Cleaning
-
టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!
ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడం అనేది మనం చిన్నప్పటినుంచీ నేర్చుకుంటున్న ప్రాథమిక పాఠం. దంతాల ఆరోగ్యాన్ని(Oral health)కాపాడుకోవాలన్నా, లేదా నోరు పరిశుభ్రంగా ఉండాలన్నా క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవడం అవసరం. లేదంటే నోరు దుర్వాసన రావడం మాత్రమే కాదు. అనేక రోగాలకు దారి చూపించిన వారమవుతాం. పళ్లు తోముకునేందుకు సాధారణంటా అందరూ టూత్ బ్రష్ (tooth brush)నే వాడతాం. వేప పుల్లలతో పళ్లు తోముకునే వారు కూడా ఉన్నప్పటికీ టూత్ బ్రష్ వాడే వారే ఎక్కువ. అయితే ఈ బ్రష్ ఎన్నిరోజులకు ఒకసారి మార్చాలి. ఏళ్ల తరబడి ఒకే టూత్ బ్రష్ను వాడవచ్చా? ఇలా వాడితే ఎలాంటి సమస్యలొస్తాయి? వీటి గురించి ఆలోచించారా ఎపుడైనా?ఎపుడు మార్చాలి?దంత సంరక్షణ విషయంలో రోజూ బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో, సమయానికి బ్రష్ మార్చడమూ అంతే ముఖ్యం. టూత్ బ్రష్ ను ఎన్ని రోజులు ఉపయోగించాలి అనే విషయంలో దంత వైద్యులు కచ్చితమమైన సిఫార్సులున్నాయి. ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు మార్చమని సిఫార్సు చేస్తారు. అరిగిపోయిన టూత్ బ్రష్ వాడుతూనే ఉంటానని చెబితే దంతక్షయం, చిగుళ్ల వ్యాధి వంటి అనేక సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలను నిర్లక్ష్యం చేసినా, అవగాహనా లేమితో ప్రయత్నించినా నష్టం తప్పదు అరిగిపోయిన లేదా, విరిగిపోయిన లేదా పాడైపోయిన బ్రష్ లను అస్సలు వాడకూడదు. అటువంటి అరిగిపోయిన టూత్ బ్రష్ను ఉపయోగించడం వల్ల దంతాల నుండి బ్యాక్టీరియా పోదు సరికదా మరికొన్ని వ్యాధులకుమూలవుతుంది. శానిటైజ్బ్రష్లను తరచుగా మార్చడంతో పాటు ఉపయోగించిన తర్వాత టూత్ బ్రష్ను నీటితో బాగా కడగాలి. కనీసం వారానికి ఒకసారి శానిటైజ్ చేయాలి. వీటికి ప్రత్యేకమైన శానిటైజర్ల పరికరాలున్నాయి. లేని పక్షంలో వేడి నీళ్లలో నానబెట్టి, బాగా కడగాలి. యాంటీమైక్రోబయల్ మౌత్వాష్లో లేదా నీరు, వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమంలో 30 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి.అలాగే బ్రష్ హోల్డర్లను బాత్రూంలలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా బ్రష్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ముంది.టూత్ బ్రష్లను ఎవరితోనూ పంచుకోవద్దు. ప్రతి ఒక్కరికి వేర్వేరు నోటి బ్యాక్టీరియా ఉంటుంది .సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మాన్యువల్ టూత్ బ్రష్ను మార్చాలి. ముఖ్యంగా నోటి శస్త్రచికిత్స, రూట్ కెనాల్ థెరపీ, చిగుళ్ల వ్యాధికి చికిత్స వంటి పంటి చికిత్సల తర్వాత.. బ్రష్ కచ్చితంగా మార్చాలని నిపుణులు అంటున్నారు. వైద్యం చేసిన ప్రాంతంలో బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ముప్పు తగ్గించడానికి.. కొత్త బ్రష్ వాడటం మంచిది. చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంఅనారోగ్యం తరువాతజలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత, టూత్ బ్రష్ను కచ్చితంగా మార్చాలి. బాక్టీరియా, వైరస్లు మీ టూత్ బ్లష్ పళ్లపై ఉంటాయి. ఇది మళ్లి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.క్ష్మక్రిములు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నివారించాలంటే ఏదైనా అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పాత బ్రష్ను వదిలేసి, కొత్త బ్రష్ను ఎంచుకోవాలి. అలాగే పాతబ్రష్ను బ్రష్నుంచి కూడా తొలగించడం కూడా చాలా ఉత్తమం. ఈ విషయంలో పిల్లల బ్రష్ విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడుతున్నా కూడా చాలా త్వరగా బ్రష్ను మార్చాల్సి ఉంటుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి దాని తలను(Head) మార్చుకోవాలి. ఎందుకంటే సాధారణ బ్రష్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లు ఇంకా వేగంగా అరిగిపోతాయి. -
ముంచుకొస్తున్న హెచ్ఎంపీవీ..నఖ శిఖం పరిశుభ్రంగా ఉందామిలా..!
చాలామంది రోజూ ఉదయం బ్రష్ చేసుకోవడం తర్వాత స్నానం మొదలు దేహ పరిశుభ్రతను చకచకా చేస్తుంటారు. ఈ క్రమంలో దేహమంతా శుభ్రమవుతుందో లేదో చూడరు.ఉదాహరణకు స్నానం సమయంలో చెవుల వెనక భాగంలో... చెవి వెనక భాగం తలతో కనెక్ట్ అయ్యే ప్రాంతంలో, మెడ వెనక, చెవుల ముడతల్లో ఇలాంటి చోట్ల శుభ్రమవుతోందా, కావడం లేదా అన్నది చూడరు. రోజువారీ హైజీన్ పాటించకపోతే అది మరికొన్ని ఆరోగ్య సమస్యలకూ, దేహ / చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అందులోనూ మరో మహమ్మారి హెచ్ఎంపీవీ(HMPV) వైరస్ చైనా(China)లో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ వైరస్ కేసులు మనదేశంలో కూడా నమోదవ్వుతున్నాయి. ఈ తరుణంలో చక్కటి జాగ్రత్తలతో మన శరీర పరిశుభ్రత పాటించడం ఎలాగో తెలుసుకోవడం కోసమే ఈ కథనం.దేహ పరిశుభ్రత కోసం పళ్లు తోముకోవడం మొదలుకొని, కాళ్లూ, పాదాల శుభ్రత వరకు ఎలాంటి హైజీన్ పాటించాలో చూద్దాం. పైగా ఇప్పుడు కొత్త కొత్త వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయన్న పుకార్లు వ్యాపిస్తున్న తరుణంలో ఆపాదమస్తకం శుభ్రత పాటించడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత జాగ్రత్తలతో మరింత మెరుగైన ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా, మరెన్నో వ్యాధులను నివారించుకోవచ్చు కూడా.ప్రతిరోజూ మనందరమూ పొద్దున్నే పళ్లను బ్రష్ చేసుకుంటాం. ఇలా బ్రష్ చేసుకునే టైమ్లో ముందువైపునకే ప్రాధాన్యమిస్తాం. కానీ పలువరసలో అన్నివైపులా శుభ్రమయ్యేలా బ్రష్ ఉపయోగించాలి. అలాగే ఆహారం తీసుకున్న ప్రతిసారీ పళ్లను కొద్దిగా నీళ్లతో నోరు పుక్కిలించాలి. నోరు అనేక సూక్ష్మజీవులకు నిలయం. ఆహారం తీసుకున్న ప్రతిసారీ బ్రషింగ్ చేసుకోవడం కుదరదు కాబట్టి... కొద్దిగా నీటిని నోట్లోకి తీసుకుని పుక్కిలిస్తూ నోరంతా శుభ్రం చేసుకోవడం అవసరం. ఆహారం తీసుకున్న తర్వాత నోట్లో బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఈ పుక్కిలింతల వల్ల అది నోరు శుభ్రమవుతుంది. ఇక ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రపోబోయే ముందు బ్రషింగ్ చేసుకోవడం అవసరమన్నది మనందరికీ తెలిసినప్పటికీ చాలా మంది ఈ నియమం పాటించరన్నది తెలిసిందే. బ్రషింగ్ తర్వాత పళ్లపైనా, చిగుర్లపైనా వేలి చివరలతో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకుంటున్నట్లుగా రాయాలి. దీనివల్ల చిగుర్లకు రక్తప్రసరణ పెరిగి చిగుర్ల వ్యాధులు నివారితమవుతాయి. పొగాకు వంటివి నమలడం, జర్దాపాన్ వంటివి తినడం, ఖైనీ, గుట్కా, పాన్మసాలాల వంటి దురలవాట్లు నోటి దుర్వాసనతో పాటు శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నోటి క్యాన్సర్లు మొదలుకొని ఇతరత్రా అనేక ఆరోగ్య సమస్యలకు తావిస్తాయి. అంతేకాదు... నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉండే వాతావరణాన్ని కలిగిస్తాయి. అలాంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి. మార్కెట్లో దొరికే మౌత్వాష్లతో తరచూ నోరు కడుక్కుంటూ ఉండటం కూడా మంచిదే. ముఖ్యంగా నోటి దుర్వాసనతో బాధపడేవారు తరచూ మౌత్వాష్తో శుభ్రం చేసుకోవడం ఇంకా మంచిది.స్నానం..ప్రతి రోజూ ప్రతివారూ స్నానం చేస్తారు. అయితే చాలామంది దేహం శుభ్రమవుతోందా లేదా అన్నది చూసుకోకుండా యాంత్రికంగా ఈ పని చేస్తుంటారు. ముఖ్యంగా చిన్నారుల్లో (కొందరు పెద్దవాళ్లలనూ) ఈ ధోరణి కనిపిస్తుంది. చాలామంది తమ చెవుల వెనక భాగాలనూ, శరీరంలో మడతపడే చోట్లను శుభ్రం చేసుకునే విషయాన్ని అంతగా పట్టించుకోరు. వాస్తవానికి చర్మం ముడతలు పడే ప్రాంతాలైన కీళ్లు, బాహుమూలాలు, మోకాలి వెనక భాగాలతో పాటు ప్రైవేట్ పార్ట్స్పై కొద్దిగా ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరముంటుంది. తలస్నానం ఎలాగంటే...: తలస్నానం వారంలో రెండుసార్లు చేయడం మంచిది. తలలో చుండ్రు వంటి సమస్యలు ఉన్నవారు రోజు విడిచి రోజు తలస్నానం చేయడమూ మంచిదే. తలస్నానం చేసే ముందర కొందరు తలకు నూనె రాస్తారు. అందరూ తలకు నూనె రాయాల్సిన అవసరం లేదు. కేవలం పొడిబారినట్లు ఉండే చర్మమూ, వెంట్రుకలు ఉన్నవారు మాత్రమే తలస్నానానికి ముందర నూనెతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి. జిడ్డుచర్మం ఉండేవారు తలకు నూనె రాయక΄ోయినా పర్వాలేదు. ఆ తర్వాత అదంతా శుభ్రమయ్యేలా మంచి షాంపూతో స్నానం చేయాలి. మైల్డ్ షాంపూ వాడటమే మేలు. కొందరు మెడికేటెడ్ షాంపూలు వాడతారు. అలాంటివి కేవలం డాక్టర్ సలహా మీద మాత్రమే వాడాలి. మరికొన్ని జాగ్రత్తలు... ఆహ్లాదం కలిగించి అనేక ఆరోగ్య సమస్యలను దూరంపెట్టే స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివి... స్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా లేదా మరీ బాగా వేడిగా ఉండకూడదు. చన్నీటి స్నానం మంచిదనేది కేవలం అపోహ. చల్లటి స్నానం వల్ల సైనస్, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి చల్లటినీళ్ల స్నానం దాన్ని ట్రిగర్ చేసే అవకాశాలెక్కువ. ఇక మరీ బలహీనంగా ఉన్నవాళ్లుగానీ లేదా వృద్ధులుగానీ మరీ ఎక్కువగా చల్లగా ఉండే నీళ్లతో స్నానం కాని, మరీ ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో స్నానం గానీ చేయడం సరికాదు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి వస్తే... ఆ స్నానం వ్యవధిని వీలైనంతగా తగ్గించడం మంచిది ఒకవేళ చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి వస్తే... దానికి ముందర వార్మప్గా కాస్తంత వ్యాయామం మంచిది కడుపు నిండా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. భోజనం తర్వాత రెండు మూడు గంట తర్వాతే స్నానం చేయడం మంచిది. చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లతో గానీ స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకుని, ఇలాంటివాళ్లు కేవలం గోరువెచ్చటి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి. చెవులసంరక్షణచెవులను చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. చాలామంది చెవుల వెనక భాగాన్ని శుభ్రం చేసుకోవడం మరచిపోతుంటారు. కానీ స్నానం సమయంలో చెవుల వెనకభాగంతో పాటు... బయటి చెవి (ఎక్స్టర్నల్ ఇయర్ పిన్నా)ను చెవిలోపలివరకూ శుభ్రం చేసుకోవాలి. మన చెవుల్లో వచ్చే గులివి / గుమిలి చెవికి రక్షణ కల్పించడం కోసమే పుడుతుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోడానికి పిన్నీసులు, ఇయర్బడ్స్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. చెవి లోపల గువిలి మరీ ఎక్కువగా ఉంటే ‘డీ–వ్యాక్స్’ అనే చుక్కల మందును వేసుకోవాలి. మరీ చెవులు మూసుకుపోయినంతగా గువిలి ఉత్పన్నమవుతుంటే ఈఎన్టీ డాక్టర్(ENT Doctor)ను సంప్రదిస్తే వారే సురక్షితమైన రీతిలో చెవులను శుభ్రం చేస్తారు.ఇయర్బడ్స్ వద్దు : కొందరు ఇయర్ బడ్స్తో తమ చెవులను తరచూ శుభ్రపరుస్తుంటారు. ఏమీ తోచనప్పుడు, ఏ పనీ లేనప్పుడు కూడా చెవుల్లో ఇయర్బడ్ పెట్టుకుని తిప్పేస్తుంటారు. నిజానికి చెవులు తమంతట తామే శుభ్రపరచుకుంటాయి. ప్రకృతి వాటినలా డిజైన్ చేసింది. వాస్తవానికి ఇయర్బడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు గువిలి చెవి లోపలికి ఇంకా లోతుగా వెళ్తుంది. చెవిలోకి ఏదైనా బయటి వస్తువు / పురుగు ప్రవేశించినప్పుడు అడ్డుకుని, చెవిని రక్షించడం కోసమే ఈ గువిలి స్రవిస్తుంటుంది.ఇయర్బడ్స్తో లేదా అగ్గిపుల్లలతో శుభ్రం చేయడం మొదలుపెట్టగానే చెవిలోని గ్రంథులు మరింత ఎక్కువగా గువిలిని స్రవిస్తాయి. దాంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే చెవులను తరచూ శుభ్రపరచుకునే వారిలోనే గువిలి లేదా వ్యాక్స్ ఎక్కువగా స్రవిస్తుంది. కాబట్టి ఇయర్బడ్స్, అగ్గిపుల్లలు, పుల్లలు, పెన్నులు, పిన్నీసులు వంటి వాటితో చెవులను శుభ్రం చేసుకోకూడదు. పిల్లలూ... పదునైన వస్తువులు : కొంతమంది పిల్లలు తమ తెలిసీ తెలియనిదనంతో గుచ్చుకు΄ోయేలా ఉండే వాడిౖయెన / పదునునైన వస్తువులు చెవుల్లో పెట్టుకుంటారు. ఉదాహరణకు పెన్సిళ్లు, పుల్లలు, పెన్నులు, పిన్నులు వంటివి. వాటితో కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. దాంతో భవిష్యత్తులో వినికిడి సమస్యలు రావచ్చు. అందుకే అలాంటి వస్తువుల నుంచి చిన్నారులను దూరగా ఉంచాలి. నూనె పోయకూడదు : చెవులను శుభ్రం చేయడానికి కొందరు కొబ్బరి నూనె, ఆముదం లాంటివి చెవుల్లో పోస్తుంటారు. అలా ఎంతమాత్రమూ చేయకూడదు. అలా చేయడం వల్ల చెవి ఇన్ఫెక్షన్తో పాటు మరెన్నో సమస్యలు రావచ్చు. ఏవైనా సమస్యలుంటే ఈఎన్టీ వైద్యులతో సరైన చికిత్స తీసుకోవాలి.చర్మ సంరక్షణకోసం... కొంతమందిలో చర్మం పొడిబారడం ఓ సమస్యగా మారుతుంది. ఇలాంటివారు తరచూ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోవాలి. వేసవికాలంలో ఈ సమస్య పెద్దగా లేక΄ోయినా చలికాలంలో వారిని మరింతగా బాధపెడుతుంటుంది. అందుకే ఆ సీజన్లో తప్పనిసరిగా రాసుకోవాలి. లేకపోతే చర్మం మీద మంట, దురద వస్తాయి. పొడిచర్మం ఉన్నవారి పైచర్మం దోక్కుపోయినప్పుడు... కిందిచర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్(Infection)కు దారితీయవచ్చు. ఎండలోకి వెళ్లేటప్పుడు అది సీజన్ అయినా సరైన ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాసుకోవాలి. దీన్ని ప్రతి మూడు గంటలకోమారు రాసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు శరీరమంతా కప్పేలా ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం మంచిది. ముఖం మీది చర్మం కూడా కవర్ అయ్యేలా స్కార్ఫ్ ధరించడం మేలు ఇక శరీరంప్లై చర్మం ముడుతలు పడి ఉండే మెడ, భుజాలు, బాహుమూలాల వద్ద, తొడలు, గజ్జల వంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడుతలు ఉన్నచోట్ల ప్రత్యేకంగా పూర్తిగా పొడిగా అయ్యేలా టవల్తో తుడుచుకోవాలి.డయాబెటిస్ ఉన్నవారి పాదసంరక్షణకు...ఇవి డయాబెటిస్ ఉన్నవారికే కాకుండా, ఆరోగ్యవంతులు కూడా పాటించడానికి అనువైన నియమాలని గుర్తుంచుకోండి. కాకపోతే డయాబెటిస్ ఉన్నవారికి మరింత మేలు చేస్తాయి. తరచూ తామే స్వయంగా కాలిని పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలా చేసే సమయంలో కాలి పైభాగాన్నీ నిశితంగా పరీక్షించుకోవడం వీలవుతుంది. కానీ కిందనుండే పాదం భాగం కనిపించదు కాబట్టి దాన్ని పరిశీలించడానికి పాదాల కింద అద్దం పెట్టి చూసుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ అంతే నిశితంగా పరీక్షించుకుంటూ ఉండాలి. మొత్తం కాలిభాగంలో ఏ చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారిలో పుండ్లు పడటం వల్ల గ్యాంగ్రీన్ ఏర్పడితే ఒక్కోసారి పూర్తి పాదాన్ని, కాలిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాదాలను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. రోజూ కాళ్లు కడుక్కున్న తర్వాత వెంటనే పూర్తిగా పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పొడిబారడం కోసం కాలివేళ్ల మధ్య పౌడర్ రాసుకోవడం మంచిది. మరీ వేడి వస్తువులూ, పదార్థాల నుంచి కాళ్లను దూరంగా ఉంచుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్తో కాళ్లకు కాపడం పెట్టుకోక΄ోవడమే మంచిది. పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్ను కాలికీ, వేళ్లకూ మధ్య రుద్దుతూ, ఆ వాజిలైన్ తడిదనం, జిడ్డుదనం పోయేలా పూర్తిగా పొడిబారేంతవరకు మృదువుగా రుద్దాలి. అలా ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. కాళ్ల మీద పులిపిరి కాయలూ, కాలి కింద ఆనెకాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే వెంటనే డాక్టర్కు చూపించుకోవాలి. కాలిగోళ్లను క్రమం తప్పకుండా తొలగించుకోవాలి. ఇలా చేసేటప్పుడు గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. అలా జరిగిన కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో చాలా ప్రమాదం. కాలికి చెప్పులు, బూట్లు వంటి పాదరక్షలు లేకుండా నడవకూడదు. ఇవి కూడా కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకూడదు. ఎందుకంటే మన సొంత పాదరక్షల వల్ల ఏదైనా చిన్నపాటి గాయం అయినా మళ్లీ అదే గాయం రేగి ఎప్పటికీ మానక΄ోతే అది గ్యాంగ్రీన్గా మారే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ బాధితుల్లో దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు (ఆమాటకొస్తే పురుషులు కూడా) స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే తమ రోజువారీ ఇంటి పనులు చేసుకోవడం మంచిది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులైతే కనీసం ఏడాదికోసారి ఆర్థోపెడిక్ లేదా మెడికల్ స్పెషలిస్ట్ వంటి కాలి వైద్య నిపుణులకు చూపించుకుంటూ ఉండాలి.చేతుల పరిరక్షణఆహారం తీసుకునే ముందర చేతుల్ని తప్పనిసరిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మూత్ర, మల విసర్జన తర్వాత (అంటే వాష్రూమ్కు వెళ్లి వచ్చాక) రెండు చేతులనూ తప్పనిసరిగా శుభ్రంగా కడుక్కోవాలి. దీనికో కారణముంది. వాష్రూమ్ తలుపు తెరిచే సమయంలో ‘నాబ్’ను చాలామంది ముట్టుకుంటారు. వాళ్ల చేతుల్లో ఏవైనా బ్యాక్టీరియల్, వైరల్, ఏకకణజీవుల వంటి పరాన్నజీవులు ఉంటే... వారు ముట్టుకున్న చోటిని మళ్లీ మనం ముట్టుకోవడం వల్ల మనకూ ఆ వైరస్, బ్యాక్టీరియా, ఏకకణజీవులు సంక్రమించవచ్చు. ఇలా జబ్బు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడాన్ని ‘ఫోమైట్ ట్రాన్స్మిషన్’గా చెబుతారు. ఇలా ఈ మార్గంలో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వాష్రూమ్కు వెళ్లివచ్చాక తప్పక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాళ్లు / పాదాల శుభ్రత...కాళ్లు లేదా పాదాలకు సమస్య వచ్చినప్పుడు తప్ప వాటి ఉనికినే మనమెవరమూ గుర్తించం. ప్రతిరోజూ పాదాలను పరీక్షించుకుంటూ ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారైతే... రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాదాలు, మడమలు శుభ్రంగా ఉన్నాయా లేక ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్నది పరీక్షించుకోవాలి. పాదాలపై పుండ్లుగానీ, ఇన్ఫెక్షన్లుగానీ, పగుళ్లుగానీ ఏర్పడకుండా సంరక్షింకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా ΄÷డిగా మారేలా తుడుచుకోవాలి. కాలివేళ్ల గోళ్లు తీసుకుంటూ ఉండాలి.గోళ్లను..గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్ చేసుకోవాలి. అంటే గోరు చివరకంటా కత్తిరించకుండా, కొద్దిపాటి గోరంచు ఉండేలా ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గోళ్లలో మట్టి చేరదు. ఇలా మట్టిచేరకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భోజనం చేసే సమయంలో గోళ్ల ద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. (చదవండి: నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!) -
బయటపడిన మృత్యుబావి, మరో మందిరం
సంభాల్: ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో జరుగుతున్న తవ్వకాల్లో ఈరోజు(గురువారం) మరో అద్భుతం బయటపడింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలో ఒక బావి కనిపించింది. ఈ బావి హిందువులు అధికంగా ఉంటున్న ప్రాంతంలో ఉంది. దీనిని మృత్యుబావిగా చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోనే ఒక ఆలయం ఉందని, అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయం అని స్థానికులు అంటున్నారు. ఈ ఆలయం ప్రస్తుతం మట్టిలో కూరుకుపోయింది. ఇక్కడ తవ్వకాలు జరిపితే ఇక్కడ ఆలయం తప్పకుండా కనిపిస్తుందని అంటున్నారు.సంభాల్ ఒకప్పుడు పుణ్యక్షేత్రంగా ఉండేది. పురాణాల ప్రకారం సంభాల్లో 84 ప్రదక్షిణల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో 68 పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెబుతారు. అలాగే 19 బావులు ఉన్నాయని, వాటిలో ప్రతిదానికీ ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అంటారు. ఇప్పుడు స్థానికులు ఈ తవ్వకాల పనుల్లో పాల్గొంటూ విలువైన ఆధారాలు సేకరిస్తున్నారు. సంభాల్ను మతపరమైన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది.ఇటీవల సంభాల్లో చోటుచేసుకున్న హింసాయుత ఘటనల కారణంగానే ఈ ప్రాంతం వార్తల్లో నిలిచింది. ఈ నేపధ్యంలోనే స్థానిక పరిపాలనాధికారులు ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. అదిమొదలు ఇక్కడ పలు చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద బయటపడుతోంది. ప్రస్తుతం ఇక్కడి చందౌసిలో కనిపించిన పురాతన మెట్ల బావిని శుభ్రం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మృత్యు బావి బయటపడింది. దీనిలో అందులో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని స్థానికులు చెబుతారు. ఇక్కడికి కొద్ది దూరంలో యమదగ్ని కుండ్ కూడా ఉందని అంటున్నారు. దీని కోసం పరిశోధనలు ప్రారంభమయ్యాయి.ఇక్కడ మృత్యుంజయ దేవాలయం కూడా ఉండేదని, తమ ముందు తరాలవారు తమకు ఈ విషయం చెప్పారని, పరిశోధిస్తే అది కూడా బయటపడుతుందని స్థానికులు అంటున్నారు. దాని గోడలు కూడా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం మట్టిలో కూరుకుపోయిన కట్టడాలను పరిశోధించేదిశగా ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం మృత్యుబావిని కనుగొనేందుకు తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చందౌసిలో పలు పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: 20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి.. -
పుట్టిన రోజే.. ఆఖరి రోజు.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
వాషింగ్టన్ డీసీ : పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఓ సరదా అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటనలో విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముందే స్నేహితుడు ప్రాణ కోల్పోవడంతో పక్కనే ఉన్న స్నేహితులు ఏమీ చేయలేని స్థితిలో గుండెలవిసేలా రోదించారు. దీంతో ఉప్పల్ కళ్యాణ్ పురిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమెరికా పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.ఉప్పల్ కళ్యాణ్ పురికి చెందిన ఆర్యన్ రెడ్డి(23) అమెరికాలోని జోర్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలో ఎమ్మెస్ చదువుతున్నాడు. అయితే ఈ క్రమంలో నవంబర్ 13న అతని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే అదే రోజు తన వద్ద ఉన్న తుపాకీని క్లీన్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తుపాకీ మిస్ఫైర్ అయి ఆర్యన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. ఇవాళ రాత్రి ఆర్యన్ రెడ్డి మృతదేహాన్ని తరలించనున్నారు. -
కాల‘నీళ్లు’!
