Cheepurupalli
-
విజయనగరం: చీపురుపల్లి YSRCP అసెంబ్లీ అభ్యర్థి బొత్స నామినేషన్
-
అందరి చూపు వైఎస్సార్సీపీ వైపే..
చీపురుపల్లి(గరివిడి): జిల్లాలో అందరి చూపు వైఎస్సార్ సీపీవైపే. ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తుండడంతో టీడీపీ శ్రేణులు పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నాయి. అర్హతే కొలమానంగా సంక్షేమ పథకాలు అందజేయడం, ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ధికలగడం, జనబలం మెండుగా ఉండడంతో వైఎస్సార్సీపీలో చేరి ప్రజలకు సేవచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే కోవలో గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మన్నెపురి లక్ష్మణరావు ఆధ్వర్యంలో బద్రి పాపినాయుడు, మందాడి రాంబాబు, బద్రి లక్ష్మీనారాయణ, కిరాల రాము, పిసిని భవాని, బెల్లాన లక్ష్మిలకు చెందిన 100 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో శుక్రవారం చేరాయి. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల గుర్తుకొస్తారని, అనంతరం వారివైపు కన్నెత్తి కూడా చూడరని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కష్ట, సుఖాలను పంచుకోవడం సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు నైజమన్నారు. టీడీపీ నాయకులు ఈ రాష్ట్రానికి, జిల్లాకు, నియోజకవర్గానికి ఏం చేశారో ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో 600 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీను నెరవేర్చకుండా, మళ్లీ ఆరు గ్యారంటీలు పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనతో కొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల, భోగాపురం ఎయిర్పోర్టు, గిరిజన వర్సిటీ, గిరిజన ఇంజినీరింగ్, జేఎన్టీయూ వర్సిటీ మంజూరు చేసి ప్రజల చిరకాల కలను సీఎం సాకారం చేశారన్నారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణరాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, చీపురుపల్లి మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీలు గుడివాడ శ్రీరాములునాయుడు, సర్పంచ్ తమ్మినాయుడు, బార్నాల సూర్యనారాయణ, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో జోరుగా చేరికలు టీడీపీని వీడుతున్న శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరిన వెదుళ్లవలస టీడీపీ నాయకులు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన జెడ్పీచైర్మన్, ఎంపీ -
కార్పొరేట్ను తలదన్నేలా...
ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్సీ నూతన భవనం. ఇది కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి. రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం జిల్లాలో వైద్య విధాన్ పరిషత్కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆస్పత్రులు ఇలా... ప్రతి ఆస్పత్రిలోని క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్ వార్డులు, చేంజింగ్ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే విభాగం, కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అన్ని వసతులతో... వైద్య విధాన్ పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. – డాక్టర్ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) -
అమెరికాలో నృత్య ప్రదర్శనకు చీపురుపల్లి యువతులు
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఇద్దరు నృత్యకళాకారిణిలకు అరుదైన అవకాశం లభించింది. తాము నేర్చుకున్న విద్యను ఖండాంతరాల్లో ప్రదర్శించేందుకు అర్హత సాధించారు. చిన్నప్పటి నుంచి నృత్యంలో శిక్షణ పొంది దేశంలో ఎన్నో వేదికలపై వందలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చిన హిమబిందు, ప్రవళ్లికలు ఇప్పుడు విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వమే స్వయంగా వీరిని అమెరికాలో నృత్య ప్రదర్శనలకు పంపిస్తోంది. ఆజాదికా అమృత మహోత్సవ్లో భాగంగా ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారత ప్రభుత్వం వందేభారతం పేరుతో భారీ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. అందులో దేశ వ్యాప్తంగా 300 బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. అందులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన 35 బృందాలను విదేశాల్లో ప్రదర్శనలు కోసం ఎంపిక చేశారు. ఆ 35 బృందాల్లో శ్రీకాకుళానికి చెందిన శివశ్రీ కళా నృత్యనికేతన్ బృందానికి చెందిన నృత్యకారులు ఎంపికకాగా, అందులో చీపురుపల్లికి చెందిన నృత్యకారిణిలు ఇద్దరు ఉన్నారు. చీపురుపల్లి రిక్షాకాలనీకి చెందిన హిమబిందు ప్రస్తుతం టెక్మహీంద్రా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తుండగా, ఆంజనేయపురానికి చెందిన జి.ప్రవళ్లిక ఎమ్మెస్సీ చదువుతోంది. 12 బృందం నృత్యకారులు నృత్యనికేతన్ మాస్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ పర్యవేక్షణలో నృత్య ప్రదర్శనలకు మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. జూలై 21న అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. (క్లిక్: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
ఒకరు నమ్మించి... మరొకరు బెదిరించి
చీపురుపల్లి రూరల్: ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వాంఛ తీర్చుకున్నాడు. చివరికి ఆ వ్యక్తి మాయమాటల్లో పడి ఆ యువతి మోసపోయింది. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు వీరద్దరి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొని శారీరక వాంఛ తీర్చాలంటూ ఆ యువతిని భయపెట్టాడు. వారి ప్రేమ వ్యవహారాన్ని గ్రామంలో చెప్పి బయట పెడతానని చెప్పి బెదిరించాడు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిస్తే తమ కుటుంబం పరువు ఎక్కడ పోతుందోనని భయపడిన ఆ యువతి ఆ యువకుడికి కూడా లొంగిపోయింది. ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత ఆ యువతిలో శారీరక మార్పులు రావటంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆ యువతిని ఏమయ్యిందని ఇంట్లో నిలదీశారు. విషయం తెలుసుకొని డాక్టర్ వద్దకు తీసుకువెళ్లగా ఆమె గర్బవతి అయిందని తేలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం పంచాయతీ పరిధి పుర్రేయవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుర్రేయవలస గ్రామానికి చెందిన వివాహితుడు సంగిరెడ్డి రామారావు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఈ విషయం తెలుసుకున్న మరో యువకుడు బూటు పైడిరాజు ఆ యువతిని బెదిరించి వాంఛ తీర్చుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో గ్రామ పెద్దలకు తెలియజేసింది. అక్కడ న్యాయం జరగకపోవడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాటేసిన కాలువ
ఇద్దరు చిన్నారులూ ఐదోతరగతి చదువుతున్నారు. మంచి స్నేహితులు. ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం సెలవుపెట్టారు. సరదాగా ఆటల్లో నిమగ్నమయ్యారు. సైకిల్పై గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న తోటపల్లి కుడి ప్రధాన కాలువ వద్దకు చేరుకున్నారు. దుస్తులు ఒడ్డున పెట్టి స్నానం కోసం దిగబోయారు. అంతే.. కాలువ రూపంలో మృత్యువు కాటేసింది. ఇద్దరినీ అందని లోకాలకు తీసుకుపోయింది. పిల్లలే సర్వస్వంగా బతుకుతున్న కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. సాక్షి, చీపురుపల్లి రూరల్: చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారం గ్రామానికి చెందిన ఇజ్జరోతు సతీష్(9) ఖరీదు గౌరీ శంకర్(9) సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న తోటపల్లి కాలువలో పడి మృతిచెందారు. స్థానిక పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఇద్దరు చిన్నారులు స్థానికంగా ఉన్న వేర్వేరు ప్రైవేటు పాఠశాలల్లో ఐదోతరగతి చదువుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన వీరు పాఠశాలకు సెలవుపెట్టారు. ఆటల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం 3 గంటల సమయంలో సైకిల్పై తోటపల్లి కాలువ వైపు వెళ్లారు. ఇద్దరూ దుస్తులు తీసి ఒడ్డున పెట్టారు. స్నానానికి దిగబోయి కాలువలో పడిపోయారు. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరి మృతదేహం కాలువలోని నీటిలో తేలి ఉండడాన్ని అటువైపుగా వస్తున్న రైతులు గమనించారు. గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో స్థానికులు దిగి విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. ఒడున రెండు జతల దుస్తులు కనిపించడంతో మరో విద్యార్థి ఉండొచ్చని భావించి కాలువలో దిగి వెతికారు. కాలువలోని బురదలో కూరుకుపోయిన మరో చిన్నారి మృతదేహం కనిపించడంతో గగ్గోలు పెడుతూ బయటకు తీశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మరణంలోనూ వీడని స్నేహం.. వారిద్దరు చిన్నారులు మంచి స్నేహితులు. ఒకటే వయస్సు. మృత్యువులోనూ స్నేహం వీడలేదు. మృతుల్లో సతీష్ తల్లిదండ్రులు శంకరరావు డ్రైవర్ కాగా తల్లి అరుణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తోంది. వీరికి సతీష్ ఒక్కడే కుమారుడు. ఒక్కగానొక బిడ్డను మృత్యువు కాటేయడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని వారు విలపిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. మరో విద్యార్థి గౌరీ శంకర్ తల్లిదండ్రులు సత్యనారాయణ, కనకరత్నంలు అగ్రహారం గ్రామం రోడ్డు సమీపంలో చిన్నపాటి టిఫిన్ దుకాణం నడుపుకుంటూ కాలం గడుపుతున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు. అల్లారుముద్దుగా సాకుతున్న కుమారుడిని మృత్యువు కబళించడంతో భోరున విలపిస్తున్నారు. దేవుగా ఎందుకిలా చేశావు.. నీకు మేము ఏం అన్యాయం చేశావు... మా పిల్లలను తీసుకుపోయావంటూ ఏడ్చిన తీరు అక్కడివారిని కలచివేసింది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. -
బాబోయ్... బాలయ్య
-
బాబోయ్... బాలయ్య
సాక్షి, విజయనగరం: చంద్రబాబు వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వీరంగం ఇప్పట్లో ఆగేట్టు కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య వ్యవహారశైలి సొంత పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది. వీధి రౌడీలా కంటే హీనంగా ప్రవర్తిస్తున్న బాలకృష్ణను చూసి టీడీపీ నేతలే అదిరిపడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ‘ఫైటింగ్’పై స్థానికులు మండిపడుతున్నారు. ఆదివారం చీపురుపల్లి నియోజకవర్గంలో ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా వచ్చిన బాలకృష్ణ.. ఒక్కసారిగా వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో కార్యకర్తలు ఫొటో తీసుకోవడానికి ఎగబడ్డంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన ఆయన ఓ కార్యకర్త వెంటపడ్డారు. నడిరోడ్డుపై పరుగులు పెట్టించి అతడిపై పిడిగుద్దులు గుద్ది.. కాళ్లతో తన్ని విశ్వరూపం ప్రదర్శించారు. అక్కడితే ఆగకుండా తిట్ల దండకం మొదలెట్టారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆయన ప్రచారం చేస్తే నాలుగు ఓట్లు వస్తాయనకుంటే... కార్యకర్తలపై దాడి చేయడం ద్వారా ఉన్న ఓట్లు కూడా పోయేట్టు ఉన్నాయని తలలు పట్టుకుంటున్నారు. (చదవండి: బాలయ్య బిత్తిరిపర్వం.. మరో కార్యకర్తకు షాక్..) -
చీపురుపల్లిలో నామినేషన్ వేసిన బొత్స
-
ఒక అసెంబ్లీ... ఇద్దరు ఎమ్మేల్యేలు...
సాక్షి, అమరావతి: ఎన్నికలు మొదలైన తొలి దశకంలో కొన్నిచోట్ల ద్విసభ్య (ఇద్దరు సభ్యుల) నియోజకవర్గాలు ఉండేవి. వాటిలో ఒకటి ఎస్సీలకు, మరొకటి జనరల్కు కేటాయించేవారు. అప్పట్లో ఎస్సీ ఓటర్లు అధికంగా ఉండేచోట్ల ఈ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యేవారు. 1962 ఎన్నికల నుంచి ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. శ్రీకాకుళం, అదే జిల్లాలో పాతపట్నం ద్విసభ్య నియోజకవర్గాలుగా ఉండేవి. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, గజపతినగరం, విజయనగరం, శృంగవరపుకోట ద్విసభ్య స్థానాలు ఉండేవి. విశాఖ జిల్లాకు వస్తే.. పాడేరు (అప్పట్లో గొలుగొండ), నర్సీపట్నంలో ఈ స్థానాలు ఉండేవి. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు (అప్పట్లో పల్లిపాలెం. 2009లో రద్దయిన నియోజకవర్గం), కాకినాడ, అమలాపురం, రాజోలు, రాజానగరం నియోజకవర్గాలు ద్విసభ్య జాబితాలో ఉండేవి. పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే.. కొవ్వూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం ఉండేవి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ (అప్పట్లో దివి), ప్రకాశం జిల్లా ఒంగోలు, కందుకూరు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం (ప్రస్తుతం కోవూరు), నెల్లూరు, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు ద్విసభ్య స్థానాలుగా ఉండేవి. కడప జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని, అనంతపురం జిల్లా గుంతకల్లు, కల్యాణదుర్గం, హిందూపూర్, ధర్మవరం, చిత్తూరు జిల్లా పుంగనూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు నియోజకవర్గాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకునేవారు. ఈ నియోజకవర్గాల్లో ప్రతి ఓటరు ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉండేది. గుంటూరు జిల్లాలో మాత్రం ఒక్కటి కూడా ద్విసభ్య నియోజకవర్గం లేకపోవటం గమనార్హం. గుర్తుందా! 1967కి ముందు విశాఖ నగరం మొత్తం ఒకే నియోజకవర్గంగా ఉండేది. 1967లో ఇది విశాఖ–1, విశాఖ–2 స్థానాలుగా విడిపోయింది. 2009లో ఆ రెండు నియోజకవర్గాలు రద్దవగా, పునర్విభజనతో విశాఖ (తూర్పు), విశాఖ (పశ్చిమ), విశాఖ (దక్షిణం), విశాఖ (ఉత్తరం) నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. అదే ఏడాది పరవాడ నియోజకవర్గం రద్దవగా, ఆ స్థానంలో గాజువాక ఏర్పాటైంది. 1955, 62 ఎన్నికల్లో కొండకర్ల నియోజకవర్గం ఉండేది. 1967లో అది రద్దయ్యింది. 1962 ఎన్నికల్లో బొడ్డం నియోజకవర్గం ఉండేది. ఆ తరువాత రద్దయ్యింది. 1955 ఎన్నికల్లో గూడెం (ఎస్టీ) నియోజకవర్గం ఉండేది. 1962 ఎన్నికల్లో అది చింతపల్లి (ఎస్టీ)గా మారింది. 2009 పునర్విభజనలో చింతపల్లి రద్దయి, ఆ స్థానంలో అరకు (ఎస్టీ) ఏర్పాటైంది. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పాటైన గొలుగొండ 1967లో రద్దయ్యి, పాడేరు (ఎస్టీ) ఏర్పాటైంది. 1967లో ఏర్పడిన జామి నియోజకవర్గం 1978లో రద్దయి పెందుర్తి నియోజకవర్గం తెరపైకి వచ్చింది. -
రెబల్తో బోణీ..
సాక్షి, చీపురుపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు పర్వానికి తెర లేచిన మొదటి రోజునే బోణీ పడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా కె.త్రిమూర్తులురాజు నామినేషన్ దాఖ లు చేశారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునను అధిష్టానం ఎంపికగా చేయగా... దానిని వ్యతిరేకిస్తూ త్రిమూర్తులురాజు సోమవారం ఉదయం నామినేషన్ వేశారు. పట్టణంలోని ఆంజనేయపురంలో గల ఆయన నివాసం నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయిలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సాల్మన్రాజ్కు అందజేశారు. అంతకుముందు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 2014లో పార్టీ అధిష్టానం మృణాళినిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించి గెలిపించాలని ఆదేశిస్తే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గెలిపించామనీ, ఆమె గెలిచిన తరువాత నియోజకవర్గంలో పార్టీ భ్రష్టుపట్టిపోయిందని, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందనీ పేర్కొన్నారు. మూడేళ్లుగా ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెబుతున్నా కనీసం పట్టించుకోలేదనీ, ఆమెకు ఈసారి టిక్కెట్టు ఇవ్వొద్దని సమన్వయ కమిటీలో 80 శాతం మంది వ్యతిరేకించామనీ, అయినా ఆమె కుమారుడికి ఇవ్వడం తమను బాధించిందని చెప్పారు. మరో ఐదేళ్లు బాధలు అనుభవించలేమని, కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు అనుగుణంగా పోటీకి వెళ్లాలని భావించినట్లు తెలిపారు. ఆయనకు చీపురుపల్లి జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్ మద్దతు తెలిపారు. -
టీడీపీలో రె‘బెల్స్’
తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది.అభ్యర్థుల ఎంపిక వివాదాస్పదమైంది. ఇప్పటివరకూ ప్రకటించిన ఏడింట్లో అప్పుడే రెండుచోట్ల రెబల్స్పుట్టుకొచ్చారు. అందులో ఒకచోట అప్పుడే నామినేషన్కూడా వేసేశారు. ఇంకా ప్రకటించాల్సిన రెండింటి విషయంలోనూ వివాదం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.అక్కడ కూడా రెబల్స్కు అవకాశం ఉందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలోనే ఇన్ని వివాదాలు తలెత్తితే... ఇక ముందు ముందు ఎలాంటి విచిత్రాలు చోటు చేసుకుంటాయోనన్నసందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీలో నామినేషన్ల పర్వం రెబల్స్తో మొదలైంది. అభ్యర్థుల ఎంపికలోనే తడబడుతున్న అధికార పార్టీ ఇప్పటికీ జిల్లాలోని రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ నియోజకవర్గానికి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేకపోతోంది. నాదంటే నాదేనంటూ సీటు కోసం ఈ పార్టీ నేతలు ఆశలు పెట్టుకుంటున్నా వారికి అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో తాము వద్దన్న వారికే మరలా టిక్కెట్టు ఇవ్వడంపై తీవ్ర మనస్థాపానికి గురైన టీడీపీ అసంతృప్త నేతలు రెబల్స్గా మారుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తోంది. చీపురుపల్లిలో రెబల్గా త్రిమూర్తులురాజు చీపురుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జునకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె.త్రిమూర్తులరాజు సోమవారం రెబల్గా నామినేషన్ దాఖలు చేశారు. త్రిమూర్తులు ఏపీజీవీబీ మేనేజర్, ఆ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో బొత్స సత్యనారాయణపై గద్దె బాబూరావు ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినప్పటికీ మృణాళికి పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. అప్పుడు కూడా ఇలాగే రెబల్గా నామినేషన్ వేశారు. కానీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అశోక్గజపతిరాజు బుజ్జగించి నామినేషన్ వెనక్కుతీసుకునేలా చేశారు. తీరా అశోక్ ఎంపీ అయిన తర్వాత మాటతప్పి త్రిమూర్తులు రాజును మోసం చేశారు. ఐదేళ్లుగా ఇస్తామన్న ఎమ్మెల్సీగానీ, మరే ఇతర పదవిగానీ ఇవ్వలేదు. దీంతో ఈసారైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పట్టుబట్టారు. చివరి నిమిషం వరకూ పోరాడారు. అయినా మళ్లీ పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో మరలా రెబెల్ అవతారం ఎత్తారు. ఈ పట్టుదల చివరి నిమిషం వరకూ ఉంటుందో... లేక అధిష్టానం ఆదేశాలతో విరమించుకుంటారో చూడాలి. ఈసారి పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం పదవి కోసమే ఈ డ్రామాలనే విషయం జనానికి అర్థమై, ఇప్పటి వరకూ ఆయనపై ఉన్న గౌరవాన్ని కోల్పోవాల్సి ఉంటుందని ఆయన వర్గీయులే అభిప్రాయపడుతున్నారు. గజపతినగరంలోనూ అదే తీరు... జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి గజపతినగరం సమస్యాత్మకంగా మారింది. టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడుకు వ్యతిరేకంగా అతని సోదరుడు కొండబాబు రెబల్గా నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. నెల్లిమర్ల టిక్కెట్టుపై కూడా అధిష్టానం ఏ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతోంది. ఇక్కడ కూడా పతివాడ నారాయణస్వామినాయుడు లేదా అతని కుమారుడు అప్పలనాయుడుకు టిక్కెట్టు ఇస్తే టీడీపీలో రెబల్స్ పుట్టుకొచ్చే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ప్రశ్నార్థకంగా గీత భవితవ్యం విజయనగరంలో దాదాపుగా టిక్కెట్ కోల్పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం రాత్రి ఇంటికి పిలిపించుకున్న అశోక్ గజపతి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అదితిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నానని, ఆమెకు కొత్త గనుక వెనకుండి ప్రచారం చేయాలని గీతను కోరారు. తాను ఉండగా ఇదేమిటని, అధిష్టానం తనకే టిక్కెట్టు ఇస్తుందనే నమ్మకం ఉందని సమాధానం చెప్పి గీత వెనుదిరిగారు. విజయనగరం టిక్కెట్ల ఖరారు బాధ్యతను అశోక్కే చంద్రబాబు అప్పగించినందున ఆయన తన కుమార్తెకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేగాదు పార్టీ అధికారిక ప్రకటన వెలువడకపోయినా తన కుమార్తె నామినేషన్ వేసే తేదీని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో రెబల్గా పోటీలో నిలబడాలని గీత వర్గీయులు పట్టుబడుతున్నారు. ఆమె కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేనతోనూ సంప్రదింపులు జరుపుతున్నటికీ టీడీపీతో తెరవెనుక పొత్తుల నేపధ్యంలో అశోక్ కుమార్తెకు వ్యతిరేకంగా గీతకు జనసేన టిక్కెట్టు ఇచ్చే అవకాశం లేదు. -
పార్టీ ప్రకటనకు ముందే రెబల్గా నామినేషన్..
-
తొలి రోజే టీడీపీకి షాకిస్తున్న రెబల్స్..
