deaths increased
-
దుమ్ము దుప్పట్లో విలాస నగరం
వాషింగ్టన్: ఆరు చోట్ల ఆరని పెను జ్వాలలు, కమ్మేసిన దుమ్ము, ధూళి మేఘాలు, నిప్పుకణికల స్వైరవిహారంతో లాస్ ఏంజెలెస్ నగర కొండప్రాంతాలు నుసిబారిపోతున్నాయి. వేల ఎకరాల్లో అటవీప్రాంతాలను కాల్చి బూడిదచేసిన వేడిగాలులు అదే బూడిదను జనావాసాల పైకి ఎగదోస్తూ మిగతా పరిసరాలను దమ్ముకొట్టుకుపోయేలా చేస్తున్నాయి. పొగచూరిన వాతావరణంలో సరిగా శ్వాసించలేక లక్షలాది మంది స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో జనం బయట తిరగొద్దని, హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నామని స్థానిక యంత్రాంగం శనివారం ప్రకటించింది. 10,000 భవనాలను కూల్చేసి, 11 మంది ప్రాణాలను బలిగొన్న కార్చిచ్చు ఇంకా చల్లారకపోగా తూర్పు దిశగా దూసుకుపోతుండటంతో స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారమైంది. ఇప్పటికే మూడు లక్షల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా ఆస్తి నష్టం లక్షల కోట్లను దాటి లాస్ఏంజెలెస్ నగర చరిత్రలోనే అత్యంత దారుణ దావాగ్ని ఘటనగా మిగిలిపోయింది. పర్వత సానువుల గుండా వేడి గాలుల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో మంటలు మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించవచ్చన్న భయాందోళనలు పొరుగు ప్రాంతాలైన ఎన్సినో, వెస్ట్ లాస్ఏంజెలెస్, బ్రెంట్వుడ్వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మంటలు ఆపేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న అగ్నిమాపక సిబ్బందికి నీటి కష్టాలు మొదలయ్యాయి. ఫైరింజన్లకు సరిపడా నీటి సౌకర్యాలు లేకపోవడంపై కాలిఫోరి్నయా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంటా యెంజ్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా పూర్తిస్థాయిలో లేకపోవడంపైనా ఆయన ‘ఎక్స్’వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్న మంటలకుతోడు కొత్తగా గ్రనడా హిల్స్లో అంటుకున్న అగ్గిరవ్వలు ‘ఆర్చర్ ఫైర్’గా విస్తరిస్తూ ఇప్పటికే 32 ఎకరాలను దహించివేసింది. ఈ ప్రాంతంలోనే ఎంటర్టైన్మెంట్ దిగ్గజ కిమ్ కర్దాషియాన్ సోదరీమణుల ఇళ్లు, డిస్నీ కార్పొరేట్ ఆఫీస్ ఉన్నాయి. కార్చిచ్చులో కళాకారుల కలల సౌధాలు: వెనుక కొండలు, ముందు వినీలాకాశం, కింద సముద్ర తీరంతో అద్భుతంగా కనిపించే లాస్ ఏంజెలెస్లో చాలా మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఎంతో ఇష్టంతో ఇళ్లు కొన్నారు. వాటిల్లో చాలా మటుకు ఇప్పుడు కాలిపోయాయి. 76 ఏళ్ల అమెరికన్ కమేడియన్ బిల్లీ క్రిస్టల్ 1979లో పసిఫిక్ పాలిసేడ్స్లో కొనుగోలుచేసిన విలాసవంత భవనం తాజా మంటల్లో కాలిబూడిదైంది. మ్యాడ్ మ్యాక్స్ స్టార్ మేల్ గిబ్సన్, మరో నటుడు జెఫ్ బ్రిడ్జెస్, సెలబ్రిటీ టెలివిజన్ పర్సనాలిటీ ప్యారిస్ హిల్టన్, ‘ప్రిన్సెస్ బ్రైడ్’నటుడు క్యారీ ఎల్వీస్, ప్రముఖ నటుడు మ్యాండీ మూర్, మీలో వెంటిమిగ్లియా, లీటన్ మీస్టర్, ఆడమ్ బ్రాడీ, ఆంటోనీ హాప్కిన్స్, జాన్ గుడ్మాయ్న్, మైల్స్ టెల్లర్, అన్నా ఫారిస్, పాలిసేడ్స్ గౌరవ మేయర్ ఎజీన్ లేవీ, క్రిస్సీ టీగెన్, జాన్ లెజెండ్, మార్క్ మరోన్, మార్క్ హామిల్ల ఇళ్లు సైతం మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. లిడియా, హర్స్ట్, ఆర్చర్, ఈటన్, కెన్నెత్, పాలిసేడ్స్ ఫైర్ దావాగ్నులు మొత్తంగా 37,579 ఎకరాల్లో విస్తరించాయి. -
మయన్మార్ వరదల్లో... 236 మంది మృతి
నైపిడావ్: మయన్మార్లోని యాగీ తుఫాను విలయం కొనసాగుతూనే ఉంది. దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వాటి ధాటికి ఇప్పటిదాకా ఏకంగా 236 మంది మృతి చెందారని ప్రభుత్వ సంస్థ గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ మంగళవారం వెల్లడించింది. ఈ సంఖ్య పెరగవచ్చని ఐరాస మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసీహెచ్ ఏ) పేర్కొంది. ‘‘77 మంది గల్లంతయ్యారు. కనీసం 6 లక్షల మందికి పైగా వరదల బారిన పడ్డారు’’ అని ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ చైనా, వియత్నాం, లావోస్, మయన్మార్లో గత వారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర వియత్నాంలో ఇప్పటికే వందలాది మంది మరణించినట్లు నిర్ధారించారు. మయన్మార్లో రాజధాని నైపిడావ్, సెంట్రల్ మాండలే, కయా, కయిన్, షాన్ స్టేట్స్ సహా కనీసం తొమ్మిది ప్రాంతాలు, రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేశాయి. 2023లో మోచా తుఫాను వేళ అంతర్జాతీయ సాయాన్ని తిరస్కరించిన సైనిక పాలకులు ఇప్పుడు మాత్రం సాయానికి విజ్ఞప్తి చేస్తున్నారు.సైనిక ప్రభుత్వంతో సమస్య ఆహారం, తాగునీరు, మందులు, బట్టలు, ఆశ్రయం మయన్మార్కు అత్యవసరమని ఓసీహెచ్ఏ పేర్కొంది. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, అస్థిరమైన టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని తెలిపింది. పొరుగు దేశాల సాయం బాధితులకు అందాలంటే సైన్యం పౌర సమాజంతో కలిసి పని చేయడం ముఖ్యమని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణుల స్వతంత్ర సమూహం ఏఎస్ఏసీ–ఎం తెలిపింది. కానీ మెజారిటీ ప్రజలకు సాయమందేలా చూడాలనే ఉద్దేశం సైనిక ప్రభుత్వానికి లేదని ఒక ప్రకటనలో ఆక్షేపించింది. సైన్యం దేశంలో మానవతా సంక్షోభాన్ని సృష్టించిందని, ప్రజలను గాలికొదిలి సొంత సైనిక, రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తోందని ఆరోపించింది. నిధుల సమస్యతో కూడా సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయని ఓసీహెచ్ఏ పేర్కొంది. -
పేజర్లే బాంబులై...
బీరూట్: ఇజ్రాయెల్కు తమ ఆనుపానులు చిక్కొద్దనే ఉద్దేశంతో వాడుతున్న పేజర్లు చివరికి హెజ్బొల్లా మిలిటెంట్ల ప్రాణాలకే ముప్పు తెచి్చపెట్టాయి. మంగళవారం దేశంలో పలు ప్రాంతాల్లో వేలాది పేజర్లు ఉన్నపళాన పేలిపోయాయి. ఈ వింత పేలుళ్లలో కనీసం 2,800 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘కనీసం 200 మందికి పైగా ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటిదాకా 9 మంది మృత్యువాత పడ్డారు’’ అని ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియద్ తెలిపారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాలన్నీ హెజ్బొల్లా కంచుకోటలే. రాజధాని బీరూట్లో పలుచోట్ల జనం తమ చేతులు, ప్యాంటు జేబులు, బెల్టుల్లోని పేజర్లు పేలి గాయాలపాలవుతున్న వీడియోలు, ఫొటోలు వైరల్గా మారాయి. ఆస్పత్రుల్లో ఎ మర్జెన్సీ వార్డులన్నీ క్షతగాత్రులతో నిండిపోతున్నట్టు స్థానిక ఏపీ ఫొటోగ్రాఫర్లు తెలిపారు. ప్రధానంగా నడుము, కాళ్లకు గాయాలైనట్టు చెప్పారు. లెబనాన్లోని తమ రాయబారి కూడా పేజర్ పేలి గాయపడ్డ ట్టు ఇరాన్ ధ్రువీకరించింది. సిరియాలోనూ పేజర్ పేలుళ్లు జరిగాయి. ప్రతీకారం తప్పదు: హెజ్బొల్లా ఇది కచి్చతంగా ఇజ్రాయెల్ పనేనని హెజ్బొల్లా మండిపడింది. ప్రతీ కారం తప్పదంటూ ప్రకటన విడుదల చేసింది. మిలిటెంట్లు వాడుతున్న పేజర్లనే ఇజ్రాయెల్ వారిపైకి ఆయుధాలుగా మార్చి ప్రయోగించిందని ఏపీ అభిప్రాయపడింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో అవి ఏకకాలంలో పేలేలా చేసిందని చెప్పుకొచి్చంది. దీనిపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. సెల్ ఫోన్లు వాడితే తమ కదలికలను ఇజ్రాయెల్ కనిపెడుతుందనే భయంతో వాటి వాడకాన్ని హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా గతంలోనే ఆదేశించారు. దాంతో కమ్యూనికేషన్ కోసం మిలిటెంట్లు పేజర్లు వాడుతున్నారు. ఆ క్రమంలో ఇటీవల కొనుగోలు చేసిన కొత్త బ్రాండ్ పేజర్లే పేలాయని హెజ్బొల్లా ప్రతినిధి చెప్పుకొచ్చారు. ‘‘అవి ముందుగా వేడెక్కాయి. కాసేపటికే పేలిపోయాయి. వాటిలోని లిథియం బ్యాటరీలే కొంపముంచినట్టున్నాయి’’ అంటూ వాపోయారు. శత్రువు పని పట్టడంలో ఆరితేరిన ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఇలా వినూత్నంగా ప్లాన్ చేసిందన్న వ్యాఖ్యలు విని్పస్తున్నాయి. -
బ్రెజిల్లో కూలిన విమానం.. 62 మంది మృత్యువాత!
సావో పౌలో: బ్రెజిల్లోని సావో పౌలో రాష్ట్రంలో శుక్రవారం విమానం కుప్పకూలిన ఘటనలో అందులోని మొత్తం 62 మంది ప్రయాణికులు చనిపోయారు. సావో పౌలో అంతర్జాతీయ విమానం వైపు వెళ్తున్న ఆ విమానం విన్హెడో నగరంలోని జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంపై కూలింది. విమానం శిథిలాల నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి. ఓ విమానం నిట్టనిలువునా గిరికీలు తిరుగుతూ కూలడాన్ని, ఆ వెంటనే ఆ ప్రాంతంలో మంటలు ఎగసిపడటాన్ని చూపించాయి. ఘటనలో విమానంలో ఉన్న 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా పేర్కొన్నారు. మృతులకు సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఫైర్ సిబ్బందితోపాటు మిలటరీ పోలీసులు, పౌర రక్షణ అధికారులు విన్హెడోని ఘటనా ప్రాంతంలో రక్షణ, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
Wayanad Landslides: ఆగని మరణ మృదంగం
వయనాడ్(కేరళ): కనీవిని ఎరుగని పెను విషాదం నుంచి కేరళ ఇంకా తేరుకోలేదు. మరుభూమిలా మారిన తమ సొంత భూమి నుంచి బయటకు తీస్తున్న ఆప్తుల పార్ధివదేహాలను చూసిన బంధువులు, స్నేహితుల ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ కుగ్రామాల్లో ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య తాజాగా 289కి పెరిగింది. ఇంకా 200 మందికిపైగా స్థానికుల జాడ గల్లంతైంది. కాలంతోపోటీపడుతూ సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్గార్డ్, పోలీసు, స్థానిక యంత్రాంగం ముమ్మర గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే భీతావహంగా మారిన అక్కడి పరిసరాలు సహాయక చర్యలకు పెద్ద అవరోధంగా తయారయ్యాయి. కూలిన వంతెనలు, కొట్టుకుపోయిన రోడ్లు, కొట్టుకొచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, బురదమయమై నేల, కూలిన చెట్లు, వరద ప్రవాహం, భారీ వర్షం మధ్య సహాయక చర్యలు కొనసాగించడం అక్కడి బృందాలకు పెద్ద సవాల్గా మారింది. కాగా, ఇప్పటివరకు 91 శిబిరాలకు 9,328 మందిని తరలించామని కేరళ రెవిన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. 225 మంది ఆస్పత్రుల్లో చేరగా 96 మందికి చికిత్స కొనసాగుతోంది.ఇది జాతి విపత్తు: రాహుల్గతంలో సొంత నియోజకవర్గమైన వయనాడ్లో జరిగిన ఈ ఘోర విపత్తు చూసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చలించిపోయారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంకా గాంధీ కేరళకు వచ్చారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో వర్షంలోనే పర్యటించారు. తర్వాత మేప్పాడిలోని ఆస్పత్రుల్లో క్షతగాత్రులను, సహాయక శిబిరాల్లో బాధితుల బంధువులను కలిసి పరామర్శించారు. ‘‘ఇది వయనాడ్, కేరళలో భారీ విషాదం నింపింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందాల్సిందే. కుటుంబసభ్యులు, సొంతిళ్లను కోల్పోయిన స్థానికులను చూస్తుంటే మాటలు రావడం లేదు. సర్వం కోల్పోయిన వారిని ఎలా ఓదార్చాలో, వారికెలా ధైర్యం చెప్పాలో తెలీడం లేదు. ఇది జాతీయ విపత్తు’ అని రాహుల్ అన్నారు. ‘‘ ఇంతటి మహా విషాదాన్ని చూస్తుంటే మా నాన్న చనిపోయిన సందర్భం గుర్తొస్తోంది. అయితే వీళ్లు తమ నాన్నను మాత్రమే కాదు.. మొత్తం కుటుంబాన్నే కోల్పోయారు. నేను బాధపడుతున్నదానికంటే అంతులేని విషాదం వీరి జీవితాల్లో ఆవహించింది. వయనాడ్ బాధితులకు అందరూ అండగా నిలబడటం గర్వించాల్సిన విషయం. దేశ ప్రజలు బాధితులకు ఆపన్నహస్తం అందిస్తారు’ అని రాహుల్ అన్నారు.పారిపోదామనుకున్నా: వైద్యురాలి ఆవేదనధైర్యంగా పోస్ట్ మార్టమ్ చేసే వైద్యురాలు సైతం మృతదేహాలు ఛి ద్రమైన తీరు చూసి డాక్టర్ మనసు కకావికలమైన ఘటన వయనాడ్లోని స్థా నిక ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఇంతటి హృదయవిదారక దృశ్యాన్ని ఏనాడూ చూడలేదని బాధి తుల మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ చేసిన ప్రభుత్వ వైద్యురాలు గద్గద స్వరంతో చెప్పారు. ‘‘ ఎన్నో రకాల పోస్ట్మార్టమ్లు చేశాగానీ ఇలాంటివి ఇదే మొదలు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు శవపరీక్ష సమయంలో గుండెనిబ్బరంతో ఉంటారు. కానీ భారీ బండరాళ్లు పడిన ధాటికి దెబ్బతిన్న మృతదేహాలను చూశాక నాలో స్థైర్యం పోయింది. కొన్ని మృతదేహాలు పూర్తిగా చితికిపోయాయి. ఒకదానివెంట మరోటి తెస్తూనే ఉన్నారు. ఎక్కువ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా రూపు కోల్పోయాయి. ఒక ఏడాది చిన్నారి మృతదేహం దారుణంగా దెబ్బతింది. ఇక నా వల్ల కాదు.. క్షతగాత్రుల సహాయక శిబిరానికి పారిపోదామనుకున్నా. కానీ ఇంకోదారిలేక వృత్తిధర్మం పాటిస్తూ 18 మృతదేహాలకు పోస్ట్మార్టమ్ చేశా. తర్వాత కేరళలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సర్జన్లు వచ్చారు. రాత్రి 11.30కల్లా 93 పోస్ట్మార్టమ్లు పూర్తిచేశాం. ఈ ఘటనను జీవితంలో మర్చిపోను’ అని వైద్యురాలు తన అనుభవాన్ని చెప్పారు.కదిలొచ్చిన తల్లి హృదయంతల్లులను కోల్పోయిన పసిపిల్లలు పాల కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న దృశ్యాలను చూసిన ఒక తల్లి అనుకున్న తడవుగా వయనాడ్కు పయనమైంది. నాలుగు నెలల బిడ్డకు తల్లి అయిన ఆమె విషాదవార్త తెలియగానే వయనాడ్కు భర్త, పిల్లలతో కలిసి బయల్దేరారు. సెంట్రల్ కేరళలోని ఇడుక్కి నుంచి వస్తున్న ఆమెను మీడియా పలకరించింది. ‘‘ నాకూ చంటిబిడ్డ ఉంది. తల్లిపాల కోసం బిడ్డపడే ఆరాటం నాకు తెలుసు. అందుకే నా చనుబాలు ఇచ్చి అక్కడి అనాథలైన పసిబిడ్డల ఆకలి తీరుస్తా’ అని ఆమె అన్నారు. కాగా, కేరళ బాధితులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన సంతాప సందేశం పంపించారు. అవిశ్రాంతంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్మీని ఆయన అభినందించారు. -
Wayanad: బురద వరద ముంచేసింది
వయనాడ్ (కేరళ): ఘోర కలి. మాటలకందని విషాదం. కేరళ చరిత్రలో కనీ వినీ ఎరగని ప్రకృతి విలయం. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కొండ ప్రాంతమైన వయనాడ్ జిల్లాలో మహోత్పాతానికి కారణమయ్యాయి. అక్కడి మెప్పడి ప్రాంతంపైకి మృత్యువు కొండచరియల రూపంలో ముంచుకొచి్చంది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఆ ప్రాంతమంతటా భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వెల్లువెత్తిన బురద, ప్రవాహం ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. గ్రామాలతో పాటు సహాయ శిబిరాలు కూడా బురద ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఎటుచూసినా అంతులేని బురదే కప్పేసింది. దాంతో గాఢ నిద్రలో ఉన్న వందలాది మంది తప్పించుకునే అవకాశం కూడా లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. బురద, మట్టి దిబ్బల కింద సమాధైపోయారు. కళ్లు తిప్పుకోనివ్వనంత అందంగా ఉండే మెప్పడి ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో శవాల దిబ్బగా మారిపోయింది. ఇప్పటిదాకా 123 మృతదేహాలను వెలికితీశారు. వాటిలో చాలావరకు సమీపంలోని నదుల్లోకి కొట్టొకొచ్చినవే. ఏ శవాన్ని చూసినా కాళ్లు చేతులు తెగిపోయి కని్పంచడం బీభత్స తీవ్రతను కళ్లకు కడుతోంది. ప్రమాద స్థలం పొడవునా నిండిపోయిన బురద ప్రవాహాన్ని, మట్టి దిబ్బలను తొలగిస్తే వందల్లో శవాలు బయట పడతాయని చెబుతున్నారు. మృతుల్లో స్థానికులతో పాటు ఉత్తరాది నుంచి పొట్ట చేత పట్టుకుని వచి్చన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని భావిస్తున్నారు. సమీపంలోని టీ ఎస్టేట్లో పని చేస్తున్న 600 మంది వలస కూలీల జాడ తెలియడం లేదు. వారంతా విలయానికి బలై ఉంటారంటున్నారు. నడి రాత్రి ఘోర కలి... మెప్పడి ప్రాంతంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండ ప్రాంతమంతా తడిసీ తడిసీ వదులుగా మారిపోయింది. అర్ధరాత్రి వేళ కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. తొలుత సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వేళ ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో సహాయక సిబ్బంది హుటాహుటిన స్పందించారు. బాధితులను సమీపంలోని చూరల్మల స్కూలు వద్ద సహాయక శిబిరాలకు తరలించారు. అనంతరం తెల్లవారుజామున నాలుగింటికి ఆ ప్రాంతమంతటా మళ్లీ భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో శిబిరాలతో పాటు పరిసర గ్రామాల్లోని ఇళ్లు, దుకాణాలన్నీ బురదలో కొట్టుకుపోయాయి. రోడ్లు, బ్రిడ్జిల వంటివన్నీ నామరూపాల్లేకుండా పోయాయి. దాంతో ఆ ప్రాంతాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో సహాయక బృందాలు అక్కడ కాలు పెట్టలేకపోతున్నాయి. అయితే బురదలో చిక్కుబడి ప్రాణాలతో ఉన్న పలువురిని సైన్యం, నేవీ సంయుక్త ఆపరేషన్ చేపట్టి హెలికాప్టర్ల ద్వారా కాపాడాయి. మెప్పడి ఆరోగ్య కేంద్రంలో స్థలాభవం కారణంగా మృతదేహాలను నేలపైనే వరుసగా పేరుస్తున్నారు. ఉత్పాతం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారంతా తలలు బాదుకుంటూ, హృదయ విదారకంగా రోదిస్తూ తమవారి శవాల కోసం వెదుక్కుంటున్నారు! నిర్వాసితులుగా మారిన వేలాదిమందిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. రంగంలోకి సైన్యం కేరళ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సైన్యం, జాతీయ విపత్తు దళం హుటాహుటిన రంగంలోకి దిగాయి. బురద, మట్టి దిబ్బల కింద ప్రాణాలతో ఉన్నవారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నారు. వారి ఆనవాలు పట్టేందుకు డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. మోదీ దిగ్భ్రాంతి ఈ ఘోర విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. సీఎం పినరయి విజయన్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యలు తదితరాల్లో కేరళకు అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని ప్రకటించారు. ఆయన బుధవారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది.ప్రాణం దక్కించుకున్న వృద్ధుడు వయనాడ్ విలయంలో వెల్లువెత్తిన బురద ప్రవాహంలో చిక్కిన ఓ వృద్ధుడు గంటల కొద్దీ ఒక పెద్ద బండరాయిని ఆధారంగా పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. స్థానికులు అతని ఆర్తనాదాలు విని కూడా వరద ప్రవాహ తీవ్రత కారణంగా ఏమీ చేయలేకపోయారు. దాంతో వృద్ధుడు జోరు వానలో, వరద ప్రవాహం నడుమ గంటల పాటు బండరాయి చాటునే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చివరికి సహాయక బృందాలు చాలాసేపు శ్రమించి ఆయన్ను కాపాడాయి. ఆ వీడియో వైరల్గా మారింది.త్రుటిలో బయటపడ్డాం... కళ్లముందే సర్వస్వాన్నీ ముంచెత్తిన వరద, బురద బీభత్సం నుంచి పలువురు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ వణికిపోయారు. ఓ వృద్ధ జంట తమ ఇంటి చుట్టూ బురద నీటి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుండటంతో వణికించే చలిని, జోరు వానను కూడా లెక్కచేయకుండా రాత్రి 11 గంటల వేళ కొండపై భాగానికి వెళ్లిపోయింది. కాసేపటికే వాళ్ల ఇల్లు నామరూపాల్లేకుండా పోయింది. ‘‘పొరుగింటాయనను రమ్మని బతిమాలాం. రాకుండా ప్రాణాలు పోగొట్టుకున్నాడు’’ అంటూ వాళ్లు వాపోయారు. ‘‘మా బంధువులైన దంపతులు పసిపాపను చంకనేసుకుని ప్రాణాల కోసం పరుగులు తీస్తూ నాతో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రవాహం, బురద తమను ముంచెత్తుతున్నాయని చెప్పారు. కాసేపటికే ఫోన్ మూగబోయింది. వాళ్ల జాడా తెలియడం లేదు’’ అంటూ ఒక మహిళ రోదించింది.వయనాడ్కు రెడ్ అలర్ట్: న వయనాడ్తో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఫోన్లలో ఆర్తనాదాలు బురద ప్రవాహంలో చిక్కుబడ్డ చాలామంది కాపాడాలంటూ అధికారులకు ఫోన్లు చేశారు. ప్రాణ భయంతో ఫోన్లోనే ఏడ్చేసిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చానళ్లలో ప్రసారమవుతున్న ఆ సంభాషణలు, గ్రామాలన్నీ బురద కింద కప్పబడిపోయిన్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఇది మాటలకందని విషాదమని సీఎం విజయన్ అన్నారు. ‘‘భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం ప్రాంతమంతా పెను విధ్వంసానికి లోనైంది. మృతుల్లో మహిళలు, చిన్నారులున్నారు. పలు శవాలు చెలియార్ నదిలో పొరుగున మలప్పురం జిల్లాలోకి కొట్టుకొచ్చాయి.నదే రెండుగా చీలింది విరిగిపడ్డ కొండచరియల ధాటికి స్థానిక ఇరువలింజిపుజ నది ఏకంగా రెండుగా చీలిపోయింది! అక్కడి వెల్లరిమల ప్రభుత్వ పాఠశాల పూర్తిగా సమాధైపోయిందని సీఎం విజయన్ చెప్పారు. -