సాయం చేసే దిక్కు లేదు..నా జీవనోపాధి పోయింది. స్కూల్ దగ్గర ట్రామ్పోలిన్ జంపింగ్ ద్వారా రోజంతా కష్టపడితే రూ.300 వస్తాయి. వాటితోనే నేను, నా భర్త పొట్ట పోసుకుంటున్నాం. ఇప్పుడు వరదలో ట్రామ్పోలిన్ కొట్టుకుపోయింది. పది రోజుల నుంచి తినడానికి తిండి లేదు. సాయం చేసే దిక్కులేదు. – కళావతి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీప్రాంతం: వైఎస్సార్ జక్కంపూడి కాలనీ అపార్ట్మెంట్ బ్లాకులు: 250కిపైగా (ఒక్కో బ్లాక్లో 32 ప్లాట్లు) జనాభా: సుమారు 50 వేలు వరద పరిస్థితి: బురద నీళ్లు, చెత్త ఇళ్ల పరిస్థితి: డ్రైనేజీ నీళ్లతోనే ఇంటిలోని బురదను శుభ్రం చేసుకుంటున్న బాధితులు డ్రోన్లతో ఆహారం: ఒక్క డ్రోన్తో కూడా ఆహారం అందించిన దాఖలా లేదు హెలికాఫ్టర్లతో ఆహారం: బాధితులు చేరుకోలేని ప్రదేశాలు, వాటర్ ట్యాంకులపైనే అరకొరగా ఆహార పొట్లాలు పడేశారు. ఫైరింజన్లతో ఇళ్లు శుభ్రం: కాలనీలో ఫైరింజన్ గంట సౌండ్ కూడా వినిపించట్లేదు. పారిశుధ్యం: రోడ్లపై వరదలో కొట్టుకొచి్చన చెత్త మేటలు వేసింది. ఒక్కరైనా పారిశుధ్య సిబ్బంది కనిపించలేదు. తాగునీరు: ప్రతి ఇంటిలోనూ తాగునీటికి కటకటేవరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధివిజయవాడలోని వరద ప్రభావిత కాలనీల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు సరఫరా చేశామని, ఫైరింజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేసేశామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పది రోజుల తర్వాత కూడా బాధితులు ఆకలి, దప్పికలు తీర్చుకోవడానికి రోడ్లపైకి సంచులతో పరుగులు తీస్తున్నారు. ఇళ్లలో చేరిన బురద, చెత్తను శుభ్రం చేసుకోవడానికి బకెట్టు నీళ్లు దొరక్క.. రోడ్డుపై డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటినే వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కారి్మకులను రప్పించి రోడ్లను అద్దాల్లా తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా కాలనీల్లో చెత్త మేటలు పేరుకుపోయాయి. డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటితో దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. విజయవాడ శివారులోని వైఎస్సార్ జక్కంపూడి కాలనీ దుస్థితి ప్రజలు పడుతున్న అవస్థలకు అద్దం పడుతోంది. సోమవారం ‘సాక్షి’ బృందం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పర్యటించినప్పుడు కాలనీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో సుమారు 250కిపైగా బ్లాకుల్లో దాదాపు 50 వేల మంది జీవిస్తున్నారు. రోజూ కూలికి పోతే కానీ ఐదు వేళ్లు నోటికి పోని పరిస్థితుల్లో ఉన్నవారిని బుడమేరు వరద మరింత దుర్భర స్థితిలోకి నెట్టేసింది. ప్రభుత్వం ముందస్తు వరద హెచ్చరికలు చేసినా తమదారి తాము చూసుకునే వాళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు దాటాక వరద తగ్గిందని తెలుసుకున్నాకే సీఎం చంద్రబాబు ఆదివారం ఈ ప్రాంతంలో చుట్టపుచూపుగా వచి్చపోయారని బాధితులు మండిపడ్డారు. సీఎం వచ్చి వెళ్లాక కూడా ఇక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పరిస్థితి మాత్రమే కాదు.. కండ్రిక, పాయకాపురం, ఉడా కాలనీ, వాంబే కాలనీ, కొత్త, పాత ఆర్ఆర్పేట, పైపుల రోడ్డుతో సహా ముంపు ప్రాంతాలన్నింటిలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ప్రచార కండూతి తప్ప ఫైరింజన్లు ఎక్కడ? ఓవైపు ముంపునకు గురైన ఇళ్లను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉండే కొన్ని ఇళ్లకు మాత్రమే ఫైర్ ఇంజన్ల ద్వారా నీళ్లు కొట్టి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయించుకుంటున్నారు. చంద్రబాబుది కేవలం ప్రచార కండూతి.. చేసే చేతల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని జక్కంపూడి కాలనీలోని పరిస్థితులు అద్దం పట్టాయి. గత పది రోజులుగా వరద నీరు, బురద, చెత్తాచెదారం చేరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో కాలనీలో రోడ్లపై ఉన్న మురుగు నీటిని బకెట్లలోకి తోడుకుని మహిళలు ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. అదేంటి మురికి నీళ్లతోనే ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు? ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని చెబుతోందిగా అని స్థానికులను ప్రశి్నంచగా.. ‘ఇంట్లో వారం నుంచి వాడుకోవడానికి చుక్క నీళ్లు లేవు. ఫైర్ ఇంజన్లు వచ్చి ఇళ్లు కడగటం ఒక్కటే తక్కువైంది మా బతుకులకు’ అని ప్రభుత్వంపై బాధితులు మండిపడ్డారు. డ్రోన్ ఎగిరిందీ లేదు.. ఆహారం అందిందీ లేదు.. ముంపు ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగు నీరు సరఫరా చేసేశాం.. అందరి ఆకలి తీర్చేశామని రోజు మీడియా సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే సుమారు 50 వేల మంది నివాసం ఉంటున్న వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో ఒక్క డ్రోన్ ద్వారా.. ఒక్క ఇంటికి కూడా ఆహారం పంపిణీ చేయలేదని స్థానికులు అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. హెలికాప్టర్లలో వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలు తెచ్చి కాలనీకి దూరంగా ఉండే వాటర్ ట్యాంక్పై విసిరి వెళ్లారని, పీకల్లోతు నీటిలో వెళ్లి వాటర్ ట్యాంక్లు ఎక్కి ఆహారం, నీళ్లు ఎలా తెచ్చుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వ పెద్దలకు లేదా? అని నిలదీశారు. జలయుద్ధాలు తప్పడం లేదు.. పది రోజులుగా ముంపులో చిక్కుకుపోయిన వారికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవు. స్నానాలు చేసి రోజులు గడుస్తుండటంతో చర్మ వ్యాధులు, దద్దుర్లతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీళ్ల ట్యాంకర్ కాలనీలోకి రాకముందే దాని వెంట పరుగులు తీస్తూ జలయుద్ధాలు చేస్తున్నారు.కూడబెట్టుకున్నదంతా పోయింది.. కూలినాలి చేసుకుని సంపాదించుకున్నదంతా వరదలో కొట్టుకుపోయింది. ఎలా ఉన్నారని పలకరించిన నాథుడు లేడు. పది రోజులుగా నరకయాతన పడ్డాం. వయసుకు వచి్చన ఆడ బిడ్డలతో ఎక్కడికి వెళ్లి ఉంటాం? ఇంటిలో ఏ వస్తువూ మిగల్లేదు. పునరావాస కేంద్రానికి తరలిస్తామని ఒక్కరూ చెప్పలేదు. ఉచిత బియ్యం ఇస్తామనీ ఇవ్వలేదు. కరెంట్ లేదు. వేసుకోవడానికి సరైన బట్టలు లేవు. పనుల్లేక చేతిలో డబ్బులు లేవు. ఎలా బతికేది? జీవితం రోడ్డున పడింది. – భార్గవి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఒక్క వస్తువు కూడా మిగల్లేదు.. మా తమ్ముడి ఇంటిలో ఫంక్షన్కని ఆగస్టు 25న కాకినాడ నుంచి వచ్చాను. ఆదివారం ఒక్కసారిగా వరద నీరు ఇంటిలోకి రావడవంతో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. ఇద్దరు ఆడ పిల్లలతో మా తమ్ముడు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి వండుకోవడానికి పప్పులు, ఉప్పులు ఇస్తే కానీ గడవని దుస్థితి ఉంది. – నాగమణి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఈ చిత్రంలోని మహిళ.. సయ్యద్ సమీరా. ఆమె ఇంటి ముందు మురుగు నీరు తటాకాన్ని తలపిస్తోంది. దీంతో విధిలేక తన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఆ మురుగు నీటినే తీసుకెళుతోంది. ఇదేంటమ్మా.. ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో ఇళ్లు శుభ్రం చేయిస్తామని చెబుతుంది కదా అని ప్రశి్నస్తే.. ‘మా బతుకులకు అదొకటే తక్కువైంది. పది రోజుల నుంచి మురుగు నీటిలోనే పడి ఉన్నాం. ఎవరూ పలకరించిన పాపానపోలేదు. వరద పోయి బురద మిగిలితే.. దాన్ని కడుక్కోవడానికి చెంబు నీళ్లు కూడా ఇవ్వట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరద వస్తుందని ఎవరూ చెప్పలేదు.. అర్ధరాత్రి ఇంటిలోకి నీళ్లు చేరితే.. కట్టుబట్టలతో పై అంతస్తులోకి పరుగులు పెట్టాం.ఇద్దరు చిన్న పిల్లలను పక్కింటిలో ఉంచి మేము నీళ్ల మధ్యే దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు కాలం వెళ్లదీశాం. ఇప్పుడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేని దుస్థితిలో ఉన్నాం. ఫ్రిజ్ నీటిలో తేలుతూ రోడ్డుపైకి కొట్టుకొచి్చంది. నా భర్త సయ్యద్ ఖాజా పైపుల రోడ్డులో నిర్వహించే వెల్డింగ్ షాపు కూడా నీటమునిగింది. మొత్తం మెషినరీ కూడా తడిచిపోయింది. ఇళ్లు, షాపు కోల్పోయి రోడ్డుపై పడ్డాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా సమీరా ఒక్కరే కాదు.. వేలాది మంది సోమవారం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో వరద బాధితులుగా.. కట్టుబట్టలతో రోడ్లపై కష్టాలను అనుభవిస్తూ కనిపించారు.నిత్యావసరాలు కరవై.. 50వేల మంది ఉండే జక్కంపూడి కాలనీని ప్రభుత్వం గాలికొదిలేసింది. అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లు నీటమునిగాయి. కాలు బయటకు అడుగు పెట్టలేని దుస్థితిలో పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత నిత్యావసరాలు కూడా ఇక్కడికి చేరలేదు. ఇంటిలో బియ్యం తడిచిపోయి, వంట వస్తువులు నీటిలో మునిగిపోయాయి. దీంతో దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు తీసుకుని రోడ్లపై పిల్లజల్లాలతో పడిగాపులు కాస్తున్నారు.జీవనాధారం కకావికలంబుడమేరు వరదతో జక్కంపూడి కాలనీకి చెందిన బార్బర్ రాంబాబుకు తీవ్ర నష్టం వారం రోజులు నీటిలోనే బార్బర్ షాపు, ఇల్లుపూర్తిగా పాడైపోయిన షాపులోని కుర్చీలు, వస్తువులు షాపు పునరుద్ధరణకు రూ.లక్ష వరకూ అవసరం కన్నీరుమున్నీరవుతున్న రాంబాబు కుటుంబం వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి బుడమేరు వరద ధాటికి బడుగుల జీవితాలు కకావికలమయ్యాయి. తాము నివాసం ఉంటున్న వీధిలో, కాలనీలోనే చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు పెట్టుకుని చిరువ్యాపారాలు చేసుకుంటున్నవారు, చేతి వృత్తులను నమ్ముకున్నవారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. జక్కంపూడి కాలనీకి చెందిన ఇక్కుర్తి రాంబాబుది కూడా అలాంటి కన్నీటి గాథే. జక్కంపూడి కాలనీలోని డ్రెయిన్ పక్కనే చిన్న బార్బర్ షాప్ నడుపుకుంటూ రాంబాబు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతని భార్య ఉమామహేశ్వరి ఇళ్లలో పనులకు వెళ్తారు. ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు నగరంలోని ఓ సెలూన్ షాపులో రోజువారీ కూలీకి వెళుతుంటాడు. డిగ్రీ చదువుతున్న రెండో కుమారుడు మణికంఠ కాలేజీ నుంచి వచ్చాక తండ్రికి షాపులో సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీ అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా బుడమేరు వరద ప్రారంభమైంది. తెల్లవారేసరికే జక్కంపూడి కాలనీని ముంచేసింది. రాంబాబు బార్బర్ షాపు కూడా వరద నీటిలో మునిగిపోయింది. వారం రోజులకు పైగానే షాపు నీటిలో ఉంది. షాపు లోపల ఉన్న రెండు కుర్చీలు, సెలూన్ సామాగ్రి అంతా నానిపోయి పనికిరాకుండా మారాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే రాంబాబు ఇంట్లోకి కూడా వరద చేరడంతో సరుకులు, టీవీ, మంచం... ఇలా ఏ ఒక్కటి మిగలకుండా అన్నీ పాడైపోయాయి. వారం రోజులపాటు ఇంటి పై ఫ్లోర్లోని బాల్కనీలో అతని కుటుంబం తలదాచుకుంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం షాప్లోని తడిచిపోయిన వస్తువులన్నింటినీ రాంబాబు, అతని కుమారుడు మణికంఠ బయటపెట్టి బురదను శుభ్రం చేసుకున్నారు. వారి వేదనను గుర్తించిన ‘సాక్షి’ ప్రతినిధి... ‘మళ్లీ ఆ వస్తువులు పనిచేస్తాయా...’ అని అడగ్గా... ఒక్క వస్తువు కూడా పనిచేయదని రాంబాబు బదులిచ్చాడు. ‘రెండు చైర్లు పూర్తిగా పనికి రాకుండాపోయాయి. కొత్తగా కొనుగోలు చేయాలంటే ఒక్కోటి రూ.15 వేలుపైనే చేస్తాయి. అద్దాలు కొత్తగా కొనాలి. వారం పాటు ముంపులోనే ఉండిపోవడంతో షాప్ కూడా దెబ్బతింది. రిపేర్ చేయించాలి. ట్రిమ్మర్లు, కత్తెరలు, దువ్వెనలు, టవల్స్.. ఇలా ప్రతి ఒక్కటి కొత్తగా కొనాలి. కనీసం రూ.లక్ష ఖర్చు అవుతుంది. మరోవైపు చిన్నబ్బాయి కాలేజీ ఫీజులు చెల్లించాలి. ఇంట్లోని వస్తువులు కూడా పాడైపోయాయి. పది రోజుల నుంచి పని లేక ఇళ్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం నిత్యావసరాలు కూడా పంపిణీ చేయలేదు.’ అని రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు. -
ఇది ఫేస్ డీప్ క్లీనింగ్ డివైస్..! ప్రయాణాల్లో..
స్కిన్ కేర్లో డీప్ క్లీనింగ్ అనేది బెస్ట్ ప్రాసెస్ అంటారు నిపుణులు. వేసుకున్న మేకప్ పూర్తిగా చర్మాన్ని వదలకపోయినా, ప్రయాణాల్లో దుమ్మూధూళి నుంచి ముఖాన్ని సంరక్షించుకోవాలన్నా డీప్ క్లీనింగ్ అవసరం. అందుకు ఈ ఫేషియల్ స్టీమర్ సహకరిస్తుంది. 360 డిగ్రీలలో తిరిగే రొటేటబుల్ స్ప్రేయర్ నాజిల్తో కూడిన వార్మ్ మిస్ట్ ఫేస్ స్టీమర్ ముఖానికి పట్టిన మురికిని, జిడ్డును ఇట్టే పోగొడుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ స్టీమర్ నుంచి విడుదలయ్యే ఆవిరి చర్మపు లోలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి, క్లీన్ చేస్తుంది.ముందుగా ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగి, మెత్తటి క్లాత్తో తుడిచి, ఆపైన అరోమాథెరపీ కాటన్ ప్యాడ్పైన ఆయిల్ చుక్కలు వేసుకుని, ముఖానికి అప్లై చేసుకోవాలి. అనంతరం ఈ స్టీమర్తో ఆవిరి పట్టుకుంటే, ఇంట్లోనే స్పా చేయించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఈ స్టీమర్ని క్రమం తప్పకుండా వినియోగిస్తే, యవ్వనకాంతితో కళకళలాడవచ్చు. వారానికి 2–3 సార్లు, ఒక సెషన్కు 10 నిమిషాల చొప్పున ఫేషియల్ స్టీమర్ని ఉపయోగించడం మంచిది. కాలిన గాయాలను నివారించడానికి కూడా ఫేస్ స్టీమర్ని వాడుకోవచ్చు.ఇందులో నీళ్లు నింపుకుని, బటన్ ఆన్ చేసుకుని ఆవిరి విడుదల అయ్యే రాడ్ని మనకు అనుకూలంగా అమర్చుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి దాని పొడవు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అనువైన విధంగా సెట్ చేసుకోవచ్చు. దాంతో ఆవిరి పట్టుకునేటప్పుడు, మన వీలుని బట్టి కూర్చుని లేదా పడుకుని కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర 27 డాలర్లు. అంటే 2,266 రూపాయలు. ఈ స్టీమర్స్ చాలా కలర్స్లో అందుబాటులో ఉన్నాయి. -
ఈ కిచెన్వేర్స్ని నిమ్మకాయతో అస్సలు క్లీన్ చేయకూడదు !
వంటగదిలో క్లీన్ చేయడానికి లేదా శుభ్రంగా ఉంచడానికి మొట్టమొదటగా ఉపయోగించేది నిమ్మకాయలనే. దీనిలోని ఆమ్లత్వం, తాజా సువాసన కారణంగా వీటిని మిరాకిల్ క్లీనర్గా పిలుస్తుంటారు. చెప్పాలంటే ఏదైనా చెడు వాసన పోగొట్టేందుకు, క్రిమిసంహారక క్లీనర్గానూ నిమ్మకాయాలు బెస్ట్. ఈ నిమ్మకాయలు క్లీనింగ్కి, సువాసన కోసం ఉపయోగించినప్పటికీ కిచెన్లోని ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయలతో క్లీన్ చేయకూడదు. నిమ్మకాయలకు దూరంగా ఉంచాల్సిన వంటగది వస్తువులు ఏవంటే..మార్బుల్, గ్రానైట్ కౌంటర్టాప్లు: ఇళ్లలోని ఫ్లోర్ ఎక్కువగా మార్బుల్ లేదా గ్రానైట్ రాయిని వినియోగిస్తున్నారు. వీటిని క్లీన్ చేసేందుకు నిమ్మకాయలను ఉపయోగించకూడదు. దీనిలోని అధిక ఆమ్లత్వం కారణంగా నష్టం వాటిల్లుతుందే తప్ప అవి క్లీన్ అవ్వవు. పైగా వాటికి ఉండే సహజ మెరిసే గుణం పోతుంది. వీటిని క్లీన్ చేసేందుకు పీహెచ్ తటస్థ క్లీనర్లను ఎంపిక చేసుకుంటే అవి మెరుస్తుంటాయి. కాస్ట్ ఐరన్ పాన్లు: తొందరగా వేడేక్కే బెస్ట్ పాన్లు. వీటిని కూడా నిమ్మకాయలతో క్లీన్ చేయకూడదు. ఎందుకంటే దీనిలోని ఆమ్లత్వం తుప్పు పట్టేలా చేస్తుంది. పైగా పాన్లపై నూనెకు సంబంధించిన జిగటను నిరోధించే రక్షిత పొరకు నష్టం వాటిల్లేలా చేస్తుంది. వీటిని శుభ్రం చేసేందుకు బ్రష్, వేడి నీటిని ఉపయోగించండి. కత్తులు వంటి వాటికి..కత్తులు వంటి పదునైన వస్తువులను క్లీన్ చేసేందుకు నిమ్మకాయను అస్సలు వాడకూడదు. ఇది రియాక్షన్ చెంది ఆక్సీకరణం చేయడంతో కత్తులు తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇది క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వీటిని శుభ్రపరిచేందుకు ఉపయోగించకపోవడమే మంచిది. ఇలాంటి పదునైన వస్తువులను క్లీన్ చేసేందుకు డిష్ సబ్బును ఉపయోగించండి, క్లీన్ చేసిన వెంటనే తడి లేకుండా ఆరనివ్వాలి. ఇలా చేస్తే వాటి పదును పోదు, ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. చెక్క పాత్రలు, చెక్క కట్టింగ్ బోర్డులు..చెక్ పాత్రలు, చెక్ కట్టింగ్ బోర్డులు నిమ్మకాయతో క్లీన్ చేస్తే గనుక..దీనిలోని ఆమ్లత్వం పొడిగా అయిపోయి పగళ్లు తెప్పిస్తుంది. పైగా బ్యాక్టీరియాను ఆశ్రయించేలా చేస్తుంది. వీటిని క్లీన్ చేసేందుకు తేలికపాటి సబ్బును ఉపయోగించండి. మంచిగా ఉండేందుకు నూనె అప్లై చేయండి.అల్యూమినియం పాత్రలు..అల్యూమినియం పాత్రలను నిమ్మకాయలతో శుభం చేయడం హానికరం. ఎసిడిటీ వల్ల రంగు మారడం, మెరుపు కోల్పోవడం జరుగుతుంది. అంతేగాదు ఆ పాత్ర ఉపరితలంపై చిన్న రంధ్రాలను కూడా ఏర్పరుస్తుంది. వీటిని క్లీన్ చేసేందుకు డిస్ సోప్ వినియోగించండి. కొత్తగా కనిపించేలా చేసేందుకు స్పాంజ్తో క్లీన్ చేయండి. (చదవండి: ఎర్ర బచ్చలికూరతో అధిక బరువుకి చెక్!) -
ఫ్రిజ్ వాసన రాకుండా, కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా చేయండి!
రిఫ్రిజరేటర్ లేదా ఫ్రిజ్ ఇపుడు అందరి ఇళ్లల్లోనూ ఒక అవసరంగా మారిపోయింది. పాలు, పెరుగు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్లతోపాటు వండిన పదార్థాలను పాడుకాకుండా, తాజాగా ఉంచేందుకు ఫ్రిజ్ను వాడతాం. మరి ఫ్రిజ్ శుభ్రత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఫ్రిజ్లో బాక్టీరియా పేరుకుపోకుండా, మన ఆహారం శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తెలుసుకుందాం.వారాలు, నెలల తరబడి ఫ్రిజ్ను శుభ్రం చేయకపోతే దుర్వాసన వస్తుంది. ఆహారం త్వరగా పాడవుతుంది. అలాగే రిఫ్రిజిరేటర్ బయటినుంచి కూడా క్లీన్గా కనిపించేలా జాగ్రత్తపడాలి.రిఫ్రిజిరేటర్ను ఎలా శుభ్రం చేయాలి?ముందు రిఫ్రిజిరేటర్ను ఆఫ్ చేసి, ప్లగ్ తీసి పక్కన బెట్టాలి. ఇలా చేయడం వల్ల షాక్ కొట్టకుండా ఉంటుంది.కఠినమైన రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, డిష్ సోప్తో శుభ్రం చేసుకోవచ్చు.ఫ్రిజ్ షెల్ఫ్లు, ఇతర డిటాచ్బుల్ డ్రాయర్లను, గ్లాసు ట్రే, ఎగ్ ట్రేలను తొలగించి బయట శుభ్రం చేసుకొని పొడి గుట్టతో తుడిచేయాలి. ఫ్రిజ్లో అమర్చేముందు వీటిపై ఆల్కహాల్ రుద్దితే కనిపించని బ్యాక్టీరియా కూడా పూర్తిగా పోతుంది.అవసరమైతేనే డీప్ ఫ్రిజ్ను డి-ఫ్రాస్ట్ చేయాలి. లేదంటే ఆ ఏరియా వరకు క్లీన్ చేసుకోవచ్చు. పాడైపోయిన, డేట్ ముగిసిన పదార్థాలను పారేయ్యాలి. ఫ్రిజ్ డోర్కి ఉండే గాస్కెట్ సందుల్లో మురికి పేరుకుపోతుంది. దీన్ని కూడా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. బయట కూడా డిష్ వాష్ లిక్విడ్లో ముంచిన స్పాంజి సాయంతో మురికి, మరకలు పోయేలా శుభ్రం చేసి, ఆ తరువాత మెత్తని పొడిగుట్టతోతుడిస్తే తళ తళ కొత్తదానిలా మెరుస్తుంది. ఫ్రిజ్లోని వస్తువులు ముట్టుకుంటే పడిపోయేలాగా కాకుండా, చిన్న చిన్న కంటైనర్లలో పళ్లు, కూరలు, తదితరాలను పొందికగా అమర్చుకోవాలి. -
పండగొస్తోంది...మిక్సర్ గ్రైండర్ క్లీనింగ్ టిప్స్ : కొత్తగా మెరుస్తుంది
పూర్వకాలంలాగా రోళ్లు, కలం, తిరగళ్లు ఇపుడు పెద్దగా వాడటం లేదు. అవి ఎలా ఉంటాయో, ఎలా పనిచేస్తాయో కూడా ఈ తరం చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇపుడంతా మిక్సీలు, గ్రైండర్లు మయమే. అటు ఉగాది పండుగ సమీపిస్తోంది. ఉగాది నుంచి వరుసగా పండుగలు షురూ అవుతాయి. చుట్టాలు, పక్కాలు.. కొత్త అల్లుళ్లు.. హితులు..స్నేహితులు ..ఈ సందడి మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో మన వంట ఇంటిలో అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మిక్సీ గ్రైండర్. మిక్సర్ గ్రైండర్ లేకుండా వంటను ఊహించుకోవాలంటేనే కష్టం. ఒక్కోసారి జార్స్ సరిగ్గా పనిచేయక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరిగ్గా పని ఉన్నపుడో, చుట్టాలొచ్చినపుడో పని చేయనని మొరాయిస్తుంటాయి. అయితే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సాధారణంగా పచ్చళ్లు, రకరకాల పొడులు, పొడులు, అల్లం వెల్లుల్లి, ఇతర పేస్ట్లు చేసేందుకు మిక్సీ గ్రైండర్ వాడతాం. వాడిన తరువాత ఎప్పటికపుడు చక్కగా క్లీన్ చేసుకోవాలి. గాస్కట్ (జార్ మూత చుట్టూ ఉండే రబ్బరు) బ్లేడ్లు కూడా తీసి శుభ్రం చేసుకోవాలి. లేదంటే మిక్సీజార్తో పని ఎంత సులువో, అది మొరాయిస్తే అంత కష్టం. ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా ఉంచుకుంటేనే, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా ఎక్కువరోజులు మన్నుతాయి. మిక్సీని, జార్స్ని ఎలా క్లీన్ చేయాలి? వంటసోడా: మురికి పట్టి, మొరాయించిన మిక్సీ జార్ సరిగ్గా పనిచేయాలంటే.. బేకింగ్ సోడా కూడా హెల్ప్ చేస్తుంది. బేకింగ్ పౌడర్లో కొద్దిగా వేడి నీరు పోసి పేస్టులా చేయండి. దీంతో జార్స్ని అప్లై చేసి, కొద్దిగా జార్లో వేసిన రెండు సార్లు తిప్పాలి. ఈ తర్వాత శుభ్రమైన నీటితో క్లీన్ చేయండి. వెనిగర్: వెనిగర్, నీళ్లు కలిపి జార్స్లో వేసి కాసేపు అలానే ఉండనివ్వండి. ఒక్కసారి మిక్సీ వేయండి. తరువాత నీటితో క్లీన్ చేస్తే బ్లేడ్లు, జార్ మొత్తం శుభ్రంగా తయారవుతుంది. పిండి , జార్లో పేరుకుపోయిన వ్యర్థాలను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. నిమ్మ తొక్కలు: నిమ్మ తొక్కలతో కూడా జార్స్ని చక్కగా క్లీన్ చేయొచ్చు. నిమ్మతొక్కలు, కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ కొద్దిగా నీరు వేసి మిక్సీని ఆన్ చేయండి. ఒకటి రెండు నిమిషాలు తిప్పండి. అలాగే మిక్సీని మొత్తాన్నికూడా జాగ్రత్తగా మెత్తని క్లాత్తోగానీ, స్పాంజితో గానీ క్లీన్ చేసుకుంటే.. చక్కగా కొత్తదానిలా మెరిపోతుంది. నోట్ : మిక్సీని క్లీన్ చేసేటపుడు బ్లేడుల కారణంగా మన చేతి వేళ్లు తెగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మిక్సీ మోటర్లోకి అస్సలు వాటర్ పోకూడదు. ఒక్క చుక్క నీరు పోయినా మోటర్ పాడయ్యే అవకాశం ఉంది. -
Summer: సీలింగ్ ఫ్యాన్.. క్లీనింగ్ ఇలా...!