సాక్షి, అమరావతి: నామినేషన్ల పర్వం మొదలైన రోజే టీడీపీకి గట్టి షాక్ తగిలింది. పలువురు టీడీపీ రెబల్ అభ్యర్థులు తొలి రోజే తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రెబల్స్ నామినేషన్ల పర్వం ఓ వైపు.. పార్టీలో అసమ్మతి నేతల మరోవైపు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మెజారిటీ జిల్లాలో ఇలాంటి పరిస్థితులే నెలకొనడం టీడీపీకి మింగుడుపడని అంశంగా మారింది. రెబల్స్ను బుజ్జగించాలని చూస్తున్న టీడీపీ నేతల ప్రయత్నాల ఫలించడంలేదు. రెబల్ అభ్యర్థిగా బరిలోకి త్రిమూర్తులు రాజు... విజయనగరం: జిల్లాలో తొలి నామినేషన్ అధికార పార్టీ రెబెల్ అభ్యర్థితో మొదలైంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె తిమూర్తులు రాజు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లి టికెట్పై ఆశపెట్టుకున్న త్రిమూర్తులు రాజుకు నిరాశే మిగిలింది. దీంతో ఆయన టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ చీపురుపల్లి టికెట్ను ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగర్జునకు కేటాయించింది. దీనిని వ్యతిరేకిస్తూ త్రిమూర్తులు రాజు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం తన నివాసంలో సమావేశమయ్యారు. కిమిడి మృణాళిని కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దన్న పార్టీ పట్టించేకోలేదన్నారు. మూడు రోజులుగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన అనంతరమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. (విజయనగరం టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి జ్వాలలు) త్రిమూర్తులు రాజు నిర్ణయానికి పార్టీలోని మెజారిటీ ప్రజలు అండగా నిలిచారు. ఆయన నామినేషన్ ప్రక్రియకు కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. పార్టీ ఓడిపోయేవారికి టికెట్ ఇచ్చిందని.. అందుకే పార్టీని బ్రతికించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు త్రిమూర్తులు రాజు వ్యాఖ్యానించారు. త్రిమూర్తులు రాజును ఎలాగైనా బుజ్జగించి.. పోటీలో లేకుండా చేయాలనే టీడీపీ నేతల ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ ప్రకటనకు ముందే రెబల్గా నామినేషన్.. అనంతపురం: కల్యాణదుర్గం టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుండటంతో.. పార్టీ అభ్యర్థిని ప్రకటించకముందే సిట్టింగ్ ఎమ్మెల్యే రెబల్గా బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. టికెట్ ఖరారు కాకముందే నామినేషన్ వేయడంపై ఆయన వ్యతిరేక వర్గం భగ్గుమంటుంది. హనుమంతరాయ చౌదరి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. పార్టీ తరఫున టికెట్ వచ్చినా.. రాకపోయిన పోటీ చేసి తీరుతానని హనుమంతరాయ చౌదరి స్పష్టం చేశారు. మాల్యాద్రిని చిత్తుగా ఓడిస్తాం.. గుంటూరు: తాడికొండ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రవణ్కు కేటాయించకపోవడం ఆయన వర్గం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. శ్రవణ్కు టికెట్ కేటాయించాలని సీఎం నివాసం వద్ద కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. తాడికొండ టికెట్ మాల్యాద్రికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్కు టికెట్ ఇవ్వకపోతే.. మాల్యాద్రిని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎంపీ సుజనా చౌదరి అండతోనే మాల్యాద్రికి సీటు ఇచ్చారని విమర్శిస్తున్నారు. మల్యాద్రి ముసుగులో రాజధానిలో అవినీతికి పాల్పడాలని సుజనా చూస్తున్నారని ఆరోపించారు. మాల్యాద్రిని గ్రామాల్లోకి కూడా రానివ్వమని టీడీపీ కార్యకర్తలు తేల్చిచెప్పారు. తూర్పు గోదావరిలో అసంతృప్త జ్వాలలు.. తూర్పుగోదావరి: జిల్లాకు చెందిన పలువురు అసంతృప్త నేతలు బాహాటంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం ఏజెన్సీలో వంతల రాజేశ్వరి ఎంపికపై విలీన మండలాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పులపర్తి నారాయణమూర్తికి పి గన్నవరం టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. -
టీడీపీకి గట్టి షాక్ తగిలింది
-
ప్రజాసంకల్పయాత్ర 279వ రోజు చీపురుపల్లి నియోజకవర్గం
-
మృణాళిని మాకొద్దు.!
సాక్షిప్రతినిధి, విజయనగరం: చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మృణా ళినికి సొంత పార్టీ నుంచి తిరుగుబావుటా ఎదు రైంది. ఆమెను కొనసాగించవద్దంటూ పార్టీ నాయ కులు తెగేసి చెబుతున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త చేసే అక్రమాలను చూస్తూ ఊరుకోలే మంటున్నారు. గరివిడి జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణ నేతృత్వంలో శనివారం చీపురుపల్లి జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, టీడీపీ మండలాధ్యక్షుడు రౌతు కామునాయుడు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్, గుర్ల జెడ్పీటీసీ భర్త కిరణ్రాజు, ఎంపీపీ సోదరుడు వెన్నె సన్యాసినాయుడులు అదే పార్టీకు చెందిన ఎమ్మెల్యే కిమిడి మృణాళినిపై నేరుగా సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేయడం చర్చాంశనీయాంశంగా మారింది. చంద్రబాబు జిల్లాకు వస్తున్న సమయంలో ఓ వైపు బొబ్బిలిలో, మరోవైపు చీపురుపల్లిలో సొంత పార్టీల నుంచే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర స్థాయిలో అసమ్మతి పవనాలు వీస్తుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఇవీ కారణాలు: నియోజకవర్గంలో ఔట్ సోర్సింగ్ విధానంలో వందలాది ఉద్యోగ నియామకా లు ఎమ్మెల్యే, ఆమె భర్త జరిపారని, గ్రామీణ విద్యుత్ సహకార సం ఘం (ఆర్ఈసీఎస్) లో 30కుపైగా ఉద్యో గ నియామకాల్లో భారీస్థాయిలోడబ్బు వసూలు చేశారన్న ఆరోపణలను సీఎం దృష్టికి అసంతృప్తి వర్గం తీసుకెళ్లింది. ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, ఎమ్మెల్యే భర్త కిమిడి గణపతిరావులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఉద్యోగ నియామకాలు చేసుకున్నారని పార్టీలో ఉన్న తమను కనీసం సంప్రదించ లేదని సీఎంకు ఫిర్యాదు చేశారు. పద్ధతి ప్రకారం ఫిర్యాదు.. మృణాళినిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు కేవలం నోటి మాటలతో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకోలేదు. వారంతా పదవులు కలిగిన వారే కావడంతో వారి లెటర్హ్యాడ్లపై స్వయంగా ఫిర్యాదులు రాసి, అదనపు కాగితాలు కూడా జతచేసి సీఎంకు ఇచ్చారు. చీపురుపల్లి జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు ఏకంగా 12 పేజీల్లో ఎంఎల్ఎపై ఫిర్యాదులు లిఖిత పూర్వకంగా అందజేసినట్టు తెలిసింది. గత నాలుగున్నర సంవత్సరాలుగా వీరికి ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ స్థాయిలో బయిటపడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో అసంతృప్తి వర్గాల తిరుగుబాటు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే, ఈ అసంతృప్తి వర్గాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు విడుదలయ్యే నిధులు, ఎన్నికల ప్రయోజనాల్లో భాగంగా అధిష్టానం దృష్టి తమపై పడేలా చేసుకోవడానికి అసంతృప్తి అస్త్రం ప్రయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కారణమేదైనా టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు అసంతృప్తి వెళ్లగక్కుతూ ఇన్నాళ్లూ జనానికి తామేమీ చేయకపోగా స్వప్రయోజనాలే తమ పరమావధి అనే విషయాన్ని బయటపెడుతున్నారు. -
విసిగిపోయే ప్రాణాలు తీశాడు..
చీపురుపల్లి: భార్య ప్రవర్తనతో విసిగి వేసారిన భర్త ఆలోచన మారిపోయింది. తాను డబ్బులు ఇస్తానని చెప్పినా రాకుండా ప్రియుడితో కలిసి వాహనంపై తిరుగుతోందన్న సమాచారంతో మరింత రగిలిపోయాడు. చివరకు ప్రియుడితో కలిసి ద్విచక్ర వాహనంపై దర్జాగా వస్తున్న భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. అంతే కోపం కట్టలు తెంచుకుని ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో లారీతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఆ ఇద్దరినీ హతమార్చాలని భావించాడు. ఈ నెల 7వ తేదీన జరిగిన లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో పోలీసుల విచారణలో తేలిన అంశమిది. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్యామలరావు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన రేగాన తవిటయ్య, రమణమ్మలు భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్గా పని చేస్తున్న తవిటయ్య భార్య రమణమ్మకు అదే గ్రామానికి చెందిన రేగాన రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై భార్యను పలుమార్లు తవిటయ్య హెచ్చరించాడు. అయినా రమణమ్మ భర్త మాట పెడచెవిన పెట్టింది. ఈ నెల 6వ తేదీన హుజూరాబాద్ నుంచి పర్లాకిమిడికి సిమెంట్ లోడు తీసుకువస్తున్న తవిటయ్య తన భార్య రమణమ్మకు ఫోన్ చేసి 7వ తేదీ ఉదయం 10 గంటలకు సుభద్రాపురం వస్తే డబ్బులు ఇస్తానని తెలిపాడు. అలాగే అని చెప్పిన రమణమ్మ మధ్యాహ్నం ఒంటి గంట అయినా సుభద్రాపురం చేరుకోలేదు. ఇంతలో తవిటయ్య ఇంటికి ఫోన్ చేస్తే కుమార్తె ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ ఎప్పుడో బయిలుదేరిపోయిందని తెలిపింది. వెంటనే తవిటయ్య చీపురుపల్లిలో ఉండే తన సహచరులకు ఫోన్ చేస్తే రామకృష్ణతో కలిసి బండిపై వెళ్లడం చూశామని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన తవిటయ్య సుభద్రాపురం నుంచి చీపురుపల్లి వైపు లారీలో వస్తుండగా, ఎదురుగా ద్విచక్ర వాహనంపై తన భార్య రమణమ్మ ప్రియుడు రామకృష్ణతో రావడం చూశాడు. వెంటనే వారిని హతమార్చాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనాన్ని లారీతో బలంగా ఢీకొట్టాడు. ఈ సంఘటనలో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, రామకృష్ణ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించిన తవిటయ్యపై 302,304 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి ఎస్సైలు టి.కాంతికుమార్, శ్రీనివాస్ ఉన్నారు. -
కనకమహలక్ష్మి ఆలయంలో చోరీ
అమ్మవారి ఆలయంలో దొంగలు చీపురుపల్లి : కోర్కెలు తీర్చే కల్పవల్లి, చీపురుపల్లి ప్రాంత ఇలవేల్పు శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయంలో దొంగలు పడ్డారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగుచూడడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి ఆలయంలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే దొంగలు గర్భగుడిలోకి సైతం ప్రవేశించినప్పటికీ ఎలాంటి బంగారు ఆభరణాలు లభించకపోవడంతో దేవాదాయశాఖ సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దేవాదాయశాఖ మేనేజర్ జి.శ్రీరామ్మూర్తి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి దూరంగా ఉన్న అమ్మవారి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారం గొళ్లెం స్క్రూలు విప్పి లోపలికి ప్రవేశించారు. అక్కడ నుంచి గర్భగుడి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి గొళ్లెం తొలగించి లోపలకి ప్రవేశించారు. అయితే వారికి విలువైన వస్తువులు దొరక్కపోవడంతో అమ్మవారి విగ్రహంపైనున్న రోల్డ్గోల్డ్ ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై దేవాదాయ శాఖ మేనేజర్ జి. శ్రీరామ్మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణానికి దూరంగా ఆలయం ఉండడంతో బంగారు ఆభరణాలు ఆలయంలో ఉంచడం లేదని మేనేజర్ తెలిపారు. -
ఆకలి తీర్చండి..
చీపురుపల్లి/గరివిడి: నియోజకవర్గ పరిధిలో మూతపడిన ఫేకర్, ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు తెరిపించి వేలాది మంది కార్మికుల ఆకలి మంటలు తీర్చాలని సీఐటీయూ ప్రతినిధులు అంబల్ల గౌరునాయుడు, జంపన విశ్వనాథరాజు డిమాండ్ చేశారు. ఆకలియూత్ర పేరుతో సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు, మహిళలు గరివిడి నుంచి చీపురుపల్లి వరకు పాదయూత్ర చేపట్టారు. అనంతరం పట్టణంలోని కొత్త గవిడివీధిలో గల రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే సీఐ ఎస్.రాఘవులు, ఎస్సై టి.కాంతికుమార్ నేతృత్వంలో పోలీసులు కార్మికులు, నాయకులను అడ్డుకున్నారు. దీంతో క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి పరిశ్రమలు తెరిపించాలి.. కార్మికుల జీవితాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజిన్ కార్యదర్శి అంబల్ల గౌరునాయుడు మాట్లాడుతూ, రెండేళ్లుగా గరివిడిలో ఫేకర్ పరిశ్రమ మూతపడిందన్నారు. దీంతో వేలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని మెరకముడిదాం, గుర్ల మండలాల్లో ఉన్న ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు కూడా మూతపడ్డాయని, ఈ విషయూన్ని మంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అనంతరం మంత్రి మృణాళిని క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, రెడ్డి గోవింద్, నానిబాబులకు కార్మికులు వినతిపత్రం అందజేశారు. -
స్వాహాపై లోకాయుక్తకు...
చీపురుపల్లి: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా మండలంలో బొప్పాయి సాగుకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహక నిధుల్లో చోటు చేసుకున్న భారీ కుంభకోణంపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, విచారణ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బెల్లాన రవి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షాత్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులను రక్షించి, అర్హులకు అందజేయాల్సిన తెలుగుదేశం నాయకులే స్వాహాకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. బొప్పాయి సాగు ప్రోత్సాహకాల్లో రూ.కోటి వరకు స్వాహా జరిగిందని, దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిధులు పక్కదారి పడుతున్న విషయాన్ని ముందుగానే ఉద్యానవనశాఖ అధికారుల దృష్టికి తాము తీసుకెళ్లినప్పటికీ కనీసం పట్టించుకోలేదన్నారు. పైగా ఏడీ ప్రసాద్ ఈ విషయం తన దృష్టికి రాలేదని పత్రికలకు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. బొప్పాయి సాగు చేసుకునే అర్హులైన రైతులకు నిధులు ఇవ్వకుండా తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో ఉద్యానవనశాఖ అధికారులు భూములు లేని వారికి, బొప్పాయి మొక్కలు నాటని వారికి, గ్రామాల్లో లేని వ్యక్తులకు ప్రోత్సాహక నిధులు జమ చేయడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీని వెనుక తెలుగుదేశం నాయకులు హస్తం ఉందని ఆరోపించారు. రాబోయే గ్రీవెన్స్ సెల్కు అర్హులైన రైతులతో వెళ్లి కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లనున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, కరిమజ్జి శ్రీనివాసరావు, మీసాల రమణ, కంది పాపినాయుడు, అధికార్ల శ్రీనుబాబు, కోరాడ సిమ్మినాయుడు, రేవల్ల సత్తిబాబు, కర్రోతి శరత్, కరణం ఆది తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టంలో ఫిర్యాదు ఇదిలా ఉండగా ప్రోత్సాహకాల్లో జరుగుతున్న అక్రమాలపై చాలా రోజుల క్రితమే ఉద్యానవనశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పి.కె.పాలవలస గ్రామానికి చెందిన రెల్లి వెంకటేశ్ చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బొప్పాయి సాగుకు ఉద్యానవనశాఖ అధికారులు ఇస్తున్న నిధులు పక్కదోవ పడుతున్నాయని ఆ శాఖ ఏడీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. భూములు లేని రైతులకు నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పినా వారు పట్టించుకోలేదన్నారు. దీంతో ఏయే రైతులకు, ఎంతమంది రైతులకు బొప్పాయి ప్రోత్సాహక నిధులు ఇస్తున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని మార్చి 31న సమాచార హక్కు చట్టంద్వారా సమాచారం కోరినట్లు ఆయన తెలిపారు. 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు వివరాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. గ్రామంలో విచారణ నిర్వహిస్తే వాస్తవాలు బయిటపడతాయని చెప్పారు. -
విద్యార్థిని అదృశ్యంపై మంత్రి ఫైర్
చీపురుపల్లి (విజయనగరం) : చీపురుపల్లిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని అదృశ్యంపై సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్ బాబు స్పందించారు. స్కూల్ ప్రిన్సిపాల్ వేంకటేశ్వర రావు, టీచర్ రజనీ కుమారిలపై సస్పెన్షన్ విధించారు. అదృశ్యానికి సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు. -
ఆదాయంలో రిజిస్ట్రేషన్ శాఖ దూకుడు
గడిచిన తొమ్మిది నెలల్లో జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం ఇలా ఉంది. నెల్లిమర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ లక్ష్యం కోటీ 86 లక్షల రూపాయలు. కాగా రికార్డు స్థాయిలో రూ.5 కోట్ల ఆదాయం సాధించింది. 268.92 శాతంతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన కురుపాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.39 లక్షలు. రూ.71 లక్షల ఆదాయం సాధించింది. చీపురుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం 2.49 కోట్ల రూపాయలు కాగా, రూ.4.320 కోట్ల రాబడితో మూడోస్థానంలో నిలిచింది. సాలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ లక్ష్యం రూ.3.12 కోట్లు కాగా.. రూ.5.19 కోట్లు సాధించింది. గజపతినగరం కార్యాలయం లక్ష్యం 3.44 కోట్ల రూపాయలు కాగా.. రూ.5 కోట్లు సంపాదించింది. విజయనగరం పశ్చిమ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.16.53 కోట్లు కాగా.. రూ.23 కోట్ల రెండు లక్షల ఆదాయంసాధించి 139.26 శాతంతో ఆరో స్థానంలో నిలిచింది. తెర్లాం కార్యాలయ లక్ష్యం ఒక కోటీ34 లక్షల రూపాయలు కాగా.. కోటీ 83 లక్షల రూపాయలు సంపాదించింది. కొత్తవలస కార్యాలయం లక్ష్యం 11 కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు కాగా.. 14.96 కోట్ల రూపాయల ఆదాయంతో 134.86 శాతం పొంది ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు కాగా.. నాలుగు కోట్ల 37 లక్షల రూపాయలు సాధించింది. పార్వతీపురం కార్యాలయం లక్ష్యం ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయలు కాగా, రూ.6 కోట్ల 82 లక్షల ఆదాయాన్ని సముపార్జించింది. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.25.37 కోట్లు కాగా రూ.27.21 కోట్లు సాధించి 107 శాతం ఆదాయంతో 11వ స్థానంలో నిలిచింది. బొబ్బిలి కార్యాలయం లక్ష్యం 7.98 కోట్ల రూపాయలు కాగా 8.52 కోట్లు సంపాదించింది. విజయనగరం ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. లక్ష్యం 24.79 కోట్ల రూపాయలు కాగా.. రూ.23.45 రూపాయలు మాత్రమే సంపాదించింది. 94.58 శాతం ఆదాయంతో చివరి స్థానంలో నిలిచింది. తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వందశాతం నుంచి 200 శాతం పైబడి ఆదాయం సాధించడం విశేషం. -
ఆస్పత్రిలో కేంద్రమంత్రి ఆకస్మిక తనిఖీలు
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతి రాజు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9.30 లకు మంత్రి ఆరోగ్య కేంద్రానికి రాగా ఒక్క వైద్యుడూ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకు వైద్యులు రావాల్సి ఉంది. ఇక్కడ మొత్తం ఆరుగురు వైద్యులు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి మంత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంకు వెళ్లారు. -
టీడీపీకి ‘ప్రత్యేకం’గా ఇష్టం లేదు
జగన్ దీక్షకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు వాయిదా పడిన నిరవ ధిక దీక్ష వైఎస్సార్సీపీ నేత ‘బెల్లాన’ చీపురుపల్లి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావడం అధికార తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తలపెట్టిన దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం అందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చునని ఆయన శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకరులకు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుమతి ఇవ్వని కారణంగా తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్ష తాత్కాలికంగా వాయిదా పడిందని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదా సాధన ఇష్టం లేకనే జగన్మోహన్రెడ్డి దీక్షను అణగదొక్కేందుకు చరిత్రలో ఎన్నడూ లేని చట్టాలను వినియోగించారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ స్టాండ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు జగన్మోహన్రెడ్డి దీక్ష వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. -
విషాదం అమ్మను వదిలి...
