chandrasekhar
-
చంద్రబాబూ.. ఇంత బరితెగింపా?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని.. విషం చిమ్మే నాయకుడంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎందుకింత కక్ష అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసింది విద్వేషపూరిత వ్యాఖ్యలు.. మేం తలుచుకుంటే వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి మాట్లాడుతున్నారు’’ అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా?. పచ్చబిళ్ల పెట్టుకున్న వాళ్ల పనులు చేసిపెట్టమన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కొనసాగింపే చంద్రబాబు వ్యాఖ్యలు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా.. లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు.‘‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. కులం, మతం చూడకుండా జగన్ పాలన చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతా వివక్షే. రెడ్డి సామాజికవర్గంపై కక్ష సాధిస్తున్నారు. దళిత ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్, కేంద్రం స్పందించాలి’’ అని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.‘‘గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై ఎందుకు మీకింత పగ?. వెలిగొండ ప్రాజెక్ట్పై నిజాలు మాట్లాడే దమ్ముందా?. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్కు నిధులు కేటాయించకుండా మాటలు చెబుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నాం. ఎర్రగొండపాలెనికి మీ శాఖ ద్వారా ఏం చేశారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వెలిగొండను సందర్శించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని చంద్రశేఖర్ హితవు పలికారు. -
Chandrasekhar Reddy: లోకేష్ చాలెంజ్కి దిమ్మతిరిగే కౌంటర్
-
ఒకరు తీర్థయాత్ర.. ఒకరు విహారయాత్ర.. కొంచెం కూడా సిగ్గులేదా
-
‘గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ హామీల ఊసే లేదు’
తాడేపల్లి : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో(AP assembly sessions) భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్(abdul Nazeer) ప్రసంగంపై వైఎస్సార్ సీపీ పలు ప్రశ్నలు సంధించింది. అసలు గవర్నర్ ప్రసంగలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ఊసే లేకపోవడానికి కారణం ఏమిటో అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం ఆత్మ స్తుతి, పరనిందలా ఉందని విమర్శించింది.‘సీఎం చంద్రబాబు(Chandrababu Naidu).. గవర్నర్ ప్రసంగంలో పిట్ట కథలు చెప్పించారు. ప్రజలను ఎలా మోసం చేయాలో గవర్నర్ తో చెప్పించారు. విద్యా వ్యవస్థ సర్వ నాశనం అవుతున్నా.... లోకేష్ క్రికెట్ మ్యాచ్ కోసం దుబాయ్ వెళ్ళారు. మరొకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీర్థ యాత్రలు చేస్తారు. మంత్రి లోకేష్ ఆయన శాఖను పట్టించుకోరు.పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సిఎం పోస్టు రాజ్యాంగం లో ఉందా?, ఆరు శాతం ఓట్లు వచ్చిన జనసేన కు డిప్యూటీ సీఎం పదవి ఎలా వచ్చింది?, ప్రజా స్వామ్యం అంటే పవన్ కళ్యాణ్ కి తెలుసా PAC చైర్మన్ పదవి అనేది ప్రతి పక్ష పార్టీకి ఇవ్వాలి. జనసేన పార్టీ PAC చైర్మన్ పదవి ఎలా తీసుకున్నారు?2019 లో రెండు చోట్ల ఓడి పోయాక మూడు సంవత్సరాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అడ్రెస్ లేరు.భారత రాజ్యాంగం గురించి పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది. ఎల్లోమీడియా నా పై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ నన్ను తన పక్కన కుర్చీ వేసి కూర్చో బెట్టుకుంటారు. అది ఆయన మాకు ఇచ్చే గౌరవం. ఎల్లోగ్యాంగ్ ఈ సంగతి తెలుసుకుంటే మంచిది’ అని ఆయన స్పష్టం చేశారు. -
కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు: చంద్రశేఖర్
-
ఏపీలో రాజ్యాంగ రాజ్యానికి బదులు రాక్షస రాజ్యం నడుస్తోంది
-
సత్యవర్థన్ని పోలీసులే వేధించి నిర్బంధించారు: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుందని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలు, అరచకాలు పెచ్చరిల్లాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారని ఘాలు విమర్శలు చేశారు. గన్నవరం కేసులో సత్యవర్థన్ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావటం లేదు. కూటమి ప్రభుతం ఏర్పడిన తర్వాత దుర్మార్గాలు, అరాచకాలు పెరిగాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ దుర్మార్గానికి లక్ష్మి అనే మహిళ బలైంది. చివరికి ఆమె మీదనే రివర్స్ కేసు పెట్టించి పక్క రాష్ట్రాల పోలీసులతో అరెస్టు చేయించారు. రాష్ట్రంలో అరెస్టులే తమ లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారుగన్నవరం కేసులో సత్యవర్థన్ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారు. సత్యవర్ధన్ నిజంగా కిడ్నాప్ అయితే పోలీసులకు ఎలా దొరికాడు?. గన్నవరం కేసులో తనను సాక్షిగా పిలిచి, ఫిర్యాదుదారుడిగా చేశారంటూ సత్యవర్ధనే జడ్జికి చెప్పాడు. దీన్ని తట్టుకోలేక వల్లభనేని వంశీ మీద అక్రమంగా మరో కేసు పెట్టి జైలులో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుంది. కూటమి నేతలకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు. చట్టం, న్యాయం అంటే వీరికి గౌరవం లేదు.గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే వారిని పట్టించుకోవడం లేదు. పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారు. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలే తమ పార్టీ ఆఫీసుపై దాడి చేసుకున్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి ఏకంగా పోలీసుల మీద దాడులు చేయించాడు. వారి చేతిలో సీఐ కనకారావు గాయపడ్డారు. తర్వాత కేసు మొత్తాన్ని మార్చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసు మీద దాడి జరగటం, దగ్గర్లోనే అగ్ని ప్రమాదాలు జరగటంపై మాకు అనుమానాలు ఉన్నాయి. దోషులపై కనీస చర్యలు కూడా తీసుకోని చేతగాని ప్రభుత్వం ఇది. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం దగ్గర్నుంచి జైలు పాలు చేయటం వరకు అన్నీ ప్రభుత్వ పెద్దలే నిర్ణయిస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. -
వల్లభనేని వంశీకి 14రోజుల రిమాండ్.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రియాక్షన్
-
కూటమి ప్రభుత్వం పేదలకు ఏం చేసిందో చెప్పాలి
-
చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసింది?: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. నారా లోకేష్ సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీపై నారా లోకేష్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘‘ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. విద్యా శాఖలో లోకేష్ ఏం సంస్కరణలు చేశారో చెప్పాలి. స్కూళ్లలో డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయా?. ఇంగ్లీష్ మీడియంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉందా?. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశాం. గవర్నమెంట్ బడుల్లో చదివే విద్యార్థులు అంటే చంద్రబాబు ప్రభుత్వానికి చిన్నచూపు’’ అంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి‘‘రాష్ట్రంలో చీటింగ్ ప్రభుత్వం పాలన చేస్తోంది. ఒక్క కేబినెట్ మీటింగ్లో కూడా ప్రజా సంక్షేమ పథకాల ఊసులేదు. లక్షా 19 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పటం లేదు. అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పి, ఇప్పుడు ఒక్కటీ అమలు చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేస్తూ ప్రజల గురించి ఆలోచించటం మానేశారు. లోకేష్ మంత్రి అయ్యాక విద్యాశాఖ భ్రష్టు పట్టింది. ఈ రోజు వరకు టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్ల మీద ఖర్చు పెట్టటం తప్పు అని ఎల్లోగ్యాంగ్ మాట్లాడుతోంది..ఇంగ్లీషు మీడియాన్ని పేద పిల్లలకు దూరం చేశారు. లోకేష్ మాత్రం విదేశాల్లో ఇంగ్లీషు మీడియం చదివారు, మా పేదలకు మాత్రం ఇంగ్లీషును దూరం చేస్తున్నారు. చంద్రబాబుకే సంపద సృష్టి తప్ప పేద ప్రజలకు కాదని తేలిపోయింది. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు. దళిత ఉద్యోగులు, అధికారుల మీద కక్షకట్టి చర్యలు తీసుకుంటున్నారు. లోకేష్కి మిడిమిడి జ్ఞానం. అందుకే విశాఖకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేయలేదంటూ మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ కోసం స్థల సేకరణ నుండి వాల్తేరు డివిజన్ సాధించటం వరకు వైఎస్సార్సీపీనే పోరాటం చేసి సాధించింది. విశాఖకు మెట్రో రైలు డీపిఅర్ని సిద్ధం చేసింది మా ప్రభుత్వమే. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమలు మా హయాంలోనే వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం గీతం యూనివర్శిటీతో భూములను కబ్జా చేయించింది..రాజధానిలో తాత్కాలిక భవనాలను నిర్మించి దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దేశం మొత్తం మీద పెట్రోలు ధర చిత్తూరు జిల్లాలోనే అధికంగా ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే అధికంగా ధర ఉందంటే అయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లోకి వచ్చి చూస్తే వారి ఆగ్రహం ఎలా ఉందో తెలుస్తుంది’’ అని చంద్రశేఖర్ చెప్పారు. -
అప్పుడు తాలిబన్లు.. ఇప్పుడు కూటమి.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్
-
PAC ఛైర్మన్ ను ప్రతిపక్షానికే ఇవ్వాలి
-
PAC పదవిలో కూడా రాజకీయమా? కూటమి నిర్ణయంపై ఎమ్మెల్యే చంద్రశేఖర్
-
పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని.. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే ఖర్చులపై పీఏసీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు.ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. అందుకే పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇస్తారు. 1985-86లో టీడీపీకి 30 సీట్లే వచ్చినప్పటికీ ఏరాసు అయ్యపరెడ్డికి పీఏసీ ఛైర్మన్ ఇచ్చారు. వంద సంవత్సరాల పీఏసీ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఛైర్మన్గా వ్యవహరించారు. తగిన సంఖ్యా బలం లేకపోయినా పీఏసీ ఛైర్మన్గా ఇచ్చారు. బోఫార్స్ కుంభకోణం కూడా ఇదే పీఏసీ బయట పెట్టింది. స్పెక్ట్రం స్కాంని కూడా పీఏసీ ఛైర్మన్ మురళీ మనోహర్ జోషి బయటకు తీశారు. కోల్గేట్ కుంభకోణం వంటి అనేక అంశాలను పీఏసీనే బయటకు తీసింది’’ అని చంద్రశేఖర్ గుర్తు చేశారు.‘‘అలాంటి వ్యవస్థను ఏపీలో లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అప్పుడు అడ్డూ అదుపు లేకుండా స్కాంలు చేయొచ్చని భావిస్తున్నారు. ప్రతిపక్షానికి పదవి ఇవ్వనప్పుడు నామినేషన్ల వ్యవహారం ఎందుకు తెచ్చారు?. మా పార్టీ తరపున నామినేషన్ వేయటానికి వెళ్తే ఒక్క అధికారి కూడా అక్కడ లేరు. మూడు గంటలసేపు అక్కడ కూర్చోపెట్టి అవమానపరిచారు. మా హయాంలో ప్రతిపక్షానికే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చాం. హుందాగా మేము వ్యవహరించాం. కానీ అలాంటి హుందాతనం కూటమి ప్రభుత్వంలో లేదుఇదీ చదవండి: ‘లోకేష్ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. అందుకే ఆయనకి పీఏసీ ఛైర్మన్గా రాకుండా అడ్డుకున్నారు. మూడు కమిటీల్లో ఒక్కదానికి కూడా ప్రతిపక్ష సభ్యులను లేకుండా చేశారు. తద్వారా అడ్డగోలుగా దోపిడీ చేయాలని భావించారు. చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చారు. తాలిబన్లు మాత్రమే ఆ పదవిని వారి దగ్గర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా తాళిబన్ల బాటలోనే నడుస్తోంది. రాష్ట్రాన్ని తాలిబన్ల బాటలో నడిపిస్తున్నారు. దళిత నేతలకు రాష్ట్రంలో రక్షణలేదు. నందిగం సురేష్ని మూడు నెలలుగా జైలులో పెట్టి వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాదిగలపై ఇలాంటి వివక్ష తగదు’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
కేసులకు భయపడేది లేదు.. వైఎస్ జగన్ ను సీఎం చేసేదాకా తగ్గేదేలే
-
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై నాలుగు కేసులు నమోదు
యర్రగొండపాలెం/టెక్కలి/మంత్రాలయం/ పామూరు: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం ఎస్ఐ చౌడయ్య ఆయనకు మెమోలు అందజేశారు. మంత్రి లోకేశ్పై ట్వీట్ చేసిన కేసు ఒకటి కాగా, మరో మూడు కేసులు ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారి పెట్టిన కేసులుగా ఎస్ఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ గళం వినిపిస్తూనే ఉంటామని, ఇలాంటి కేసులకు బెదిరేది లేదన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడపై ఫిర్యాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలంటూ జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ సోమవారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుపై కేసు సోషల్ మీడియా యాక్టివిస్టులపై టీడీపీ కూటమి అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఎక్కడికక్కడ కేసులు పెడుతూనే ఉంది. సోమవారం రాత్రి మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం పోలీస్స్టేషన్లో టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు బగ్గు జయరామ్పై కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు. మరో సోషల్ మీడియా యాక్టివిస్టుకు రిమాండ్ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులపై పోస్టులు పెట్టిన వ్యక్తికి సోమవారం కనిగిరి జేఎఫ్సీఎం 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్ఐ కిషోర్బాబు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మల్కిపురానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు నానిబాబుపై పామూరుకు చెందిన మోషే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నానిబాబును ఆదివారం అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ చెప్పారు. -
ఏపీలో YSRCP నాయకులపై కూటమి సర్కారు వేధింపులు
-
కూటమి ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు: తాటిపర్తి
సాక్షి,ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కి పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్ వేదికగా నారా లోకేష్పై పెట్టిన పోస్టింగ్తో పాటు ఎన్నికల సమయంలో పెట్టిన నాలుగు కేసులకు సంబంధించి ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్నికుట్రలు చేసినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే కుట్రతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అన్నారు. -
ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే సత్తా లేదా?
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వానికి అసెంబ్లీలో వైఎస్సార్సీపీని ఎదుర్కొనే సత్తా లేదని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్ (యర్రగొండపాలెం), మత్స్యరాస విశ్వేశ్వరరాజు (పాడేరు), బూసినె విరూపాక్ష (ఆలూరు), రేగ మత్స్యలింగం (అరకు) అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఐదు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి, అరాచకాలు, హత్యలు, దోపిడీలు, మోసాలతో పాటు.. వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై తాము అసెంబ్లీలో ప్రశ్నిస్తే, సమాధానం చెప్పుకోలేమనే భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతోందని చెప్పారు. ప్రభుత్వం అదే కోరుకుంటోందా? ‘సభలో తమను ఎదుర్కొనే సత్తా లేదా? లేక మీ దుర్మార్గాలు బయట పడతాయని భయపడుతున్నారా?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సభలో రెండే పక్షాలు ఉన్నప్పుడు, విపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడే సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కుతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పీకర్కు లేఖ రాశారన్నారు.అయితే దానిని వారు పట్టించుకోక పోవడంతో హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. తమ పిటిషన్పై కోర్టు.. స్పీకర్ వివరణ కోరితే, కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని ఆక్షేపించారు. ఇప్పుడు కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు విపక్షాన్ని పిలవాలని.. కానీ తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అంటే ప్రతిపక్షం సభకు రాకూడదని కూటమి ప్రభుత్వం కోరుకుంటోందా? అని ప్రశ్నించారు.5 నెలలు.. రూ.57 వేల కోట్ల అప్పు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కూటమి ప్రభుత్వానికి ఐదు నెలలు ఎందుకు పట్టిందని, ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే ఏకంగా రూ.57 వేల కోట్ల అప్పు ఎందుకు చేశారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ నిలదీశారు. ఐదు నెలలుగా ప్రతి వ్యవస్థలో అధికారులను తమ ఏజెంట్లుగా మార్చుకుని అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై ప్రశ్నిస్తామనే భయంతోనే తాము అసెంబ్లీకి రాకూడదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. తాము రూ.14 లక్షల కోట్ల అప్పు చేశామని ఇన్నాళ్లూ చంద్రబాబు సహా, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్తో తేలిపోయిందని తెలిపారు. చివరకు అందులో సగం అప్పు కూడా చూపించలేకపోయారన్నారు.తాము అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై ఎల్లో మీడియా ద్వారా సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తుండటం దారుణం అన్నారు. అప్పులు 6.46 లక్షల కోట్లేనని ఇప్పుడు వాళ్లే చెబుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను సమగ్రంగా ప్రస్తావించడానికే ప్రతిపక్ష హోదా కోరుతున్నాము తప్ప సౌకర్యాల కోసం కాదని స్పష్టం చేశారు. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై బనాయిస్తున్న అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సంయుక్తంగా వెల్లడించారు.ఈ ప్రశ్నలకు బదులివ్వండి⇒ మీరిచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తామని భయమా?⇒ హామీలను తుంగలో తొక్కింది వాస్తవం కాదా?⇒ వైఎస్సార్సీపీకి ప్రతిపక్షహోదా ఇచ్చే దమ్ము, ధైర్యం లేదా?⇒ సభలో తగినంత సమయం ఇప్పిస్తామని స్పీకర్తో ప్రకటన చేయించగలరా?⇒ రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు, గంజాయి అందుబాటులోకి వచ్చింది నిజం కాదా?⇒ ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేయడం లేదా?⇒ రూ.57 వేల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారు?⇒ ఏకంగా ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి అరాచకానికి పాల్పడింది వాస్తవం కాదా?⇒ మీ అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టడం లేదా?⇒ రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ ఉందా? -
ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారు: Tatiparthi Chandrasekhar
-
అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ఉద్రిక్తత
-
Big Question: ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్.. పవన్ ఇప్పుడే నిద్ర లేచాడు..