సాధారణంగా సీలింగ్ ఫ్యాన్లను ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల వాటిని తరచు శుభ్రం చేయడం చాలా కష్టం. అలాగని నెలల తరబడి అలాగే ఉంచేస్తే మురికి పేరుకుని పోయి అసహ్యంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పాత పిల్లో కవర్ తీసుకుని టేబుల్ మీద ఎక్కి సీలింగ్ ఫ్యాన్ రెక్కలను కవర్ చేయాలి. కవర్ పైభాగం నుంచి మీ చేతులతో రుద్దాలి. అదేవిధంగా, మూడు రెక్కలను శుభ్రం చేయాలి. మట్టి కూడా కవర్లో పడిపోతుంది. ఇది మీ ఇంటిని కూడా మురికిగా చేయదు. మరో పద్ధతి... పాత షర్ట్, టీషర్ట్ లేదా ఏదైనా కాటన్ వస్త్రం సహాయంతో ఫ్యాన్ను శుభ్రం చేయవచ్చు. ఫ్యాన్ మీద ΄÷డి దుమ్ము ఉంటే.. అది సులభంగా ఒక వస్త్రంతో శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ వంటగదిలో ఉండే ఫ్యాన్ను క్లీన్ చేస్తున్నట్లయితే.. దానిపై నూనె, ధూళి పేరుకుపోయి ఉంటుంది. అటువంటి వాటిని సబ్బుతో కడగడం మంచిది. కాసేపు రెక్కలను స్క్రబ్ చేయాలి. గుర్తుంచుకోవాల్సింది.. ఫ్యాన్ను క్లీన్ చేసినప్పుడల్లా కింద ఒక షీట్ లేదా వస్త్రాన్ని పరచాలి. దీంతో ఫ్యాన్ క్లీన్ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు గ్లాసెస్ లేదా సన్గ్లాసెస్ ధరించండి. ఇది చెత్తను కంట్లో పడకుండా చేస్తుంది. దీంతో అలర్జీ కూడా రాదు. సీలింగ్ ఫ్యాన్ శభ్రం చేసేటపుడు ముక్కుకు మాస్క్ లేదా రుమాలు కట్టుకోవాలి. ఇవి చదవండి: ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..! -
ఇయర్ వాక్స్.. లాభమా? నష్టమా?
'కొంతమందిని చూస్తే ఎప్పుడూ ఏ తాళం చెవో, పెన్ను రీఫిలో, పొడవుగా చుట్టిన కాగితాన్నో, ఏవీ దొరక్కపోతే చేతివేళ్లతోనో చెవిలో సంగీతం పాడిస్తుంటారు. ఈ చికాకంతా ఎందుకని చాలామంది స్నానం చేయగానే వీలైనంత లోతుగా చెవిని శుభ్రం చేస్తుంటారు. కానీ బయటికి కనిపించే చెవి కాకుండా లోపలి వైపు శుభ్రం చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.' ఇంతకీ చెవి ఎలా శుభ్రం చేయాలో చూద్దాం... కాటన్ బడ్ పెట్టడం వల్ల అది ఇయర్ వాక్స్ని చెవి లోపలికి మరింతగా నెట్టివేస్తుంది. అంతేకాదు, చెవిలో పెట్టిన బడ్ కర్ణభేరికి తగలవచ్చు. ఇది మరింత ప్రమాదకారి. దీనివల్ల వినికిడి శక్తి దెబ్బతింటుంది. నిజానికి ఇయర్ వాక్స్ వల్ల చెవులకు లాభమేగానీ నష్టం లేదు. బయటినుంచి వేరే పదార్థాలు, క్రిముల వంటివి చెవి లోపలికి వెళ్లకుండా ఇది రక్షిస్తుంది. శిలీంధ్రాలు లేదా ఫంగస్ ఏర్పడకుండా నివారిస్తుంది. చెవిలోని నాళం పొడిబారకుండా ఉండేందుకు దోహదపడుతుంది. మరి ఇయర్ వాక్స్ని ఏం చేయాలి? దాని జోలికి వెళ్లకుండా ఉండడమే సరి. వాక్స్ తీయడం కోసం చెవి లోపల ఇయర్ బడ్ మాత్రమే కాదు. ఇంకేమీ పెట్టక్కరలేదు. ఎందుకంటే, చెవి తనను తానే శుభ్రం చేసుకోగలుగుతుంది. ఒకవేళ చెవిలో శబ్దాలు రావడం, నొప్పి లాంటి సమస్యలు కనిపించినా, వినికిడిలో తేడా అనిపించినా వెంటనే ఈఎన్టీ నిపుణుని కలవండి. ఇవి చదవండి: 'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా? -
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట: ఆలయాలు శుభ్రం చేస్తున్న ప్రముఖులు (ఫొటోలు)
-
రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటుడు
అయోధ్యలో ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటులు హాజరుకానున్నారు. ఇంతలో ఒక నటునికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్.. రామాలయ ప్రాంగణాన్ని, మెట్లను శుభ్రం చేస్తూ ఒక వీడియోలో కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు జాకీష్రాఫ్ను మెచ్చుకుంటున్నారు. 66 ఏళ్ల జాకీ ష్రాఫ్ ముంబైలో జరిగిన పురాతన రామాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. రామునిపై ఆ నటునికి ఉన్న భక్తిని, అతని సింప్లిసిటీని అభిమానులు కొనియాడుతున్నారు. ‘ఎక్స్’లో షేర్ చేసిన ఈ వీడియోను యూజర్స్ అమితంగా ఇష్టపడుతున్నారు. పలువురు అభిమానులు రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక యూజర్ జాకీని ఉద్దేశించి ‘జీరో నుంచి హీరోగా మారిన వ్యక్తి’ అని కామెంట్ చేయగా, మరొకరు, 'కెమెరా ముందు.. కెమెరా వెనుక అత్యంత వినయుడు' అని రాశారు. జాకీ ష్రాఫ్ అప్పుడప్పుడు పలు సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. నిరుపేద చిన్నారులకు వైద్య చికిత్స చేయించేందుకు, అలాంటి వారికి విద్య అందించేందుకు జాకీష్రాఫ్ విరాళాలు అందిస్తుంటారు. ఆయన సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. #WATCH | Maharashtra: Amruta Fadnavis wife of Maharashtra Deputy CM Devendra Fadnavis & Bollywood actor Jackie Shroff took part in the cleanliness drive of the oldest Ram temple in Mumbai. (14.01) pic.twitter.com/mhdkzcNB5x — ANI (@ANI) January 14, 2024 -
Change Is Us: ఒడ్డును.. ఒడ్డున పడేస్తారు
పర్యావరణ పరిరక్షణ బాధ్యత మొన్న జనవరి 1 వేడుకలు. లక్షలాది మంది ముంబై బీచుల్లో చేరి ఎంజాయ్ చేశారు. మంచిదే. లెక్కలేనంత చెత్త పారబోశారు. అందమైన సాగర తీరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృహ మనకు ఎప్పుడూ లేదు. అందుకే ముంబైలోని ‘చేంజ్ ఈజ్ అజ్’ సంస్థలోని టీనేజ్ పిల్లలే ఈ క్లీనింగ్కి పూనుకున్నారు. బుద్ధులు వినాల్సిన పిల్లలే పెద్దలకు బుద్ధులు చెబుతున్నారు. విందామా వారి మాట? మనిషి బావిని, చెరువును తవ్వించగలడు. సముద్రాన్ని కాదు. ఒక ప్రాంతంలో సముద్రం ఉందంటే అది ప్రకృతి ఆ ప్రాంతానికి ఇచ్చిన వరం. ఎన్ని చికాకులున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంతో సంతోషంగా అనిపించినా అలా బీచ్కు వెళితే, సముద్రం ఒడ్డున కూచుంటే, అలల ఘోషను వింటూ, ఆ సమతల అగాధపు గాంభీర్యాన్ని కంటూ, ఎగిరే పక్షుల వల్ల, తిరిగే పడవల వల్ల, వీచే గాలుల వల్ల ఓదార్పు పొందడం ఎంత బాగుంటుంది! కాని ఆ భావాలన్నీ పేరుకున్న చెత్త వల్ల నాశనమైతే? మన దేశంలో పేద, మధ్యతరగతి వారికి ఖర్చులేని కాలక్షేపం బీచ్. దానికి కూడా వెళ్లలేనంతగా వాటిని గలీజ్ చేస్తే? అలా చేసేంత దుర్గుణం మనుషులకే ఉంది. దానికి జవాబు యువత దగ్గర ఉంది. ఛేంజ్ ఈజ్ అజ్ ముంబైలో ఎంతలేదన్నా డజన్ అందమైన బీచ్లు ఉన్నాయి. అతి చిన్న ఇరుకు ఇళ్లలో జీవించే ముంబై జీవులు బీచ్లకు వచ్చే ఊపిరి పీల్చుకుంటారు. 75 ఏళ్ల కుంతీ ఓజా అనే మహిళ మూడు నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో ‘చిన్నప్పటి నుంచి చౌపాటి బీచ్కు వచ్చి ఆహ్లాదం పొందేదాన్ని. పసుపు రంగు ఇసుక చూడటం, చిరుతిళ్లు తినడం భలే ఉండేది. కాని ఇప్పుడు బీచ్ మొత్తం చెత్త. మా చిన్నప్పుడు మిగిలిన తిండి పారేసేవారు. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ చెత్తను పారేస్తున్నారు’ అని రాసింది. ఆమె గోడు విన్నట్టుగా ఆ సమయంలోనే సీనియర్ ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అక్షత్ షా, శుభ్ మెహతా పర్యావరణ విధ్వంసం గురించి స్కూల్లో, బయట వింటున్న వార్తలతో ప్రభావితం అయ్యారు. అప్పుడే అమెజాన్ అడవులు తగలబడటం వారిని కలిచి వేసింది. ‘మన వంతుగా ఏదో ఒకటి చేద్దాం’ అని సోషల్ మీడియా వేదికగా ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ను ప్రారంభించి ముంబైలోని బీచ్ల క్లీనింగ్కి నడుం కట్టారు. జూలై 2019న మొదటిసారి అక్షత్ షా, శుభ్ మెహతా జూలై, 2019లో మొదటిసారి చౌపాటి బీచ్ను క్లీన్ చేయడానికి సోషల్ మీడియాలో పిలుపునిచ్చినప్పుడు కేవలం 18 మంది టీనేజ్ విద్యార్థులు హాజరయ్యారు. వారంతా కలిసి బీచ్ను క్లీన్ చేయడం జనం వింతగా చూశారు. కాని మంచి పనికి కొత్త తరం అండ తప్పక లభిస్తుంది. క్రమం తప్పకుండా బీచ్లను క్లీన్ చేయడం, ఫొటోలను ప్రచారంలో పెట్టడంతో హైస్కూల్, కాలేజీ స్థాయి పిల్లలు స్పందించడం మొదలెట్టారు. తల్లిదండ్రులు కూడా ఈ మంచి పనికి అడ్డు చెప్పలేదు. ‘ఇప్పటి వరకూ మేము ముంబై బీచ్ల నుంచి 480 టన్నుల చెత్త పారబోశాం’ అంటారు అక్షత్ షా, శుభ్. ప్రస్తుతం అక్షత్ ముంబైలోనే ఉంటూ చదువుకుంటుంటే శుభ్ యూకేలో చదువుకుంటూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. పాతిక వేలమంది వాలంటీర్లు ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ ఎంత సక్సెస్ అయ్యిందంటే ముంబై మొత్తం నుంచి 25,200 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా చేరారు. బీచ్ల శుభ్రత గురించి ఛేంజ్ ఈజ్ అజ్ సభ్యులు స్కూళ్లు, కాలేజీలకు తిరిగి ప్రచారం చేయడం వల్ల కూడా ఈ చేరిక సాధ్యమైంది. వీరంతా తమకు వీలున్నప్పుడల్లా ముంబైలోని బీచ్లను శుభ్రం చేస్తుంటారు. ముఖ్యంగా పండగలప్పుడు, డిసెంబర్ 31 వంటి సందర్భాల్లో వీరి పని ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో బీచ్లు టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. పట్టణ, నగర సంస్థలు బీచ్ల శుభ్రత కోసం ఎంతోకొంత నిధులు వెచ్చిస్తున్నా నిరంతర అలల్లాగే నిరంతరం చెత్త పడుతూనే ఉంటుంది. అందుకే ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం... తీరాల పొడవునా బీచ్లను శుభ్రం చేయడానికి విద్యార్థినీ విద్యార్థులు నడుం బిగించాలి. వారు కదిలితే పెద్దలూ కదులుతారు. -
హిందీ మాట్లాడేవాళ్లు... టాయిలెట్లు కడుగుతున్నారు
చెన్నై/పట్న: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రగడ మొదలైంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ కారి్మకులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్ ఈ ఏడాది మార్చి నెలలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మారన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. మార్చి జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడుతూ... తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని, తమిళనాడు ప్రజలు ఆయా భాషలను చక్కగా నేర్చుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడని గుర్తుచేశారు. ఒకవేళ సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే నిర్మాణ రంగంలో సాధారణ కారి్మకుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు. తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, మెరుగైన వేతనాలు పొందుతున్నారని తెలిపారు. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు తమిళనాడుకు వలస వచ్చి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని, రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని చెప్పారు. హిందీ మాత్రమే నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మారన్ మాట్లాడిన వీడియో క్లిప్ సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది. డీఎంకే రంగు బయటపడింది: బీజేపీ హిందీ రాష్ట్రాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో విమర్శించారు. ఆ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మంపై దాడి చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరువిప్పడం లేదని ఆక్షేపించారు. ఇతరులను కించపర్చడం తగదని డీఎంకే నేతలకు హితవు పలికారు. మారన్ వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం నాటివే అయినప్పటికీ డీఎంకే అసలు రంగు మళ్లీ బయటపడిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను అవమానించేలా, దూషించేలా డీఎంకే పెద్దలు తరచుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులోనూ వారు వైఖరి మార్చుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలూ సమానమే: డీఎంకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి జె.కాన్స్టాండైన్ రవీంద్రన్ ఆరోపించారు. సమతావాద సమాజానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది తమ విధానం కాదని, అన్ని రాష్ట్రాలూ సమానమేనని అన్నారు. మారన్ ఏనాడూ చెప్పని మాటలను చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మాతృ భాషతోపాటు ఆంగ్లమూ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయన్నది మారన్ ఉద్దేశం. ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఇండియాలోనే గాక ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. మారన్ చెప్పిందీ అదే’’ అన్నారు. పరస్పరం గౌరవించుకోవాలి: తేజస్వి దయానిధి మారన్ వ్యాఖ్యలను బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. కుల అసమానతలు, కొన్ని కులాల వారే ప్రమాదకరమైన పనులు చేయడం గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలందరినీ ఇందులోకి లాగడం సమంజసం కాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని సూచించారు. పరస్పరం గౌరవించుకోవడం సముచితమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తాము ఇతరులను గౌరవిస్తామని, వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. -
ఈ రోబో ఇంటి పనులన్నీ సులభంగా చేసేస్తుంది!
ఇంటి పనులన్నీ చేసే రోబోలను సినిమాల్లోనూ లేదా కార్టూన్ షోల్లోనే చూశాం. నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటుందనేది తెలియదు. అందుకోసం ఇప్పటికే పరిశోధనలు చేయడమే గాక పలు రూపాల్లో రోబోలను తీసుకొచ్చారుగానీ. ఎలా రోబోలతో పనిచేయించుకోవాలనేది కాస్త సమస్యాత్మకంగా ఉంది. ఏం చేయాలన్నిది రోబోకి ముందుగానే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమస్య లేకుండా శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కూడిన సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీని సాయంతో రోబోకు సాధారణ ఇంటి పనులను ఎలా నిర్వహించాలో సులభంగా నేర్చుకుని చేసేస్తుంది. ఈ మేరకు రోబోని ట్రైయిన్ చేసేలా డాబ్ ఈ అనే కొత్త ఓపెన్ స్టోర్ సిస్టమ్ని రూపొందించారు. వాస్తవంగా ప్రతి ఇంట్లో ఉంటే పనులను పరిగణలోకి తసుకుని ఓ డేటాని రూపొందించారు న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం. ఈ డాబ్ ఈకి మనం సాధారణంగా వినయోగించే రీచర్ గ్రాబర్ స్టిక్కి జోడించిన ఐఫోన్ను ఉపయోగిస్తే చాలు. రోబో ఈజీగా అన్ని పనులను నేర్చుకుంటుంది. ఈ ఐఫోన్ దేనికంటే మనమిచ్చిన ఇన్స్ట్రక్షన్లను డాబ్ ఈ డేటా రోబోకి ఎలా చేయాలో రికార్డు చేసిన వీడియోల ద్వారా తెలుపుతుంది. దీంతో రోబో ఆటోమేటిగ్గా సులభంగా ఆ పనిని చేసేస్తుంది . ఈ సరికొత్త సాంకేతికతో కూడిన రోబో వర్కింగ్ గురించి న్యూయార్క్లోని దాదాపు 22 ఇళ్లల్లో టెస్ట్ చేయగా చక్కటి ఫలితం వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ డాబ్ ఈ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా పరిశోధనలు చేస్తున్నారు. ఈ డేటా మరింత ఎక్కువగా ఉంటే కొత్త ఇంటిని చూడగానే ఆ రోబోని ట్రైయిన్ చేయాల్సిన పని కూడా ఉండదనేది పరిశోధకులు ఆలోచన. ప్రతి ఇంట్లో ఉండే పనులన్నీ రోబోలకు ఇప్పటికే తెలుసు, నేర్చుకున్నాయి కూడా అన్నారు. ఇక్కడ రోబో స్టిక్సిస్టమ్లను వినియోగిస్తుంది. వీటినన్నంటిని కలిపి డాబ్-ఇ అని పిలుస్తారు. ఈ రోబో ఇల్లు తుడవడం దగ్గర నుంచి లాండ్రీ వరకు అన్నింటిని చేసేస్తుంది. (చదవండి: భారత రెస్టారెంట్కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్గా అరోరా) -
లిటిల్ స్టార్స్ ఇన్ ఫైవ్స్టార్
ఒక వ్యక్తి కొంత మంది పిల్లలను ఫైవ్స్టార్ హోటల్కు తీసుకువెళ్లి వారికి ఇష్టమైన పదార్థాలు తినిపించిన వీడియో వైరల్ అయింది. ఆ పిల్లలకు ఈయన తండ్రి కాదు. కనీసం దూరపుచుట్టం కాదు. వీరు వీధిబాలలు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో 39 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. కవల్చాబ్ర అనే వ్యక్తి కారు ట్రాఫిక్ జామ్లో నిలిచిపోయినప్పుడు కొందరు పిల్లలు కారు అద్దాలను తుడవడం మొదలు పెట్టారు. వారిని చూడగానే చాబ్రకు ‘అయ్యో!’ అనిపించింది. వెంటనే పిల్లలను కారులో కూర్చోబెట్టుకొని ఫైస్టార్ హోటల్కు తీసుకువెళ్లాడు. ఈ వైరల్ వీడియో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తోంది. -
క్లీనింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. క్యాంప్ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మురుగునీరు, చెత్త నిర్మూలన వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు100 మురుగు శుద్ది వాహనాలను ఏపీ ప్రభుత్వం అందజేసింది. రేపు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన అనంతరం పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు. -
రెడీ మిక్స్ ప్లాంట్లో దారుణం
మణికొండ (హైదరాబాద్): ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకున్న రెడీమిక్స్ ప్లాంట్ను శుభ్రం చేస్తున్న కార్మికులను గమనించకుండా.. దానిని ఆపరేటర్ ఆన్ చేయటంతో వారు అందులోనే నుజ్జునుజ్జుగా మారి మృతి చెందిన విషాద ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మారంట బేటా సోరెన్ (30), సుశీల్ ముర్ము (29)లు పుప్పాలగూడలో టవర్ల నిర్మాణం చేస్తున్న ఏఎస్బీఎల్ స్పెక్ట్రా సంస్థలో కొంత కాలంగా పని చేస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు విధులకు వెళ్లిన వారు రెడీమిక్స్ కాంక్రీట్ను మిక్స్ చేసే యంత్రంలోకి దిగి దానిని నీటితో శుభ్రం చేస్తున్నారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా రెడీమిక్స్ ఆపరేటర్ ఆన్ చేశాడు. దాంతో మారంగ బేటా సోరెన్, సుశీల్ ముర్ము అందులో కూరుకుపోయి నుజ్జునుజ్జు మారి మృతి చెందారు. పక్కనే పనిచేస్తున్న వారి బంధువు మాజ్హి ముర్ము గమనించి వెళ్లి చూడగా ఇద్దరూ అప్పటికే మృతిచెందారు. అతనితో పాటు అక్కడే పని చేస్తున్న తోటి కార్మికులు, మృతుల బంధువులు నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఫరి్నచర్ ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. పాటు ఆపరేటర్పై దాడికి పాల్పడ్డారు. మాజ్హి ముర్ము ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి.. పుప్పాలగూడ ఎస్బీఎల్ స్పెక్ట్రా నిర్మాణ సంస్థలోని రెడీమిక్స్ ప్లాంట్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి.పర్వతాలు, జిల్లా కార్యదర్శి ఎస్. మల్లేష్లు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వ చ్చిన కార్మికుల భద్రతకు నిర్మాణ సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు చట్ట ప్రకారం వచ్చే ఎక్స్గ్రేషియాను ఇవ్వాలన్నారు. -
సఫాయి కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారమివ్వాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సఫాయి కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. అదేవిధంగా, డ్రెయినేజీలను శుభ్రం చేస్తూ శాశ్వత వైకల్యానికి గురయ్యే వారికి కనీసంగా రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కూడా పేర్కొంది. మాన్యువల్ స్కావెంజింగ్ విధానాన్ని పూర్తిగా లేకుండా చేయాలని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఒకవేళ సఫాయి కార్మికులు విధుల్లో ఇతర అవకరాలకు గురయిన సందర్భాల్లో రూ.10 లక్షలను పరిహారంగా చెల్లించాలని కూడా ఈ సందర్భంగా జస్టిస్ భట్ పేర్కొన్నారు. -
స్మార్ట్ఫోన్లో వేల కొద్ది బాక్టీరియా.. ఇలా క్లీన్ చేసుకోండి
నిత్యం మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్.. ఎన్నో వేల బ్యాక్టీరియా, వైరస్లకి ఆలవాలమనే సంగతి తెలిసిందే! దాన్ని పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయాలంటే.. ఇలాంటి స్టెరిలైజర్ డిసిన్ఫెక్షన్ బాక్స్ ఉండాల్సిందే. ఇందులో 3 నిమిషాలు పెట్టి.. ఆన్ బటన్ నొక్కితే చాలు. 99.99 శాతం క్రిములు నాశనం అవుతాయి. ఫోన్ నీట్గా మారిపోతుంది. ఇక ఈ బాక్స్లో బండి తాళాలు, ఇంటి తాళాలు, మాస్కులతో పాటు.. కళ్లజోడు, బ్లూటూత్, పెన్నులు, నగలు వంటివెన్నో శుభ్రం చేసుకోవచ్చు. ఈ బాక్స్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, వైర్లెస్ మెషిన్లా వాడుకోవచ్చు. భలే ఉంది కదూ! -
Swachhata Hi Seva: స్వచ్ఛ భారత్.. స్వాస్థ్ భారత్
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా కీ సేవా’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు చేతపట్టి రహదారిని శుభ్రం చేశారు. ఆయన ఈ శ్రమదాన కార్యక్రమంతో వినూత్నంగా ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జోడించారు. ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ అంకిత్ బైయాన్పూరియాతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పిలుపుమేరకు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో జరిగిన స్వచ్ఛతా కీ సేవాలో లక్షలాది మంది స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. గంటపాటు శ్రమించారు. తమ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. మార్కెట్లు, జల వనరులు, బస్ స్టాండ్లు, టోల్ వసూలు కేంద్రాలు, గోశాలలు, జంతు ప్రదర్శనశాలలు, సముద్ర తీర ప్రాంతాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల్లోనూ శ్రమదానం చేశారు. 4 నిమిషాల నిడివి గల తన శ్రమదానం వీడియోను ప్రధాని మోదీ తన అధికారిక ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘నేడు దేశమంతా స్వచ్ఛతపై దృష్టి పెట్టింది. నేను, అంకిత్ బైయాన్పూరియా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నాం. కేవలం పరిసరాలను శుభ్రం చేయడమే కాదు, ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జతకలిపాం. ఇదంతా స్వచ్ఛ భారత్, స్వాస్థ్ భారత్ కోసమే’’ అని మోదీ ఉద్ఘాటించారు. 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో.. స్వచ్ఛతా కీ సేవా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు చీపుర్లకు పనిచెప్పారు. ఇళ్ల చుట్టుపక్కన, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం ఊడ్చేశారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, మార్కెట్ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ధార్మిక సంస్థలు, వాణిజ్య సంఘాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శ్రమదానం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని ఝండేవాలన్ ఏరియాలో శ్రమదానంలో పాల్గొన్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలో స్వచ్ఛతా యజ్ఞంలో భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీతాపూర్లో ‘స్వచ్ఛతా పఖ్వాడా’ నిర్వహించారు. ‘చెత్త రహిత భారత్’ను సాధిద్దాం దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని కేంద్రప్రభుత్వం తీర్మానించుకుందని, ఇదొక పెద్ద సవాలు అయినప్పటికీ చేసి చూపిస్తామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. స్వచ్ఛతా యజ్ఞంతో మహాత్మా గాం«దీకి నివాళులర్పిద్దామని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కీ సేవాలో పాల్గొన్ని, కొత్త చరిత్ర సృష్టిద్దామని ఉద్బోధించారు. ‘చెత్త రహిత భారత్’ అనే కలను నెరవేర్చుకుందామని సూచించారు. ప్రజలు శ్రమదానంలో పాల్గొనాలంటూ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఇచి్చన ‘స్వచ్ఛ భారత్’ పిలుపును ప్రజలు అందిపుచ్చుకుంటారని తాము ఆశిస్తున్నట్లు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ చెప్పారు. -
కాలువ శుభ్రం చేస్తుంటే వందలకొద్దీ సైకిళ్లు.. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి?