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల హింస.. మరో 18 మంది మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల కోటాలో సంస్కరణలను కోరుతూ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మరో 18 మంది చనిపోగా 2,500 మంది వరకు గాయపడ్డారు. దీంతో, ఈ ఆందోళనల మృతుల సంఖ్య 25కు చేరింది. గురువారం ఆందోళనకారులు ఢాకాలో ప్రభుత్వ టీవీ కార్యాలయం ముందుభాగాన్ని ధ్వంసం చేశారు. పార్కు చేసిన వాహనాల్ని తగులబెట్టారు. దీంతో, ఉద్యోగులతోపాటు జర్నలిస్టులు లోపలే చిక్కుబడిపోయారు. ఢాకాతోపాటు ఇతర నగరాల్లో ఉన్న వర్సిటీల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఆందోళనకారులు భద్రతా సిబ్బంది, అధికార పార్టీ అనుకూలురతో బాహాబాహీగా తలపడ్డారు. ఘర్షణల్లో 18 మంది చనిపోగా 2,500 మందికి పైగా గాయపడినట్లు డెయిలీ స్టార్ పత్రిక తెలిపింది. ఢాకాలోనే 9 మంది చనిపోయినట్లు పేర్కొంది. దాంతో రైళ్లతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
Israel-Hamas war: 90 మంది దుర్మరణం
జెరుసలేం: గాజాలోని దక్షిణ ప్రాంత నగరం ఖాన్ యూనిస్పై శనివారం ఇజ్రాయెల్ ఆర్మీ మళ్లీ విరుచుకుపడింది. తాజా దాడుల్లో 90 మంది మృతి చెందగా కనీసం 300 మంది పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారు. హమాస్ మిలటరీ విభాగం అధిపతి మహ్మద్ డెయిఫ్ లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ మరో ముఖ్య నేత రఫా సలామాను కూడా ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో వీరిద్దరూ చనిపోయిందీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఫెన్సింగ్తో ఉన్న హమాస్ స్థావరంపై జరిపిన దాడిలో కొందరు మిలిటెంట్లు కూడా హతమైనట్లు ప్రకటించింది. అయితే, ఉత్తర రఫా– ఖాన్ యూనిస్ మధ్యలో ఇజ్రాయెల్ ఆర్మీ రక్షిత ప్రాంతంగా ప్రకటించిన మువాసిలోనే ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లక్షలాదిగా పాలస్తీనియన్లు తలదాచుకున్న మువాసిపైకి కనీసం ఏడు క్షిపణులు వచ్చి పడ్డాయని అంటున్నారు. ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, కాలిపోయిన కార్లు, టెంట్లు, నల్లగా మసిబారిన గృహోపకరణాలు నిండిపోయి ఉన్నాయి. దాడి తీవ్రతకు చిన్నారుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయని, తమ చేతులతోనే వాటిని ఏరుకోవాల్సి వచ్చిందని ఓ వ్యక్తి రోదిస్తూ తెలిపాడు. బాధితుల్ని కార్లు, గాడిదల బండ్లు, దుప్పట్లలో వేసుకుని సమీపంలోని నాసర్ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటనను హమాస్ ఖండించింది. అక్కడ డెయిఫ్ సహా తమ నేతలెవరూ లేరని స్పష్టం చేసింది. భయంకరమైన ఊచకోతను కప్పిపుచ్చుకునేందుకే ఇజ్రాయెల్ ఆర్మీ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తోందని మండిపడింది. ఇజ్రాయెల్ చెబుతున్నదే నిజమైతే గత తొమ్మిది నెలల యుద్ధంలో సాధించిన కీలక విజయమవుతుందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో సాగుతున్న చర్చలకు తాజా ఘటన అవరోధంగా మారుతుందని చెబుతున్నారు.ఎవరీ డెయిఫ్..?ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో హమాస్ మిలటరీ వి భాగం చీఫ్గా వ్యవహ రిస్తున్న డెయిఫ్ది మొదటి పేరు. గత రెండు దశాబ్దాల్లో ఇజ్రాయె ల్ నిఘా విభాగాలు పలుమార్లు చేసిన హత్యాయత్నాల నుంచి డెయిఫ్ త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పట్లో గాయపడిన ఇతడు పక్షవాతం బారినపడుతున్నట్లుగా భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంపై జరిపిన మెరుపుదాడికి సూత్రధారి డెయిఫే అని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. 30 ఏళ్ల వయస్సులో ఇతడి ఒకే ఒక్క ఫొటో తప్ప మరే ఆధారం ఇజ్రాయెల్ ఆర్మీ వద్ద లేదు. -
తమిళనాట 50కి చేరిన మద్యం మృతులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం మరో 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 50కి చేరాయి. అలాగే, సారా తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు కూడా మరణించడంతో ఆ సంఖ్య 50ని దాటింది. అయితే, వీరి మరణంపై అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కల్తీ సారా మరణాల ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. దద్దరిల్లిన అసెంబ్లీ కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 50 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. -
86కు చేరిన కాంగో పడవ మృతులు
కిన్షాసా: కాంగోలో పడవ మునిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 86కు పెరిగింది. 271 మంది ప్రయాణికులతో కిక్కిరిసిన నాటు పడవ ఇంజన్ వైఫల్యంతో మంగళవారం నీట మునగడం తెలిసిందే. 185 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. దట్టమైన అటవులు, నదుల కారణంగా కాంగోలో రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. జనం పడవ ప్రయాణాలకే మొగ్గుచూపుతారు. పడవ ప్రమాదాలు అక్కడ సర్వసాధారణం. ఫిబ్రవరిలోనూ నాటు పడవ మునిగి డజన్లకొద్దీ చనిపోయారు. -
Kuwait Building Fire: కువైట్లో భారీ అగ్నిప్రమాదం... 49 మంది దుర్మరణం
దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కారి్మకులు నివసిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వలస వచి్చన వీరంతా ఎన్బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కారి్మకుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కారి్మకులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నెంబర్ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది. కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్లోని మొత్తం కారి్మకుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కలి్పంచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. యాజమాన్యం దురాశకు అమాయకులు బలి మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కలి్పంచని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కారి్మకులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిహుటాహుటిన కువైట్కు మంత్రి రాజవర్ధన్ సింగ్కువైట్ అగ్నిప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు చెప్పారు. కువైట్ భారత రాయబార కార్యాలయం సహాయక చర్యల్లో నిమగ్నమైందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. ఈ ఉదంతంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్ సింగ్ కువైట్కు బయలుదేరారు. సహాయ చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. మృతుల్లో మలయాళీలు ఎక్కువగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తమయ్యారు. కేంద్రం వెంటనే తగిన సాయం అందించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్కు లేఖ రాశారు. -
అమెరికాలో టోర్నడోల బీభత్సం
హూస్టన్: అమెరికాలో పలు ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు టోర్నడోలు ప్రతాపం చూపుతున్నాయి. గాలుల తీవ్రతకు ఇళ్లు కూలడం, చెట్లు పడిపోవడం వంటి ఘటనల్లో 28 మందికి పైగా చనిపోయారు. వేలాదిగా ఇళ్లు నేల మట్టమయ్యాయి. టెక్సాస్, ఒక్లహామా, అర్కన్సాస్ సహా 16 రాష్ట్రాల్లో 6 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు టెక్సాస్, ఆస్టిన్, డాలస్, న్యూ మెక్సికో, ఒక్లహామా, అరిజోనా, కొలరాడో రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇలినాయీ, మిస్సోరీ, కెంటకీ, టెన్నెస్సీల్లో తీవ్రమైన గాలి తుఫాన్లు వీస్తాయని చెబుతున్నారు. -
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..
మెల్బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. -
కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
గురుగ్రామ్: కదులుతున్న బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. 17 మంది గాయపడ్డారు. హరియాణాలోని నుహ్ జిల్లా టౌరు సమీపంలో శని వారం వేకువజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. పంజాబ్లోని హోషియార్పూర్, లూధియానా జిల్లాలకు చెందిన సుమారు 60 మందితో కూడిన బంధువర్గం మథుర, బృందావన్ తీర్థయాత్రకు వెళ్లి తిరిగివస్తోంది. వీరి బస్సులో కుండ్లి– మనేసర్– పల్వాల్(కేఎంపీ)ఎక్స్ప్రెస్ వేపై వెళ్తుండగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు వాహన చోదకులు గమనించి డ్రైవర్ను హెచ్చరించారు. అతడు పట్టించుకోకపోవడంతో బస్సును వెంబడించారు. ఈలోగా బస్సులోపల మంటలు, పొగ వ్యాపించడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి పరారయ్యాడు. బస్సు మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి అతికష్టమ్మీద కిందికి దూకారు. అప్పటికే బస్సులోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Pakistan: లోయలో పడిన బస్సు.. 17 మంది మృత్యువాత
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. సింధ్, బలోచిస్తోన్ ప్రావిన్స్ల సరిహద్దుల్లోని హుబ్ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్లోని తట్టా పట్టణానికి చెందిన కొందరు బలోచిస్తాన్లోని హుబ్ పట్టణంలోని షా నూరానీ దర్గాకు బుధవారం మధ్యాహ్నం బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు రాత్రి 8 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. క్షతగాత్రులను అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మాస్కోలో మారణహోమం
మాస్కో/న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్స్్కలో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధికారులు మాత్రం ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ముష్కరుల పనేనని ఆరోపిస్తున్నారు. కాల్పులకు తెగబడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. తాజా పరిణామాలపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ శనివారం రష్యా అధినేత పుతిన్తో సమావేశమయ్యారు. అనుమానితుల అరెస్టు తదితరాల గురించి తెలియజేశారు. రష్యాలో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం సాధించి ఆరేళ్లపాటు అధికారం దక్కించుకున్నారు. కొన్ని రోజులకే మాస్కోలో భీకర దాడి జరగడం, 133 మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. మోదీ దిగ్భ్రాంతి మాస్కో ఘోరకలిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష దాడిని భారత్ ఖండిస్తోందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో రష్యా ప్రజలకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్కు సంబంధం ఉంది: పుతిన్ కాల్పుల ఘటనతో ఉక్రెయిన్కు సంబంధం ఉందని పుతిన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్కు పారిపోయేందుకు ప్రయతి్నంచారని అన్నారు. మా పని కాదు: ఉక్రెయిన్ రష్యా కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందించారు. మాస్కో మారణహోమంతో తమకు సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు ఉక్రెయిన్కు లేదన్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశారు ► కాల్పులు జరిగిన క్రాకస్ సిటీ హాల్ చాలా విశాలమైన కాంప్లెక్స్. ఇందులో మ్యూజిక్ హాల్తోపాటు షాపింగ్ సెంటర్ ఉంది. ► శుక్రవారం రాత్రి సంగీత కచేరి ప్రారంభం కావడానికి ముందు జనం సీట్లలో కూర్చున్నారు. మొత్తం 6,200 సీట్లూ నిండిపోయాయి. ► సంగీత కార్యక్రమం ప్రారంభం కాకముందే కాల్పుల మోత మొదలైనట్లు వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ► సైనిక దుస్తుల్లో వచి్చన ముష్కరులు అటోమేటిక్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు. జనంపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి కాల్పులు జరిపారు. తూటా నుంచి రక్షణ కోసం పలువురు సీట్ల వెనుక దాక్కున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ► అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. చాలామంది బయటకు పరుగులు తీసేందుకు ప్రయతి్నంచారు. తొక్కిసలాట జరిగింది. హాల్ కిక్కిరిసి ఉండడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. లోపలంతా పొగ అలుముకుంది. ► ముష్కరులు గ్రెనేడ్లు, బాంబులు కూడా వేసినట్టు రష్యా మీడియా వెల్లడించింది. కాల్పులు, పేలుళ్ల ధాటికి హాల్లో మంటలు రేగాయి. పైకప్పు కూలిపోయింది. అగి్నమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్రాకస్ సిటీ హాల్లో కాల్పులు జరుపుతున్న దుండగులు -
ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడంతస్తుల షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 46 మంది సజీవ దహనమయ్యారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గ్యాస్ లీకేజీయే కారణమని భావిస్తున్నారు. బైలీ రోడ్డు ప్రాంతంలోని గ్రీన్ కోజీ కాటేజీలో పలు రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్లో రాత్రి 9.50 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు పై అంతస్తులకు శరవేగంగా వ్యాపించాయి. దీంతో అందులోని వారంతా ప్రాణభయంతో పై అంతస్తులకు చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సుమారు 75 మందిని నిచ్చెనల సాయంతో కిందికి దించారు. మంటలను అర్ధరాత్రి 12.30 గంటలకు అదుపులోకి తీసుకురాగలిగారు. ఘటనపై ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
World Health Organization: భారత్లో 9 లక్షల క్యాన్సర్ మరణాలు
న్యూఢిల్లీ: భారత్ను క్యాన్సర్ మహమ్మారి కబళిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది. ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం 2022లో భారత్లో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. క్యాన్సర్ కారణంగా 9.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పురుషల్లో పెదవులు, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు సర్వసాధారణమయ్యాయి. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువయ్యాయి. మొత్తం కొత్త కేసుల్లో 27 శాతం బ్రెస్ట్, 18 శాతం సెరి్వక్స్ యుటెరీ క్యాన్సర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సోకి ఐదేళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య 5.3 కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు. -
Israel-Hamas War: అదే గాజా.. అదే దీన గాథ!
దెయిర్ అల్ బలాహా/ఖాన్ యూనిస్ (గాజా): అదే కల్లోలం. అవే దారుణ దృశ్యాలు. అందరి కంటా నిస్సహాయంగా నీటి ధారలు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల ధాటికి గాజాలో మానవీయ సంక్షోభం తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఎటు చూసినా మరణమృదంగం ప్రతిధ్వనిస్తోంది. గాజాలోని దాదాపు అన్ని ఆస్పత్రులనూ ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టి రోజుల తరబడి దిగ్బంధించడం తెలిసిందే. దాంతో కరెంటుతో పాటు కనీస సౌకర్యాలన్నీ దూరమై అవి నరకం చవిచూస్తున్నాయి. ఐసీయూలు, ఇంక్యుబేటర్లకు కూడా కరెంటు, ఆక్సిజన్ రోజులు దాటింది. వాటిల్లోని రోగులు, నవజాత శిశువులు నిస్సహాయంగా మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారు! ఇప్పటిదాకా అరచేతులు అడ్డుపెట్టి అతి కష్టమ్మీద వారి ప్రాణాలు నిలుపుతూ వచ్చిన వైద్యులు కూడా క్రమంగా చేతులెత్తేస్తున్నారు. గాజాలో అతి పెద్దదైన అల్ షిఫాతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి! షిఫా ఇంకెంతమాత్రమూ ఆస్పత్రిగా మిగల్లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోం గేబ్రెయేసస్ వాపోయారు. ‘‘ఈ దారుణంపై ప్రపంచం మౌనం వీడాల్సిన సమయమిది. కాల్పుల విరమణ తక్షణావసరం’’ అని పిలుపునిచ్చారు. చిన్నారులను కాపాడేందుకు... ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నవజాత శిశువులను కాపాడుకునేందుకు అల్ షిఫా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా తదితరాలన్నీ నిలిచిపోవడంతో చిన్నారులను ఇంక్యుబేటర్ల నుంచి తీసుకెళ్లి సిల్వర్ ఫాయిల్ తదితరాల్లో చుట్టబెట్టిన మంచాలపై ఒక్కచోటే పడుకోబెడుతున్నారు. పక్కన వేడినీటిని ఉంచి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంధన రగడ ఇంక్యుబేటర్లను నడిపి చిన్నారులను కాపాడేందుకు అల్ షిఫా ఆస్పత్రికి 300 లీటర్ల ఇంధనం అందజేస్తే హమాస్ ఉగ్రవాదులు అడ్డుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. కానీ అరగంటకు కూడా చాలని ఆ సాయంతో ఏం ప్రయోజనమని పాలస్తీనా ఆరోగ్య శాఖ మండిపడింది. ఇది క్రూర పరిహాసమంటూ దుయ్యబట్టింది. అల్ రంటిసి, అల్ నస్ర్ ఉత్తర గాజాలోని ఈ ఆస్పత్రుల నుంచి రోగులు తదితరులను హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారానికే కొద్దిమంది రోగులు, వైద్య సిబ్బంది మినహా ఇవి దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అయితే వాటిలో సాధారణ పౌరులు వందలాదిగా తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం వీటిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని వారందరినీ అక్కడినుంచి పంపించేస్తోంది. అల్ స్వెయిదీ లోపల కొద్ది మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. 500 మందికి పైగా శరణార్థులు తలదాచుకుంటున్నారు. శనివారం నాటి రాకెట్ దాడి ఆస్పత్రిని దాదాపుగా నేలమట్టం చేసింది. ఆదివారం రాత్రికల్లా ఇజ్రాయెల్ సైనికులు ఆస్పత్రిలోకి ప్రవేశించారు. ఇంకా మిగిలిన ఉన్న వారందరినీ ఖాళీ చేయించి బుల్డోజర్లతో ఆస్పత్రిని నేలమట్టం చేయించారు. అల్ షిఫా 700 పడకలతో గాజాలోనే అతి పెద్ద ఆస్పత్రి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం పూర్తిస్థాయిలో చుట్టుముట్టింది. దాంతో వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. కరెంటు లేదు. ఇంధనం, ఆహార సరఫరాలు తదితరాలన్నీ నిండుకున్నాయి. ఇక్కడ తలదాచుకున్న శరణార్థుల్లో అత్యధికులు పారిపోయారు. ఇంకో 2,500 మందికి పైగా ఆస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కానీ 20 వేలకు పైగా అక్కడ చిక్కుబడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 600 మందికి పైగా రోగులు, 500 మంది దాకా వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వందలాది శవాలు ఆస్పత్రి ప్రాంగణంలో పడున్నట్టు చెబుతున్నారు! ఆది, సోమవారాల్లోనే 35 మంది రోగులు, ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 36 మంది చిన్నారులు ఏ క్షణమైనా తుది శ్వాస విడిచేలా ఉన్నట్టు వైద్య వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. అల్ ఖుద్స్ గాజాలో రెండో అతి పెద్ద ఆస్పత్రి. 500 మందికి పైగా రోగులు, 15 వేలకు పైగా శరణార్థులున్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఆదివారానికే ఆస్పత్రిలో సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఆహార నిల్వలన్నీ నిండుకున్నాయి. పరిసరాల్లోనే గాక ఆస్పత్రిపైకి కూడా భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాంతో ఇక్కడి ఐసీయూ వార్డు రోగులు ఒకట్రెండు రోజుల్లో నిస్సహాయంగా మృత్యువాత పడేలా ఉన్నారు! 6,000 మందికి పైగా శరణార్థులను ఇక్కణ్నుంచి దక్షిణాదికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్ అక్సా ఇక్కడ కూడా వందల సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది, శరణార్థులున్నారు. రోగుల, ముఖ్యంగా 100 మందికి పైగా ఉన్న నవజాత శిశువుల సామూహిక మరణాలకు ఇంకెంతో సమయం పట్టదని సిబ్బంది చెబుతున్నారు. తూటాలు తరచూ ఆస్పత్రి లోనికి దూసుకొస్తున్నాయంటున్నారు. ఆస్పత్రిని సైన్యం చుట్టుముట్టింది. -