-
జలాశయాల్లో ‘సికెంట్’ వినియోగించరు!
సాక్షి, హైదరాబాద్: ‘జలాశయాల నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగించరు. సికెంట్ పైల్స్ డిజైన్ల తయారీకి ప్రత్యేక నిబంధనలూ లేవు. మేడిగడ్డ బరాజ్కి సికెంట్ పైల్స్ ఎందుకు వాడారు?’అని కాళేశ్వరం బరాజ్లపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) మాజీ ఎస్ఈ కె.ఎస్.ఎస్.చంద్రశేఖర్కు శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో బరాజ్ల డిజైన్లపై కమిషన్ కీలక ప్రశ్నలను సంధించింది. దేశంలో జలాశయాల నిర్మాణాల్లో సికెంట్ పైల్స్ వినియోగంపై అప్పట్లో తమ వద్ద సమాచారం లేదని చంద్రశేఖర్ బదులిచ్చారు. ఇన్ఫ్రా, సముద్రపు తీర ప్రాజెక్టుల్లో వీటిని వినియోగిస్తున్నారన్నారు. వీటి డిజైన్లకు మార్గదర్శకాలు లేకపోవడంతో బ్రిటిష్ కోడ్ను అనుసరించామన్నారు. సికెంట్ పైల్స్పై నిర్ణయం ఫీల్డ్ ఇంజనీర్లు, ఎల్అండ్టీదే.. మేడిగడ్డ బరాజ్ పునాదు (ర్యాఫ్ట్)ల కింద షీట్పైల్స్కి బదులు సికెంట్ పైల్స్తో కటాఫ్ వాల్ నిర్మించాలని ప్రాజెక్టు క్షేత్ర స్థాయి ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నిర్ణయం తీసుకుందని చంద్రశేఖర్ తెలిపారు. ప్రాథమిక దశలో నాలుగు బోర్ రంధ్రాలు వేసి నిర్వహించిన మట్టి నమూనా పరీక్షల ఆధారంగా షీట్పైల్స్ను డిజైన్లలో ప్రతిపాదించామన్నారు. తర్వాత దశలో మరిన్ని బోర్ రంధ్రాలు వేసి పరీక్షలు నిర్వహించగా భూగర్భంలో కంకర మట్టి, ఇసుక రాళ్లు ఉన్నట్టు తేలడంతో షీట్పైల్స్ను వాడడం సాధ్యం కాదని క్షేత్ర స్థాయి ఇంజనీర్లు నివేదించారన్నారు. తాము ప్రత్యామ్నాయంగా డయాఫ్రమ్ వాల్కి డిజైన్లు ఇవ్వగా, క్షేత్ర స్థాయి ఇంజనీర్లు, ఎల్అండ్టీ ప్రతినిధులు సికెంట్ పైల్స్ వేసేందుకు డిజైన్లు కోరారన్నారు. సరైన షూటింగ్ వెలాసిటీని పరిగణనలోకి తీసుకున్నారా సీడీఓ విభాగం సరైన డిజైన్లు ఇవ్వకపోవడంతోనే మేడిగడ్డ బరాజ్లోని 7వ బ్లాక్ కుంగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని చంద్రశేఖర్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డిజైన్ల రూపకల్పన సందర్భంగా.. మేడిగడ్డ బరాజ్ నుంచి విడుదలయ్యే వరద వేగాన్ని (షూటింగ్ వెలాసిటీని) సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోలేదని, విడుదలైన వరద నేలను తాకే చోట మట్టికోతకు గురికాకుండా దిగువన సరిపడా నీటి నిల్వలతో టైల్పాండ్ ఉండాలనే ఆలోచన చేయలేదని కమిషన్ తప్పుబట్టగా, అందులో వాస్తవం లేదన్నారు. డిజైన్ల రూపకల్పన సందర్భంగా సరైన షూటింగ్ వెలాసిటీ, టైల్పాండ్ లెవల్ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో నేల కోతకు గురై మేడిగడ్డ బరాజ్ కుంగిందని ఓ మోడల్ స్టడీలో తేలడంతో కమిషన్ ఈ కీలక ప్రశ్నను లేవనెత్తింది. అధిక షూటింగ్ వెలాసిటీ ఉండనుందని క్షేత్ర స్థాయి ఇంజనీర్ల నుంచి తమకు లెక్కలు అందలేదన్నారు. వ్యాప్కోస్ నివేదికలోని లెక్కల ఆధారంగా సరైన టైల్పాండ్ లెవల్తోనే డిజైన్లను తయారు చేశామన్నారు. డీపీఆర్లో నీటి నిల్వ సామర్థ్యం లేదు.. మేడిగడ్డ బరాజ్ డీపీఆర్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని సూచించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చంద్రశేఖర్ తెలిపారు. వ్యాప్కోస్ ఇచి్చన హైడ్రాలజికల్ డేటాను హైపవర్ కమిటీ ఆమోదించిందని, దాని ఆధారంగానే డిజైన్లను తయారు చేశామని వివరించారు. సీఈ సీడీఓ ఇచి్చన డిజైన్లకు నిర్మాణ దశలో చేసిన మార్పులు గుర్తు లేదన్నారు. క్షేత్ర స్థాయి ఇంజనీర్ల సూచనతో బరాజ్ల ర్యాఫ్ట్ డిజైన్లలో మార్పులు చేసిచ్చామన్నారు. నీటి నిల్వ సామర్థ్యంపై క్షేత్ర స్థాయి ఇంజనీర్లు ఏమైనా సూచనలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, గుర్తు లేదన్నారు. 2డీ, 3డీ మోడల్ స్టడీస్ తర్వాత డిజైన్లలో మార్పులు చేయాల్సిన అవసరం రాలేదన్నారు. -
తెనాలిలో యువతిపై పెమ్మసాని అనుచరుడి పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తెనాలి రూరల్: టీడీపీకి చెందిన రౌడీషీటర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ యువతి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఆదివారం తెనాలిలో ఈ దారుణం చోటు చేసుకుంది. తెనాలి అయితానగర్కు చెందిన 26 ఏళ్ల యువతి ఓ స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ సెంటర్లో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం డ్యూటీకి వెళ్లిన బాధితురాలిని కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన రౌడీషీటర్ రాగి నవీన్ (కొంతకాలంగా తెనాలిలో నివాసం ఉంటున్నాడు) తన పుట్టిన రోజు అని నమ్మించి వెంట తీసుకువెళ్లాడు.కొద్ది గంటల అనంతరం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. అనంతరం అక్కడకు చేరుకున్న యువతి తల్లిదండ్రులు వైద్యుల సూచనల మేరకు మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎయిమ్స్ సహా పలు ప్రైవేటు వైద్యశాలలకు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకురాగా అక్కడి వైద్యులు గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు. వెంటిలేటర్పై ఉన్న బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు..తమ కుమార్తెపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటిపై పలు చోట్ల గాయాలున్నాయని.. మెడ, తల కమిలిపోయిందని, దాడి చేసి గాయపర్చినట్లు నల్ల మచ్చలు శరీరంపై ఉన్నాయని బాధితురాలి తల్లి విలపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పెమ్మసాని అనుచరుడిగా..బాధితురాలిపై దాడి చేసిన నిందితుడు నవీన్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల్లో పెమ్మసాని తరఫున ప్రచారం నిర్వహించాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నిస్సార్ బాషా తెలిపారు.పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలుగుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోందని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ముచ్చుమర్రి, హిందూపురం, పిఠాపురం, బద్వేలు, ఇప్పుడు తెనాలిలో మహిళలపై వరుసగా దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. -
ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్లో కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము గోల్మాల్ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో బాధిత ఖాతాదారులు గురువారం బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్థానిక బ్యాంకు బ్రాంచిలో కొన్నేళ్లుగా పలువురు ఫిక్స్డ్ (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు(ఆర్డీ) చేయడంతో పాటు గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఆర్డీకి సంబంధించి వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు వచ్చిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఒక్కొక్కరుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్ల విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజనల్ హెడ్ రమేశ్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో గతంలో బ్రాంచి మేనేజర్గా పనిచేసిన దూడ నరేశ్ చంద్రశేఖర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. డిపాజిట్లు రెన్యువల్ చేయకపోవడం, ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇతర సిబ్బంది హస్తంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14మంది బ్యాంకు ఖాతాదారులు పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు రూ.6.9కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్మాల్ జరిగిందని చెప్పారు. అంతేకాకుండా, మరో రూ.30 కోట్ల వరకు ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యందీనిపై జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, అది పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ "ఐసీఐసీఐ బ్యాంక్లో ఎల్లప్పుడూ కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశాం. బ్యాంకులో మోసాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం" అన్నారు -
ఆ ఐపీఎస్ ఓ క్రిమినల్.. బ్లాక్మెయిలర్
శివాజీనగర: ఏడీజీపీ చంద్రశేఖర్ ఒక బ్లాక్ మెయిలర్, క్రిమినల్, అతడు తోటి ఉద్యోగులకు రాసిన లేఖను చక్కగా తయారు చేశారు. సరైన సమయంలో దీనికి సమాధానం ఇస్తానని జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం జేపీ నగర నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏడీజీపీ తన తోటి ఉద్యోగులకు రాసిన లేఖ గురించి స్పందిస్తూ, ఆయన చెప్పినట్లుగా నేను కేసుల్లో నిందితున్ని కావచ్చు, అయితే అతను అధికారి అనే హోదాలో ఉన్న క్రిమినల్. వరుస నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేతికింద పనిచేసే ఇన్స్పెక్టర్కు రూ. 20 కోట్లు డిమాండ్ పెట్టి చిక్కుకొన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ ఈ అధికారి మీద ఫిర్యాదు చేశారు. తక్షణమే రూ.2 కోట్లు తీసుకురావాలని బ్లాక్మెయిల్ చేసింది ఇతను కాదా? అని దుయ్యబట్టారు. లోకాయుక్తకు గవర్నర్ రాసిన లేఖ ప్రభుత్వ సహకారమున్న ఒక టీవీ చానెల్కు లీక్ అయ్యింది, దానిని లీక్ చేసింది ఎవరు? అనేది అందరికి తెలుసునన్నారు. అయితే అది రాజ్భవన్ నుండే లీకేజీ అయ్యిందని, అక్కడి అధికారులను విచారించాలని చంద్రశేఖర్ పై అధికారులకు లేఖ రాశారు, అందుకే అతని దర్పం, నేపథ్యంపై తాను ఆధారాల సమేతంగా మాట్లాడుతున్నానని చెప్పారు. నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి తాను అడిగిన ప్రశ్నలకు ఐపీఎస్ చంద్రశేఖర్ సమాధానమివ్వాలి, అలా కాకుండా క్రిమినల్ మనస్తత్వంతో కూడిన అసభ్యకరమైన భాషను ఉపయోగించి ఒక కేంద్ర మంత్రి గురించి చెడుగా లేఖను విడుదల చేశారు, ఇందుకు ఏమి చేయాలి, ఆధారాలు, విషయం లేనిదే నేను మాట్లాడను. తాను శనివారం ఉదయం మీడియాతో మాట్లాడగానే, సాయంత్రం ఆ అధికారి ఎక్కడకి వెళ్లాడనేది తెలుసు. ఆయన లేఖను ఎవరు తయారు చేసిచ్చారు అనేది తెలుసని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ ఉపయోగించిన భాష అతని సంస్కృతికి నిదర్శనం. అతడు ఏం మాట్లాడారు అనేది అందరికీ తెలుసు అని మండిపడ్డారు. కుమార ఆధారాలివ్వాలి: డీసీఎం కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, ఏడీజీపీ చంద్రశేఖర్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరగా, ఇందులో ఆధారాలు ఏమున్నాయో కుమారస్వామి విడుదల చేయాలని డీసీఎం డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నెలమంగలలో మాట్లాడుతూ కుమారస్వామికి విరుద్ధంగా కేపీసీసీ కార్యాలయంలో లెటర్ను తయారుచేసి లీక్ చేశారని ఆరోపించడం సబబు కాదన్నారు. కుమారస్వామి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. కేపీసీసీకి, ఏడీజీపీ చంద్రశేఖర్కు ఏమి సంబంధమని ప్రశ్నించారు. చంద్రశేఖర్ నన్ను కలిసింది, మాట్లాడిందీ లేనే లేదన్నారు. -
షర్మిలపై తాడిపత్రి చంద్రశేఖర్ సంచలన కామెంట్స్
-
ప్రసంగమంతా చంద్రబాబు భజనే: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు గురించి భజన చేయకుండా..రాష్ట్రంలో జరగుతున్న అరాచకపాలన గురించి మాట్లాడితే బాగుండేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అన్నారు. తాడేపల్లిలో వైఎస్సాఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ఈ సందర్భంగా తాడిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగమంతా చంద్రబాబు భజనే కనపడింది. ప్రతిపక్ష పార్టీపై దుమ్మెత్తిపోయటానికే సరిపోయిందని మండిపడ్డారు. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేదు. అమరావతి, ప్రత్యేక హోదా గురించి కనీస ప్రస్థావనే లేదని అన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ చెప్తారనుకున్నాం. కానీ దాని గురించి మాట్లాడలేదు. మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ అమలు గురించి కూడా మాట్లాడలేదు. అంటే హామీలన్నింటినీ తుంగలో తొక్కేసినట్టేనని అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి గవర్నర్ మాట్లాడకపోవడం దారుణమన్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి వంద కోట్లు కూడా లేవు. కానీ 2024నాటికి ప్రభుత్వ ఖజానాలో రూ.7 వేల కోట్ల పైనే ఉందన్న తోట చంద్రశేఖర్..ఎన్నికల హామీలను చంద్రబాబు ఇప్పటి వరకు అములు చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే తప్ప గవర్నర్ వాస్తవాలను మరిచిపోయారు. 2014-19 మధ్యలో 54 సంస్థలను ప్రయివేటుపరం చేశారు.వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ధ్వజమెత్తారు.చంద్రబాబుకు లబ్ధి చేకూరేలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహరించడం సర్వసాధారణమైందని వ్యాఖ్యానించారు.షర్మిళ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేయటం సిగ్గుచేటని తెలిపారు.షర్మిల వైఖరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 50 రోజుల్లోనే రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా షర్మిల నోరెందుకు మెదపటం లేదు? చంద్రబాబు కోసమే తప్ప ప్రజల కోసం షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.ఓట్ ఆన్ బడ్జెట్ ఏడు నెలలపాటు నిర్వహించాలనుకోవటం సిగ్గుచేటు.మేనిఫెస్టో పథకాలకు ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ఓట్ ఆన్ బడ్జెట్ పెడుతున్నారు. ప్రజాస్వామ్య యుతంగా మేము నిరసనలు తెలిపితే పోలీసులు మాపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అసెంబ్లీలో ప్లకార్డులను చూపిస్తే చంద్రబాబు వణుకిపోతున్నారు. అరాచకాలపై అసెంబ్లీలో నిలదీశాం.ప్రభుత్వం స్పందించలేదనే బాయ్ కాట్ చేశామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
సంపద సృష్టిస్తానన్న బాబు అప్పులు సృష్టిస్తున్నాడు..!