భారతదేశం అయినా విదేశాల్లో అయినా సరే ప్రతి పౌరుడి బాధ్యత తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. విదేశాల్లో రోడ్డుపై చెత్త వేయడం నేరంతో సమానం. ఇందుకు కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినా చాలామంది నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ వీడియోలో కాలువను శుభ్రం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మురుగునీటిలో నుంచి పెద్ద సంఖ్యలో సైకిళ్లు బయటకు వచ్చి, కుప్పగా ఏర్పడిన తీరు వీడియోలో కనిపిస్తుంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కాలువను శుభ్రం చేస్తున్న కార్మికులు నీటి అడుగునుంచి పలు సైకిళ్లను వెలికితీశారు. జేసీబీతో ఈ క్లీనింగ్ పనులను చేపట్టారు. ఈ క్లిప్ @fasc1nate అనే ఖాతాతో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వేలాది బైక్లు, సైకిళ్లను నదులు, చెరువులు, సరస్సులలో విసిరివేస్తున్నారు. ఇదేవిధంగా బైక్లు, సైకిళ్లు ప్రమాదవశాత్తు కూడా నీట మునుగుతున్నాయి. ఈ కారణంగా వాటిని శుభ్రపరిచే సమయంలో పెద్ద మొత్తంలో చెత్త బయటకు వస్తున్నది. కేవలం 2 నిమిషాల 9 సెకన్ల వీడియోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది పలువురి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఇన్ని సైకిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాయగా, మరొకరు ఈ సైకిళ్లను అమ్ముతారా? అని ప్రశ్నించారు. మరొక యూజర్ కాలువలోకి ఇంత పెద్ద సంఖ్యలో సైకిళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? అని రాశారు. ఇది కూడా చదవండి: శాంతినికేతన్తో చైనాకు లింకు ఏమిటి? తాన్ యున్ జెన్ ఏం సాయం చేశారు? Finding some surprises while cleaning the canals of Amsterdam. pic.twitter.com/QsEJgj5GHM — Fascinating (@fasc1nate) September 18, 2023 -
నమామీ గోదావరి..స్వచ్ఛ గోదావరే లక్ష్యంగా ఏపీ సర్కార్ కృషి
-
ఇలా చేస్తే వాటర్ బాటిల్స్ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు
ఈ రోజుల్లో ప్రతి యంత్రం, ప్రతి పరికరం.. న్యూ టెక్నాలజీని అందుకుంటూ.. ఈజీ ప్రొసెస్ను వినియోగదారులకు అందిస్తున్నాయి. సాధారణంగా వాటర్ బాటిల్స్, పాల బాటిల్స్, వాటి చిన్న చిన్న మూతలను క్లీన్ చేయడానికి పొడవాటి బ్రష్ ఉండేది. అయితే చిత్రంలోని బ్రష్ చూడటానికి అలానే కనిపిస్తుంది కానీ, ఇది టెక్నాలజీతో ముడిపడిన పరికరం (ఎలక్ట్రిక్ వాటర్ప్రూఫ్ డివైస్). ఒక్క బటన్ నొక్కితే చాలు గిర్రున తిరుగుతూ బాటిల్ మూల మూలలను శుభ్రం చేసి పెడుతుంది. ఈ హ్యాండ్హెల్డ్ క్లీనర్కి తగినంత చార్జింగ్ పెట్టుకుని.. వైర్లెస్గా వినియోగించుకోవచ్చు. అవసరం అయితే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు వేసుకుని సులభంగా వాడుకోవచ్చు. ఒంపులు తిరిగిన మగ్గులు, గ్లాసులు, చెంబులు, బేబీ బాటిల్స్, బాటిల్ నిపుల్స్ వంటివి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అందుకు అనువైన రెండు వేరు వేరు బ్రష్లు.. బేస్ డివైస్కి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మధ్యలో ఉన్న పవర్ బటన్ ఆన్ చేసుకోవడంతో ఈ డివైస్ పని చేస్తుంది. ఇది వాటర్ప్రూఫ్ కావడంతో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీని ధర 14 డాలర్లు (రూ.1,158) -
ఫలితాలిస్తున్న మిషన్ క్లీన్ కెనాల్స్
-
నాలాలు, వరద నీటి కాలువల శుభ్రతపై దృష్టి సారించాలి
రాయదుర్గం: పట్టణ ప్రాంతాల్లో నిత్యం నాలాలు, వరద నీటి కాలువలను శుభ్రం చేసే అంశంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి చారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ‘ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ... ప్రస్తుతం పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో రోడ్లపైకి మురుగునీరు, వర్షపునీరు రాకుండా శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్షపు నీటిని చాలా వరకు భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని కూడా పేర్నొన్నారు. అన్ని విభాగాల వారు సమష్టిగా చర్యలు చేపడితే దాదాపు అన్ని సమస్యలు తీరేందుకు అవకాశం ఉంటుందన్నారు. తరచూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలిస్తే వాటిని ప్రభుత్వాలు అమలు చేస్తే చాలా వరకు సమస్యలు తీరేందుకు ఆస్కారం ఉందన్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కరుణాగోపాల్, రీ సస్టేనబిలిటీ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ పి.జి.శాస్త్రి, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ కె.కిషన్, జేఎన్టీయూఏ వాటర్ రిసోర్సెస్ హెచ్ఓడీ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.గిరిధర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.గోపాల్నాయక్, సిటీ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నర్సింగ్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పిల్లలకు పాలు పడుతున్నారా? కనిపించని బ్యాక్టీరియాలు..
సాధారణంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగానే ఉంటాం. అందులోనూ పాలు తాగే పిల్లల విషయంలో ఈ జాగ్రత్త అవసరం. వాళ్ల కోసం వాడే పాలసీసాలు, పాల పీకలు, ఉగ్గు గిన్నెలు, స్పూన్లు వంటివన్నీ శుభ్రంగా ఉంచాలి. అయితే ఎంత శుభ్రంగా కడిగినా కనిపించని క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు చాలానే ఉంటాయి. వాటిని పారదోలేందుకు ఉపయోగపడుతుంది ఈ బేబీ బాటిల్ స్టీమ్ స్టెరిలైజర్. ఇందులో సుమారుగా ఆరు చిన్న చిన్న బాటిల్స్తో పాటూ నిపుల్స్, ఉగ్గు గిన్నెలు వంటివి క్లీన్ చేసుకోవచ్చు. ఫాస్ట్ – ఎఫెక్టివ్ స్టెరిలైజేషన్ టెక్నాలజీతో ఆటో షట్ ఆఫ్ వంటి ఆప్షన్తో రూపొందిన ఈ డిౖవైస్.. 99.9 శాతం సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత సుమారు 24 గంటల పాటు మూత తియ్యకుండా ఉంచితే.. క్రిమిరహితంగా దాచిపెడుతుంది. కేవలం 8 నిమిషాల్లోనే ఈ మెషిన్.. బాటిల్స్ని క్లీన్ చేయగలదు. బాగుంది కదూ!. ఈ స్టీమ్ స్టెరిలైజర్ ధర 22 డాలర్లు (రూ.1,810) మాత్రమే. -
సెల్ఫ్ క్లీనింగ్ రోబో వాక్యూమ్ క్లీనర్ - ధర ఎంతో తెలుసా?
విద్యుత్తుతో పనిచేసే వాక్యూమ్ క్లీనర్లు ఇప్పటికే చాలా చోట్ల వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రోబో వాక్యూమ్ క్లీనర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రోబో వాక్యూమ్ క్లీనర్లు గదిలోని చెత్తను పూర్తిగా తొలగించాక, వాటిలోని అర చెత్తతో నిండిపోతోంది. ఆ చెత్తను మనం తొలగించాల్సి ఉంటుంది. అయితే, చైనీస్ హైటెక్ కంపెనీ ‘జియావోమీ’ ఇటీవల సెల్ఫ్ క్లీనింగ్ రోబో వాక్యూమ్ క్లీనర్ను అందుబాటులోకి తెచ్చింది. ‘రోబోరాక్ ఎస్7 మాక్స్ అల్ట్రా’ పేరుతో తెచ్చిన ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ గదిలోని చెత్తను తొలగించాక, తనను తాను శుభ్రం చేసుకుంటుంది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) ఇందులోని సెన్సర్లు గదిలోని చెత్తను రకాల వారీగా గుర్తించి, అందుకు అనుగుణంగా పనిచేస్తాయి. సూక్ష్మమైన ధూళికణాలను కూడా ఏరివేసేందుకు ఇవి దోహదపడతాయి. గదిలో అడ్డదిడ్డంగా వస్తువులు పడి ఉంటే, అడ్డంకులను దాటుకుని మరీ ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ పనిచేస్తుంది. దీని ధర 1299 డాలర్లు (రూ.1,06,581). -
శరీరంపై 800 టాటూలు.. అక్కడే చిక్కొచ్చి పడింది..!
టాటూ.. శరీరాన్ని మరింత అందంగా ఫ్యాషన్గా కనిపించేలా చేస్తుంది. అందరి కళ్లూ మనమీదే ఉండేలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ బ్రిటన్కు చెందిన ఓ మహిళకు మాత్రం టాటూలే తన పాలిట శాపంగా మారాయి. టాటూల కారణంగానే ఎక్కడకు వెళ్లినా.. దిక్కరింపులే ఎదురవుతున్నాయట. జీవనోపాధి కూడా లభించట్లేదట. ఎందుకంటే..? ఆమె పేరు మెలిస్సా స్లోన్(46) యూకేకు చెందిన మహిళ. ఇంతకు ముందు తనకు కనీసం టాయిలెట్ క్లీనింగ్ ఉద్యోగమైనా లభించేది. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఆమె తన శరీరంపై ఏకంగా 800 టాటూలను వేయించుకుంది. శరీరమంతా టాటూలతో నిండిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం ఇవ్వకుండా యజమానులు తిరస్కరిస్తున్నారట. మెలిస్సాకు తన 20వ ఏట నుంచి టాటూలను శరీరంపై వేయించుకునే అలవాటు ఉండేది. మొదట్లో ప్రతి వారం రెండు నుంచి మూడు టూటూలు వేయించుకుంటే.. ఇక రాను రాను పరిస్థితి మారిపోయింది. వాటికి అలవాటు పడి శరీరమంతా పచ్చబొట్లను పొడిపించుకుంది. దీంతో చూడటానికి ఇబ్బందికరంగా మారిపోయింది. మెలిస్సాకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. టూటూల కారణంగా శరీరం నీలం రంగులో మారిపోయిందని ఆమె చెబుతున్నారు. కానీ అవంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది. బహుశా ప్రపంచంలో తన కంటే ఎక్కువ టాటూలు ఎవరి శరీరంపై ఉండబోవని ఆమె అన్నారు. ఇదీ చదవండి: గిన్నీస్ రికార్డ్: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి.. -
సంపు క్లీన్ చేస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి..
చిత్తూరు: చౌడేపల్లి మండలం పెద్ద కొండామారిలో విషాద ఘటన జరిగింది. విద్యుత్ షాక్కు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సంపు క్లీన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచారు. మృతులను రమణ, మునిరాజా, రవిలుగా గుర్తించారు. మోటారు వైరు తెగి సంపులో పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని కుటుంబసభ్యులు తెలిపారు. విగతజీవులుగా మారిన వారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం.. -
బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ!
-
ఇలా చేస్తే ఇల్లంతా శుభ్రమే!
ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ సోఫా, మ్యాట్రెసెస్, టేబుల్స్, చైర్స్ ఇలా చాలా రకాల ఫర్నీచర్ ఉంటుంది. వీటిని శుభ్రం చేయకపోతే దుమ్ము, ధూళీ పేరుకుని పోయి చాలా అపరిశుభ్రంగా కనిపిస్తాయి. అంతేకాదు, వీటివల్ల డస్ట్ అలర్జీ ఉన్న వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. వీటిలో దాగి ఉండే సూక్ష్మక్రిముల వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తుంటాయి. వీటిని క్లీన్ చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. దీనివల్ల ఫర్నీచర్ శుభ్రంగా కనిపించడంతోపాటు ఎక్కువకాలం మన్నుతుంది కూడా. ఫర్నీచర్ను శుభ్రం చేసేందుకు ఏం చేయాలో చూద్దాం. సోఫా: ఆరు టీస్పూన్ల బాత్ సోప్ పౌడర్ తీసుకోండి. ఈ పొడికి కప్పు వేడి నీరు కలపండి. సబ్బు నురగ వచ్చిన తర్వాత దానికి రెండు టీస్పూన్ల అమ్మోనియా లేదా తేనె జోడించండి. ఈ ద్రావణం చల్లబడిన తర్వాత దానిని బాగా కలపండి. దీంతో నురగ వస్తుంది. ఒక క్లాత్ లేదా స్పాంజ్ సహాయంతో ఈ నురగతో సోఫా పై భాగంలో శుభ్రం చేయండి. దీని తరువాత సోఫాను ఫ్యాన్ కింద ఆరనివ్వండి. దీంతో ఫ్యాబ్రిక్ సోఫా కొత్తగా కనిపిస్తుంది. లెదర్ సోఫా: లెదర్ సోఫాను క్లీన్ చేసే ఏకైక మార్గం మైల్డ్ క్లీనర్తో శుభ్రం చేయడమే. ఇందు కోసం ఎప్పుడూ మృదువైన బ్రష్.. వాక్యూమ్ క్లీనర్ను ఉపయోగించాలి. శుభ్రం చేయడానికి నీటితో కలిపిన వెనిగర్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. డైనింగ్ టేబుళ్లు, చెక్క కుర్చీలు తదితర ఉడెన్ ఫర్నీచర్ని తుడిచేందుకు పొడి వస్త్రాన్ని వాడండి. వీటిని మరింతగా మెరిసేలా చేయాలంటే వ్యాక్స్, పాలిష్ కూడా చేయొచ్చు. అదే విధంగా దుమ్ముని క్లీన్ చేయాలంటే డిష్ వాష్ని నీటిలో కలిపి అందులో మెత్తటి బట్టను ముంచి బయటికి తీసి పిండి దానితో ఫర్నీచర్ని రుద్దాలి. తర్వాత పొడిబట్టతో చక్కగా తుడవండి. ఇలా క్లీన్ అయిన ఫర్నీచర్ని పూర్తిగా ఆరబెట్టండి. కొన్ని వస్తువులు పాత పాలిష్తో చూడ్డానికి అంత బాగుండవు. వీటిని క్లీన్ చేయాలంటే.. ముందుగా కొద్దిగా టీ బ్యాగ్స్ తీసుకుని వేడినీటిలో వేసి డికాషన్ చేయాలి. ఇది గోరువెచ్చగా అయ్యే వరకూ ఉంచి గుడ్డపై దీనిని పోస్తూ కొద్దికొద్దిగా తుడవాలి. టీ డికాక్షన్లోని యాసిడ్ ఉడ్ని క్లీన్ చేస్తుంది. మరకలు దూరమవ్వాలంటే.. కొన్నిసార్లు డైనింగ్ టేబుల్పై ఫుడ్ ఐటెమ్స్ మూలాన మరకలు పడుతుంటాయి. వాటిని తొలగించాలంటే... మరకలు పడ్డ చోట కాస్తంత టూత్పేస్ట్ అప్లై చేసి దానితో రుద్దాలి. ఆరిన తర్వాత ఒక తడిబట్టతో శుభ్రంగా తుడిచెయ్యండి. మరకలు మొండిగా ఉంటే బేకింగ్ సోడా, టూత్పేస్ట్లను సమానంగా కలిపి వాటితో రుద్దండి. కాసేపయ్యాక తడిగుడ్డతో తుడిచి ఆరబెట్టండి. గోడలపై ఇంక్ మరకలు, పెన్ను గీతలు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్లా చేయండి. ఈ పేస్ట్ని మరకలపై పట్టించి రుద్ది తడిగుడ్డతో తుడిచెయ్యాలి.దీనికి మరో పద్ధతి ఉంది. అదేంటంటే... గిన్నెలో కాసిన వేడినీళ్లు తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కల షాంపూ వేసి బాగా కలపాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిలో ఒక క్లాత్ను ముంచి మరకలు పడ్డ చోట రుద్దండి. ఆరిన తర్వాత తడిబట్టతో తుడవండి. మరకలు పలచబడతాయి. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. ఇలా ఒకటి రెండుసార్లు చేయడం మంచిది. ఉడెన్ ఫర్నిచర్: చెక్కతో చేసిన గృహోపకరణాలు పాడు కాకుండా ఉండాలంటే టీ డికాషన్లో మెత్తటి క్లాత్ను నానబెట్టి పిండి దాంతో తుడవండి. ఇలా చేస్తే రంగు వెలిసిన ఫర్నీచర్కు కూడా తిరిగి మెరుపు వస్తుంది. చెక్కపై నీటి మరకలు దాని అందాన్ని పాడు చేస్తాయి. నీటి మరకలు పడినచోట వైట్ టూత్ పేస్ట్ (జెల్ పేస్ట్ కాదు) రాయండి. తర్వాత మెత్తని బట్టతో రుద్దాలి. అప్పుడు టూత్పేస్ట్ను తీసివేసి.. తడిబట్టతో తుడిచేయాలి. చెక్క ఫర్నిచర్పై మసి ఉంటే.. టీస్పూన్ బేకింగ్ సోడాను నీటిలో వేసి కరిగించండి. మసి ఉన్న ప్రాంతంపై దీన్ని అప్లై చేయండి. తర్వాత మెత్తని పొడిబట్టతో తుడవండి. సీలింగ్ ఫ్యాన్లు సాధారణంగా సీలింగ్ ఫ్యాన్లు ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల ముందుగా మీరు టేబుల్ పైకి ఎక్కి ఫ్యాన్ను తీసేయండి. ఆ తర్వాత ఫ్యాన్ బ్లేడ్ని తీసి విడిగా శుభ్రం చేయండి. రెక్కలను కూడా సబ్బుతో రుద్ది శుభ్రంగా కడిగిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. రెండో విధానం.. పాత పిల్లో కవర్ తీసుకుని టేబుల్ మీద ఎక్కి సీలింగ్ ఫ్యాన్ రెక్కలలో ఒకదానిని కవర్ చేయాలి. ఇప్పుడు కవర్ పైనుంచి చేతులతో రుద్దాలి. అదేవిధంగా మూడు రెక్కలను శుభ్రం చేయాలి. రెక్కలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, బూజు అంతా కవర్ లోపల పడిపోతుంది. తర్వాత దాన్ని పారవేసి పిల్లో కవర్ను ఉతుక్కుంటే సరిపోతుంది. గుర్తుంచుకోవాల్సింది.. ఫ్యాన్ను క్లీన్ చేసినప్పుడల్లా కింద ఒక షీట్ లేదా వస్త్రాన్ని పరవాలి. దీంతో ఫ్యాన్ క్లీన్ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు కళ్లకి ప్లెయిన్ గ్లాసెస్ లేదా సన్ గ్లాసెస్ ధరిస్తే కంట్లో దుమ్ము పడకుండా ఉంటుంది. అలాగే ముక్కుకు మాస్క్ లేదా రుమాలు కట్టుకోవాలి లేదంటే డస్ట్ అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాన్ని క్లీన్ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు. -
వందే భారత్ రైలులో క్లినింగ్ ప్రకియ చేపట్టిన రైల్వే మంత్రి
ఇప్పుడిప్పుడే మెట్రో రైలు వంటి ఆధునికతతో కూడిన హైక్లాస్ రైళ్లను పట్టాలెక్కించి ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది కేంద్రిం. అందులో భాగంగానే తక్కవ సమయంలో దూర ప్రయాణాలు చేయగలిగే వందే భారత్ వంటి హైక్లాస్ రైలును కూడా తీసుకొచ్చింది. మంచి ఆధునికతతో కూడిన రైలు అని మురిసిపోయేలోగే దాన్ని కూడా ప్రజలు చెత్తతో నింపేశారు. దీంతో ఆ రైలులో పరిస్థితి ఇది అంటా, అది అంటా అంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రంగంలోకి దిగి చెత్తను క్లీన్ చేశారు. శానిటరీ వర్కర్ మాదిరిగా డ్రైస్ ధరించి ఓ సంచిని పట్టుకుని ప్రతి ప్రయాణికుడి సీటు వద్దకు వెళ్లి చెత్తను సేకరించారు. విమానాల్లో మాదిరిగా క్లీనింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రైళ్లలో పరిశుభ్రతను కాపాడుకోవడంలో ప్రజలు సహకరించాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వందే భారత్ రైలు ప్లేట్లు, కప్పులు వంటి చెత్తతో నిండిపోయింది. సిబ్బంది నిర్ణిత వ్యవధిలో క్లీన్ చేసినప్పటికీ రైలు స్టేషన్కి చేరుకునే సరికి చెత్తతో దారుణంగా ఉంది. దీంతో నెటిజన్ల తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రిని కోరారు. ఈ నేపథ్యంలోనే రైల్వే మంత్రి ఈ క్లినింగ్ ప్రక్రయను చేపట్టారు. Cleaning system changed for #VandeBharat trains. आपका सहयोग अपेक्षित है। https://t.co/oaLVzIbZCS pic.twitter.com/mRz5s9sslU — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 28, 2023 (చదవండి: కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించాం.. 'మన్కీ బాత్'లో మోదీ) -
Mancherial: మందు బాబులకు రిమ్మ దిగిపోయే శిక్ష
సాక్షి, మంచిర్యాల: శిక్షల విధించడంలోనూ ఈమధ్య కొందరు న్యాయమూర్తులు వైవిధ్యతను కనబరుస్తున్నారు. నేరానికి తగ్గట్లు శిక్ష విధించి.. వాటికి పాల్పడుతున్నవాళ్లలో మార్పునకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంచిర్యాలలో మందుబాబులకు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది. తాగి ఊగితే పర్వాలేదు. కానీ, రోడ్ల మీదకు చేరి పబ్లిక్ న్యూసెన్స్కు పాల్పడుతుంటారు కొందరు. అలా తాగి రచ్చ చేసిన 13 మందికి.. వాళ్ల రిమ్మ దిగిపోయేలా జిల్లా పస్ట్ క్లాస్ కోర్టు భలే శిక్ష విధించింది. రెండు రోజుల హాస్పిటల్ క్లీన్ చేయాలని, అలాగే మాతాశిశు ఆసుపత్రిలో రెండు రోజుల పాటు సేవలందించాలని ఆదేశించింది. దీంతో వాళ్లు కంగుతినగా.. ఆదేశాలను పాటించని పక్షంలో.. జైలు శిక్ష, జరిమానా తప్పదని వారించినట్లు తెలుస్తోంది. -
వెహికల్స్ను క్లీన్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా?
