుటూ రు, శ్రీశైలం రీజియన్ పరిధిలో సౌకర్యాలను మెరుగుపరిచామన్నారు. డిమాం డ్ అధికంగా ఉన్న ప్రాంతాలలో నూతనంగా బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి నెలా 16న ఆర్టీసీ డిపోలు, కాంప్లెక్స్ల్లో స్వచ్ఛభారత్ నిర్వహిస్తామన్నారు. అనకాపల్లి కాంప్లెక్స్ ఆవరణలో మొక్కలను నాటారు. చోడవరం కాంప్లెక్స్లో మరుగుదొడ్ల నిర్వాహకులు నిర్దేశించిన రుసుం కంటే అదనం గా వసూలు చేస్తున్నట్టు తెలియడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి రూ. 500 జరిమానా విధించారు. ఆర్టీసీ కాం ప్లెక్స్లను పరిశుభ్రంగా ఉంచేలా ప్ర యాణికులు సహకరించాలని కోరారు. రద్దీగా ఉండే రూట్లలో అదనపు బస్సు లు నడిపేందుకు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రధాన పట్టణాలకు అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎప్పకప్పుడు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో బస్సులు నడుపుతున్నామన్నారు. చోడవరం -విజయనగరం సర్వీసును పరిశీ లిస్తామన్నారు. ఆయనతోపాటు ఆర్టీసీ డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ జీవన్ ప్రసాద్, జిల్లా రీజనల్ మేనేజర్ జగదీష్బాబు, అనకాపల్లి అసిస్టెంట్ మేనేజర్ రమణమ్మ పాల్గొన్నారు. ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యం యలమంచిలి: విశాఖపట్నం-యలమంచిలికి త్వరలో ఏసీ వాల్వో బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణ చె ప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెం చడంతో పాటు ప్రయాణికులకు ప్రత్యేకంగా అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. బుధవారం యలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంప్లెక్స్ పరిసరాలు,మరుగుదొడ్లు పరిశీలించారు. ప్ర యాణికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి 7.30 గంటలు దాటితే యలమంచిలి నుంచి పాయకరావుపేటకు బస్సు లు అందుబాటులో లేవని, హైదరాబా ద్ వెళ్లేందుకు గతంలో ఉన్న సర్వీసును కూడా నిలిపివేసిన సంగతిని కొందరు ఆయన దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే లగ్జరీ సర్వీసును బుధవారం సాయంత్రం నుంచే యలమంచిలి కాంప్లెక్స్కు వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ వా హనాల వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోందన్నారు. ఆర్టీఏ అధికారులతో మాట్లాడి ప్రైవేట్ వాహనాల ఇష్టారాజ్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. -
‘తూర్పు’పై కడలి కన్నెర్ర
సముద్రంలో కలసిన 50 ఇళ్లు, మరో 25 గృహాలు ధ్వంసం సామర్లకోటలో చెట్టు మీదపడి ఒకరి మృతి సాక్షి ప్రతినిధి, కాకినాడ: హుదూద్ తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతం లోని మత్స్యకార గ్రామాలపై మాత్రం కడలి కన్నెర్ర చేసింది. తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్ సహా 16 మండలాల్లోని 78 గ్రామాల్లో ఈ తాకిడి కనిపించింది. ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేటలో శనివారం రాత్రి నుంచే ఉవ్వెత్తున ఎగసిపడ్డ కెరటాలు కారణంగా దాదాపు 50 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. మరో 25 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటిలో పక్కా ఇళ్లు, పూరిళ్లు కూడా ఉన్నాయి. 150 కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. మత్స్యకారుల చేపల షెడ్లు, బోట్లు, వలలు కొట్టుకుపోయాయి. ఈ ఒక్క గ్రామంలో జరిగిన నష్టం రూ. కోటి పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. కాగా, ఉప్పాడ బీచ్రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట గ్రామాల్లోకి సముద్రపు నీరు వచ్చింది. ఆ గ్రామాల నుంచి సుమారు 5,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తొండంగి మండలంలో సముద్రం 30 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చింది. పాత చోడిపల్లిపేట, కోదాడ, ఎ.కొత్తపల్లి, పెరుమాళ్లపురం తదితర ప్రాంతాల్లో రెండు మీటర్ల మేర తీరం కోతకు గురైంది. పలు చోట్ల భారీ వక్షాలు నేలకూలాయి. సామర్లకోట పట్టణంలో నేరేడు చెట్టు మీదపడి నేమాని వెంకట్రావు(60) మృతి చెందాడు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరి, అరటి పంటలకు తీవ్రం నష్టం వాటిల్లింది. జిల్లా మొత్తమ్మీద 31,804 మందిని 67 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి వీస్తున్న బలమైన ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లాలో పజలు అవస్థలు పడాల్సి వచ్చింది. రైళ్లు, అంతర్ జిల్లాల బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. 16వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేయడంతో ఇటు విశాఖపట్నం, అటు విజయవాడ వైపు రోడ్లు బోసిపోయాయి. జిల్లా అంతటా ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాకినాడ పోర్టులో మూడో రోజు ఆదివారం కూడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉప ముఖ్యమంత్రి ఎన్. చినరాజప్ప, కలెక్టర్ నీతూ ప్రసాద్ కలెక్టరేట్ నుంచి జిల్లాలో పరిస్థితిని సమీక్షించారు. -