-
నా జీవితం.. ‘అందమైన పూలతోట’ కాదు
తెనాలి: ‘నా జీవితం అందమైన పూలతోట కాదు.. జీవనం కోసం ఎన్నెన్నో చిరుద్యోగాలు చేశాను. అన్నింటిలోను అత్తెసరు సంపాదనే. చివరకు రచనా వ్యాసంగమే బాలసాహిత్య ప్రపంచంలో నిలబెట్టింది. గుర్తింపువచ్చాక వెనుదిరిగి చూసుకోలేదు. కథలు, నవలికలు, నవలలు, టెలీఫిలింస్తో బిజీ అయ్యాను. కమ్యూనిస్టు నేపథ్యం ఉండటంతో కమర్షియల్ కాదలచుకోలేదు. సీరియస్ సాహిత్యాన్నే చేశాను. సామాజిక సమస్యలతో కూడిన ఇతివృత్తాలతోనే సాహిత్య సృజన చేశాను. ఇప్పుడీ అవార్డుకు ఎంపికవటం సంతోషంగా ఉంది..’ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డుకు ఎంపికైన ప్రముఖ బాలసాహితీవేత్త, నవలా రచయిత, కాలమిస్ట్, టెలీఫిలింస్ కథ, మాటలు, స్క్రీన్ప్లే రచయిత పి.చంద్రశేఖర ఆజాద్ స్పందన ఇది. అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రశేఖర అజాద్ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండల గ్రామం వెల్లటూరు. 1955 మే 24న జన్మించారు. తండ్రి పమిడిముక్కల లక్ష్మణరావు. అప్పట్లో కమ్యూనిస్టు యోధుడు. తెలంగాణ పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. కొడుక్కి స్వాతంత్య్రయోధుడు చంద్రశేఖర అజాద్ పేరు పెట్టారు. అజాద్కు ఏడేళ్ల వయసులోనే ఆయన మరణించారు. గుంటూరులోని సీపీఎం కార్యాలయం ఆయన పేరుతోనే ఉంటుంది. రేపల్లెలో ఇంటర్ వరకు చదివిన అజాద్.. ఆ మరుసటిరోజే తెనాలిలోని బావగారి హోటల్లో పనికి కుదిరాడు. ఏ ఉద్యోగంలోను ఎక్కువకాలం చేయలేదు. నవభారత్ టొబాకోలో కొంతకాలం, తర్వాత మరికొన్నింటిలో పనిచేశారు. అపరాధ పరిశోధన.. నిలబెట్టింది ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే తనలోని భావాలను అక్షరాల్లోకి మార్చే ప్రయత్నం చేశారు అజాద్. వాటిని అప్పటి దినపత్రికలకు పంపేవారు. ఆరోజుల్లో ‘అపరాధ పరిశోధన’ మాసపత్రిక వచ్చేది. తన కథలు, నవలికలు పంపుతుండేవారు. ‘ఆ పుస్తకమే తనను రచయితగా నిలబెట్టింది..’ అని అజాద్ గుర్తుచేసుకున్నారు. ‘ఆ పత్రికకు 16–17 నవలికలు, 40కి పైగా కథలు రాశాను. అప్పటో్లనే కథకు రూ.75, నవలికకు రూ.125 నుంచి రూ.150 చొప్పున ఇచ్చేవారు. చేసే ఉద్యోగంతో నెలకు రూ.180 వరకు వచ్చేవి. అమ్మ విజయలక్ష్మి వాళ్లంతా తెనాల్లో ఉండేవారు. ఆ డబ్బులు తీసుకుని అమ్మను చూడ్డానికి వెళే్లవాడిని..’ అని చెప్పారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్లో చేరారు. రోజుకు రూ.10 వేతనం. సెలవులొస్తే అది కూడా ఉండేది కాదు. 1974లో పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు. 1982 వరకు నెలకొచ్చే వేతనం ఏనాడు రూ.180కి మించలేదు. అందమైన పూలతోటకు మొదటి బహుమతి 1983లో ఒక దినపత్రిక ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల మాసపత్రిక బాలల నవలల పోటీని ప్రకటించింది. ‘అందమైన పూలతోట’ అనే నవలను రాసి పంపారు. తెలుగు బాలసాహిత్యంలో ఒక ప్రయోగాత్మకమైన ఆ నవలకు ప్రథమ బహుమతి, ఆరుద్ర భార్య రామలక్ష్మి రాసిన నవలకు ద్వితీయ బహుమతి వచ్చాయి. ‘మహదానందం కలగటమే కాదు.. ఆ నవలతో నా జీవితం మలుపు తిరిగింది..’ అన్నారు అజాద్. ‘అప్పటికే యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి వంటి రచయితలు సాహితీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. నాలాంటి వర్ధమాన రచయితలకు ఖాళీలేదని అర్థమైంది. బాలసాహిత్యంలో అవకాశం ఉందనిపించటంతో అప్పట్నుంచి పిల్లలకోసం అంకితమయ్యాను..’ అంటారు అజాద్. విజయవాడ నుంచి వెలువడే ‘స్వాతి’ మాసపత్రికలో అవకాశమిచ్చారు. ‘మా హృదయం’ పేరుతో పదేళ్లలోపు పిల్లలకు అమ్మ, నాన్నతో మొదలుకొని వారికి సంబంధించిన మొత్తం 50 అంశాలను వారి భాషలో రాసిన సీరియల్కు కూడా మంచి గుర్తింపు లభించింది. స్వాతి మాసపత్రికల్లో ఆ సీరియల్ ఆఖరిది. అప్పట్నుంచి రచనలు వేగం పుంజుకున్నాయి. కట్చేస్తే.. ఇప్పటికి 85 నవలలు, 17 నవలికలు, 850కి పైగా కథలు రాశారు. కమ్యూనిస్టు నేపథ్యం కావటంతో సీరియస్ సాహిత్యమే చేశానంటారు అజాద్. సామాజిక అంశాలకు సంబంధించిన ఏదో ఒక సమస్యను చర్చించినవే అన్నీ. వందకుపైగా కథలు, 30కి పైగా నవలలు వివిధ బహుమతులు గెల్చుకున్నాయి. తెలిమబ్బుల ఛాయ, మనోప్రస్థానం, నగరంలో వెన్నెల నవలలకు వరుసగా మూడేళ్లు ఆటా, తానా బహుమతులు లభించాయి. విపరీత వ్యక్తులు, అహానికి రంగుండదు, ముక్తిపర్వం, దేవుడొచ్చాడు నవలలు కూడా గుర్తింపు పొందాయి. పిల్లల ప్రపంచం, నాన్నకో ఉత్తరం, మూడ్స్, ఎక్స్ప్రెషన్స్, ఇంప్రెషన్స్ పేరుతో దినపత్రికల్లో రాసిన కాలమ్స్ ప్రజాదరణ పొందాయి. గతంలో ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ‘నగరంలో వెన్నెల’ ఇప్పుడో సాహిత్య మాసపత్రికల్లో సీరియల్గా ఆరంభమైందని తెలిపారు అజాద్. ఆకర్షించిన బుల్లితెర మరోవైపు బుల్లితెర రంగం కూడా అజాద్ను ఆకర్షించింది. దూరదర్శన్లో ‘జీవనతీరాలు’ సీరియల్తో ఆరంభించి, రాధామధు, లయ, అడగక ఇచ్చిన మనసు, ఎదురీత సీరియల్స్తో మొత్తం ఐదువేల ఎపిసోడ్లకు రచనా సహకారం అందించారు. సామాజిక, మానవ భావోద్వేగాలకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను చర్చించారు. అజాద్ రచనా సహకారం అందించిన పాండవులు, అడవిపూలు, బోన్సాయ్, తమసోమా టెలీఫిలింస్కు మూడు స్వర్ణాలు, వెండి నంది వచ్చాయి. అడవిపూలు టెలీఫిలింకు కథ, స్క్రీన్ప్లే, సంభాషణలకుగాను వ్యక్తిగతంగా నంది బహుమతిని స్వీకరించారు. సరదా కోసం కొన్ని టెలీఫిలింస్, టీవీ సీరియల్స్లోను ఆయన నటించారు. ఉపాధికోసం గుంటూరు, ఒంగోలు, ఏలూరు, రాజమండ్రిలో ఉన్నపుడు కొన్ని సాంస్కృతిక సంస్థల నిర్వహణలోను పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
రేపు కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, సంజయ్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారానికి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఈనెల 13న ఉదయం 11 గంటల కు జి.కిషన్రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి గా శాస్త్రి భవన్లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ నార్త్ బ్లాక్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయు డు, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం లేదా శుక్రవారం, శ్రీనివాస వర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్నాయుడు?
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలిసింది. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఆయనను కేబినెట్ హోదాలో తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్డీయే మంత్రివర్గంలో టీడీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో ఒకటి కేబినెట్ మంత్రి హోదాతో కాగా మరో రెండు సహాయ మంత్రి పదవులను ఇస్తామని చెప్పగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ హోదా మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అలాగే, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడుకి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జనసేన–బీజేపీకి ఒకటి..జనసేన, బీజేపీల నుంచి కూడా ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనసేనకు మంత్రి పదవి ఇస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే, బీజేపీ తరఫున అయితే సీఎం రమేష్ లేదా పురందేశ్వరిలో ఒకరికి ఛాన్స్ ఉండవచ్చని చెబుతున్నారు. -
కష్టాలను అధిగమించి ప్రత్యర్థితో పోరాడి గెలిచిన తాటిపర్తి
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15 సంవత్సరాలుగా నిజాయతీగల కార్యకర్తగా పనిచేసిన తాటిపర్తి చంద్రశేఖర్కు ఫలితం దక్కింది. మంగళవారం జరిగిన కౌంటింగ్లో ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయం సాధించారు. సింగరాయకొండలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న ఆయనను గుర్తించిన ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి యర్రగొండపాలెం(ఎస్సీ) టికెట్ ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవాన్ని నిలుపుకోవటానికి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి అయినా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుల వరకు ఆయన కలుపుకొనిపోయారు. నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను ఆయన ఎంతో సహనంతో పరిష్కరించగలిగారు. అందరినీ సమన్వయ పరచడంలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అనతి కాలంలోనే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న నీటి సమస్యను వెనువెంటనే పరిష్కరించగలిగారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను తన సొంత నిధులతో మరమ్మతులు చేయించి ఆయా ప్రాంత ప్రజల మన్ననలు పొందారు. ప్రత్యర్థి టీడీపీ వర్గానికి చెందిన వారు అడుగడుగునా పెట్టిన కష్టాలను ఎదుర్కొంటూ ఆయన ఎన్నికల్లో ముందుకు సాగారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ చేస్తున్న కార్యక్రమాలకు అభ్యంతరం చెప్తూ ఆర్వోకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయించడం లాంటి కష్టాలను సైతం అధిగమించి ప్రత్యర్థితో పోరాడిన ఆయనను నియోజకవర్గ ప్రజలు 5,477 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. తన స్వగ్రామమైన సింగరాయకొండలో చేసిన స్వచ్ఛంద సేవలు ఈ ఎన్నికల్లో బాగా పనిచేశాయని చెప్పవచ్చు. తాటిపర్తి చంద్రశేఖర్ వదిన, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు వనజ, ఆయన భార్య భాగ్యసీమ చౌదరి, కుమార్తె ఆకాంక్ష ఇంటింటికీ తిరిగి చేసిన ప్రచారం నియోజకవర్గ ప్రజలు గుర్తించి వారికి తగిన ఫలితాన్ని అందించారు. వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సచివాలయాల కన్వీనర్లు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవటానికి తమ స్థాయికి మించి కష్టపడ్డారని చెప్పవచ్చు. -
విషాదం, కన్నీరు.. అనారోగ్యం
శివమొగ్గ: అవినీతిని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న వాల్మీకి అభివృద్ధి పాలక మండలి అధికారి చంద్రశేఖర్ భార్య కవిత శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వాంతులు అవుతూ నీరసంగా ఉండడంతో కవితాను ఆటోలో ఆమె కుమారుడు ఆస్పత్రికి తరలించాడు. చంద్రశేఖర్ ఆకస్మిక మరణంతో ఆమె తీవ్ర ఆవేదనలో ఉండిపోయింది. పదే పదే భర్తను తలుచుకుంటూ విలపిస్తోంది. సరిగ్గా భోజనం చేయలేదని, దీంతో అనారోగ్యం బారిన పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. పరామర్శల వెల్లువ మరోవైపు అధికారి ఆత్మహత్య నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలు, నాయకులు చంద్రశేఖర్ ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటివరకు మృతుని కుటుంబానికి ఎలాంటి పరిహారం అందించలేదు. ఎంతో మంది నేతలు ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని తెలిపి రిక్త హస్తాలతో తిరిగి వెళుతున్నారు. మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మూడు లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా మృతుని కుటుంబానికి అందించారు. -
RR vs RCB: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
-
Qualifier 1: సన్రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
-
కాళేశ్వరానికి ‘అత్యవసర’ గడువు మించిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వానాకాలానికి ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సత్వరమే సిఫారసు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనీల్కుమార్ ఇటీవల అయ్యర్ కమిటీకి లేఖ రాశారు. ఈ నెల ముగిశాక ఎప్పుడైనా వానాకాలం ప్రారంభం కావచ్చని, ఆలోగా అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబందించిన ప్రాథమిక సమాచారంతోపాటు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు నిర్వహించిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల నివేదికలను సమరి్పంచామని ఈ ఖలో గుర్తుచేశారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. కమిటీ మధ్యంతర నివేదిక కోసం గత నెల రోజులుగా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. ఎన్నికల ఫలితాలొచ్చాకే మధ్యంతర నివేదిక? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాకే అయ్యర్ కమిటీ మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయి అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆలోగా వర్షాకాలం మొదలవుతుందని.. దీనివల్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి వీలుండదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బ్యారేజీలకు అత్యవసరంగా గ్రౌంటింగ్ వంటి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అయ్యర్ సిఫారసులు వచ్చాకే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
లక్నో హ్యాట్రిక్ విక్టరీ.. టైటాన్స్ తప్పని పరాభవం
-
IPL 2024: ముంబై గెలుపు బోణీ.. పాండ్యా ముఖంలో నవ్వు
-
ముమ్మరంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
మేడిగడ్డ డిజైన్లలో వైరుధ్యాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మిత స్థలంతోపాటు ర్యాఫ్ట్–ఎగువ/దిగువ కాటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. ఈ విషయంలో సీడీవో తీసుకున్న అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన నోట్స్ను అందించాలని కోరింది. ‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా నది గర్భంలో పాతిన షీట్పైల్స్ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా తొలగించారా? లేదా? కుంగిపోయిన ఏడో బ్లాక్ పునాదులకు ఎదురుగా కొంతభాగంలో షీట్పైల్స్ను అలానే వదిలేశారా? అక్కడ భూమి కోతకు గురికావడానికి ఇదే కారణమా?’’ అని నిలదీసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ.. 52 ప్రశ్నలతో సీడీవో విభాగానికి ప్రశ్నావళి అందించి, త్వరగా బదులివ్వాలని కోరింది. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లపై ఫోకస్ మేడిగడ్డ బ్యారేజీల పునాది (ర్యాఫ్ట్), సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై అయ్యర్ కమిటీ ప్రధాన దృష్టిసారించింది. బ్యారేజీల్లో లోపాలకు ఇవి కూడా ముఖ్యకారణం కావచ్చన్న చర్చ ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ/దిగువ కాటాఫ్లు–ర్యాఫ్ట్ల మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ను అందించాలని సీడీవోను కమిటీ కోరింది. ‘‘జాయింట్లలో లాకింగ్ ఏర్పాట్లున్నాయా? బ్యారేజీలకు రక్షణ కల్పించాల్సిన అప్రాన్ దెబ్బతిని ర్యాఫ్ట్ కుంగిపోతే, సెకెంట్ పైల్స్–ర్యాఫ్ట్ మధ్య జాయింట్లు విరిగిపోవా? మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ 2.5 మీటర్ల మందం ఉంటే.. ర్యాఫ్ట్–సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్గా వేసిన శ్లాబు మందం 1.5 మీటర్లు మాత్రమే ఉంది. నీటి ఒత్తిడిని జాయింట్ ఎలా తట్టుకుంటుంది?.’’ అని ప్రశ్నించింది. దృఢమైన రాతిపై కటాఫ్వాల్స్ను నిర్మిస్తే.. ర్యాఫ్ట్ కుంగిపోయేందుకు ఉన్న అవకాశాలను ఊహించలేదా? అని అడిగింది. బ్యారేజీలను తేలియాడే కట్టడాలుగా డిజైన్ చేశారా? స్థిరంగా ఉండేలా చేశారా అని ప్రశ్నించింది. సీడీవోలో ఎవరేం చేస్తారు? సీడీవోలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారాల శ్రేణి, బాధ్యతలను, విభాగం నిర్మాణ క్రమాన్ని తెలపాలని కమిటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో సీడీవో పాత్ర, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది. ‘‘బ్యారేజీలకు పరీక్షలను సంతృప్తికర స్థాయిలో జరిపారా? మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్లు చేశారా? లోటుపాట్లు ఏమైనా గుర్తించారా?’’ అని ప్రశ్నించింది. డీపీఆర్, ఆ తర్వాత నిర్మాణ దశల్లో ప్రతి బ్యారేజీ విషయంలో నిర్వహించిన సబ్ సర్ఫేస్ జియోలాజికల్/జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ల వివరాలను అందించాలని కోరింది. డిజైన్ ఉల్లంఘనలేమిటి ? సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ విభాగం జరిపిన నిర్మాణాలేమిటో తెలపాలని నిపుణుల కమిటీ కోరింది. లేఖలు/ సవరణ డ్రాయింగ్స్ ద్వారా ఆ ఉల్లంఘనలకు తర్వాతి కాలంలో అనుమతి ఇచ్చారా? ఇస్తే ఆ సవరణ డ్రాయింగ్స్ జాబితా ఇవ్వండి అని అడిగింది. ‘‘సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ జారీ చేయడానికి ముందే నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయా? దీనివల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రాయింగ్స్ను మళ్లీ సవరించాలనే ఒత్తిడిని సీడీవో ఎదుర్కోవాల్సి వచ్చిందా? బ్యారేజీల నిర్మాణానికి పరిశీలించిన ప్రత్యామ్నాయ స్థలాలేవి? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు’’ అని ప్రశ్నించింది. బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరదతో దిగువన భూమి కోతకు గురవకుండా తగిన మోతాదులో నీరుండేలా టెయిల్ పాండ్ను డిజైన్ చేశారా అని.. నిబంధనల ప్రకారమే గేట్లను ఆపరేట్ చేశారా? వివరాలు ఇవ్వాలని కోరింది. -
విరాట్ విజృభించేనా..ఆ జట్టుకే విజయావకాశాలు
-
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్కు స్టీల్ షీట్ పైల్స్ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
కలిసి పనిచేద్దాం..