వీధి కాలువలో కొట్టుకుపోయిన 3 ఏళ్ల బాలుడు చెరువు వద్ద శవమై కనిపించిన వైనం శోకసంద్రంగా మారిన పాతగవిడి వీధి ఇంకా సరిగా నడవడం రాలేదు... అప్పుడే నాన్న చేతిని విడిచిపెట్టేశాడు. ఇంకా పలకడమే రాలేదు... అప్పుడే అమ్మ ఒడిని వదిలి వెళ్లిపోయాడు. ముద్దుముద్దు మాటలు, బుడిబుడి అడుగులతో నిత్యం ఇంటిని సందడిగా ఉంచిన ఆ బుజ్జాయి అందరినీ వదిలి వెళ్లిపోయాడు. ‘అమ్మా అని పిలవరా..’ అంటున్న తల్లి కన్నీటికి, నాన్నా లేవరా అంటున్న తండ్రి శోకానికి బదులివ్వకుండా చిన్నారి శాశ్వతంగా దూరమైపోయాడు. చీపురుపల్లిలోని పాతగవిడివీధిలో శనివారం మూడేళ్ల చిన్నారి మీసాల జయప్రకాష్ వీధి కాలువలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఈ విషాద ఘటనతో ఆ వీధి శోక సంద్రమైంది. అక్కడి వారంతా విషాదంలో మునిగిపోయారు. చీపురుపల్లి: పట్టణంలోని పాతగవిడివీధికి చెందిన మీసాల జయప్రకాష్(3) అనే బాలుడు ఇంటి ఎదురుగా ఉన్న వీధి కాలువలో పడి కొట్టుకుపోయి చనిపోయిన సంఘటన శనివారం సాయంత్రం స్థానికులను కలిచివేసింది. అంతవరకు ఆడుకుంటూ కనిపించిన జయప్రకాష్ మృతి చెందడం కుటుంబ సభ్యులతో బాటు స్థానికులకు మింగుడుపడలేదు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో పట్టణంలో దాదాపు 20 నిమిషాలు పాటు భారీ వర్షం కురిసింది. దీంతో వీధి కాలువలు భారీ స్థాయిలో ప్రవహించాయి. జయప్రకాష్ ఇంటి ఎదురుగా పెద్ద వీధి కాలువ ఉంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో చిన్నపిల్లలతో కలిసి జయప్రకాష్ కూడా ఆ కాలువ వద్ద ఆడుకుంటుండగా జారి పడిపోయాడు. దీంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువ నీటిలో కొట్టుకుపోయాడు. స్థానికులు వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న వార్డు మెంబరు గవిడి సురేష్ పంచాయతీ సేవకులను రప్పించి వెదికించారు. దీంతో వీధి చివరిలో ఉన్న చెరువు వద్ద బాలుడు శవమై కనిపించాడు. కాలువలో కొట్టుకుపోయిన కొడుకు సజీవంగా వస్తాడని ఎదురు చూసిన తల్లిదండ్రులకు చేదు వార్త ఎదురవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. తాపీ పని చేసుకుంటూ..... మృతి చెందిన బాలుడు జయప్రకాష్ తండ్రి మీసాల పెంటయ్య తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య తవిటమ్మ పెద్ద కుమారుడు వేదవినీత్ ఉన్నారు. కుమారుడి మరణవార్తను విని గుండెలు బాదుకుని రోదించారు. ఇంటి ముందు ఉన్న కాలువే కుమారుని పాలిట మృత్యు కుహరమవుతుందని కలలో కూడా ఊహించలేదని విలపించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి అనంతంలు సంఘటనా స్థలానికి చేరుకుని సంతాపం తెలియజేశారు. -
వరద నీటిలో కొట్టుకుపోయిన బాలుడు
చీపురుపల్లి (విజయనగరం) : వాన నీటిలో ఆడుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పాతగవిడి వీధికి చెందిన మీసాల పెంటయ్య, కవిటమ్మ దంపతుల చిన్న కుమారుడు జయప్రకాశ్(3) వాన వెలసిన తర్వాత నీళ్లలో ఆడుకునేందుకు వీధిలోని మురుగు కాలువ వద్దకు వెళ్లాడు. అంతలోనే వరద ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రమాదవశాత్తు జయప్రకాశ్ అందులో పడి కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు బాలుడి కోసం నీళ్లలో గాలిస్తున్నారు. -
సూపర్ శ్రీను
చీపురుపల్లి: రోడ్డుపై వెళ్తుండగా వంద రూపాయల నోటు కనిపిస్తే చటుకున్న వంగి తీసుకుని జేబులో వేసుకునే ఈ రోజుల్లో..పక్కపక్కనే ప్రయాణిస్తూ జేబులు కత్తిరించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాంటిది ఎవ్వరూ లేని ఏటీఎంలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.25 వేలు దొరికితే ఇంకేమైనా ఉందా. పట్టుకుని ఉడాయించేస్తారు కదా..! కానీ అంతా అలాగే చేస్తారనుకుంటే పొరపాటే.. అందులో భాగంగా చీపురుపల్లి పట్టణానికి చెందిన సిరేల శ్రీను అనే యువకుడు ఎంతో నిజాయితీగా వ్యవహరించి ఏటీఎంలో లభ్యమైన ఆ డబ్బులను ఏం చేయాలో తెలియక సాక్షి ప్రతినిధిని ఆశ్రయించాడు. దీంతో సాక్షి, ఆ యువకుడు సంయుక్తంగా పోలీస్స్టేషన్కు వెళ్లి దొరికన డబ్బులను పోలీసులకు అప్పగించారు. ఎంతో నిజాయితీగా వ్యవహరించిన ఆ యువకుడిని అందరూ అభినందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. స్థానిక మెయిన్రోడ్లో గల పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి డబ్బులు తీసుకునేందుకు స్థానిక జి.అగ్రహారం ప్రాంతానికి చెందిన సిరేల శ్రీను అనే ఎంబీఏ విద్యార్థి శుక్రవారం ఉదయం 11.16 గంటల సమయంలో వెళ్లాడు. ఆయన లోపలకు వెళ్లేసరికి ఆ ఏటీఎం యంత్రంలో నుంచి రూ.25వేలు నగదు, విత్డ్రా స్లిప్ బయటకు వచ్చాయి. లోపల చూస్తే ఎవ్వరూ లేరు. ఆ డబ్బులను తీసుకున్న శ్రీను ఎవరైనా వస్తారేమోనని దాదాపు అరగంట వరకు అక్కడే వేచి ఉన్నాడు. ఎవ్వరూ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక సాక్షి ప్రతినిధిని ఆశ్రయించాడు. దీంతో వారిద్దరూ సంయుక్తంగా చీపురుపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్సై ఎం.నాగేశ్వరరావుకు వివరించి, నగదును, విత్డ్రా స్లిప్ను హెచ్సీ కామేశ్వరరావుకు అప్పగించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ స్టేట్బ్యాంకును సంప్రదించి వాస్తవంగా ఈ డబ్బులు ఏ ఖాతాదారునికి చెందినవో తెలుసుకుని వారికి అప్పగించే చర్యలు చేపడతామ న్నారు. నిజాయితీగా వ్యవహరించిన యువకుడు శ్రీను, సాక్షి పత్రికను ఈ సందర్భంగా ఎస్సై అభినందించారు. -
మజాగా పెద్దలు
చీపురుపల్లి: మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తలపెట్టినా ప్రభుత్వ భూములు లేవని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నా వాటి స్వాధీనానికి అధికారులు ప్రయత్నించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెదనడిపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 28లో 16 ఎకరాల ప్రభుత్వ భూమి ఎంతో కాలంగా గరివిడికి చెందిన ఓ మైనింగ్ పరిశ్రమ యాజమాన్యం చేతుల్లో ఉన్నాయి. ఈ భూముల్లో పెద్ద ఎత్తున ఆయిల్పామ్ తోటలు కూడా ఉన్నాయి. ఈ పరిశ్రమ అధినేతకు అధికార పార్టీ నేతల అండదండలుండటంతో అధికారులు వాటి జోలికి వెళ్లలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. అవి ప్రభుత్వ భూములని రికార్డుల్లో నమోదైనా పట్టించుకోకపోవడం విశేషం. మూడేళ్ల క్రితం ఈ భూములు ప్రభుత్వానివేనని అప్పటి తహశీల్దార్ మజ్జి శంకరరావు వెల్లడించడం తెలిసిందే. దీంతో అప్పట్లో ఈ భూములను విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి కేటాయించేందుకు కూడా సిద్ధమయ్యారు. పెదనడిపల్లి గ్రామానికి చెందిన కొందరు దళితులు ఈ భూముల్లో తమకు ప్రభుత్వం గతంలో పట్టాలు ఇచ్చిందని, విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఒప్పుకోమని అడ్డు తగలడంతో ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకుంది. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే సమయానికి ఆ తహశీల్దార్కు బదిలీ కావడంతో ఈ విషయం మరుగున పడింది. ప్రస్తుతం ఒక్కో ఎకరం రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల విలువ చేస్తుంది. దాదాపు రూ.70 లక్షల విలువైన ప్రభుత్వ భూముల స్వాధీనానికి చర్యలు ప్రారంభించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. దీనిపై తహశీల్దార్ డి.పెంటయ్యను వివరణ కోరగా పదహారు ఎకరాలు ప్రభుత్వ భూములేనని ధ్రువీకరించారు. ఈ వివాదంపై జాయింట్ కలెక్టర్ కోర్టులో జరిగిన విచారణలో అవి ప్రభుత్వ భూములేనని తేలిందని స్పష్టం చేశారు. కబ్జాదారు దీనిపై సీసీఎల్ఏకు అప్పీలు చేయడంతో పెండింగ్లో ఉందని, తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. -
అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం కావాలి
మెట్టపల్లి(చీపురుపల్లి రూరల్): అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం కావడానికి అందరూ సహకరిస్తేనే ఆశించిన లక్ష్యం నేరువేరుతుందని ఐసీడీఎస్ ఉత్తరాంధ్ర ఆర్జేడీ సీహెచ్ కామేశ్వరమ్మ అన్నారు. చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో మంగళవారం ఒకటో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జూన్ నెల నుంచి రాష్ర్టస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడానికి ప్రత్యేక దరఖాస్తు నమూనాను రూపొందించామన్నారు. ఇందులో అంగన్వాడీ కేంద్రాల పరిధిలో అందుతున్న సేవలను పరిశీలించిన అనంతరం అందులో వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఆ వివరాలను వెంటనే ఆన్లైన్లో పెడతామన్నారు. తద్వారా రాష్ర్టంలో ఏ కేంద్రంలో ఎలాంటి సేవలు అందుతున్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కేంద్రాల్లో అందించే పోషకాహారంతో పాటు ఇంటి వద్ద కూడా చిన్నారులకు సమతుల్య ఆహారం అందించడానికి చిన్నారుల తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు. అప్పుడే చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే కార్యకర్తలు, హెల్పర్లు వారికిచ్చిన యూనిఫారాలను తప్పనిసరిగా ధరించి రావాలన్నారు. సమయపాలన పాటించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలను సంద ర్శించే సీడీపీఓలు, సూపర్వైజర్లు కేంద్రాల పనితీరు మెరుగుపడేలా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అప్పుడే కేంద్రాల నిర్వహణ విజయవంతం అవుతుందన్నారు. ప్రతి సీడీపీఓ తమ ప్రాజెక్టు పరిధిలో నెలలో 30 కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలన్నారు. అదేవిధంగా సూపర్వైజర్లు ప్రతి కేంద్రాన్ని నెలలో ఒకసారి తనిఖీ చేయాలన్నారు. కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ పరిశీలించాలన్నారు. సమావేశంలో చీపురుపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఎస్తేర్రాణి, సూపర్వైజరు పైడిమంగ తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్జేడీ మెట్టపల్లి గ్రామంలోని కాలనీలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రం పనితీరు పట్ల ఐసీడీఎస్ ఉత్తరాంధ్ర జాయింట్ డెరైక్టర్ సిహెచ్.కామేశ్వరమ్మ అసంతృప్తి వ్యక్తం చేసారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రానికి ఆమె వచ్చిన సమయానికి 13 మంది పిల్లలు ఉండాల్సి ఉండగా 8 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. దీంతో పాటు కేంద్రంలో చిన్నారులకు హాజరు కూడా వేయలేదు. దీంతో ఆగ్రహించిన ఆమె ప్రతిరోజూ కేంద్రం ఎన్ని గంటలకు తెరవాలి, ఎన్ని గం టలకు హాజరు వేయాలో తెలుసా? అని అంగన్వాడీ కార్యకర్తను ప్రశ్నించారు. 11గంటలు సమయం అయినప్పటికీ అటెండెన్స్ వేయకపోవటమేమిటని ప్రశ్నించారు.కార్యకర్త యూనిఫాం ధరించకపోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం పనితీరు ఉండాల్సిన స్థాయిలో లేదన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి ఐసీడీఎస్ పీఓ ఎస్తేరురాణి,సూపర్వైజర్ పైడిమంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో గ్రూపుల గోల
చీపురుపల్లి టీడీపీలో భగ్గుమన్న విభేదాలు ఎంపీపీ, జెడ్పీటీసీ మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు కుమ్ములాడుకునే స్థాయిలో విభేదాలు చీపురుపల్లి : నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షా త్తూ రాష్ట్ర మంత్రి కిమిడి వృణాళిని సొంత నియోజకవర్గ కేంద్రంలో పార్టీకి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ రెండు వర్గాలుగా విడిపోయి కుమ్ములాటకు దిగుతున్నారు. జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ రౌతు కాంతమ్మ భర్త మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు మధ్య ఎంతో కాలంగా ఉన్న అంతర్గత విభేధాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పా ర్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రి కిమి డి వృణాళిని సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీపీ వర్గీయు లు కుమ్ములాటకు దిగే స్థాయికి ఇరువర్గాల మధ్య విబేధాలు పెరిగిపోయాయి. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా.. ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. అయితే తొలి నుంచి ఈ రెండు వర్గాల మధ్య సయో ధ్య అంతంతమాత్రంగానే ఉంది. బయటకు మాత్రం ఇరువర్గాల నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శి స్తూ.. వస్తున్నారు. తాజాగా జరిగిన సంస్థాగత ఎన్నికలు ఇరువర్గాల మధ్య బహిరంగ కయ్యానికి వేదికయ్యాయి. పట్టణ పార్టీ అధ్యక్షుని పదవి లో చాలా కా లంగా మండల పార్టీ అధ్యక్షుడు రౌతు నారాయణరా వు కొనసాగుతున్నారు. కొద్ది కాలం క్రితమే పార్టీలోకి వచ్చిన జెడ్పీటీసీ మీసాల వరహా ల నాయుడు తన అనుచరుడు, వార్డు మెంబరు గవిడి సురేష్కు ఆ పద వి కావాలని పట్టుబట్టారు. దీన్ని రౌతు వర్గీయులు వ్య తిరేకించారు. దీంతో మంత్రి మృణాళిని ఎదుటే యు ద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇరువర్గాలు కిందకు దిగే పరిస్థితులు కనిపించడం లేదు. జెడ్పీటీసీ వర్గీయులు అక్కడితో ఆ గకుండా మండల పార్టీ అధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పదవుల కోసం ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేయడంతో విషయం మ రింత వేడెక్కింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, పార్టీలో ఉంటారో ఉండరో తెలియని వారికి ఎలా పద వులు ఇస్తామని, ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమిస్తున్నామని రౌతు వర్గం బహిరంగంగా వ్యాఖ్యానిస్తోంది. ప్రస్తుతం ఎంతోమంది నాయకులు పార్టీలు మారి తిరిగి వచ్చిన వారేనని, ఏ పార్టీలో ఉన్నామన్నది కా దు, ఉన్న పార్టీ కోసం ఎంతవరకు పని చేస్తున్నామన్నది ముఖ్యమని, అంతేకాకుండా మేజర్ పంచాయతీ తమ చేతిలో ఉందని, ఇక్కడ ఏ పదవి అయినా తమకే సొంతం అంటూ వరహాలనాయుడు వర్గీయులు అం టున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సిన నేపథ్యంలో మంత్రి వృణాళిని ఏ విధంగా స్పందిస్తారోనని ఆ పార్టీ క్యాడర్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మంత్రి గారూ....సంస్థాగత ఎన్నికలు జరిపించండి పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు ఉల్లంఘించిన నేపథ్యంలో మంత్రి మృణాళిని చొరవ తీసుకుని ఆమె సమక్షంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని జెడ్పీటీసీ మీసాల వర్గీయులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చే స్తూనే మంత్రి మృణాళిని నిర్ణయాన్ని తప్పక పాటిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరహాలనాయుడు వర్గీయులు గవిడి నాగరాజు, గవిడి సురేష్, నారాయణరావు, రొ బ్బి గణేశ్తో పాటు రఘు పాత్రుని చంద్రశేఖర్, రొబ్బి రమణ, రొబ్బి చిన్ని, ఆదికృష్ణ, శ్రీరాములు, బోడసిం గి సత్యం తదితరులు మాట్లాడారు. చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడితో పాటు పట్టణ అధ్యక్షుని స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశా రు. సోమవారం పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాలు లో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సమావేశానికి ముందు మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, దన్నా న రామచంద్రుడు, దన్నాన శ్రీరాములు, రౌతు కాము నాయుడు, రౌతు నారాయణరావు సమక్షంలో పార్టీ మండల అధ్యక్షునిగా రౌతు కామునాయుడును, పట్ట ణ పార్టీ అధ్యక్షునిగా గవిడి సురేష్ను నిర్ణయిం చడం జరిగిందన్నారు. అయితే అదే విషయాన్ని మంత్రి మృ ణాళిని సభా వేదికపై చదివి వినిస్తున్న తరుణంలో ఎ న్నికపై రౌతు కామునాయుడు, రౌతు నారాయణరావు అభ్యంతరం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పట్ట ణ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఎప్పుడో జరిగిపోయిందని, అధిష్టానానికి కూడా పంపించామని వారు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు, ఆరుగురు ఎంపీటీసీలు ఉన్నారని, వారికి కూడా ఎప్పుడు ఎన్నిక ఎప్పుడు జరిగిందో తెలియదన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్ర జాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. -
మరుగుదొడ్డికి 15000/- సహాయం!
-
బిడ్డ బరువైపోయింది.. బావిలో పడేసింది
ఓ కన్నతల్లి ఘాతుకం చీపురుపల్లి: నవ మాసాలు మోసింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇంతలోనే భర్త ఆమెను వదిలేశాడు. ‘అసలే ఆడపిల్ల. ఆపైన అనారోగ్యంతో ఎదుగుబొదుగు లేని శరీరం. అత్తారింటి ఆదరణ లేదు.. కన్నవారికీ భారంగా మారాను..’ అనుకుందో, మరేమనుకుందో కానీ ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి రామాంజనేయకాలనీకి చెందిన టేకు ఇందు అనే మహిళ తన ఏడాదిన్నర పాప జ్యోత్స్నను మంగళవారం రాత్రి బావిలో పడేసింది. వెంటనే పాపను బావిలో పడేశానంటూ కేకలు పెట్టింది. దీంతో అక్కడికి చేరుకున్న ఇందు తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేయనున్నట్టు పట్టణ ఎస్ఐ ఎం.నాగేశ్వరరావు తెలిపారు. అర్ధరాత్రి వరకు పాపను బయటకు వెలికి తీయలేదు. తాను పుట్టింటికి, పాప తనకు భారంగా మారిన పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చిందని ఇందు చెప్పింది. -
నేను మంత్రినన్న సంగతి తెలుసా?