ఇజ్రాయెల్ గుప్పిట్లో గాజా
గాజా్రస్టిప్: హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాను పూర్తిగా చుట్టుముట్టింది. గాజా స్ట్రిప్లోని ఇతర ప్రాంతాలతో ఉత్తర గాజాకు సంబంధాలు తెగిపోయాయి. ఉత్తర గాజా మొత్తం దిగ్బంధంలో చిక్కుకుంది. గాజా స్ట్రిప్ను రెండు ముక్కలుగా విభజించామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఉత్తర గాజా ఇప్పుడు తమగుప్పిట్లో ఉందని పేర్కొంది. యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ అని, ఇకపై కీలక దాడులు చేయబోతున్నామని తెలియజేసింది. గాజా సిటీలోకి అడుగుపెట్టడానికి ఇజ్రాయెల్ సేనలు ముందుకు కదులుతున్నాయి. సైన్యం ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉత్తర గాజాపై నిప్పుల వాన కురిపించింది. వైమానిక దాడులు ఉధృతం చేసింది. 450 లక్ష్యాలను ఛేదించామని, మిలిటెంట్ల స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సీనియర్ మిలిటెంట్ జమాల్ మూసా హతమయ్యాడని వివరించింది. హమాస్ కాంపౌండ్ ఒకటి తమ అ«దీనంలోకి వచ్చిందని పేర్కొంది. మిలిటెంట్లకు సమీపంలోనే ఉన్నామని, అతిత్వరలో వారిపై మూకుమ్మడి దాడి ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ వెల్లడించారు. హమాస్కు గాజా సిటీ ప్రధానమైన స్థావరం. మిలిటెంట్లు ఇక్కడ పటిష్టమైన సొరంగాల వ్యవస్థను నిర్మించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆయుధ నిల్వలను సిద్ధం చేసుకున్నారు. గాజా సిటీ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులతో ముఖాముఖి తలపడేందుకు వారు సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా తెలియజేసింది. ఒక్క రాత్రి 200 మంది బలి! గాజాపై ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకూ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో దాదాపు 200 మంది మరణించారని గాజా సిటీలోని అల్–íÙఫా హాస్పిటల్ డైరెక్టర్ చెప్పారు. పెద్ద సంఖ్యలో మృతదేహాలు తమ ఆసుపత్రికి చేరుకున్నాయని తెలిపారు. చాలామంది క్షతగాత్రులు చికిత్స కోసం చేరారని వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. కాల్పుల విరమణకు ససేమిరా గాజాపై దాడులకు విరామం ఇవ్వాలని, పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందేలా చర్యలు తీసుకోవాలంటూ మిత్రదేశం అమెరికా చేసిన సూచనను ఇజ్రాయెల్ లెక్కచేయడం లేదు. కాల్పుల విరమణ పాటించాలంటూ జోర్డాన్, ఈజిప్టు తదితర అరబ్ దేశాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడుదల చేసే వరకూ గాజాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. గాజాలో సంక్షోభం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుండడంతో అరబ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. జోర్డాన్ సైనిక రవాణా విమానం సోమవారం ఉత్తర గాజాల్లో క్షతగాత్రులకు, రోగులుకు అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలను జార విడిచింది. మరోవైపు ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఘర్షణలు ఆగడం లేదు. ఇరాన్ అండదండలున్న హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు సాగిస్తూనే ఉన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ దాడుల్లో దక్షిణ లెబనాన్లో నలుగురు పౌరులు మరణించారు. 10,022 మంది పాలస్తీనియన్లు మృతి ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలై నెల రోజులవుతోంది. ప్రాణనష్టం నానాటికీ పెరిగిపోతోంది. గాజాలో మృతుల సంఖ్య 10 వేలు దాటింది. ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 10,022 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. మృతుల్లో 4,100 మంది చిన్నారులు, 2,600 మంది మహిళలు ఉన్నారని తెలియజేసింది. వైమానిక దాడుల్లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ భూభాగం వైపు హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో 500కుపైగా రాకెట్లు గాజాలోనే కూలిపోయాయని, వాటివల్ల పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. డేర్ అల్–బాలహ్ పట్టణంలో సోమవారం ఉదయం ఓ ఆసుపత్రి సమీపంలోనే 66 మృతదేహాలను సామూహికంగా ఖననం చేశారు. ముగిసిన ఆంటోనీ బ్లింకెన్ పర్యటన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మధ్యప్రాచ్యంలో పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమయ్యారు. ఆయన సోమవారం తుర్కియే రాజధాని అంకారాలో ఆ దేశ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్తో సమావేశమయ్యారు. అమెరికాకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. గాజాలో సంక్షోభాన్ని నివారించే ప్రక్రియ పురోగతిలో ఉందని చెప్పారు. గాజాపై దాడులకు విరామం ఇవ్వాలని ఇజ్రాయెల్కు మరోసారి సూచించారు. ఇజ్రాయెల్–హమాస్ సంఘర్షణకు తెరదించడం, బందీలను విడిపించడంతోపాటు గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేలా చర్యలు తీసుకొనే లక్ష్యంతో మధ్య ప్రాచ్యం చేరుకున్న బ్లింకెన్ పాక్షికంగానే విజయం సాధించారు. మధ్యప్రాచ్యం చేరుకున్న అమెరికా జలాంతర్గామి ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణ మరింత ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా తన గైడెడ్ మిస్సైల్ జలాంతర్గామిని మధ్యప్రాచ్యానికి పంపించింది. ఓహాయో క్లాస్ సబ్మెరైన్ తనకు కేటాయించిన ప్రాంతంలో అడుగుపెట్టిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈజిప్టు రాజధాని కైరోకు ఈశాన్య దిక్కున సూయెజ్ కెనాల్లో జలాంతర్గామి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తమ గైడెడ్ మిస్సైల్ జలాంతర్గాముల ఎక్కడ మకాం వేశాయన్నది అమెరికా సైన్యం ఇలా బహిరంగంగా ప్రకటించడం అత్యంత అరుదు. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ జోలికి ఎవరూ రావొద్దన్న హెచ్చరికలు జారీ చేయడానికే అమెరికా తన జలాంతర్గామిని మధ్యప్రాచ్యానికి తరలించినట్లు తెలుస్తోంది. ఖాన్ యూనిస్లోని భవన శిథిలాల్లో బాధితుల కోసం అన్వేíÙస్తున్న ఓ పాలస్తీనా వాసి ఉద్వేగం రఫాలో శిథిలాల మధ్య చిన్నారులు -
Israel-Hamas war: గాజా రక్తసిక్తం
ఖాన్ యూనిస్/రఫా/జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో దాడులు కొనసాగిస్తోంది. భూతల దాడులతోపాటు వైమానిక దళం బాంబులు ప్రయోగిస్తోంది. గాజా రక్తసిక్తంగా మారుతోంది. హమాస్ మిలిటెంట్లతోపాటు వందలాది మంది సాధారణ ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గాజా సిటీ సమీపంలో జబాలియా శరణార్థి శిబిరంలోని అపార్టుమెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం రెండో రోజు బుధవారం కూడా దాడులు సాగించింది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. క్షతగాత్రులుగా మారి రక్తమోడుతున్న మహిళలను, చిన్నపిల్లలను శిథిలాల నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి. జబాలియాలో సాధారణ నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన హమాస్ కమాండ్ సెంటర్ను, మిలిటెంట్ల సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇక్కడ హమాస్ కీలక కమాండర్తోపాటు చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని ప్రకటించింది. సాధారణ ప్రజలు 50 మందికిపైగానే మరణించినట్లు, వందలాది మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. శరణార్థి శిబిరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తోపాటు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హమాస్ చెరలో 240 మంది బందీలు ఇజ్రాయెల్ సైన్యం–హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 8,700 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని, 22,000 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో 122 మంది పాలస్తీనియన్లు చనిపోయారని వెల్లడించింది. హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. ఇప్పటివరకు నలుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. బందీగా ఉన్న ఒక ఇజ్రాయెల్ మహిళా జవాన్ను ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు విడిపించాయి. 34 మంది జర్నలిస్టులు బలి ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో 34 మంది జర్నలిస్టులు మరణించారని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ వెల్లడించింది. ఇరు పక్షాలూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో పాలస్తీనియన్ జర్నలిస్టులు దారుణ హత్యలకు గురవుతున్నారని, వీటిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ జరపాలని పేర్కొంది. సాధారణ ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు మకాం వేస్తున్నారని, తద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు మృతి గాజాలో హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న ఘర్షణలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు హలెల్ సోలోమాన్ (20) బుధవారం మృతిచెందాడు. దక్షిణ ఇజ్రాయెల్లోని డొమోనా పట్టణానికి చెందిన సోలోమాన్ హమాస్ మిలిటెంట్లపై వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతిపట్ల డిమోనా మేయర్ సంతాపం ప్రకటించారు. డిమోనా పట్టణాన్ని ‘లిటిల్ ఇండియా’గా పిలుస్తుంటారు. భారత్ నుంచి వలస వచి్చన యూదులు ఇక్కడ స్థిరపడ్డారు. గాజాలో మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు 11 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. బుధవారం ఒక్కరోజే 9 మంది మరణించారు. ఇంటర్నెట్, ఫోన్ సేవలకు అంతరాయం గాజాలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు బుధవారం కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. సాయంత్రానికల్లా పునరుద్ధరించారు. ఇంటర్నెట్, ఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతుండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్కు ఆహారం, ఇంధనం ఎగుమతులు ఆపేయండి గాజాలో సాధారణ పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్కు తగిన బుద్ధి చెప్పాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇజ్రాయెల్కు ఆహారం, ఇంధనం ఎగుమతులను తక్షణమే నిలిపివేయాలని బుధవారం ఆస్లామిక్ దేశాలకు పిలుపునిచ్చారు. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నేరాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్ను ఏకాకిని చేయాలని, ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ఇస్లామిక్ దేశాలకు సూచించారు. -
Libya Floods: లిబియాలో ఊహకందని మహా విషాదం
డెర్నా: అస్థిర ప్రభుత్వాలు, సంక్షోభం, ఎవరికీ పట్టని ప్రజా సంక్షేమంతో సమస్యల వలయంలో చిక్కిన లిబియాపై ప్రకృతి కత్తి గట్టింది. ఊహించని వరదలు, వరద నీటి ధాటికి పేకమేడల్లా కుప్పకూలిన రెండు డ్యామ్లు.. వరద విలయాన్ని మరింత పెంచాయి. డ్యామ్ల నుంచి దూసుకొచ్చిన నీటిలో కొట్టుకుపోయి జలసమాధి అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటి గణాంకాల ప్రకారం డెర్నా సిటీలో వరద మృతుల సంఖ్య ఏకంగా 5,100 దాటింది. ఇంకా వేలాది మంది జాడ గల్లంతయిందన్న కథనాలు చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరద ఉధృతికి ఇళ్లుసహా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు వేలాదిగా ఉన్నారు. డెర్నా సిటీ తీరప్రాంతంలోని పర్వతాలు, లోయలతో నిండిన నగరం. వరదల కారణంగా చాలా రోడ్లు దెబ్బతిని సహాయక బృందాలు వరద ముంపు ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో చాలా చోట్ల సహాయక చర్యలు మొదలేకాలేదు. అతికష్టం మీద కొన్ని బృందాలు చేరుకుని జలమయమైన ఇళ్లలో బాధితుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. నేలమట్టమైన భవనాలు, శిథిలాల కింద వెతికే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 30 వేలు దాటిన వలసలు వరద ధాటికి సర్వం కోల్పోవడంతో దాదాపు 30 వేల మంది స్థానికులు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్లారని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ సంఖ్య 40,000కుపైనే ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్ సొసైటీ లిబియా ప్రతినిధి తమెర్ రమదాన్ అంచనావేశారు. రెండు ప్రభుత్వాల మధ్య నలిగి.. తూర్పు ప్రాంతంలో ఒక ప్రభుత్వం, మరో దిశలో ఇంకో ప్రభుత్వాల నిర్లక్ష్య ఏలుబడిలో ఉన్న లిబియాలో మౌలిక వసతుల కల్పన అరణ్యరోదనే అయ్యింది. ‘నగరంలో ఉన్న ఏకైక శ్మశానానికి తరలించేందుకు మృతదేహాలను ఒక దగ్గరకు చేరుస్తాం. ఈ జల విలయంలో 11 మంది కుటుంబసభ్యులను కోల్పోయి గుండెలవిసేలా రోది స్తున్న ఒకాయనను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు’ అని సహాయక బృంద సభ్యుడొకరు చెప్పారు. ‘ నా కుటుంబం మొత్తాన్నీ కోల్పోయా. వరదల్లో మా వాళ్ల మృతదేహాలు సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’ అని అబ్దల్లా అనే వ్యక్తి వాపోయారు. రోడ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు బుల్డోజర్లుతో రెండు రోజులుగా నిరంతరంగా పనిచేయిస్తున్నారు. అప్పుడుగానీ అత్యవసర సరుకుల్ని తరలించలేని దుస్థితి. వేరే పట్టణాలకు మృతదేహాల తరలింపు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించే పరిస్థితు లు డెర్నీ సిటీలో కరువవడంతో వందలాది మృతదేహా లను సమీపంలోని పట్టణాలకు తరలిస్తున్నారు. మరణించిన వారిలో 84 మంది ఈజిప్టువాసులూ ఉన్నారు. దక్షిణాన ఉన్న బెనీ సుయెఫ్ రాష్ట్రంలో ఎల్–షరీఫ్ గ్రామంలో డజన్లకొద్దీ ఈజిప్షియన్లు జలసమాధి అయ్యారు. డెర్నాలో భీతావహ దృశ్యం నగరంలో చాలా చోట్ల మృతదేహాలు కనపడుతు న్నాయి. బురదనీటిలో కూరుకుపోయి, వీధుల్లోకి కొట్టుకొచ్చి, సముద్ర తీరం వెంట.. ఇలా చాలా ప్రాంతాల్లో స్థానికులు విగతజీవులై కనిపించారు. ఒక్కసారిగా నీరు రావడంతో ఎటూ తప్పించుకోలేని నిస్సహాయక స్థితి. ‘నగరంలో ఏ ప్రాంతంలో సహాయం చేసేందుకు వెళ్లినా అక్కడ మాకు చిన్నారులు, మహిళల మృతదేహాలే కనిపిస్తున్నాయి’ అని బెంఘాజీకి చెందిన ఒక సహాయకుడు ఫోన్లో మీడియా సంస్థకు చెప్పారు. ‘సిటీ శివార్లలోని డ్యామ్ బద్దలైన శబ్దాలు మాకు వినిపించాయి. నగరం గుండా ప్రవహించే వాదీ డెర్నీ నదిలో ప్రవాహ ఉధృతి అమాంతం ఊహించనంతగా ఎగసి జనావాసాలను ముంచేసింది. ‘ డ్యామ్ బద్దలవడంతో ఏకంగా ఏడు మీటర్ల ఎత్తులో దూసుకొచ్చిన ప్రవాహం తన మార్గంలో అడ్డొచ్చిన అన్నింటినీ కూల్చేసింది’ అని లిబియాలో రెడ్ క్రాస్ కమిటీ ప్రతినిధి బృంద సారథి యాన్ ప్రైడెజ్ చెప్పారు. మధ్యధరా ప్రాంతంలో సన్నని తీరప్రాంతంలో పర్వత పాదాల చెంత ఈ నగరం ఉంది. పర్వతాల నుంచి వచ్చిన వరద నీరు నగరాన్ని ముంచేస్తూ తీరం వైపు కిందకు ఉరకలెత్తడంతో వరద తీవ్రత భయంకరంగా ఉంది. వరద ధాటికి దక్షిణం వైపు కేవలం రెండు రోడ్లు మాత్రమే మిగిలిపోయాయి. కూలిన వంతెనలు నగరం మధ్య భాగాన్ని రెండుగా చీల్చాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాయపడిన ఏడు వేలకుపైగా స్థానికులను మైదానాల్లోని తాత్కాలిక వైద్యశాలల్లో చికిత్సనందిస్తున్నారని తూర్పు లిబియాలోని అంబులెన్స్, అత్యవసర కేంద్రం అధికార ప్రతినిధి ఒసామా అలీ చెప్పారు. -
శవాల దిబ్బగా మొరాకో
మర్రకేశ్: భూకంపం సృష్టించిన పెను విధ్వంసం, ప్రాణనష్టం మొరాకో వాసులను షాక్కు గురిచేసింది. ఈ ఉత్తర ఆఫ్రికా దేశంలో ఇంతటి తీవ్ర భూకంపం రావడం 120 ఏళ్లలో ఇదే మొదటిసారి. దేశంలోని మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్ల్లో శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు భయాందోళనలతో వీధుల్లో రెండో రోజూ చీకట్లోనే జాగారం చేశారు. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది. శిథిలాలను తొలగిస్తుండటంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 2,012కు చేరింది. క్షతగాత్రులైన మరో 2,059 మందిలో 1,404 మందికి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు చెబుతున్నారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని గుర్తించి, కాపాడేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సుదూరంగా కొండ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు సహాయక బృందాలు చేరడం కష్టంగా మారింది. అక్కడి మట్టిరోడ్లపై బండరాళ్లు పడిపోవడంతో టాక్సీలు, అంబులెన్సులు, రెడ్ క్రాస్ సిబ్బంది వాహనాలు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. అక్కడ జరిగిన నష్టం వివరాలు కూడా వెల్లడైతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఈ విలయానికి తీవ్రంగా ప్రభావితమైన అల్ హౌజ్ ప్రావిన్స్లో మరణాలు అత్యధికంగా 1,293 నమోదయ్యాయి. ఆ తర్వాత టరౌడంట్ ప్రావిన్స్లో 452 మంది చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్, అల్జీరియా, జర్మనీ, యూఏఈ, జోర్డాన్ తదితర దేశాలతోపాటు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి సంస్థలు చేయూత అందించేందుకు ముందుకు వచ్చాయి. కళతప్పిన పర్యాటక పట్టణం అట్లాస్ పర్వతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతం మౌలే బ్రహీం భూకంపం ధాటికి విలవిల్లాడింది. మూడువేల జనాభా కలిగిన ఈ చిన్న పట్టణవాసుల ప్రధాన ఆధారం వ్యవసాయం, పర్యాటకం. ఇక్కడి వందల ఏళ్లనాటి ఇటుకతో నిర్మించిన ఇళ్లు పర్యాటకులను ఆకట్టుకునేవి. భూకంపం తీవ్రతకు ఈ ఇళ్లు చాలా వరకు నామరూపాలు కోల్పోగా మిగిలినవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో, జనం ఇళ్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పట్టణంలోని కూడలిలోనే భారీ టెంట్ వేసుకుని, అందులోనే ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ఇల్లంతా ఒక్కసారిగా కదులుతున్నట్లు అనిపించడంతో తమ కుటుంబసభ్యులంతా కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశామని మౌలే బ్రహీంకు చెందిన హంజా లంఘానీ చెప్పాడు. బయటికి వెళ్లాక చూడగా తమ ఇంటితోపాటు పొరుగిల్లు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయన్నాడు. పొరుగింట్లో ఉండే తన చిన్ననాటి స్నేహితులు అయిదుగురూ ఆ శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయారని నిర్వేదంతో చెప్పాడు. భారతీయులంతా సురక్షితం భూకంపం నేపథ్యంలో మొరాకోలోని భారత దౌత్యకార్యాలయం స్పందించింది. దేశంలోని భారత పౌరులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం లేదన్నారు. స్థానిక యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాల్సిందిగా సలహా ఇచ్చింది. అవసరమైన పక్షంలో తమ హెల్ప్లైన్ నంబర్ 212661297491కు కాల్ చేయాల్సిందిగా కోరింది. -
యూపీలో వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది...
షాజహాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్, శ్రావస్తి జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మంది దుర్మరణం పాలయ్యారు. షాజహాన్పూర్ జిల్లా అజ్మత్పూర్కు చెందిన సుమారు 30 మంది గ్రామంలో జరిగే భాగవత కథ కార్యక్రమం కోసం నీటిని తెచ్చేందుకు గర్రా నదికి ట్రాక్టర్పై బయలుదేరారు. నిగోహి రోడ్డులో వంతెనపై వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిపోయింది. ఘటనలో 8 మంది చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 24 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంటున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. మరో ఘటన..శ్రావస్తి, బలరాంపూర్ జిల్లాలకు చెందిన కొందరు పంజాబ్లోని లూధియానాలో పనులు చేసుకుంటున్నారు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరు ఎస్యూవీలో బయలుదేరారు. ఆ వాహనం శనివారం వేకువజామున శ్రావస్తి జిల్లా ఇకౌనా ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డు పక్క చెట్టును ఢీకొని, గుంతలో పడిపోయింది. ఘటనలో 9 ఏళ్ల బాలుడు సహా ఆరుగురు చనిపోయారు. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. -
Turkey–Syria Earthquake: 24 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
అంకారా/న్యూఢిల్లీ: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య ఏకంగా 24,000 దాటింది. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయింది. శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. కొందరు సజీవంగా బయటపడడం ఊరట కలిగిస్తోంది. తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. కొన్నిచోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన చలిలో ఆకలి బాధలతో ప్రాణాలు నిలుపుకొనేందుకు వారుపడిన కష్టాలు వర్ణనాతీతం. శిథిలాల కింద ఇరుక్కుపోయి, బయటపడే మార్గం లేక కేవలం మూత్రం తాగి ఆకలిదప్పులు తీర్చుకున్నామని బాధితులు చెబుతుండడం కన్నీరు పెట్టిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తుర్కియేలో అంత్యక్రియల కోసం తీసుకొస్తున్న మృతదేహాలతో ఇప్పటికే శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమయం వేచి చూడాల్సి వస్తోందని మృతుల బంధువులు చెబుతున్నారు. ఈ భూకంపం ‘ఈ శతాబ్దపు విపత్తు’ అని తుర్కియే అధ్యక్షుడు తయీఫ్ ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన తుర్కియేకు దాదాపు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, ఆయన భార్య అస్మా శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను పరామర్శించారు. భూకంపం సంభవించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. 75,000 మంది నిరాశ్రయులు భూకంపం వల్ల తుర్కియేలో ఇప్పటిదాకా 18,900 మంది మరణించారని, దాదాపు 75,000 మంది గాయపడ్డారని తుర్కియే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. ఇళ్లు కూలిపోవడంతో 75,000 మందికిపైగా జనం నిరాశ్రయులైనట్లు అంచనా వేస్తున్నామని తెలిపింది. సిరియాలో భూకంపం కారణంగా 3,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు 22,000 మందికి పైగా బలైనట్లు తెలుస్తోంది. తుర్కియేలో 12,000 దాకా భవనాలు నేలమట్టం కావడమో లేక దెబ్బతినడమో జరిగిందని మంత్రి మురాత్ కరూమ్ చెప్పారు. తుర్కియే ప్రజలకు అండగా ఉంటాం: మోదీ ‘ఆపరేషన్ దోస్త్’లో భాగంగా తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మన దేశ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తెలిపారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాయని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి మన బృందాలు కృషి చేస్తూనే ఉంటాయని ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో తుర్కియే ప్రజలకు భారత్ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. -
మనుషుల కంటే తుపాకులెక్కువ ! 3 వారాలు.. 38 కాల్పులు.. 70 ప్రాణాలు
మీకు ఒక విషయం తెలుసా..? అమెరికాలో నిప్పులు గక్కిన తుపాకీ తూటాలకు 1968–2017 మధ్య 15 లక్షల మంది అమాయకులు బలయ్యారు. ఈ సంఖ్య అమెరికా స్వాతంత్య్ర సంగ్రామం నుంచి ఆ దేశం చేసిన యుద్ధాల్లో కోల్పోయిన సైనికుల కంటే ఎక్కువ. గత ఏడాదే అమెరికా తుపాకుల విక్రయానికి సంబంధించి బైడెన్ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తెచ్చింది. అయినప్పటికీ కొత్త సంవత్సరంలో కేవలం మూడు వారాల్లో 38 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. దాదాపుగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో ఈ దారుణ మారణకాండను ఇక అరికట్టలేరా ? అమెరికా నెత్తురోడుతోంది. గన్ కల్చర్ విష సంస్కృతి మరింతగా విస్తరిస్తోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కాల్పుల శబ్దాలు భయపెడుతున్నాయి. అయితే చంపడం, లేదంటే ఆత్మహత్య చేసుకొని చావడం. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి బయటకు వెళితే క్షేమంగా వెనక్కి వస్తారో లేదో తెలీదు. చదువుకోవడానికి బడికి వెళితే ఏ ఉన్మాది ఏం చేస్తాడోనని హడలిపోవాలి. నైట్ క్లబ్బులో విందు వినోదాలైనా, రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లినా ఎటు వైపు నుంచి ఈ తూటా దిగుతుందో చెప్పలేము. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్న వాళ్లలో యువత ఎక్కువ మంది ఉన్నారని తేలడంతో గత ఏడాది జూన్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వారి చేతుల్లోకి తుపాకులు వెళ్లకుండా విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టాన్ని తెచ్చారు. అయినా కాల్పులు పెరిగాయే తప్ప తగ్గలేదు. 2023కి అగ్రరాజ్యం కాల్పులతో స్వాగతం పలికింది. ఒహియో, ఫ్లోరిడా, షికాగో, కరోలినా, పెన్సిల్వేనియాలలో తుపాకీల మోత మోగింది. అప్పట్నుంచి 38 సార్లు కాల్పులు జరిగితే 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 21న కాలిఫోర్నియాలో మాంటెరరీ పార్క్లో చైనీయుల కొత్త సంవత్సరం వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది మరణిస్తే 48 గంటలు తిరక్కుండానే కాలిఫో ర్నియా హాఫ్ మూన్ బే వ్యవసాయక్షేత్రంలో ఏడు గురు తూటాలకు బలయ్యారు. షికాగోలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించారు. ఎన్నాళ్లీ నెత్తుటి మోత ..! అమెరికా రాజ్యాంగానికి రెండో సవరణ పౌరులు తుపాకులు కలిగి ఉండే హక్కుని కల్పించింది. రెండు ప్రధాన పార్టీల్లో రిపబ్లికన్లు తుపాకీలు కలిగి ఉండడానికి మద్దతుగా ఉండడం ఈ విషసంస్కృతిని కూకటి వేళ్లతో పెకిలించివేయడానికి వీల్లేకుండా చేస్తోంది. ప్రభుత్వం గన్ కల్చర్పై కఠిన ఆంక్షలు విధించాలని భావించిన సమయంలో సుప్రీం కోర్టు బహిరంగంగా తుపాకీ తీసుకువెళ్లే హక్కు అమెరికన్లకు ఉందంటూ గత ఏడాది సంచలన తీర్పు ఇచ్చింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ప్రజాప్రతినిధులతో బలమైన లాబీయింగ్ చేస్తూ తుపాకుల నిషేధానికి ఎప్పటికప్పుడు అడ్డం పడుతూ ఉంటుంది. టెక్సాస్ పాఠశాలలో ఒక టీనేజర్ జరిపిన కాల్పుల ఘటనలో 21 మంది విద్యార్థులు బలవడంతో ఒక్కసారిగా ప్రజల్లో కూడా తుపాకీ సంస్కృతిపై వ్యతిరేకత వచ్చి అదొక ప్రజా ఉద్యమంగా మారింది. అమెరికా ప్రజల్లో 60శాతం మంది తుపాకుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీనేజర్లకి తుపాకులు విక్రయిస్తే వారి నేరచరితను విచారించాలంటూ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేయడం లేదు. శక్తిమంతమైన రాష్ట్రాలు తలచుకుంటేనే ఈ తుపాకుల హింసకు అడ్డుకట్టపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ► అమెరికాలో తుపాకీ తూటాలకు రోజుకి సగటున 53 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ► కరోనా సమయంలో కాల్పుల ఘటనలు ఎక్కువగా జరిగాయి. ఆ సమయంలో తుపాకుల అమ్మకాలు ఏకంగా 63% పెరిగాయి. ► 2013 నుంచి ఏఆర్–15 రైఫిల్స్ అమ్మకాలు ఏడాదికి కోటికి పైగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ► 2020లో కాల్పులు దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచాయి. ఆ ఏడాది 610 కాల్పులు జరగ్గా 45,222 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హత్యలు, ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. ► 2021లో రైఫిళ్లు, పిస్తోళ్లు వంటి చిన్న ఆయుధాల మార్కెట్ 370 కోట్ల డాలర్లుగా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీటుబెల్ట్ ధరించక 16 వేల మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల 16,397 మంది చనిపోయారు. వీరిలో 8,438 మంది సంబంధిత వాహనాల డ్రైవర్లు కాగా, 7,959 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించక పోవడం వల్ల 46,593 మంది మృతి చెందారు. వీరిలో 32,877 మంది వాహనచోదకులు, మిగతా 13,716 మంది ప్రయాణికులు. కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 2021లో దేశవ్యాప్తంగా జరిగిన 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది దుర్మరణం పాలవగా, 3,84,448 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో హెల్మెట్ ధరించని వారు 93,763 మంది, సీటు బెల్ట్ ధరించని వారు 39,231 మంది అని పేర్కొంది. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 8.2% డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, జంపింగ్ రెడ్ లైట్, సెల్ ఫోన్ వాడకం వంటి కారణాలతోనే జరిగాయని తెలిపింది. జాతీయ రహదారులపై జరిగే 9.35% ప్రమాద మరణాలకు ఇవే కారణాలని తెలిపింది. 67.5% ప్రమాదాలు తిన్నగా ఉండే రహదారులపై జరుగుతున్నాయి. గుంతలు, ఇరుకుగా, ఏటవాలుగా ఉండే రోడ్లపై 13.9% ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషించింది. కూడళ్లలో 20% ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టి–జంక్షన్లలో జరిగే ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోవడమో, గాయపడటమో జరుగుతోందని తెలిపింది. 2021లో అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే నాలుగింట మూడొంతుల ప్రమాదాలు సంభవించగా, మంచు, వర్షం, గాలుల తీవ్రత వల్ల 16% ప్రమాదాలు జరిగాయని వివరించింది. దేశంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. -
‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వంసం
బఫెలో: ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుపాన్ (Bomb Cyclone) కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. గత వారం రోజులతో పోలిస్తే హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాంతో తుఫాన్ విధ్వంసం తాలూకు తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్ ధాటికి కనీసం 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు భావిస్తున్నారు. దీన్ని తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే మహోత్పాతంగా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది. మెరుగవని రవాణా వ్యవస్థ దేశవ్యాప్తంగా వారం రోజులుగా దాదాపుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. మంగళవారం కూడా 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయల్దేరాల్సిన 3,500 పై చిలుకు విమానాలను ముందస్తుగానే రద్దు చేశారు. దాంతో విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. చిక్కుబడిపోయిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బయటికెళ్లే పరిస్థితి లేక ప్రయాణికులంతా టెర్మినల్స్లోనే కాలం గడుపుతున్నారు. డిసెంబర్ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది. సకాలంలో సేవలను పునరుద్ధరించడంలో సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ వైఫల్యం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. సంస్థకు చెందిన వేలాది విమాన సర్వీసులు వరుసగా ఆరో రోజూ రద్దవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆగ్రహించారు. ఎయిర్లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని ప్రయాణికులకు సూచించారు! కానీ పరిస్థితి చక్కబడేందుకు కనీసం ఇంకో వారం పట్టొచ్చని సౌత్వెస్ట్ ప్రకటించింది. యథేచ్ఛగా లూటీలు రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలు తదితరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో చాలా రాష్ట్రాల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక జనం రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడంతో ఆహార పదార్థాలు నిండుకున్నాయి. నాలుగైదు రోజులుగా దుకాణాలూ తెరిచుకోక సమస్య మరింతగా విషమించింది. ఫలితంగా మొన్నటిదాకా బఫెలో నగరంలోనే వెలుగు చూసిన లూటీ ఉదంతాలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లోనూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల్లోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మంది తెలుగువాళ్లు కూడా నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువ నమోదవున్నాయి! వరద ముప్పు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా ఇప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటోంది. మంచు శరవేగంగా కరగడం వల్ల ఊహాతీత వేగంతో ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని పలు రాష్ట్రాలను వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. బఫెలో.. దయనీయం! పశ్చిమ న్యూయార్క్లోని బఫెలో నగరంలో ఇంకా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా 8 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. దాంతో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు అత్యవసర సర్వీసులు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి! నగరంలోకి వెళ్తుంటే యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ వాపోయారు. నగరం, పరిసరాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం ఇంకా అమల్లోనే ఉంది. దాని అమలుకు మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగారు. పొరుగు రాష్ట్రం న్యూజెర్సీ నుంచి ఎమర్జెన్సీ సేవల సిబ్బంది న్యూయార్క్కు తరలుతున్నారు. చాలామంది కార్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. 30కి పైగా మృతదేహలను వెలికితీసినట్టు చెబుతున్నారు. ఇంతటి ప్రతికూల వాతావరణాన్ని తమ సర్వీసులోనే ఎన్నడూ చూడలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. చావు అంచుల దాకా వెళ్లాం మంచు తుఫాను బారిన పడి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డవాళ్లు తామెదుర్కొన్న కష్టాలను కథలుగా చెబుతున్నారు. మేరీలాండ్కు చెందిన డిట్జక్ ఇలుంగా అనే వ్యక్తి తన ఆరు, పదహారేళ్ల కూతుళ్లతో కలిసి కార్లో హామిల్టన్ వెళ్తూ బఫెలో వద్ద తుఫానులో చిక్కాడు. చూస్తుండగానే కారు చుట్టూ మంచు పేరుకుపోవడంతో గంటల తరబడి కారు ఇంజన్ ఆన్లో ఉంచి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ‘‘చివరికి ప్రాణాలకు తెగించాం. ధైర్యం చేసి కష్టమ్మీద కారు దిగాం. చిన్న కూతుర్ని వీపున వేసుకుని, పెద్దమ్మాయీ నేనూ భయానక వాతావరణంలో అతికష్టమ్మీద షెల్టర్ హోమ్ దాకా వెళ్లాం. లోపలికి అడుగు పెడుతూ నేనూ నా పిల్లలూ ఒక్కసారిగా ఏడ్చేశాం. ఇంతటి భయానక అనుభవం జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఒక్క అడుగూ వేయడానికి ప్రాణాలన్నీ కూడదీసుకోవాల్సి వచ్చింది. కానీ సాహసం చేయకపోతే కార్లోనే నిస్సహాయంగా మరణించేవాళ్లం’’ అంటూ డిట్జక్ గుర్తు చేసుకున్నాడు. -
రూబీ లాడ్జ్: ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. ఫైర్ అధికారి కీలక వ్యాఖ్యలు
సాక్షి, రాంగోపాల్పేట్: సికింద్రాబాద్లోని రూబీ లాడ్జ్లో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక, లాడ్జీ లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉంది. దీంతో లాడ్జీలో ఉన్న వారంతా మెట్ల మార్గంలో కిందకు రాలేకపోయారు. దట్టమైన పొగ కారణంగా హైడ్రాలిక్ క్రేన్ సాయంతో భవనం ఉన్న 9 మందిని కాపాడినట్టు తెలిపారు. మరోవైపు.. ఘటన స్థలానికి క్లూస్ టీమ్, స్థానిక తహసీల్దార్ కూడా చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న కారణాలపై విశ్లేషిస్తున్నట్టు తెలిపారు. ఇక, ఈ ప్రమాదంలో స్పాట్లోని ముగ్గురు చనిపోగా, ఆసుపత్రికి తరలిస్తుండగా నలుగురు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. కాగా, మృతదేహాలు గాంధీ ఆసుప్రతిలో ఉండగా.. మరికొందరు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక, మృతుల్లో విజయవాడకు చెందిన హారీశ్, ఢిల్లీకి చెందిన వీరేందర్, చెన్నైకి చెందిన సీతారామన్, పలువురు ఉన్నారు. కాగా, ఈ ప్రమాదం అనంతరం పోలీసులు.. రూబీ లాడ్జీని సీజ్ చేశారు. ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారి రంజిత్ సింగ్పై సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై మూడు బృందాలు దర్యాప్తు చేపటినట్టు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హోటల్లో బస చేసిన కొందరి పేర్లు ఇవే.. 1) అబ్రహం వాల్తాలా 2) ఆర్త్ పటేల్ 3) మహేందర్ సింగ్ భట్ 4) అశ్వని శిలా 5) ఠాకూర్ 6) పృథ్వీరాజ్ 7) చందన్ ఈతి 8) అషోత్ మామిదువాట్ 9) దేబాషిస్ గుప్త 10) ఇర్ఫాన్ ఉస్మా 11) అశుతోష్ సింగ్ 12) మొహమ్మద్ జావిద్ 13) లావర్ యాదవ్ 14) సునీల్ కుమార్ 15) వర్మ 16) బిన్ శియల. -
భారత్లో కొత్తగా 7 వేల కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,231 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోన కేసుల సంఖ్య 4,44,28,393కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మొత్తం సుమారు 45 మరణాలు సంభవించాయని, దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 5 లక్షలకు చేరుకుందని వెల్లడించింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 0.15 శాతం ఉండగా, జాతీయ రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఢిల్లీలో సుమారు 377 క్తొత కేసులు నమోదయ్యాయని పేర్కొంది. అలాగే కరోనా సంబంధితన మరణాలు రెండు సంభవించాయని తెలిపింది. ప్రస్తుతం తాజగా అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 2.58 శాతంగా ఉందని పేర్కొంది. (చదవండి: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు) -
కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న కేసులు.. గురువారం ఒక్కసారిగా పెరిగాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళనకంగా మారింది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,608 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 16,251 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,01,343 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇక, రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.23 శాతానికి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 4,42,98,864 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,36,70,315 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,27,206 మంది మృతి చెందారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 1652 మందికి పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. రెండు వారాల కింద 291 మంది ఆసుప్రతిలో చేరగా.. తాజాగా 591 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య.. 2,08,95,79,722కు చేరింది. బుధవారం ఒక్కరోజే.. 38,64,471 మందికి టీకాలు అందించారు. ఇది కూడా చదవండి: గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా.. -
జర జాగ్రత్త.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
Corona cases Updates.. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే, కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలపైనే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 20,409 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,988 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, కరోనా నుంచి ఇప్పటి వరకు 4,33,09,484 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 5,26,258 మంది కరోనా కారణంగా మృతిచెందారు. మరోవైపు.. 2,03,60,46,307 మందికి వ్యాక్సినేషన్ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. India reports 20,409 new COVID19 cases today; Active caseload at 1,43,988 pic.twitter.com/3YYULK8bZJ — ANI (@ANI) July 29, 2022 ఇది కూడా చదవండి: 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తుకు అవకాశం.. ఈసీ కీలక నిర్ణయం -
IND: కరోనా రెడ్ అలర్ట్.. భయపెడుతున్న కేసులు, మరణాలు
Corona Cases Updates In India.. దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపాటుకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు.. 20వేలపైనే నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా 67 మంది మృత్యువాతపడ్డారు. ఇక, కరోనా నుంచి 20,726 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,50,100 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు.. మొత్తం కేసులు 4,38,68,476కు చేరుకోగా.. కరోనా మృతుల సంఖ్య 5,25,997 మందికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,31,92,379 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. ఇప్పటివరకు 201.68 కోట్ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. #COVID19 | India reports 21,411 fresh cases, 20,726 recoveries and 67 deaths in the last 24 hours. Active cases 1,50,100 Daily positivity rate 4.46% pic.twitter.com/jxr8ep9utB — ANI (@ANI) July 23, 2022 ఇది కూడా చదవండి: అప్పుడు ప్రధాని మోదీ, ఇప్పుడు సీఎం యోగికి షాకిచ్చిన బీజేపీ ఎంపీ -
IND: దేశంలో కరోనా టెన్షన్ షురూ.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్దిరోజలుగా తగ్గుముఖం పట్టిన కేసులు బుధవారం అన్యూహంగా పెరిగాయి. దీంతో, ఆందోళన నెలకొంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21,566 మంది వైరస్ బారిన పడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కరోనా నుంచి 18,294 మంది కోలుకున్నారు. ఇక, దేశంలో ప్రస్తుతం 1,48,881 పాజిటివ్ కేసులు ఉన్నాయని.. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. మరోవైపు.. దేశవ్యాపంగా ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,25,185కు చేరుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,25,870కి చేరింది. వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,31,50,434 చేరుకుంది. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 200.91 కోట్లు వ్యాక్సిన్ డోసులను అందించారు. బుధవారం ఒక్కరోజే 29,12,855 మందికి టీకాలు అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 9,71,390 మంది వైరస్ బారినపడగా.. మరో 2,015 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో కొత్తగా 1,36,624 మందికి వైరస్ సోకింది. 177 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 1,13,588 మందికి వైరస్ సోకగా.. 367 మంది చనిపోయారు. ఫ్రాన్స్లో కొత్తగా 89,982 మందికి కరోనా సోకగా.. 125 మంది మరణించారు. #COVID19 | India reports 21,566 fresh cases and 18,294 recoveries in the last 24 hours. Active cases 1,48,881 Daily positivity rate 4.25% — ANI (@ANI) July 21, 2022 -
భారత్లో కరోనా టెన్షన్.. భయపెడుతున్న పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వరుసగా మూడో రోజూ కూడా 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు రావడం ఆందోళన లిగిస్తోంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,044 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. ఇదే సమయంలో కరోనాతో 53 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,30,071కు చేరింది. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కోలుకోగా, 5,25,660 మంది మృతిచెందారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం 1,40,760 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 18,301 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగిందని, యాక్టివ్ కేసులు 0.32 శాతం ఉండగా.. మరణాలు 1.20 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. డ్రాగన్ కంట్రీ చైనాలో కొత్త వేరియంట్ల కారణంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనాలో నిన్ని ఒక్కరోజే 547 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. #COVID19 | India reports 20,044 fresh cases, 18,301 recoveries, and 56 deaths in the last 24 hours. Active cases 1,40,760 Daily positivity rate 4.80% pic.twitter.com/lvMcyWZ0ti — ANI (@ANI) July 16, 2022 -
అమర్నాథ్ యాత్ర.. కొత్త బ్యాచ్లకు బ్రేక్
జమ్మూ: తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ నుంచి కశ్మీర్లోని బేస్ క్యాంప్లకు చేరుకోవాల్సిన అమర్నాథ్ యాత్రికుల కొత్త బ్యాచ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అమర్నాథ్ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది యాత్రికులు మృతి చెందగా మరో 40 మంది వరకు జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. జూన్ 30వ తేదీ నుంచి మొదలైన 43 రోజుల అమర్నాథ్ యాత్ర ఆగస్ట్ 11వ తేదీన రక్షా బంధన్ రోజున ముగియనుంది. -
భారత్ను టెన్షన్ పెడుతున్న కరోనా.. పాజిటివ్ కేసులు ఎన్నంటే..?
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు, మరణాల రేటు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో 16,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో వైరస్ కారణంగా మరో 31 మంది మృతిచెందారు. కాగా, ప్రస్తుతం దేశంలో 1,11,711 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 13,929 బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 4,35,02,429కి చేరాయి. ఇందులో 4,28,65,519 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,199 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.21 శాతం ఉంది. ఇక మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.21 శాతం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 197.95 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. #COVID19 | India reports 16,103 fresh cases, 13,929 recoveries and 31 deaths, in the last 24 hours. Active cases 1,11,711 Daily positivity rate 4.27% pic.twitter.com/bSAssBCfIX — ANI (@ANI) July 3, 2022 -
ఫోర్త్ వేవ్ రెడ్ అలర్డ్: లక్ష దాటిన యాక్టివ్ కేసులు
Corona Active Cases In India.. దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,819 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో 39 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. కాగా, దేశంలో ప్రస్తుతం 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 13,827 మంది కోలుకున్నారు. అయితే, రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.16 శాతానికి పెరిగింది. #COVID19 | India reports 18,819 fresh cases and 39 deaths, in the last 24 hours. Active cases 1,04,555 Daily positivity rate 4.16% pic.twitter.com/A0RaRud8Nr — ANI (@ANI) June 30, 2022 ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో ఫిబ్రవరి 28 తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటడం ఇదే రెండోసారి. కాగా, ఫిబ్రవరి 28న దేశంలో 1,02,601 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ జూన్ 30(నేడు)వ తేదీన ఆ మార్కు దాటి యాక్టివ్ కేసులు పెరిగాయి. -
Afghan earthquake: జీవచ్ఛవాలు
గయాన్ (అఫ్గానిస్తాన్): అఫ్గానిస్తాన్ను కుదిపేసిన పెను భూకంపం భారీ విధ్వంసాన్ని మిగిల్చింది. ఊళ్లకు ఊళ్లు నేలమట్టమయ్యాయి. వ్యవప్రయాసల కోర్చి సహాయ చర్యల కోసం వెళ్లిన సిబ్బంది కొండల్లో మృతదేహాలు ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పడి ఉండటం చూసి కంటతడి పెడుతున్నారు. వాటిని వెలికి తీయడం తప్ప చేయడానికి అక్కడేమీ లేదని సహాయ సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేశారు. బుధవారం నాటి భూకంపంలో వెయ్యి మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. పక్తిక ప్రావిన్స్లోని గయాన్, బర్మల్ జిల్లాల్లో అత్యధికంగా విధ్వంసం జరిగింది. అక్కడి ఊళ్లన్నీ శిథిలాల దిబ్బలుగా మిగిలాయి. ప్రాణాలతో బయట పడ్డవారు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. జీవచ్ఛవాలుగా మారారు. అయిన వారి కోసం వారు ఏడుస్తూ వెదుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. భారీ వర్షం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. ఉత్తర వజరిస్తాన్ నుంచి అఫ్గాన్కు వెళ్లిన 30 మంది పాకిస్తానీలు భూకంపానికి బలైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. చేతులే ఆయుధాలుగా గ్రామాలన్నీ నేలమట్టం కావడంతో శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో చూసేందుకు గ్రామస్తులు చేతులనే ఆయుధాలుగా మార్చుకున్నారు. గుట్టలుగా పడున్న రాళ్లు, రప్పలను చేతులతో తొలగిస్తున్నారు. తలదాచుకోవడానికి తమకు కనీసం టెంట్ కూడా లేదని వాళ్లు వాపోతున్నారు. పరిసర ఊళ్ల వాళ్లు తప్ప ప్రభుత్వం నుంచి ఎవరూ సాయానికి రావడం లేదని చెబుతున్నారు. తిండికి కూడా లేక వారంతా అల్లాడుతున్నారు. ఎక్కడ చూసినా మరణించిన తమవారి ఆత్మశాంతి కోసం బాధితులు చేస్తున్న ప్రార్థనలే వినిపిస్తున్నాయని కవరేజీకి వెళ్లిన బీబీసీ జర్నలిస్టు చెప్పారు. సహాయ చర్యలకు రంగంలోకి దిగినట్టు యునిసెఫ్ చెప్పింది. మృతుల్లో చిన్నారులే అధికం భూకంపంలో పిల్లలు, యువతే అత్యధికంగా బలైనట్టు వైద్య సిబ్బంది వెల్లడించారు. రెండు హెలికాఫ్టర్లలో పక్తిక ప్రావిన్స్కు వెళ్లిన వైద్యులకు ఎటు చూసినా పిల్లలు, యువత శవాలే కనిపిస్తున్నాయి. భూకంప తీవ్రతకు సెల్ టవర్లు కూడా కూలి కమ్యూనికేషన్లు తెగిపోవడంతో సమాచారం తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది. ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో కొద్ది రోజులైతే తప్ప తేలేలా లేదు. -
కిమ్ను భయపెడుతున్న కరోనా.. ఫుల్ టెన్షన్లో నార్త్ కొరియన్లు
Covid In North Korea.. ఉత్తరకొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్దిరోజుల కిత్రం ఒమిక్రాన్ మొదటి కేసు నమోదు కాగా తాజాగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇప్పటివరకు వరకు నార్త్ కొరియాలో కరోనా వైరస్తో 42 మంది మృతి చెందినట్టు ఆ దేశ మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(KCNA) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈరోజు వరకు దేశంలో 8,20, 620 మందికి లక్షణాలు ఉండగా 3,24,550 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని మీడియా పేర్కొంది. మరోవైపు ఆదివారం ఒక్కరోజే 15 మంది వైరస్ సోకి మృత్యువాతపడ్డారు. దీంతో అప్రమత్తమైన కిమ్ సర్కార్ దేశంలోని అన్ని ప్రావిన్స్లు, నగరాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించింది. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలను సైతం మూసివేయాలని ఆదేశించింది. ఇక, ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాలేదు. నార్త్ కొరియన్లు టీకా తీసుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. అంతకుమందు ఉత్తరకొరియాకు డబ్ల్యూహెచ్వో, రష్యా, చైనాలు టీకాలను అందిస్తామని ఆఫర్ ఇచ్చినప్పటికీ కిమ్ జోంగ్ ఉన్ తిరస్కరించారు. దీంతో తాజాగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు పంపే ఉద్దేశ్యంలేదని అగ్రరాజ్యం అమెరికా తేల్చి చెప్పింది. గతంలో కోవాగ్జిన్కి చెందిన గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన విరాళాలను ఉత్తరకొరియా పదేపదే తిరస్కరించిందని ఈ సందర్భంగా అమెరికా గుర్తు చేసింది. కానీ, ఉత్తరకొరియాకు మానవతా సాయం అందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ఇది కూడా చదవండి: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 10 మంది మృతి -
రష్యాలో కరోనా విస్ఫోటం.. ఒక్క రోజులోనే..
మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం ఒక్కరోజే 40,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,159 మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో రోజువారీ కేసులు, మరణాల్లో ఇప్పటిదాకా ఇవే అత్యధికం. వైరస్ ఉధృతిని అరికట్టడానికి జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని మాస్కోలో గురువారం నుంచి నాన్ వర్కింగ్ పీరియడ్ (అత్యవసర విధుల్లో ఉన్నవారు మినహాయించి ఇతర ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరు కాకూడదు) ప్రారంభమయ్యింది. రష్యాలో కరోనాతో ఇప్పటిదాకా 2,35,057 మంది మృతిచెందారు. ఒకవైపు కరోనా వ్యాప్తి పెరుగుతున్నా మరోవైపు జనం నిర్లక్ష్యం వీడడం లేదు. రష్యా నుంచి ఈజిఫ్టు, టర్కీకి ప్యాకేజీ టూర్ల సంఖ్య భారీగా పెరిగింది. రష్యాలో 14.6 కోట్ల జనాభా ఉండగా, ఇప్పటిదాకా4.9 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకున్నారు. (చదవండి: సెనోలిటిక్స్.. వయసుపై యుద్ధం!) -
పెరిగిన కరోనా మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కారణంగా ఒక్క రోజులో మరణించిన వారి సంఖ్యలో ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఒక్కరోజులో మహమ్మారి కారణంగా 666 మంది మృతి చెందారు. కేరళ ప్రభుత్వం గతంలో సంభవించిన 292 మరణాలను తాజాగా నమోదుచేయడంతో ఈ పెరుగుదల కనిపించింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,53,708కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,728కి తగ్గగా, గత 24 గంటల్లో 16,326 కొత్త కేసుకోవిడ్–19, మరణాలు, కేంద్ర ఆరోగ్య శాఖలు నిర్ధారణయ్యాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్లో101.30 కోట్ల టీకా డోస్లు ఇచ్చారు. -
ఇడా తుపాను దెబ్బకు 46 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలో ఇడా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మేరీలాండ్ నుంచి కనెక్టికట్ ప్రాంతం వరకు ఇడా సృష్టించిన విలయంలో దాదాపు 46 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. పలువురు ప్రజల ఇళ్లు, వాహనాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇడా దెబ్బకు పలు ప్రాంతాల్లో నదులు పొంగి ఉత్పాతాలు సృష్టించాయి. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో 23 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. పరిస్థితులను అధ్యక్షుడు జోబైడెన్ సమీక్షిస్తున్నారు. జోరున కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ బాధితులతో పాటు అత్యవసర చికిత్సలు అవసరమైనవారి కోసం చాలా చోట్ల జనరేటర్లతో ఆసుపత్రులను నిర్వహించాల్సి వచి్చంది. అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేసిన 911 సేవలకూ ఆటంకాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు ఇళ్ల కప్పులు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా ష్కైల్కిల్ నదికి 100ఏళ్లలో ఎన్నడూ రానంత వరద వచి్చంది. వాన, గాలి కారణంగా అధికారిక సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. -
కొవిడ్ లెక్కలు: సవరణలతో భారీగా మరణాలు
పాట్నా: ప్రతిపక్షాల డిమాండ్తో, కోర్టు మొట్టికాయలతో దిగొచ్చిన నితీష్ కుమార్ ప్రభుత్వం ఎట్టకేలకు కరోనా లెక్కల్ని సవరించి అధికారికంగా ప్రకటించింది. బీహార్లో కొవిడ్-19తో ఇప్పటిదాకా 9 వేలమందికి పైగా చనిపోయారని తేల్చింది. ఇది గతంలో ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. కాగా, ఇంతకు ముందు బీహార్ ఆరోగ్య శాఖ మరణాల లెక్కను 5, 500గా చూపించింది. ఈ తరుణంలో కోర్టు జోక్యంతో తాజా సంఖ్యను 9,429గా తేల్చింది. ఇక మార్చ్ 2020 నుంచి మార్చ్ 2021 మధ్య కొవిడ్ మరణాలు 1,600 కాగా, కేవలం ఏప్రిల్ నుంచి జూన్ 7వ తేదీ మధ్య 7,775 మరణాలు సంభివించాయని బీహార్ ఆరోగ్య శాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. అంటే ఈ రెండు నెలల్లోనే అంతకు ముందుకంటే ఆరు రెట్ల మరణాలు నమోదు అయ్యాయన్నమాట. మొత్తం జిల్లాలను పరిశీలించాక 72 శాతం పెరగుదలతో ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 38 జిల్లాలకుగానూ రాజధాని పాట్నాలో 2,303 మంది చనిపోగా, రివైజ్ లెక్కల్లో ఇక్కడే ఎక్కువ మరణాలు నమోదు అయినట్లు చూపించారు. సీఎం నితీశ్ స్వంత జిల్లా నలందలో 222 మరణాలు నమోదు అయ్యాయి. ఒక ప్రాంతం వాళ్లు మరో ప్రాంతంలో కరోనా ట్రీట్మెంట్తో చనిపోవడం వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ప్రత్యాయ్ అమ్రిత్ వెల్లడించాడు. కరోనా మరణాల సంగతి ఎలా ఉన్నా.. తాజా లెక్కలతో మిగతా వాటిల్లో కూడా భారీ మార్పులు చూపించింది ప్రభుత్వం. ఇక రికవరీ రేటును కూడా 98 నుంచి 97 శాతానికి తగ్గించడం విశేషం. ఇదిలా ఉంటే అధికారిక లెక్కల్లో కొవిడ్ అంత్యక్రియల సంఖ్య 3,243గా ఉండడం కొసమెరుపు. అయితే బీహార్ మాత్రమే కాదని.. దేశం మొత్తం ఇలాంటి లెక్కల గందరగోళం అంతటా ఉందని పలువురు ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ప్రజల సొమ్మే కదా.. నొక్కేద్దాం! -
కరోనా రక్కసి మారణహోమం: 514 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి మారణహోమం కొనసాగిస్తోంది. కేసులు తగ్గినప్పటికీ మృత్యు బీభత్సం అదుపులోకి రావడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 514 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. మరోవైపు 18,324 మంది కరోనా బారిన పడగా, 24,036 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,53,446 కి పెరిగింది. అందులో 23,36,096 మంది కోలుకున్నారు. 30,531 మంది కన్నుమూశారు. 2,86,798 మంది చికిత్స పొందుతున్నారు. మంగళ, బుధవారాల కంటే గురువారం కేసులు రెండువేల వరకూ పెరిగాయి. బెంగళూరులో 3,533 పాజిటివ్లు.. బెంగళూరులో 3,533 పాజిటివ్లు, 7,672 డిశ్చార్జిలు, 347 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 11,74,275కు పెరిగింది. అందులో 10,25,614 మంది కోలుకున్నారు. 14,276 మంది కన్నుమూశారు. ప్రస్తుతం 1,34,384 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 1,82,306 మందికి టీకా.. మరో 1,50,168 నమూనాలను పరీక్షించగా, మొత్తం టెస్టులు 3,01,49,275 కు పెరిగాయి. 1,82,306 మందికి కరోనా టీకా ఇచ్చారు. మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 1,43,27,273 కు పెరిగింది. తాజా మరణాల్లో టాప్ 5 జిల్లాలు.. బెంగళూరు సిటీ - 347 మండ్య - 14 హాసన్ - 14 మైసూరు - 12 బెంగళూరు రూరల్ - 11 -
పెరుగుతున్న మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 లక్షలలోపు కేసులు రావడం వరసగా ఇది మూడోరోజు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,96,330కు పెరిగింది. 3,89,851 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,529 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,83,248కు పెరిగింది. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 3,89,851 కరోనా రోగులు కోలుకున్నారు. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,19,86,363కు పెరిగింది. రికవరీ రేటు 86.23 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,26,719కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసులో 69.02 శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 32,03,01,177 కరోనా పరీక్షలు నిర్వహించగా గత 24 గంటల్లో 20,08,296 పరీక్షలు చేపట్టారు. ఇది అంతర్జాతీయ రికార్డు. భారత్లో ఒకే రోజు ఇంత ఎక్కువ కరోనా టెస్ట్లు చేయడం ఇదే తొలిసారి. గత వారంతో పోలిస్తే భారత్లో 13 శాతం తక్కువగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే రోజూ రెండు లక్షలకు మించి కొత్త కేసులతో ప్రపంచంలోనే అత్యధిక కొత్త కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ తొలిస్థానంలో ఉందని డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్రలో 52 మందిని బలిగొన్న బ్లాక్ ఫంగస్
ముంబై: కరోనా వైరస్ బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ ముప్పు భయపెడుతోంది. అరుదుగా వచ్చే ఈ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) ప్రమాదకరమైనదేనని, బాధితులు చూపు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలో బ్లాక్ ఫంగర్ కారణంగా ఇప్పటిదాకా 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న లేదా కోలుకుంటున్నవారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, ముక్కు మూసుకుపోవడం, పాక్షికంగా చూపు కోల్పోవడం వంటివి ఈ ఫంగస్ లక్షణాలు. మహారాష్ట్రలో మ్యూకోర్మైకోసిస్ వల్ల మరణించిన 52 మంది కరోనా నుంచి కోలుకున్నవారే కావడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్య శాఖ తొలిసారిగా బ్లాక్ ఫంగస్ మృతుల జాబితాను బయటపెట్టింది. రాష్ట్రంలో 1,500 దాకా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు యాంఫోటెరిసిన్–బి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. మహారాష్ట్రలో ఈ ఫంగస్ వల్ల 8 మంది చూపు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. రికవరీలు 2 కోట్లకు పైనే.. 24 గంటల్లో 3,43,144 పాజిటివ్ కేసులు ఒక్కరోజులో మృతుల సంఖ్య 4వేలు దేశంలో రికవరీ రేటు 83.5% నమోదు సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మార్పు కనిపిస్తున్నప్పటికీ, మరణాల్లో మాత్రం తగ్గుదల నమోదు కావట్లేదు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 24 గంటల్లో 3,43,144 మందికి కరోనా వైరస్ సోకింది. ఇందులో 10 రాష్ట్రాల వాటా 72.37%గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2,40,46,809కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 42,582 కొత్త కేసులు రాగా, కేరళలో 39,955, కర్ణాటకలో 35,297 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో 24 గంటల్లో 4వేల మంది వైరస్తో మృత్యువాతపడగా మొత్తం మృతుల సంఖ్య 2,62,317కు చేరుకుంది. మరణాల రేటు 1.09%గా ఉంది. ఇందులో 10 రాష్టాలకు చెందినవారే 72.70% మంది ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 850 మంది, కర్ణాటకలో 344 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య శుక్రవారం 2,00,79,599కు పెరిగింది. దీంతో దేశంలో కరోనా రికవరీలు 83.50%గా ఉన్నాయి. దేశంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 37,04,893కు తగ్గింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 15.41%గా ఉంది. గత 24 గంటల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య నికరంగా 5,632 తగ్గింది. మరోవైపు దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటివరకు ప్రజలకు అందించిన డోస్ల సంఖ్య 18 కోట్లకు చేరువైంది. కేరళలో 23 వరకూ లాక్డౌన్ కేరళ ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 16వరకూ విధించిన లాక్డౌన్ను 23వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, కేరళలో విధించిన లాక్డౌన్ ప్రభావం ఇంకా కనిపించట్లేదు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య తగ్గట్లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం వెల్లడించారు. తిరువనంతపురం, ఎర్నాకులం, త్రిచూర్, మలప్పురంలో ట్రిపుల్ లాక్డౌన్ ప్రకటించారు. అలాగే, దేశంలోని మరో 17 రాష్ట్రాల్లో పూర్తి లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మిజోరం, గోవా, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. -
దేశంలో కరోనా మరణ మృదంగం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. వరుసగా నాలుగో రోజు 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో ఏకంగా 2,61,500 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్ మరణ శాసనం రాస్తోంది. మరో 1,501 మందిని బలితీసుకుంది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కు, మరణాల సంఖ్య 1,77,150కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు క్రియాశీల(యాక్టివ్) కరోనా కేసులు వరుసగా 39వ రోజు కూడా పెరిగాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 18,01,316కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.18 శాతం ఉన్నాయి. ఇక రికవరీ రేటు 86.62 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ తెలియజేసింది. దేశంలో కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1,28,09,643 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా సంబంధిత మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు గత ఏడాది ఆగస్టు 7న 20 లక్షల మార్కును, ఆగస్టు 23న 30 లక్షల మార్కును, సెప్టెంబర్ 5న 40 లక్షల మార్కును, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్కును, నవంబర్ 20న 90 లక్షల మార్కును, డిసెంబర్ 19న కోటి మార్కును దాటేశాయి. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం.. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 17 వరకూ 26,65,38,416 నమూనాలను పరీక్షించారు. శనివారం ఒక్కరోజే 15,66,394 నమూనాలను పరీక్షించారు. దేశంలో కరోనా వల్ల 1,77,150 మంది మరణించగా, వీరిలో 59,970 మంది మహారాష్ట్రలో, 13,270 మంది కర్ణాటకలో, 13,071 మంది తమిళనాడులో, 11,960 మంది ఢిల్లీలో, 10,540 మంది పశ్చిమ బెంగాల్లో, 9,703 మంది ఉత్తరప్రదేశ్లో, 7,834 మంది పంజాబ్లో కన్నుమూశారు. భారత్లో కరోనా బారినపడి మృతిచెందిన వారిలో 70 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 162 పీఎస్ఏ ప్లాంట్లు మంజూరు దేశంలో కోవిడ్–19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రజారోగ్య కేంద్రాల్లో 162 ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్ఏ) ప్లాంట్లను నెలకొల్పేందుకు అంగీ కారం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ ప్లాంట్ల ద్వారా ఆసుపత్రులు తమకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. తద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే నేషనల్ గ్రిడ్పై భారం తగ్గిపోతుంది. మొత్తం 162 పీఎస్ఏ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాల్లో వీటిని ఏర్పాట్లు చేస్తారు. వీటితో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 154.19 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. ఇప్పటికే 33 పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మధ్యప్రదేశ్లో 5, హిమాచల్ ప్రదేశ్లో 4, చండీగఢ్లో 3, గుజరాత్లో 3, ఉత్తరాఖండ్లో 3, బిహార్లో 2, కర్ణాటకలో 2, తెలం గాణలో రెండు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హరియాణా, కేరళ, మహా రాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, యూపీరాష్ట్రాల్లో ఒక్కో టి చొప్పున నెలకొల్పుతున్నారు. దేశంలో ఏప్రిల్ ఆఖరుకల్లా మరో 55, మే చివరికిమరో 80 పీఎస్ఏ పాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 162 పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటుకయ్యే రూ.201.58 కోట్ల భారాన్ని కేంద్రమే భరిస్తోంది. ఇక ఆక్సిజన్ రైళ్లు దేశంలో కోవిడ్–19 ఉధృతరూపం దాల్చడంతో ఆక్సిజన్ సిలండర్లకి డిమాండ్ బాగా పెరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్కి కొరత ఏర్పడడంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. ముంబైకి సమీపంలోని కలంబొలి, బోయిసార్ స్టేషన్ల నుంచి ఖాళీ ట్యాంకర్లు తీసుకొని ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు సోమవారం తన ప్రయాణం ప్రారంభిస్తాయి. వైజాగ్, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారోలలో లిక్విడ్ ఆక్సిజన్ను నింపుకొని అవసరమైన ప్రాంతాలకు తరలిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఆదివారం వెల్లడించారు. పరిశ్రమలకు ఆక్సిజన్ బంద్ పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల ను ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. తద్వారా మెడికల్ ఆక్సిజన్ సరఫరా పెరిగి విలువైన ప్రాణాలను కాపాడుకోగలమని పేర్కొంది. ఈనెల 22 నుంచి ఇది ఈ నిషేధం అమలులోకి రానుంది. తొమ్మిది రకాల పరిశ్రమలకు దీనినుంచి మినహాయింపునిచ్చారు. పాజిటివిటీ రేటు 12 రోజుల్లోనే రెట్టింపు భారత్లో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు కేవలం 12 రోజుల్లోనే రెట్టింపయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 8 శాతంగా ఉండేది. 12 రోజుల్లో ఇది 16.69 శాతానికి చేరింది. అంటే ప్రతి 100 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 16.69 శాతం పాజిటివ్గా తేలుతున్నాయి. వీక్లీ పాజిటివ్ రేటు నెల రోజుల్లో 3.05 శాతం నుంచి 13.54 శాతానికి ఎగబాకింది. అత్యధికంగా వీక్లీ పాజిటివ్ రేటు చత్తీస్గఢ్లో 30.38 శాతం, గోవాలో 24.24, మహారాష్ట్రలో 24.17, రాజస్తాన్లో 23.33, మధ్యప్రదేశ్లో 18.99 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 78.56 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే బయటపడ్డాయి. కరోనా వల్ల తాజాగా మరణించిన 1,501 మందిలో మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉన్నారు. 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు ఒక్కటీ నమోదు కాలేదు. 92 రోజుల్లో 12,26,22,590 డోసులు అగ్రరాజ్యం అమెరికాలో 12 కోట్ల కరోనా టీకా డోసులు ఇవ్వడానికి 97 రోజులు పట్టింది. చైనాలో అయితే 108 రోజులు పట్టింది. భారత్లో మాత్రం కేవలం 92 రోజుల్లోనే 12 కోట్లకుపైగా టీకాలు డోసులు అర్హులకు ఇవ్వడం గమనార్హం. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రభాగాన నిలుస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ భారత్లో ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 18,15,325 సెషన్లలో 12,26,22,590 టీకా డోసులను అర్హులకు అందజేశారు. మొత్తం డోసుల్లో 59.5 శాతం డోసులను ఎనిమిది రాష్ట్రాల్లోనే ఇవ్వడం విశేషం. నాలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా చొప్పున డోసులను అందజేశారు. గుజరాత్లో 1,03,37,448, మహారాష్ట్రలో 1,21,39,453, రాజస్తాన్లో 1,06,98,771, ఉత్తరప్రదేశ్లో 1,07,12,739 డోసులు ఇచ్చారు. గుజరాత్లో ఏప్రిల్ 16 నాటికి కోటి డోసుల పంపిణీని పూర్తి చేయగా, మిగతా మూడు రాష్ట్రాల్లో ఏప్రిల్ 14 నాటికి కోటి డోసుల పంపిణీ పూర్తయ్యింది. కరోనా వ్యాక్సినేషన్లో 92వ రోజు శనివారం 26,84,956 డోసులు ఇచ్చారు. -
Covid Deaths: 30 లక్షలు దాటిన మరణాలు
రియో డీ జనీరో: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపుతోంది. ప్రపంచం మొత్తం మీద శనివారం నాటికి కరోనా కారణంగా 30 లక్షల మంది మరణించారు. ఈ వివరాలను జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అందించింది. ప్రత్యేకించి భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా మహమ్మారి తాజా పంజా విసురుతోంది. మొత్తం మరణాలు వెనెజులాలోని కరైకాస్ నగర జనాభాకు దాదాపు సమానం కావడం గమనార్హం. కొన్ని దేశాల ప్రభుత్వాలు కరోనా మరణాలకు సంబంధించి పూర్తి వివరాలను బయటకు వెల్లడించడం లేదని భావిస్తున్నారు. అమెరికా, భారత్ వంటి దేశాల్లో టీకాలు భారీస్థాయిలో ఇస్తున్నా మరణాలూ భారీ సంఖ్యలో ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 12 వేలకుపైగా మరణాలు, ఏడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలోనే ఇప్పటి వరకూ 5,60,000లకు పైగా మరణాలు సంభవించాయి. -
బ్రెజిల్లో మరణ మృదంగం
బ్రెజీలియా: బ్రెజిల్లో కోవిడ్ –19 విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. రోజుకి సగటున 2 వేల మంది ప్రాణాలను కరోనా బలి తీసుకుంటోంది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైంది బ్రెజిల్లోనే. ఇప్పటివరకు 2,59,271 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నట్టుగా వరల్డో మీటర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఊహించలేదని బ్రెజిల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మొదట్నుంచి నిర్లక్ష్యమే: కరోనాని కట్టడి చేయడంలో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో మొదట్నుంచి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వైరస్ని తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు. మాస్కులు తప్పనిసరి చేయలేదు. లాక్డౌన్ విధించడానికి ఇష్టపడలేదు. ప్రజలు కూడా కరోనా గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోవిడ్ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. బ్రెజిల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నెమ్మదిగా సాగుతోంది. చైనా తయారీ కరోనావాక్, ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను ఇస్తోంది. ఇప్పటివరకు 71 లక్షల మందికి ఒక్క డోసు, 21 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చింది. కేసుల తీవ్రతకి అమెజాన్ అడవులు బాగా విస్తరించిన మానస్ నగరం నుంచి నుంచి వచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్ పీ1 కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
ఒకే రోజు 3 వేలకు పైగా మరణాలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అమెరికా చరిత్రలో చీకటి రోజుగా చెప్పుకునే 2001 సెప్టెంబర్ 11 నాటి దాడిలో కంటే, ఇప్పుడు 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. బుధవారం ఒక్క రోజే 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ నాటి దాడిలో 2,977 మంది మరణిస్తే, ఇప్పుడు ఒకే రోజు కరోనా 3,054 మంది అమెరికన్ల ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా మే 7న 2,769 మంది మరణించడం ఒక రికార్డు అయితే ఇప్పుడు ఒక్కసారిగా 3 వేలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య సైతం లక్షా 6 వేల 688కి చేరుకుంది. బుధవారం ఒక్క రోజే 2,26,533 కేసులు నమోదయ్యాయి. థ్యాంక్స్ గివింగ్ కొంప ముంచిందా? శీతాకాలం కావడం, ప్రజలు మాస్కులు ధరించకపోవడం, థ్యాంక్స్ గివింగ్ వీక్ కావడంతో ప్రజలంతా పార్టీల్లో మునిగితేలడంతో కరోనా మరింతగా విజృంభిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సంబరాలకి కూడా సన్నాహాలు చేస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో కేసులు మరింతగా పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలందరూ మాస్కులు పెట్టుకోవాలని, ఇళ్లకే పరిమితం కావాలంటూ అధికారులు కోరుతున్నారు. కరోనా రికవరీ రేటు 94.74% న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో మరో 31,521 కరోనా కేసులు నిర్ధారణయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,67,371కు చేరుకుంది. అదే సమయంలో కరోనా కారణంగా 412 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,41,772కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారానికి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 92,53,306 అయ్యింది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,72,293గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 3.81%గా ఉన్నాయి. మరణాల రేటు 1.45%గా ఉంది. -
కాబూల్ వర్సిటీలో కాల్పులు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లోని కాబూల్ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కనీసం 25 మంది మృతి చెందడంగానీ, గాయపడటంగానీ జరిగిందని అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అయితే, ఎంతమంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారనే కచ్చితమైన సమాచారం వెల్లడించలేదు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. 20 మంది మరణించి ఉంటారని అంచనా. యూనివర్సిటీలో పుస్తక ప్రదర్శన జరుగుతుండగా ముగ్గురు వ్యక్తులు హఠాత్తుగా తుపాకులతో కాల్పులు ప్రారంభించినట్లు సమాచారం. అఫ్గానిస్తాన్లోని ఇరాన్ రాయబారి ఈ పుస్తక ప్రదర్శనకు హాజరయ్యారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వర్సిటీ ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. వర్సిటీకి దారితీసే రోడ్లను మూసివేశారు. ముష్కరులు, పోలీసుల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. కొన్ని గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసుల ఎదురుదాడిలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కాబూల్ విశ్వవిద్యాలయంలో కాల్పులు తామే జరిపామంటూ ఇప్పటిదాకా ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటన జారీ చేయలేదు. సాయుధులైన ఉగ్రవాదులు కాబూల్ యూనివర్సిటీపై జరిపిన దాడిని ప్రధాని మోదీ ఖండించారు. -
కుప్పకూలిన భవనం.. 17 మంది దుర్మరణం
సాక్షి ముంబై: మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మూడంతస్తుల భవనం నేలమట్టం కావడంతో అందులోని 17 మంది మృతి చెందారు. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు ఏడుగురు ఉన్నారు. ఈ సంఘటనలో 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. భివండీ ధామన్కర్నాకా పటేల్ కాంపౌండ్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనం సోమవారం వేకువజామున 3.15 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. అంతా గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని వారు ఉలిక్కిపడ్డారు. బాధితుల హాహాకారాలు విని ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ ఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపాదికపై సహాయక చర్యలు ప్రారంభించారు. ఉదయం 11 గంటల సమయానికి 13 మందిని శిథిలాల నుంచి కాపాడగలిగారు. సహాయక చర్యలు సోమవారం రాత్రి వరకు కొనసాగాయి. సాయంత్రం 6.15 గంటల వరకు అందిన వివరాల మేరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. బాధితుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడటంతో వారందరికీ వెంటనే ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి∙ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు 43 ఏళ్లనాటి ఈ శిథిల భవనం ప్రమాదకరమైందంటూ భివండీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. 40 ఫ్లాట్లున్న ఈ భవనంలో 150 మంది వరకు నివాసం ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. అధికారులు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. భివండీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. -
చైనాలో రెస్టారెంట్ కూలి 17 మంది మృతి
బీజింగ్: ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో ఒక రెస్టారెంటు కుప్పకూలి 17 మంది మరణించారు. లిన్ఫెన్ అనే పట్టణంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల ఈ హోటల్ భవనం శిథిలాల నుంచి మొత్తం 45 మందిని బయటకు తీశారు. వీరిలో 17 మంది విగతజీవులుగా బయటపడగా, 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. భవనం కూలిపోవడానికి కారణాలేమిటనేది వెంటనే తెలియరాలేదు. -
యువతతో పెద్దలకు కరోనా ముప్పు!