సాక్షి, హైదరాబాద్: గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని, రాష్ట్రం కోసం వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు సంబంధించిన డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడానికి ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. పౌరుల అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన సేవలు అందించడానికి అవసరమైన సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని వివరించారు. రహదారుల భద్రత విషయంలో గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ సేవలను వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన అరుణ్తివారీ, చిన్నబాబు ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక రచయిత అరుణ్తివారీ, కేన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో మైక్రాన్ ప్రెసిడెంట్, సీఈఓ భేటీ ప్రపంచంలోనే అతిపెద్ద మెమొరీ చిప్ల తయారీ కంపెనీ మైక్రాన్టెక్నాలజీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే ప్రభుత్వం అన్నిరకాల సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మైక్రాన్ కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్ మెహ్రోత్రా గురువారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మైక్రాన్ టెక్నాలజీ సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. -
ప్లాంట్–మ్యాన్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్
‘‘డైరెక్టర్గా ‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి సినిమాలు తీశాను. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ‘ప్లాంట్–మ్యాన్’. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి స్పందన వస్తే ఏడాదికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని పరిచయం చేయాలని ఉంది’’ అని నిర్మాత పన్నారాయల్ అన్నారు. చంద్రశేఖర్, సోనాలి జంటగా కె.సంతోష్బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్పై పన్నారాయల్ నిర్మించిన చిత్రం ‘ప్లాంట్–మ్యాన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో కె.సంతోష్బాబు మాట్లాడుతూ–‘‘మా ‘ప్లాంట్–మ్యాన్’ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చిన పన్నాగారికి కృతజ్ఞతలు’’ అన్నారు చంద్రశేఖర్. ‘‘ఇలాంటి ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషం’’ అన్నారు సోనాలి. -
మేయర్ ఫోన్ చేస్తే మాట్లాడవా? నా చాంబర్ ఎదుట30 నిమిషాలు నిల్చో!
ఎంజీఎం: ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తన తండ్రి వృత్తిని కించపరుస్తూ తనను డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు ఆయన చాంబర్ ఎదుట నిల్చోబెట్టాడని కాకతీయ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ వీర ప్రసాద్ ఆరోపించడం కలకలం రేపింది. మనస్తాపానికి గురైన ప్రసాద్ తన పీజీ సీటు వదిలేస్తానని లేఖ రాసి.. తనకు అవమానం జరిగిందంటూ జూడా ప్రతినిధు లకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విషయం బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సదరు లేఖ, ఫిర్యాదులోని వివరాల ప్రకారం..’’ ఈ నెల రెండో తేదీన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డ్యూటీలో ఉండగా ఓ రోగి ఛాతీనొప్పితో రావడంతో పరీక్షిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో అటెండర్ ఫోన్ తీసుకువచ్చి మేయర్ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పగా.. రోగికి వైద్యం అందించగానే మాట్లాడతానని చెప్పాను. వెంటనే ఫోన్ తీసుకోలేదన్న కారణంగా సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్.. నన్ను చాంబర్ దగ్గరికి పిలిపించాడు. నా తండ్రి వృత్తిని పేర్కొంటూ వ్యక్తిగతంగా కించపరిచాడు. డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు తన చాంబర్ ఎదుట నిలుచోబెట్టి తీవ్రంగా అవమాపరిచాడు’ అని ఆ లేఖ, ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ చదవడంకంటే పీజీ సీటు వదిలేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నాడు. ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారంతే: ఆర్ఎంఓ శ్రీనివాస్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాస్ ఈ ఘటనపై స్పందించారు. సదరు పీజీ వైద్యుడితో సూపరింటెండెంట్ దురుసుగా ప్రవర్తించలేదని, సాధారణంగా పీజీ విద్యార్థి ఏ స్థాయి నుంచి వచ్చారో అనే కోణంలో ప్రశ్నించారని తెలిపారు. చాంబర్ ముందు 30 నిమిషాలు ఉండమన్నందుకు సదరు విద్యార్థి మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి కాబట్టి ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారే తప్ప వ్యక్తిగతంగా దూషించలేదని వివరణ ఇచ్చారు. -
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోని చెన్నై ప్లాట్ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
పోటీకి రెడీ.. నియోజకవర్గం ఏది!
వికారాబాద్: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధత వీడడం లేదు. ఆయన నేటికీ ఈ విషయంలో డోలాయమానంలోనే ఉన్నారు. అనేక పార్టీలు మారిన ఆయన చివరకు బీజేపీని వీడి మళ్లీ హస్తం గూటికి చేరిన విషయం విదితమే. ఆయన కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం మొదలైననాటి నుంచి పోటీ చేసే స్థానం విషయంలోనూ ఎన్నో ప్రచారాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ వాస్తవ్యుడైన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ నుంచి మరో మాజీ మంత్రి బలమైన నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఉండడంతో ఏసీఆర్ నియోజకవర్గం వీడడం అనివార్యమైంది. ఆయన జహీరాబాద్ లేదా చేవెళ్ల నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది. పరిచయాలు ఇక్కడ.. ప్రాంతం అక్కడ కాంగ్రెస్లో చేరింది మొదలు ఏసీఆర్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ఆయన అనుచరగనం, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పార్టీలో చేరిన తొలినాళ్లలో చేవెళ్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆయన తన సన్నిహితులతోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆయన తల్లిదండ్రులు, తాత ముత్తాతల సొంత నియోజకవర్గం జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ సాగింది. ఇప్పటికే ఆయన అక్కడ పలుమార్లు పర్యటించారు. కాగా ఏ నియోజకవర్గంలో గెలుపు సునాయాసమనేది తేల్చుకోలేక పోతున్నారు. జహీరాబాద్ సొంత నియోజకవర్గమైనప్పటికీ అక్కడ పెద్దగా పరిచయాలు లేవు. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం వికారాబాద్ నియోజకవర్గంలోనే సాగింది. దీంతో ఆయన పునరాలోచనలో పడి చేవెళ్ల నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని.. తాజాగా పార్టీ పెద్దలతోనూ చర్చించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న నవాబుపేట మండలం ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో ఉండడం, నవాబుపేట యాదయ్య సొంత మండలమైనా మిగతా మండలాలతో పోలిస్తే ఓటింగ్ సరళి వ్యతిరేకంగా ఉంటూ రావడం.. నవాబుపేట మండలంపై ఏసీఆర్కు పూర్తిగా పట్టుండడంతో.. చేవెళ్ల నియోజకవర్గంలోనూ పరిచయాలుండడంతో ఆయనకు చేవెళ్ల నుంచి పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలుంటాయని సర్వేలు చెబుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో ఉన్న రత్నం, ఆయన వర్గం నేతలు యాదయ్యతో అంటీముట్టనట్టు ఉండడం తదితర కారణాల నేపథ్యంలో ఏసీఆర్ తాజాగా చేవెళ్ల నుంచే బరిలో ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారినా దక్కని ఫలితం మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో వికారాబాద్ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఏసీఆర్ మళ్లీ తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన 2008 వైఎస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికలో ప్రసాద్కుమార్ చేతిలో ఓటమి చవిచూశారు. తరువాత 15 ఏళ్ల పాటు ఆయన ప్రతీ ఎన్నికలో ఓటమి తప్పలేదు. దీంతో ఆయన ఒక్క గెలుపు కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని పార్టీలు మారినా గెలుపును అందుకోలేకపోయారు. బీజేపీలోనూ గెలుపు సాధ్యం కాదని భావించి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళీ ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలుపొంది ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. -
రత్నగిరీశునికి ముత్యాల వస్త్రం
అన్నవరం: దేవతామూర్తులకు బంగారు, వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు తయారుచేసి భక్తితో అలంకరించి తరిస్తుంటాం. అలాగే మంచి ముత్యాలతో నఖశిఖ పర్యంతం ఉండే ఒక ముత్యాల వస్త్రం (ముత్తంగి) అలంకరించడం కూడా పలు దేవాలయాల్లో ఆనవాయితీగా వస్తోంది. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి, భద్రాద్రిలో సీతారాములు ముత్తంగి అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, ఈశ్వరుడు కార్తీకమాసం నుంచి ముత్తంగి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.8 లక్షలు సమకూర్చేందుకు దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముందుకు వచ్చింది. ప్రాచీన కళను కాపాడుతూ.. ముత్తంగి తయారీ ప్రాచీనమైన కళ. దీన్ని హైదరాబాద్కు చెందిన సుధీర్ చరణ్ కుటుంబం వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తోంది. తమిళనాడులోని శ్రీరంగంలో సుమారు 12 అడుగుల పొడవున పవళించి ఉండే శ్రీరంగనాథునికి 17వ శతాబ్దంలో నాయకర్ రాజులు ముత్తంగి తయారు చేయించి అలంకరించారు. వందేళ్ల తరువాత వన్నె తగ్గడంతో దాన్ని తీసి భద్రపరిచారని సుదీర్ చరణ్ ‘సాక్షి’కి చెప్పారు. తరువాత 1932లో చెన్నైకి చెందిన ఆయన ముత్తాత కృష్ణాజీని శ్రీరంగం దేవస్థానం ప్రతినిధులు సంప్రదించి, భద్రపరిచిన ముత్తంగిని మళ్లీ ముత్యాలు, వజ్రాలు, కెంపులతో తయారు చేయించి శ్రీరంగనాథునికి అలంకరించారు. ఎలా తయారు చేస్తారంటే.. ముత్తంగి తయారీ చాలా శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రతతో కూడిన కళ. ఇందుకు అవసరమయ్యే ముత్యాల వ్యయం తక్కువే అయినప్పటికీ వాటిని వస్త్రంగా తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. శిరస్సు దగ్గర నుంచి పాదాల వేళ్ల వరకూ దేవతామూర్తుల కొలతలు తీసుకుని, ముందుగా వెండి లేదా రాగి రేకుతో వస్త్రంలా తయారు చేసి, దానికి వివిధ సైజుల్లో ముత్యాలు అతికిస్తారు. వీటి మధ్యలో ఎటువంటి ఖాళీ ఉండదు. కేవలం స్వామి, అమ్మవార్ల ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన భాగమంతా మంచిముత్యాలే కనిపిస్తాయి. సత్యదేవునికీ ముత్తంగి సేవ సత్యదేవుడు, అమ్మవారు, శంకరులకు ప్రతి సోమవారం ముత్తంగి అలంకరించి, ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించాం. దీనికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కూడా అంగీకరించారు. దాతల ద్వారా ముత్తంగి చేయించాలనుకున్నాం. అదే సమయంలో వ్రతపురోహిత సంఘం ముందుకు వచ్చింది. – ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో, అన్నవరం దేవస్థానం -
ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలున్నప్పటికీ విచారణకు గైర్హాజరు కావడం పట్ల జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) డిప్యూటీ కార్యదర్శిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)) జారీ చేసింది. ఆయనను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. తమ కాలేజీ గుర్తింపును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్మెన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ పీడీ చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. గత విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. గుర్తింపు రద్దు కోసం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చామని, అయినా కూడా ఆ వివరణను పరిగణనలోకి తీసుకోకుండా గుర్తింపు రద్దు చేస్తూ జూలై 7, 2020లో ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై ఎన్సీటీఈ ముందు ఆన్లైన్లో అప్పీల్ దాఖలు చేశామని, చట్టం నిర్దేశించిన ఫీజు కూడా చెల్లించామన్నారు. అలాగే పోస్టు ద్వారా వినతిపత్రం కూడా పంపామని తెలిపారు. అయితే తమ ముందు ఎలాంటి అప్పీల్ దాఖలు చేయలేదని ఎన్సీటీఈ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శి ఈ నెల 18న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన విచారణకు డిప్యూటీ కార్యదర్శి రాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కొట్టేసిన న్యాయమూర్తి డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. -
కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత చంద్రశేఖర్
-
కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత.. బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్లోకి చంద్రశేఖర్ను ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలకాలి. తెలంగాణకు కేసీఆర్ చీడపీడ. సీనియర్ నేత చంద్రశేఖర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాం. కేసీఆర్ లక్ష కోట్ల విలువైన పదివేల ఎకరాల భూమి కాజేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుదని ఆశించారు.. కానీ, అలా జరగకపోవడంతో బీజేపీకి రాజీనామా చేశారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో భాగంగా చంద్రశేఖర్ కాంగ్రెస్లో చేరడానికి అంగీకరించారు. ఈనెల 18న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోంది. దళితులకు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూముల యాజమాన్య పట్టాలు ఇవ్వడానిఇక హక్కులు ఇవ్వాలని చంద్రశేఖర్ కోరారు. భవిష్యత్తులో దీనిపై డిక్లరేషన్ చేస్తాం. దళితుల మధ్య వర్గీకరణ చిచ్చు లేకుండా పంచాయితీ తెంచుతాం అని తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లో పనిచేసిన చంద్రశేఖర్.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో కొత్త టెన్షన్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పొలిటికల్ వార్ -
ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరుతున్నాను
-
ఏపీలో 4 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్లో నాలుగు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కేంద్రాలు అమలులో ఉన్నట్టు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు బుధవారం లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవి అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ ఆత్రేయపురం పూతరేకులకు జీఐ ట్యాగ్ మంజూరైందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్ప్రకాశ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు మార్గాని భరత్రామ్, వంగా గీతా విశ్వనా«థ్ అడిగిన ప్రశ్నకు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సర్ ఆర్ధర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు జూన్ 14, 2023న జీఐ ట్యాగ్ మంజూరైనట్టు కేంద్ర మంత్రి వివరించారు. 3,841 కిలోమీటర్లు విద్యుదీకరణ ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జూన్ 30 వరకూ 3,841 కిలోమీటర్లు (బ్రాడ్గేజ్ ) విద్యుదీకరణ పూర్తయినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు ఆదాల ప్రభాకర్రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ సభ్యులు చింతా అనూరాధ, కోటగిరి శ్రీధర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఏపీలో నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుతున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు. కార్యాచరణ సాధ్యాసాధ్యాలు, ట్రాఫిక్ తదితర అంశాలకు లోబడి నూతన వందేభారత్ సేవలు నిర్వహిస్తున్నామని ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కడప–పెండ్లిమర్రి ప్రాజెక్ట్ ప్రారంభం 268 కిలోమీటర్ల మేర కడప–బెంగళూరు ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వ వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన బడ్జెట్లో మంజూరు చేసినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు అవినాశ్రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. పూర్తి ప్రాజెక్టు ఖర్చు రూ.2705.98 కోట్లలో 50శాతం ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉందన్నారు. మార్చి 2023 వరకూ ఈ ప్రాజెక్ట్కు రూ.358.60 కోట్లు వ్యయం చేయగా.. 21.30 కి.మీ పొడవున కడప–పెండ్లిమర్రి సెక్షన్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కడప–బెంగళూరు వయా మదనపల్లికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేవలం భూమి ఖర్చు మాత్రమే భరిస్తామని పేర్కొందని, అనంతరం పలు మార్పులు సూచించిందన్నారు. ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రూట్ను అనుమతించామన్నారు. ఇది వైఎస్సార్ కడప జిల్లా మీదుగా వెళ్తుందని తెలిపారు. -
వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్