చీపురుపల్లి : పశు సంవర్థక శాఖాధికారులుపై రాష్ట్ర గ్రా మీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవా రం చీపురుపల్లి వచ్చిన ఆమెను మండల పరిషత్ కార్యాలయంలో పశు సంవర్థక శాఖ జాయింట్ డెరైక్టర్ వై. సింహాచలం, ఏడీ శ్రీనివాసరావు కలిసారు. ఈ సందర్భంగా ఆమె వారిపై అసహ నం వ్యక్తం చేశారు. జిల్లాలో మంత్రిగా ఉన్నానని తెలు సా..? లేదా? అని ప్రశ్నించారు. అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. స్వయాన మంత్రి సొంత నియోజకవర్గంలో సమస్యలపై కూడా తన దృష్టి కి ఇంతవరకు తీసుకురాకపోవడం ఏమిటి, అసలు మీ ఇబ్బందులు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. శాఖలో ఉన్న సమస్యలను తానే గుర్తించి, ఫోన్లు చేసిన ంత వరకు కలవకపోతే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఇంతలో పశు సంవర్థకశాఖ ఏడీ శ్రీనివాసరావు కలుగజేసుకుని చాలాసార్లు జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు దృష్టికి చీపురుపల్లి పశువైద్యశాల సమస్య తీసుకొచ్చానని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి ఆయనతో ఎందుకు చెప్పడం నేరుగా తన వద్దకే వచ్చి చెప్పాలి కదా...ఏం చదువుకున్న వారే కదా.. మీ ఆస్పత్రిలో సమస్యలు మీరు వచ్చి చెప్ప లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనుకోవడం మా నేసి, ఉద్యోగులు తమ కార్యాలయాల్లో ఏం సమస్యలు ఉన్నాయో గుర్తించాలన్నారు. ఆ సమస్యలను ఎలా పరి ష్కరించుకోవాలో మార్గం తెలుసుకుని తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. చీపురుపల్లి పశువైద్యశాల సొంత భవనం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పది సెం ట్లు స్థలం ఉంటే సొంత భవనానికి నిధులు మంజూరవు తాయని జేడీ సింహాచలం చెప్పారు. స్థలం ఎక్కడైనా ఉంటే చూడాలని తహశీల్దార్ డి. పెంటయ్యను మంత్రి ఆదేశించారు. ఇంతలో జెడ్పీటీసీ మీసాల కలుగజేసుకుని మార్కెట్ యార్డు స్థలంలో చాలా ఖాళీ స్థలం ఉంద ని,అక్కడ నిర్మించుకుంటే బాగుంటందని సూచించా రు. దీనికి మంత్రి సుముఖత వ్యక్తం చేస్తూ, సర్వే నంబర్లతో లేఖను తయారు చేయాలని తహశీల్దార్ను ఆదేశించారు. -
ఏసీబీ వలలో అవినీతి చేపలు
చీపురుపల్లి : అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ర్యాలీలు, సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించగా, మరో పక్క లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు చిక్కారు. వేధింపులు, కేసులు లేకుండా ఉండాలంటే తమకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి, చీపురుపల్లి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో గల మెరకముడిదాం మండలం భైరిపురంలో ఉన్న మద్యం దుకాణం యజమాని కె.సత్యం నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.నాగభూషణరావు, కానిస్టేబుల్ జగన్నాథరెడ్డి దొరికిపోయారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి అందజేసిన వివరాలు... భైరిపురంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న సత్యంను ఎక్సైజ్ అధికారులు నిత్యం వేధిస్తున్నారు. భవిష్యత్తులో వేధింపులు, కేసులు లేకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆయన తమను ఆశ్రయించినట్లు చెప్పారు. తమ సూచన మేరకు గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో సత్యం రూ. 15 వేలు తీసుకుని సీఐ నాగభూషణరావు గదిలోకి వెళ్లి, ఆయనకు ఇవ్వగా, ఆ సొమ్మును సీఐ ఆదేశాలు మేరకు పక్కన ఉన్న కానిస్టేబుల్ జగన్నాథరెడ్డి అందుకున్నారు. అదే సమయంలో దాడిచేసి వారిద్దరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు లక్ష్మీపతి తెలిపారు. నిత్యం వేధింపులే.... ఇదే విషయమై భైరిపురం మద్యం దుకాణం యజమాని కొప్పల సత్యం విలేకరులతో మాట్లాడుతూ తమ దుకాణంపై ఎక్సైజ్ అధికారులు నిత్యం దాడులుచేస్తూ, తనను వేధింపులకు గురిచేసేవారని చెప్పారు. చాలా ప్రాంతాల్లో సారా తయారవుతోందని సమాచారం ఇచ్చినా కనీసం పట్టించుకోలేదని చెప్పారు. వ్యాపారం నష్టాల్లో సాగుతూ అవస్థలు పడుతుంటే ... తమ దుకాణంపై ఏదో ఒక కేసు బనాయిస్తూనే ఉన్నారని తెలిపారు. ఇటీవల తమ దుకాణం నుంచి బిల్లుతో కూడిన మద్యం బాటిళ్లను ఓ ఆటోలో తీసుకెళ్తుండగా వాటిని పట్టుకుని రూ.45 వేలు లంచం డిమాండ్ చేశారని చెప్పారు. బిల్లులు ఇచ్చామని అయినప్పటికీ కేసులు ఎందుకని ప్రశ్నించగా, ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావని హెచ్చరించారన్నారు. తరువాత అయితే రూ. 45 వేల నుంచి 15 వేల రూపాయలకు దిగారని, వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించానని చెప్పారు. ఉద్యోగ విరమణ వాయిదా పడి.... సీఐ నాగభూషణరావు 2014 ఆగస్టు నెలలో ఉద్యోగ వి రమణ పొందాల్సి ఉంది. అలా జరిగితే ఆయన ఏసీబీ అధికారులకు చిక్కేవారు కాదు. అయితే ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచడంతో ఆయన విధుల్లో కొనసాగుతూ ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. -
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
చీపురుపల్లి: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన మండలంలోని ఆర్దివలస బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బేబీనాయన కోరారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్తో కలిసి మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు చీర, దుప్పటి, కంచం, 25 కేజీల బియ్యం, రూ.500 పంపిణీ చేశారు. అనంతరం దెబ్బతిన్న ఇళ్ల వద్దకు వెళ్లి ప్రమాదం ఎలా సంభవించిందో అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో బాధితులు ఏం నష్టపోయారో అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వాకాడ శ్రీను, బెల్లాన వంశీ, సీహెచ్.సత్యనారాయణరెడ్డి, రేవళ్ల సత్తిబాబు, ఇప్పిలి నీలకంఠం, అలజంగి, ఇటకర్లపల్లి సర్పంచ్లు రఘుమండ త్రినాథ్, మీసాల రమణ, బాణాన శ్రీను, ఇప్పిలి తిరుమల, సతివాడ అప్పారావు తదితరులు ఉన్నారు. -
వచ్చారు... వెళ్లారు
చీపురుపల్లి: తుపాను బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం ప్రకటిస్తారో అంటూ ఎదురు చూసిన బాధితులు, రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. శుక్రవారం గుర్ల మండలంలో సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన పర్యటన వచ్చారు...వెళ్లారు అన్నట్టుగా మారింది. తుపాను వల్ల ఏర్పడిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి జిల్లా ప్రజలకు మేలు చేయవలసిన టీడీపీకి చెందిన నేతలెవరకూ ఆ దిశ గా కనీస ప్రయత్నం కూడా చేయలేదు. సభలో జిల్లా మంత్రి కిమిడి మృణాళిని, ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎవ్వరూ జిల్లాకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ కావాల్సిన సాయాన్ని కోరకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా మంత్రి మృణాళిని ప్రసంగంలో రైతులు, బాధితులు కోసం మాట్లాడాల్సింది పోయి ఏకంగా పొగడ్తలకే సమయం మొత్తం కేటాయించడం సర్వత్రా చర్చంశనీయమయింది. గుజ్జంగివలసలో జరిగిన సభలో పలువురు వృద్ధులు, రైతులు పింఛన్లు, రుణమాఫీ, ఇసుక కోసం ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అయితే వీటిపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో వారు కూడా నిరాశ చెందాల్సి వచ్చింది. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ ఎందుకు ఇవ్వలేదంటూ వృద్ధుల ఆవేదన ఓ వైపు, రుణమాఫీ జరగలేదు, ఇసుక లేక పట్టణాల్లోను, గ్రామాల్లోను ఉపాధి లేదంటూ మరోవైపు రైతులు అరుపుల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభ జరిగింది. హుదూద్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలు పరిశీలించేందుకు, రైతులను పరామర్శించేందుకు గురువారం గుర్ల మండలంలోని గుజ్జంగివలస గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన అకస్మాత్తుగా నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలు ప్రాంతంలో గుజ్జంగివలస చేరుకున్న ముఖ్యమంత్రి పొలాల వైపు వె ళ్లలేదు, రైతులు పరామర్శించలేదు. గుజ్జంగివలసలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ప్రారంభించే సమయంలోనే గుజ్జంగివలస గ్రామానికి చెందిన తలచుట్ల పైడమ్మ, లండ ఆదమ్మ అనే ఇద్దరు వృద్ధమహిళలు ఒకరి తరువాత మరొకరు లేచి తమకు పింఛను తొలగించారంటూ చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. వీరికి ఎలా పింఛను తొలగిపోయిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటతోనే సరిపెట్టారు తప్ప మీకు పింఛను ఇప్పిస్తానని చెప్పకపోవడంతో నిరాశ చెందారు. దీంతో పక్కనే ఉన్న కలెక్టర్ ఎం.ఎం.నాయక్ వారిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సభ జరుగుతుండగా కొంతమంది రైతులు వెనుక నుంచి రుణమాఫీ కోసం పెద్దగా అరుస్తూ ప్రశ్నిస్తున్నారు. వారిని ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో సమావేశం ఆఖరి సమయంలో మరోసారి పెద్దగా రుణమాఫీ జరగలేదని, గత కొద్ది రోజులుగా ఇసుక లభించకపోవడంతో ఊరిలో పనులు లేవని పెద్దగా పలువురు రైతులు అరవడంతో ఉపాధి పనులు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రుణమాఫీ కోసం మాట్లాడకపోవడంతో రైతులు నిరాశ చెందారు. అంతేకాకుండా తుపాను నష్టాలను అంచనా వేసేందుకు గ్రామాల్లోకి వస్తున్న అధికారులు తమ మాట వినడం లేదని, నష్టాలను సరైన పద్ధతిలో నమోదు చేయడం లేదని జెడ్పీటీసీ పద్మిని, ఎంపీపీ సత్యమమ్మలు నేరుగా మైక్లో ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించగా దానికి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అధికారులు సక్రమంగా నమోదు చేయకపోతే మళ్లీ ఫొటోలు తీసి తనకు పంపించాలని అనడంతో వారు కూడా కంగుతిన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి కిమిడి మృణాళిని, రాష్ట్ర ఐటీశాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, కె.ఎ.నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యేలు కిమిడి గణపతిరావు, గద్దే బాబూరావు, జెడ్పీటీసీ టి.పద్మిని, ఎంపీపీ జమ్ము సత్యమమ్మ, సర్పంచ్ గొర్లె జానకి, సీఈఓ మోహనరావు, డీఆర్డీఏ పీడీ గోవిందరాజులు, ఆర్డీఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారిని చిదిమేసిన ‘హుదూద్’
చీపురుపల్లి:ఒక్కగానొక్క కొడుకు పెరిగి పెద్దవాడై తమను ఆదుకుంటాడనుకున్న తల్లిదండ్రుల ఆశలను హుదూద్ తుపాను చిదిమేసింది. కన్నకొడుకు తుపాను వర్ష బీభత్సానికి మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముక్కుపచ్చలారని విద్యా ర్థి గెడ్డలో కొట్టుకుపోయిన విషయం ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి మండలంలోని పేరిపి గ్రామానికిచెందిన మోపాడ గొల్ల, రామలక్ష్మిల ఒక్కగానొక్క కొడుకు దుర్గాప్రసాద్(10) ఈ నెల 12న ఆవులను మేపేందుకు పొలంలోకి తీసుకెళ్లాడు. అప్పటినుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గాలిస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం ఇటకర్లపల్లి సమీపంలో గల పెద్దగెడ్డలో దుర్గాప్రసాద్ శవమై తేలాడు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి పరుగుపరుగున చేరుకుని భోరున విలపించారు. జెడ్పీటీసీ మీసాల వరహాల నాయుడు చిన్నారి మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి శవపంచనామా నిర్వహించి తిరిగి గ్రామానికి పంపిం చారు. ఇదిలా ఉండగా తుపాను కారణంగా నష్టపోయిన పంటలు పరిశీలించేందుకు, బాధితులను పరామర్శించేందుకు చీపురుపల్లి నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఐటీ శాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎక్సైజ్శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని చిన్నారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు మోసగాడు
చీపురుపల్లి : ప్రతి ఒక్కరినీ మోసం చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైజమని, ప్రజలను మోసం చేస్తూనే అధికార దర్పాన్ని కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తీవ్రంగా విమర్శించారు. మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యన్నారు. పట్టణంలోని రాధామాధవ ఫంక్షన్ హాల్లో చీపురుపల్లి మండల పార్టీ కార్యకర్తల సమావేశం విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కోలగట్ల మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి మోసగాడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలిసినా.. గడిచిన పదేళ్ల లో మారి ఉంటాడనే ఆలోచనతో ఓటు వేశారన్నారు. చంద్రబాబు తీరులో ఏ మాత్రం మార్పు రాలేదని ప్రజలు గమనించారని, దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత స్వల్ప కాలంలో ప్రజా వ్యతిరేకత రాలేదని చెప్పారు. అమలు కాని హామీలిచ్చి మరిన్ని మోసపూరిత హామీలు ఇస్తున్నారని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి రామనితెలిసి లేనిపోని హామీలు గుప్పిస్తునారని దుయ్యబట్టారు. నిరుద్యోగులు, రైతు, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచేశాడని ఆరోపించారు. కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయూలన్నారు. పోలీసులను తీసుకుని జన్మభూమికి ప్రజాప్రతినిధులు వెళ్తున్నారని.. గ్రామాల్లో ప్రజలు ఉన్నారో... రౌడీలు ఉన్నారో తెలుగుదేశం నేతలు చెప్పాలన్నారు. కార్యకర్తల కోసం అర్ధరాత్రి అరుునా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలు జగన్మోహన్రెడ్డికి ఇవ్వడం ఇష్టం లేదన్నారు. అందుకే లేనిపోని హామీలు ఇవ్వలేదని గుర్తు చేశారు. పార్టీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పిల్లనిచ్చిన మామను, ఓట్లేసిన ప్రజలను చంద్రబాబునాయుడు మోసం చేశాడని విమర్శించారు. బెల్టు దుకాణాలు నిషేధిస్తానని చెప్పి మొబైల్ బెల్టు దుకాణాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందన్నారు. మంత్రి గారికి మధ్యాహ్న భోజనాలు చెక్ చేయడం తప్ప మరొక పని లేదని విమర్శించారు. టీడీపీ పాలనతో అభివృద్ధిని మరచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అంతకు ముందు దివంగత వైఎస్ఆర్ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించిన పార్టీ నేతలు నివాళులర్పించారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, ప్రచార కమిటీ అధ్యక్షుడు గొర్లె వెంకటరమణ, గజపతినగరం నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ డెరైక్టర్ కె. వి.సూర్యనారాయణరాజు, పార్టీ నాయకులు వాకాడ శ్రీను, మామిడి అప్పలనాయుడు, ఎస్.బంగారునాయుడు, నడిపేన శ్రీనివాసరావు, పైడితల్లి, రెడ్డి గురుమూర్తి, బండారు ఆనంద్, చీపురుపల్లి మండల నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, కరిమజ్జి శ్రీనివాసరావు, చందక గురునాయుడు, కోరాడ నారాయణరావు, పిసిని శ్రీనివాసరావు, గొర్లె రమణ, పనస అప్పారావు, బవిరి రవిశంకర్, రేవల్ల సత్తిబాబు, పతివాడ రాజారావు, అప్పికొండ ఆదిబాబు, మహంతి ఉమ, ముజ్కీర్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ వసూళ్లకు టీడీపీ ధరల పట్టిక చీపురుపల్లి : జిల్లాలో అక్రమ వసూళ్లకు తెరలేపిన తెలుగుదేశం నాయకులు ఏకంగా ఒక్కో పనికి ఒక్కో రేటు అంటూ ధరల పట్టిక పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. ఇక్కడ విలేకరులతో ఆయన గురువారం మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి నుంచి గ్రామ స్థారుు నాయకుడు వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మద్యం సిండికేట్ల వద్ద టీడీపీ నాయకులు నెలవారీ మామూళ్లకు ఫిక్స్ కావడంతో అధిక ధరలకు మద్యం విక్రయూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన సంతకాల్లో ఏ సంతకం అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో పోలీసుల అండతో జన్మభూమి కార్యక్రమానికి తెలుగుదేశం నేతలు వెళ్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసే దిశగా గ్రామ స్థారుు నుంచి కమిటీలు వేస్తున్నట్టు తెలిపారు. తొలి దశలో 20 మండలాల్లో కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. చీపురుపల్లి నుంచి కార్యకర్తల సమావేశాలు ప్రారంభించామన్నారు. సమావేశంలో సీజీసీ సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుది మోసపూరిత చరిత్ర గర్భాం (మెరకముడిదాం) : ముఖ్యమంత్రి చంద్రబాబుది మొదటి నుంచి మోసపూరితమైన చరిత్రేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి దుయ్యబట్టారు. గురువారం మండలంలోని గర్భాం గ్రామంలో మాజీ ఎంపీపీ తాడ్డె కృష్ణారావు మిల్లు వద్ద నిర్వహించిన మండల పార్టీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని, ఎన్టీఆర్ని ఒక్కసారి మోసం చేస్తే, ప్రజలను మాత్రం మూడుసార్లు మోసం చేశారని దుయ్యబట్టారు. మెరకముడిదాం మొదట్నుంచి రాజకీయ చరిత్ర గల మండలమని అన్నారు. జిల్లాలో ఏ ఒక్క కార్యకర్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానని మరిచిపోవద్దని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులు, మహిళలు చంద్రబాబుకు ఓటు వేసి చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నార న్నారు పార్టీ మండలాధ్యక్షుడిగా తాడ్డె కృష్ణారావును నియమించినట్టు ఆయన ప్రకటించారు. జిల్లా పార్టీ కార్యదర్శులుగా బూర్లె న రేష్కుమార్ను, కర్రోతునాగేశ్వరరావును నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అనంతరం మండల పార్టీ తరఫున కోలగట్లను, బెల్లానను మండల పార్టీ నాయకులు దుశ్శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అవనాపువిజయ్, గొర్లె వెంకటరమణ, మామిడి అప్పలనాయుడు, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, తాడ్డె కృష్ణారావు, శనపతిసిమ్మినాయుడు, సర్పంచ్లు బూర్లెనరే ష్కుమార్, మండలసత్యనారాయణ, పిన్నింటిసుగణాకరరావు, నాయకులు పల్లేడబంగార్రాజు, కొమ్ముశంకర్రావు, గాంధీ, ఎంఎన్.అప్పలనాయుడు, రామకృష్ణ, రామస్వామి, సీతారామరాజు, సన్యాసినాయుడు, ఆదినారాయణ, మధు, పులిగుమ్మి సర్పంచ్ భర్త రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీపై రగడ
చీపురుపల్లి: రుణమాఫీ పథకం అమలులో ప్రభుత్వం కాలయూపన చేస్తుండడంతో రైతులు ఆగ్రహించారు. ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఇంకెంత కాలం తమను మోసం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును రైతులు విమర్శించడాన్ని తట్టుకోలేని టీడీపీ నాయకులు రైతులతో వాగ్వాదానికి దిగారు. మండలంలోని పత్తికాయవలసలో సోమవారం జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రుణమాఫీ విషయమై ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత, సర్పంచ్ భర్త దన్నాన జనార్దన్తో పాటు మరికొంత మంది రైతులు అధికారులను నిలదీశారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. దీన్ని తట్టుకోలేని టీడీపీ వర్గీయులు వారితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణ చివరకు కొట్లాటకు దారి తీసింది. ఎవరిని ఎవరు తోసుకుంటున్నారో ఎవరినెవరు కొడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉన్న ఒక్క పోలీసు కానిస్టేబుల్ ఇరువర్గాల మధ్య అలాగే ఉండిపోయూరు. ఇదంతా తహశీల్దార్, మండల ప్రత్యేకాధికారి సమక్షంలోనే జరిగింది. ముందుగా సర్పంచ్ భర్త దన్నాన జనార్దన్ మాట్లాడుతూ అధికారం లోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై పెడతానని రైతులను నమ్మించిన చంద్రబాబు సంతకం చేయలేదు సరికదా, రైతులను బ్యాంకులకు వెళ్లకుండా చేశారని, ఇప్పుడేమో కొత్తగా సాధికారత కమిటీ పేరుతో మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. కనీసం రైతులకు రీషెడ్యూల్ అవకాశం కూడా లేకుండా చేశారని తెలిపారు. ఆయనకు మరికొంత మంది రైతులు మద్దతు పలకడం తో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దన్నాన రామచంద్రుడు మాట్లాడుతూ ఇదేమీ రాజకీయ సమావేశం కాదని, తమ నాయకుడ్ని విమర్శించరాదని చెప్పడంతో ఇరువర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగారు. ఘర్షణ కాస్త తోపులాట అక్కడి నుంచి స్వల్ప కొట్లాటకు దారి తీసింది. అయితే ఒకే ఒక కానిస్టేబుల్ ఉండడంతో ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఈ సమయంలో తహశీల్దార్ డి.పెంటయ్య మైక్లో ఇరువర్గాలను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇరు వర్గాలు అలసి పోయిన వరకు తోసుకుని అక్కడితో విశ్రమించారు. కాగా ఇదే సమావేశంలో జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ నేత దన్నాన జనార్దన్ అడ్డు తగులుతూ 79 శాతం వికలాంగత్వం ఉన్న వారికి పింఛన్లు ఇస్తారా ఇవ్వరా అం టూ ప్రశ్నించారు. 80 శాతం వికలాంగత్వం ఉంటే తప్ప వికలాంగ పింఛను ఇవ్వరని జెడ్పీటీసీ స్పష్టం చేసారు. 79 శాతం విక లాంగత్వం కలిగిన వారిని ఈ ప్రభుత్వం గుర్తించదా అని జనార్దన్ ప్రశ్నించారు. ఇలా ఆయన ఓ వైపు ప్రశ్నలు వేస్తున్నప్పటికీ మరో వైపు సమావేశాన్ని ముగించడం కొసమెరుపు. ఎమ్మెల్యే కోళ్లను నిలదీసిన పింఛన్దారులు కొత్తవలస: కొత్తవలస పంచాయతీలో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని కొంతమంది పింఛన్దారులు నిలదీశారు. 70 ఏళ్ల వయస్సు ఉన్నా.. తమను ఎందుకు అనర్హులుగా గుర్తించారని ప్రశ్నించారు. ఐదేళ్లుగా పింఛన్లు అందుకుంటున్న తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పింఛన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో 170 మంది అర్హులకు పింఛన్లు తొలగించారని ఎంపీటీసీలు మేళాస్త్రి సరస్వతి, మేళాస్త్రి అప్పారావు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వాస్తవంగా అర్హులను తప్పిస్తే వారికి పింఛన్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాడంగిలో రసాభాస బాడంగి: మండల కేంద్రంలో సోమవారం జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. సర్పంచ్, ఎంపీటీసీల మధ్య పంచాయతీ అభివృద్ధి పనుల విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. గ్రామంలో అభివృద్ధి పనులు జరగకుండా వైఎస్సార్ సీపీ మెం బర్లు అడ్డుకుంటున్నారని సర్పంచ్ చెప్పగా.. ఎంపీటీసీల తరుఫున స్వామినాయుడు తాము చేసిన పనులు, ప్రతిపాదించిన పనుల గురించి సభలో చెబుతుండగా మాజీ ఎంపీటీసీ కుమారుడు చల్ల కృష్ణ అడ్డు తగిలారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తమ నాయకుడు మాట్లాడుతుండగా అడ్డుతగలడమేమిటని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అలాగే ఎన్టీఆర్ శుద్ధజలం విషయంలో నిర్వాహకులు 20 లీటర్ల నీటిని క్యాన్తో రూ. 250 లకు అమ్ముతున్నారని, మా ర్కెట్లో రూ. 150 లకే దొరుకుతుందని ఎంపీటీసీ కుమారుడు రవిప్రకాష్ తహశీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో టీడీపీకి చెందిన గుణుపూరు శ్రీను జోక్యంతో చేసుకోవడంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు ఇరువర్గాలను సముదారుుంచి, సభ సక్రమంగా జరిగేలా చూశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముం నాయుడు, ఎంపీడీఓ బాబూరావు, ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
‘ఓ ప్రేమా ప్రాణం తీశావే’
చీపురుపల్లి: యువతను చిదిమేస్తున్న ప్రేమపై కామాక్షి వైభవ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మించిన ‘ఓ ప్రేమా ప్రాణం తీశావే’ లఘు చిత్రం సీడీని సంస్థ అధినేత భోగాపురపు వాయునందశర్మ బుధవారం విడుదల చేశారు. పట్టణంలోని పోలీస్లైన్ రోడ్లో గల శ్రీ కామాక్షి వైభవ పంచాయతన పీఠంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు వెళ్తున్న యువత ప్రేమ అనే మాయలో పడి ఎలా భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారో? అ నే అంశంపై 15 నిమిషాల లఘు చిత్రాన్ని ని ర్మించామని తెలిపారు. ఈ లఘు చిత్రాన్ని యూట్యూబ్లో పెట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కె.సిమ్మినాయుడు, బి.సాంబమూర్తినాయుడు, మనోహర్నాయుడు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
మృణాళిని ఇలాకాలో తమ్ముళ్ల రణం
చీపురుపల్లి: అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే అధికార తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ముసలం మొదలయ్యింది. మండలంపై ఆధిపత్యం కోసం నువ్వా నేనా అంటూ ఎంపీపీ, జెడ్పీటీసీలు కా లు దువ్వుతుండడంతో ఏం చేయాలో అ ర్థం కాక దిగువ శ్రేణి నాయకులు ముక్కు న వేలేసుకుంటున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గం కావడంతో వీరిలోఎవరి మాట వినాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక మండలం లో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది కాలంగా ఆధిపత్యం కోసం ఎంపీపీ, జెడ్పీటీసీల మధ్య అంతర్గతంగా జరుగుతున్న అలజడి తా జాగా బహిర్గతమయ్యింది. ఈవిషయా న్ని సాక్షాత్తూ ఎంపీపీ రౌతు కాంతమ్మ, ఆమె భర్త ఎంపీటీసీ రౌతు కామునాయుడులే బాహాటంగా పత్రికలు ముందు వా రి అక్కసు వెళ్లగక్కారు. దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అంతా ఒక్కటిగా ఉండి కార్యకర్తలను ముందుకు నడిపించాల్సిన ఎంపీపీ, జెడ్పీటీసీలే ఇలా ఆధిపత్యం కోసం కుమ్ములాడుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం వేదికగా వీరి మధ్య ప్రారంభమైన విభేధాలు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వరకు పాకి ప్రస్తుతానికి తారస్థాయికి చేరాయి. దీంతో జెడ్పీటీసీ మీసాల వరహాలునాయుడు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఎంపీపీ రౌతు కాంతమ్మ భర్త ఎంపీటీసీ, మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు రౌతు కామునాయుడు మాత్రం తమ ఆవేదనను ఎక్కడికక్కడే బాహాటంగా వెళ్లగక్కు తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు హాజరైన ఎంపీపీ రౌతు కాంతమ్మ, జెడ్పీటీసీ భార్య, మేజర్ పంచాయతీ సర్పంచ్ మీసాల సరోజినిలు ఇద్దరిలో సర్పంచ్ మీసాల సరోజినితో పాఠశాలల్లో జెండా వందనం చేయించడాన్ని ఎంపీపీ దంపతులు జీర్ణించుకోలేకపోయారు. ఇదే విషయంపై అదే రోజు చాలా మంది ఉపాధ్యాయులపై తమ కోపాన్ని ప్రదర్శించారు. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు పెరిగాయి. ఇటీవల స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. వారి స్థానంలో ప్రస్తుతం జెడ్పీటీసీ మీసాల వరహాలునాయుడుకు చెందిన వర్గీయులు మధ్యాహ్న భోజన నిర్వహణ వ్యవహారాన్ని చూస్తున్నారు. దీంతో అదే పాఠశాలలో తమ మనుషులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అప్పగించాలంటూ గత కొద్ది కాలంగా ఎంపీపీ దంపతులు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనికి జెడ్పీటీసీ మీసాల వరహాలునాయుడు ససేమిరా అన్నారు. కొద్ది కాలంగా ఈ వ్యవహారం నలుగుతున్న సమయంలో శని వారం బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఎంపీపీ దంపతులు..ఉపాధ్యాయులు, మండల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు వీరు పాఠశాలలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికే జెడ్పీటీసీ వర్గీయులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించి ఉత్తర్వులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎంపీపీ దంపతులు ఓ వైపు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరోవైపు జెడ్పీటీసీ తెలివిగా వ్యవహరిస్తూ ఆయన పనులు చక్కబెట్టుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. దీని ప్రకారం ఆధిపత్యం విషయంలో జెడ్పీటీసీ ముందంజలో ఉన్నట్లు పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. -
గందరగోళం!