హైఅలర్ట్
పరప్పన అగ్రహార జైలు ఎదుట అన్నాడీఎంకే కార్యకర్తల ఆందోళన పోలీసుల లాఠీచార్ వాహనాలపై రాళ్లు రువ్విన అభిమానులు దాదాపు ఐదు వందల మంది అరెస్ట్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్ సర్వీసులు పరిస్థితిని సమీక్షించిన నగర సీపీ ఎం.ఎన్. రెడ్డి బెంగళూరు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసులో శనివారం ఇక్కడి ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో బెంగళూరు నగర శివార్లలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రత్యేక కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నేపథ్యంలో అన్నా డీఎంకు చెందిన వేలాది మంది కార్యకర్తలు తమిళనాడు నుంచి బెంగళూరు చేరుకున్నారు. దీంతో పోలీసులు అసాధరణ భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో అన్నాడీఎంకే అభిమానులు మూడు రోజుల క్రితమే బెంగళూరు చేరుకున్నారు. ఈ మేరకు శనివారం అన్నా డీఎంకే కార్యకర్తల ఆందోళనలతో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలు పరిసరాలు అట్టుడికాయి. ఇక్కడి జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు..తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుపై తీర్పు ఇచ్చింది. జయకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించినట్లు న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెంటనే...అప్పటికే అక్కడకు వందలాదిగా చేరుకున్న అన్నా డీఎంకే కార్యకర్తలు నిర్వేదానికి గురయ్యారు. అన్నా డీఎంకే శాసన సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఓ దశలో కార్యకర్తలు బ్యారికేడ్లను దాటుకొని కోర్టు ఆవరణలోకి చొచ్చుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రెచ్చిపోయిన కార్యకర్తలు చుట్టు పక్కల వెళ్తున్న వాహనాలపైకి రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు ఆందోళన కారులను వెంటాడి తరితరిమి కొట్టారు. దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేసి బీఎంటీసీ బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరో వైపు జయలలితకు మద్దతుగా హొసూరు రోడ్డు, హొసరోడ్డు, హొసరోడ్డు జంక్షన్. పరప్పన అగ్రహార, అత్తిబెలే, చందాపుర తదతర చోట్ల అభిమానులు, అన్నా డీఎంకే కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు. రోడ్లపై టైర్లు వేసి నిప్పంటించారు. డీఎంకే అధినేత కరుణానిధికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ జయలలిత అక్రమాస్తులపై తీర్పు నేపథ్యంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన పరప్పన జైలు పరిసర ప్రాంతంలో పోలీసుశాఖ శనివారం ఉదయమే కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ విధించింది. జయలలిత దోషి అని కోర్టు ప్రకటించిన వెంటనే కోర్టు పరిసర ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని సమీక్షించిన నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి 144 సెక్షన్ను ఐదు కిలోమీటర్లకు పొడిగించారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పరప్పన అగ్రహార జైలు పరిసరాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్రూం సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో పోలీసు భద్రత జయలలిత అక్రమాస్తులపై కోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని అత్తిబెలే ప్రాంతంలో పోలీసులు భద్రతను పెంచారు. శనివారం వేకువ జామునుంచి అన్నా డీఎంకే కార్యకర్తలు మకాం వేశారు. వారు బెంగళూరు నగర శివార్లలోకి రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు అక్కడే మకాం వేసి పరిస్థితి చేయిదాటకుండా చర్యలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల సర్వీసులు రద్దు జయలలిత కేసు తీర్పు నేపథ్యంలో అల్లర్లు చెలరేగుతాయని భావించిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు రెండు ప్రాంతాల మధ్య బస్ సర్వీసులు రద్దు చేశారు. తమిళనాడుకు వెళ్లే కేఎస్ఆర్టీ బస్సు సర్వీసులు నగరంలోనే నిలిపివేశారు. అదేవిధంగా బెంగళూరుకు రావాల్సిన బస్సులను తమిళనాడులోనే నిలిపివేశారు. బెంగళూరు గట్టి బందోబస్తు బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలలో తమిళ సోదరులు నివాసం ఉంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అలజడులు, ఆందోళనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మఫ్టీ పోలీసులు రహస్యంగా వీడియో చిత్రీకరణ చేపట్టారు. -