న్యూఢిల్లీ: భారత్లో సెమీకండక్టర్ల ప్లాంటు నెలకొల్పేందుకు దేశీ దిగ్గజం వేదాంతతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) నుంచి హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) తప్పుకుంది. మరిన్ని వైవిధ్యమైన అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘పరస్పర అంగీకారం మేరకు, వేదాంతతో జాయింట్ వెంచర్ విషయంలో ముందుకు సాగరాదని నిర్ణయించుకున్నాం. వేదాంత యాజమాన్యంలోని సంస్థకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మా పేరును జోడించి ఉంచడం వల్ల గందరగోళానికి దారి తీస్తుంది కాబట్టి దాన్ని తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం‘ అని ఫాక్స్కాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఆకాంక్షల సాకారానికి పూర్తి తోడ్పాటు అందిస్తామని, స్థానిక అవసరాల మేరకు భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని పేర్కొంది. తైవాన్కు చెందిన కాంట్రాక్ట్ ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్, వేదాంత .. గుజరాత్లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశీయంగా తొలి సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు గతేడాది జేవీ కుదుర్చుకున్నాయి. ఏడాది పైగా దీనిపై కసరత్తు చేశాయి. సాంకేతిక భాగస్వామిగా యూరప్ సంస్థ ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టేందుకు ప్రయత్నించినా చర్చలు ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం వేదాంత–ఫాక్స్కాన్ జేవీకి బ్రేక్ పడింది. ఫోన్లు, ఫ్రిజ్లు, కార్లలో ఉపయోగించే చిప్లు కేవలం కొన్ని దేశాల్లోనే తయారవుతున్నాయి. భారత్ కూడా చిప్ల తయారీలోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టి ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనికి స్పందనగా వేదాంత–ఫాక్స్కాన్, ఐఎస్ఎంసీ, ఐజీఎస్ఎస్ దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, వేదాంత జేవీ మినహా మిగతా రెండింటి విషయంలో పెద్దగా పురోగతి లేదు. ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నాం.. కాగా సెమీకండక్టర్ ప్రాజెక్టుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని వేదాంత స్పష్టం చేసింది. చిప్ ప్లాంటు ఏర్పాటులో భాగస్వాములయ్యేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ‘సెమీకండక్టర్ల విషయంలో ప్రధాని విజన్ను సాకారం చేసేందుకు, మరింతగా కృషి చేస్తాం’ అని వేదాంత పేర్కొంది. సైయంట్ డీఎల్ఎం లిస్టింగ్ భళా ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్విసుల కంపెనీ సైయంట్ డీఎల్ఎం భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 265తో పోలిస్తే బీఎస్ఈలో 51 శాతం ప్రీమియంతో రూ. 401 వద్ద లిస్టయ్యింది. ఆపై ఒక దశలో 61% దూసుకెళ్లి రూ. 426ను అధిగమించింది. చివరికి 59 శాతం(రూ. 156) లాభంతో రూ. 421 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో సైతం రూ. 403 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 427 వరకూ ఎగసి చివరికి రూ. 422 వద్ద స్థిరపడింది. వెరసి రూ. 157 లాభంతో ముగిసింది. భారత్ లక్ష్యాలపై ప్రభావం ఉండదు వేదాంతతో జేవీ నుంచి ఫాక్స్కాన్ వైదొలగడమనేది భారత్ నిర్దేశించుకున్న చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏర్పాటు లక్ష్యాలపై ప్రభావం చూపబోదు. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ మంత్రి -
భారత ప్రభుత్వం బెదిరించింది
న్యూఢిల్లీ: భారత్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020, 2021లో పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం జరిగినప్పుడు ట్విట్టర్ ఖాతాలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం తమను ఆదేశించిందని, మాట వినకపోతే దేశంలో ట్విట్టర్ను మూసివేస్తామని హెచ్చరించిందని జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సే 2021లో ఆ సంస్థ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. ఖాతాలపై ఆంక్షలు విధించడంతోపాటు కొన్ని పోస్టులను తొలగించకపోతే సంస్థను మూసివేయడంతోపాటు ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందని, తమపై ఒత్తిడి తెచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తుర్కియే(టర్కీ), నైజీరియా ప్రభుత్వాల నుంచి కూడా తమకు బెదిరింపులు వచ్చాయని అన్నారు. చెప్పినట్లు చేయాలని అక్కడి ప్రభుత్వాలు తమపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొన్నారు. భారత ప్రభుత్వంపై జాక్ డోర్సే చేసిన ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం కొట్టిపారేశారు. డోర్సే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. డోర్సే సీఈఓగా ఉన్న సమయంలో భారత ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పనిచేసేందుకు ట్విట్టర్ యాజమాన్యం నిరాకరించిందని గుర్తుచేశారు. భారత ప్రభుత్వ చట్టాలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించిందని అన్నారు. ట్విట్టర్ సంస్థ నుంచి ఎవరూ జైలుకు వెళ్లలేదని, మన దేశంలో ట్విట్టర్ను మూసివేయలేదని చెప్పారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే జాక్ డోర్సే పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాజీవ్ చంద్రశేఖర్ ఆక్షేపించారు. జాక్ డోర్సే ఆరోపణలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ ఐటీ విభాగం నాయకుడు అమిత్ మాలవీయ తదితరులు ఖండించారు. దేశానికి వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని, అలాంటి వారి ఖాతాలపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో ట్విట్టర్ యాజమాన్యానికి సూచించామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేంద్రం సమాధానం చెప్పాలి: ఖర్గే ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే చేసిన ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. సోషల్ మీడియాను, జర్నలిస్టులను అణచివేయడం ప్రభుత్వం ఇకనైనా ఆపాలని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటామని ఖర్గే తేల్చిచెప్పారు. డోర్సే ఆరోపణలపై మోదీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తదితరులు డిమాండ్ చేశారు. ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేశారు: తికాయత్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చిన ట్విట్టర్ ఖాతాలను అప్పట్లో ప్రభుత్వం నిలిపివేసిన సంగతి నిజమేనని, ఈ విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. ఖాతాలను బ్లాక్ చేసేలా ట్విట్టర్ యాజమాన్యంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని అన్నారు. రైతుల ఉద్యమం ప్రజల్లోకి వెళ్లకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. చాలా ట్విట్టర్ ఖాతాలు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయని వివరించారు. అసమ్మతిని, వ్యతిరేకతను కేంద్రం సహించదని వ్యాఖ్యానించారు. -
నాలుగేళ్ల క్రితం వివాహం.. సంతానం కలగడం లేదని...
ఏటూరునాగారం : సంతానం కలగడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎలిశెట్టిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం. ఎలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన హన్మంతరావు–నర్సక్క కుమారుడు పులిశె చంద్రశేఖర్(28) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రశేఖర్కు నాలుగేళ్ల క్రితం మౌనికతో వివాహం జరిగింది. అతనికి సంతానం కలగడం లేదని గత కొంత కాలంగా మద్యానికి బానిసై ఈనెల 28న ఆదివారం భార్యతో గొడవపడగా అతని భార్య పుట్టింటికి వెళ్లిందన్నారు. సంతానం కలగడం లేదని జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్క వారు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిర్భయంగా వచ్చి ఓటేయాలని ఓటర్లకు పిలుపు
-
పారిస్.. యానాం మూడుముళ్ల బంధం
యానాం నుంచి పారిస్కు చాలా దూరం. కానీ.. రెండు ప్రాంతాల మనుషుల మధ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1954లో ఫ్రెంచ్ వాళ్లు యానాంను విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో మాత్రం నేటికీ బంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో మూడుముళ్లు.. ఏడడుగులతో పెనవేసుకుని.. కడవరకూ కలిసుంటామని ప్రమాణం చేసుకుంటూ బంధాలను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు. ఏటా కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ పౌరులతో ముడిపడుతున్నాయి. అవి కూడా పెద్దలు కూర్చిన వివాహాలు కావడం.. హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుండటం మరో విశేషం. సాక్షి ప్రతినిధి, కాకినాడ: యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. కాళ్లు కడగటం.. కన్యాదానం చేయడం.. కల్యాణ ఘడియలో వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పరస్పరం జీలకర్ర, బెల్లం ఉంచటం.. ఆ తరువాత వధువు మెడలో వరుడు తాళి కట్టడం.. అరుంధతీ నక్షత్ర వీక్షణ.. చివరగా అప్పగింతలు వంటి వివాహ తంతుల్లో ఏ ఒక్కటీ వదలకుండా వివాహ తంతును సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ యానాం–పారిస్ వివాహ బంధానికి ప్రతీకగా యానాంలోనూ ఈఫిల్ టవర్ నమూనా నిర్మిం చారు. 30 మందికి పైగా.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు. అలాగని.. ఇవన్నీ ప్రేమ వివాహాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిలో అధిక శాతం వివాహాలు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుదుర్చుకున్నవే. ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు. పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి. జాక్పాట్ కొట్టినట్టే.. ఫ్రెంచ్ వారితో వివాహ బంధంతో ఒక్కటైతే వరుడు లేదా వధువు జాక్పాట్ కొట్టినట్టే. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే లభించే ఫ్రెంచ్ పాస్పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆ్ర«ఫికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. అలనాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. యానాంను రెండు శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వాళ్లు పాలించారు. తమ పాలనకు స్వస్తి పలికి తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడి వారికి ఐచ్చికంగా ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అప్పట్లో సుమారు 4 వేల మంది ఉండగా.. వారిలో 70 మంది ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నారు. ఫ్రెంచ్ పౌరసత్వం అనేది ఐచ్ఛికమని భారత్–పారిస్ మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెంచి–యానాం మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. తొలినాళ్లలో 70 మంది ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోగా.. ఆ దేశ పౌరసత్వం ఉన్న సుమారు 100కు పైగా కుటుంబాల వారు ఫ్రాన్స్లోనే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్లో ఉన్నా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడకుండా ఏటా రెండు, మూడు పర్యాయాలు వచ్చి వెళుతుంటారు. యానాంలో నివసించిన తమ పూర్వీకుల సమాధులు, వారి స్వీయ అనుభవాలు నిక్షిప్తమై ఉన్న యానాం రోమన్ కేథలిక్ చర్చితోపాటు సమాధులను దర్శించుకుని వెళుతుంటారు. అలా వారి మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఇప్పుడు వివాహ బంధంతో ముడివేస్తున్నారు. చెక్కుచెదరని అనుబంధం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఫ్రెంచ్ వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. వారి పాలనకు మెచ్చి యానాం సహా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతవాసులు వారితో వివాహ బంధం కోసం అమితాసక్తి చూపుతున్నారు. ఏటా యానాం సహా పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన కనీసం 10 మంది ఫ్రెంచ్ వారిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. – సాధనాల బాబు, ఫ్రెంచ్ కాన్సులేట్ సభ్యుడు, యానాం మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు ఫ్రెంచ్ యువతీ, యువకులను యానాం ప్రాంత వాసులు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్ వారు కూడా మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రెంచ్ వారు తమ పూర్వికుల చరిత్రను తెలుసుకునేందుకు, సమాధులను దర్శించుకోవడం కోసం ఏటా ఒకటి, రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. – కనకాల రామదాసు, ప్రముఖ న్యాయవాది, యానాం -
పాపులర్ కపుల్ రవీంద్రన్-మహాలక్ష్మి ఫొటోలు చూశారా?
-
భారత్ను కాలుష్య రహిత దేశంగా మార్చుదాం
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ కోరారు. ఖనిజ పరిశ్రమల్లో హైడ్రోజన్, ఎల్ఎన్జీ గ్యాస్తో నడిచే యంత్రాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మినరల్ ఇండస్ట్రీస్ సదస్సు రెండు రోజులపాటు హైటెక్స్లో జరిగింది. ఈ సందర్భంగా ఖనిజ పరిశ్రమల్లో పర్యావరణ చర్యలు అనే అంశంపై సోమవారం పలువురు మైనింగ్ మేధావులు తమ పత్రాలను సమర్పించారు. ఈ సదస్సులో ఎన్ఎండీసీ చైర్మన్, ఫీమీ అధ్యక్షులు సుమిత్ దేవ్, ఉపాధ్యక్షులు శాంతేష్ గురెడ్డి, సింగరేణి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. ఖనిజ పరిశ్రమల్లో వినియోగించే థర్మల్ విద్యుత్ తగ్గించేలా చూడాలని కోరారు. సింగరేణి సంస్థ ఇప్పటికే తన విద్యుత్ అవసరాల కోసం 219 సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుందని, మరో 81 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పా టు చేసుకుని, 2023–24 నాటికి సంస్థ అవసరాలకు కావాల్సిన విద్యుత్ను సోలార్ ప్లాంట్ల ద్వారా సమకూర్చుకుంటామని వివరించారు. దీంతో 100 శాతం ‘నెట్ జీరో ఎనర్జీ’లక్ష్యాన్ని సాధించబోతున్నామని వెల్లడించారు. -
డిజిటల్ ఇండియా చట్టం వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి సంబంధించి చాలా మటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, 2023 తొలినాళ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకశం ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఇందులోని కీలక అంశాలపై మరింతగా సంప్రదింపులు జరగాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ‘వినియోగదారులు, పరిశ్రమ, స్టార్టప్లు, లాయర్లు, న్యాయమూర్తులు, పౌరులు మొదలైన వర్గాలన్నింటి సంప్రదింపులతో రూపొందాలి. వారందరి అభిప్రాయాలకు ఆ చట్టాల్లో స్థానం లభించాలి. ప్రభుత్వం చేయబోతున్నది ఇదే‘ అని మంత్రి చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల నాటి ఐటీ చట్టం 2000 స్థానంలో డిజిటల్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. -
మూన్లైటింగ్కు కేంద్రం సపోర్ట్, రూటు మార్చిన టెక్ కంపెనీలు
మూన్ లైటింగ్ (రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం) విధానాన్ని కేంద్రం సమర్ధించడంతో దేశీయ టెక్ కంపెనీలు రూటు మార్చాయి. ఇప్పటి వరకు తమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల్నిటెక్ కంపెనీలు విధుల నుంచి తొలగించాయి. తాజాగా మూన్లైటింగ్ అంశంలో ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ వెల్లడించింది. ఇప్పుడు టీసీఎస్ దారిలో మరికొన్ని కంపెనీలు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉందని హెచ్ఆర్ కన్సల్టెన్సీ సర్వీస్ నిపుణులు భావిస్తున్నారు. దేశీ ఐటీ సేవల కంపెనీలు అక్టోబర్ 10 (సోమవారం) నుంచి ఈ ఏడాది 2022 -23 క్యూ2 (రెండో త్రైమాసిక) ఫలితాల్ని విడుదల చేస్తున్నాయి. తొలుత టీసీఎస్ క్యూ2 ఫలితాల చేయగా.. తర్వాత విప్రో,హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ సైతం క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో క్యూ2 ఫలితాల అనంతరం టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ మూన్లైటింగ్ అంశంపై స్పందించారు. 6.16 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న తమ సంస్థ (టీసీఎస్) ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై తుది అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు అన్నీ కోణాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మూన్లైటింగ్ అనేది నైతికతకు సంబంధించిన అంశం. ఇది తమ సంస్థ విలువలు, సంస్కృతికి విరుద్ధమే. అయినప్పటికీ మరో టెక్ సంస్థ విప్రో మూన్ లైటింగ్ పాల్పడుతున్న 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసిందని, కానీ మేం మాత్రం ఇప్పటి వరకూ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు. అంతేకాదు టీసీఎస్ తన ఉద్యోగుల పట్ల దీర్ఘకాలిక నిబద్ధతను కలిగి ఉందని, ఉద్యోగులకు కంపెనీ పట్ల పరస్పర నిబద్ధత ఉందని, ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ఇతర సంస్థలు వారి ఉద్యోగుల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండవచ్చని ఆయన అంగీకరించారు. మూన్లైటింగ్పై కంపెనీ తన వైఖరిని వెల్లడిస్తుందని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ తెలిపారు. మరోవైపు, జాబ్ ఆఫర్లు అన్నింటినీ గౌరవిస్తున్నామని, ప్రథమార్ధంలో ఇప్పటికే 35,000 మంది ఫ్రెషర్స్ను తీసుకున్నామని చెప్పారు. మరో 12,000 మందిని తీసుకోబోతున్నామని.. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 పైచిలుకు ఫ్రెషర్స్ నియామక లక్ష్యాన్ని అధిగమించబోతున్నామని లక్కడ్ తెలిపారు. కేంద్రం సపోర్టు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 21న వర్క్ ఫ్రం హోం పేరిట ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని విప్రో ఫైర్ చేసింది. మూన్ లైటింగ్ విధానం అనైతికమని..నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇన్ఫోసిస్ విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. విప్రో నిర్ణయం తర్వాత సెప్టెంబర్ 24న పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. ఉద్యోగుల మూన్లైటింగ్ను సమర్ధించారు. టెక్ దిగ్గజ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఉద్యోగులు.. అదే ఉద్యోగం కోసం తమ జీవితాల్ని త్యాగం చేసే రోజులు గడిచిపోయాయని అన్నారు. అంతేకాదు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించి ఇతర స్టార్టప్లలో పని చేయకూడదని చెబుతున్న ఐటీ కంపెనీల ప్రయత్నాలు విఫలమవుతున్నాయని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. చదవండి👉 విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన! -
‘డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం మార్మోగాలి!