పెద్ద పెద్ద ఇళ్లల్లో గచ్చును శుభ్రం చేయడానికి, వాహనాలను శుభ్రం చేయడానికి వాషర్లు తప్పనిసరి. ఇప్పటి వరకు విరివిగా వాడుకలో ఉన్న వాషర్లన్నీ విద్యుత్తు సాయంతో పనిచేసేవే! ఇవి కాస్త భారీగా కూడా ఉంటాయి. ఎక్కడికంటే అక్కడికి తరలించాలంటే కష్టమే! పైగా ఆరుబయట ఉన్న వాహనాన్ని శుభ్రం చేయాలంటే, ఇంట్లో ఉన్న ప్లగ్ సాకెట్ నుంచి ఆరుబయట ఉన్న వాహనం వరకు సరిపోయే పొడవాటి తీగ కావాల్సి ఉంటుంది. ఫొటోలో కనిపిస్తున్న ‘ఆల్బో పోర్టబుల్ కార్డ్లెస్ ప్రెషర్ వాషర్’కు అంత పటాటోపం ఏమీ అక్కర్లేదు. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. విద్యుత్ వాషర్లకంటే ఇది తేలిక కూడా. దీని బరువు ఆరుకిలోలే! పైగా దీని అడుగున అమర్చిన చక్రాల వల్ల దీనిని ఎక్కడికైనా సులువుగా నడిపించుకుంటూ పోవచ్చు. దీని సిలిండర్లో నీళ్లు నింపుకొని, స్విచ్ ఆన్ చేసుకుంటే చాలు. ఇందులోని బ్యాటరీ విడుదల చేసే 55 బార్ల ప్రెషర్ ధాటికి ఎంతగా మురికిపట్టిన గచ్చయినా, వాహనాలైనా ఇట్టే శుభ్రమైపోతాయి. అమెరికన్ కంపెనీ ‘ఆల్బో’ రూపొందించిన ఈ పోర్టబుల్ ప్రెషర్ వాషర్ ఈ ఏడాదికి రెడ్ డాట్ డిజైన్ అవార్డు కూడా అందుకుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,355) మాత్రమే! ప్రస్తుతం ఇది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
దారుణం: పెళ్లి భోజనం చేశాడని.. ప్లేట్లు కడిగించారు
వైరల్: పిలవని పెళ్లికి వెళ్లిన ఓ హాస్టల్ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్రీగా తిన్నాడని అతనితో బలవంతంగా ప్లేట్లు కడిగించారు అక్కడున్న కొందరు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రీగా తింటే దానికి శిక్ష ఏంటో తెలుసా?.. మీ ఇంట్లోలాగే ఇక్కడ ప్లేట్లు సరిగ్గా కడుగు అంటూ అతని ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్తూ ఉండగా.. వీడియో రికార్డు అయ్యింది. ఎందుకు వచ్చావ్? అసలు ఎవడు పెళ్లికి పిలిచాడు నిన్ను.. ఫ్రీగా తినడానికి వచ్చావా?.. ఇదే నీకు సరైన శిక్ష అంటూ వాయిస్ వినిపిస్తుంది ఆ వీడియోలో. బాధిత యువకుడిది జబల్పూర్(మధ్యప్రదేశ్)గా తేలింది. భోపాల్కి చదువు కోసం వచ్చాడట. ‘‘ఎంబీఏ చదువుతున్నావ్. నీ తల్లిదండ్రులు నెల నెలా డబ్బు పంపడం లేదా?. నువ్వు ఇలా చేయడం వల్ల మీ ఊరికి చెడ్డ పేరు వస్తుంది అంటూ అతన్ని మందలిస్తున్నారు మరికొందరు. दो तस्वीर… pic.twitter.com/T8uG6l4te1 — Awanish Sharan (@AwanishSharan) December 1, 2022 కొసమెరుపు ఏంటంటే.. తీరా ప్లేట్లు కడిగాక ‘ఎలా అనిపిస్తోంది’ అంటూ కొందరు అతన్ని అడిగారు. ఫ్రీగా తిన్నప్పుడు.. ఏదో ఒక పని చేయాల్సిందే కదా అంటూ సమాధానం ఇచ్చాడు ఆ స్టూడెంట్. ఇలా పిలవని ఫంక్షన్లకు, కార్యక్రమాలకు వెళ్లి భోజనం చేయడం మామూలు కావొచ్చు. కానీ, దానికే ఇలా ప్లేట్లు కడిగించి మరీ వీడియోలు తీయడం, ఆ విద్యార్థిని అలా అవమానించడం సరికాదంటున్నారు చాలామంది. ఇదిలా ఉంటే.. అదే సమయంలో మరో వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. బీహార్లో ఇలాగే పిలవని పెళ్లికి వెళ్లి భోజనం చేసిన ఓ హాస్టల్ విద్యార్థి.. ఏకంగా పెళ్లి కొడుకు దగ్గరికే వెళ్లి ఆ విషయాన్ని తెలియజేశాడు. అయితే.. ఆ విద్యార్థి బాధను అర్థం చేసుకున్న ఆ పెళ్లి కొడుకు.. పర్వాలేదని, మరికొంత భోజనం హాస్టల్లో ఉన్న అతని స్నేహితులకు సైతం తీసుకెళ్లమని సూచిస్తాడు. God Bless You.❤️ pic.twitter.com/0Cu0rDdZoI — Awanish Sharan (@AwanishSharan) December 1, 2022 ఇదీ చూడండి: పేగుబంధం పక్కన పెట్టి.. కొడుకును పోలీసులకు పట్టించింది -
Hyderabad: టీచర్ల నిర్వాకం.. విద్యార్థులతో పారిశుద్ధ్య పనులు..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో సర్కారు బడుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కనీస అవసరాలకు నిధులు విదిల్చని సర్కారు తీరు, విద్యాశాఖాధికారుల ప్రేక్షక పాత్ర నిరుపేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు విద్యార్ధులతో పారిశుద్ధ్య పనులు చేయించడం విస్మయానికి గురిచేస్తోంది. కరోనా కంటే ముందు సర్కారు బడుల్లో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నా.. ఆ తర్వాత సరైన నిర్వహణ లేకుండా పోయింది. ఒక వైపు ఉపాధ్యాయుల కొరతతో బోధన అంతంత మాత్రం కాగా, మరోవైపు వసతుల లేమి, పారిశుధ్య పనులు కూడా సమస్యగా తయారయ్యాయి. పాఠశాల నిర్వహణకు నిధులేవీ..? గత రెండేళ్లుగా పాఠాశాల నిర్వహణకు నిధుల కొరత వెంటాడుతోంది. గతంలో స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం నిధులు కేటాయించేది. 1 నుంచి 15 మంది విద్యార్థులు గల పాఠశాలకు ఏడాదికి రూ.12,500, 16 నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25,000, అదేవిధంగా 101 నుంచి 250 మంది ఉంటే రూ.50,000, 251 నుంచి 1000 మంది ఉంటే రూ,75,000, వెయ్యికి పైగా విద్యార్థులు గల పాఠశాలలకు రూ. లక్ష కేటాయించేవారు. ఆయా స్కూళ్లకు ఇచి్చన నిధులను రిజిస్టర్లు, చాక్పీస్లు, విద్యుత్ బిల్లులు, కంప్యూటర్ల మరమ్మతుల ఖర్చుతోపాటు, స్కావెంజర్ల వేతనాలు చెల్లింపునకు వినియోగించేవారు. మొత్తం మీద విడుదలైన నిధులను హెచ్ఎంలు సర్దుబాటు చేస్తూ పనులను పూర్తి చేసేవారు. స్కావెంజర్లు లేక.. సర్కారు బడుల్లో తరగతి గదులు, మరుగుదొడ్లను శుభ్రం చేసే ఒక్కో స్కావెంజర్కు రూ.2,500 నుంచి రూ.3000 చెల్లించేవారు. కరోనాతో 2020 మార్చిలో పాఠశాలలు మూతపడినప్పటి నుంచి స్కూల్ మెయింటనెన్స్ నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో స్కావెంజర్ల సమస్య ఏర్పడింది. రెండేళ్లుగా స్కూల్ మెయింటెనెన్స్ నిధులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కొన్ని స్కూళ్లలో టీచర్లు సొంతంగా డబ్బులు సమకూర్చుకుని స్కావెంజర్లను నియమించుకున్నారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్ధులతో తరగతి గదులు, టాయిలెట్లను శుభ్రం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్కారు బడులు ఇలా ►మహానగర పరిధిలో సుమారు 2497 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 3.67 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ►హైదరాబాద్ జిల్లాలో 691 పాఠశాలల్లో 1,12, 686 మంది విద్యనభ్యసిస్తున్నారు. ►రంగారెడ్డిలో 1301 స్కూళ్లలో 165,856 మంది విద్యార్థులు చదువు తున్నారు. ►మేడ్చల్లోని 505 బడుల్లో 90,358 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. సరూర్నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్లు, స్కావెంజర్లు లేకపోవడంతో విద్యార్థినులతో తరగతి గదులు, టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచి్చంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సదరు ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. తరగతి గదులు శుభ్రం చేస్తే తప్పేంటని, ఇష్టం లేకుంటే స్కూల్ నుంచి టీసీ తీసుకెళ్లండని ఆయన దురుసుగా సమాధానం ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. నగరంలో సుమారు 40 శాతం పైగా స్కూళ్లల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైరల్ వీడియో : నాలుగో అంతస్తులో నిలబడి కిటికీ అద్దాలు శుభ్రం చేస్తూ..!
-
Video: కిటికీ అద్దాలు తుడిచేందుకు మహిళ సాహసం.. నాలుగో అంతస్తు నుంచి!
ఏ పండుగ, శుభకార్యం అయినా షాపింగ్, ఇంట్లో పనులు, అందంగా రెడీ అవ్వడం ఇవన్నీ ముఖ్యంగా ఉండే విధులు. వీటన్నింటిలో ఇళ్లు శుభ్రం చేసుకోవడం మెయిన్ టాస్క్. ఇంటిని శుభ్రం చేయడంలో ఆడవారిదే అందెవేసిన చేయి. ఇళ్లు తళతళా మెరిసిపోవాలన్న ఉద్ధేశంతో ఓపిక ఉన్నా లేకున్నా వారం రోజుల ముందు నుంచే క్లీన్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు, సహసాలు చేస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ మహిళ ప్రాణాలను లెక్కచేయకుండా ఇళ్లు శుభ్రం చేస్తూ అందరిని ఉలక్కిపడేలా చేసింది. సాధారణంగా అపార్టుమెంట్లలో పై అంతస్తులో ఉండే వాళ్లు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కిటికీ అద్దాలు తుడవాలంటే లోపలి నుంచే తుడవాలి. బయటకు వెళ్లి శుభ్రం చేయడం సాధ్యం కాదు. కానీ ఓ అపార్ట్మెంట్లో నాలుగో అంతస్తులో నివసిస్తున్న మహిళ గోడ బయటవైపు నిలబడి కిటికీ అద్దాలు తుడిచింది. కిటికీ గోడ అంచులపై నిర్లక్ష్యంగా ఉండి ఎలాంటి భయం లేకుండా ఆమె పని ఆమె చకచకా చేసుకుపోయింది. కిటికీ ఊచల్ని మాత్రమే పట్టుకుని అద్దాలు తుడుస్తున్న ఈ వీడియోను చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం. ఎందుకంటే ఏమాత్రం పట్టుజారినా ప్రమాదమే. ఎదురింట్లో ఉన్న వ్యక్తి ఎవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశారు. ‘ఈ దీపావళికి గనుక మహాలక్ష్మి ఆమె ఇంటికి రాకపోతే ఇంక ఎవరి ఇంటికి రాదు’ అనే క్యాప్షన్తో పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘వామ్మో నాకు గుండె ఆగినంత పనైంది. ఇంత రిస్క్ అవసరమా. ఇలాంటి సహసాలు చేయవద్దు) అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. Agar inke ghar Laxmi ji nahi aayi toh kisi ke ghar nahi aayegi Diwali pe pic.twitter.com/SPTtJhAEMO — Sagar (@sagarcasm) October 20, 2022 -
Viral Video: ఖాళీ చేతులతో స్కూల్ టాయిలెట్లు శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ..
భోపాల్: మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ కనిపించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది జరిగి 24 గంటలు గడవకముందే రాష్ట్రంలో ఇలాంటి కోవకే చెందిన మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఈసారి పిల్లలు కాకుండా బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా బాలికల పాఠశాలలో టాయ్లెట్లు శుభ్రం చేస్తూ కనిపించారు. అయితే ఆయన ఎలాంటి బ్రష్ సాయం లేకుండా తన చేతులతో క్లీన్ చేయడం గమనార్హం. ఈ వీడియోను బీజేపీ ఎంపీ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బీజేపీ యువ మోర్చా యూత్ వింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘సేవా పఖ్వాడా) కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న మొదలైన ఈ కార్యక్రమం అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి రోజున ముగించనున్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్లోని రేవా నియోజకవర్గంలోని ఖట్కారి బాలికల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి స్థానిక నియోజకవర్గ ఎంపీ జనార్ధన్ మిశ్రా ముఖ్య అతిథిగా వచ్చారు. తన సందర్శనలో పాఠశాల మరుగుదొడ్లు(టాయిలెట్స్) పరిశుభ్రంగా లేకపోవడాన్ని ఎంపీ గమనించారు. దీంతో ఆయనే స్వయంగా తన చేతులతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మహాత్మాగాంధీ, మోదీ ఇచ్చిన నినాదాన్ని గుర్తు చేశారు. ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఇదేం మొదటిసారి కాదని అన్నారు. पार्टी द्वारा चलाये जा रहे सेवा पखवाड़ा के तहत युवा मोर्चा के द्वारा बालिका विद्यालय खटखरी में वृक्षारोपण कार्यक्रम के उपरांत विद्यालय के शौचालय की सफाई की।@narendramodi @JPNadda @blsanthosh @ChouhanShivraj @vdsharmabjp @HitanandSharma pic.twitter.com/138VDOT0n0 — Janardan Mishra (@Janardan_BJP) September 22, 2022 -
Video Viral: స్కూల్ విద్యార్థులతో టాయిలెట్ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్
లక్నో: ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో ప్రిన్సిపల్ టాయిలెట్లు శుభ్రం చేయిస్తున వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. బలియా జిల్లా పిప్రా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ స్కూల్లోని విద్యార్థులను ప్రిన్సిపల్ వాష్రూమ్లు శుభ్రం చేయాలని ఆదేశించాడు. ప్రిన్సిపల్ పక్కన నిలబడి పిల్లలచేత టాయిలెట్లు కడిగించాడు. అంతేగాక విద్యార్థులకు మరుగుదొడ్డి సరిగ్గా శుభ్రం చేయాలని ఆదేశాలు ఇస్తున్నాడు. సరిగా క్లీన్ చేయకుంటే తాళం వేస్తానని, అప్పుడు అందరూ మల విసర్జన కోసం ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని బెదిరించాడు. ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. Primary School Students Made To Clean Toilet by Principle in Ballia, Uttar Pradesh. The incident was reported from Pipra Kala Primary School of Sohav Block in Ballia. pic.twitter.com/oYaqqBhFJA — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) September 8, 2022 ఇందులో కొందరు విద్యార్థులు టాయిలెట్ను శుభ్రం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్గా మారింది. అదికాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు విధ్యాశాఖ అధికారి అఖిలేష్ కుమార్ ఝా తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: పగ తీర్చుకున్నాడు.. కాటేసిన పామును కసితీరా కొరికి -
బట్టలే కాదు, చేతి వేళ్లను శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ ఉందని మీకు తెలుసా!
సాయంత్రం చిరుతిళ్లు చాలామందికి అలవాటే! పకోడీలు, చిప్స్ వంటివి పంటి కింద కరకరలాడిస్తూ కబుర్లాడుకోవడం చాలామందికి ఇష్టమైన కాలక్షేపం. నూనెలో వేయించిన చిరుతిళ్లు తినేటప్పుడు మధ్యలో అదే చేత్తో మరో వస్తువు అందుకోవాలంటే, చెయ్యి కడుక్కోవడమో లేదా కనీసం టిష్యూపేపర్తో తుడుచుకోవడమో తప్పదు. పదే పదే చేతులు తుడుచుకోవాల్సిన పరిస్థితులు కొంత చిరాకు కలిగిస్తాయి. అంతేకాదు, టిష్యూపేపర్ వృథాకు దారితీస్తాయి. ఈ ఇబ్బందిని అరికట్టడానికే అంతర్జాతీయ చిప్స్ తయారీ సంస్థ ‘లేస్’ ఒక సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. ఈ బుల్లి పరికరంలో అరచెయ్యంతా పట్టదు గాని, వేళ్లు ఇంచక్కా పట్టేస్తాయి. దీని ఎత్తు 15 సెం.మీ., వెడల్పు 11 సెం.మీ. ఇందులో వేళ్లు పెడితే చాలు, ఇట్టే శుభ్రమైపోతాయి. ఇందులో వేళ్లు పెట్టగానే, దీని పైభాగంలోని సెన్సర్లు గుర్తించి, ఇందులోని సిలిండర్ నుంచి ఆల్కహాల్ను స్ప్రే చేస్తాయి. ఇందులోని వేడిమి వల్ల క్షణాల్లోనే వేళ్లు పొడిగా శుభ్రంగా తయారవుతాయి. యూఎస్బీ పోర్ట్ ద్వారా దీనిని చార్జింగ్ చేసుకుని ఇంచక్కా వాడుకోవచ్చు. వాడకాన్ని బట్టి పైభాగంలోని సిలిండర్ లో ఆల్కహాల్ను ఎప్పటి కప్పుడు రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది ఎంత ముచ్చటగా ఉన్నా, మార్కెట్లో దీనిని కొనుక్కోవాలంటే కష్టమే! ‘లేస్’ సంస్థ ఇప్పటి వరకు ఈ పరికరాలను ఐదింటిని మాత్రమే తయారు చేసింది. -
విషాదం.. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు దిగి ముగ్గురు మృతి
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూ వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్లో డ్రైనేజిలోకి దిగిన ముగ్గురు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. డ్రైనేజీ బాగు చేసేందుకు లోపలికి వెళ్లిన వీరు ఊపిరాడక మరణించారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు. మరొకరు బిల్డింగ్ యజమాని కొండలరావు. చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం! -
విషాదం: నీటి ట్యాంకు శుభ్రం చేయబోయి.. పైపులో జారిపడ్డ కార్మికుడు
ఖమ్మం మయూరిసెంటర్: భారీ మంచినీటి ట్యాంకును శుభ్రం చేసే యత్నంలో ఓ కార్మికుడు నీటిపైపు లో జారి పడి ప్రాణాలు పోగొట్టుకు న్నాడు. మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. రోజువారీ కార్మికుడితో..: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని వాటర్ ట్యాంకులను అనుభవం కలిగిన పారిశుధ్య కార్మికులతో పదిహేను రోజులకోసారి శుభ్రం చేయిస్తారు. కార్మికులు తక్కువగా ఉండటంతో మంగళవారం రోజువారీ వేతన కార్మికుడు చిర్రా సందీప్(23)కు పని అప్పగించారు. ఉదయం సందీప్ మరో ఇద్దరితో కలిసి నయాబజార్ కళాశాల పక్కన ఉన్న వాటర్ట్యాంక్ ఎక్కాడు. ట్యాంక్ లోపలికి దిగి శుభ్రం చేస్తున్న సందీప్ ప్రమాదవశాత్తు పైపులో జారిపడ్డాడు. మిగతా ఇద్దరు కార్మికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కేఎంసీ రెస్క్యూ టీం వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సందీప్ జారిపడిన పైపు దిగువన తెరిచి చూడగా అతను కనిపించలేదు. కొంచెం దూరంలో జేసీబీతో మట్టిని తొలగించి పైపును పగులగొట్టడంతో సందీప్ కాళ్లు కనిపించాయి. చదవండి👉🏼 ట్యాంక్బండ్పై నో పార్కింగ్.. బండి పెట్టారో.. రూ.1000 కట్టాలి! మృతదేహాన్ని బయటికి తీసేసరికి సాయంత్రం 5.20 గంటలు దాటింది. కాగా, నైపుణ్యం లేని కార్మికులతో పనిచేయించడంతో సందీప్ చనిపోయా డంటూ కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి రూ.6 లక్షల పరిహారం, ఇంటి స్థలం, కుటుం బంలో ఒకరికి కేఎంసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని పోలీసులు, రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. చదవండి👉🏻 మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’ -
రోబో వాక్యూమ్ క్లీనర్ ఇంట్లో ఉంటేనా.. అండర్ వాటర్ ట్యాంక్లో నలకలు మాయం!
భారీ నీటి తొట్టెలు, ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి శుభ్రం చేయడం ఆషామాషీ పని కాదు. ఎంతగా శుభ్రం చేశామనుకున్నా, సూక్ష్మాతి సూక్ష్మమైన నలకలు, నాచు మొలకలు ఎక్కడో చోట ఇంకా మిగిలే ఉంటాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న అండర్ వాటర్ రోబో వాక్యూమ్ క్లీనర్ గనుక ఉంటే, వీటిని శుభ్రం చేయడం చాలా తేలిక. ఇది నీటి అట్టడుగు వరకు ప్రయాణించగలదు. మూల మూలల్లోని చెత్తను, 180 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైన నలకలను కూడా ఇట్టే ఒడిసి పట్టుకుని, తిరిగి నీట్లోకి చేరకుండా చూస్తుంది. ‘ఎయిపర్ సీగల్–3000’ పేరుతో జపాన్కు చెందిన ఎయిపర్ ఇంటెలిజెంట్ కంపెనీ రూపొందించిన ఈ అండర్ వాటర్ రోబో వాక్యూమ్ క్లీనర్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. -
విశాఖ బీచ్ క్లీనింగ్ చేపట్టిన ప్రజా ప్రతినిధులు, అధికారులు
-
మురికి కాల్వలో దూకిన కౌన్సిలర్.. వెంటనే పాలాభిషేకం.. ఎందుకో తెలుసా..?
సాక్షి, న్యూఢిల్లీ: సింహాద్రి సినిమాలో సింగమలై అంటూ విలన్లను ఊచకోత కోస్తాడు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఎన్టీఆర్కు పాలాభిషేకం చేస్తారు. ఇదే తరహాలో ఓ కౌన్సిలర్ చేసిన పనికి ప్రజలు ఫిదా అయిపోయి ఆయనకు పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఎవరా కౌన్సిలర్.. ఎందుకిలా చేశారు అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలో మున్సిపల్ కార్మికులు మురికి కాలువను శుభ్రం చేయడంలేదని ఆ ప్రాంత కౌన్సిలర్కు వినతి పత్రాలు అందాయి. దీంతో అక్కడికి చేరుకున్న ఆప్ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్.. శాస్త్రి పార్క్లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. అనంతరం కాలువలోని చెత్తను తొలగించారు. AAP councilor Haseeb-ul-Hasan jumps in drain during mission clean up, then milk bath much in the style of actor Anil Kapoor in the Bollywood blockbuster “Nayak”. Watch the #ViralVideo. (Video by @PankajJainClick) #AAP #Drain #MilkBath pic.twitter.com/bkBAi5PyEB — IndiaToday (@IndiaToday) March 22, 2022 ఈ సందర్భంగానే ఆ కాలువను అక్కడి అధికారులు శుభ్రం చేయడం లేదని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానని హసీబ్ చెప్పడం గమనార్హం. కాలువలోని చెత్తను తొలగించిన అనంతరం ఆ ప్రాంతంలోని ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయనను కూర్చోబెట్టి పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెటిజన్ స్పందిస్తూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల స్టంట్లు మొదలయ్యాయంటూ కామెంట్స్ చేశాడు. -
ఏడాది చివరకు కాలుష్యరహిత యమున
న్యూఢిల్లీ: రాబోయే డిసెంబర్ చివరకు యమునా నదిలోకి ఎలాంటి మురికి నీరు చేరదని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ చెప్పారు. నదిలోకి దారితీసే అన్ని మురుగుకాల్వలను అప్పటికల్లా మూసివేస్తారన్నారు. 1,300కిలోమీటర్ల పొడవున ప్రవహించే యమునా నది దేశంలోని అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నది నుంచి దేశరాజధానికి మంచినీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీలో నది 22 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. కానీ నదిలోని 98 శాతం కలుషితమంతా ఇక్కడనుంచే వస్తోంది. నదిలోకి మురుగునీరు వదిలే 18 డ్రెయిన్స్ ఉన్నాయని, వీటిని మూసివేసి, మురుగునీటిని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మళ్లించే పనులు చేపడతామని అశోక్ చెప్పారు. ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని నదిలోకి వదులుతారని, దీంతో నదిలో పరిశుభ్రమైన నీరు మాత్రమే ప్రవహిస్తుందని వివరించారు. యమునా నదిని శుభ్రపరిచేందుకు ఎన్జీయోధా(నమామి గంగే యమునా ఆఫ్ ఢిల్లీ ఏరియా)ను ప్రారంభిస్తామన్నారు. -
Hyderabad: స్వచ్ఛ సాగర్గా హుస్సేన్సాగర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్సాగర్ను స్వచ్ఛ సాగర్గా మార్చేందుకు మార్చి నెల నుంచి మహానగరాభివృద్ధి సంస్థ, పీసీబీ సూచనలతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించనుంది. ఏటా వేసవిలో ప్రధానంగా నాచు, నైట్రోజన్, పాస్పరస్లు భారీగా పెరిగి జలాల నుంచి దుర్గంధం పెద్ద ఎత్తున వెలువడుతుండడంతో స్థానికులు, వాహనదారులు, పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణమైన నాచు (ఆల్గే) ఉద్ధృతిని తగ్గించేందుకు జలాల్లో పర్యావరణహిత ఏరోబిక్ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా బయోరెమిడియేషన్ ప్రక్రియను నిర్వహించనుంది. ఇందుకోసం ఇటీవలే అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. గతంలో కెనడాకు చెందిన ఓ సంస్థ ఈ ప్రక్రియ చేపట్టడంతో సత్ఫలితాలు సాధించిన నేపథ్యంలో తాజాగా మరోసారి బయో రెమిడియేషన్కు సిద్ధమవుతుండడం గమనార్హం. మార్చి నుంచి జూన్ వరకు.. ►వచ్చే నెల నుంచి వర్షాలు కురిసే జూన్ వరకు ఈ ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా 4.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హుస్సేన్సాగర్ క్యాచ్మెంట్ పరిధి సుమారు 240 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఈ జలాశయంలోకి నాలుగు నాలాల నుంచి నీరు వచ్చి చేరుతోంది. ►ప్రధానంగా కూకట్పల్లి నాలాలో ప్రవహించే 400 మిలియన్ లీటర్ల రసాయనిక వ్యర్థ జలాలు సాగర్కు శాపంగా పరిణమించాయి. ఈ నీరు సాగర్లోకి చేరకుండా గతంలో డైవర్షన్ మెయిన్ ఏర్పాటు చేసినప్పటికీ.. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ బల్క్డ్రగ్, ఫార్మా, రసాయనిక పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థజలాలు కూకట్పల్లి నాలా ద్వారా సింహభాగం సాగర్లో చేరుతున్నాయి. ►దీంతో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ల మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి కారణంగా ఏటా వేసవిలో నీరు ఆకుపచ్చగా మారి దుర్గంధం వెలువడుతోంది. బయో రెమిడియేషన్తో సాగర జలాల్లో కరిగిన ఆక్సిజన్ మోతాదును ప్రతి లీటరుకు 4 మిల్లీ గ్రాములు, బీఓడీని 36 మిల్లీగ్రాముల మోతాదు ఉండేలా చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో జలాల్లో వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడ సాధ్యపడుతుందని చెబుతున్నారు. చదవండి: (ప్రయోగాత్మకంగా డీజిల్ బస్సు ఎలక్ట్రిక్గా మార్పు! ఇక నుంచి) అడుగున ఉన్న వ్యర్థాల శుద్ది ఎప్పుడో? సుమారు నాలుగు దశాబ్దాల పాటు పారిశ్రామిక వ్యర్థ జలాల చేరికతో సాగర గర్భంలో రసాయనిక వ్యర్థాలు టన్నుల మేర అట్టడుగున పేరుకుపోయాయి. ఈ వ్యర్థాలను ఇజ్రాయెల్,జర్మనీ దేశాల్లో ఉన్న సాంకేతికత ఆధారంగా తొలగించి.. ఈ వ్యర్థాలను మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ ఆనకట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా మిషన్ హుస్సేన్సాగర్కు రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ స్వచ్ఛ సాగర్ ఇప్పటికీ సాకారం కాలేదనే ఆరోపణలు వస్తుండటం గమనార్హం. -
సింపుల్ క్లీనింగ్ టిప్స్: జిడ్డు మరకలా? ద్రాక్ష, నిమ్మకాయ, ఇంకా బ్రెడ్తో..
సింక్, బాత్ టబ్లకు అంటుకున్న మొండి, జిడ్డు మరకలను తొలగించడానికి ద్రాక్ష పండు, నిమ్మకాయ, వెనిగర్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ► ద్రాక్షపండును సగానికి ముక్కలు కోయాలి. బాత్టబ్ లేదా సింక్పై ఉప్పు చల్లాలి. వాటి మీద ద్రాక్ష పండు సగం ముక్కతో రుద్దాలి. తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ► వెనిగర్ను సింక్ టాప్, బాత్ టబ్లపై చల్లి, గంట సేపు వదిలి, తర్వాత సోప్వాటర్ని ఉపయోగించి కడిగితే బాగా శ్రుభపడతాయి. ► కాఫీ ఫిల్టర్ శుభ్రపడాలంటే అందులో బ్లాటింగ్ పేపర్ని చిన్న చిన్న ఉండలుగా చేసి వేయాలి. అటూ ఇటూ పదే పదే తిప్పాలి. (చదవండి: Health Tips: పాలమీగడలో ఏలకులను కలుపుకుని చప్పరిస్తే..) ► గోడలపైన వేలి ముద్రల మరకలు నూనె జిడ్డుగా కనిపిస్తుంటాయి. వీటిని వదిలించడానికి బ్రెడ్ స్లైస్ను తీసుకొని, మరకలపైన రబ్ చేసి, తుడవాలి. దీంతో నూనె మరకలు తగ్గిపోతాయి. అదే బ్రెడ్తో పగిలిన గ్లాసు ముక్కలను తీయడానికి కూడా ఉపయోగించవచ్చు. ► స్టౌ పై జిడ్డు మరకలు సాధారణంగా అవుతుంటాయి. నిమ్మరసం రాసి, బ్రెడ్ లేదా స్పాంజితో తుడవాలి. (చదవండి: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా) -
గచ్చిబౌలిలో విషాదం: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక..
సాక్షి, హైదరాబాద్: సెప్టిక్ట్యాంక్ను శుభ్రపరిచేందుకు లోపలికి దిగిన ఇద్దరు కార్మికులు మృతువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటన కొండాపూర్లోని గౌతమి ఎన్క్లేవ్లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లో ఆదివారం జరిగింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జి.సురేష్, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు.. కొండాపూర్ గౌతమి ఎన్క్లేవ్లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లోని సెప్టిక్ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్రైవేటు సెప్టిక్ ట్యాంకర్కు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంకర్ డ్రైవర్, యజమాని అయిన స్వామి, హెల్పర్ జాన్ కలిసి క్లీనింగ్ చేయడానికి ఒప్పుకొన్నారు. చంపాపేట్ సింగరేణి కాలనీ ఆదర్శనగర్కు చెందిన శ్రీనివాస్ (38) అలియాస్ శ్రీను, ఈ ప్రాంతానికే చెందిన ఆంజనేయులు (25)ను సెíప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే పనులకు రావాలని చెప్పారు. వీరిద్దరూ సరే అనడంతో ఆదివారం ఉదయం 8 గంటలకు గౌతమి ఎన్క్లేవ్లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్కు ట్యాంకర్తో పాటు చేరుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ మూతలు తీసి పైపులతో కొంత నీటిని తొలగించారు. భద్రత చర్యలు నిల్.. సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేయాలంటే ముందుగా భద్రత చర్యలు చేపట్టాలి. కానీ.. హేమదుర్గా అపార్ట్మెంట్లో లోపలికి దిగిన ఆంజనేయులు, శ్రీనివా స్ ముఖానికి మాస్కులతో కూడిన యంత్రాలు వాడకపోవడం, అంతకుముందే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ను వాడకపోవడం, మూత తెరిచి కనీసం అందులోని విషవాయువులు బయటకు వెళ్లి పోయేంత వరకు వేచి ఉండక పోవడంతోనే ఇద్దరు మృత్యువాత పడినట్లు భావిస్తున్నారు. సెప్టిక్ ట్యాంకర్ జీహెచ్ఎంసీలో రిజిస్టర్ చేసుకున్నా వారి ద్వారా వచ్చిన కాల్ కాకుండా ప్రైవేటుగా వచ్చిన కాల్తోనే వారు వచ్చి శుభ్రం చేసే పనులను చేపట్టినట్లు తెలుస్తోంది. మిన్నంటిన రోదనలు.. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. శ్రీనివాస్, ఆంజనేయులు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మంజు తండా. కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి ఆటో నడపడంతో పాటు ఇతర కూలిపనులు చేస్తున్నాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆంజనేయులుది నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట్లోని అక్కారం గ్రామం. భార్య పద్మ, అయిదేళ్ల కుమారుడు ఉన్నారు. సెప్టిక్ ట్యాంక్ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఊపిరి ఆడకపోవడంతోనే.. శుభ్రపరిచేందుకు శ్రీనివాస్, ఆంజనేయులు సెప్టిక్ ట్యాంక్ లోపలికి దిగారు. అరగంట అయినా ఎలాంటి ఉలుకూ పలుకూ లేకపోవడంతో స్వామి, జాన్ కూడా లోపలికి దిగారు. ఇది గమనించిన వాచ్మన్ మరికొందరితో కలిసి స్వామిని, జాన్ను బయటికి లాగారు. వారు ఊపిరి తీయడం తీవ్ర ఇబ్బందిగా ఉండటంతో కొండాపూర్లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సెప్టిక్ట్యాంక్ లోపలే ఊపిరి ఆడక బయటకు రాలేకపోయిన శ్రీనివాస్, ఆంజనేయులును అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెలికితీశారు. అప్పటికే వారిద్దరూ మృత్యువాత పడినట్లు గుర్తించారు. చదవండి: ఎన్టీఆర్ పార్కు ముందు బీభత్సం.. హుస్సేన్ సాగర్లోకి దూసుకెళ్లిన కారు -
టాయిలెట్స్ ఎవరు కడగాలి?
World Toilet Day 2021: ఇది భలే సహజ విషయం. స్త్రీలకు సహజంగా కేటాయించబడిన విషయం. పిల్లలు పుడితే వారి టాయిలెట్ను శుభ్రం చేయడం స్త్రీల పని. ఇంట్లో బాత్రూమ్లను క్లీన్ చేయడం స్త్రీల పని. వయసు మీరిన వారు లావెటరీ వరకు వెళ్లలేకపోతే కూతురు, కోడలు లేదా పనిమనిషి మొత్తానికి స్త్రీలే వాటిని ఎత్తి పోసే పని. టాయిలెట్స్ కట్టే వరకు స్త్రీలు ఒక అవస్థ పడ్డారు. కట్టాక చీపుళ్లు పట్టుకు నిలబడుతున్నారు. పురుషులకు రెండు చేతులు ఉన్నాయి. వారు ఎందుకు ఈ పని షేర్ చేసుకోరు? ఈ పని స్త్రీలు మాత్రమే ఎందుకు చేయాలి? ఎంతకాలం చేయాలి? మొత్తం మీద పని మనుషులు తమ ఆత్మగౌరవాన్ని చాటుకుంటున్నారు. ఇంటి పని ఒప్పుకునే ముందు ‘టాయిలెట్లు తప్ప’ అని చెబుతున్నారు. ఒకప్పుడు ఇంటి పనిలో టాయిలెట్లు శుభ్రం చేయడం కూడా ఉండేది. కాని ఇప్పుడు పని మనుషులు ఒప్పుకోవడం లేదు. అంట్లు, బట్టలు, ఇల్లు ఓకే. టాయిలెట్లు? ఎవరికి వారు శుభ్రం చేసుకోవడం కదా సంస్కారం. అయితే అది దాదాపు అన్ని ఇళ్లల్లో స్త్రీ సంస్కారం మాత్రమే. పురుషుడిది కాదు. గాంధీజీ ఏ విషయానికైనా గొప్పవారే. ఆయన తానే ఒక పార పట్టుకుని బహిర్భూమికి వెళ్లేవారు. వచ్చే ముందు పారతో మట్టిపోసి వచ్చేవారు. విసర్జనం ఒక నిత్యకృత్యం. శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు అందుకై వాడే స్థలం కూడా ఎవరికి వారు శుభ్రం చేయాలి. కాని పురుషుడై ఉంటే అందునా భర్త అయితే ఈ చోటు శుభ్రం చేసే పని భార్యదిగా ఉంటుంది. భార్యది మాత్రమే ఎందుకు? తరతరాల ఇబ్బంది భారతదేశంలో రోజు వారీ తప్పని ఈ అవసరానికి స్త్రీలను తరాలుగా ఇబ్బంది పెట్టారు. టాయిలెట్లు కట్టక, స్తోమత ఉన్నా మూఢత్వం కొద్దీ కట్టక, వారి మర్యాదను పట్టించుకోక ఇబ్బంది పెట్టారు. స్త్రీలు బహిర్భూమికి సిగ్గుతో చితుకుతూ ఊరికి దూరంగా వెళ్లాల్సి రావడం ఒక అంశమైతే రాత్రి పొద్దుపోయాక లేదా తెల్లవారుజామున తుప్పల్లోకో పొదల్లోకో వెళ్లి ప్రమాదాల్లో పడ్డారు. దాడులకు గురయ్యారు. తొంగి చూసే ఆకతాయిల వల్ల అవమానాలు పడ్డారు. ‘స్వచ్ఛభారత్’ వల్ల గాని, దానికి ముందు ప్రభుత్వాలు చేసే ప్రచారం వల్లగాని ఈ సమస్య ఒక కొలిక్కి వస్తున్నా ఇంకా టాయిలెట్లు లేని ఇళ్లు, టాయిలెట్లకు నోచుకోని పేదజనం ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ టాయిలెట్ డే’ నిర్వహించేది ప్రతి మనిషి శుభ్రత కలిగిన, మరుగు కలిగిన ప్రదేశంలో గౌరవం చెడకుండా కాలకృత్యాలు తీర్చుకునే హక్కు కలిగి ఉన్నాడని చెప్పేందుకే. సరే... టాయిలెట్లు వచ్చాయి. వాటిని కడగడం ఎవరి వంతు? నీటి సమస్య... శుభ్రత సమస్య టాయిలెట్లు కడగడం అంటే ఆ కొద్దిపాటి స్థలం కడగడం మాత్రమే కాదు. అందుకు నీళ్లు కావాలి. ఈ దేశంలో 90 శాతం ఇళ్లలో నీళ్లు పట్టాల్సిన, మోయాల్సిన, పొదుపు చేయాల్సిన బాధ్యత స్త్రీలది. నలుగురు కుటుంబ సభ్యులు కాలకృత్యాల కోసం రోజులో ఐదారుసార్లు టాయిలెట్లను వాడితే ప్రతిసారీ నీరు ఖర్చవుతుంది. ఆ నీరు మోసే పని భారం స్త్రీ మీద పడుతుంది. తమ టాయిలెట్ అవసరాలకు నీరు మోసుకోవాలని పిల్లలకు నేర్పాల్సి ఉంటుంది. భర్త తానే పట్టి తెచ్చి ఉదాహరణగా నిలవాల్సి ఉంటుంది. ఈ రెండూ జరగడం మృగ్యం. ఇంకా సమస్య ఏమిటంటే ‘టాయిలెట్ ఎటికెట్’ను పాటించకపోవడం. టాయిలెట్ వాడి చేతులూపుకుంటూ వచ్చేస్తే ‘నీళ్లు కొట్టండ్రా’ అని స్త్రీలు వారి వెనుక వెళ్లి ప్రతిసారీ నీళ్లు కొట్టాలి. నీళ్లు మోయాలి.. నీళ్లు కొట్టాలి... అన్నిసార్లు టాయిలెట్ను చూడాల్సి రావడం ఎవరికైనా వికారంగానే ఉంటుంది. స్త్రీలకు ఆ వికారం ఎందుకు? ఈ శ్రమ ఎవరిది? ఇంట్లో వయసు మీరిన వారుంటే వారు జబ్బున పడితే స్త్రీల పైప్రాణాలు పైనే పోతాయి. దానికి కారణం వారి టాయిలెట్ అవసరాలు చూడాల్సి రావడమే. ఈ సమస్యను పురుషులు సరిగా అడ్రస్ చేయకపోవడం వల్ల కుటుంబ నిర్మాణంలో అనేక అంతరాలు, అవాంతరాలు వస్తున్నాయి. వయసు మీరిన అత్తగారిని, మావగారిని ఇంట్లో ఉంచుకోవడానికి ‘కొందరు కోడళ్లు’ సుముఖంగా లేరు అని అనడం వింటూ ఉంటే ‘ఆ పెద్దల సేవను ఎవరు చేయాలి?’ అనే ప్రశ్నకు సమాధానం పురుషుడు చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక కారణాల రీత్యా ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టే వీలు లేదు. ఈ సేవకు పురుషుడు సిద్ధ పడడు. మరి స్త్రీనేగా చేయాలి. చేయడానికి ఆమె నిరాకరించదు, పురుషుడు కనుక ఆ పనిలో భాగం పంచుకుంటే. ఈ పనిని, సేవను గొప్పగా చేసిన పురుషులు ఉన్నారు. కాని వారి శాతం స్వల్పం. ఒకరిపై ఆధారపడేలా టాయిలెట్ అవసరాలు తీర్చుకునే పెద్దవారు ఉంటే పురుషుడు అప్రమత్తం కావాలి. స్త్రీతో చర్చించాలి. ఆ శ్రమను సరిగా విభజన చేయాలి. సెంటిమెంట్లు, బాధ్యతలు ఏ పనిలో అయినా సరే కాని ఈ పనిలో కాదు. ఫినాయిల్, బ్రష్ పట్టండి ఇల్లు శుభ్రంగా ఉండటం ఎంత ముఖ్యమో టాయిలెట్ శుభ్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. సబ్బు వాసనలు వచ్చే టాయిలెట్లో వెళ్లడానికి ఇష్టపడతారు ఎవరైనా చెడు వాసనలు వచ్చే టాయిలెట్ కంటే. కనుక పురుషులు తమకు సమయం చిక్కినప్పుడు నెలకు ఇన్నిసార్లు అని టాయిలెట్ను తప్పక శుభ్రం చేయాలి. ఇంట్లో ఉన్న మగపిల్లల చేత చేయించాలి. ఫినాయిల్ వాడటం, బ్రష్ పట్టుకుని కమోడ్లను తోమడం కూడా నేర్చుకోవాలి. నీటి సమస్య ఉన్న ప్రాంతాలైతే మరింత బాధ్యతగా వ్యవహరించాలి. టాయిలెట్లు కూడా క్లీన్ చేయలేవా అని గీరగా భార్య వైపు చూసే భర్తలు ఒకసారి బాత్రూమ్లో చీపురు, నీళ్లు పట్టుకుని అడుగుపెట్టండి. ప్లీజ్. ఈ పనిని, సేవను గొప్పగా చేసిన పురుషులు ఉన్నారు. కాని వారి శాతం స్వల్పం. ఒకరిపై ఆధారపడేలా టాయిలెట్ అవసరాలు తీర్చుకునే పెద్దవారు ఉంటే పురుషుడు అప్రమత్తం కావాలి. స్త్రీతో చర్చించాలి. ఆ శ్రమను సరిగా విభజన చేయాలి. సెంటిమెంట్లు, బాధ్యతలు ఏ పనిలో అయినా సరే కాని ఈ పనిలో కాదు. -
ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్హోల్
దొడ్డబళ్లాపురం: సురక్షిత పరికరాలు లేకుండా భూగర్భ డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన రామనగర పట్టణంలో చోటుచేసుకుంది. హరీష్ అనే కాంట్రాక్టర్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్వహణను చూస్తుంటాడు. పట్టణ పరిధిలోని న్యూ నేతాజీ స్కూల్ వెనుక డ్రెనేజీలో సమస్య ఏర్పడింది. దీంతో మంజునాథ్ అనే వ్యక్తి ఇద్దరు కార్మి కులు, రాకేశ్లను బెంగళూరు నుంచి పిలిపించారు. శుక్రవారం మధ్యాహ్నం మ్యాన్హోల్లో దిగి పనులు చేస్తుండగా ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. అగి్నమాపక సిబ్బంది, రామనగర పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తాళ్లతో బాధితులను బయటకు తీసి రామనగర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రెండు కుటుంబాల్లో కన్నీళ్లు నింపిన బావి
జయపురం: బావి శుభ్రం చేసే క్రమంలో ఊపిరాడక ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా.. మరో వ్యక్తి అస్వస్థతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి హటబరండి పంచాయతీ సోనారపార గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు సోనారపారకు చెందిన రాజు కెవుట తన బావిని శుభ్రం చేసేందుకు గ్రామానికి చెందిన హేమరాజు హలదను పిలిచాడు. హేమారాజ్ నూతిలో దిగి పని ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత బావిలో నుంచి ఎటువంటి శబ్ధం రాకపోవడంతో హేమరాజ్కు ఏమైందో అని ఆందోళనతో అతన్ని కాపాడేందుకు రాజు కెవుట బావిలో దిగాడు. అతడు కూడా బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. వారిని కాపాడేందుకు అనూప్ కెవుట అనే మరో వ్యక్తి బావిలో దిగాడు. బావిలో శ్వాస ఆడక ముగ్గురూ సృహతప్పి పడిపోయారు. స్థానికులు కుందైయ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, రాయిఘర్ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ముగ్గురినీ బయటకు తీశారు. అయితే అప్పటికే హేమరాజ్, అనూప్ మృతి చెందగా, రాజు కెవుట ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. అతడిని వెంటనే హటబరండి పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. కుందైయ్ పోలీస్ స్టేషన్ అధికారి ఫకీర్మోహన ఖొర కేసు నమోదు చేసి మృతదేహాను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాయిఘర్ అదనపు తహసీల్దార్ జగు పూజారి, కుంధ్ర బీడీఓ దేవేంద్ర ప్రసాద్ ధల్ సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజు కెవుట ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. చదవండి: కూతురి ప్రేమపెళ్లి.. పరువు కోసం తల్లిదండ్రులు -
సిద్దిపేట జిల్లాలో విద్యార్థినులతో టాయిలెట్స్ క్లీనింగ్
-
విద్యార్థినులతో టాయిలెట్స్ క్లీనింగ్
సాక్షి, దుబ్బాక(సిద్దిపేట): చీపుర్లు పట్టి టాయ్లెట్స్ శుభ్రం చేస్తున్న వీరంతా సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపురం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు. ఈ పాఠశాలలో 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు 560 మంది విద్యార్థినులున్నారు. హౌస్ కీపింగ్, ఇతర పనులకు విద్యార్థినులను పురమాయించడం రివాజుగా మారింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఇటీవల విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం చేయించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చదవండి: ఉన్నత చదువు చదివి ఇంత పనిచేశాడా! బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు.. -
చాక్పీసు పట్టాల్సిన చేతుల్లో చీపుర్లు
ఇది జెడ్పీహెచ్ఎస్ దేవన్పల్లి స్కూల్. 378 మంది విద్యార్థులు, 15 మంది టీచర్లు ఈ స్కూళ్లో ఉన్నారు. ఇక్కడ వరండా శుభ్రం చేస్తున్నది స్కూల్ టీచర్ శ్రీనివాస్. స్కావెంజర్ను విద్యాశాఖ నియమించకపోవడం, స్థానిక సంస్థలే పారిశుద్ధ్య పనులు చేస్తాయని ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడం, అడిగితే స్థానిక సంస్థలు పట్టించుకోకపోవడం వంటి కారణాలతో టీచర్లు, హెడ్మాస్టర్లే స్కూళ్లను శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. చాక్పీసులు పట్టి బోధించాల్సిన చేతులతోనే చీపుర్లు పట్టుకొని ఊడ్చుకోవాల్సి వస్తోంది. టీచర్లే వరండాలు, స్టాఫ్ రూమ్లను శుభ్రం చేసుకోవడమే కాదు, చివరకు టాయిలెట్లు కూడా వారే కడగాల్సిన పరిస్థితి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొంది. సాక్షి, హైదరాబాద్: ఇది ఆ ఒక్క స్కూల్లోనే కాదు.. రాష్ట్రంలోని 24,311 జిల్లా పరిషత్ పాఠశాలలు, 1,751 ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది. గత నెల 27వ తేదీ నుంచి టీచర్లంతా స్కూళ్లకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ పాఠశాలలను శుభ్రం చేయించే పనిని స్థానిక సంస్థలకు వదిలేసింది. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ఓ లేఖ రాసి కూర్చుంది. మరోవైపు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. మండల స్థాయిలోని ఎంఈవోలు స్థానికంగా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో సమన్వయం చేసుకొని పాఠశాలలను శుభ్రం చేయించుకోవాలని సూచించింది. అయితే క్షేత్ర స్థాయిలో ఆయా శాఖలు విద్యాశాఖ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అడిగినా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు స్పందించకపోవడం, విద్యాశాఖ స్కావెంజర్ల నియామకాలకు చర్యలు చేపట్టకపోవడంతో టీచర్లు, ప్రధానోపాధ్యాయులే పారిశుద్ధ్య పనులను చేసుకోవాల్సి వస్తోంది. గత విద్యా సంవత్సరంలో నిధులు ఇచ్చినా.. పాఠశాలలు ఊడ్చేందుకు, టాయిలెట్స్ శుభ్రం చేసేందుకు పారిశుధ్య కార్మికులను (స్కావెంజర్స్) నియమించుకునేందుకు గత విద్యా సంవత్సరంలో(2019–20) విద్యాశాఖ నిధులను ఇచ్చింది. కరోనా కారణంగా లాక్డౌన్తో గత మార్చి నెల నుంచి పాఠశాలలు బంద్ అయ్యాయి. దీంతో జూన్లో ప్రారంభం కావాల్సిన(2020–21) కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ 1నుంచి డిజిటల్ (వీడియో పాఠాలు) పాఠాల బోధనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టీచర్లంతా స్కూళ్లకు రావాలని ఆదేశాలు జారీ చేయడంతో టీచర్లంతా వచ్చారు. స్కావెంజర్లను నియమించుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో స్కూళ్లను, స్టాఫ్ రూమ్లను వారే శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది. అయితే అన్లాక్ నిబంధనల ప్రకారం ఈనెల 21వ తేదీ నుంచి 50 శాతం టీచర్లు స్కూళ్లకు వచ్చేలా చర్యలు చేపట్టింది. అయితే పాఠశాలలను శుభ్రం చేసే స్కావెంజర్లను నియమించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేయలేదు. దీంతో మళ్లీ టీచర్లే స్టాఫ్ రూమ్లు, వరండాలు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా మున్సిపల్ అధికారులను, గ్రామ పంచాయతీని సంప్రదించినా వారు ఇప్పటికీ స్పందించలేదని, మళ్లీ తామే ఆ పనులను చేసుకోవాల్సి వస్తుందని టీచర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యాశాఖనే స్కావెంజర్ల నియామకానికి నిధులను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు, మాజీ నేతలు రఘునందన్, వేణుగోపాల్, నావత్ సురేష్, మహిపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
మహిళ ఫిర్యాదు, మరుగుదొడ్లు కడిగిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ గ్వాలియర్లోని కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తరువాత మరుగుదొడ్లు శుభ్రపరిచే సామాన్లలను అందించాలని కోరిన ఆయన స్వయంగా పౌర రక్షణా సిబ్బందితో కలిసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయడంలేదని కమిషనర్ కార్యాలయంలోని ఒక మహిళ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘మరుగుదొడ్లు అందరికి ముఖ్యం. టాయ్లెట్లు సరిగా లేనందువల్ల మహిళలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, ఉపయోగపడేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. తోమర్ మార్చి నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. చదవండి: పీపీఈ సూట్తో ఓటు.. మరో ఎమ్మెల్యేకు కరోనా -
వెంకీ మామ ఇంటి పని అదిరింది
-
విజయనగరంలో ఎర్ర చెరువు శుద్ధి కార్యక్రమం
-
ఏళ్లుగా సాగుతున్నాశుభ్రంకాని హుస్సేన్సాగర్