డీయూ విద్యార్థులకు త్వరలో ప్రత్యేక బస్సు సేవలు
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విద్యార్థులకు శుభవార్త. ఉత్తర, దక్షిణ ప్రాంగణాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు త్వరలో ప్రత్యేక బస్సు సేవలు అందనున్నాయి. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రతినిధుల బందం కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయమంత్రి కిషన్పాల్ గుజ్జార్ను కలిసింది. విద్యార్థులకోసం ప్రత్యేక బస్సు సేవలు అందించాలని కోరుతూ ఆయనకు ఓ వినతిపత్రం సమర్పించింది. ఇందుకు మంత్రి కి షన్పాల్ సానుకూలంగా స్పందించారు. త్వరలో సేవలను ప్రారంభిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఏబీవీపీ కార ్యదర్శి రోహిత్ చహాల్ వెల్లడించారు. కాగా నగరంలోని ఆయా మెట్రో స్టేషన్ల వద్దనుంచి ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ)కి చెందిన మూడు బస్సులు ఉత్తర ప్రాంగణానికి విద్యార్థులను చేరవేస్తున్నాయి. కాగా డీయూకి అనుబంధం గా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 78 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. -
నేడు పరిమితంగానే బస్సులు
సాక్షి, హైదరాబాద్: సమగ్ర సర్వే నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ప్రకటించటం, సర్వే సిబ్బంది వచ్చేసరికి కుటుంబ సభ్యులు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో బస్సులు నడపాల్సిన అవసరం లేదని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో మంగళవారం ప్రజల అవసరాల కోసం ఎక్కడా బస్సులు నడపటం లేదని ప్రకటించింది. కేవలం సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్ల వెసులుబాటు కోసం ఉదయం, రాత్రి వేళల్లో పరిమితంగా మాత్రమే బస్సులు తిప్పనున్నారు. వాటిలో సాధారణ ప్రయాణికులను కూడా అనుమతిస్తారు. అయినప్పటికీ వీలైనంతవరకు ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆర్టీసీ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బస్సులు నడపాల్సిన అవసరం లేదని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి వెల్లడించారు. సర్వే రోజున బస్సులు నడుస్తాయని తాను ప్రకటించినట్టుగా కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త అవాస్తవమని స్పష్టంచేశారు. కాగా, హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి 11 గంటల వరకు సిటీ బస్సులు తిరుగుతాయి. ఉదయం, రాత్రి వేళ నాలుగు గంటల చొప్పున బస్సులు తిప్పాలని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు కోరడంతో ఆర్టీసీ ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఎన్యూమరేటర్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా పలు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా బస్సులు బుక్ చేసుకున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్కు 100, ఖమ్మంకు 120, రంగారెడ్డికి 120, నిజామాబాద్కు 350, కరీంనగర్ జిల్లాకు 250 చొప్పున బస్సులను కేటాయించారు. ప్రత్యేక రైళ్లేవీ? సాధారణంగా ఒకేసారి భారీ సంఖ్యలో ప్రజలు ఊళ్లబాట పడితే ప్రత్యేక రైళ్లు నడపటం కద్దు. కానీ సమగ్ర సర్వే సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఒక్క ప్రత్యేక రైలు కూడా నడపలేదు. ‘‘ఒక ప్రాంతానికి కాకుండా ప్రజలు వారివారి సొంతూళ్లకు పయనమయ్యారు. అలాంటప్పుడు ఏ ప్రాంతానికని అదనపు రైళ్లు నడుపుతాం. ఇలాంటప్పుడు బస్సులే సౌకర్యంగా ఉంటాయి. పైగా ఈ సర్వే కోసం ప్రజలు ఎక్కువగా బస్సులపైనే ఆధారపడ్డారు. రైళ్లను ఎంచుకున్నవారు తక్కువ. సికింద్రాబాద్ నుంచి నిత్యం 58 వేల మంది అన్రిజర్వుడు బోగీల్లో ప్రయాణిస్తుంటారు. ఆదివారం ఈ సంఖ్య 64 వేలు మాత్రమే. అంటే ప్రయాణికుల సంఖ్య పెరిగింది కేవలం 10 శాతం మాత్రమే. వీటిని దృష్టిలో ఉంచుకునే ప్రత్యేక రైళ్లు నడపలేదు’’ అని ఓ రైల్వే సీనియర్ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. కానీ ఈ లెక్కలెలా ఉన్నా ఆది, సోమవారాల్లో సికింద్రాబాద్ స్టేషన్ కిటకిటలాడింది. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్లకు ప్రత్యేక రైళ్లను నడపాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. -
ప్రమాదం అంచున ప్రయాణం.