బెంగళూరు: దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన చిప్ల తయారీ దిగ్గజం ఇంటెల్ నినాదం ’ఇంటెల్ ఇన్సైడ్’ తరహాలో ’డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం ప్రపంచంలో మార్మోగాలని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీపై డెల్, సోనీ వంటి సంస్థలు డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ–వీ (డీఐఆర్–వీ) ప్రోగ్రామ్లో కలిసి పనిచేస్తున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. డీఐఆర్–వీ కింద దేశీయంగా తయారైన తొలి చిప్సెట్ను 2023–24 నాటి కల్లా వ్యాపార అవసరాల కోసం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు వివరించారు. -
‘చౌక ట్రూనాట్ కిట్’కు ఇన్ఫోసిస్ పురస్కారం!
సాక్షి, హైదరాబాద్: మోల్బయో డయాగ్నాస్టిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ నాయర్ ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ అవార్డు దక్కించుకున్నారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్షలను సులభతరం చేయడంతోపాటు అత్యంత చౌకగా చేసే ట్రూనాట్ ఆర్టీపీసీఆర్ కిట్ను తయారు చేసినందుకు ఈ అవార్డు వచ్చింది. 2021 సంవత్సరానికిగాను ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఈయనకు దక్కగా హ్యుమానిటీస్ విభాగంలో డాక్టర్ ఆంజెలా బెరాటో జేవియర్ అవార్డు అందుకున్నారు. జీవవైవిధ్యం, వాతావరణ మార్పుల రంగంలో కృషి చేస్తున్న మహేశ్ శంకరన్కు జీవశాస్త్ర విభాగపు అవార్డు లభించింది. గణితశాస్త్రంలో నీరజ్ కయాల్ (మైక్రోసాఫ్ట్ బెంగళూరు)ను అవార్డుకు ఎంపిక చేశారు. అణుశక్తి రంగంలో పరిశోధనలు చేస్తున్న బేదాంతదాస్ మహంతిని భౌతికశాస్త్ర విభాగంలో ఇన్ఫోసిస్ అవార్డు వరించింది. లింగ వివక్షపై పరిశోధనలు చేస్తున్న ప్రతీక్ష బక్షీని సామాజిక శాస్త్ర రంగంలో అవార్డుకు ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, సామాజిక, తత్వవేత్తలు అవార్డు ఎంపికకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారని ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్కు చెందిన క్రిస్ గోపాలకృష్ణన్ గురువారం జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో ప్రకటించారు. యువతరానికి ఆదర్శంగా నిలిచే శాస్త్రవేత్తలను గుర్తించే లక్ష్యంతో 2009లో ఇన్ఫోసిస్ అవార్డును ప్రారంభించామని, ఒక్కో విభాగానికి రూ.50 లక్షల చొప్పున ఆరు విభాగాల్లో నగదు బహుమతితో అవార్డులు అందిస్తున్నామని వివరించారు. -
ఉరివేసుకొని వైద్యుడి ఆత్మహత్య
కేపీహెచ్బీకాలనీ(హైదరాబాద్)/మెదక్ జోన్: బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లల వైద్యుడు హైదరాబాద్ కేపీహెచ్బీకాలనీలోని హోటల్ గదిలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడి నీట్ పరీక్ష కోసం ఇక్కడికి భార్యతో కలసి వచ్చి హోటల్లో దిగారు. ఆదివారం ఉదయం కొడుకును నిజాంపేటలోని పరీక్షా కేంద్రం వద్ద దింపారు. భార్యను తిరిగి మెదక్లోని ఆసుపత్రికి పంపి హోటల్ గదికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేపీహెచ్బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు చంద్రశేఖర్ (50) ఆదివారం ఉదయం భార్య డాక్టర్ అనురాధ, కొడుకు సాయివెంకట రామకృష్ణప్పలతో కలసి కేపీహెచ్బీ కాలనీలోని సితార గ్రాండ్ హోటల్కు వచ్చారు. నిజాంపేట్లోని పరీక్ష కేంద్రంలో కొడుకు పరీక్ష రాసి.. తిరిగి వచ్చేవరకు వేచి ఉండటం కోసం ఉదయం 8 గంటలకు హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. 9 గంటలకు కొడుకును పరీక్షా కేంద్రం వద్ద వదిలిపెట్టారు. అనురాధను మెదక్లోని ఆసుపత్రిలో రోగులను చూసేందుకు పంపించి.. 11 గంటల ప్రాంతంలో హోటల్ గదికి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం 2.30 గం. సమయంలో అనురాధ.. చంద్రశేఖర్కు పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో హోటల్కు ఫోన్ చేసి ఆ గదికి వెళ్లి చూడాలని కోరారు. హోటల్ సిబ్బంది వెళ్లి కిటికీ ద్వారా గదిలోకి చూడగా చంద్రశేఖర్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించారు. విషయాన్ని పోలీసులకు తెలప డంతో వారు హోటల్ గది తలుపులు తెరిచి మృతదేహాన్ని కిందకు దించి పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలాఉండగా, గత నెల 9న మెదక్ జిల్లా మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్యకేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యం లోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే శ్రీనివాస్ హత్యతో డాక్టర్కు ఎలాంటి సంబంధం లేదని తూప్రాన్ డీఎస్పీ తెలిపారు. చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే ఇక్కడకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉరివేసుకునేందుకు నైలాన్ తాడు వాడటంతోపాటు హోటల్ గదిలో నిద్రమాత్రలు, సర్జికల్ బ్లేడ్లు లభించడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒంటిపై దుస్తులు ఎందుకు లేవనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చి.... చంద్రశేఖర్ స్వస్థలం కర్ణాటక కాగా, ఇరవై ఏళ్ల క్రితం మెదక్ వచ్చి అజంపులలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. అనురాధ కూడా ప్రముఖ గైనకాలజిస్టు. ఆమె పేరుతోనే అనురాధ నర్సింగ్హోం నెలకొల్పారు. ఇద్దరూ మంచి డాక్టర్లుగా పేరు సంపాదించారు. కొంపెల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ భాగస్వామ్యం ఉంది. కాగా, మెదక్ జిల్లాలో ఏ స్థిరాస్తి కొనాలన్నా చంద్రశేఖర్ ముందుండేవారన్న పేరుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. చంద్రశేఖర్ మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. గదిలో 140 నుంచి 150 వరకు నిద్ర మాత్రలున్నాయి. మూడు సర్జికల్ బ్లేడ్లు కూడా లభించాయి. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఆత్మహత్య వెనుక ఇతర కారణాలున్నాయా? అనేది ఆరా తీస్తున్నాం. వెల్దుర్తి పరిధిలో నమోదైన శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ను పోలీసులు పిలిచి విచారించారు. – ఆకుల చంద్రశేఖర్, కూకట్పల్లి ఏసీపీ -
తెలంగాణ ఆర్టీసీ: కారుణ్యం లేదు.. కనికరం లేదు
సాక్షి, హైదరాబాద్: వేయి మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రెండేళ్లుగా అంతులేని ఆవేదనతో విలవిల్లాడుతున్నాయి. ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అవుతున్నాయి. విధి నిర్వహణలోఉండగా ఉద్యోగి చనిపోయి సంపాదించేవారు లేక కొన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమైతే, కుటుంబ పెద్ద ఉద్యోగం చేయలేక అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో జీవనాధారం లేక మరికొన్ని దిక్కుతోచని స్థితిలో ఉన్నా యి. వీరిని ఆదుకునేందుకు చట్టపరంగా రెండు పథకాలున్నా.. ఆర్టీసీలో నెలకొన్న గందరగోళ పరిస్థితితో అవి అక్కర కు రాకుండా పోయాయి. బాధిత కుటుంబసభ్యులు నిత్యం బస్భవన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కన్నీళ్లే మిగులుతున్నాయి..తప్ప కనికరించే నాథుడే కన్పించడం లేదు. సమ్మె సమయంలో నిర్ణయాలే శాపం 2019 అక్టోబర్.. ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మె. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆర్టీసీలో ఎన్నో సమస్యలకు కారణమయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి చనిపోతే అతని కుటుంబంలో ఒకరికి అర్హతల ఆధారంగా సంస్థలో ఉద్యోగం ఇచ్చేందుకు వీలు కల్పించే (బ్రెడ్ విన్నర్) కారుణ్య నియామకాలను సంస్థ అటకెక్కించింది. అలాగే అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులను ఆర్టీసీ అన్ఫిట్గా ప్రకటించి ఉద్యోగం నుండి తొలగిస్తుంది. అలాంటి వారికి ఇంకా సర్వీసు మిగిలే ఉంటే వారి కుటుంబంలో కూడా ఒకరికి మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం కింద ఉద్యోగం ఇవ్వొచ్చు. కానీ ఇవ్వడం లేదు. ఉద్యోగాల కోసం 1,025 దరఖాస్తులు 2018 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద 770 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50 మందికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి శిక్షణ ఇచ్చారు. పోస్టింగులు ఇవ్వడమే తరువాయి. అలాగే అనారోగ్య సమస్యలతో 2018 తర్వాత అన్ఫిట్ అయిన డ్రైవర్ల కుటుంబాల నుంచి 255 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 30 మంది పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీసీలో 52 రోజుల సుదీర్ఘ సమ్మె జరిగింది. ఆ సమయంలో ఖర్చును తగ్గించే పేరుతో ఏకంగా వేయికి పైగా బస్సులను తొలగించి వాటి స్థానంలో 1,300 అద్దె బస్సులను తీసుకున్నారు. ఫలితంగా 2,500 మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగులు (ఎక్సెస్)గా తేలారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంటు వయసును 58 నుంచి 60కి పెంచారు. ఫలితంగా రెండేళ్లపాటు రిటైర్మెంట్లు లేకుండాపోయాయి. ఈ రెండు నిర్ణయాలతో ఆర్టీసీలో ఖాళీలు ఏర్పడకపోగా, భారీగా సిబ్బంది మిగిలిపోయారు. దీంతో కారుణ్య నియామకాలు, అన్ఫిట్ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ కల్పన పథకాలు అటకెక్కాయి. భవిష్యత్తులో ఖాళీలు ఏర్పడితే తప్ప వారికి ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తికాని వారి మాటలా ఉంచితే.. చివరకు శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగులకు సిద్ధంగా ఉన్న వారిని కూడా తీసుకోలేదు. వారికిచ్చి.. వీరికివ్వకుండా.. ఆర్టీసీ సమ్మె సమయంలో 32 మంది కార్మికులు చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు గుండెపోటు, ఇతర కారణాలతో చనిపోయారు. ఆ కుటుంబాల్లోని ఇతర సభ్యులకు అర్హతల ఆధారంగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వీరి కంటే ముందునుంచి పెండింగులో ఉన్న దరఖాస్తుదారులను మాత్రం ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. తండ్రికి మందులు కూడా కొనలేక.. పగడపల్లి దత్తు ఆదిలాబాద్ డిపోలో డ్రైవర్. తీవ్ర అనారోగ్య సమస్యతో 2017లో డ్రైవర్గా పనిచేసే అర్హత కోల్పోయారు. ఆయనను సంస్థ అన్ఫిట్గా డిక్లేర్ చేసింది. అప్పటికి మరో ఐదేళ్ల సర్వీసు ఉండటంతో ఆయన కుమారుడు బీఎస్సీ చదివిన చంద్రశేఖర్ బ్రెడ్ విన్నర్ స్కీం కింద ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుల్గా దరఖాస్తు చేసుకుని, ఎంపికై శిక్షణ కూడా పొందారు. కానీ పోస్టింగ్ ఇచ్చే సమయానికి సంస్థలో ఖాళీలు లేవనే పరిస్థితి ఏర్పడింది. అతని పోస్టింగ్ కోసం ఆ కుటుంబం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది. వివాహమైన చంద్రశేఖర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో రూ.8 వేల జీతానికి పనిచేస్తున్నాడు. తల్లి, అనారోగ్యంతో ఉన్న తండ్రి, భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన ఆ కుటుంబానికి రూ.8 వేలు ఎటూ చాలకపోవడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. ఆరోగ్యం సరిగా లేని తండ్రికి మందులు ఇప్పించటం కూడా కష్టంగా మారిందని చంద్రశేఖర్ ఆవేదన చెందుతున్నాడు. కండక్టర్గా ఎంపికైనా ఫలితం లేదు ఎన్.లింగన్న నిర్మల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్. విధుల్లో ఉండగా 2017లో గుండెపోటుకు గురై చనిపోయారు. బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసి హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేస్తున్న ఆయన కుమారుడు విఘ్నేశ్ దానికి రాజీనామా చేసి కారుణ్య నియామకం పథకం కింద ఆర్టీసీకి దరఖాస్తు చేసుకున్నాడు. కండక్టర్ పోస్టుకు ఎంపికయ్యాడు కూడా. పోస్టింగ్ కోసం శిక్షణ ఇచ్చే సమయంలోనే.. ఆర్టీసీలో బస్సుల సంఖ్య తగ్గించటం, ఉద్యోగ పదవీ విరమణ వయసును పెంచటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో విఘ్నేశ్కు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. విధిలేని పరిస్థితుల్లో కుటుంబపోషణకు నిర్మల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద చాలీచాలని జీతానికి సైట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. -
ఎవరి కోసం ఈ అప్పగింత?