జెనీవా: యువతలో కరోనా విజృంభిస్తే, వారి ఇళ్లలోని పెద్దవారిపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఫలితంగా మరణాలు పెరిగే ప్రమాదం పొంచి ఉందని, కోవిడ్–19 సుడిగాలిలాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) యూరప్ చీఫ్ డాక్టర్ హన్స్ క్లూగ్ వెల్లడించారు. యువతరం కారణంగా కచ్చితంగా ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుతోందన్నారు. మరోవైపు దక్షిణ కొరియాలో ఒకే రోజు అత్యధికంగా 441 కరోనా కేసులు కొత్తగా నమోదవడంతో, కరోనాని కట్టడి చేయడానికి లాక్డౌన్ లాంటి ఆంక్షలు విధించవచ్చని భావిస్తున్నారు. గత 14 రోజుల్లో దేశంలో కొత్తగా 4,000 కోవిడ్ కేసులు నమోదైనట్టు వైద్యులు పేర్కొన్నారు. సియోల్లో వైరస్ సోకిన వారిని గుర్తించటం చాలాకష్టతరంగా మారిందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. సియోల్లోని నేషనల్ అసెంబ్లీని మూసివేశారు. దేశ ఆర్థికాభివృద్ధి 1.3 శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని దక్షిణకొరియా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఇక కరోనా పుట్టినిల్లు చైనాలో వరుసగా గత 11 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకుండా కట్టడి చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా సోకగా, మొత్తం 324 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్ వచ్చిన వారికే తిరిగి వస్తుందా? కరోనా వైరస్ సోకిన వారికి తిరిగి మళ్ళీ రెండోసారి కరోనా సోకుతుందా అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా దీనిపై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒకవేళ అదేజరిగితే వ్యాక్సిన్ కార్యక్రమంపై కూడా దీని ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. యూకే కేంద్రంగా పనిచేస్తోన్న భారతసంతతికి చెందిన డాక్టర్ అసీమ్ మల్హోత్రా 21 రోజుల ఇమ్యూనిటీ ప్లాన్ని అభివృద్ధి పరిచి, కరోనా వైరస్ని ఎదుర్కొనేలా శరీరాన్ని సంసిద్ధం చేయడానికి పుస్తకరూపంలో పొందుపరిచిన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పిట్టల్లా రాలుతున్న జనం
-
చైనా తర్వాత ఇరాన్..
న్యూఢిల్లీ/బీజింగ్/వాషింగ్టన్/టెహ్రాన్: కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మెల్లగా విస్తరిస్తోంది. ప్రభుత్వాల్లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు 70 దేశాల్లోని 88వేల మందికి ఈ వ్యాధి పాకింది. చైనాలో ఈ వైరస్తో 2,900 మంది మృత్యువాతపడగా అన్ని దేశాల్లో కలిపి 3 వేల మంది వరకు చనిపోయారు. చైనా వెలుపల అత్యధికంగా ఇరాన్లో 66 మంది కోవిడ్తో మృతి చెందడం, మరో 1,500 మందికి వ్యాధి నిర్ధారణయినట్లు ఆ దేశం ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. భారత్లోనూ కొత్తగా రెండు కోవిడ్ కేసులు బయటపడ్డాయి. చైనా తర్వాత ఇరాన్.. చైనాలో సోమవారం కోవిడ్తో 42 మంది మృతి చెందగా మొత్తం బలైనవారి సంఖ్య 2,912కు చేరుకుంది. మరో 80 వేల మంది ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. దేశంలో జనవరి 22వ తేదీ తర్వాత కొత్తగా బయటపడుతున్న కేసులు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయమని చైనా ప్రభుత్వం పేర్కొంది. ఈ వైరస్ మొదటిగా బయటపడిన చైనా తర్వాత అత్యధికంగా ఇరాన్లో మరణాలు నమోదయ్యాయి. ‘సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ సలహాదారు మిర్మొహమ్మదీ(71) సహా 66 మంది ఈ వ్యాధితో చనిపోయారు. మరో 1,501 మందిలో వైరస్ లక్షణాలను గుర్తించాం’ అని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, చైనా అధికారులు తీసుకున్న కరోనా నియంత్రణ చర్యల కారణంగా ఆ దేశంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపాయి. మరో ఘటనలో..యున్నాన్ ప్రావిన్సులో కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు అధికారులను పొడిచి చంపిన ఓ వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. గత నెల 6న ఈ ఘటన జరిగింది. -
చైనా వెలుపల కోవిడ్ మృతులు
బీజింగ్/వాషింగ్టన్: శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి చైనా వెలుపల కూడా ప్రాణాలను మింగేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్లాండ్లో తొలిసారిగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అమెరికా గడ్డపై 50 ఏళ్లు పైబడిన ఒక వ్యక్తి మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజలెవరూ ఈ వైరస్ గురించి ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు అమెరికాలో 22 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో 15 మంది కోలుకున్నారు. మరోవైపు జపాన్ డైమండ్ ప్రిన్సెస్ నౌకలో వైరస్ సోకి పెర్త్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు మరణించడంతో ఆస్ట్రేలియాలో కూడా తొలి కోవిడ్ మరణం నమోదైంది. థాయ్లాండ్లో కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 2,996కు చేరింది. ఇరాన్లో మృతులు 54 మరోవైపు ఇరాన్లో కోవిడ్ విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ 54 మంది మరణించారు. మరో 987 మంది చికిత్స పొందుతున్నారని ఇరాన్ మీడియా వెల్లడించింది. దక్షిణ కొరియాలో కూడా ఈ వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. కొత్తగా మరో 376 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో బాధితుల సంఖ్య 3,526కి చేరుకుంది. చైనాలో మరో 35 మంది మృతి ఇక చైనాలో ఆదివారం ఒక్కరోజే 35 మంది మరణించారు. మరో 570 తాజా కేసులు నమోదయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 2,870కి చేరుకుంటే, వైరస్ సోకిన వారి సంఖ్య 79,824కి చేరుకుంది. కరోనా వైరస్ సోకిన వారిలో 60 ఏళ్ల వయసు పైబడినవారు, హైపర్ టెన్షన్ ఉన్నవారే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. -
భారత విమానానికి చైనా నో?
బీజింగ్/న్యూఢిల్లీ: కోవిడ్–19ను ఎదుర్కోవడంలో భారత్ అందించే సాయాన్ని తీసుకోవడానికి చైనా ఇంకా ముందుకు రాలేదు. కరోనా వైరస్తో అతలాకుతలమైపోతున్న వూహాన్కి సహాయ సామగ్రిని, అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురావడం కోసం మిలటరీ రవాణా విమానాన్ని కేంద్ర ప్రభుత్వం పంపింది. అయితే ఆ విమానం ల్యాండ్ అవడానికి చైనా అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ సామగ్రిలో గ్లోవ్స్, సర్జికల్ మాస్క్లు, ఫీడింగ్ పంప్స్, గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించే డెఫిబ్రిలేటర్స్ ఉన్నాయి. చైనా ఉద్దేశపూర్వకంగానే అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని భారత్లో అత్యున్నత స్థాయి అధికారులు వెల్లడించారు. హుబాయ్ ప్రావిన్స్లో పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, వైరస్ను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలపై దృష్టి అధికంగా కేంద్రీకరించడంతో, అనుమతినివ్వడంలో జాప్యం జరిగి ఉండవచ్చునని చైనా ఎంబసీ వివరణ ఇచ్చింది. కోవిడ్ సోకుతున్న దేశాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో అంతర్జాతీయంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దక్షిణ కొరియాలో ఒకరు, ఇటలీలో ఇద్దరు వ్యాధిగ్రస్తులు మరణించడం ఆందోళన పుట్టిస్తోంది. సింగపూర్, ఇరాన్, దక్షిణ కొరియా దేశాల్లో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఈ వైరస్ను ఎలా నిరోధించాలో అర్థంకాక శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు అత్యవసరమైతే తప్ప సింగపూర్కు ఎవరూ ప్రయాణించవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వూహాన్కు డబ్ల్యూహెచ్ఓ అధికారులు కోవిడ్ తీవ్రతను అంచనావేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధికారులు వూహాన్కు బయల్దేరారు. ఈ వ్యాధి ఒకరికి వ్యాపిస్తే, వారి నుంచి మరో పది మందికి వ్యాపిస్తూ ఉండడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. వూహాన్లో పరిస్థితుల్ని అంచనా వేసి కోవిడ్ను ఎలా నియంత్రించవచ్చునో ప్రణాళికలు సిద్ధం చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
కారాగారాల్లోనూ కోవిడ్
బీజింగ్: కోవిడ్–19(కరోనా వైరస్) ఇప్పుడు చైనాలో జైళ్లనూ వణికిస్తోంది. ఖైదీలకు కోవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో 500కి పైగా కరోనా కేసులు నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. వూహాన్లో మహిళా జైలులో అత్యధికంగా కేసులు నమోదైనట్టుగా జైళ్ల శాఖ తెలిపింది. షాండాంగ్ ప్రావిన్స్లో రెంచెంగ్ జైలులో 200 మంది ఖైదీలు, ఏడుగురు గార్డులకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దీంతో సమగ్ర దర్యాప్తుకి ఆదేశించిన ప్రభుత్వం రెంచెంగ్ జైలుకి చెందిన ఏడుగురు అధికారుల్ని సస్పెండ్ చేసింది. ఒక్కరోజే 118 మంది మృతి కరోనా మృతులు రోజు రోజుకి పెరుగుతున్నారు. హుబాయ్ ప్రావిన్స్లో ఒక్కరోజే 118 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,236కి చేరుకుంది. ఇప్పటివరకు 75,400 కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకీ మృతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు వ్యాధి భయంతో మాస్క్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో డిమాండ్కి తగ్గ సప్లయి లేక భారీగా కొరత ఏర్పడింది. దీంతో హాంగ్కాంగ్లో చాలామంది సొంతంగా మాస్క్లు తయారు చేసుకుంటున్నారు. కొందరు జేబు రుమాళ్లకే ఎలాస్టిక్ తగిలించి మాస్క్గా వాడుతున్నారు. మెరుగుపడుతున్న భారతీయుల ఆరోగ్యం జపాన్ తీర ప్రాంతంలో డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా వైరస్ సోకిన భారతీయుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. కరోనా సోకిన ఎనిమిది మందికి చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని జపాన్లో భారత్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలకూ వ్యాప్తి కోవిడ్ వ్యాప్తి చెందిన దేశాల జాబితాలో తాజాగా మరో రెండు దేశాలు చేరాయి. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. తాజాగా డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి ఇజ్రాయెల్కి చేరుకున్నాక ఒక ప్రయాణికుడికి కోవిడ్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. ఆ నౌకలో మొత్తం 15 మంది ఇజ్రాయెల్ దేశస్తులు ఉంటే వారిలో నలుగురికి కరోనా ఉన్నట్టు తేలడంతో అక్కడే ఉంచి చికిత్స చేస్తున్నారు. మిగిలిన 11 మందిని వారి దేశానికి పంపారు. అయితే ఇజ్రాయెల్కు చేరుకున్నాక ఒక ప్రయాణికుడికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఇక లెబనాన్లో 45 ఏళ్ల వయసున్న ఒక మహిళకు వైరస్ సోకినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. -
కోవిడ్ మృతులు 2 వేలు
బీజింగ్/టోక్యో: చైనాలో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 2,004కు చేరుకోగా, బాధితుల సంఖ్య 74,185కు చేరుకుంది. దాదాపు 25 దేశాల్లోని వెయ్యిమందికి వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధారించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు వ్యాధిబారిన పడడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా పౌరులు తమకు కావాల్సిన ఆహారం, నిత్యావసరాలను ఆన్లైన్లో ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. దీంతో ఈ కామర్స్ సంస్థలకు గిరాకీ భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే తమ వద్ద ఉన్న 1.80 లక్షల మంది సిబ్బందికి అదనంగా 20వేల మందిని నియమించుకున్నట్లు జేడీ డాట్ కామ్ పేర్కొంది. కోవిడ్ భయంతో జపాన్ తీరంలో 14 రోజులుగా నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ ఓడ నుంచి కరోనా లక్షణాలు లేని 500 మంది బయటకు వచ్చారు. ఓడలోని 3,711 మందిలో 542 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ కట్టడిలో చైనా విఫలమైందంటూ ఈ నెల 3వ తేదీన ‘వాల్స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన ‘చైనాయే అసలైన రోగి’ (చైనా ఈజ్ది రియల్ సిక్ మ్యాన్ ఆఫ్ ఆసియా)కథనంపై ఆ దేశం మండిపడింది. క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్కు వాల్స్ట్రీట్ జర్నల్ తలొగ్గక పోవడంతో ఆ పత్రిక రిపోర్టర్లు ముగ్గురికి చైనా దేశ బహిష్కారం విధించింది. -
కోవిడ్ మృతులు 1,665
బీజింగ్/న్యూఢిల్లీ: ప్రాణాంతక ‘కోవిడ్–19’ విజృంభణ కొనసాగుతోంది. చైనాలో ఈ వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,665కి చేరింది. ఈ మరణాల్లో అత్యధికం తొలుత ఈ వైరస్ను గుర్తించిన వుహాన్ నగరం ఉన్న హుబే ప్రావిన్స్లోనే చోటు చేసుకున్నాయి. శనివారం చనిపోయిన 142 మందిలో 139 మంది ఆ రాష్ట్రంలోనే మరణించారు. అలాగే, మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 68,500కు పెరగగా, వాటిలో 56,249 కేసులు హుబే ప్రావిన్స్లోనివే. వీటిలో శనివారం ఒక్కరోజే నిర్ధారించిన కేసుల సంఖ్య 1,843. అయితే, కొత్తగా వైరస్ సోకుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 1700 మంది వైద్య సిబ్బందికి ఈ వైరస్ సోకగా ఆరుగురు చనిపోయారు. కరెన్సీ ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్న నేపథ్యంలో.. నోట్లు, నాణేలను కొన్ని రోజుల పాటు వాడకుండా పక్కనబెట్టి, వాటిపై అతినీలలోహిత కిరణాలను ప్రసరింపచేసి, ఆ తరువాత మళ్లీ సర్క్యులేషన్లోకి పంపిస్తున్నారు. పాన్ తీరంలో నిలిపేసిన ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలో కోవిడ్–19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కోవిడ్–19పై పోరులో చైనాకు అన్ని రకాలుగా సహకరిస్తామని భారత్ మరోసారి చెప్పింది. భారత్ త్వరలో ఔషధాలను పంపించనుందని చైనాలో భారతీయ రాయబారి విక్రమ్ మిస్రీ తెలిపారు. -
కోవిడ్తో విలవిల..
బీజింగ్: చైనాలో కోవిడ్–19 మృతుల సంఖ్య రోజురోజుకూ ఎగబాకుతోంది. ఇప్పటివరకూ ఈ వైరస్ బారిన పడి 1,523 మంది మరణించగా మొత్తం 66వేల మంది దీని బారినపడినట్లు నిర్ధారణ అయిందని చైనా ఆరోగ్య కమిషన్ శనివారం వెల్లడించింది. చైనా మొత్తమ్మీద కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 66,492కు చేరుకోగా, వీరిలో 11, 053 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య 8096కు పెరిగింది. కోవిడ్ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ తగ్గుతోందని చైనా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించిందని, వ్యాధికి కేంద్రబిందువుగా భావిస్తున్న హుబే ప్రాంతం మినహా మిగిలిన చోట్ల తగ్గుదల నమోదవుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా.. కోవిడ్–19ను నియంత్రించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా వంటి టెక్నాలజీలను వాడాలని అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఆ తల్లీ బిడ్డ డిశ్చార్జ్ కోవిడ్ బారినపడ్డ 67 రోజుల వయసున్న పసిబిడ్డ చికిత్స తర్వాత∙ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి విడుదలైంది. జియాంగ్ అనే ఇంటిపేరున్న ఈ బిడ్డను హుబేలోని సెంట్రల్ ఆసుపత్రిలో చేర్చారు. గుయిఝూ ప్రాంతం నుంచి సెలవులు గడిపేందుకు గత నెల 16న హుబే వచ్చిన జియాంగ్ తల్లిదండ్రులకు వ్యాధి సోకినట్లు జనవరి 25న నిర్ధారణ అయింది. ఇదే సమయంలో బిడ్డలోనూ వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో ఫిబ్రవరి రెండవ తేదీ జియాంగ్ను ఆసుపత్రిలో చేర్పించడం తెల్సిందే. వచ్చే వారం 406 మంది విడుదల? ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వూహాన్ నుంచి తీసుకొచ్చి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కేంద్రాల్లో పర్యవేక్షణలో ఉంచిన 406 మందిని వచ్చే వారం విడుదల చేసే వీలుంది. కోవిడ్ సోకలేదని నిర్ధారణ చేసుకున్నాకే విడుదలచేస్తారని అధికారులు శనివారం తెలిపారు. 650లో 406 మందిని న్యూఢిల్లీలోని ఐటీబీపీ కేంద్రాల్లో పర్యవేక్షణలో ఉంచగా, మిగిలిన వారిని మానేసర్లోని సైనిక శిబిరంలో పర్యవేక్షణలో ఉంచారు. ఆ కరెన్సీ నోట్ల చలామణీ బంద్ కోవిడ్ను ఎదుర్కొనేందుకు చైనా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వైరస్ను నియంత్రించే లక్ష్యంతో తాజాగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధికి కేంద్రబిందువుగా భావిస్తున్న ప్రాంతాల్లోని కరెన్సీ నోట్ల చలామణీని తాత్కాలికంగా ఆపేశారు. ఈ నోట్ల ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుందేమో అన్న అనుమానంతో ఈ చర్యలు చేపట్టినట్లు అంచనా. పాతనోట్ల స్థానంలో కొత్తనోట్లు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వైస్ గవర్నర్ ఫాన్ వైఫీ తెలిపారు. కోవిడ్కు విరుగుడుగా చైనా వైద్యం? కోవిడ్ను ఎదుర్కొనేందుకు చైనా సంప్రదాయ వైద్యాన్ని సమర్థంగా ఉపయోగిస్తోంది. వ్యాధి సోకిందని నిర్ధారణ అయిన వారిలో కనీసం సగంమందికి సంప్రదాయ వైద్యంతో సాంత్వన చేకూరిందని చైనా ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న హుబేలో తాము అల్లోపతితోపాటు చైనీస్ వైద్యం అందించడం మొదలుపెట్టామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఉపాధ్యక్షుడు వాంగ్ హెషింగ్ తెలిపారు. అల్లోపతి వైద్యంలో కరోనా వైరస్ నివారణకు నిర్దిష్టమైన చికిత్సలేకపోవడంతో ఈ వార్తకు ప్రాధాన్యమేర్పడింది. -
కోవిడ్ మృతులు 1,500
బీజింగ్/టోక్యో/న్యూఢిల్లీ: చైనాలో ప్రమాదకర కోవిడ్–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉన్న హుబే ప్రావిన్స్, తదితర ప్రాంతాల్లో ఒక్క రోజులోనే 121 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,500కు చేరుకుంది. అదేవిధంగా, చైనాలోని 31 ప్రావిన్స్ల్లో మరో 5,090 కేసులు కొత్తగా బయటపడగా వీటిలో 4,823 కేసులు వ్యాధి మూలాలు మొదట గుర్తించిన హుబే ప్రావిన్స్లోనివే కావడం గమనార్హం. దీంతో దేశం మొత్తమ్మీద బాధితుల సంఖ్య గురువారానికి 64,894కు చేరుకుంది. అలాగే, కోవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తూ వైరస్ సోకిన 1,700 మంది ఆరోగ్య సిబ్బందిలో ఆరుగురు చనిపోయారని చైనా ప్రకటించింది. జపాన్ ఓడలో ముగ్గురు భారతీయులకు.. కోవిడ్–19 వైరస్ అనుమానంతో జపాన్ తీరంలో నిలిపేసిన ఓడలోని 3,711 మందిలో 218 కేసులను పాజిటివ్గా గుర్తించగా వీరిలో ముగ్గురు భారతీయులున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. డైమండ్ ప్రిన్సెస్ అనే ఈ ఓడలోని 138 భారతీయుల్లో 132 మంది సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులున్నారు. దీంతోపాటు ఓడలోని కోవిడ్ నెగటివ్గా నిర్ధారించిన 11 మంది 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జపాన్ అధికారులు శుక్రవారం బయటకు పంపించారు. టోక్యోకు చెందిన ఓ వృద్ధురాలు కోవిడ్తో మృతి చెందినట్లు జపాన్ తెలిపింది. భారత్లో పరిస్థితి అదుపులోనే.. దేశంలో కోవిడ్ (కరోనా) వ్యాప్తి నియంత్రణలోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ తెలిపారు. చైనాలోని వుహాన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థులకు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, వీరిలో ఒకరు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. చైనా, హాంకాంగ్, థాయ్లాండ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే వారికి దేశంలోని 21 ఎయిర్పోర్టుల వద్ద స్క్రీనింగ్ కొనసాగుతుండగా, ఈ జాబితాలో జపాన్, దక్షిణకొరియాలను కూడా చేర్చినట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. -
‘కోవిడ్’ మృతులు 1,115
బీజింగ్: రోజులు గడుస్తున్నా చైనాలో కోవిడ్–19 (కరోనా వైరస్) కల్లోలానికి అంతం లేకుండా పోతోంది. గత ఏడాది డిసెంబర్లో తొలికేసు నమోదైన నాటి నుంచి చూస్తే మంగళవారం నాటికి వైరస్ బాధితుల మరణాల సంఖ్య 1,115కు చేరింది. ప్రస్తుతం 44,763 మంది వ్యాధి బారినపడినట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం తెలిపారు. జపాన్ తీరంలో లంగరేసిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో తాజాగా 39 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో నౌకలో వైరస్ బాధితుల సంఖ్య 174కు చేరింది. మొత్తం 3700 మంది ప్రయాణీకులు ఉన్న ఈ నౌకలో ఇంకా వందలాది మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉందని జపాన్ ఆరోగ్య మంత్రి కట్సునోబూ కాటో తెలిపారు. కోవిడ్ బారిన పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు మహిళలు రష్యాలోని ఆసుపత్రి నుంచి పరారైనట్లు రష్యా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు సరిగా సహకరించకపోవడం, ఆసుపత్రిలోని పరిస్థితులు, వైరస్ సోకుతుందేమో అన్న భయం కారణంగానే తాము పారిపోయినట్లు ఆ మహిళలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇద్దరు భారతీయులకు కోవిడ్ టోక్యో: జపాన్లో క్రూయిజ్ నౌకలో చిక్కుకున్న 138 మంది భారతీయుల్లో ఇద్దరికి కోవిడ్ సోకినట్లు జపాన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వ్యాధి సోకిన వారిని ఆస్పత్రులకు తరలించి జపనీస్ నియమనిబంధనల ప్రకారం చికిత్స అందిస్తున్నామని జపాన్ అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ వైరస్ ఉన్నందున ఈ నెల 19 వరకూ క్రూయిజ్ నౌకను తమ అదుపులోనే ఉంచుకోనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు తెలుకునేందుకు భారత రాయబార అధికారులు జపాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
కరోనా : నిర్బంధంలో 200 మంది భారతీయులు
టోక్యో/బీజింగ్/జెనీవా: కరోనా భయంతో జపాన్ ప్రభుత్వం యెకోహోమా తీరంలో నిలిపివేసిన నౌకలోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే ఆ నౌకలో నిర్బంధంలో ఉన్న బినయ్ కుమార్ సర్కార్ అనే భారతీయుడు తమను కాపాడాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. 200 మంది భారతీయులతో పాటు నౌకలో అంతా కలిపి 3,700 మంది ఉన్నారనీ, వీరిలో 62 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ కాగా తమ నౌకను అధికారులు దిగ్బంధించినట్లు బినయ్ పేర్కొన్నాడు. మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో తమను కాపాడాలంటూ బినయ్ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఓ వీడియోను ఫేస్బుక్లో పెట్టారు. ‘మేం కోరుకుంటోంది ఒక్కటే, దయచేసి మమ్మల్ని ఈ నౌక నుంచీ, ఈ నిర్బంధం నుంచీ వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచండి. మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. మాకు భయంగా ఉంది. దయచేసి సాయం చేయండి’అని అందులో ఉంది. వైరస్ ఇంకా మరింత మందికి వ్యాపించకుండా ఉంటే, ఫిబ్రవరి 19 వరకు వీరందరినీ వేరుగా ఉంచాల్సి ఉంటుందని నౌకలోని జపాన్ అధికారులు శుక్రవారం చెప్పారు. ‘జపాన్ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 7 గంటల వరకు భారతీయులెవ్వరికీ కరోనా సోకలేదు. ప్రస్తుతం నౌకలోని చివరి బృందానికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’అని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. 723కు చేరిన కరోనా మృతులు చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 723కు చేరింది. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన కేసులు 34,598కు చేరాయి. తాజాగా, 1,280 మంది వ్యాధిగ్రస్తుల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు చైనా నేషనల్ హెల్త్క మిషన్ ప్రకటించింది. చైనాలో కరోనా వైరస్ బారిన పడి అమెరికాకు చెందిన ఓ మహిళ, జపనీయుడొకరు మృతి చెందారు. కరోనాతో చైనాలో విదేశీయులు మరణించిన తొలి ఘటన ఇదే. కరోనాకు శాశ్వత పేరుపై తర్జనభర్జన ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త రకం వైరస్ కరోనాకు శాశ్వతంగా ఏం పేరు పెట్టాలనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తర్జనభర్జన పడుతోంది. కరోనా వైరస్ ప్రారంభమైన వుహాన్ నగరం పేరు గానీ, అటు చైనా ప్రజల మనోభావాలు గానీ దెబ్బతినకుండా ఉండేలా పేరు పెట్టాలని జాగ్రత్త వహిస్తోంది. ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పేర్కొన్న ఈ వ్యాధికి ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ అధికారికంగా తాత్కాలిక పేరు ‘2019–ఎన్కోవ్ అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్’అని పెట్టింది. ‘ఎన్కోవ్’అంటే ‘నావల్ కరోనావైరస్’అని అర్థం అని తెలిపింది. ‘పేరుతో ప్రదేశానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉండేలా ఓ పేరును పెట్టడం చాలా ముఖ్యమని మేం భావించాం’అని డబ్ల్యూహెచ్వో అత్యవసర వ్యాధుల విభాగం అధిపతి మరియా తెలిపారు. శాశ్వత పేరు పెట్టడంపై నిర్ణయం కొద్దిరోజుల్లోనే తీసుకుంటామని, డబ్ల్యూహెచ్వోతో పాటు ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ (ఐసీటీవీ) కరోనా నిపుణుల నిర్ణయం మేరకు ఉంటుందని ఆమె వెల్లడించారు. ఎయిర్ హగ్ ! కరోనా బాధితులకు సేవలు అందించేందుకు ఆస్పత్రిలో చేరిన నర్స్ లియు హైయాన్ తన కూతురు చెంగ్ను 10 రోజుల నుంచి కలవలేదు. శనివారం చెంగ్ ఆస్పత్రి వద్దకు వచ్చింది. అయితే కరోనా కారణంగా ఇద్దరు కలవడం కుదరకపోవడంతో దూరం నుంచే కౌగిలింత ఇచ్చినట్లుగా ఏడుస్తూ చేతులు చాచి భావోద్వేగానికి గురయ్యారు. ‘మమ్మీ వైరస్తో పోరాడుతోంది.. తగ్గగానే ఇంటికి వస్తుంది’ అని చెబుతూ.. చక్కగా, మంచిగా ఉండాలని కుమార్తెకు సూచించారు. కరోనా కారణంగా తల్లీకూతుళ్లు కన్నీళ్ల నడుమ జరిగిన ఈ ఎయిర్ హగ్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. తల్లి, కూతుళ్ల ఎయిర్ హగ్ -
కరోనా విశ్వరూపం
బీజింగ్: కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. చైనాలో 31 ప్రావిన్షియల్ రీజియన్లలో ఇది విశ్వరూపం చూపిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 490 మంది మరణించారని, 24 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకీ పెరిగిపోతూ ఉండడంతో వూహాన్లో జాతీయ స్టేడియం, జిమ్లనే తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చైనాలో కరోనా ధాటికి బెంబేలెత్తిపోయి హాంగ్కాంగ్ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో చైనా నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచుతామని హాంగ్కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ ప్రకటించారు. పుట్టిన పసికందుకి సోకిన వైరస్ చైనాలోని వూహాన్లో అప్పుడే పుట్టిన పసికందుకి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకు ఈ వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రసవం కావడానికి ముందు తల్లికి జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో బిడ్డకు గర్భంలోనే ఆ వైరస్ సోకి ఉంటుందని చెబుతున్నారు. అనుమానితుడు పరారీ: గుజరాత్లో కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. జనవరి 19న చైనా నుంచి వచ్చిన 41 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతనిని వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు. అయితే రక్త నమూనాలు ఇవ్వకుండా అతను పరారీ కావడం ఆందోళన రేపుతోంది. కాగా, కరోనా వైరస్ నిర్మూలనకు చైనాతో కలిసికట్టుగా పోరాటం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం గుజరాత్లో వజ్రాల వ్యాపారాన్ని చావు దెబ్బ కొట్టనుంది. వచ్చే రెండు నెలల్లో 8 వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. -
కరోనా కేసులు 20,522
బీజింగ్/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. చైనాలో ఈ వైరస్ బారిన పడి మరణించినవారి సంఖ్య 426కి చేరింది. సోమవారం ఒక్కరోజే చైనాలో 64 మంది చనిపోగా, 3235 కొత్త కేసులు, 5072 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకిన వారిలో 492 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 1,71,329 మంది అనుమానితులు ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారు. చైనాలో ఈ వైరస్ బాధితుల సంఖ్య సోమవారం నాటికి 20,522కి చేరింది. వైరస్ వ్యాప్తి, కట్టడిని సమీక్షించేందుకు సోమవారం అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షతన అధికార కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత పొలిటికల్ బ్యూరో సమావేశం జరిగింది. బాధితులకు చికిత్స అందించే విషయంలో, వైరస్ను నిరోధించే విషయంలో నిర్లక్ష్యం చూపిన అధికారులను కఠినంగా శిక్షించాలని జిన్పింగ్ ఆదేశించారు. భారత్ ముందు జాగ్రత్త చర్యలు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా భారత్ వీసా నిబంధనలను మరింత కఠినం చేసింది. గత రెండు వారాల్లో చైనా వెళ్లిన చైనీయులు, విదేశీయులకు ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. జనవరి 15 తరువాత చైనా వెళ్లి, ప్రస్తుతం సాధారణ వీసా లేదా ‘ఈ–వీసా’పై భారత్లో ఉన్న వారు వెంటనే 011–23978046 హాట్లైన్ నంబర్లో కానీ, nఛిౌఠి2019ఃజఝ్చజీ .ఛిౌఝకి ఈమెయిల్ చేసి ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించాలని కోరింది. చైనా, సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకుల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా హైదరాబాద్ సహా దేశంలోని ఏడు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. వారిని ఆ ఏరోబ్రిడ్జిల ద్వారా తీసుకెళ్లి స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. వైరల్ అయిన విషాదం కరోనా వైరస్తో బాధపడుతున్న తండ్రి ప్రత్యేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూ వీల్చెయిర్కే పరిమితమైన అతడి కుమారుడు, ఆహారం అందించి, సాయం చేసే వారు లేని పరిస్థితుల్లో మృత్యువాత పడిన విషాదం చైనాలో చోటు చేసుకుంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న యాన్ షియావోవెన్ను జనవరి 22న చికిత్సా కేంద్రానికి తరలించారు. జనవరి 27న అతడికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. గ్రామంలోని వారి ఇంటివద్ద సెరిబ్రల్ పాల్సీతో బాధపడ్తున్న ఆయన కుమారుడు యాన్ చెంగ్ మాత్రమే ఉన్నాడు. వీల్ చెయిర్కే పరిమితమైన చెంగ్ సొంతంగా ఏ పనులు చేసుకోలేడు. ఈ నేపథ్యంలో తన కుమారుడికి సాయం చేయాలని బంధువులను, గ్రామస్తులను కోరుతూ షియావోవెన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. కానీ అప్పటికే ఆలస్యం అయింది. జనవరి 29న యాన్ చెంగ్ మృతి చెందాడు. ఆయన మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. అయితే, ఈ ఘటనను హాంగన్ కౌంటీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ, మేయర్లపై వేటు వేసింది. ఈ విషాద ఘటన చైనాలో వైరల్గా మారింది. ఆ తండ్రి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్కు 27 కోట్ల వ్యూస్ వచ్చాయి. -
1000 పడకల ఆస్పత్రి 9 రోజుల్లో..
-
9 రోజుల్లో కరోనా ఆస్పత్రి
బీజింగ్/తిరువనంతపురం: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు చైనా ప్రభుత్వం కఠోర యుద్ధం చేస్తోంది. అందుకు ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని చైనా ప్రభుత్వం తేల్చి చెప్పింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వుహాన్లో రికార్డుస్థాయిలో కేవలం తొమ్మిది రోజుల్లోనే 1000 పడకల భారీ ఆస్పత్రిని నిర్మించింది. అత్యంత అధునాతన వైద్య సదుపాయాలతో వుహాన్లో నిర్మించిన ఈ హౌషెన్షాన్ ఆసుపత్రిలో ఏకకాలంలో వేలమందికి చికిత్స అందించే ఏర్పాట్లు ఉన్నాయి. గతంలో సార్స్ బారిన పడిన ప్రజలను కాపాడిన అనుభవం ఉన్న వైద్యులను ఇక్కడకు తీసుకొచ్చారు. చైనా సైన్యంలోని 1400 మంది అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందిని ఆసుపత్రిలో నియమించింది. సోమవారం ఈ ఆసుపత్రిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. భారత్, అమెరికాలతో కలిపి ఇప్పటికే 25 దేశాలకు పాకిన కరోనా వైరస్.. చైనాలో 17,205 మందికి సోకింది. ఆదివారం ఒక్కరోజే చైనాలో కరోనా మృతుల సంఖ్య 57గా నమోదైంది. ఇప్పటివరకు చైనాలో మొత్తం 361 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. అయితే 475 మంది వైరస్ నుంచి కోలుకున్నట్టు చైనా అధికారులు వెల్లడించారు. కేరళలో మూడో కరోనా వైరస్ కేసు ఇప్పటికే కేరళలో 2 కరోనా కేసులు గుర్తించగా తాజాగా మరో వ్యక్తికి వైరస్ ఉన్నట్లు తేలిందని కేరళ ఆరోగ్య మంత్రి శైలజ చెప్పారు. ఈ ముగ్గురూ ఇటీవలే చైనాలోని వుహాన్ నుంచి కేరళకు వచ్చారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్న వారే కావడం గమనార్హం. చైనాకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని భారతీయులకు కేంద్రం సూచించింది. చైనా నుంచే కాకుండా సింగపూర్, థాయ్లాండ్ల నుంచి ముం బైకి వచ్చిన ప్రయాణికులకు సైతం స్క్రీనింగ్ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వాధికారి వెల్లడించారు. అమెరికా అతిగా స్పందిస్తోంది: చైనా చైనాతో రాకపోకల నిషేధాలు, వ్యాపార సంబంధాలు, దౌత్యాధికారుల తరలింపులు లాంటి చర్యలతో అమెరికా అనవసర భయాందోళనలు రేకెత్తిస్తోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చన్నీంగ్ ఆరోపించారు. పైగా 361 మందిని బలిగొన్న ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు ఎటువంటి తోడ్పాటునీ అందించలేదని అమెరికాపై ఆరోపణలు గుప్పించారు. కరోనాపై జీవోఎం భేటీ.. సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర మంత్రులతో కూడిన బృందం (జీవోఎం) ఏర్పాటైంది. ఈ జీవోఎంకు సంబంధించి తొలి ఉన్నత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఇందులో జి.కిషన్రెడ్డి తదితరులు ఉన్నారు. చైనా వెళ్లేందుకు అవసరమైన ఈ–వీసా సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వుహాన్ నుంచి భారత్ చేరుకున్న 645 మంది గురించి అధికారులు మంత్రులకు తెలిపారు. బీజింగ్, షాంఘై, గువాంఝులలోని ఎంబసీలను సంప్రదించడం ద్వారా అక్కడున్నవారు భారత్కు చేరుకోవచ్చని భారత పౌరులకు జీవోఎం సూచించింది. కాగా, ఇప్పటి వరకూ 593 విమానాల్లో 72 వేల మంది పౌరులు భారత్కు తిరిగొచ్చినట్లు అధికారులు తెలిపారు. -
కరోనా డేంజర్ బెల్స్
బీజింగ్ /న్యూఢిల్లీ: చైనాలోని వుహాన్లో బట్టబయలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనాలో రోజురోజుకి వ్యాధిగ్రస్తులు పెరిగిపోతూ ఉంటే, చైనా వెలుపల ఫిలిప్పీన్స్లో తొలి మరణం సంభవించింది. ఇక భారత్లోని కేరళలో రెండో కరోనా కేసు నమోదు కావడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్తో 305 మంది మరణిస్తే, 15వేల మంది వరకు ఈ వైరస్ సోకింది. 25 దేశాలకు విస్తరించింది. వుహాన్ నుంచి∙ఫిలిప్పీన్స్కి వచ్చిన 44 ఏళ్ల చైనీయుడు ఈ వైరస్ కారణంగా మృతి చెందినట్టు ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చైనా పలు చర్యలు చేపట్టింది. కరోనా వ్యాధితో మృతి చెందిన వారికి అంతిమ యాత్రలపై నిషేధం విధించింది. శవాలను పూడ్చిపెట్టకుండా, వారు మృతి చెందిన ప్రాంతానికి సమీపంలో ఉన్న శ్మశాన వాటికల్లో దహనం చేయాలని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేరళలో రెండో కరోనా కేసు మన దేశంలోని కేరళలో మరో కరోనా కేసు నమోదైంది. ఇటీవల చైనా నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. అయితే పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. వుహాన్ యూనివర్సిటీ నుంచి కేరళకు వచ్చిన ఆ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు అనుమానం రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ వెల్లడించారు. మరోవైపు వుహాన్ నుంచి మరో 323 మంది భారతీయులు, ఏడుగురు మాల్దీవుల వాసుల్ని భారత్కు తీసుకువచ్చారు. వీరిని ఆర్మీ, ఐటీబీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రుల్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనాలో బర్డ్ ఫ్లూ భయం కరోనా వైరస్తోనే నానాయాతన పడుతున్న చైనాలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వ్యాధి బయల్పడింది. హుబాయ్ ప్రావిన్స్కు దక్షిణ సరిహద్దుల్లో హువాన్ ప్రావిన్స్లో ఈ వ్యాధి బయటకి వచ్చింది. షోయాంగ్ నగరంలోని పౌల్ట్రీలో ఈ వైరస్ బయటపడినట్టు చైనా వ్యవసాయం, గ్రామీణ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్కడ 7,850 కోళ్లు ఉంటే, 4,500 కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. మరో 17,828 కోళ్లను వ్యవసాయాధికారులే చంపేశారు. ఇప్పటికింకా మనుషులకు ఈ వ్యాధి సోకలేదు. చైనా ప్రయాణికులకు భారత్ ఇ–వీసా రద్దు చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ–వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్లో భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. -
విదేశీయుల తరలింపునకు రెడీ!
బీజింగ్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ దేశం నుంచి విదేశీయులను సురక్షితంగా పంపించేందుకు సిద్ధమని చైనా బుధవారం పేర్కొంది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న వుహాన్ నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. హ్యుబయి రాష్ట్రంలో దాదాపు 250 మంది భారతీయులున్నారు. వారిలో విద్యార్థులే అత్యధికం. అయితే, భారత్ వచ్చిన తరువాత వారంతా 14 రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. చైనాకు విమాన సర్వీసుల రద్దు చైనాకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రకటించాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఢిల్లీ – షాంఘై సర్వీస్ను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించగా, బెంగళూరు– హాంకాంగ్ రూట్లో ఫిబ్రవరి 1 నుంచి, ఢిల్లీ–చెంగ్డూ రూట్లో 14వరకు సర్వీస్లను రద్దు చేశామని ఇండిగో పేర్కొంది. ‘కరోనా’కు హోమియోపతి, యునానీ భేష్ శ్వాస సమస్యలు వస్తే ఫోన్ చేయాలని కోరుతూ ఆరోగ్య శాఖ బుధవారం హెల్ప్లైన్ నంబర్ 011–23978046ను ప్రకటించింది. కరోనా వైరస్ సోకినవారిని గుర్తించేందుకు విశాఖపట్టణం సహా దేశంలోని 21 విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తిని హోమియోపతి, యునానీ మందులు సమర్ధవంతంగా అడ్డుకోగలవని ఆయుష్ శాఖ ప్రకటించింది. ఈ దిశగా పనిచేసే కొన్ని ఔషధాలను పేర్కొంది. చైనాలోని హ్యుబయి రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి మరో 25 మంది మృతి చెందారు. మొత్తంగా చైనావ్యాప్తంగా మృతుల సంఖ్య 132కి చేరింది. అలాగే, దాదాపు 6 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. ‘కరోనా’ను తయారు చేసినశాస్త్రవేత్తలు నోవల్ కరోనా రకం వైరస్ను ప్రయోగశాలలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు విజయవంతంగా తయారు చేశారు. చైనా బయట వైరస్ను తయారు చేయడం ఇదే మొదటిసారని, దీని సాయంతో కరోనా వైరస్పై పరిశోధనలు చేయవచ్చని వారు భావిస్తున్నారు. భారత్కు కరోనా సోకే ప్రమాదం న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందే అత్యంత అధిక అవకాశాలు ఉన్న 30 దేశాల్లో భారత్ ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ బారిన పడ్డ నగరాల నుంచి ఎక్కువ సంఖ్యలో విమాన ప్రయాణికులు ఈ 30 దేశాలకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఈ 30 దేశాలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం అత్యంత అధికంగా ఉందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనాన్ని బ్రిటన్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో తొలి 3స్థానాల్లో థాయిలాండ్, జపాన్, హాంకాంగ్ ఉండగా.. అమెరికా(6), ఆస్ట్రేలియా(7), బ్రిటన్(17), భారత్(23) స్థానాల్లో ఉన్నాయి. -
బాబోయ్ కరోనా
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన పడి సోమవారం వరకు 81 మంది చనిపోయారు. 2,744 మందికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఈ వైరస్ మొదట వెలుగు చూసిన వుహాన్ నగరంలో సోమవారం చైనా ప్రధాని లీ కెక్వింగ్ పర్యటించారు. బాధితులకు అందుతున్న చికిత్స వివరాలను, వైరస్ వ్యాపిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. బాధితులు ఉన్న పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న 32,799 మందిని పరీక్షించామని, వారిలో 583 మందిని ఆదివారం మొత్తం అబ్జర్వేషన్లో ఉంచి, సోమవారం డిశ్చార్జ్ చేశామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్, మలేసియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో కూడా ఈ వైరస్ సోకిన కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా చైనా పలు చర్యలు తీసుకుంది. నగరంలోకి రాకపోకలు నిషేధించిన జనవరి 23 లోపే వుహాన్ నుంచి దాదాపు 50 లక్షల మంది వెళ్లిపోయారని ఆ నగర మేయర్ జో జియాన్వాంగ్ తెలిపారు. ఆ నగర జనాభా దాదాపు కోటి పదిలక్షలు. భారతీయుల కోసం మూడు హాట్లైన్స్ హ్యుబెయి రాష్ట్రంలో ఉన్న భారతీయుల కోసం చైనాలోని భారతీయ రాయబార కార్యాలయం 3 హాట్లైన్ నెంబర్లను ప్రారంభించింది. వుహాన్లో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది భారతీయులను తీసుకురావడానికి సంబంధించి చైనా విదేశాంగ శాఖతో భారతీయ అధికారులు సోమవారం సంప్రదింపులు జరిపారు. కాగా, ముంబైలోనూ పలు అనుమానిత కేసులు నమోదయ్యాయి. స్థానిక కస్తూర్బా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఒక అనుమానిత వ్యాధిగ్రస్తుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
కరోనా మృతులు 56
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. రోజు రోజుకి కరోనా వైరస్ కాటేసిన వారి సంఖ్య పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికి కరోనా వైరస్ సోకి 56 మంది ప్రాణాలు కోల్పోగా 2వేల కరోనా కేసులు నమోదైనట్టు చైనా సర్కార్ ప్రకటించింది. వివిధ దేశాలకు విస్తరణ చైనాలో వూహాన్ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ మెల్లమెల్లగా అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంగ్కాంగ్, మలేసియా, నేపాల్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్ల్యాండ్, వియత్నాం తదితర దేశాలకు వ్యాపించింది. పాకిస్తాన్కు కూడా ఈ వైరస్ విస్తరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి వచ్చిన నలుగురు పాకిస్తానీయులకి ముల్తానా, లాహోర్ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చైనాలో ఉన్న అమెరికా పౌరులు, సిబ్బందిని వెనక్కి తీసుకురావడానికి ఆ దేశం ప్రత్యేక విమానాన్ని పంపింది. ఫ్రాన్స్ ప్రత్యేకంగా బస్సుల్ని ఏర్పాటు చేసి తమ దేశ పౌరుల్ని వెనక్కి తీసుకువచ్చేస్తోంది. భారత్లోనూ భయాందోళనలు చైనా నుంచి భారత్కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో క్షుణ్నంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు ఉన్న వారిని ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఈ వైరస్ సోకినట్టు అధికారికంగా వెల్లడి కాలేదు. చైనాలో ఉన్న భారతీయుల క్షేమ సమాచారాలు బీజింగ్లో భారత్ రాయబార కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టుగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ వైరస్కి కేంద్రమైన వూహాన్ నగరంలో 250 మంది వరకు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. వారికి ఎలాంటి సాయమైనా అందించడానికి భారత రాయబార కార్యాలయం హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మాంసం విక్రయంపై నిషేధం చైనాలో విస్తృతంగా మాంసాహారాన్ని వినియోగిస్తారు. అడవి జంతువుల్ని ఎక్కువగా చంపి తింటారు. కరోనా వైరస్ మొదట్లో సీఫుడ్ నుంచి వచ్చిందని భావించారు. కానీ తాజా పరిశోధనల్లో పాముల నుంచి ఇతర అడవి జంతువులకి సోకి వారి నుంచి మనుషులకి సోకినట్టు వెల్లడైంది. దీంతో అడవి జంతువుల మాంసం వ్యాపారాలపై చైనా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. వాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో చైనా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ఉండడంతో దానికి వాక్సిన్ కనుగొనడానికి శాస్త్రవేత్తలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవల ఉన్నతాధికారుల సమావేశంలో కరోనా విస్తరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్కు చెందిన శాస్త్రవేత్తలు దీనికి వాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్ట శాస్త్రవేత్త జూ వెంబో వెల్లడించారు. -
ఉత్తరాదిన ఉప్పొంగుతున్న నదులు
సిమ్లా/డెహ్రాడూన్/చండీగఢ్:/న్యూఢిల్లీ: ఉత్తరాదిన వానలు దంచికొడుతున్నాయి. గంగా, యమున, సట్లెజ్ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 37 మంది చనిపోయారు. అత్యధికంగా హిమాచల్లో 25 మంది మృతి చెందారు. మరో 24 గంటలపాటు వానలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఎన్నడూలేని విధంగా భాక్రా జలాశయం ఈ ఏడాది ముందుగానే నిండింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా, కంగ్రా, కుల్లు జిల్లాల్లో సోమవారం మరో ముగ్గురు చనిపోవడంతో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరుకుంది. శనివారం నుంచి కురుస్తున్న వానలతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలడంతోపాటు, కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 500 మందిని ఎన్డీఆర్ఎఫ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.. పంజాబ్ ప్రభుత్వం హైఅలర్ట్ విడవని వానల కారణంగా యమునా నది ఉప్పొంగడంతో పంజాబ్, హరియాణాల్లోనూ వరద ప్రమాదం పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది. కర్నాల్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన స్త్రీలు, చిన్నారులు సహా 9 మందిని ఐఏఎఫ్ బృందాలు కాపాడాయి. రోపార్ ప్రాజెక్టు నుంచి వరదను విడుదల చేయడంతో దిగువన ఉన్న షాకోట్, నకోదర్, ఫిల్లౌర్ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. అలాగే, సట్లెజ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలంధర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 48 నుంచి 72 గంటల వరకు భారీ వర్ష సూచన ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్లో ఆగిన వాన హిమాచల్ప్రదేశ్– ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 9 మృతదేహాలు బయటపడటంతో రాష్ట్రంలో వానల కారణంగా జరిగిన సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 12కు చేరుకుంది. హరిద్వార్ వద్ద ప్రమాదస్థాయిని మించి, రిషికేశ్ వద్ద ప్రమాదస్థాయికి చేరువలో గంగ ప్రవహిస్తోంది. వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు చిక్కుకుపోగా వరి, చెరకు పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నదీ తీరం వెంట ఉన్న 30 గ్రామాల వారిని అప్రమత్తం చేశామని, వరద తీవ్రత పెరిగితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని యంత్రాంగం తెలిపింది. ఢిల్లీకి వరద ముప్పు యమునా నది హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమయింది. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు, ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం కేజ్రీవాల్ అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. సోమవారం యమునా నీటి మట్టం 204.7 మీటర్లకు చేరుకుంది. హరియాణాలోని హతినికుండ్ జలాశయం నుంచి 8.28 క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదల చేయనుండటంతో మంగళవారం ఉదయానికి నీటిమట్టం 207 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలను పోలీసులు, పౌర రక్షక దళాల సాయంతో ఖాళీ చేయించాలని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. యమున ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరింది. -
వరద విలయం
-
వరదలో చిక్కుకున్న సీఎం కుమార్తె అవంతిక
చెన్నై/తిరువనంతపురం/బెంగళూరు/సాక్షి ముంబై: ఏకధాటిగా కురుస్తున్న వానలతో దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర విలవిల్లాడుతున్నాయి. కేరళలో వరదలతో గత మూడు రోజుల్లో 35 మంది చనిపోగా మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడిన రెండు ఘటనల్లో సుమారు 40 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు 25 వరకు నమోదయ్యాయి. అధికార యంత్రాంగం సుమారు 64 వేల మందిని 738 సహాయక శిబిరాలకు తరలించింది. వయనాడ్ జిల్లా మెప్పడి, మలప్పురం జిల్లా నిలాంబర్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని కేరళ సీఎం విజయన్ తెలిపారు. వరద తీవ్రతకు మెప్పడిలోని పుత్తుమల టీ ప్లాంటేషన్ నామ రూపాల్లేకుండా పోయిందని, అందులో చిక్కుకున్న 40 మందిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్మీ తెలిపింది. ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటపడగా మరో 9 మందిని రక్షించామని పేర్కొంది. ఈ ప్రాంతంలో సుమారు 70 ఇళ్లు ధ్వంసమయ్యాయని అంచనా. మలప్పురం జిల్లాలోని కొండప్రాంత కవలపర గ్రామంలోని 40 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. అయితే, నష్టం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. పలక్కడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 30 సెం.మీ. నుంచి 39 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. పెరియార్ నది పొంగుతుండటంతో కొచ్చి విమానాశ్రయం రన్వేపైకి భారీగా వరద చేరింది. దీంతో కొచ్చి విమానాశ్రయాన్ని శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొచ్చికి వచ్చే విమానాలను తిరువనంతపురం విమానాశ్రయానికి మళ్లిస్తున్నారు. కొండప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. రైల్వే శాఖ పలు సర్వీసులను రద్దు చేసింది. రాష్ట్రంలోని 14 జిల్లాలకు గాను వయనాడ్, మలప్పురం, కన్నూర్, ఇడుక్కి తదితర 9 కొండ ప్రాంత జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. గత ఏడాది సంభవించిన వరదల్లో కేరళలో 400 మందికిపైగా మరణించడం తెలిసిందే. కనువిందు చేసే ప్లాంటేషన్ కనుమరుగైంది వయనాడ్ జిల్లాలో మెప్పడి సమీపంలోని పుత్తుమల టీ ప్లాంటేషన్లకు పెట్టింది పేరు. ప్రముఖ పర్యాటక ప్రాంతం కూడా. గురువారం సాయంత్రం వరకు ఈ ప్రాంతం.. లోయలు..ఎత్తైన కొండలు, చెట్లు.. కనువిందు చేసే పచ్చదనంతో కళకళలాడింది. అయితే, ఎడతెగని వర్షాలు, భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతమంతా పచ్చదనం బదులు ఇప్పుడు మట్టి, బురదతో నిండిపోయింది. కొండ శిఖరాలు సైతం చదునుగా మారాయి. చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి. ఇళ్లు, భవనాలు, గుడి, మసీదు తుడిచిపెట్టుకుపోయాయి. అక్కడ అసలు జనం ఉన్న ఆనవాళ్లే కనిపించకుండాపోయాయి. రెండు కొండల మధ్య నున్న సుమారు 100 ఎకరాల భూమి, ప్లాంటేషన్లు, భవనాలు, జనంతో కళకళలాడిన ఆ లోయ బురదతో నిండిపోయింది. 4 రాష్ట్రాల్లో 83 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మహారాష్ట, కర్ణాటక, కేరళ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో 83 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు హోం శాఖ తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, కోస్ట్గార్డ్కు చెందిన 173 బృందాలకు వీరు అదనమని తెలిపింది. వరదలో చిక్కుకున్న హిమాచల్ సీఎం కుమార్తె హిమాచల్ సీఎం ఠాకూర్ కుమార్తె అవంతిక వరదల్లో చిక్కుకున్నారు. ఉడిపి జిల్లా మణిపాల్ వర్సిటీలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చదువుతున్న అవంతిక స్నేహితులతో కలిసి బాదామికి బయలుదేరారు. వీరి బస్సు మలప్రభ నది వరదలో చిక్కుకుంది. దీంతో అవంతిక, ఆమె స్నేహితులు బస్సు దిగి వరద నీటిలోనే ముందుకు వెళ్లారు. హొసూరులో గ్రామస్తులు వారికి ఆశ్రయం కల్పించారు. కేరళను ఆదుకోండి: రాహుల్ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధానిని కోరారు. వర్షాలకు కేరళలో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్న విషయాన్ని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కావలసిన సహాయాన్ని అందిస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు వయనాడ్ ఎంపీ ఆఫీస్ ట్విటర్ ఖాతాలో రాహుల్ పోస్ట్ చేశారు. కర్ణాటకలో 12 మంది మృతి కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 12 మంది మృతి చెందారని సీఎం యడియూరప్ప తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని 1.24 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. శుక్రవారం కొడగు జిల్లా కొరంగాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తమిళనాడులో ఐదుగురు మృతి తమిళనాడులో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో వానల ఉధృతి కొనసాగుతోంది. నీలగిరి జిల్లాలో ధారాపాతంగా కురిసిన వర్షాలకు ఐదుగురు చనిపోయారు. లోతట్టు ప్రాంతాల్లోని 1,704 మందిని 28 సహాయక శిబిరాలకు తరలించామని అధికారులు తెలిపారు. దక్షిణ భారతంలోనే మునుపెన్నడూ లేనంతగా వర్షపాతం ఇక్కడ నమోదయింది. పర్యాటక ప్రాంతం అవలాంచిలో గత 72 గంటల్లో 2,136 మి.మీ. వర్షం కురిసింది. వయనాడ్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు మహారాష్ట్రలో మొత్తం 30 మంది మృతి మహారాష్ట్రలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 30 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. సాంగ్లి జిల్లాలో పడవ బోల్తా ప్రమాదంలో గల్లంతైన ఐదుగురి జాడ తెలియలేదని పేర్కొన్నారు. కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాల్లో ముంపుప్రాంతాల నుంచి 2.52 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కొల్హాపూర్లో వరద పరిస్థితి మెరుగయింది. -
వరద విషాదం..43 మంది మృతి
న్యూఢిల్లీ/బెంగళూరు/తిరువనంతపురం/సాక్షి, ముంబై/ పింప్రి: కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్నాయి. మహారాష్ట్రలో వరదల కారణంగా 27 మంది మరణించారు. ముఖ్యంగా సాంగ్లీ జిల్లాలోని పలుస్ తాలూకాలో వరద బాధితులతో వెళ్తున్న బోటు బోల్తా పడటంతో 9 మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో 9 మంది, కేరళలో నలుగురు, తమిళనాడులోని కోయంబత్తూరులో ఇద్దరు, ఒడిశాలో ఒకరు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు చరిత్రలోనే అత్యధికంగా నీలగిరి జిల్లా అవలాంచి అడవుల్లో 82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వివిధ రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకున్న లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లు నేలమట్టం కావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వానలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్డు, రైల్వే రవాణా స్తంభించింది. వరద బాధిత రాష్ట్రాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ నేత రాహుల్ పిలుపునిచ్చారు. ఐదు జిల్లాల్లో అత్యధిక ప్రభావం మహారాష్ట్రలోని పుణే, సతారా సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్ జిల్లాల్లో వరదల కారణంగా ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు పుణే డివిజన్ కమిషనర్ దీపక్ మైసేకర్ తెలిపారు. ముఖ్యంగా సాంగ్లీ పలుస్ తాలుకాలో కృష్ణా, యేర్లా నదీ సంగమంలో వరద తీవ్రతకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ఉదయం పలుస్ గ్రామస్తులను తరలిస్తున్న బోటు బోల్తా పడింది. దీంతో 14 మంది గల్లంతు కాగా 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. సహాయక సిబ్బంది 9 మృతదేహాలను వెలికితీశారు. సాంగ్లీ జిల్లా జైలు వరద నీటిలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆ ప్రాంతానికి విమానంలో వెళ్లి రక్షణ, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో ఫోన్లో మాట్లాడారు. సాంగ్లీలో పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ఆల్మట్టి డ్యాం నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరారు. వరదల కారణంగా కొల్హాపూర్–మిరజ్ మార్గంలో రైళ్లను రద్దు చేశారు. పుణే–బెంగళూర్ జాతీయ రహదారి దెబ్బతినడంతో పుణే–షోలాపూర్ రహదారి మీదుగా వాహనాలను మళ్లించారు. సాయం అందించండి: యడియూరప్ప కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు 9 మంది చనిపోగా 43 వేల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి యడియూరప్ప బెళగావిలో మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.5వేల కోట్లు అవసరమవుతాయని, దాతలు ముందుకు రావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలు, కొండచెరియాలు విరిగిపడటంతో ఏడాది చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. -
మళ్లీ నెత్తురోడింది
కొలంబో/వాషింగ్టన్: ద్వీప దేశమైన శ్రీలంక మరోసారి నెత్తురోడింది. నిఘావర్గాల సమాచారంతో సోదాలు జరుపుతున్న భద్రతాబలగాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు, అనంతరం తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన తన అత్యవసర అధికారాలతో ఉగ్రసంస్థలు నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే), జమాతే మిల్లతూ ఇబ్రహీం(జేఎంఐ)లపై నిషేధం విధించారు. ఏప్రిల్ 21న ఈస్టర్ రోజు చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 253 మంది చనిపోవడం తెల్సిందే. ఎన్టీజే స్థావరంలో తనిఖీలు.. ఉగ్రవాదుల విషయమై నిఘావర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్ఫోర్స్, ఆర్మీ సంయుక్త బలగాలు శుక్రవారం రాత్రి కల్మునయ్ పట్టణంలోని సైంతమురుతు ప్రాంతంలో ఎన్టీజే స్థావరంగా భావిస్తున్న ఓ ఇంటిని చుట్టుముట్టాయి. సైన్యం కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారు. సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఇరువర్గాల కాల్పుల్లో ఓ పౌరుడు చనిపోయాడు. ఓవైపు ఇరువర్గాల మధ్య కాల్పులు భీకరంగా కొనసాగుతుండగానే, ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాబలగాలకు ప్రాణాలతో చిక్కకూడదన్న ఉద్దేశంతో తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)కు స్థావరంగా ఉన్న ఈ ఇంటిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, ఆత్మాహుతి కిట్లు, ఐసిస్ జెండాలు, ఆర్మీ దుస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు భావిస్తున్నామని పోలీస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. గాయపడిన ముగ్గురు ఉగ్రవాదులకు ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఉగ్రదాడులపై విచారణలో శ్రీలంక అధికారులకు సహకరించేందుకు అమెరికా ముందుకొచ్చింది. తమ అధికారులతో ఓ బృందాన్ని కొలంబో పంపినట్లు ఎఫ్బీఐ చీఫ్ క్రిస్టోఫర్ రే తెలిపారు. తమ పౌరులకు భారత్, అమెరికా సూచన అత్యవసరమైతే తప్ప భారత పౌరులెవరూ శ్రీలంకకు ప్రయాణాలు పెట్టుకోవద్దని భారత విదేశాంగ శాఖ సూచించింది. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సివస్తే కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం, జాఫ్నా, హంబన్తోటలోని కాన్సులేట్లు, కండిలోని అసిస్టెంట్ హైకమిషన్ను సంప్రదించాలని చెప్పింది. మరోవైపు శ్రీలంక పర్యటనకు వెళ్లాలనుకునే అమెరికా పౌరులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని అగ్రరాజ్యం కోరింది. శ్రీలంకలో ఉగ్రదాడుల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ శనివారం లెవల్–3 ప్రయాణ సూచికను జారీచేసింది. వారందరినీ చంపాలి శ్రీలంకలో వరుసబాంబు పేలుళ్లు జరిగిన కొన్ని గంటలకే ఈ దాడులకు సూత్రధారిగా భావిస్తున్న జహ్రన్ హషీమ్ వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ఇందులో శ్రీలంక యాసతో తమిళంలో హషీమ్ మాట్లాడుతూ.. ‘మతవిశ్వాసాలు, నమ్మకం ఆధారంగా మనుషులను మూడు రకాలుగా విభజించవచ్చు. వీరిలో ఒకరు ముస్లింలు. మరొకరు ముస్లింల అభిప్రాయాలను అంగీకరించేవారు. ఇక మూడోవర్గం ఉంది చూశారా.. వీళ్లందరిని చంపేయాలి. ఈ మాట చెప్పేందుకు చాలామంది భయపడతారు. ఈ వ్యాఖ్యలను ఉగ్రవాదంగా ముద్రవేస్తారు. ఇస్లాం సిద్ధాంతాలతో అంగీకరించని వాళ్లందరినీ చంపేయాలి’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు శ్రీలంక ఉగ్రదాడిని ఐసిస్ తమ పత్రికలో ‘ప్రత్యేక కథనం’గా ప్రచురించింది. కాగా, హషీమ్ విద్వేష ప్రసంగాలపై తాము ప్రభుత్వానికి 2015, 2018లో ఫిర్యాదు చేశామనీ, అయినా అధికారులు దీన్ని సీరియస్గా తీసుకోలేదని శ్రీలంక ముస్లిం మండలి ఉపాధ్యక్షుడు హిల్మే అహ్మద్ తెలిపారు. ఖురాన్ తరగతుల పేరుతో యువతకు విద్వేషం నూరిపోసిన హషీమ్, గౌతమబుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసేలా యువతను ప్రేరేపించాడని విమర్శించారు. తమిళనాడులోనే ఉగ్ర శిక్షణ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులంతా తమిళనాడులో శిక్షణ పొందినట్లు ఆ దేశానికి చెందిన పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్టీజేకు అధ్యక్షుడిగా ఉన్న జహ్రన్ హషీమ్ వీరందరికీ శిక్షణ ఇచ్చాడన్నారు. ఈస్టర్ రోజున జరిగిన ఆత్మాహుతి దాడిలో హషీమ్సహా 9 మంది బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారని వెల్లడించారు. హషీమ్ రూపొందించిన ఆత్మాహుతి దళంలో మహిళా బాంబర్ కూడా ఉందని పేర్కొన్నారు. హషీమ్ తొలుత శ్రీలంకలోని మట్టకళప్పు ప్రాంతం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నడిపేవాడనీ, కానీ ఇతని వ్యవహారశైలిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండేళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని చెప్పారు. ఘటనాస్థలిలో లభ్యమైన బాంబులు, బ్యానర్లు