పట్నంబజారు (గుంటూరు) : అధికారులు అన్ని విషయాల్లో నిబంధనలు అంటూ మంకుపట్టు పట్టడం వివేకం అనిపించుకోదు. కొన్నికొన్ని విషయాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నెలవారీ పాసులు ఎక్స్ప్రెస్ బస్సుల్లో చెల్లవు. కానీ ఉదయం వేళల్లో విద్యార్థులు కళాశాలలకు వెళ్లే సమయంలో ఉన్న ప్యాసింజర్ సర్వీసులు చాలక ఫుట్పాత్లపై వేలాడుతూ ప్రమాదం అంచున ప్రయాణం చేస్తుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు నగరం పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. కొందరు కళాశాలల బస్సుల్లో వెళుతున్నా... అలా వీలుపడని వారికి ఆర్టీసీ బస్సులే శరణ్యం. ఆటోలైతే మరీ డేంజరు... కదా అని ఆర్టీసీ బస్సు ఎక్కుదామంటే నెలవారీ పాసుల వారికి ఎక్స్ప్రెస్ బస్సులు నిషిద్ధం. ఇక గతిలేక ఊపిరాడని రద్దీలో పల్లెవెలుగు బస్సులోనే ప్రయాణం తప్పనిసరి. భావి భారత ఇంజినీర్లకు ఇక్కడ నుంచే కష్టాలు మొదలవుతాయి. ఈ బస్సుల్లో ప్రయాణం దినదినగండమే. ఆ రోజు క్షేమంగా చేరితే చేరినట్టు. చాలీచాలని సర్వీసులు... విద్యా సంవత్సరం ప్రారంభమైంది. నిత్యం వందలాది మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న కళాశాలలు, పాఠశాలలకు వెళుతుంటారు. వీరిలో అత్యధిక శాతం మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. అయితే పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. విద్యార్థులు ఫుట్పాత్లపై నిలబడి ప్రయాణం చేస్తూ ప్రాణాలనే పణంగా పెట్టి ప్రయాణం చేస్తున్నా... పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి నిత్యం ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు వందలాది మంది విద్యార్థులు కళాశాలలకు వెళుతుంటారు. కొంతమంది విద్యార్థులు ఆటోల్లోనూ, మరికొంతమంది కళాశాల బస్సుల్లోనూ ప్రయాణం చేస్తుండగా, అధిక శాతం మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. తెనాలి, న రసరావుపేట, చిలకలూరిపేట, నల్లపాడు, ప్రత్తిపాడు, విజయవాడ ప్రాంతాల్లో అధికంగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఉదయం సమయంలో ఆయా ప్రాంతాలకు అధికంగా సర్వీసులు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలకు ఆలస్యం అయిపోతోందన్న తొందర్లో ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. పల్లె వెలుగు బస్సుల్లోనే విద్యార్థులను అనుమతిస్తామని చెప్పడం, ఆ సమయంలో పల్లె వెలుగు బస్సు సర్వీసులు సరిపడా ఉండకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు చెప్పినా... పట్టించుకోని సిబ్బంది ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎక్స్ప్రెస్ బస్సుల్లో సైతం కొద్దిమొత్తాన్ని చెల్లించి విద్యార్థులను తీసుకుపోవాలని చెబుతున్నా, సిబ్బంది మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి చెందిన విద్యార్థి ఇలాగే ఫుట్పాత్పై నిలబడి జారిపడి ప్రాణాలను కోల్పోయాడు. అప్పట్లో విద్యార్థులంతా బైపాస్లో రాస్తారోకో నిర్వహించి అధికారుల తీరును ఎండగట్టారు. ప్రత్తిపాడు సమీపంలోని పుల్లడిగుంటలో ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థి ఫుట్పాత్ మీద నుంచి కిందపడి గాయాలపాలైన సంఘటన ఇటీవలి కాలంలోనే జరిగింది. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు విద్యార్థులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో బస్సుల సర్వీసులను పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. నెలవారీ పాసులు ఉన్న విద్యార్థులను కళాశాలల సమయంలో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ అనుమతి కల్పించాలని కోరుతున్నారు. గతంలో జరిగిన పరిణామాలను చూసైనా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, కేవలం ఆర్భాటపు ప్రకటనలు చేయకుండా, కార్యాచరణపై దృష్టి సారించాలని కోరుతున్నారు. సర్వీసులను పెంచుతున్నాం విద్యార్థుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలవైపు సర్వీసులను పెంచేందుకు దృష్టి సారిస్తున్నాం. ఇప్పటికే చిలకలూరిపేట మార్గంలో సర్వీసులను అభివృధ్ధి పరిచాం. నరసరావుపేట, తెనాలి, విజయవాడ మార్గాల్లో అధికారుల ద్వారా సర్వే నిర్వహించి సర్వీసుల పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. విద్యార్థులను ఎక్స్ప్రెస్ల్లో అనుమతించని కండక్టర్, డ్రైవర్లపై చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడబోం. ఏడు రూపాయలు చెల్లించి ఎక్స్ప్రెస్ బస్సుల్లో విద్యార్థులు ప్రయాణించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయిలో సర్వీసులను అధికం చేయనున్నట్టు తెలిపారు. - పి.వి.రామారావు, ఆర్ఎం, ఆర్టీసీ -
సిటీ బస్సులు..మూణ్నాళ్ల ముచ్చటేనా?
- రద్దయిన బస్సు సేవలు - పునరుద్ధరించాలని ప్రయాణికుల డిమాండ్ రామడుగు, న్యూస్లైన్: కరీంనగర్ పట్టణానికి సమీప గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రవేశపెట్టిన సిటీ బస్సులు మూ ణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. గత నవంబర్లో అప్పటి ఆర్టీసీ చైర్మన్ ఎం. సత్యనారాయణరావు ప్రారంభించా రు. వీటిని కరీంనగర్ నుంచి తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కరీంనగర్ నుంచి కొత్తపలి, వెదిర గ్రామాలకు, మానకొండూర్ నుంచి పద్మనగర్ వరకు సర్వీసులను ప్రారంభించారు. గత ఏప్రిల్ చివరి వరకే బస్సులు నడిచాయి. ప్రస్తుతం ఈ సిటీ బస్సుల జాడ కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎమ్మెస్సార్ స్వగ్రామం వెదిర వరకు సిటీబస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ అధికారులు నవంబర్ 12 నుంచి సిటీ బస్సులను పొడిగిం చారు. వీటితో ఈ రూట్లోని గ్రామస్తులకు సౌకర్యవంతంగా ఉన్నాయి. ప్రస్తుతం రద్దు చేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర పనులకు కరీంనగర్ వెళ్లే వారికి అవస్థలు తప్పడం లేదు. కనిపించని ఆర్డినరీ బస్సులు కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి గుండా ఆర్డినరీ బస్సులు ఆధికారులు అంతంత మాత్రంగానే నడిపించడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారిపై గుండా కేవలం మూడు ఆర్డినరీ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నా రు.బస్సులు లేకపోవడంతో ఆటోల్లో రాకపోకలు సాగిస్తున్నామని వెదిరకు చెందిన సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసీ ప్రవేశపెట్టిన సిటీ బస్సులను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వెదిర, దేశరాజ్పల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. -
బెంగళూరు నగర బస్సు సర్వీసులు చార్జీలు పెరిగాయి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు నగర బస్సు సర్వీసులు ‘బీఎంటీసీ’లో గురువారం అర్ధరాత్రి నుంచి చార్జీలు పెరిగాయి. సగటున 15 శాతం మేరకు పెంచారు. డీజిల్ ధర పెంపుతో పాటు కార్మికులకు డీఏ పెంచిన నేపథ్యంలో చార్జీలను పెంచడానికి అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గురువారం నుంచి నియమావళిని ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద చార్జీల పెంపునకు అనుమతినిచ్చింది. ఇదే బాటలో ఆర్టీసీ బస్సు చార్జీలూ పెరగనున్నాయి. విద్యుత్ చార్జీల పెంపునకు కూడా రంగం సిద్ధమవుతోంది. -
ఈ రోజులు మాకొద్దు.. రాదు.. పోదు.. కదలదు
బస్సుల కోసం పడిగాపులు పడే జనం.. బస్సొస్తే పొలోమంటూ పరుగెత్తే విద్యార్థులు.. జీపులో జనమున్నారో.. లేక జనం మధ్యలో జీపుందో తెలియనంతగా కిక్కిరిసే ప్రైవేటు వాహనాలు.. ఇటువంటి దృశ్యాలు పల్లెల్లో నిత్యకృత్యమయ్యాయి. ఎప్పుడొస్తుందో తెలియని బస్సు కోసం గంటల కొద్దీ నిరీక్షించలేని పల్లెవాసులు ‘ప్రైవేటు’ బాట పడుతుండగా.. ‘లాభం’ లేదని ఆర్టీసీ ట్రిప్పులు తగ్గించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రజలు అష్టకష్టాలపాలవుతున్నారు. ఆర్టీసీని నమ్ముకోలేక.. అలాగని ప్రయాణాలు వాయిదా వేసుకోలేక ప్రమాదం అంచునే ప్రయాణిస్తున్నారు. నరకానికి డైరెక్ట్ రూట్లుగా మారిన రోడ్లు.. రావడమే గొప్పన్నట్టు ముక్కుతూ ములుగుతూ వచ్చే బస్సులు చచ్చీచెడీ మధ్యలో మొరాయిస్తే.. బతుకు బస్టాండే! బస్సుకోసం ఎదురుచూసీ.. చూసీ యాష్టకొచ్చి జీపులో ఓ ఇరవై మంది.. టాపుపై మరో 15మంది ప్రాణాలు గాల్లో దీపాలని తెలిసినా.. గమ్యం చేరాలంటే తప్పదుగా మరి! స్కూలుకో, కాలేజీకో వెళ్లాలంటే చెమటోడ్చాల్సిందే ‘పల్లెవెలుగు’తో రూపురేఖలు మార్చేస్తాం అంటారు పాలకులు.. దండిగా పాసులిచ్చేస్తారు.. మరి బస్సులేవయ్యా అంటే రోడ్డులేదంటారు.. రోడ్డుంటే ‘ఆక్యుపెన్సీ’ లేదంటారు. ఆ రూట్లో ‘లాభం’ లేదంటూ ‘ప్రైవేటు’కు దన్నుగా నిలుస్తారు. ‘పల్లె వెలుగు’లు నింపడం లేదని.. ఆటోలు.. జీపుల సాకుతో ఆ ఒక్కటీ ఊడబెరుకుతారు, కాదు.. కూడదంటే డొక్కుబస్సులేస్తారు మరి ఏమైపోవాలి విద్యార్థులు?.. ఎక్కడికెళ్లాలి ఊరి జనం? స్వతంత్ర భారతావనిలో ఇంకా రోడ్డులేని.. బస్సురాని ఊళ్లా? చాలు.. ఈ రోజులు మాకొద్దు.. ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టేద్దాం. - సాక్షి నెట్వర్క్. బుట్టలల్లకపోతే బువ్వ లేదు! వృత్తి పథం: మేదరులు: నాకు అరవయ్యేళ్లు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తే కానీ బువ్వ దొరకదు. ఒకట్రెండ్రోజులు కాదు... పుట్టింటి నుంచి వచ్చిన 44 ఏళ్ల నుంచి ఇదే కష్టమే. నా భర్త పరమేశు.. నేను ఇద్దరమే. పిల్లల్లేరు. నిద్ర లేచినప్పటి నుంచి నా మొగుడు పనిలోకి దిగితే, నేను ఇంటి పనులు, వంట చేస్తాను. తర్వాత నా మొగుడితో పాటే పని చేస్తా. సాయంత్రానికి నాలుగు పప్పు గంపలు అల్లుతా. ఆ నాలుగు కలిపి రూ.300కు అమ్ముతాం. ఇందులో సగం పెట్టుబడికి పోతే మిగిలిన డబ్బుతో ఇల్లు గడుస్తుంది. అప్పట్లో దబ్బల రేటు తక్కువగా ఉండేది. దీంతో డబ్బు మిగిలేది. సరుకు కర్నూలు జిల్లాలోని అహోబిలం నుంచి వస్తుంది. వెదురుబొంగు రూ.60 ప్రకారం కొంటాం. రూ.20 వేలకు పైగా పెడితే కానీ అక్కడి నుంచి సరుకు తెచ్చుకోలేం. సరుకు దొరకనప్పుడు కూలి పనులకు వెళ్తాం. ఎంత కష్టపడుతున్నా రూపాయి కూడా మిగలట్లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు గొంతుక్కూర్చొని పని చేస్తుండటంతో ఒళ్లంతా నొప్పులు పుడుతున్నాయి. అయినా బతకడం కోసం చేయాల్సిందే కదా! మాకెలాంటి ప్రభుత్వ సాయమూ అందడం లేదు. ఇంతకుముందు మైదుకూరుకు చెందిన కొంతమంది వ్యక్తులు సొసైటీలో ఉన్న సొమ్మంతా తినేశారు. కష్టాల్లో ఉన్న మా లాంటి వాళ్లను నాయకులు ఆదుకోవాలి. అలాంటి వారికే ఓటేస్తాం. - రాగం లక్ష్మమ్మ, ప్రొద్దుటూరు, వైఎస్సార్ జిల్లా -
నిబంధనలు పాటించని బస్సులపై కేసులు
గన్నవరం, న్యూస్లైన్ : నిబంధనలకు విరుద్ధంగా బస్సు సర్వీసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఉప రవాణాశాఖ కమిషనర్ సిహెచ్.శివలింగయ్య పేర్కొన్నారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అలిం డి యా పర్మిట్లు కలి గిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 225 ఉన్నాయన్నారు. వీటిలో 49 బస్సులకు సంబంధించి సర్వీసులు నడపలేమని యజమానులు పర్మిట్లను సరెండర్ చేశారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీ చేస్తున్న ప్రైవేటు బస్సులపై ప్రస్తుతం కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్నగర్జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు ప్రమాదం జరగకముందు స్టేజ్ క్యారేజీ చేస్తున్న 200 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. ఘటన అనంతరం ఇప్పటివరకు మరో 220 బస్సులపై కేసులు నమో దయ్యాయన్నారు. ఈ కేసులకు సంబంధించి బస్సుల యాజమానులు, డ్రైవర్లను కోర్టుల్లో హాజరుపరచగా, జరిమానాలు చెల్లించి బయటకు వస్తున్నారని తెలి పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం స్టేజ్ క్యారేజీ చేస్తున్న బస్సుల పర్మిట్లను మూ డు నెలల పాటు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.305 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ. 165 కోట్లు మాత్ర మే వచ్చిందని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం, పన్నులు సక్రమంగా వసూలు కాకపోవడం ఇందుకు కారణాలని వివరించారు. ఇప్పటివరకు పన్నులు చెల్లించని వాహనాలకు సంబంధిం చి ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి సీజ్ చేస్తామని తెలిపారు. అవసరమైతే వాటి యాజమానులపై రెవె న్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పారు. హై సెక్యూరిటీ నెంబరు ప్లేట్ల విధానాన్ని త్వరలో జిల్లాలో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి నంబరు పేట్ల తయారీ బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించామని, 2015 డిసెంబరు నాటికి జిల్లాలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబరు ప్లేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని శివలింగయ్య వివరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీజ్ గరికపాడు (జగ్గయ్యపేట) : గరికపాడు ఆర్టీఏ చెక్పోస్టు వద్ద శుక్రవారం వేకువజామున నిర్వహించిన తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సును సీజ్ చేసినట్లు చెక్పోస్టు ఇన్చార్జి మృత్యుంజయరాజు తెలి పారు. ఆరంజ్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా తనిఖీ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీసు నిర్వహిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తనిఖీల్లో వెహికిల్ ఇన్స్పెక్టర్లు నాయుడు, సోనిప్రియ, రాంబాబునాయక్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు. -
నష్టాల తగ్గింపుపై దృష్టి
సాక్షి, ముంబై: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) నష్టాలు వస్తున్న రూట్లలో బస్సు సేవలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెరిగిన డీజిల్, విడిభాగాల ధరలు, ఉద్యోగుల జీతాల పెంపు, బకాయిలు చెల్లింపు కారణంగా సంస్థపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ఫలితంగా భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. చాలా మార్గాల్లో కలెక్షన్లు లేక బస్సులన్నీ ఖాళీగా తిరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. దీంతో సంస్థను గట్టెక్కించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఆదాయం లేని రూట్లలో విడతల వారీగా బస్సు సేవలు రద్దు చేయడం, రాత్రి వేళల్లో ట్రిప్పులు వేసే బస్సుల చార్జీలు కొంతమేర తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో సంస్థ పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తున్న విషయం తెలిసిందే. 2012లో రూ.292 కోట్లు నష్టాలను చవిచూసింది. 2013లో ఈ నష్టం రూ.428 కోట్లకు చేరుకుంది. ఇది ఏటా పెరుగుతూనే ఉంది. ప్రైవేటు వాహనాల పోటీని ఎదుర్కొనేందుకు ఎమ్మెస్సార్టీసీ చేసిన అనేక ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ వాహనాల కారణంగా ఆర్టీసీకి ప్రయాణికులు దొరకడమే కష్టతరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల కారణంగా 23 వేల ట్రిప్పులకు అసలు ఆదాయమే రావడం లేదు. వీటి కారణంగా ఈ ఏడు ఆర్టీసీకి రూ.330 కోట్ల నష్టం వాటి ల్లింది. సంస్థ నష్టాల బాటలో కూరుకుపోవడానికి ప్రైవేటు వాహనాలే ప్రధాన కారణమని తేలింది. ఈ నేపథ్యంలో రాబడి తక్కువగా నమోదవుతున్న రూట్లలో మెల్లమెల్లగా బస్సులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సు కిలోమీటరు దూరం ప్రయాణానికి రూ.25 చొప్పున ఖర్చవుతుంది. అయితే అనేక రూట్లలో కిలోమీటరుకు రూ.తొమ్మిది మాత్రమే ఆదాయం వస్తోంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా బస్సులు నడపాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారి ఒకరు అన్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్య తిరిగే లగ్జరీ, సెమీ-లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సుల చార్జీలు ఈ నెల 15 నుంచి కొంతమేర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతీ స్టేజీకి రూ.6.95 వసూలు చేస్తున్నారు. దీన్ని రూపాయి వరకు తగ్గించనున్నారు. ఇలా ప్రతీ ఆరు కిలోమీటర్లకు రూపాయి చొప్పున చార్జీలు తగ్గనున్నాయి. అయితే ఈ నెల 15, ఆ తరువాత తేదీల ప్రయాణానికి ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగ్గింపు చార్జీల మొత్తాలను ప్రయాణ సమయంలో కండక్టరే బస్సులో చెల్లిస్తాడని అధికారులు వెల్లడించారు. -
ఐటీ కారిడార్లో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు: ఏకే ఖాన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు విస్తరించిన ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు, సర్వీసులు నడపాలని, రాత్రి సర్వీసుల సమయాన్ని పొడిగించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ వెల్లడించారు. ఐటీ కంపెనీలు కోరితే వారి ఉద్యోగుల కోసం ప్రత్యేక సర్వీసులతోపాటు, అద్దెకు కూడా బస్సులను అందజేస్తామని తెలిపారు. ఐటీ కారిడార్ పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చే అంశంపై ఐటీ సంస్థల ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులతో సీఎం కిరణ్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఐటీ కారిడార్లో 2 లక్షల మంది పనిచేస్తుండగా వారిలో 40% మంది ప్రజారవాణా ద్వారానే ప్రయాణిస్తున్నారని, వీరి సౌకర్యార్థం ఆర్టీసీ రోజూ 300 బస్సులతో 4 వేల ట్రిప్పులు నడుపుతోందని తెలిపారు. నగరం నలుమూలలతోపాటు దగ్గరలోని ఎంఎంటీఎస్ స్టేషన్లతో బస్సులను అనుసంధానిస్తామని చెప్పారు. -
రైళ్లు,బస్సుల రాకపోకల పై అల్పపీడన ప్రభావం
-
సగానికి పడిపోయిన శ్రీవారి ఆదాయం