చీపురుపల్లి: చీపురుపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. స్థానిక ప్రజాప్రతినిధులు కళాశాలను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. అధికారుల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కళాశాల మంజూరై సుమారు ఏడాది కావస్తున్నా.. ఇప్పటివరకు అధికారులు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్థానికంగా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కళాశాలను తాత్కాలికంగా విజయనగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ సీట్లు పొందిన విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. చీపురుపల్లికి మంజూరైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను విజయనగరంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహా లు చేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది చీపురుపల్లికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది.2014- 15 విద్యా సంవత్సరానికి సంబంధించి అధికారులు ఈ కళాశాల పేరును కౌన్సెలింగ్ జాబి తాలో కూడా చేర్చారు. దీంతో చీపురుపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన గ్రా మీణ ప్రాంత విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. చీపురుపల్లి పేరుతో ప్రభుత్వ పాలి టెక్నికల్ కళాశాల మంజూరైనప్పటికీ ఇంతవరకు చీపురుపల్లిలో కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చీపురుపల్లి కళాశాలను కూడా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులు, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని కలెక్టర్, ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీలతో కొద్ది రోజుల క్రితం ఫోన్లో మాట్లాడి, పాలిటెక్నికల్ కళాశాలను చీపురుపల్లిలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోతోంది. వాస్తవానికి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ఏడాది పాలిటెక్నిక్ , ఇంజినీరింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వివాదాస్పదమైన విషయం తెలి సిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరికొద్ది రోజుల్లో తరగతులు ప్రారంభంకానున్న తరుణంలో చీపురుపల్లి పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కళాశాల తాత్కాలిక ఏర్పాటుకు అవసరమైన భవనాలు కూడా స్థానిక జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కేటాయిం చారు. సొంత భవనం ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణలో ప్రజాప్రతినిధులు ఉన్నారు.అయినప్పటికీ సాం కేతిక విద్యా అధికారులు కళాశాల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా రంగంలో ఎంతో వెనుకపడి ఉన్న చీపురుపల్లికి పాలిటెక్నికల్ కళాశాల మం జూరు కావడం వరమే అయినప్పటికీ కళాశాల ఏర్పాటులో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దగా దృష్టిసారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే మృణాళిని రాష్ట్ర స్థాయిలో మంత్రి గా ఉన్నప్పటికీ కళాశాల ఏర్పాటులో జాప్యం జరుగుతోం దంటే స్థానిక ప్రజాప్రతినిధులు అలసత్వం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చీపురుపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. -
మంత్రి ఇలాకాలో మొక్కుబడి
చీపురుపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతా న్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమం సాక్షాత్తు జిల్లా మంత్రి ప్రాతిని ధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో మొక్కుబడిగా సాగుతోంది. మంత్రి కిమిడి మృణాళిని పట్టణంలోనే ఉన్నప్పటికీ బడి పిలుస్తోంది కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం అమలు చేసేందుకు మండల కమిటీ ఉన్నప్పటికీ వారు వెళ్లిన చోట మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇతర పాఠశాలల పరిధిలో ఎవరూ పట్టించుకోవడం లేదు. బడిపిలుస్తోంది కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం శనివారం ప్రతి పాఠశాల పరిధిలోనూ ర్యాలీ నిర్వహించాలి, అంతేకాకుండా పాఠశాలల పరిధిలో స్థానికులు, ప్రజాప్రతినిధులతో గ్రామసభ నిర్వహించి బడిబయట పిల్లలు ఉండకూడదని అవగాహన కల్పించాలి. చీపురుపల్లి మేజర్ పంచాయతీలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు దాదాపు పది వరకు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఎక్కడా ర్యాలీ గానీ, గ్రామసభ గానీ జరగలేదు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలైన అలజంగి, పేరిపి, కరకాం, పి.కె.పాలవలస, రామ లింగాపురం, వంగపల్లిపేట పాఠశాలలు మినహాయిస్తే మిగతా చోట్ల బడిపిలుస్తోంది ర్యాలీలు, గ్రామసభలు జరిగిన దాఖలాలు లేవు. బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలోను పండగలా చేయాలని కలెక్టర్ ఎంఎం.నాయక్ ఆదేశించినప్పటికీ స్థానిక ఉపాధ్యాయులు కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ జరుగుతోంది. మండల కమిటీలో ఉన్న ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ, ఎంఈఓలు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి షెడ్యూల్ అమలు చేయని పాఠశాలలపై చర్య లు చేపట్టాల్సింది పోయి ముందుగా సిద్ధం చేసుకున్న పాఠశాలలకు మాత్రమే వెళ్లి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రో జుల పాటు నిర్వహించాల్సిన బడిపిలుస్తోంది కార్యక్రమంలో రెండో రోజు షెడ్యూల్ అమలు కాకపోతే ఇక మిగిలిన రోజుల కార్యక్రమాలు ఏం జరుగుతాయంటూ పలువురు సందే హం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మంత్రి మృణాళిని చీపురుపల్లి పట్టణంలో శనివారం వధ్యాహ్నం 12.15 గంటల నుంచి సాయంత్రంవరకు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడిపిలుస్తోంది కార్యక్రమం అంతంతమాత్రంగా నిర్వహించడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. -
చీపురుపల్లి టీడీపీలో ముసలం
చీపురుపల్లి : నియోజవర్గంలోని అధికార పార్టీలో ము సలం ప్రారంభమైంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు పెత్తనాన్ని నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు రెండు గ్రూపులుగా ఉన్న పార్టీ నేతలు..ఎన్నికల తరువాత ఒక్కటయ్యూరు. అయితే గద్దే వ్యాఖ్యలతో మళ్లీ రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. గతంలో పరిస్థితిని పక్కన పెడితే తాజాగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మృణాళినిని గద్దే ఓవర్ టేక్ చేస్తూ పలు ప్రకటనలు చేస్తుండడం తాజా వివాదానికి దారి తీసింది. వాస్తవానికి మంత్రి మృణాళిని ఆదేశాలతోనే గద్దే ఇలా వ్యవహరిస్తున్నారా లేదా అంతాతానై వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారా అన్నది స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఎంపీపీ, వైస్ ఎంపీపీల పేర్లును ప్రకటించి గద్దే పార్టీలో గందరగోళానికి తెర తీసారు. రెండు రోజులుగా గద్దే ప్రకటనలతో విసుగు చెందిన ఆ పార్టీ నాయకులు సోమవారం బయటపడ్డారు. గద్దే తీరుపై తీ వ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ, పార్టీకి నష్టం కలిగిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల్లో తెలుగుదేశం నాయకులు ఏకంగా ప్రెస్మీట్లు పెట్టి మరీ గద్దే వ్యాఖ్యలను తప్పుబట్టారు. అంతేకాకుండా ఎంపీపీ వైస్ ఎంపీపీలను నియమించడానికి ఆయన ఎవరంటూ మండిపడ్డారు. మండల స్థాయిలో తీసుకునే నిర్ణ యాన్ని చెప్పడానికి ఆయన ఎవరంటూ గుర్ల మండల నాయకులు ప్రశ్నించారు. అంతేకాకుండా గద్దే తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు కూడా వారు సిద్ధమవుతున్నట్లు భోగట్టా. ఏదిఏమైనప్పటికీ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్న మృణాళిని సొంత నియో జకవర్గంలోనే పార్టీ నేతలు ఒకరిపై మరొకరు ప్రెస్మీట్లు పెట్టుకుని రోడ్డెక్కి, పార్టీ పరువు బజారు కీడుస్తుండడంతో చర్చనీయమైంది. -
ఎంపీపీ ఎంపికలో రాజకీయం
చీపురుపల్లి: చీపురుపల్లి, గరివిడి మండల అధ్యక్షుల ఎంపికలో రాజకీయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఎంపీపీలు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పార్టీ అధిష్ఠానం ఇప్పటికే కొందరిని ఎంపీపీలుగా ఎంపిక చేసినప్పటికీ అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు శనివారం చేసిన వ్యాఖ్యలు అభ్యర్థుల్లో మరింత గందరగోళానికి తెరతీసాయి. దీనిపై చీపురుపల్లి, గరివిడి మండలాల్లోని టీడీపీ వర్గీయుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పూర్తి మెజార్టీతో పాటు మంత్రి ఆశీస్సులు ఉండడంతో చీపురుపల్లి, గరివిడి మండలాలకు చెందిన ఎంపీపీ అభ్యర్థులు ముహూర్తం పెట్టుకు ని సీటులో కూడా కూర్చున్నారు. కానీ గద్దే ఝలక్తో ఇప్పుడు వారంతా ఖంగు తింటున్నారు. గద్దే మాటల తో ఏం జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మె రకముడిదాం, గుర్ల మండలాల ఎంపీపీ అభ్యర్థులను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. దీంతో చీపురుపల్లి, గరివిడి మండలాల్లో ఇప్పటికే రౌతు కాంత మ్మ, పైల సింహాచలం వారం రోజులు క్రితమే ము హూర్తం కోసం ఎంపీపీ సీటులో అనధికారికంగా కూ ర్చున్నారు. అయితే వచ్చే నెల 4వ తేదీన ఎంపీపీ ఎన్ని క జరగనున్న నేపథ్యంలో..శనివారం గద్దే బాబూరావు విలేకరులతో మాట్లాడుతూ చీపురుపల్లి, గరివిడి మం డల అధ్యక్షుల ఎంపికపై అస్పష్టంగా మాట్లాడడంతో సర్వత్రా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ముహూర్తానికి ఈ రెండు మండలాల్లో ఎంపీపీ అభ్యర్థులు కూర్చొన్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా కూర్చొంటే అయిపోతుందా అంటూ ఎదురు ప్రశ్న వే శార. అయితే చివరకు ఆ ఇద్దరినే కూర్చోబెట్టొచ్చు కా ని....పనితీరు బాగా లేకపోతే నెల రోజుల్లో దింపేయవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తన మాట ల్లో ఎంపీపీ అభ్యర్థి పైల బలరామ్కు కూడా ఝలక్ ఇచ్చారు. గరివిడి వైస్ ఎంపీపీగా తన అనుచరుడు రవి పేరును ప్రకటించడంతో టీడీపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇది నచ్చని ఆ పార్టీలో మరికొంతమం ది వైస్ ఎంపీపీ పేరు ప్రకటించడానికి ఆయనకు ఉన్న అధికారమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు బ యటకు పొక్కడంతో నియోజకవర్గంలోని టీడీపీ వర్గీయుల్లో చర్చ ప్రారంభమవ్వగా.. ఎంపీపీ అభ్యర్థుల్లో గుబు లు మొదలైంది. -
మూడోసారి... నో ఛాన్స్!
చీపురుపల్లి, న్యూస్లైన్: చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి సెం టిమెంట్ మరోమారు రుజువైంది. ఇక్కడ వరుసగా మూడోసారి పోటీ చేసిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంతవరకు గెలవలేదు. తాజాగా బొత్స కూ డా ఓటమి పాలయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలి చిన బొత్స మూడోసారి పోటీకి దిగి ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. 1953లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు ఎవరూ లేరు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గద్దే బాబూరావు, త్రిపురాన వెంకటరత్నం, టంకాల సరస్వతమ్మ, చిగులుపల్లి శ్యామలరావు, కోట్ల సన్యాశప్పలనాయుడు, తాడ్డి రామారావు, తాడ్డి అచ్చంనాయుడు, రౌతు పైడపునాయుడులు ఎమ్మెల్యేలుగా పని చేసినా ఎవరూ మూడుసార్లు వరుసగా పని చేయలేదు. 1996, 1999లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దే బాబూరావు 2004లో ఓడిపోయారు. 2004, 2009లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స సత్యనారాయణ కూడా పరాజ యం పాలయ్యారు. అందులోనూ కొత్తవారికి పట్టం కట్టడానికే స్థానికులు ఆసక్తి చూపిస్తారు. బొత్స సత్యనారాయణ, కిమిడి మృణాళిని విషయంలో ఈ అంశం రుజువైంది. -
బొత్స ఘోరపరాజయం
చీపురుపల్లి, న్యూస్లైన్ : జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వరకూ ఆయన మకుటం లేని మహారాజు. నిన్నమొన్నటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి, పది సంవత్సరాలు మంత్రిగా, ఒక ఏడాది ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ చీఫ్గా పనిచేశారు. ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. అన్నిటికి మించి తన కనుసన్నల్లో జిల్లాను ఎదురులేకుండా ఏలారు. ఆ స్థాయి వ్యక్తిని నేడు చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. సత్తి కాలపు నమ్మకాలను ప్రజలు పక్క నపెట్టారు. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికలు ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. విజయం సాధించడానికి ఆయన వేసిన ఎత్తులేవీ పనిచేయలేదు. ఏకంగా 20,840 ఓట్లతో వ్యత్యాసంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో ఓటమి చవి చూశారు. తన కుటుంబంలో మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పదవిని పెట్టుకుని జిల్లాను శాసించిన బొత్సకు ఈ సారి గర్వభంగం తప్పలేదు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తనతో పాటు, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోవడంతో ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది. నియోజకవర్గంలో ఆది నుంచి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ బొత్సతో పాటు ఆయన మేనల్లుడు చిన్నశ్రీను సైతం నియోజకవర్గంలో విజయం కోసం అష్టకష్టాలు పడ్డారు. రేయింబవళ్లు శ్రమించారు. ఓటర్లపై ప్రలోభాల వల విసిరారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రధానంగా చీపురుపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం తక్కువగా వచ్చాయి. దీనికి కారణం రాష్ట్ర విభజన విషయంలో బొత్స రెండునాల్కల ధోరణితో వ్యవహరించారని ప్రజలు విశ్వసించడమే. ఆ సమయంలో ఉప్పెనలా వచ్చిన ఉద్యమాన్ని అణిచివేసేందుకు అమలు చేసిన కర్ఫ్యూవల్ల ప్రజలు నానా పాట్లు పడ్డారు. భయంతో బితుకుబితుకుమం టూ గడిపారు. కనీసం ఆలయానికి వెళ్లి తమను కాపాడమని భగవంతుడిని ప్రార్థించే అవకాశాన్ని కూడా లేకపోయింది. రాత్రీపగలు తేడా లేకుండా నిత్యం పోలీసుల బూటు చప్పుళ్ల ధ్వనితో వారు తీవ్రంగా భీతిల్లారు. ఇంతగా తమను భయబ్రాంతులకు గురిచేసిన బొత్సపై ప్రజలు పెంచుకున్న కసిని ఇలా తీర్చుకున్నారు. ప్రజల ను మోసం చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించారు. -
రెండు దశాబ్దాలుగా అదే సెంటిమెంట్!