‘జాతీయ ఆస్తుల నగదీకరణ’ నష్టదాయకం. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు. కానీ తన మౌలిక రంగ ఆస్తులను ప్రభుత్వం ఎన్నడూ నిర్వహించిన పాపాన పోలేదు. అలాగని సేవలను అందించిందీ లేదు. కానీ ఆ ఆస్తుల విలువను కేవలం డబ్బు చేసుకోవాలనుకుంటోంది. గత అనుభవాలను పరిశీలించినట్లయితే, మదుపుదారులను ఆకర్షించడానికి ప్రభుత్వ ఆస్తుల స్వాధీనం అనేది పెద్దగా పనిచేయదని తెలుస్తుంది. నష్టాలపాలవుతున్న ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ గురించి కేంద్ర ప్రభుత్వం డాంబిక పదజాలం వెనుక దాక్కుంటోంది కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్, స్టేషన్లు, ఇంధన పైప్ లైన్లు, టెలికాం టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, వేర్హౌస్లు, స్టేడియంలు వంటి ప్రభుత్వ ఆస్తులను బడా ప్రైవేట్ మదుపుదారులకు స్వాధీనం చేయనున్నారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి నాలుగేళ్ల కాలంలో రూ.6 లక్షల కోట్ల నగదు సమీకరణ ఈ పథకం లక్ష్యం. ఈ భారీ మొత్తాన్ని కొత్త మౌలిక వసతుల కల్పనకు ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇది ప్రైవేటీకరణ ఏమాత్రం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి వాదించారు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఉనికిలో ఉన్న, పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రాజెక్టుల నుంచి రాబడులు ఆర్జించడానికి ప్రైవేట్ మదుపుదారులకు నిర్దిష్ట కాలం వరకు వాటిపై హక్కులను తాత్కాలికంగా ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగిస్తున్నామని నిర్మలా సీతారామన్ వక్కాణించారు. అయితే ఈ ఆస్తులపై యాజమాన్యం ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక్కడ నాలుగు అంశాలను చర్చించాల్సి ఉంది. మొదటిది– ఉపయోగం లేకుండా వృ«థాగా ఉంటున్న ప్రభుత్వ ఆస్తుల విలువను పెంచడమే జాతీయ నగదీకరణ లక్ష్యం అని చెబుతున్నారు. కానీ ఇలా ప్రైవేట్ పరిశ్రమలకు అప్పగించిన ఆస్తులు నిర్దిష్టకాలం తర్వాత ప్రభుత్వానికి తిరిగి దఖలుపర్చడం జరిగినప్పటికీ, తదుపరి దశ నగదీకరణ కోసం వీటిని మళ్లీ మార్కెట్లోకి ప్రభుత్వం పంపించగలదు. ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు. కానీ తన వద్ద ఉన్నమౌలికరంగ ఆస్తులను ప్రభుత్వం ఎన్నడూ నిర్వహించిన పాపాన పోలేదు. అలాగని సేవలను అందిం చిందీ లేదు. కానీ ఆ ఆస్తుల విలువను కేవలం డబ్బు చేసుకోవాలనుకుం టోంది. కానీ గత అనుభవాల బట్టి, మదుపుదారులను ఆకర్షించడానికి ప్రభుత్వ ఆస్తుల అమ్మకం పెద్దగా పనిచేయదని తెలుస్తుంది. పైగా ప్రభుత్వ ఆస్తుల వేలం ప్రారంభానికి ముందే వాటిద్వారా ఇంత వస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, ఆస్తుల అమ్మకాల ద్వారా లభించే మొత్తం అంత అధికంగా ఉండదు. రెండు – ప్రభుత్వ మాలిక రంగ ఆస్తులను తీసుకుని, వాటిని నిర్వహించడం ద్వారా, వాటి సేవల అమ్మకాల నుండి వచ్చే రాబడులపై ప్రైవేట్ రంగానికి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే ఈ ఆస్తులకు యజమానిగా ఉన్నప్పటికీ, ధరలు నిర్ణయించడం వాణిజ్యపరంగా ఉంటుంది. ప్రైవేట్ రంగం ఆశించే అధిక రాబడులు సిద్ధించాలంటే వినియోగదారులపై భారీగా యూజర్ చార్జీలు విధించాల్సి ఉంటుంది లేదా ఈ రాబడుల విషయంలో వచ్చే వ్యత్యాసాన్ని పూడ్చడానికి ప్రభుత్వమే నిధులను పంపిణీ చేయవలసి ఉంటుంది. రాబడులు తక్కువగా ఉండి లేదా పరిమితంగా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వ సహాయం గణనీయంగా ఉండాలి. ఈ క్రమంలో ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. మూడు – తగినన్ని రాబడులను ఆర్జించడానికి ప్రైవేట్ రంగం ఖర్చులను తగ్గించుకునే స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేయవచ్చు. వీటిలో కార్మికులు, సిబ్బందిపై పెట్టే ఖర్చులు కూడా ఉంటాయి. లేబర్ ఖర్చులను తగ్గించే ప్రయత్నం వేతనాల కోత, ఉద్యోగాల నుంచి తొలగింపు వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. సంఘటిత కార్మిక మార్కెట్ల కోసం ప్రమాణాలు స్ధిరంగా కొనసాగించే ప్రభుత్వరంగ పాత్ర ఈ విషయంలో పూర్తిగా తగ్గిపోవచ్చు లేదా దాని ప్రాధాన్యతను తొలగించవచ్చు కూడా. చివరిది – ప్రభుత్వ ఆస్తులను సాధించిన ప్రైవేట్ రంగ మేనేజర్లు వాంఛనీయమైన సేవలను అందించే విషయమై ప్రభుత్వం ఏ రకమైన పాత్ర నిర్వహిస్తుంది అనే అంశంపై ఈ జాతీయ నగదీకరణ విధానం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ లక్ష్యం కోసం రెగ్యులేటరీ వ్యవస్థను అమలు చేసినట్లయితే, అది ఖర్చుతో కూడుకున్నది. కాలహరణం కూడా జరగవచ్చు. దీనివల్ల అధిక ఖర్చులతో కూడిన సేవల నాణ్యత నిర్లక్ష్యానికి గురై క్షీణించవచ్చు కూడా. ఆస్తుల నగదీకరణపై ఒక్కమాటలో చెప్పాలంటే, గ్రీన్ ఫీల్డ్ ఇన్ఫ్రా ప్రాజెక్టులపై పెట్టుబడి వనరులను సమీకరించడం అంటే బడా వ్యాపార వర్గాల చర్యలకు ఈ రంగం మొత్తాన్ని విస్తరించజేయడమే అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే వినియోగదారులు లేదా ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టే ఖర్చుతో బడా పారిశ్రామిక వర్గాలు అధిక రాబడులను ఆర్జిస్తాయి. అంటే సంపద అనే పిరమిడ్లో శిఖరాగ్రాన ఉంటున్న వర్గాలవారికే మరింత ఆదాయాన్ని, సంపదను పంపిణీ చేయడమే నగదీకరణ అంతిమ లక్ష్యం. ప్రజా సంపదను తాకట్టు పెడుతున్న కుంభకోణాన్ని తలపించే ఈ పథకం కొంతమంది ఎంపిక చేసుకున్న వాణిజ్య వర్గాలను మరింతగా బలపర్చడానికే ఉపయోగపడుతుంది తప్పితే కేంద్రప్రభుత్వం ఘనంగా చెబుతున్నట్లుగా కొత్త ఆస్తుల సృష్టికి ఏమంత పెద్దగా దోహదం చేయదు. జాతీయ మౌలిక వసతుల కల్పనా రంగంతో సహా పలు కీలక ప్రాజెక్టుల్లో వచ్చే అయిదేళ్ల కాలంలో మొత్తం 111 లక్షల కోట్ల రూపాయలను మదుపు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఆస్తుల అమ్మకం లేదా నగదీకరణ పథకం ద్వారా వస్తుందని భావిస్తున్నది 6 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కొత్త మౌలిక రంగ ప్రాజెక్టులకు ఈ నగదీకరణ పథకం ద్వారా అందేది అందులో అయిదు శాతం మాత్రమే. వాస్తవానికి, గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రజాధనం వెచ్చించి సృష్టించిన అపార సంపదలను బడా వాణిజ్య వర్గాలకు కట్టబెట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంటోంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అయిదేళ్ల కాలంలో ముట్టేది అయిదు శాతం కంటే తక్కువే అనేది చేదు నిజం. ఇది పథకం ప్రకారం రూపొందిస్తున్న భారీ కుంభకోణం తప్ప మరేమీ కాదు. నగదీకరణ వాస్తవ రాబడి ఎంత? ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు 25 సంవత్సరాల పాటు లీజు లేదా రెంట్కు అప్పగించడం ద్వారా 6 లక్షల కోట్ల రూపాయల రాబడిని కేంద్రం ఆశిస్తోంది. కానీ ప్రభుత్వానికి అంతిమంగా మిగిలేది పెద్దగా ఉండదని చిన్న ఉదాహరణ చెబుతుంది. ఆస్తుల విలువ ఇప్పుడు 100 రూపాయలు అనుకుందాం. ఈ సంపదపై సంవత్సరానికి 4 శాతం రాబడి వస్తుందనుకుందాం (ద్రవ్యోల్బణం తీసివేశాక). అయితే ప్రైవేటు వ్యాపారులు వాస్తవ వడ్డీరేటు అంచనా 6 శాతం అనుకుంటే ఈ వందరూపాయల సంపదపై వారికి వచ్చేది రూ. 51.3. దీన్ని రౌండ్ ఫిగర్ కింద 50గా మారిస్తే 25 ఏళ్లకాలానికి 4 శాతం వార్షిక రాబడి కింద వంద రూపాయల ఆస్తిపై రూ.50 రాబడి వచ్చినట్లు లెక్క. అంటే ఆస్తుల నగదీకరణ కింద అప్పగించిన ప్రతి వంద రూపాయలకు ప్రైవేట్ ఆపరేటర్కి వచ్చే రాబడి 50 రూపాయలన్నమాట. దీంట్లోంచి పెట్టుబడిపై ఆశించే రాబడిని తీసివేయాలి. తన మదుపుపై 50 శాతం కనీస రాబడిని ప్రైవేట్ వ్యాపారి ఆశిస్తున్నట్లయితే, ప్రతి రూ.100 ఆస్తిపై రూ.35లను చెల్లించడానికి అతడు సిద్ధపడతాడు. ఇప్పుడు అసలు లెక్క వస్తుంది. ఆరు లక్షల కోట్ల మార్కెట్ విలువ నుంచి రెంటల్ తదితర ఖర్చులను మినహాయిస్తే ప్రభుత్వానికి వచ్చే అసలు రాబడి రూ.1.5 లక్షల కోట్లు మాత్రమే. వాస్తవానికి కేంద్రప్రభుత్వం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధ్వంసకర నిర్ణయాల ద్వారా ఆర్థిక వ్యవస్థను నిశ్శబ్ద సంక్షోభంలోకి నెట్టివేసింది. 2019లో కార్పొరేట్ రంగానికి పన్నుల కోత ద్వారా రూ.1.45 లక్షల కోట్లను మిగిలించడం అతిపెద్ద విధ్వంసకర నిర్ణయం. జీడీపీ వృద్ధి నిరంతరాయంగా పతనం చెందడం, ఆర్థికంగా తప్పుడు నిర్ణయాల వల్ల రాబడులు తగ్గిపోవడం, వీటికి తోడు కార్పొరేట్ పన్ను కోతల భారం నుంచి తప్పించుకునేందుకు చమురు ధరను పెంచుతూ పోయారు. ప్రత్యక్ష పన్నులను పెంచడం ద్వారా దిగువ మధ్యతరగతి వినియోగదారులను పరోక్షంగా దెబ్బ తీశారు. దీంతో జీడీపీ పతన బాట పడుతూనే వచ్చింది. ఆస్తుల అప్పగింత ద్వారా వచ్చే రాబడిని ప్రభుత్వం ఏం చేస్తుందనేది ముఖ్యం. పెరిగిన ప్రభుత్వ వినియోగానికి రాబడిని ఉపయోగిస్తూ వస్తున్నారు. మౌలికరంగంపై మరింత పెట్టుబడి పెడతామంటున్నారు కానీ మితిమీరిపోయిన ప్రభుత్వ రుణాన్ని చెల్లించడానికి అది సరిపోతుంది. అంటే ప్రభుత్వ లక్ష్యాలు ఏవీ వాస్తవంగా అమలు కాలేవన్నది నిజం. – ప్రొఫెసర్ సి.పి. చంద్రశేఖర్, ఆర్థిక రంగ నిపుణులు -
మనిషి మనీషిగా మారాలంటే..?
►నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత? ►నడత మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఆ సంపద నివ్వటంలో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది. ►ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం , అసహాయులు, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు. నిషి పక్షిలా ఆకాశంలో ఎగరగలడు, నీటి అడుగునా ఈదగలడు. భూమిని తొలిచే శక్తి ఉన్నవాడు. భూమి మీద నడవగలిగితే ఈ రోజు ప్రపంచమే స్వర్గమవుతుంది’ అన్నాడు టామి డగ్లస్ అనే కెనడా దేశపు తత్వవేత్త.ఎంత అర్థవంతమైన మాటలు! ఎంత లోతుగా ఆలోచింపచేస్తున్నాయి!! చిత్తశుద్ధితో ఆత్మశోధన చేసుకోమనటం లేదూ!!! మనిషి శక్తి సామర్థ్యాలను, మనిషికున్న పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి ఈ మాటలు.తమ ప్రవర్తనను పరిశీలించుకుని, మదింపు చేసుకుని దానిలోని మంచి చెడులను తెలుసుకుని చెడును పరిహరించుకోవలసిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. మనిషి విస్మరిస్తున్న బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. మనిషి మనిషిగా ఉండటం చాలా కష్టమన్న ఓ కవి మాటల్ని రుజువు చేస్తున్నాయి. ఆ విషయాన్ని సుస్పష్టం చేస్తూ మనిషిని అప్రమత్తుణ్ణి చేస్తున్నాయి. ఇక్కడ నడవడమంటే మనిషి నడుచుకునే తీరు అని అర్ధం. అంటే ప్రవర్తన. దీనిలో అనేక అంశాలు... మనం ఇతరులతో మాట్లాడే పద్ధతి, నలుగురిలో మసలే తీరు, ఎదుటి వారి గురించి మనం చేసే ఆలోచనలు, సభ లో మనం నడుచుకునే విధానం, వివాహాది సందర్భాలలో మనముండే పద్ధతి... ఇమిడి ఉన్నాయి. మన ముఖకవళికలు, కనుబొమ ల కదలికలు, నేత్రద్వయ విన్యాసం, కరచరణాల అభినయం మన ఆలోచనా పోకడకు, మనసుకు చిత్తరువులవుతాయి. ఇవే మన నడతకు భాష్యం చెపుతాయి. మన వ్యక్తిత్వాన్ని ఇతరులకు స్ఫురింపచేస్తాయి. మనకు సమా జంలో ఒకగౌరవాన్ని, హుందాతనాన్ని తేవచ్చు లేదా అవి పోయేటట్టు చెయ్యచ్చు. మనలోని భావోద్వేగాలు అక్షరాకృతిని పొంది శబ్దరూపం దాల్చటానికి ముందే మన హావభావాలు, ఆంగికవిన్యాసం మన నడవడిని ఎదుటివారికి చూపిస్తాయి. మనమేమిటో చెప్పేస్తాయి. మనం ఒకరిని నోరారా ప్రేమతో పిలిచినా, ఆ పిలుపు అదే భావనలో వారికి చేరాలంటే వాటికి హావభావాలు తోడవ్వాలి. అప్పుడే వాటి మధ్య ఒక సమన్వయం ఏర్పడుతుంది. లేకపోతే, నోటితో పలకరిస్తూ నొసటితో వెక్కిరించటమే అవుతుంది. ఇదీ ప్రవర్తనలో అంతర్భాగమే. అందుకనే మన మాటలను, వాటిని ముందుగానే సూచించే శారీరక సంకేతాలమీద, ముద్రల మీద కూడ మనకు నియంత్రణ కావాలి. అది కష్టసాధ్యమే కాని, అసాధ్యమేమి కాదు. అపుడే ఇతరులను నొప్పించకుండా మనగలం. దీనికోసం ప్రయత్నం చేయాలి. మన మాటలతో కాని, చేతలతో కాని ఎదుటివారిని బాధ పెట్టకూడదు. ‘ఒరులేయవి యొనరించిన...’ అన్న శ్లోక సారాంశమిదే. ఇటువంటి వర్తనను అలవరుచుకోగలిగితే మన సంబంధ బాంధవ్యాలు హాయిగా, ఆనందంగా సాగిపోతాయి.నడక మన శరీరానికి చక్కని ఆకృతినిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పని సక్రమంగా ఉండేటట్టు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి నడత?మనిషికి చక్కని శీలసంపదనిస్తుంది. మంచి శీలమంటే సుగుణాలరాశి. ఇది చక్కని వ్యక్తిత్వాన్ని ప్రోది చేస్తుంది. ఆ సంపద నివ్వటం లో తల్లిదండ్రుల, గురువులు, పెద్దల పాత్ర ఎంతో అమూల్యమైనది.ఎదుటివారితో ప్రేమగా మాట్లాడటం, అసహాయుల, బాధా సర్పదస్టుల మీద కరుణ కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, చేసే పని లేదా వృత్తిలో నిబద్ధత, ధర్మచింతన, సమదృష్టి, సంస్కారయుతంగా నడచుకోవటం.. ఇత్యాది విషయాలు మనిషిలో ఉండే సహజ లక్షణాలు. వీటిని గొప్ప విషయాలుగా భావిస్తాం. వీటి గురించి చర్చించడం వల్ల ఉపయోగమే లేదు. ఈ అంతర్గత శక్తులు లేదా సుగుణాలను మనం అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో ఆచరించగలగాలి. అంటే త్రికరణ శుద్ధి అవసరం. అలా ఆచరించిన వారినే శీలసంపన్నులంటాం. కొన్ని వేలమాటలకు దక్కని ఫలితం, విలువ ఆచరణ వల్ల వస్తుంది. అపుడే ఆ సుగుణాలు మరింతగా శోభిస్తాయి. మనిషికి మంచి నడత చాలా ముఖ్యం. అందుకే అది అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక వంటపదార్ధపు రుచి దాని గురించి ఎంతగా మాట్లాడినా, వివరించినా తెలియదు. దాన్ని రుచి చూసినపుడే తెలుస్తుంది. అదే బోధనకు, ఆచరణకు ఉన్న భేదం. అటువంటి వారినే సమాజం గౌరవిస్తుంది. వారే ఆదర్శప్రాయులు. ప్రాతః స్మరణీయులు. వారే మార్గదర్శకులు అవుతారు. మంచి నడత గలవారి మాటలకు ఎనలేని శక్తి వస్తుంది. వారే ఎందరినో ప్రభావితం చెయ్యగలరు. సన్మార్గం చూపించగలరు.టామి డగ్లస్ చెప్పిన మాటల సారమిదే. మనిషి తనలోని శక్తులను మేల్కొలపాలి. నడతకున్న ప్రాముఖ్యతను గుర్తెరగాలి. అదే తనను మంచి మార్గంలో నడిపించగల శక్తి అని తెలుసుకోవాలి. మనిషిని మనీషిగా మార్చే శక్తి నడతే. అపుడు అందరిలోనూ, అంతటా ఆనందమే. – బొడ్డపాటి చంద్రశేఖర్ ఆంగ్లోపన్యాసకులు -
దేవినేని ఉమపై సోదరుడు చంద్రశేఖర్ వ్యంగ్యస్త్రాలు