సాక్షి,సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక హుస్సేన్ సాగర మథనం మళ్లీ మొదటికొచ్చింది. ఏళ్లుగా రూ.కోట్లు ఖర్చు చేసినా సాగర్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రపంచస్థాయి టెండర్లు పిలుస్తున్నా ఆశించినంత పురోగతి కనబడటం లేదు. ఏటికేడు స్వచ్ఛమైన నీరుగా రూపు మారకపోవడం కలవరానికి గురిచేస్తోంది. ఏటా గణేశ్ నిమజ్జనంతో వచ్చే వ్యర్థాలకు తోడు ముఖ్యంగా సాగర్ తీరంలో వెలిసిన నిర్మాణాల నుంచి ప్రతిరోజూ వచ్చి చేరుతున్న భారీ వ్యర్థాలతో సాగర్ తీవ్రంగా కలుషితమైదుర్వాసన వస్తున్న టాక్ ప్రజల నుంచి వినబడుతోంది. ఇక వేసవిలో అటువైపు వెళ్లే పర్యాటకులైనా, వాహనదారులైనా ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ దుర్వాసన నుంచి విముక్తి కల్పించడంతో పాటు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓబీ) తగ్గడం, కెమికల్ అక్సిజన్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో వాటిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎండీఏ తాజాగా ‘బయో రేమెడియేషన్ పద్ధతి’ చర్యలు చేపట్టేందుకు ప్రపంచస్థాయి టెండర్లను పిలిచింది. దీనివల్ల సాగర్కు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకిలా అవుతుందంటే.. సెప్టెంబర్, 2016లో కురిసిన భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి కూకట్పల్లి, బుల్కాపూర్ తదితర నాలాల నుంచి భారీగా వరద నీరు చేరింది. ఈ నీటిలో బల్క్, డ్రగ్ ఫార్మా కంపెనీల నుంచి విడుదలైన హానికారక రసాయనాలు సైతం ఉన్నాయి. జలాశయం అడుగున సుమారు 40 లక్షల టన్నుల ఘన, రసాయన వ్యర్థాలు గుట్టలా పోగుపడినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో ఇప్పటి దాకా కేవలం 5 లక్షల టన్నులే తొలగించారు. మిగతాది సాగర గర్భంలోనే ఉంది.రెండేళ్ల క్రితం అమీర్పేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్న మెయిన్ మురుగు పైప్లైన్కు ఎన్టీఆర్ గార్డెన్ వద్ద గండి పడడంతో మురుగు నీరంతా హుస్సేన్సాగర్లోకి చేరింది. అలాగే ఏటా గణేశ్ నిమజ్జనాలకు తోడు తీర నిర్మాణంలోని నుంచి వ్యర్థాలు సాగర్లోకి భారీగా చేరుతున్నాయి. సాగర్ చుట్టూ ఇష్టారీతిన కమర్షియల్ కార్యకలాపాలకు హెచ్ఎండీఏ అనుమతివ్వడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వివిధ ప్రాంతాల్లోని నాలాల ద్వారా వచ్చే మురుగునీటితో ఇబ్బందులుండగా ఎస్టీపీల నిర్మాణంతో కొంత నియంత్రించగలిగారు. గణేశ్ విగ్రహలతో తీవ్ర ప్రభావం ఈ ఏడాది గణేశ్ నిమజ్జనంతో హుస్సేన్ సాగర్లోకి సుమారు 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇందులో ఇనుము, కలప, తదితర ఘన వ్యర్థాలను బల్దియా ఎప్పటికప్పుడు తొలగించినప్పటికీ పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీటిలో కలిసిపోవడంతో సాగర్ మరింత గరళంగా మారింది. దీంతో జీవరాశుల మనుగడకు అత్యావసరమైన బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ రోజుల్లో ఇది 35 నుంచి 40 పీపీఎం మించదు. ఇక కెమికల్ అక్సిజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడీ) 200 పీపీఎంను మించే ప్రమాదం ఉంది. సాధారణ రోజుల్లో ఇది 80–100 పీపీఎం మించదు. దీనికితోడు జలాశయం నీటిలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడంతో అందులోని హానికర రసాయనాలు జలాశయాల్లో చేరి పర్యావరణ హననం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, జైకా రుణం.. రూ.310 కోట్లతో సాగర్ శుద్ధికి చర్యలు తీసుకున్నా తీర ప్రాంతాల్లోని నిర్మాణాల నుంచి వస్తున్న వ్యర్థాలే సాగర్ శుద్ధిని మలినం చేస్తున్నాయనే మాట వినబడుతోంది. ‘బయో రెమెడియేషన్’తో ఉపశమనం ప్రధానంగా వేసవితో పాటు మిగిలిన కాలాల్లో సందర్శకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ దుర్వాసనను పూర్తిగా తగ్గించేందుకు గతేడాది మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు చేసిన ‘బయో రెమెడియేషన్’ తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించింది. సుమారు రూ.3 కోట్లతో బెంగళూరుకు చెందిన నాకాఫ్ సంస్థ దుర్వాసన నుంచి కొంతమేర విముక్తి కల్పించింది. మొదటిæదశలో ఐఎం సొల్యూషన్స్ను ట్యాంకర్ల ద్వారా సాగర్లో చల్లారు. దీనివల్ల జలాశయంలోని వ్యర్థ బ్యాక్టీరియాలు చనిపోయి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగింది. రెండో దశలో బొకా షిబాల్స్ను జలాశయంలోకి వదిలారు. ఈ రసాయనాలు అడుగున ఉన్న బ్యాక్టీరియాను తినేస్తుంది. దీంతో చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడంతో పాటు అక్సిజన్ శాతం పెరుగుతోంది. ఈసారి కూడా బయో రెమెడియేషన్ కోసం హెచ్ఎండీఏ మళ్లీ ప్రపంచస్థాయి టెండర్లను ఆహ్వానించింది. -
ఇంటి కాలుష్యం ఆపండి
మన దేశంలో అభివృద్ధి బాగా జరగాలని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలంటే అభివృద్ధి జరగాలని మనం అనుకుంటూ ఉంటాం. యువతరం కూడా అభివృద్ధి ఫలాలను పొందేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. అయితే, ఆ అభివృద్ధితో పాటు కాలుష్యం అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. తెచ్చిపెడుతూనే ఉంది. కాలుష్యం అనేది పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించినది. ఇది ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు.ఈ విషయంలో పర్యావరణ కాలుష్యం, సహజవనరులను కలుషితం చేయడంలో ఎవరికి వారు తమ పాత్రను పోషిస్తున్నారనేది గమనార్హం. కాలుష్యకారకాలతో అభివృద్ధి ఏ విధంగా అనుసంధానించబడిందో.. అది మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే అని తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవచ్చు. ఇంటి నుంచే హానికారాలు షాంపూలూ, డిటర్జెంట్లు, సౌందర్యసాధనాలు, ఎయిర్ప్రెషనర్లు, విండో క్లీనర్లు, డిష్వాష్ ద్రవ్యాలు, హెయిర్ డైలు, మస్కిటో రిఫెల్లెంట్లు (దోమల మందులు), ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విలాసవంతులు, ఆధునికులు విరివిగా ఉపయోగించే వస్తువులు. ఇవి చిన్నగా అనిపించే పెద్ద కాలుష్యకారకాలుగా మన ముందు ఇప్పుడు సమస్యాత్మకంగా నిలిచాయి. ఇవి ఇళ్లల్లో ఉండటం అభివృద్ధి అని మనం అనుకుంటూ ఉంటాం. అందువల్ల విలాసవంతులు వాడే ఈ వస్తువులు ఒక సాధారణ ఇంటిలో చోటు సంపాదించుకోవడం ప్రారంభించాయి. తద్వారా ఈ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో అనేక ఎంఎన్సీ కంపెనీలు ఈ వస్తువుల ఉత్పత్తిలో దూసుకుపోయాయి. ఈ వస్తువుల అమ్మకాలలో వచ్చే లాభంతో ఇండియన్ మార్కెట్లో మెరుగైన ఉత్పత్తిని ఇవ్వడానికి ఎమ్ఎన్సీలు పోటీ పడటం ప్రారంభించాయి. మురుగు నీటి నుంచి మంచి నీళ్లలోకి ఈ పోటీ పరుగులో ఎమ్ఎన్సీలు వస్తువుల ఉత్పత్తిలో సంక్లిష్టమైన రసాయన కలయికల వల్ల కలిగే ఆరోగ్యప్రమాదాల గురించి ఏ మాత్రం బాధపడటం లేదు. ఈ ఉత్పత్తులు సామాన్యుడి రోజువారీ జీవితంలో చాలా సహాయకారిగా ఉన్నప్పటికీ వాటి అవశేష ప్రభావం ప్రజారోగ్యం, పర్యావరణ దృక్ఫథం నుండి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉత్పత్తుల వాడకం తర్వాత ప్రమాదకర రసాయన అవశేషాలను వదిలేస్తాం. తరువాత ఇవి మన స్థానిక మురుగు నీటిలో చేరుతాయి. ప్రమాదకర రసాయనాలతో నిండిన మురుగునీరు తరచూ మంచినీటి ప్రవాహాలలోకి చేరుతుంటుంది. మన నగరాలు, పట్టణాలలో చాలా వరకు సమర్థవంతమైన మురుగునీటి శుద్ధి కర్మాగారాలు లేవు. కొన్ని సార్లు అసలు మురుగునీటి ప్రమాదకర స్వభావాన్ని పట్టించుకోం.అంతేకాదు, ఈ మురుగు నదీ జలాలు, సహజ వనరుల్లోకి చేరుకుంటున్నాయి. తత్ఫలితంగా ఈ రసాయనాలు నదుల పర్యావరణ వ్యవస్థ, వాటి మీద ఆధారపడే ప్రాణులకు అపాయం కలిగించడమే కాకుండా మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయి. ఈ హానికరమైన రసాయనాలు ఆహార గొలుసులోకి ప్రవేశిస్తాయి. ఈ రసాయనాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ రసాయనాల ప్రభావాలు కొన్ని సార్లు చాలా ప్రమాదకరమైనవి. అవి తల్లి పాలను కూడా కలుషితం చేస్తాయి. భావితరాలకు ఏమిస్తున్నాం? మన వారసులకు ఆస్తులు అందించడంలో చూపించే ఆసక్తి మేలైన పర్యావరణాన్ని అందించడంలో చూపడం లేదనేది వాస్తవం. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలలో ఒకటైన భారతదేశం ప్రకృతికి అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. సాంకేతికత ఒక జీవనశైలికి దారితీసింది. దీనిలో ఒక సామాన్యుడి రోజువారి జీవితంలో ప్రకృతి ఒక భాగంగా మారింది. కానీ, ఇంత గొప్ప మన సాంస్కృతిక పర్యావరణ వారసత్వాన్ని ముందు తరాలకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. నాటి నుండి పాలకులు, ప్రభుత్వాలు మన నాగరిక వారసత్వం గొప్పదనాన్ని మెచ్చుకోలేదు సరికదా కాలక్రమంలో ఒక సామాన్యుడి అవసరాలకు తగినట్లుగా మార్పులను చేర్చడానికి చర్యలు కూడా తీసుకొలేదు. మన ప్రభుత్వాలు ప్రపంచంలోని పాశ్చాత్య దేశాల అభివృద్ధి నమూనాలపై మక్కువ చూపించాయి. ఫలితంగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆ పరిజ్ఞానంలో దిగుమతికి ఇచ్చిన ప్రాధాన్యత పర్యావరణ రక్షణకు ఇవ్వలేదు. ఇల్లే శిక్షణ ఉత్పత్తుల వాడకం పెరుగుల అభివృద్ధి ప్రక్రియను సూచిస్తుంది కదా అనవచ్చు. కానీ, ఇది ఏ రకం అభివృద్ధి ప్రక్రియో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ఉత్పత్తులకు ‘నో’ చెప్పడం ఎలా? హానికరమైన రసాయనాల ఉత్పత్తికి ఒక చిన్న ఇంటి సహకారం ఎంత ఉంది? తమ జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఒక సామాన్యుడు ప్రకృతి చేతుల్లోకి ఎలా వెళుతున్నాడు?! తెలుసుకోవడంలో ఎప్పుడూ అనాసక్తినే చూపుతున్నాం. ఈ రకమైన అభివృద్ధి మన పిల్లలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాత్రమే ఇవ్వగలదని, కచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని కాదని మన అనుభవాల నుంచే స్పష్టమవుతుంది. అధునాతన ఎయిర్ కండిషనర్లు, వాటర్ ప్యూరిఫైర్లతో కూడిన ఆధునిక ఇళ్లను మన పిల్లలకు బహుమతిగా ఇవ్వగలం. కానీ, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన తాగునీరు కాదు. ఒక ఇంటి నుంచి ఈ రసాయనాలను విడుదల చేయడం తక్కువే కావచ్చు. ఈ ఉత్పత్తులను ఉపయోగించే జనాభా అధికంగా ఉండటం, గృహ కాలుష్యకారకాలను విస్మరించడం అంత అల్పమైన విషయం కాదని గ్రహించవచ్చు. ఆధునిక సమాజంలో జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి తిరిగి ప్రకృతి చేతుల్లోకి వెళ్లడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, మన జీవితంలో ప్రకృతి పాత్రను గుర్తించడంలో మాత్రం ఎప్పుడూ వెనుకబాటులో ఉండకూడదు. ప్రతి ఒక్కరు దీనిని అభ్యాసంగా చేసుకోవాలి. రోజువారీ కార్యకలాపాలలో ప్రకృతికి తగిన గౌరవం ఇచ్చి తీరాలి. భారతదేశంలో గృహ కాలుష్య కారకాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు త్వరితంగా చర్యలు తీసుకోవాల్సిన సరైన సమయం మాత్రం ఇదే! – ఆరెన్నార్ -
తరగక ముందే కడగాలి
► ఆకు కూరలను ఉప్పునీటితో కడిగితే త్వరగా శుభ్రపడుతాయి. మామూలు నీటితో నాలుగు సార్లు కడగడం కంటే ఉప్పు నీటితో రెండుసార్లు కడిగితే చాలు. ► ఆకుకూరలు, కూరగాయలను కడిగిన తర్వాత మాత్రమే తరగాలి. తరిగిన తర్వాత కడిగితే వాటిలో ఉండే పోషకాలు నీటిలో కలిసిపోతాయి. ► జిడ్డు పట్టిన ఇనుప పెనాలను శుభ్రం చేయడం కష్టం. పెనం మీద ఉప్పు చల్లి, పేపర్తో తుడిచి ఆ తర్వాత సబ్బునీటితో శుభ్రం చేయాలి. ► కప్పుల్లో చివరగా మిగిల్చే కొద్దిపాటి కాఫీ, టీల వల్ల కప్పు అడుగున మరకలు పడుతుంటుంది. అలా పట్టేసిన మరకలు పోవాలంటే పొడి కప్పులో ఉప్పు చల్లి రుద్దాలి. ► రిఫ్రిజిరేటర్ లోపల శుభ్ర పరచడానికి ఉప్పు, సోడా బైకార్బనేట్ కలిపిన నీటిని వాడాలి. సోడా బైకార్బనేట్ రిఫ్రిజిరేటర్లో దుర్వాసనను కూడా పోగొడుతుంది. చిన్న కప్పులో (వంటసోడా) వేసి ఫ్రిజ్లో ఒక మూల పెడితే కొద్దిగంటల్లోనే దుర్వాసన పోతుంది. ► రాగి పాత్రల మీద మరకలు పోవాలంటే మరకల మీద ఉప్పు చల్లి వెనిగర్లో ముంచిన క్లాత్తో తుడవాలి. ► ద్రాక్షపండ్ల మీద చల్లిన రసాయనాలు వదలాలంటే ఉప్పు కలిపిన నీటిలో కనీసం గంటసేపు ఉంచి కడగాలి. -
వంటగదిని శుభ్రం చేశారా!
దీపావళి పండగకు ముందుగా ఇళ్లు మొత్తం శుభ్రం చేసుకోనిదే మనసుకు సంతోషం అనిపించదు. అమ్మ, బామ్మ.. ఇంట్లోని ప్రతీ గదిని వరసగా శుభ్రం చేసుకుంటూ దుమ్మ దులపడాన్ని మన చిన్ననాటి రోజుల నుంచి చూస్తున్నదే. శుభ్రం చేసిన తర్వాత కొత్త హంగులతో అలంకారాలతో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఇంటి శుభ్రత లేకుండా పండగ పనులేవీ ముందుకు కదలవు. అన్ని గదుల కన్నా వంటగది శుభ్రత కష్టంగా అనిపిస్తుంటుంది. సులువుగా, మరింత శుభ్రంగా వంటగదిని ఎలా ఉంచాలో చూద్దాం... ►బేకింగ్ సోడా, డిష్వాషింగ్ సోప్, వేడినీళ్లు, వెనిగర్, కిచెన్ను శుభ్రం చేసే టవల్.. ముందు వీటిని సిద్ధం చేసుకోవాలి. వీటితో కిచెన్ జిడ్డును వదిలించడంలో పని సులువు అవుతుంది. ►వంటగదిలో ఎప్పుడూ ఉండే సమస్య క్రిములు. అలాగే చిన్న చిన్న పురుగుల నుంచి బొద్దింకల వరకు అప్పుడప్పుడైనా కనిపిస్తుంటాయి. వీటికి విరుగుడుగా షాపుల్లో పెస్ట్ కంట్రోల్ స్ప్రే లభిస్తుంది. కిచెన్ షెల్ఫ్లో వంటసామానంతా పక్కన పెట్టేసి ఆ పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేయాలి. ►వెచ్చని నీటిలో వెనిగర్, డిష్వాషర్ సోప్ కలుపుకోవాలి. సిద్ధంగా ఉంచుకున్న టవల్ని ఆ నీళ్లలో ముంచి, నీళ్లు కారకుండా పిండి దాంతో షెల్ఫ్లు, కప్బోర్డ్స్ ఉంటే ఆ పై భాగాలను శుభ్రంగా తుడవాలి. దీంతో దుమ్ము, జిడ్డు మరకలన్నీ శుభ్రం అవుతాయి. ►ఆ తర్వాత డబ్బాల్లో మూడు నాలుగు నెలలుగా ఉండిపోయిన దినుసులు ఉంటాయి. ముఖ్యంగా మసాలా దినుసులు.. మరికొన్ని డబ్బాల్లో వాడని, పురుగు పట్టినవి కూడా ఉంటాయి. వాటిని పూర్తిగా తీసేయాలి. ►స్టోర్ నుంచి తెచ్చి, ఇంకా వాడని సరుకుల ప్యాకెట్లపైన ఉన్న తేదీని బట్టి సరిచూసుకొని, షెల్ఫ్ల్లో సర్దుకుంటే వాడడమూ సులువు అవుతుంది. ►ఫ్రిజ్ను శుభ్రం చేయడం పెద్ద పని. వారానికి ఒకసారి శుభ్రం చేసినా లోపలిభాగంలో కొన్ని పదార్థాల మరకలు అలాగే ఉండిపోతుంటాయి. వెనిగర్ కలిపిన వెచ్చని నీటిలో టవల్ను ముంచి ప్రిజ్ లోపలి భాగం అంతా గట్టిగా రుద్దుతూ తుడవాలి. వెనిగర్ లేదంటే నిమ్మరసం కలిపిన నీటితో అయినా తుడిచి, మళ్లీ పొడి టవల్తో తుడవాలి. ►ఉన్న వస్తువులన్నింటితో కిచెన్ షెల్ఫ్లను నింపేయకుండా అంతగా ఉపయోగించని వస్తువులను పైషెల్ఫ్లో సర్దేయాలి. ఏవి ఎంత వరకు అవసరమో ముందే అవగాహన ఉంటుంది కాబట్టి, ఆ మేరకు మాత్రమే సర్దుకుంటే వంటగది పండగకు శుచిగా, అందంగా కనిపిస్తుంది. -
ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ శుభ్రతా కార్యక్రమం
పూరి: సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి వేలాది మంది ఏకమయ్యారు. ‘మో బీచ్ శుభ్రతా కార్యక్రమం’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద తీరప్రాంత శుభ్రతా కార్యక్రమాన్ని ఒడిశాలోని పూరిలో చేపట్టారు. అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రతా కార్యక్రమ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తీరప్రాంతాలను శుభ్రంగా ఉంచడం ఎంత ముఖ్యమైనదో అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న తీరం వెంట దాదాపు 10 వేల మందికి పైగా కార్యకర్తలు బీచ్లను శుభ్రం చేశారు. -
సాగరళ మథనం
రాష్ట్ర రాజధానిలో ప్రధాన పర్యాటక కేంద్రమైన హుస్సేన్సాగర్ ప్రక్షాళన సత్ఫలితాలనిస్తోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పది నెలల క్రితం మొదలుపెట్టిన ‘బయో రెమిడేషన్’ ప్రక్రియతో సా‘గరళం’ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. డ్రైనేజీ, రసాయన వ్యర్థాలు నిండటంతో సాగర్లోంచి వెలువడుతున్న దుర్వాసనను బెంగళూరుకు చెందిన నాకాఫ్ సంస్థ కొంతమేర నియంత్రించగలిగింది. అడపాదడపా హుస్సేన్సాగర్ నుంచి దుర్వాసన వస్తున్నా పూర్తిస్థాయిలో నియంత్రణలోనే ఉండటంతోపాటు నీటిలో ఆక్సిజన్ శాతం పెరగడమే కాకుండా వ్యర్థ బ్యాక్టీరియాలు నశించడం సానుకూల సంకేతాలను ఇస్తోంది. హెచ్ఎండీఏ అధికారుల మార్గదర్శనంలో మరో ఆరు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగితే పర్యాటకులు, నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దుర్వాసన పూర్తిస్థాయిలో దూరం కానుంది. 2దశల్లో..2పనులు హుస్సేన్సాగర్ విస్తరిత ప్రాంతంతోపాటు దుర్గంధం అధికంగా వచ్చే ప్రాంతాలపై నాకాఫ్ సంస్థ దృష్టి సారించింది. మొదటి దశలో ఐఎం సొల్యూషన్స్ను ట్యాంకర్ల ద్వారా హుస్సేన్సాగర్లో చల్లుతున్నారు. దీనివల్ల జలాశయంలోని వ్యర్థ బ్యాక్టీరియాలు నశించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతోంది. రెండో దశలో బొకాషి బాల్స్ను జలాశయంలోకి వదలుతున్నారు. దీనివల్ల ఆ రసాయనాలు సాగర్ అడుగున ఉన్న బ్యాక్టీరియాలను తినేస్తున్నాయి. ఈ ప్రక్రియ కోసం పర్యాటకశాఖ నుంచి బోటును అద్దెకు తీసుకొని ‘బొకాషి బాల్స్’ను జలాల్లో వేస్తున్నారు. దీంతో చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడమే కాకుండా ఆక్సిజన్ శాతం పెరుగుతోంది. తాజా పీసీబీ గణాంకాల ప్రకారం గతంలో శూన్య శాతంలో ఉన్న డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఇప్పుడు 7.6 శాతం దాకా చేరుకుంది. ఈ ఏడాది సాగర్ పరిసరాల్లో దుర్గంధం అంతగా లేదని పర్యాటకులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అమెరికా పర్యటన ఉండటంతో ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ హుస్సేన్ సాగర్లో శనివారం పర్యటించి నాకాఫ్ సంస్థ పనితీరును మెచ్చుకున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
ఇంటిప్స్
నాన్స్టిక్ పాత్రలు, పెనాలను సులభంగా శుభ్రం చేయాలంటే... వాటిలో వేడినీటిని పోసి పది నిమిషాలసేపు అలాగే ఉంచి తర్వాత క్లీనింగ్ పౌడర్తో కాని డిటర్జెంట్తో కాని కడగాలి. షూస్ మీద మొండి మరకలు ఉండి వదలకపోతే వాటి మీద ఆఫ్టర్ షేవ్ లోషన్ కొద్ది చుక్కలు వేసి తుడవాలి. -
చుక్ ‘మక్’ రైలే!
మక్ ట్రైన్లు... అంటే ఏమిటీ అన్న ‘కౌన్బనేగా కరోడ్ పతి’ కార్యక్రమంలోని ప్రశ్నకు మెగ్సెసే అవార్డు గ్రహీతలు ప్రకాశ్బాబా అమ్టే, ఆయన భార్య మందాకిని ఆమ్టే టక్కున సమాధానం చెప్పేశారు. దీంతో ఈ పేరు ఒక్కసారిగా స్పాట్లైట్లోకి వచ్చేసింది. సాధారణంగా రోడ్ల వెంట లేదా కాలువల పక్కన పడి ఉన్న చెత్తా,చెదారాన్ని ఎత్తేందుకు మున్సిపల్ లారీలు ఉపయోగించడం చూస్తుంటాం. అదే రైలు పట్టాల వెంట, చుట్టుపక్కలా పడిన మురికి, చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ‘మక్ రైళ్లు’ ఉపయోగిస్తున్నారు. సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఈ సర్వీసు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ముంబై మహానగరంలోని సబ్ అర్భన్ రైళ్ల పట్టాల వెంట, చుట్టుపక్కల చెత్తాచెదారం అమితంగా పోగుపడుతుండడంతో దానిని తొలగించేందుకు రోజువారి పద్ధతిలో ‘మక్ ప్రత్యేక రైళ్లు’ నడుపుతున్నారు. రోజంతా రాకపోకలు సాగించిన ప్యాసెంజర్ రైళ్లు విశ్రాంతి తీసుకున్నాక ఈ స్పెషల్ ట్రైన్లు ప్రతీరోజు తెల్లవారు జామున 2–4 గంటల మధ్య తమకు అప్పగించిన పనిని పూర్తిచేస్తాయి. 2017 ఏప్రిల్ – 2018 మార్చి మధ్యలో సెంట్రల్ రైల్వేస్ 94 వేల క్యూబిక్ మీటర్ల చెత్తను, వెస్ట్రన్ రైల్వేస్ 75 వేల క్యూబిక్ మీటర్ల చెత్తను తొలగించాయి. ఈ రైళ్ల నుంచి చెత్తను ఎత్తేసేందుకు రైల్వేఅధికారులు జేసీబీలు ఉపయోగిస్తున్నారు. రైలు పట్టాల పక్కన పడేస్తున్న చెత్త పరిమాణం క్రమక్రమంగా పెరుగుతుండగా, దానికి తగ్గట్టుగా చెత్త తొలగింపు చర్యలను రైల్వేశాఖ చేపడుతోంది. రైల్వేనెట్వర్క్ను పరిశుభ్రంగా ఉంచడంలో రైల్వేశాఖ ఉద్యోగులు చేస్తున్న కృషిని గురించి ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. రైళ్లు, పట్టాలు, పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు ప్రయాణీకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. ‘స్వచ్ఛభారత్ అభియాన్’లో మక్ రైళ్లు నిర్వహిస్తున్న పాత్రను గురించి రైల్వేశాఖ మంత్రి పీయుష్ గోయల్ ఇటీవల తన ట్వీట్లలో కొనియాడారు. -
ఫ్రాన్స్లో కాకులకు ‘చెత్త’ పని!
కుండలో అడుగులో ఉన్న నీళ్లను రాళ్లు వేసి నీళ్లు పైకొచ్చాక దాహం తీర్చుకున్న తెలివిగల కాకి కథ.. గుర్తుంది కదా! ఈసారి వెరైటీగా కాకులు చెత్త ఏరివేతకు సిద్ధయయ్యాయి. ఫ్రాన్స్లోని ప్రఖ్యాత థీమ్ పార్కు పుయ్ డు ఫౌలో ఆరు కాకుల ముక్కులకు బృహత్తర పని అప్పజెప్పారు. వాటి పనల్లా నేలపై పడిన సిగరెట్ ముక్కలు, ఇతర చెత్తా చెదారాన్ని తీసుకెళ్లి చెత్తబుట్లలో వేయడమే. కాకపోతే ట్రైనింగ్ ఇచ్చారు లెండి. ‘పార్కును శుభ్రంగా ఉంచాలన్నది ఒకటే మా లక్ష్యం కాదు.. పర్యావరణం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్వయంగా ప్రకృతి మనకు నేర్పుతుందనే విషయాన్ని చాటి చెప్పడం కూడా తమ ఉద్దేశ’మని పార్కు ఉన్నతాధికారి నికోలస్ డి విల్లీయర్ అంటున్నారు. కాకులు తమ తెలివితేటలను ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. కాకులకు సమస్యను పరిష్కరించే సత్తా ఉందని ఈ ఏడాది ప్రారంభంలో తయారు చేసిన ఒక వెండింగ్ మెషీన్ ద్వారా శాస్త్రజ్ఞులు నిరూపించారు. ఒక ప్రత్యేక సైజ్ కాగితం ముక్కను యంత్రంలో వేస్తేనే యంత్రంలో ఉంచిన ఆహారం బయటికి వస్తుంది. కాకులు ఈ ఫీట్ను దిగ్విజయంగా పూర్తి చేశాయి. యంత్రంలో ఏ సైజ్ కాగితపు ముక్కలను వేయాలనేది గుర్తుంచుకుని.. ఆ మేరకు పెద్ద సైజ్ కాగితాన్ని సైతం చిన్న ముక్కలుగా చేసి యంత్రంతో వేయడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఏదేశమైనా ఎక్కడైనా.. నీకు హేట్సాఫ్ కాకీజీ! -
మురుగు తీసి..సమస్య తీర్చి..!
లింగోజిగూడ: మురుగునీరు రోడ్లపైకి వస్తుండడంతో స్థానికుల ఇబ్బందులను తొలగించేందుకు గురువారం హయత్నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్రెడ్డి రంగంలోకి దిగారు. హయత్నగర్ డివిజన్ పరిధిలోని నర్సింహారావునగర్, శారదానగర్ జంక్షన్ వద్ద గడ్డిపొలాల యజమానులు డ్రైనేజీ మ్యాన్హోల్ను ధ్వంసం చేయడంతో మురుగునీరు పొంగి రోడ్లపైకి వస్తోందని అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోలేదని కార్పొరేటర్ తిరుమల్రెడ్డి తెలిపారు. ప్రజల ఇబ్బందులను తాత్కాలికంగా తొలగించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్వలోకి దిగి శుభ్రం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు డ్రైనేజీ మ్యాన్హోల్ను నిర్మించాలని ఆయన కోరారు. -
సినిమాకు వెళ్తే చిత్తడే..
సినిమా టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు అప్పగిస్తూ ఇటీవల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇకపై యాజమాన్యాలు టికెట్ల రేటు పెంపునకు సంబంధించి ఏ ప్రభుత్వ అథారిటీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పెంచిన రేట్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం సంబంధిత ప్రభుత్వ శాఖకు ఇస్తే సరిపోతుంది. టికెట్ల రేటు పెంపు అంశాన్ని పక్కన పెడితే థియేటర్లలో మౌలిక సౌకర్యాలు నరక కూపాన్ని తలపిస్తున్నాయి. వినోదం కోసం వచ్చే ప్రేక్షకులు విసుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : వినోదం కోసం సినిమా థియేటర్కు వెళ్లే ప్రేక్షకుడి జేబుకి ఇకపై భారీగా చిల్లు పడనుంది. టికెట్ల రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ 75ను విడుదల చేసినా.. అమలును పెండింగులో పెట్టింది. దీంతో టికెట్ రేట్ల పెంపు అవకాశాన్ని థియేటర్ యాజమాన్యాలకు కల్పిస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా పరిధిలో సుమారు 20 థియేటర్లు ఉండగా.. సుమారు పది వేల సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఒక్కో థియేటర్లో కేటగిరీని బట్టి టికెట్« ధర కనిష్టంగా రూ.10 మొదలుకుని గరిష్టంగా రూ.150 వరకు ఉంది. థియేటర్లు చాలా చోట్ల మల్టీప్లెక్సులుగా అవతారం ఎత్తుతుండగా.. జిల్లాలో మాత్రం ఇంకా ఆ సంస్కృతి వేళ్లూనుకోలేదు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం థియేటర్ యాజమాన్యాలు టికెట్ రేట్ల పెంపునకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. రేట్లు పెంచినట్లుగా సంబంధిత ప్రభుత్వ విభాగానికి సమాచారం ఇస్తే సరిపోతుంది. టికెట్ రేట్ల పెంపు విషయాన్ని పక్కన పెడితే థియేటర్లలో మౌలిక సౌకర్యాలు, నిర్వహణ తీరుపై ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పా ర్కింగ్ ఫీజు, క్యాంటీన్లో తినుబండారా లు, శీతల పానీయాల ధరలు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీ రు అందుబాటులో పెట్టడం, పారిశుద్ధ్య ం, టికెట్ల విక్రయం.. ఇలా అనేక అంశాలపై థియేటర్ యాజమాన్యాలు, లీజుదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ⇒ సీట్ల సామర్థ్యం, సీట్ల వరుసల నడుమ దూరం ఏర్పాటులో శాస్త్రీయత లేక ప్రేక్షకులు అసౌకర్యాంగా కూర్చోవాల్సి వస్తోంది. ⇒ థియేటర్లో ఉష్ణోగ్రతను సూచించేలా కనీసం మూడు నాలుగు చోట్ల డిజిటల్ థర్మా మీటర్లు ఏర్పాటు చేసి, థియేటర్ లోపల నిర్దేశిత ఉష్ణోగ్రత మాత్రమే ఉండేలా ఏసీ గాలిని వదలాలనే నిబంధన అమలు కావడం లేదు. ⇒ వెండితెర నుంచి ఎంత దూరంలో ఎన్ని డెసిబుల్స్ కలిగిన శబ్దం వదలాలనే స్పష్టమైన నిబంధనలు ఉన్నా.. మితిమీరిన శబ్దాలతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. ⇒ థియేటర్ సీట్ల సామర్థానికి అనుగుణంగా ప్రతీ 50 మందికి ఒకటి చొప్పున టాయిలెట్ కమోడ్ ఏర్పాటు చేయాలి. కానీ కమోడ్లు, మరుగుదొడ్ల నిర్వహణ లేక చాలా చోట్ల దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. కొన్ని చోట్ల నీటి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేదు. ⇒ ప్రేక్షకులకు రక్షిత తాగునీరు అందుబాటులో ఉండాలనే నిబంధన ఎక్కడా కనిపించడం లేదు. ⇒ షో ప్రారంభానికి ముందు వాణిజ్య ప్రకటనలను ఐదు నిముషాలకు మించి ప్రదర్శించకూడదనే నిబంధన అరుదుగా పాటిస్తున్నారు. ⇒ తూనికలు, కొలతలు, ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన చట్టాలేవీ అమలు కావడం లేదు. తినుబండారాలు, శీతలపానీయాల ధరలు రెండింతలు పెంచి అమ్ముతున్నా సంబంధిత విభాగాల పర్యవేక్షణ కరువైంది. ⇒ కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు విడుదలైన సందర్భాల్లో పార్కింగ్ ఫీజు పెంపు, బ్లాక్లో టికెట్ల విక్రయం సర్వసాధారణమైంది. ⇒ గతంలో థియేటర్లపై రెవెన్యూ, తూనికలు కొలతలు, ఆహార కల్తీ నియంత్రణ తదితర ప్రభుత్వ విభాగాలు తరచూ తనిఖీలు చేసి జరిమానాలు విధించేవి. థియేటర్లను సీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ విభాగాలు పర్యవేక్షించిన దాఖలా జిల్లాలో ఒక్కటీ కనిపించడం లేదు. ⇒ టెలివిజన్, సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ వినియోగం పెరగడం, పై రసీ తదితర కారణాలతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ⇒ చాలా థియేటర్లు ఫంక్షన్ హాళ్లుగా, గోదాములుగా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టికెట్ల రేట్ల పెంపునకు తమకు అవకాశం ఇవ్వడంతో కొంతమేర ఊరటనిస్తోందని యాజ మాన్యాలు పేర్కొంటున్నాయి. చెత్త కూడా ఊడ్చేవారు లేరు థియేటర్లలో పరిశుభ్రత ఏ మూలనా కనిపించదు. రోజుకు ఒక్కసారి మాత్రమే శుభ్రం చేస్తున్నారు. ప్రతీ షో తర్వాత శుభ్రం చేయకపోవడంతో ప్లాస్టిక్ కవర్లు, తినుబండారాలు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. ఎలుకలు, దోమల బెడద విపరీతంగా ఉంది. పార్కింగ్ ఫీజు ఒక్కో థియేటర్లో ఒక్కో రకంగా ఉంటోంది. కొత్త సినిమా విడుదలైతే యాజమాన్యాలు ఇష్టారీతిన పార్కింగ్ ఫీజును పెంచేస్తున్నారు. టికెట్ల కోసం క్యూలో నిలుచుంటే ఆన్లైన్లో అమ్మినట్లు చెబుతున్నారు. బహిరంగంగానే బ్లాక్ టికెట్ల దందా జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. – లతీఫ్, వ్యాపారి, సదాశివపేట పేదలు వినోదానికి దూరం సినిమా టికెట్ల ధరలతో ఇప్పటికే పేదలు వినోదానికి దూరమయ్యే పరిస్థితి ఉంది. థియేటర్లకు ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తే మరింత భారం పెరుగుతుంది. టికెట్ ధరలు, థియేటర్లలో సౌకర్యాలపై ప్రభుత్వ విభాగాలు దృష్టి సారించాలి. థియేటర్ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా.. ఎక్కడా కనిపించడం లేదు. థియేటర్లలో మహిళలు పోకిరీల బెడద కూడా ఎదుర్కొంటున్నారు. షీ టీమ్స్తో థియేటర్ల వద్ద కూడా నిఘా ఏర్పాటు చేయాలి. – దిండె రాజు, జహీరాబాద్ పర్యవేక్షణ ఉండాల్సిందే సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాల్సిందే. థియేటర్ యాజమాన్యాల విచక్షణకు వదిలేస్తే ప్రేక్షకుడిపై భారం పెరుగుతుంది. థియేటర్లలో మౌలిక సౌకర్యాలు లేకున్నా.. లాభాపేక్షతో ఇష్టారీతిన టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. థియేటర్ల నిర్వహణపై ఎలాంటి ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ప్రేక్షకుడు చెల్లించే డబ్బుకు తగిన వినోదం, మౌలిక వసతులు థియేటర్లు అందించాలి. లేదంటే సినిమా రంగంపైనే మరింత వ్యతిరేక ప్రభావం పడడం ఖాయం. – కూన వేణుగోపాల్, వినియోగదారుల హక్కుల కార్యకర్త -
వేడుకగా కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం
– మహద్వారం నుంచి గర్భాలయం వరకు శుద్ధి – సుగంధ పరిమళంతో గుభాళిస్తున్న వెంకన్న ఆలయం సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా సాగింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేసి ఆలయంలో భక్తిశ్రద్ధలతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. అక్టోబరు 3 నుంచి∙11వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ సేవ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహద్వారం మొదలు, ప్రాకారాలు, గోడలు, పైకప్పు, పూజలకు వినియోగించే రాగి, వెండి, బంగారం.. వస్తువులను వైదికంగా శుద్ధి చేశారు. గర్భాలయంలోని మూలమూర్తిపై దుమ్ము, దూళి పడకుండా మలైగుడారం అనే ప్రత్యేక శ్వేతవర్ణంలోని పట్టు వస్రం కప్పారు. శుద్ధి పూర్తి చేసిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర మిశ్రమ తిరుమంజనాన్ని ఆలయం అంతటా లేపనంగా పూశారు. ఈ సందర్భంగా చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు శ్రీవారికి కొత్త పరదాలు సమర్పించారు. చివరగా అర్చకులు గర్భాలయ మూలమూర్తిపై కప్పిన వస్త్రాన్ని తొలగించి ఆగమయోక్తంగా పూజలు, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఉదయం 11 గంటల నుంచి∙భక్తులను శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాదన ప్రత్యేక వారపు సేవను రద్దు చేశారు. కార్యక్రమంలో ట్రస్టుబోర్డు సభ్యులు పసుపులేటి హరిప్రసాద్, జి.భానుప్రకాష్రెడ్డి, డీపీ అనంత్ పాల్గొన్నారు. -
వ్యర్థానికి సరికొత్త అర్థం!
♦ ఘన, జీవ వ్యర్థాల శుద్ధిపై అధ్యయనం ♦ అత్యున్నత ప్రమాణాలతో ఔషధనగరి ♦ నెదర్లాండ్, బ్రెజిల్, ఇంగ్లాండ్లో ♦ కలెక్టర్ రఘునందన్రావు పర్యటన ♦ ‘సాక్షి’కి పర్యటన విశేషాలు వెల్లడి జీవవాళికి ప్రమాదకరంగా మారిన కాలుష్య ఉద్గారాలను శుద్ధి చేసేందుకు ఆయా దేశాలు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయి. ఐర్లాండ్కు చెందిన ‘పీఎమ్’ కన్సల్టెన్సీ సంస్థ ఫార్మా సిటీల డిజైన్లో ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఔషధనగరిలో కంపెనీల స్థాపనపై సమగ్ర అవగాహన ఈ కన్సల్టెన్సీ సొంతం. వ్యర్థాల నిర్వహణను పరిశ్రమ గుర్తించడం ఆయా దేశాల్లో సత్ఫలితాలనిస్తోంది - రఘునందన్రావు, కలెక్టర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఘన, జీవ వ్యర్థాలను వినూత్న విధానంతో అర్థవంతమైన ఉత్పత్తులుగా మార్చే దిశగా అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై జిల్లా కలెక్టర్ రఘునందన్రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమగ్రంగా అధ్యయనం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ముచ్చర్లలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఔషధనగరి (ఫార్మాసిటీ) పరిధిలో వెలువడనున్న జీవ, రసాయన కారకాలను పర్యావరణానికి హాని కలగనిరీతిలో శుద్ధి చేసి ఇం‘ధనం’గా మార్చాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్, నెదర్లాండ్, ఐర్లాండ్, బ్రెజిల్ దేశాల్లో పర్యటించి అందుబాటులో ఉన్న శుద్ధి యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, విధానాలను తెలుసుకుంది. సుమారు 13వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫార్మాసిటీ దేశానికే తలమానికంగా మారుతుందని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఔషధ కంపెనీలంటే ఉద్గారాలను వెదజల్లే పరిశ్రమలనే అపవాదును రూపుమాపేలా జీవ, రసాయన వ్యర్థాలను శుద్ధికి విదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. కాలుష్య నియంత్రణకు ఆయా దేశాల్లో అమలవుతున్న విధానాలతో అత్యున్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఔషధనగరిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యర్థాల నిర్వహణ కూడా ఒక పరిశ్రమే! ‘అక్కడ వ్యర్థ పదార్థాల నిర్వహణ కూడా ఒక పరిశ్రమే’ అనే అంశం ప్రతినిధి బృందం తెలుసుకుంది. మురుగు, చెత్త, రసాయన, బయో వేస్ట్, ఈ-వేస్ట్ శుద్ధి అంతా కూడా ఆ పరిశ్రమ కనుసన్నల్లోనే కొనసాగుతుంది. ప్రమాదకర విషవాయువుల వాసన.. కాలుష్య ఉద్గారాల జాడ తమ పర్యటనలో కనిపించకపోవడం అధికారుల ఆశ్చర్యపరిచింది. పరిశ్రమ స్థాపించిన సమయంలో వె లువడే రసాయనాల శాతం, ఘన వ్యర్థాలు, ఇతరత్రా కాలుష్య కారకాలపై స్పష్టమైన సమాచారాన్ని యాజమాన్యం ఇవ్వాల్సివుంటుంది. ఈ మేరకు నిర్ధిష్ట ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే విషయాలను ప్రభుత్వ ఆధీనంలోని విభాగం పరిశీలిస్తుంది. బ్రస్సెల్స్ నగరంలోని ఇండోవర్ కంపెనీ ఏడాదిలో 50 లక్షల టన్నుల వ్యర్థాలను శుద్ధి చేయడం.. ఈ సంస్థ ఇతర దేశాల్లో కూడా సేవలందిస్తుండడం అబ్బురపరిచిందని కలెక్టర్ రఘునందన్రావు అన్నారు. 10 రోజుల విదేశాల సందర్శన ముగించుకొని సోమవారం విధుల్లో చేరిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో పర్యటన విశేషాలను పంచుకున్నారు. జర్మనీలో ‘బాస్ఫ్’ అనే సంస్థ కాలుష్య జలాల శుద్థిలో ఆధునిక సాంకేతికను వినియోగిస్తోందని, ప్రతిరోజూ 350 క్యుబిక్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తోందని అన్నారు. 10 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ఫ్యాక్టరీలో రసాయనాల వాసన, గాలి కూడా బయటకు రాకుండా జాగ్ర త్తలు తీసుకుంటోందని అన్నారు. మన దగ్గర ‘టీ-హబ్’లో సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించినట్లే ఇంగ్లాండ్లో ఫార్మా కంపెనీల ప్రోత్సాహానికి ఫార్మా హాబ్ ఏర్పాటు చేశారని వివరించారు. ఇక్కడ ఓనమాలు నేర్చుకునే కంపెనీలకు అన్నిరకాలుగా ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్లు తమ అధ్యయనంలో తెలిసిందని చెప్పారు. ‘బయోసిటీ, మెడిసిటీ ఉత్పత్తులకు వేర్వేరుగా ఇక్కడ అవకాశం కల్పించారు. ఫార్మా రంగంలోనూ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం కలిగించే అంశాన్ని పరిశీలించమని ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని రఘునందన్రావు తెలిపారు. -
భార్య పని చేయడం లేదని..
తన భార్య ఇంటి పని, వంట పని సరిగా చేయట్లేదంటూ.. కుటుంబ కష్టాలపై ఓ భర్త కోర్టుకెక్కాడు. 'మిస్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ' అంటూ తాను పడుతున్న కష్టాలను వివరించాడు. అయితే ఇదే సందర్భంలో భర్త వల్ల ఆమె ఆరేళ్లుగా నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్న నరకం కూడా బయటపడింది. 40 ఏళ్ల వయసున్న తన భార్య.. పనిచేయడంలో వెనుకబడిందని, కుటుంబాన్ని సరిగా చూడట్లేదని ఓ భర్త కోర్టుకెక్కాడు. వంట పనిలోనూ, ఇల్లు శుభ్రపరిచే విషయంలోనూ ఆమె పరమవీక్ అంటూ ఫిర్యాదు చేశాడు. తన భార్య అపరిశుభ్రతను, బద్ధకాన్ని భరింలేకపోతున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో జీవించలేకపోతున్నానని వాపోయాడు. రెండేళ్లుగా ఈ పరిస్థితులతో తీవ్రకష్టాలు అనుభవిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు. అయితే స్థానికులు మాత్రం అతడి ఆరోపణలు నిజం కాదంటున్నారు. భర్త తరచుగా భార్యను వేధిస్తుంటాడని, కొని తెచ్చిన వంటకాలను దూరంగా విసిరి పారేస్తాడని, ఆమే వంట చేయాలంటాడని తెలిపారు. లేదంటే ఆమెను శారీరకంగా హింసిస్తుంటాడని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టుకు పత్రాలు సమర్పించిన బాధితురాలు.. తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించింది. భర్త చేస్తున్న ఫిర్యాదులు నిజం కాదంది. ఆరేళ్లుగా అతనితో నరకం అనుభవిస్తున్నాని, కోర్టుకు వచ్చేముందు కూడా తనను కొట్టాడని తెలిపింది. ఇటలీ సొన్నినో లాజియోకి చెందిన ఆమె... ఆరేళ్లుగా భర్త వేధింపులను భరిస్తూ కాలం గడుపుతున్నానని, తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని న్యాయస్థానానికి విన్నవించింది. ప్రస్తుతం ఆ భార్య భర్తల వివాదంలో విచారణను కోర్టు అక్టోబర్ నాటికి వాయిదా వేసింది. -
అనధికారికంగా సాగర్ ప్రక్షాళన
-
ఆపరేషన్ సాగర్
-
మరుగుదొడ్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే చింతల
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో రాజకీయ నేతలు, కళాకారులు, నటులు, క్రీడాకారులు, ప్రముఖులు స్వచ్ఛ్ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. స్వచ్ఛ్ భారత్లో భాగంగా ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఓ అడుగు ముందుకేశారు. అంతా రోడ్లను శుభ్రపరుస్తుంటే ఆయన మాత్రం మరుగుదొడ్లను శుభ్రపరచి అందరినీ ఆశ్చర్యపరిచారు. శుక్రవారం ఫిల్మ్ నగర్ రౌండ్ టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొని మరుగుదొడ్లను శుభ్రపరిచారు. సుమారు గంటపాటు అక్కడి మూత్రశాలలను కడిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు ఇక నుంచి ప్రతి శనివారం రాజ్ భవన్ పరిసరాలు శుభ్రం చేయాలని గవర్నర్ నరసింహన్ ...సిబ్బందికి పిలుపునిచ్చారు. ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తే తానూ పాల్గొంటానని గవర్నర్ తెలిపారు. -
హౌస్ కీపింగ్ మాయాజాలం
సాక్షి,తిరుమల: తిరుమలలో కాటేజీల పరిశుభ్రత విషయంలో ప్రైవేట్ కంపెనీలు చేతులెత్తేశాయి. టీటీడీ విధించిన నిబంధనలు పాటించడం లేదు. హౌస్కీపింగ్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఏటా రూ.2కోట్లు కేటాయించే సంబంధిత అధికారులు గదుల శుభ్రత తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నాలుగు కంపెనీలకు ఏటా రూ.2 కోట్లపైగా కాంట్రాక్టు తిరుమలలో మొత్తం 6,800 గదులున్నాయి. వీటిని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ప్యాకేజీల కింద టీటీడీ విభజిచింది. వాటి శుభ్రత కోసం బీవీజీ (వెస్ట్ ), క్రిస్టల్ (నార్త్), పనోరమ (ఈస్ట్), ఆల్సర్వీస్ (సౌత్) ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఇందుకోసం ఏటా రూ.2 కోట్లకుపైగా కేటాయిస్తోంది. టీటీడీ నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాల్లోని కాటేజీలు, అతిథి గృహాల్లోని గదుల్లో పరిశుభ్రత చర్యలు, నిర్వహణ అంతా ఆ కంపెనీల నిర్వాహకులే చూడాలి. నిబంధనలకు పాతర గదుల శుభ్రత విషయంలో సంబంధిత ప్రైవేట్ సంస్థలు టీటీడీ నిబంధనల్ని ఏమాత్రం పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఖాళీ అయిన గదిని తిరిగి కేటాయించేందుకు అనువైన మార్గం కల్పించడంలో విఫలమవుతున్నాయి. గది, మరుగుదొడ్డి, స్నానాల గది శుభ్రత వినియోగించాల్సిన పరికరాలు, మాఫ్, సువాసనలతో కూడిన ఫినాయిల్, నాప్తలిన్ ఉండలు కూడా అందుబాటులో ఉంచడం లేదు. విరిగిన కొళాయిలు, లీకేజీ బెడత, బొద్దింకలు, నల్లుల గోల, పేరుకుపోయిన దుమ్ము, ధూళితో నిండిన గదులను వంద శాతం శుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు భిన్నంగా కాటేజీల్లోని గదులు అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. అదేమని కార్మికులను అడిగితే సంబంధిత కంపెనీలు అవసరమైన వస్తువులు, పదార్థాలు ఇవ్వడం లేదని కుండబద్ధలు కొడుతున్నారు. గదులు నిర్వహణ చేసే టీటీడీ రిసెప్షన్ సిబ్బంది కూడా సంబంధిత కంపెనీల ప్రతినిధులను నిలదీసిన సందర్భాలూ ఉన్నాయి. వీఐపీలు బస చేసే ప్రాంతాల్లో అన్నీ ఉన్నా..సామాన్య భక్తులు బసచేసే గదుల్లో మాత్రం పారిశుధ్యం బాగోలేదు. ఆచరణలోలేని కమిటీలు నాలుగు ప్యాకేజీల్లోని గదుల శుభ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు రిసెప్షన్, హెల్త్, ఎఫ్ఎంఎస్ ఇంజినీరింగ్ విభాగాలతో కమిటీలు వేశారు. ఆచరణలో మాత్రం కమిటీలు పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. గదుల్లో పారిశుధ్య లోపాలను గుర్తించి సంబంధిత కంపెనీల నుంచి జరిమానా వసూలు చేయాల్సిన కమిటీలు ఏమాత్రం పట్టీపట్టనట్టుగా ఉండడంతో సంబంధిత పారిశుద్ధ్య పనులు దక్కించుకున్న కంపెనీలకు కలసి వస్తోంది.