రాజకీయాల్లో సెంటిమెంటుకు తావులేదని ప్రకటనలిచ్చే నేతలు సైతం తాము చేసే ప్రతీ పనికి వెనుకా ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారీ నేతల విజయావకాశాలతో పాటు, ఆయా స్ధానాల సెంటిమెంట్లు, గత ఎన్నికల ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. సరిగ్గా అలాంటి సెంటిమెంటే విజయనగరం జిల్లా రాజకీయ వేదికపై రెండు దశాబ్దాలుగా సజీవంగా నిలూస్తూ వస్తోంది. రాజకీయాల్లో సెంటిమెంట్లు భలే ఉంటాయి. నాయకుల నమ్మకాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. రాజకీయ నేతలు ఏం చేయాలన్నా ముహూర్తాలు చూసుకోవడంతోపాటు గతానుభవాలను కూడా బేరీజు వేసుకుంటారు. శాస్త్రీయంగా ఆ అంశాలను నిరూపించలేనప్పటికీ లెక్కల్లో మాత్రం ఖచ్చితంగా నమ్మాలనిపించేటట్లు ఉంటాయి. విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు ఖాయం. వినడానికి కాస్తా ఆశ్చర్యంగా ఉన్నా ఇది గణాంకాల సాక్షిగా నిరూపితమైన నిజం. విజయనగరం జిల్లాలో 1995 నుంచి 2009 వరకు అక్షరాలా అమలవుతున్న నిజమిది. సుమారు రెండు దశాబ్దాల కాలంలో జెడ్పీ పీఠంపై కూర్చుని ఆ పై ఉన్నత పదవులు పొందిన వారిని పరిశీలిస్తే ఈ సెంటిమెంటును ఒప్పుకోకతప్పదు. 1995-96లో జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా పనిచేసిన కొండపల్లి పైడితల్లి నాయుడు ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేశారు. ప్రత్యర్థి బొత్స సత్యనారాయణపై ఇరవై వేల ఓట్ల మెజార్టీతో బొబ్బిలి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 1998లో కూడా ఆయన బొత్సపై ఇరవై ఆరువేల ఓట్ల మెజార్టీతో లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే 1999 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కొండపల్లి పైడితల్లినాయుడు టీడీపీ నుంచి మూడోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అదే పార్టీకి చెందిన లగుడు సింహాద్రి నాలుగేళ్లు పాటు 1996-2000 మధ్య కాలంలో జిల్లా పరిషత్ పీఠాన్ని అధిష్టించారు. అయితే ఆయన అక్కడతో రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. 2001 నుంచి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ తరపున బొత్స ఝూన్సీలక్షి ఎంపికయ్యారు. అప్పటి సిట్టింగ్ లోక్సభ సభ్యుడు కొండపల్లి పైడితల్లి నాయుడు అకాలమరణంతో బొబ్బిలి స్థానానికి ఉపఎన్నికలు జరిగాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న బొత్స ఝూన్సీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి పైడితల్లినాయుడు కుమారుడు కెఏ నాయుడుపై విజయం సాధించారు. ఆ తరువాత డెంకాడ జెడ్పీటీసీగా ఉన్న బొత్స సత్యనారాయణ బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు జెడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటూనే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన బెల్లాన చంద్రశేఖర్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికై పూర్తి కాలం పదవిలో కొనసాగారు. ఇలా 1995లో కొండపల్లి పైడితల్లినాయుడు నుంచి 2009లో బడ్డుకొండ అప్పలనాయుడు వరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి నిర్వహించి ఆ తరువాత చట్టసభలకు పోటీ చేసిన వారు తమ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నిక్లలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాజీ జెడ్పీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కూడా విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా నిజమవుతూ వస్తున్న సెంటిమెంట్ ఈ దఫా కూడా ఖచ్చితంగా ఫలిస్తుందని వారి నమ్మకం. -
బెదిరింపులు...బ్లాక్మెయిలింగ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బులు, బెదిరింపు లు, కార్పొరేట్ ఎత్తుగడలతో ఆ పార్టీ నేతలు విలవిల్లాడిపోతున్నారు. చీపురుపల్లి టిక్కెట్ కేటాయింపు విషయంలో కళా వెంకటరావు....అశోక్ను బెదిరించి తన దారికి తెచ్చుకున్నారు. ఇదే విషయమై ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గం తారస్థాయిలో చర్చ జరుగుతోంది. విజయనగరం పార్లమెంట్ పరిధిలోకి రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, చీపురుపల్లి టిక్కెట్ తమకిస్తేనే ఆ రెండు నియోజకవర్గాల ఓట్లు పడతాయని, లేదంటే తమ అనుచరులు కష్టపడి పనిచేయరని కిమిడి కళా వెంకటరావు పరోక్షంగా అటు అధిష్టానాన్ని, ఇటు అశోక్గజపతిరాజును బెదిరించారన్న వాదన విన్పిస్తోంది. దీంతో తప్పని పరిస్థితిలో దిగొచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ వ్యూహం వెనుక పార్టీ కార్పొరేట్ పెద్దల పాత్ర ఉందని తెలుస్తోంది. అశోక్ గజపతిరాజును దారికి తెచ్చుకోవాలంటే ఇదొక్కటే తారకమంత్రమని కిమిడికి అండగా నిలిచిన కార్పొరేట్ పెద్దలు సూచించడంతోనే ఈ రకమైన ఎత్తుగడకు దిగినట్టు పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. కిమిడి పెట్టిన మెలికతో ఆయా నియోజకవర్గాల ఓట్లు ఎక్కడ పడవోనన్న భయంతో అశోక్ తలొగ్గారన్న వాదనలు విన్పించాయి. తనను నమ్ముకుని పనిచేస్తున్న త్రిమూర్తులురాజును ఎలాగైనా ఒప్పించవచ్చని, కిమిడికి ఉన్న బంధుత్వంతో కెంబూరి రామ్మోహనరావుతో దారికి తెచ్చుకోవచ్చన్న ఉద్దేశంతో మృణాళిని అభ్యర్థిత్వానికి అశోక్ అంగీకరించారనే చర్చ జరుగుతోంది. డామిట్ కథ అడ్డం తిరిగినట్టు త్రిమూర్తులరాజు, రామ్మోహనరావు రెబెల్స్గా నామినేషన్ వేసి దడ పుట్టించారు. ఎవరెన్ని చెప్పినా బరిలో ఉంటామని మొండికేస్తున్నారు. బుజ్జగించే పనిలో జిల్లా నాయకత్వం.. రెబల్స్గా ఉన్న త్రిమూర్తులురాజు, కెంబూరి రామ్మోహనరావులను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. కానీ, వారిద్దరూ ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆ బాధ్యతలను జిల్లా నాయకత్వానికి అప్పగించారు. ఇప్పుడా పార్టీ కీలక నేతలు రెబల్స్ను ఒప్పించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఒక పర్యాయం మాట్లాడారు. కానీ దారికి రాలేదు. దీంతో ఆదివారం రాత్రి అశోక్ గజపతిరాజు, ద్వారపురెడ్డి జగదీష్ నేరుగా రంగంలోకి దిగారు. చీపురుపల్లి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ, రెబెల్స్ ఇద్దరు తలొగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దారికి రాని నిమ్మక.. కురుపాం టీడీపీ రెబెల్గా నామినేషన్ వేసిన నిమ్మక జయరాజ్ కూడా పార్టీ నేతల బుజ్జగింపులకు తలొగ్గలేదు. దారికొచ్చేది లేదని, నామినేషన్ ఉపసంహరించుకోనని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని, టీడీపీ కార్యకర్తలంతా తనవైపే ఉన్నారని జిల్లా నాయకత్వానికి గట్టిగా బదులిచ్చినట్టు తెలిసింది. దీంతో ఆ పార్టీ నాయకులు కంగుతిన్నారు. జయరాజ్ను దారికి తీసుకురాలేమన్న నిర్ణయానికొచ్చేశారు. -
మూడో ‘సారీ’..!
చీపురుపల్లి, న్యూస్లైన్: రాష్ర్టస్థాయిలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గం చీపురుపల్లి. అ లాంటి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వ రకు వరుసగా మూడోసారి గెలిచిన ఎ మ్మెల్యే ఎవరూ లేరు. అసలు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయిన వారు కూడా ఇద్దరే. వారిలో ఒకరు గద్దే బా బూరావు కాగా మరొకరు బొత్స సత్యనారాయణ. కాకలు తీరిన నేతలుగా పే రు గాంచిన వీరిలో గద్దే బాబూరావు మూడోసారి గెలిచేందుకు అష్టకష్టాలు ప డి విఫలమయ్యారు. తాజాగా మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీ తరఫున బొత్స సత్యనారాయన మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ సారి కూడా సంప్రదాయం కొనసాగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓటింగ్ సరళిని బట్టి ప్రజలు ఓ అంచనాకు వచ్చేవారు. కానీ ప్రస్తుతం సమైక్యాంధ్ర ఎఫెక్ట్ కారణంగా కాంగ్రెస్ పార్టీ సీను కాలిపోవడంతో బొత్స సత్యనారాయణ గెలుపుపై ఇప్పుడే జనం పెదవి విరుస్తున్నారు. మూ డోసారి ఓ నేతను ఎన్నుకునేందుకు ఇక్కడి ఓటర్లు ఎంత వ్యతిరేకత చూపిస్తారో... కొత్తవారికి అధికారం ఇవ్వడానికి అం తటి ఆసక్తికి కనబరుస్తారు. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు కొత్తవారే. ఇప్పుడు కూడా స్థాని కుడు, వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్కు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. 1994, 1999లో గద్దే బాబూరావు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో మూడోసారి కూడా గద్దే పోటీ చేయగా, కొత్తగా వచ్చిన బొత్స సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2004, 2009లో బొత్స సత్యనారాయణ గెలుపొందారు. తాజాగా మే 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో బాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉంది. ఈ మూడు పార్టీల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన అభ్యర్థులు పా తవారే. వైఎస్ఆర్ సీపీ మాత్రం కొత్త అభ్యర్థిని బరిలోకి దించిం ది. దీంతో చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
మార్కెట్ కమిటీలకు కాసులపంట
విజయనగరం రూరల్, న్యూస్లైన్: 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో తొమ్మిది మార్కెట్ కమిటీలకు లక్ష్యాన్ని మించి ఆదాయం లభించింది. జిల్లా లక్ష్యం 9.37 కోట్ల రూపాయలు కాగా, తొమ్మిది మార్కెట్ కమిటీల నుంచి రూ. 10 కోట్ల 21 లక్షల 86 వేల ఆదాయం సమకూరింది. అత్యధిక ఆధాయంతో పూసపాటిరేగ మార్కెట్ కమిటీ మొదటి స్థానంలో నిలిచింది. పూసపాటిరేగ మార్కెట్ కమిటీ లక్ష్యం 75 లక్షల రూపాయలు కాగా రూ.కోటి ఆరు లక్షల 48 వేల ఆదాయంతో లక్ష్యం సాధించింది. రెండో స్థానం సాధించిన చీపురుపల్లి మార్కెట్ కమిటీ రూ.75 లక్షల లక్ష్యానికి గాను రూ.97.57 లక్షల ఆదాయం సాధించింది. బొబ్బిలి మార్కెట్ కమిటీ లక్ష్యం కోటీ 92 లక్షల రూపాయలు కాగా కోటి 89 లక్షల తొంబైమూడు వేల రూపాయలతో 99 శాతం ఆదాయాన్ని సాధించింది. కొత్తవలస మార్కెట్కమిటీ లక్ష్యం నల బై ఐదు లక్షల రూపాయలు కాగా 32 లక్షల తొమ్మిది వేల రూపాయలు, సాలూరు మార్కెట్ కమిటీ లక్ష్యం కోటి 25 లక్షల రూపాయలు కాగా కోటీ 54 లక్షల 37 వేల రూపాయల ఆదాయం సమకూరింది. కురుపాం మార్కెట్ కమిటీకి రూ.28 లక్షలు లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.36 లక్షల 25 వేల ఆదాయం సమకూరింది. పార్వతీపురం మార్కెట్ కమిటీకి రూ.1.65 కోట్ల లక్ష్యం నిర్దేశించగా రూ.కోటి 97 లక్షల 32 వేల ఆదాయం సాధించింది. విజయనగరం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.1.30 కోట్లు కాగా కోటీ 22 లక్షల 15 వేల రూపాయలతో 94 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన గజపతినగరం ఏఎంసీ ఈ ఏడాది ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది. గజపతినగరం మార్కెట్ కమిటీ లక్ష్యం కోటీ రెండు లక్షల రూపాయలు కాగా 85 లక్షల 70 వేల రూపాయలతో 84 శాతం ఆదాయాన్ని సాధించింది. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం మార్కెటింగ్శాఖకు తగలకపోవడంతో అధికారులు లక్ష్యాన్ని పూర్తి చేయగలిగారు. -
మరణించినా.. చిరంజీవుడే!
చీపురుపల్లి రూరల్, న్యూస్లైన్ : మండలంలోని పేరిపి-ఇటకర్లపల్లి గ్రామాల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని అడ్డూరివీధికి చెందిన చల్లా రమణ(38) మృతి చెందాడు. మృతుడు రమణ పట్టణంలోని సిటీకేబుల్ నెట్వర్క్లో కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా మండలంలోని ఇటకర్లపల్లి గ్రామానికి చీపురుపల్లి వైపు నుంచి ద్విచక్రవాహనంపై తన స్నేహితుడితో కలసి బయల్దేరాడు. వీరి వాహనానికి ముందు భాగాన ట్రాక్టర్ వెళ్తోంది. పేరిపి-ఇటకర్లపల్లి మధ్య ట్రాక్టర్ను ద్విచక్ర వాహనంతో ఓవర్టేక్ చేయబోయారు. అదే సమయంలో ట్రాక్టర్ పక్కవైపునకు తిరగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ను వీరి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వెనుక కూర్చొన్న రమణ ఒక్క ఉదుటున కిందపడిపోయాడు. అతని శరీరం మీద నుంచి ట్రాక్టర్ వెళ్లిపోవడంతో సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనాథలైన భార్యాపిల్లలు మృతుడు రమణది నిరుపేద కుటుంబం. అతనికి భార్య మాధవితోపాటు ఆరు, నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణ మరణంతో వీరు అనాథలయ్యారు. విషాదంలోనూ నేత్రదానానికి అంగీకారం పుట్టెడు శోకంలోనూ రమణ నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఈ మేరకు పట్టణానికి చెందిన మానవీయతా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బి.వి.గోవిందరాజులుకు ఫోన్ చేసి నేత్రదానానికి అంగీకరించారు. దీంతో గరివిడి కంటి ఆస్పత్రి వైద్యనిపుణులు వచ్చి రమణ మృతదేహం నుంచి నేత్రాలను సేకరించి నేత్రనిధికి పంపారు. -
రాజకీయ ఒత్తిళ్లే కారణం..!
చీపురుపల్లి, న్యూస్లైన్:పట్టణంలోని శ్రీనివాసా మహల్ జంక్షన్లో ఉన్న మండల పరిషత్ దుకాణ సముదాయాలకు టెం డరు నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది డిసెంబరు 31వ తేదీన దుకాణాలకు టెండర్లు నిర్వహిస్తామని ఎంపీడీఓ రాజ్కుమార్ ప్రకటించి, అదే రోజు అకస్మాత్తుగా వాయిదా వేశారు. అయితే ఇప్పటికి నెల రోజులు కావస్తున్నా.. అధికారులు స్పందించకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మండల పరిషత్ కు రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయూనికి గం డిపడుతోంది. మండల పరిషత్కు శ్రీనివాసా మహల్ జంక్షన్ ఎదురుగా పది దుకాణాలు ఉన్నాయి. వీటికి మూడేళ్లకు ఒకసారి టెండర్లు ఆహ్వానించి, అద్దెలకు ఇస్తున్నారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో దుకాణాల వేలం పాటకు మండల పరిషత్ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీం తో పది దుకాణాలకు గాను 20 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులు రూ. 5 వేలు డీడీ, లక్ష రూపాయల విలువ గల ఆస్తి ధ్రువీ కరణపత్రం, ఈపీలతో టెండరుకు దరఖాస్తులు ఇచ్చారు. డిసెంబరు 31న వేలం పాట జరగాల్సి ఉండగా, అదే రోజు వేలా న్ని వాయిదా వేస్తూ.. ఎం పీడీఓ కె. రాజ్కుమార్ ప్రకటించారు. తిరిగి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చే యలేదు, దుకాణాల్లో ఉన్న పాతవారిని ఖాళీ చేరుుంచ లేదు. దీంతో ప్రస్తుతం ఆ దుకాణాలకు చాలా తక్కువ అద్దెలు ఉన్నాయి. ప్రస్తుతం దుకాణాల్లో దిగువ అంతస్తులో ఉన్న వాటికి రూ. 2,400, పై అంతస్తులో ఉన్న వాటికి రూ. 1200 అద్దె చెల్లిస్తున్నారు. అదే వేలం పాట జరిగి ఉంటే కింద అంతస్తులో కనీసం రూ. 6 వేలకు తక్కువ లేకుండా అద్దె వచ్చేది. కానీ అధికారులు వేలం పాట నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయానికి ఆటంకం కలిగిస్తున్నారు మండల పరిషత్కు రావాల్సిన లక్షలాది రూపాయ ల ఆదాయూనికి అధికారులే ఆటంకం కలిగిస్తున్నా రు. నెల రోజులు కావస్తున్నా.. ఇంతవరకు వేలం కోసం ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారు ణం, అసలు ఎందుకు వేలం వాయిదా వేసారో, తిరిగి ఎందుకు వారుుదా వేశారో అర్థం కావడం లేదు.. - డబ్బాడ జయశంకర్, దరఖాస్తుదారుడు, జి.అగ్రహారం. -
నిజంగా.. కలిసిపోనారా?
నిన్నటివరకు ఎడమొహం,పెడమొహంగా ఉన్న చీపురుపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు కలిసిపోయారా? భేషజాలు పక్కన పెట్టి చెట్టపట్టాలేసుకుని పార్టీ కోసం పని చేస్తున్నారా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకు ఎడబాటుగా మాజీ ఎంఎల్ఏ గద్దె బాబూరావు పార్టీ నియోజక వర్గ ఇన్చార్జ్ కె.త్రిమూర్తులు రాజు తాజాగా కలిసిపోయామంటూనే పరస్పరం గోతులు తీసుకునే తెరచాటు యత్నాలు ప్రారంభించారు. శత్రుత్వాన్ని బయటకు కనిపించనీయకుండా పొత్తి కడుపులో కత్తులు పెట్టుకుంటూ హత్తుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కలిసే తిరుగుతున్నా లోలోన ఎవరికి వారే ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం డ్రామా లాడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. చీపురుపల్లి, న్యూస్లైన్: చీపురుపల్లి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీలో కొత్త యుద్ధం ఆరంభమయ్యింది. దీంతో నియోజకవర్గం తెలుగుదే శం క్యాడర్లో అయోమయం మరింత ఎక్కువైనట్లు ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇంతవరకు పార్టీకి దిక్కు ఒక్కరే ఉండేవారని, ఇప్పుడు ఇద్దరు నాయకులు మేం కలిసే ఉన్నామని బయటకు చెబుతూ లోలోపల ఆ పరిస్థితి లేదని..ఎవరితో పనిచేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతోందంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు అంటీముట్టనట్లు ఉన్న మాజీ ఎంఎల్ఏ గద్దె బాబూరావు, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జి కె.త్రిమూర్తులురాజు కలిసిపోయామంటూ తాజాగా ప్రకటించా రు. అంతేకాకుండా అప్పటి నుంచి కలిసే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే నిజంగా వీరిద్దరూ కలిశారా...? లేదంటే నటిస్తున్నారా...? అన్న సందేహాలు నియో జకవర్గ వ్యాప్తంగా విపరీతం గా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరే ముందు వరకు గద్దె బాబూరావు..ఎట్టి పరిస్థితుల్లోనూ 2014 ఎంఎల్ఏ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ఎన్నోసార్లు పత్రికా సమావేశాల్లో స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ టికెట్టు ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ఆయన అనుయాయులతో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి పరి స్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఎవరికి టికెట్టు ఇచ్చి నా తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని గద్దే చెప్పడం, త్రిమూర్తులు రాజు ఇంటికి వెళ్లి ఆయన కారులోనే గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం సాగిస్తుండడం వెనుక రాజకీయ కుట్ర ఉందని త్రిమూర్తులురాజు వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా రాజకీయంగా ఎంతో దర్పాన్ని చూపించే బాబూరావు ఇలా త్రిమూర్తులు రాజు ఇంటికి వెళ్లి మరీ కార్యక్రమాలకు హాజరవుతుండడంపై ఆయన నిజంగానే మారారా? లేదంటే టికెట్టు దక్కించుకునేందుకు కొత్త డ్రామా మొదలు పెట్టారా? అన్న కోణంలో త్రిమూర్తులురాజు వర్గీయులు ఆరా తీస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే నాలుగేళ్లుగా ఆర్థికంగా, మానసికంగా వేదన చెందుతూ ఎంఎల్ఏ టికెట్టు కోసం పార్టీని నియోజకవర్గంలో నిలబెట్టిన ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి కె.త్రిమూర్తులురాజు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్టు ను వదులుకోరాదని గట్టిగా నిర్ణయించుకుం టున్నట్లు తెలుస్తోంది. గద్దెతో పాటు తాను కూడా డ్రామాలో మునిగిపోయి తన పని తాను చేసుకుంటే మంచిదని భావిస్తున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నా యి. దీంతో ఇద్దరూ కలిసి ఉంటూనే ఎవరి పని వారు చక్కబెట్టుకుంటున్నారు. అంతేకాకుండా గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు గాని, పార్టీలో చేరికల విషయంలో గాని ఆధిపత్య పోరు కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో గద్దె బాబూరావు పార్టీలో చేరిన వారం రోజుల్లోనే అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలియవచ్చింది. ఇద్దరం కలిసి పోయామంటూ చేతులు కలుపుతున్నా ఎవరి దారి వారిదే అన్న చందంగా వ్యవహరి స్తున్నారని ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. -
అధికారుల సాక్షిగా...
జి.ములగాం(చీపురుపల్లి రూరల్), న్యూస్లైన్:మండలంలోని జి.ములగాం గ్రామం లో అధికారుల సాక్షిగా.. కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు కొట్లాటకు దిగారు. ఈ సంఘటనలో 15 మందికి గాయూలయ్యూయి. సమస్యాత్మక గ్రామమని పోలీసులకు ముందే తెలిసినా.. పెద్దగా స్పందించకపోవడంతో ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం.. కొట్లాటకు దారి తీసింది. కాంగ్రెస్ వర్గీయులు ఇనుప రాడ్లు, రా ళ్లు, కర్రలతో బీభత్సం చేయడంతో గ్రామంలో భయూనక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా.. ఇరువర్గాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత ఏడాది అక్టోబర్లో పడిన భారీ వర్షాలకు గ్రామానికి చెందిన పత్తి రైతులు పూర్తిగా నష్టాలపాలయ్యూరు. అయితే నష్ట పరిహారానికి సంబంధించిన జాబితాలో టీడీపీకి చెందిన 17 మంది రైతుల పేర్లును తప్పించారని, అదే గ్రా మానికి చెందిన టీడీపీ నాయకుడు అలమండ నరసింహమూర్తి ఇటీవల కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ బి. వెంకటరావు బుధవారం గ్రామంలోని విచారణ చేపట్టారు. ఈ విచారణలో కాం గ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు, ప్రస్తుత సర్పంచ్ బోను అప్ప య్య (కాంగ్రెస్)తో పాటు కాం గ్రెస్, టీడీపీ వర్గీయులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అలమండ నరసింహమూర్తి, సిరిపురపు అప్పలనాయు డు, మచ్చ రామునాయుడు, మజ్జి అచ్చుంనాయుడు, అలమండ అప్పలనాయుడు, కె. బీమరాజు తదితరులు మాట్లాడుతూ గత ఏడాది అక్టోబరులో పడిన వర్షాలకు పత్తి పంట వాస్తవంగా దెబ్బతిన్నప్పటికీ పరిహారం జాబితాలో తమ పేర్లు లేవన్నారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ విషయాన్ని గతంలో గ్రామానికి వచ్చిన కేంద్ర బృందం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించగా.. తమకు జాబితా ఇవ్వలేదని వారు చెప్పారు. దీంతో ఆర్డీఓ జాబితాను పరి శీలించగా అందులో కేవలం మాజీ సర్పంచ్ కరి మజ్జి శ్రీనివాసరావు, ఇంకొందరి పేర్లు మాత్ర మే ఉండడంతో వీఆర్ఓను ప్రశ్నించారు. ఇంత లో దండోరా విషయమై ఇరువర్గాల మధ్య మా టామాట పెరిగింది. దండోరా వేయలేదని టీడీపీ వర్గీయులు చెప్పగా, ముందుగానే దం డోరా వేయించామని కాంగ్రెస్ వర్గీయులు తెలి పారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జర గడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోరుుంది. రెండు వర్గాల కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. కాంగ్రెస్ వర్గీయులు ముందుగా ఇను ప రాడ్లు, కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించా రు. కొట్లాటలో టీడీపీకి 11 మందికి, కాంగ్రెస్కి చెందిన నలుగురికి గాయూలయ్యూరుు. మహిళలు కూడా కొట్లాటకు దిగడంతో భయూనక వా తావరణం నెలకొంది. ఈ సంఘటనంతా ఆర్డీఓ సమక్షంలోనే జరిగింది. కొట్లాట జరిగే సమయంలో పోలీసులు కూడా నలుగురే ఉండడంతో అదుపుచేయలేకపోయారు. గ్రామం స మస్యాత్మాక గ్రామమని అధికారులు ముందు గా పోలీసులకు చెప్పినా..వారు స్పందించలేద ని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో అధికారులు విచారణను మధ్యలోనే నిలిపివేశారు. చీపురుపల్లి ఆస్పత్రిలో క్షతగాత్రులు కొట్లాటలో టీడీపీకి చెందిన చెందిన గంట్యాడ అప్పలసూరి, గడి పాపినాయుడు, మజ్జి అ చ్చుంనాయుడు, పతివాడ అప్పలనాయుడు, మేకల సత్యం, కలిశెట్టి సీతమ్మ, లంకె జయ మ్మ, లంకె శ్రావణిలకు గాయూలయ్యూరుు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన గొర్లె గొల్ల, కరిమజ్జి మహలక్ష్మునాయుడు, కరిమజ్జి లక్ష్మి, అంబల్ల అసిరినాయుడు గాయపడ్డారు. క్షతగాత్రులంతా చీపురుపల్లి సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ఎంపీ కెంబూరి రామోహనరావు, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, నియోజకవర్గ ఇన్చార్జి కె. త్రిమూర్తులురాజులు తదితరులు టీడీపీకి చెందిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గద్దే బాబూరావు డీఐజీతో ఫోన్లో మాట్లాడుతూ పోలీసుల మెతకవైఖరి వల్ల గ్రామంలో ఎప్పటికప్పడు కాంగ్రెస్ వర్గీయులు దాడులు చేస్తున్నారని చెప్పారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎప్పుడూ ఇదే పరిస్థితి ఫిర్యాదుదారుడు నరసింహమూర్తి మాట్లాడు తూ న్యాయం అడిగితే దాడులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారన్నారు. గతంలో కూడా పలుమార్లు కాంగ్రెస్ వర్గీయులు దాడులకు పా ల్పడ్డారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ వర్గీయులే ముందుగా దాడులకు దిగడంతోనే కాంగ్రెస్ వర్గీయులు దాడులకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. గ్రామంలో పోలీస్ పికెట్ చీపురుపల్లి సీఐ జి.వాసుదేవ్ ఆధ్వర్యంలో పో లీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. చీ పురుపల్లి, గరివిడి ఎస్ఐలు షేక్ అబ్దు ల్మరూఫ్, క్రాంతికుమార్, ట్రైనీ ఎస్ఐలు నీల కంఠం, ప్రసాద్ గ్రామానికి వెళ్లి పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. -
రేషన్ షాపుపై విజిలెన్స్ దాడి
చీపురుపల్లి,న్యూస్లైన్: చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో గల ఆకులపేట రేషన్ షాపుపై విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్. ఉమాకాంత్ ఆధ్వర్యంలో జరిపిన ఆకస్మిక దాడిలో రేషన్ దుకాణంలో సరుకుల తేడా కనిపించింది. దీంతో రేషన్షాపు రికార్డులు సీజ్ చేసి, నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీల్లో 100 కేజీల బియ్యం తక్కువగాను, 30 కేజీల గోధుమపిండి ఎక్కువగాను, 200 కేజీల ఉప్పు అధికంగాను ఉన్నాయని చెప్పారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని, ధరల పట్టిక కూడా దుకాణం వద్ద లేదని తెలిపారు. ఆకులపేటలో రేషన్ దుకాణం నిర్వహించేందుకు అనుమతి, నిర్వాహకుడి వద్ద లెసైన్స్ కూడా లేదన్నారు. దీనికి డీలర్ మాట్లాడుతూ లెసైన్స్ పునరుద్ధరణకు ఇచ్చామన్నారు. ఏది ఏమైనప్పటికీ రికార్డులకు, సరుకులకు తేడా ఉండడంతో రికార్డులు సీజ్ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. తేడా వచ్చిన సరుకులను సీఎస్డీటీ జి.జనార్దన్కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ టి.రామకృష్ణ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంటు ఎస్ఐ అప్పలనాయుడు, హెచ్సీ లక్ష్మణ్, వీఆర్ఓ రమణమూర్తి తదితరులు ఉన్నారు. -
బొత్స‘చిరు’ కన్ను!
చీపురుపల్లి, న్యూస్లైన్ :పట్టణంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో భాగంగా వందలాది మంది చిరు వ్యాపారులు దుకాణాలు కో ల్పోయి, వీధిన పడ్డారు. వారిని ఆదుకోవాల్సిన పాల కులు, అధికారులు ఏమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ విషయమై ఇప్పటివరకు స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దేవాదాయ శాఖ స్థలంలో రామచంద్రసాహు కర్రల మిల్లు వద్ద నిర్మించిన దుకాణాల వివాదంలో కూడా మంత్రి కలుగజేసుకోకపోవడంతో ఆ విషయం కో ర్టుకు వెళ్లింది. దీంతో అక్కడ దాదాపు 50 దుకాణాలకు చెందిన చిరు వ్యాపారులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఆ తరువాత ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి శ్రీనివాసామహల్ జంక్షన్ వరకు నిర్మించిన దుకాణాల విషయంలో కూడా మంత్రి బొత్స చొరవ చూపించి వ్యాపారులకు అనుకూలంగా ప్రభుత్వపరంగా ఏమైనా హక్కు లు కల్పించి ఉంటే నేడు దుకాణాలు తొలగించే పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఇక్కడ ఉంటున్న 150 మంది చిరువ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా వ్యాపారాలు లేక, అప్పులు చేసి నిర్మించిన దుకాణాలు తొల గించే పరిస్థితి వచ్చినప్పటికీ మంత్రి కనీసం పట్టించుకోవ డం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన తలచుకుంటే చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఏమైనా చేయగలరని, కాని ఎందుకనో వారి కి జరుగుతున్న నష్టానికి సంబంధించి పట్టించుకోవడం లేదన్న వాదనలు ఉన్నారుు. నియోజకవర్గంలోని ప్రతి అంశంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించే మంత్రి వ్యాపారుల జీవితాలను నిలబెట్టేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదని పార్టీలోని స్థానిక నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ తెలిసి కూడా ప్రణాళికాబద్ధంగా చిరు వ్యాపారులకు పూర్తి హక్కులతో కూడిన దుకాణాలను అప్పగించాలన్న ఆ లోచన మంత్రి ఎందుకు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తమ్మీద ఈ వ్యవహారమంతా స్థానిక నేతలపై ఉంచి, మనకెందుకు లే అన్న చందం గా మంత్రి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. -
గద్దె కొత్త కాపురం సాగేనా!
చీపురుపల్లి, న్యూస్లైన్: చీపురుపల్లి నియోజకవర్గంలో సంఖ్యా బలమున్న ఓ సామాజిక వర్గం గత కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావును వ్యతిరేకిస్తూ వస్తోంది. తమ సామాజిక వర్గానికి చెందిన బొత్సను వ్యతిరేకించి, తెలుగుదేశం పార్టీలో ఉండి, గద్దెకు మద్దతిస్తే అలాంటి తమను నాలుగేళ్లుగా వదిలి పెట్టి, ఎక్కడున్నామో పట్టించుకోకుండా, తీరా ఎన్నికల సమయానికి సీటు కోసం వస్తే ఊరుకునేది లేదని ఆ వర్గానికి చెందిన మండల స్థాయి నేతలు హెచ్చరిస్తున్నప్పటికీ గద్దెను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం పై ఆ పార్టీ నాయకులకు పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా ఓటర్లు ఉన్న తూర్పుకాపు సామాజి క వర్గానికి ప్రాధాన్యమివ్వాలి తప్ప లాబీయిం గ్లకు ప్రాధాన్యమివ్వడం దారుణమని ఆ పార్టీ కి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పలువురు పార్టీని వీడడం ఖాయమని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గద్దె తెలుగుదేశంలో ప్రస్థానం..... తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి, ఆపార్టీ ప్రతిపక్షంలో ఉంటే పక్కకు తప్పుకోవడం, మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పార్టీలో చేరడం గద్దే బాబూరావుకు అలవాటని దేశం పార్టీ నేత లు విమర్శిస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి వారసత్వం, కుల బలం లేని గద్దె బాబూరావు ను రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చేసింది. 1996 నుంచి 2004 వరకు చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. మూడోసారి 2004లో జరిగిన ఎన్నికల్లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాల య్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ ప్రజల కు దూరమయ్యారు. పలుమార్లు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటనలు చేశారు. 2009లో మరోసారి బొత్సపై 5 వేల ఓట్లు తేడాతో ఓటమి చెందారు. తరువాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పట్లో నియోజకవర్గంలోని కార్యకర్తలంతా.... పార్టీకి రాజీనామా చేయవద్దని, తమను ఆదుకునే వారు ఎవ్వరూ లేరని ప్రాథేయపడ్డారు. వారి విన్నపాలను పట్టించుకోకుం డా తనకు రాజకీయం చేసే ఓపిక లేదని, వయ స్సు మీరిపోయిందని రాజీనామా చేసి, కార్యకర్తలకు దూరమయ్యారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని తెలుగుదేశం మండల స్థాయి క్యాడర్పై తన వద్ద డబ్బులు తీసుకుని, తనకు వ్యతిరేకంగా పని చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్లోకి.... 2009 ఎన్నికలు తరువాత రెండేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న గద్దె తిరిగి తెలుగుదేశంలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఆ పార్టీ క్యాడర్ గద్దె రాకను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. పార్టీలో చేరిననాటి నుంచి తనకే ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అం దుకు ఆ పార్టీ నిరాకరించడంతో పార్టీలో ఉన్న క్యాడర్ను తీసుకుని వెళ్లిపోయేందుకు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే పార్టీని వీడేందుకు క్యాడర్ అంగీకరించలేదు. దీంతో ఆయన ఒక్కరే పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితి.... దాదాపు ఐదేళ్లగా తెలుగుదేశం పార్టీకి దూరం గా ఉండి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధమవడంతో దేశం లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. జిల్లాకు చెందిన పార్టీ పెద్ద, పొలిట్బ్యూరో సభ్యుడు పి.అశోక్గజపతిరాజు, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ నెల 3న హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నట్లు స్వయంగా బాబూరావు ప్రకటించారు. తన నివాసం వద్ద, పట్టణంలోని వివిధ సెంటర్ల లో అశోక్, చంద్రబాబు, ఎన్టీఆర్ల ఫొటోలు, ఫ్లెక్సీలతో నింపేశారు. అయితే అదే పార్టీలో ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కె.త్రిమూర్తులురాజు వర్గానికి ఈ పరిణామం మిం గుడుపడడం లేదు. గద్దె పార్టీని వీడినప్పటి నుంచి కె.త్రిమూర్తులురాజు కార్యకర్తలకు అండగా నిలిచారు. నాలుగేళ్లుగా పార్టీకి వెన్నం టి ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ, చివరకు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఇక తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందనుకుంటున్న తరుణంలో బాబూరావు పార్టీలో చేరుతుండడంతో కేటీఆర్కు పోటీ తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతా కష్టపడి పని చేస్తే తమ శ్రమను గుర్తించని అధిష్టానం, పార్టీను కాదని వెళ్లిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటుందంటూ కేటీఆర్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. గద్దే పార్టీలో చేరితే ఆయన వ్యతిరేక క్యాడర్ పార్టీకి దూరంకావడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. -
సొమ్ముంటేనే... సేవలు
చీపురుపల్లి, న్యూస్లైన్: మెరకముడిదాం మండలం బిల్లల వలస గ్రామానికి చెందిన గర్భిణి వెంకటలక్ష్మికి జనవరి 12వ తేదీని డెలివరీ టైమ్గా వైద్యులు చెప్పారు. అయితే ఆమెను చెకప్ కోసం శుక్రవారం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు తక్షణమే ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలన్నారు. అందుకు ఆమె కుటుంబసభ్యులు సరేనన్నారు. సరే అంటే సరిపోదు. శస్త్రచికిత్స చేయాలంటే రూ.4 వేలు అవుతుందని వైద్యుడు చెప్పాడు. బిడ్డకు ఏమౌతుందోనని కుటుంబ సభ్యులు మళ్లీ సరే అన్నారు. అలాగే చీపురుపల్లి మండలంలోని పర్ల గ్రామానికి చెందిన పొదిలాపు సూరమ్మకు కడుపులో కాయకాసింది. మామూలుగా వైద్యునికి చూపిద్దామని ఆమె భర్త చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకు వచ్చారు. తక్షణమే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. దానికి రూ.4 వేలు అవుతుందన్నారు. పండగ తరువాత చేయించుకుంటామని భర్త చెప్పడంతో ఆ తరువాత అయితే ఏం జరుగుతుందో మాకు తెలియదని వైద్యుడు భయపెట్టడం తో అప్పుచేసి రూ.4 వేలు ఇచ్చి ఆపరేషన్ చేయించుకున్నారు. దానికి తోడు మరో రూ.400 పెట్టి మందులు కొనుక్కున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని బాతువ గ్రామానికి చెందిన గర్భిణి పద్మను కుటుంబసభ్యులు ఆస్పత్రి కి తీసుకొస్తే గర్భసంచి తీసెయ్యాలని డాక్టర్ చెప్పారు. అందుకు రూ.4 వేలు అవుతుందని చెప్పగానే ఇచ్చి ఆపరేషన్ చేయించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అయితే రూ.10 వేలు అవుతుందన్నారు. ఇక్కడైతే రూ.4వేలని చేయించామని రోగి బం ధువులు చెబుతున్నారు. ఇదంతా చీపురుపల్లి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న తీరు.పేరుకే సర్కారు దవాఖానా..కానీ ఇక్కడి తీరు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులను తలపిస్తుంది. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వైద్య సేవలు అందించాల్సిన వైద్యులే డబ్బులు ఖర్చు పెట్టాలని చెబుతుంటే పేద, మధ్యతరగతి రోగులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తమరిష్టం బాబూ..తమరెలా చెప్తే అలాగే..అంటూ చీపురుపల్లి సర్కార్ ఆస్పత్రికి వెళ్లే రోగులు, బంధువులు అక్కడి వైద్యుడు చెప్పిందానికి తలాడిస్తూ అతి కష్టం మీద అప్పులు చేసి డబ్బులు వదిలించుకుంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆస్పత్రులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కానీ చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వారికి తక్షణమే ఆపరేషన్ చేయాలని అందుకు రూ.4 వేలు అవుతుందని, ముందే చెల్లించాలని అక్కడికి నూతనంగా వచ్చిన వైద్యుడు డిమాండ్ చేస్తుండడంతో సర్కారీ దవాఖానా కాస్తా వసూళ్ల కేంద్రంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం, లావేరు తదితర మండలాలకు చెందిన ప్రజలు వైద్య సేవలకు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిపై ఆధారపడతారు. అత్యధికంగా గర్భిణులు ప్రసవం నిమిత్తం ఇక్కడకు వస్తుంటా రు. ఇదే అదునుగా తీసుకున్న వైద్యాధికారి క్యాష్ చేసుకోవాలని భావించారు. ప్రతి శస్త్ర చికిత్సకు ఓ రేటు ఖరారు చేశారు. శస్త్రచికిత్స చేయించాలంటే బయిట నుంచి వైద్యుడిని తీసుకురావాలని, అంతేకాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటే రూ.పది వేలు నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుందని రూ.4 వేలు ఇవ్వలేరా? అంటూ ప్రసవాల నిమిత్తం వస్తున్న గర్భిణుల కుటుంబ సభ్యులను మోటివేట్ చేసి మరీ ఒప్పిస్తున్నారు. స్థానిక ఆస్పత్రిలో నెలకు కనీసం 100 నుంచి 150 ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో చాలా మంది గర్భిణులకు సాధారణ ప్రసవం జరగాల్సి ఉన్నప్పటికీ డబ్బుల కోసం శస్త్రచికిత్స తప్పదని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్ల పర్వం నడుస్తోంది. శస్త్రచికిత్సల దందా ఇలా ఉండగా ఇక్కడ ప్రసవించేందుకు వస్తున్న గర్భిణులకు కనీసం మం దులు కూడా ఇవ్వకపోవడం దారుణం. ప్రసవ సమయంలో మందులు కొనుక్కోమని చెబుతూ, కనీసం బ్లేడు, సబ్బు కూడా ఆస్పత్రి వర్గాలు ఇవ్వడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. అంతేకాకుండా ధనిక వర్గాల కు చెందిన వారు ఎవరైనా తగిలితే అలాంటి వారి నుంచి డబ్బులు తీసుకుని వివిధ రకాల ఆపరేషన్లు స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో నిర్వహించి, మందులు కూడా అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటున్నాం... ఈ విషయమై ప్రభుత్వాస్పత్రి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ సునీల్ ‘న్యూస్లైన్’తో మాట్లాడు తూ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగుల నుంచి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ వైద్యులు లేరని, శస్త్రచికిత్స చేయించాలంటే బయట నుంచి వైద్యుడిని తీసుకురావాలని, ఆయన ఊరకనే రారుకదా అన్నారు. ఇవే శస్త్ర చికిత్సలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందన్నారు. తన సొంత నిధులతో ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ను అభివృద్ధి చేశానని చెప్పారు. పత్రికల్లో రాస్తే ఇక్కడ ఎవ్వరూ పని చేసేందుకు ముందుకు రారని, అయినా వార్త రాసి చెడ్డ చేస్తే ఒక్కరోజు మాత్రమే ఉంటుంద ని, పత్రిక హైలెట్ అవ్వడం తప్ప అంతకన్నా ఉపయోగం ఉండదన్నారు. మందులు కూడా బయట కొనుక్కోమని రోగులకు చెబుతున్నారట అని ప్రశ్నించగా..ఆపరేషన్కు అవసరమ య్యే చాలా మందుల సరఫరా లేదని, అవి వారే కొనుక్కోవాలన్నారు. -
చీపురుపల్లిలో 75 షాపులకు.. కరెంట్ కట్ ?
చీపురుపల్లి,న్యూస్లైన్: చీపురుపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని నిర్మించిన దుకాణాలను హైకోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు తొలగించనున్నారు. ఇంతవరకు రాజకీయ ఒత్తిళ్లే కాకుండా మానవతా దృక్పథంతో చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులు చివరికి వారి ఉద్యోగాలకే ప్రమాదం ముంచుకురానుండడంతో చేసేదేమీ లేక హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసే విధంగా చర్యలు ప్రారంభించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు దుకాణాల తొలగింపునకు విద్యుత్ కనెక్షన్లు అడ్డంగా ఉన్నాయని, అసలు ఆక్రమిత స్థలాల్లో దుకాణాలు నిర్మించిన వారికి విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారంటూ తహశీల్దార్ టి.రామకృష్ణ, చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం(ఆర్ఈసీఎస్) ఎం.డిని లిఖిత పూర్వకంగా కోరారు. దీనికి స్పందించిన ఆర్ఈసీఎస్ అధికారులు తమకెందుకు వచ్చిన బాధ అనుకుంటూ చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని ఇటీవల నిర్మాణం చేపట్టిన 75 దుకాణాలకు విద్యుత్ కనెక్షన్లను కట్ చేశారు. ఇక మిగిలిందల్లా దుకాణాలు తొలగించడమేనంటూ అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని చిరువ్యాపారులు కుమిలిపోతున్నారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణ సముదాయం నిర్మాణాన్ని చేపట్టారంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇజ్జరోతు రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యా(పిల్)న్ని గతంలో వేశారు. దీనికి స్పందించిన హైకోర్టు..రెవెన్యూ అధికారులకు అక్షింతలు వేసి, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిత కట్టడాలను తక్షణమే తొలగించాలంటూ దాదాపు రెండు నెలల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు సమైక్యాంధ్ర ఉద్యమం, అదీ, ఇదీ అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. చివ రకు హైకోర్టు ఉత్తర్వులు అమలు కావడం లేదంటూ ఉల్లంఘన కింద మరోసారి కోర్టుకు ఎవరైనా వెళ్తే కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పేటట్లు లేదు. దీంతో ఏం చేయాలో తెలియని యంత్రాంగం దుకాణాల తొలగింపునకు రంగం సిద్ధం చేసింది. ఆర్ఈసీఎస్ అధికారులు విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం పూర్తయి ఆ నివేదికను రెవెన్యూ అధికారులకు అందజేస్తే, ఆపై దుకాణాల తొలగింపేనంటూ అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇదే విషయమై ఆర్ఈసీఎస్ ఏఈ ఆర్.శ్రీనివాసపట్నాయక్ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దుకాణాలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తున్నామని తెలిపారు. తహశీల్దార్ టి.రామకృష్ణ ఇదే విషయమై మాట్లాడుతూ చట్టపరమైన చర్యలు చేపట్టక తప్పదన్నారు. ప్రభుత్వ స్థలంలో దుకాణాల నిర్మాణం చేపట్టిన వారికి ఏ రకమైన ఆధారాలూ లేవని, హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించామన్నారు. -
బాధిత రైతులను ఆదుకుంటాం
చీపురుపల్లి రూరల్/భోగాపురం, న్యూస్లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర బృందం సభ్యు డు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డెరైక్టర్ పి.గౌరీశంకర్ భరోసా ఇచ్చా రు. గత నెలలో కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు మంగళవారం సాయంత్రం కేంద్ర బృందం చీపురుపల్లి మండలం జి.ములగాం, కరకాం గ్రామాల్లో పర్యటించింది. పాడైన పత్తి, బొప్పారుు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని, 30 ఏళ్లు వ్యవసాయం కూడా చేసినందున రైతు కష్టం తెలుసునని చెప్పారు. రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా పంట నష్టం క్షేత్రస్థాయిలో నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం బృందాన్ని నియమించిందన్నారు. బృందంలో తనతో పాటు సీఈఎస్ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, డ్రింకింగ్ వాటర్ అండ్ క్వాలిటీ కంట్రోలర్ వి.కె.భట్ ఉన్నారని చెప్పారు. అంతకుముందు ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ 50 శాతానికి పైగా నష్టం జరిగితేనే పరిహారం ఇస్తామని పెట్టిన నిబంధన కారణంగా చాలా మంది రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. హెక్టారును ఒక యూనిట్గా చేసి నష్టాన్ని అంచనా వేసేలా నివేదిక అందజేయాలని కోరారు. మండలంలో నాలుగు వందల హెక్టార్లలో బొప్పాయి పంట పాడైనా నేటికీ పరిహారం అందలేదని జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీ బొత్స ఝాన్సీ, జేడీ లీలావతి మాట్లాడుతూ గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 16,936 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. 4124 హక్టార్లలో వరి, 2641హెక్టార్లలో మొక్కజొన్న, 9025 హెక్టార్లలో పత్తి, 79 హెక్టార్లలో చెరుకు, 420 హెక్టార్లలో పెసర, 355 హెక్టార్లలో మినప, 140 హెక్టార్లలో కొర్రా, 51 హెక్టార్లలో చోడి, 233 హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. అనంతరం ములగాంలో వర్ష బీభత్సానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను బృందం పరిశీలించింది. అంతకుముందు కేంద్ర బృందం భోగాపురం మండలం రావాడ గ్రామంలో పర్యటించింది. అక్కడ ఏర్పాటుచేసిన ఫొటో ప్రదర్శనను సభ్యులు పరిశీలించారు. కల్వర్టులు, రోడ్లు కోతకు గురైన విషయూన్ని ఎంపీ ఝాన్సీ కేంద్ర బృందానికి వివరించారు. ఇళ్లను ప్రభుత్వమే నిర్మించాలని ఎస్సీ కాలనీవాసులు ఎంపీ వద్ద మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్దండే, జేసీ పి.శోభ, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్డీఓ వెంకటరావు, రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయ జేడీ లక్ష్మణదాస్, స్టేట్ కన్సల్టెంట్ ఎన్డీఆర్.శర్మ, మండల ప్రత్యేకాధికారి పి.బాంధవరావు, చీపురుపల్లి తహశీల్దార్ టి.రామకృష్ణ, ఎంపీడీఓ కె.రాజ్కుమార్, ఏడీఏ ఆర్.శ్రీనివాసరావు, ఏఓ ఎస్.రవీంద్రనాద్, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, భోగాపురం తహశీల్దార్ రాజకుమారి, ఎంపీడీఓ ఎన్.సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ, సర్పంచ్ నిడిగొట్టు పైడినాయుడు, దంతులూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు మళ్లీ నిరాశే..
విపత్తులతో కుంగిపోయిన రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర బృందం అటువంటి చర్యలు చేపట్టకపోగా కనీసం వారితో మాట్లాడడానికి తీరిక కూడా కల్పించుకోలేదు. సుడిగాలి పర్యటన జరిపి, పంటపొలాలను చూసీచూడకుండా కేవలం గంటా 15 నిమిషాల్లో పర్యటనను ముంగించేసింది. గత నెలలో వారం రోజులకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షాలకు జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకోలేక....నీరింకని కళ్లతో, బరువెక్కిన గుండెతో... ఎలా బతికేది భగవంతుడా అంటూ బెంగపెట్టుకుని సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అన్నదాతలను ఆదుకోవలసిన కేంద్ర బృందం కనీసం వారిని పలకరించలేదు...గుండె బరువు దిగేలా రెండు మాటలు కూడా చెప్పలేదు... ఓదార్చే ప్రయత్నమే చేయలేదు. కేంద్ర బృందం వస్తుంది... తమ బాధలు వింటుంది... కన్నీరు తుడుస్తుంది... కనికరిస్తుంది అని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులకు మాత్రం చాలా సమయాన్ని కేటాయించడం విశేషం. దీంతో ఈ బృందం పరిశీలనకు వచ్చిందా... లేక ఇది అధికార పార్టీ ప్రచారమా అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. చీపురుపల్లి, న్యూస్లైన్: వర్షాలకు జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతినగా, వాటిని అంచనా వేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహించగా, పరిశీలనకు వచ్చిన కేంద్రం బృందం కూడా అన్నదాతకు నిరాశే మిగిల్చింది. మంగళవారం భోగాపురం, చీపురుపల్లి మండలాల్లో నాలుగు గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. తొలుత భోగాపురం మండలంలోని భోగాపురం, రావాడ గ్రామాల్లో పర్యటించిన బృందం ఆ రెండు చోట్లా పంట నష్టపోయిన ఒక్క రైతుతోనూ మాట్లాడలేదు. ఆ రెండు గ్రామాల్లో ఒక్క పంట పొలాన్ని పరిశీలించలేదు. రైతులు తమ బాధలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వలేదు. వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టు పరిశీలించి కేవలం 15 నిమిషాలలో పర్యటన ముగించింది. మధ్యాహ్నం 2.45 గంటలకు వచ్చిన బృందం 3 గంటలకు తిరుగు ప్రయాణమైంది. అక్కడకు చేరుకున్న విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కేంద్రబృందానికి నివేదికలను అందజేశారు. అనంతరం చీపురుపల్లి మండలంలోని గొల్లలములగాం, కరకాం గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. పత్తి, బొప్పాయి పంటలను పరిశీలించిన అనంతరం గొల్లలములగాంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర బృంద సభ్యులు మాట్లాడారు. ఈ గ్రామంలో 4.45 గంటల నుంచి 5.50 గంటల వరకూ ఉన్నారు. తరువాత కరకాం గ్రామంలో పంటపొలాలకు వెళ్లి కేవలం 10 నిమిషాల పాటు పరిశీలించి వెళ్లిపోయారు. అక్కడ కూడా రైతులతో మాట్లాడలేదు. ఒకరిద్దరు రైతులు మాట్లాడేందుకు ప్రయత్నించినా వారికి కూడా అవకాశం కల్పించలేదు. దీంతో రైతులు నిరాశ చెందారు. అధికార పార్టీ నేతలైన ఎంపీ ఝాన్సీలక్ష్మి, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, సర్పంచ్లు, ఇతర నేతలతోనే కేంద్ర బృందం ముచ్చటించింది. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ, జేడీ లీలావతి మాట్లాడుతూ భారీ వర్షాలకు జిల్లాలో 16,936 హెక్టార్లలో పంటలు పాడయ్యాయని బృందం దృష్టికి తీసుకువెళ్లారు. 4,124 ెహ క్టార్లలో వరి, 2,641హెక్టార్లలో మొక్కజొన్న, 9,025 హెక్టార్లలో పత్తి, 79హెక్టార్లలో చెరుకు,420హెక్టార్లలో పెసర,355 హెక్టార్లలో మినప,140 హెక్టార్లలో కొర్రా,51 హెక్టార్లలో చోడి, 233హెక్టార్లలో వేరుశనగ పంటలు పాడయ్యాయని తెలిపారు. తాను కూడా రైతు బిడ్డనే అని చెప్పుకున్న కేంద్ర బృందంలో ఒక సభ్యుడు గోపీకృష్ణకు రైతుల బాధలు వినాలని అనిపించలేదాని పలువురు రైతులు అనుకుంటున్నారు. ఇలా వచ్చారు...అలా వెళ్లారు కరకాం గ్రామంలో పాడైన పంటలను మంగళవారం పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఇలావచ్చి అలా వెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న పంటలను పరిశీలించి వెళ్లిపోయారు. సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం లే కుండా పోయింది. ఎంతో ఆశతో ఎదురుచూశాం కాని కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించలేదు. - మీసాల అప్పలనాయుడు,కరకాం, రైతు రైతులతో మాట్లాడలేదు నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం మాతో ఏమీ మాట్లాడలేదు. నేను ఈ ఏడాది బొప్పాయి పంటను సాగుచేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు బొప్పాయి పంట పూర్తిగా పాడైపోయింది. అధికారులు వస్తే చూపిద్దామనుకున్నాను. కానీ వచ్చిన వెంటనే వెళ్లిపోయారు. దీంతో నా పంటను చూపించలేకపోయాను. - మీసాల సూరినాయుడు, రైతు, కరకాం గ్రామం పొద్దుపోయాక వచ్చారు... పంటలను పరిశీలించ డానికి అధికారులు వచ్చేసరికి పొద్దుపోయింది. అధికారులు ముందే వచ్చి ఉంటే మా పంటలను చూపించి కష్టాలను చెప్పుకోవడానికి వీలయ్యేది. అధికారులు కూడా పంటపొలం వరకు వచ్చి వెళ్లిపోయారే తప్ప గ్రామంలోకి రాలేదు. ఒక పంటపొలంలో మాత్రమే పంటను పరిశీలించారు. మిగిలిన రైతుల పంటలను పరిశీలించలేదు. నష్టపరిహారం వస్తుందో రాదో తెలియదు. - గంగుపల్లి వెంకన్న,రైతు, కరకాం -
చీపురుపల్లిలో కాంగ్రెస్కు షాక్
చీపురుపల్లి, న్యూస్లైన్ : పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బొత్స ప్రధాన అనుచరుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల వరహాలనాయుడు, ఆయన భా ర్య, చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ మీసాల సరోజిని తమ అనుచరులతో కలిసి శుక్రవారం వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారి చేరికతో స్థానికంగా వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం కానుంది. మీసాల తన వర్గీయులతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరడంతో నియోజకవర్గంలో దాదాపుగా కాం గ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్టే. మొదటి నుంచీ మ ంత్రి బొత్సకు ప్రధాన అనుచురుడిగా ఉన్న మీసాల ఒక్కసారిగా ఆ పార్టీని వీడడంతో రాజకీయంగా కలకలం రేగిం ది. బొత్స మరో ప్రధాన అనుచరుడు, జెడ్పీ మాజీ చైర్మ న్ బెల్లాన చంద్రశేఖర్, మీసాల వరహాలనాయుడు మధ్య మూడేళ్లు గా ఆదిపత్య పోరు జరుగుతోంది. ఇటీవల జరిగిన మేజర్ పంచాయతీ ఎన్నికల్లో మీసాల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా,బెల్లాన చంద్రశేఖర్ భార్య శ్రీదేవిపై తన భార్య సరోజినిని ఎన్నికల్లో నిలబెట్టారు. ఈ ఎన్నికలో సుమారు ఐదు వేల ఓట్ల మెజార్టీతో విజ యం సాధించారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయంగా మీసాల పట్టు సాధించారు. కాగా మీసాల బా టలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మరికొంత మంది నాయకులు కూడా వైఎస్సార్ సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా..మీసాల చేరికలో వైఎస్సార్ సీపీ మరింత బలపడనుంది. చీపురుపల్లి, న్యూస్లైన్ : ప్రజా సమస్యలపై నిరంతం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపర్చాలని ఆ పార్టీ నాయకుడు, ఏఎంసీ మాజీ చైర్మ న్ మీసాల వరహాలనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎ స్సార్ సీపీలో చేరిన అనంతరం శనివారం పట్టణానికి వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఆంజనేయపురంలో కొత్త పెట్రోల్ బంకు వద్ద నుంచి పెద్ద ఎత్తున బాణసం చా కాల్చుతూ ఆయన్ను ఊరేగించారు. ఈ సందర్భం గా గాంధీబొమ్మ జంక్షన్ వద్ద ఉన్న దివంగత నేత వై ఎస్ రాజశేఖరరెడ్డి, మహాత్మా గాంధీ విగ్రహాలకు మీ సాల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద జరిగిన సభలో ఆయ న మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని, వారి సం క్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన నాయకు డు మహానేత వైఎస్సార్ అన్నారు. ఆయన ఆశయ సా ధనే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ పాలన మళ్లీ చూడాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయూలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకు లు తుమ్మగంటి సూరినాయుడు, పల్లేడ బంగారరాజు, రొబ్బి రమణ, డబ్బాడ శంకర్, గవిడి సురేష్, ఎల్లంటి శివ, కం చుపల్లి రమేష్, రఘుపాత్రుని చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
అత్తవారింటికెళ్తూ...అనంత లోకాలకు
చీపురుపల్లి రూరల్/తెర్లాం, న్యూస్లైన్: పండగంటిపూట భార్యాబిడ్డలతో అత్తవారింట ఆనందంగా గడుపుదామనుకుని ఎన్నో ఆశలతో బయలు దేరిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహన ప్రమాదంలో అనంత లోకాలకు చేరుకున్నాడు. గురువారం జరిగిన ఈ దుర్ఘటన పలువురిని కలిచివేచింది. తెర్లాం మండల పరిధిలోని డి.గదబవలసకు చెందిన జావాన రమేష్(28) చీపురుపల్లి మండలం పేరిపిలో అత్తవారింటికి తన సమీప బంధువు శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని గెడ్డపువలస గ్రామానికి చెందిన బూరాడ వెంకటరమణతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. వారు ప్రయాణిస్తున్న వాహనం చీపురుపల్లి-సుభద్రాపురం ప్రధాన రహదారిలో యలకలపేట కూడ లి వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో వాహనం వెనుక కూర్చున్న రమేష్ మర్మావయవాలపై బలమైన దెబ్బ తగలడంతో సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. వాహనం నడుపుతున్న వెంకటరమణకు ఎడమకాలు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని 108కు స్థానికులు సమాచారం అందించగా వెంకటరమణను మెరుగైన చికిత్సకోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. రమేష్కు రెండున్నరేళ్ల క్రితం పేరిపికి చెందిన లక్ష్మితో వివాహమైంది. వారికి 6నెలల వయస్సుగల చిన్నారి ఢిల్లీశ్వరి ఉంది. ఇంటర్మీడియెట్ చదువుకున్న రమేష్ ఉపాధి కోసం వైజాగ్లో పనులు చేసుకుంటూ కాలంవెళ్లదీస్తున్నాడు. నాగులచవితి పూజలు నిర్వహించేందుకు బుధవారం రాత్రి గదబవలసకు వచ్చాడు. గురువారం ఉద యం నాగులచవితి పూజలు ముగించుకుని రెండో పూట అత్తవారింటికి బయలు దేరివెళ్లాడు. ఇంతలో ఈ ఘోరం జరిగిందని మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు జావాన రామారావు, అప్పలస్వామిలు తెలిపారు. చేతికందికొచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతని భార్య, బిడ్డతోపాటు తమను ఆదుకునే నాథుడు లేడని రమేష్ తల్లిదండ్రులు సూర్యనారాయణ, అప్పలనర్సమ్మలు రోదిస్తున్నారు. నలుగురితో కలివిడిగా ఉంటూ ఇలా వాహన ప్రమాదంలో మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆదుకున్న మానవత్వం : చిన్నారి చార్మిళకు శస్త్రచికిత్స
చీపురుపల్లి, న్యూస్లైన్ : అభం శుభం తెలియని ఆ చిన్నారికి గుండెలో చిల్లులు పడ్డాయి. దగ్గర ఉండి చూసుకోవాల్సిన తండ్రి.. తనతోపాటు తల్లినీ విడిచిపెట్టాడు. ఓ వైపు మూడేళ్ల బిడ్డకు అనారోగ్యం, మరోవైపు భర్త ఎడబాటును ఆ ఇల్లాలు తట్టుకోలేక... తన కష్టాన్ని చెప్పుకునేందుకు స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లింది. ఇక్కడి ఎస్సై ఆమెను దేవుడిలా ఆదుకున్నాడు. చిన్నారి ఎదుర్కొంటున్న కష్టాన్ని తెలుసుకుని పదిమంది దాతల నుంచి విరాళాలు సేకరించి.. శస్త్రచికిత్స చేయించారు. ప్రస్తుతం చిన్నారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదమూ లేకపోవడంతో ఆ కుటుంబం పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన లావేటి లక్ష్మికి నాలుగేళ్ల క్రితం రణస్థలానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి చార్మిళ అనే కుమార్తె ఉంది. ఇటీవల లక్ష్మిని భర్త వదిలిపెట్టాడు. దీంతో ఆమె పుట్టినిల్లు అయిన పట్టణంలోని రిక్షాకాలనీకి వచ్చేసింది. భర్త పెడుతున్న కష్టాలను పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్సై షేక్ అబ్దుల్మరూఫ్ వద్ద వివరించింది. దీంతోపాటు తన కూతురికి గుండెలో చిల్లులు పడ్డాయని, వైద్యులు శస్త్రచికిత్స చేయించాలని చెప్పారని తెలిపింది. కనీసం తమకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేకపోవడంతో శస్త్రచికిత్స చేయించుకోలేకపోతున్నామని, మందులకు కూడా డబ్బులు లేవని చెప్పింది. తక్షణమే స్పందించిన ఎస్సై మరూఫ్... చిన్నారి మందుల కోసం అక్కడికక్కడే వెయ్యి రూపాయలు ఇచ్చారు. దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో దాదాపు రూ.50 వేల వరకూ సమకూరాయి. స్థానిక తహశీల్దార్తో మాట్లాడి వీరికి ధ్రువపత్రం మంజూరు చేయించారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స జరిగేలా చర్యలు చేపట్టారు. దీంతో ఇటీవల విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చిన్నారి చార్మిళకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం పాప ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. -
నిమజ్జనోత్సవంలో వివాదం
రణస్థలం, న్యూస్లైన్: వినాయక ఉత్సవాల్లో భాగంగా విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళుతున్న లారీని పోలీస్ అధికారి సీజ్ చేయడం వివాదానికి దారి తీసింది. హిందువుల మనోభావాలు దెబ్బతిసే విధంగా పోలీసుల ప్రవర్తిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం శంబాం గ్రామంలో వినాయక ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. బుధవారం రణస్థలం మండలం సమీపంలో గల సముద్రంలో నిమజ్జనం చేసేందుకు వినాయక విగ్రహాన్ని లారీలో గ్రామస్తులు తీసుకువస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళుతున్న శ్రీకాకుళం ఏఎస్పీ సెంథిల్ కుమార్ లారీని ఆపి పర్మిషన్ ఉందా అని డ్రైవర్ను అడిగితే లేదని చెప్పాడు. వెంటనే లారీని సీజ్ చేసి లారీ రికార్డులను స్థానిక జేఆర్పురం పోలీసులకు అప్పగించారు. రికార్డులు ఉంచుకుని లారీని వదిలితే వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసి వచ్చి లారీ అప్పగిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రాథేయపడినా ఏఎస్పీ వినిపించుకోలేదు. ఏఎస్పీ వైఖరిని నిరసిస్తూ జేఆర్పురం పాత పోలీస్ స్టేషన్ వద్ద లారీని ఆపి అందులో ఉన్న శంబాం గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న స్థానికులు కూడా వారికి మద్దతుగా ఆందోళనలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ రాజకీయ నాయకుల సభలకు, సమావేశాలకు పర్మిషన్ లేకుండా వివిధ వాహనాల్లో ప్రజలను తరలించడం పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా హైదరాబాద్ వంటి పట్టణాల్లో పోలీసులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తుంటే శ్రీకాకుళం ఏఎస్పీ ప్రవర్తించిన తీరు సరిగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినాయక విగ్రహ నిమజ్జనానికి వెళుతున్న లారీని సీజ్ చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిం చారు. ఈ ఘటన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులు, స్థానికుల ఆందోళనతో జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. అధికారులు స్పందించకపోవడంతో వినాయక విగ్రహాన్ని రోడ్డుపై పెట్టి ఆందోళన మరింత ఉద్ధృతం చేసేందుకు భక్తులు సిద్ధమయ్యారు. సుమారు ఒంటిగంట సమయంలో వేరే కార్యక్రమంలో పాల్గొని రణస్థలం వచ్చిన స్థానిక ఎస్సై లెంక సన్యాసినాయుడు విషయం తెలుసుకుని లారీ రికార్డులు డ్రైవర్కు ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది. -
79 వేల మందికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు
చీపురుపల్లి,న్యూస్లైన్: జిల్లాలో గల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా(పీఏసీఎస్)ల పరిధిలో ఉన్న 79 వేల మంది రైతులకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు తెరిచే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ వంగపండు శివశంకరప్రసాద్ చెప్పారు. శుక్రవారం ఆయన చీపురుపల్లిలోని బ్రాంచ్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నాబార్డ్ సూచనల మేరకు తమ పీఏసీఎస్లలో రుణాలు పొంది ఉన్న ప్రతి రైతుకు జీరో బ్యాలెన్స్ అకౌం ట్లు తెరిచే విధంగా తమ సిబ్బందికి సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ అకౌంట్లు తెరిచే ప్రక్రియను సెప్టెంబరు నెలాఖరులోగా పూర్తిచేయాలని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు. అయితే రైతులందరికీ ఏటీఎం కార్డు ల మాదిరిగా ఉండే కార్డులను నాబార్డ్ మంజూరు చేయనుందన్నారు. దీంతోబాటు పీఏసీఎస్లలో మినీ ఏటీఎంలు కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఇకపై రైతులు తమ లావాదేవీలన్నీ మినీ ఏటీఎంల ద్వారా చేసుకోవచ్చునని చెప్పారు. రుణా లు, రాయితీలు, ఇన్పుట్ సబ్సిడీలు వంటి పథకాలు రైతులు నేరుగా పొందేందుకు, పారదర్శకంగా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతుందని చెప్పారు. అదే విధంగా ఈ ఏడాది ఖరీఫ్ కాలానికి రూ.144 కోట్లు రుణలక్ష్యం కాగా ఇప్పటికే రూ.97 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పా రు. అలాగే దీర్ఘకాలిక రుణాలు రూ.4.50 కోట్లు లక్ష్యం కాగా, రూ.3కోట్లు ఇప్పటికే అందించడం జరిగిందన్నారు. డిపాజిట్లు రూ.50 కోట్లు లక్ష్యం గా పెట్టుకోగా, ఇప్పటికే రూ.40 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించినట్లు తెలిపారు. సమావేశంలో ఆయన వెంట బ్రాంచ్ మేనేజర్ పి.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.