సాక్షి, కృష్ణా : టీడీపీ నేత దేవినేని ఉమాపై ఆయన సోదరుడు చంద్రశేఖర్ విమర్శనాస్త్రాలు సంధించారు. తన సోదరుడు ఉమాకు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని దేవినేని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో మంగళవారం మాట్లాడుతూ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ ఉంపుడుగత్తెలా వ్యవహరస్తున్నాడని నిప్పులు చెరిగారు. టీడీపీ ఇచ్చిన 650 హామీల్లో అయిదు హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక 18 నెలల్లోనే అన్ని వర్గాలకు సంక్షేమం అందించారన్నారు. చదవండి: వల్లభనేని సవాల్.. దేవినేని ఉమ హైడ్రామా సంక్షేమాన్ని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ రాజకీయ నాయకులని భుజాలు చరుచుకునే చంద్రబాబు.. పేదలకు ఎన్ని పట్టాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు ఒకేసారి లక్షలాది మందికి పట్టాలు ఇస్తుంటే కన్నుకుట్టి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతల ఉత్తర ప్రగల్బాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం విచారణ జరిపించాలని దేవినేని చంద్రశేఖర్ కోరారు. చదవండి: ‘ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించబోతున్నాం’ టీడీపీ నేత దేవినేని ఉమా పెద్ద డ్రామా ఆర్టిస్టు అని ప్రజలందరికీ తెలుసు అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతుందన్నారు. పోలీసులు ఎలాగూ ధర్నా చేయనివ్వరని తెలిసి గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వచ్చి దేవినేని ఉమా డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి పతకం అమలువుతున్నప్పుడు వెంటనే ప్రభుత్వం బురదజల్లడానికి తెలుగుదేశం పార్టీ తయారవుతుందని ధ్వజమెత్తారు. గొల్లపూడిలో నిన్న 3648 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. చూసి ఓర్వలేక దేవినేని ఉమ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. దేవినేని ఉమకు చిత్తశుద్ధి ఉంటే.. పత్రికా ముఖంగానైనా లేదా ఒక టీవీ స్టూడియోకి వస్తే చర్చకు రావాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు. పోలీసులు ఎలాగూ అడ్డుకుంటారని తెలిసి తెలిసి రోడ్ల మీదకు వచ్చి డ్రామాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గొల్లపూడిలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని దేవినేని ఉమా మాట్లాడుతున్నారని, ‘ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం, గొల్లపూడి లబ్ధిదారులను పిలిపించి సమావేశం పెడదాం.. మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమా..’ అని దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. -
భారత మాజీ క్రికెటర్ చంద్రశేఖర్కు అస్వస్థత
సాక్షి, బెంగళూరు: భారత మాజీ క్రికెటర్, విఖ్యాత లెగ్ స్పిన్నర్ బి.ఎస్. చంద్రశేఖర్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన భార్య సంధ్య వెల్లడించారు. రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్లు ఆమె చెప్పారు. 75 ఏళ్ల చంద్రశేఖర్ గత శుక్రవారం తీవ్రమైన అలసటకు గురయ్యారు. దాంతో పాటు మాట తడబడటంతో ఆయన్ని స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. అత్యవసర విభాగంలోని వైద్యనిపుణులు ఆయనను పరీక్షించి... స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్గా నిర్ధారించి చికిత్స చేశారు. మెదడు రక్తనాళాల్లో బ్లాకేజ్లు ఏర్పడ్డాయని అందువల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. అనంతరం సాధారణ వార్డ్కు మార్చారని, ఇప్పుడు ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం, సమస్యా లేదని సంధ్య తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారం పది రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారని ఆమె పేర్కొన్నారు. మైసూరుకు చెందిన చంద్రశేఖర్ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 58 టెస్టులు ఆడి 242 వికెట్లు పడగొట్టారు. అప్పటి సహచర స్పిన్నర్లు బిషన్సింగ్ బేడీ, ప్రసన్న, వెంకటరాఘవన్లతో కలిసి 1960, 70 దశకాలను శాసించారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘అర్జున’, ‘పద్మశ్రీ’ పురస్కారాలతో గౌరవించింది. -
డీఎన్ఏ పరీక్షకు నేను సిద్ధం.. కేసీఆర్ సిద్ధమా?
సాక్షి, వికారాబాద్: ‘బండి సంజయ్ అసలైన హిందువు కాదు, డీఎన్ఏ పరీక్ష చేసుకోవాలని టీఆర్ఎస్లోని కొంత మంది మొరుగుతున్నారు. నేను డీఎన్ఏ పరీక్ష చేసుకునేందుకు సిద్ధం, మరి పెద్ద హిందువును అని చెప్పుకున్న నీవు డీఎన్ఏ పరీక్షకు సిద్ధమా? హిందువు ఎవరో, బొందుగాడు ఎవరో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తేల్చుకుందామా?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సీఎం కేసీఆర్కు సవాలు విసిరారు. ‘హిందుత్వ ఎజెండాపై నాగార్జునసాగర్ ఎన్నికల్లో పోటీకి వెళ్దాం.. సిసలైన హిందువు ఎవరో అక్కడ తేలుతుంది’అని అన్నారు. సోమవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ ఈ సందర్భంగా బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్.. కండువా కప్పి చంద్రశేఖర్ను పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రశేఖర్తోపాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. అమరుల త్యాగాల పునాదుల మీద కేసీఆర్ సీఎం పదవిని అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: (లక్షన్నర మందితో కేసీఆర్ సభ!) 2023లో బీజేపీ జెండా ఎగురవేస్తాం.. 2023లో గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగురవేస్తామని సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో 80 శాతం కృషి కేసీఆర్దే ఉన్నట్లు ప్రచారం చేసుకోవటం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 13,500 కంపెనీలు తీ సుకువచ్చి 3 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు కేసీఆర్ చెబుతున్నారని, ఇది రుజువు చేస్తే కేసీఆర్కు పాదపూజ చేస్తానని అన్నారు. లేదంటే బడితె పూజచేస్తానని హెచ్చరించారు. మాఫియాతో పోల్చటం సిగ్గుచేటు బీజేపీ మాఫియా పార్టీ అని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించటం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి గురించి ప్రశ్నిస్తే బీజేపీని మాఫియాగా అభివర్ణించటం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీనేత స్వామిగౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ అన్నారు. బీజేపీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 1న కేసీఆర్ ఓ దళితున్ని సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని, వివరాలు త్వరలో బహిర్గతం చేస్తానని తెలిపారు. బహిరంగ సభలో బీజేపీ నాయకులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, బంగారు శ్రుతి, సాయన్న, సదానందరెడ్డి, నరసింహారెడ్డి, ప్రహ్లాదరావు, మాధవరెడ్డి, శివరాజ్, పాండు తదితరులు పాల్గొన్నారు. -
18న బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి
సాక్షి, వికారాబాద్: మాజీ మంత్రి, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు డాక్టర్ ఎ. చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి పంపారు. పార్టీలో నిబద్ధత గల నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని, వెన్నుపోటుదారులకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. క్రమశిక్షణ కలిగిన తాను.. క్రమశిక్షణలేని కాంగ్రెస్లో ఇమడలేక పోతున్నానని పేర్కొన్నారు. కాగా, చంద్రశేఖర్ ఈనెల 18న వికారాబాద్లో బీజేపీలో చేరనున్నారు. 1985 నుంచి 2008 వరకు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా డాక్టర్ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. చదవండి: మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక 'కూకట్పల్లిలో బండి సంజయ్కు వ్యాక్సిన్ వేశా' -
కరోనా తగ్గే వరకు స్థానిక ఎన్నికలు వద్దు
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు స్థానిక ఎన్నికలను నిర్వహించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరతామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఆయన మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్గా అవతరిస్తున్నందున తమ ఉద్యోగులంతా విశాఖకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీపీఎస్ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాసరావు, ఈశ్వరరావు పాల్గొన్నారు. -
కోవిడ్కు కూడా ఎబోలా మందే!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వైరస్కు ఔషధాన్ని హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) అభివృద్ధి చేస్తోంది. దశాబ్దం కింద వచ్చిన ఎబోలా వైరస్ లక్షణాలే కోవిడ్లోనూ ఉన్నాయని.. అందుకే ఎబోలా యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ను రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) అభివృద్ధి చేస్తున్నామని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ఇప్పటికే ప్రపంచ ఫార్మా దిగ్గజం, రెమిడిస్విర్ను అభివృద్ధి చేసిన గిలియడ్ సైన్సెస్ కంపెనీ.. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతితో చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కోవిడ్ సోకిన వారిపై ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ చేసింది. ఇది విజయవంతమైతే మన దేశీయ అవసరాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనమే ఔషధాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2 నెలల్లో ఏపీఐ తయారీ.. ‘ఏపీఐ అభివృద్ధి కోసం అవసరమైన రైబోస్, పిర్రోల్, అలనీన్, కార్బోహైడ్రేట్స్–5 వంటి ముడి పదార్థాలను పెద్ద ఎత్తున సమీకరించాం. తొలుత శాంపిల్ ఏపీఐ కోసం 50 గ్రాములను తయారు చేస్తున్నాం. 15 మంది శాస్త్రవేత్తలు 2 విడతలుగా అభివృద్ధి పనిలో నిమగ్నమయ్యారు. 2 నెలల్లో పూర్తి స్థాయి ఏపీఐ సిద్ధమవుతుంది’అని చంద్రశేఖర్ తెలిపారు. ముంబై ఫార్మాతో ఒప్పందం.. ‘ఐఐసీటీలోని 3 స్టార్టప్ కంపెనీలు ఏపీఐకి అవసరమైన సాంకేతిక అభివృద్ధిలో సాయం చేస్తున్నాయి. ఏపీఐ తయారీ పూర్తయి, దేశీయ అవసరాల కోసం ఔషధ తయారీ అవసరమని కేంద్రం భావిస్తే.. బల్క్లో తయారు చేసేందుకు ముంబైకు చెందిన ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. స్థానిక మార్కెట్ కోసం ఔషధ తయారీకి హైదరాబాద్కు చెందిన రెండు, మూడు ఫార్మా కంపెనీలకు ఏపీఐలను అందిస్తాం’అని వివరించారు. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే చాలు.. ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరస్ తన రూపాన్ని, నిర్మాణాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు సాంకేతికత, అవగాహన పెరిగింది కాబట్టి వైరస్ను సమర్థంగా నివారించొచ్చు. వైరస్ సోకాలంటే ఏదైనా పరాన్నజీవి కావాలి. కోవిడ్ను తట్టుకునే రోగనిరోధక శక్తి మన శరీరానికి ఉంటుంది. దాన్ని బలోపేతం చేస్తే చాలు. ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి ఉన్నవారికి సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరూ 2–3 నెలలు ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది. -
లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ (35) శనివారం రాత్రి మృతి చెందాడు. ఎంఎంటీఎస్, ఇంటర్సిటీ రైలు సోమవారం ఢీకొన్న ఘటనలో ఎంఎంటీఎస్ రైలు క్యాబిన్లో ఇరుక్కుపోయిన లోకోపైలట్ చంద్రశేఖర్ను అతికష్టంమీద బయటకు తీసి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితికి చేరడంతో వెంటిలేటర్పై ఉంచి వైద్యులు చికిత్సలు అందించారు. రెండ్రోజుల క్రితమే ఆయన కుడికాలును కూడా తొలగించారు. కిడ్నీలు కూడా పనిచేయడం మానేశాయి. శనివారం రాత్రి కార్డియాక్ అరెస్ట్తో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్లో ఉంటున్నాడు. హైదరాబాద్ రైల్వే డివిజన్ మెకానిక్ విభాగంలో చేరి లోకోపైలట్గా పని చేస్తున్నాడు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15రోజుల క్రితమే మగబిడ్డ పుట్టాడు. చంద్రశేఖర్ మృతితో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి. -
లోకోపైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ చంద్రశేఖర్ (35) కుడికాలు ను గురువారం తొలగించారు. ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిధ్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో కుడిమోకాలి పైభాగం వరకు కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఇక ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బౌద్ధ నగర్కు చెందిన లెక్చరర్ శేఖర్(36)తో పాటు మరో నలుగురికి వివిధ రకాల చికిత్సలందిస్తున్నారు. -
చంద్రశేఖర్ది ఆత్మహత్య
సాక్షి, చెన్నై: భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ (58) గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన బలవన్మరణానికి అప్పులే కారణమని తేల్చారు. ఆర్థిక సమస్యల వల్లే చెన్నైలోని తన నివాసంలో చంద్రశేఖర్ గురువారం ఉరేసుకొని మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయన మరణవార్తతో తమిళనాడు క్రికెట్ సంఘం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో కాంచీ వీరన్స్ జట్టును ఆయన కొనుగోలు చేశారు. దీని నిర్వహణతో పాటు తన అకాడమీ కోసం బ్యాంకులు, సన్నిహితుల వద్ద రూ. 3 కోట్ల మేర అప్పు చేశారు. చివరకు చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చెన్నై రాయపేట ఆసుపత్రిలో శుక్రవారం చంద్రశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, క్రికెటర్లు దినేష్ కార్తీక్, మురళీ విజయ్, విజయ్ శంకర్లతో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం సభ్యులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. -
భారత మాజీ క్రికెటర్ ఆకస్మిక మృతి
సాక్షి, చెన్నై : భారత మాజీ క్రికెటర్, తమిళనాడు క్రికెట్కు సుదీర్ఘ కాలం మూలస్తంభంలా నిలిచిన వక్కడై బిశ్వేశ్వరన్ (వీబీ) చంద్రశేఖర్ గుండెపోటుతో గురు వారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు 58 ఏళ్లు. 1988–90 మధ్య భారత్ తరఫున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్ మొత్తం 88 పరుగులే చేయడంతో స్థానం కోల్పోయి మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. అతడి 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్ మాత్రం బాగా సాగింది. తమిళనాడు ఓపెనర్గా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన వీబీ 81 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు. దూకుడైన ఆటకు గుర్తింపు పొందిన చంద్రశేఖర్ 1988–89 ఇరానీ కప్ మ్యాచ్లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అప్పట్లో భారత్ తరఫున అదే ఫాస్టెస్ట్ ఫస్ట్ క్లాస్ సెంచరీ. రిటైర్మెంట్ అనంతరం 2012లో తమిళనాడు కోచ్గా, భారత సెలక్టర్గా పనిచేసిన ఆయన... ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్లోకి ధోనిని తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కామెంటేటర్గానూ గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ ప్రస్తుతం చెన్నైలో సొంత క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు.