Department of Irrigation
-
‘మేడిగడ్డ’ ఖర్చు ప్రభుత్వమే భరించాలి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్ డ్యాం నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్మాణసంస్థ ఎల్అండ్టీ మళ్లీ తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్తోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈనెల 17న రామగుండం సీఈకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీళ్లన్నీ మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ను చుట్టుముట్టాయని, దీంతో తాము చేసిన పనులు దెబ్బతిన్నాయని ఆ లేఖలో పేర్కొంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంతో తాము చేసిన పనులు వృథా అయ్యాయని చెప్పింది. ఇందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్లో దెబ్బతిన్న పియర్లు (పిల్లర్లు), రాఫ్ట్ ఫౌండేషన్, కటాఫ్ వాల్స్, ససికెంట్ పైల్స్ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉందని, పునరుద్ధరణ పనులు చేసే ఏడో బ్లాక్తోపాటు దానికి ఇరువైపులా ఉన్న బ్లాకులకు అప్స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్లో కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉందని ఈ లేఖలో స్పష్టం చేసింది. ఈ పనులు వ్యయ ప్రయాసలతో కూడుకున్నవని, అందుకే ప్రభుత్వం వాటికి మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తేనే పునరుద్ధరణ పనులు చేస్తామని పేర్కొంది. గోదావరినదిలో కాపర్డ్యాం నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని, వర్క్అగ్రిమెంట్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. మళ్లీ మొదటికొచ్చిన మేడిగడ్డ పనులు అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి ముందు మేడిగడ్డ ఏడో బ్లాక్లో ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, దీంతో ఆ పనులన్నీ మళ్లీ మొదటికొచ్చాయని ఎల్అండ్టీ ఆందోళన వ్యక్తం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్21న సాయంత్రం కుంగిపోయింది. బ్యారేజీ ఏడో బ్లాక్లోని 20వ నంబర్ పిల్లర్భూమిలోకి ఐదు అడుగులకుపైగా కుంగింది. దీంతో ఏడో బ్లాక్లోని నాలుగు పిల్లర్లు భారీగా, ఇంకో ఆరు పిల్లర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్టులోనే స్పష్టం చేసింది. బ్యారేజీలోని మిగతా బ్లాకులు దెబ్బతినకుండా ఉండేందుకు పగుళ్లు తేలిన పిల్లర్లు, వాటి రాఫ్ట్ ఫౌండేషన్తో సహా తొలగించేందుకు డైమండ్ కట్టింగ్ విధానం అనుసరించాలని నిర్ణయించారు. బ్యారేజీ కుంగిపోయినప్పుడు దానిని పరిశీలించిన ఎల్అండ్టీ అధికారులు తామే పునరుద్ధరిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు (డిసెంబర్ 2న) బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్అండ్టీ బాంబు పేల్చింది. ఈమేరకు రామగుండం ఈఎన్సీకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. కాఫర్ డ్యాం నిర్మాణానికికే రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. బ్యారేజీని పునరుద్ధరించకుంటే ఎల్అండ్టీని బ్లాక్లిస్టులో పెట్టడంతో పాటు ఆ సంస్థ పొందిన బిల్లులను రెవెన్యూ రికవరీ యాక్ట్ప్రయోగించి వసూలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. సీఎం ఘాటుగా హెచ్చరించిన తర్వాత కూడా ఎల్అండ్టీ అధికారులు అన్నారం బ్యారేజీ నుంచి నీటి విడుదలను సాకుగా చూపుతూ మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని మరో లేఖ రాశారు. మళ్లీ ఒప్పందం చేసుకోండి మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాంతోపాటు బ్యారేజీలో దెబ్బతిన్న పోర్షన్ పునరుద్ధరణకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని ఆ లేఖలో స్పష్టం చేసింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్29నపూర్తయ్యిందని, దీంతో దెబ్బతిన్న బ్యారేజీని పునరుద్ధరించడం తమ బాధ్యత కానేకాదని అందులో పేర్కొన్నారు. 2020లో బ్యారేజీ వద్ద కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు సహా ఇతర పనులు చేయాలని కోరారని, ఆ సమయంలో వర్క్అగ్రిమెంట్లో లేని పనులను తాము చేపట్టలేమని స్పష్టత ఇచ్చామని గుర్తు చేశారు. పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లు ఇవ్వాలని అప్పుడే కోరినా బ్యారేజీ దెబ్బతినేంత వరకు ఇరిగేషన్డిపార్ట్మెంట్నుంచి తమకు ఎలాంటి డిజైన్లు కూడా అందలేదని లేఖలో ప్రస్తావించారు. బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయిన తర్వాత జరిగిన లోపాలను తాము సరి చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కాఫర్డ్యాంతో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు కొత్తగా అగ్రిమెంట్చేసుకుంటే తప్ప తాము అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేమని స్పష్టం చేశారు. -
పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): టీడీపీ మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పంట కాలువను అడ్డగోలుగా కబ్జాచేశారు. అంతటితో ఆగకుండా ఆ స్థలంలో ఆయన ఇల్లు నిర్మించుకుని తన ఆగడాలకు అంతేలేదని చాటిచెప్పారు. జిల్లాలోని రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ అయిన నీలంపేట చానల్కు నర్సీపట్నం పరిధిలోని శివపురం వద్ద నీటిపారుదల శాఖ గోడ నిర్మించింది. దానిపైనే అయ్యన్నపాత్రుడు యథేచ్ఛగా ఇంటికి బేస్మెంట్ నిర్మించారు. ఈ చానల్ ఒడ్డున నదిలో 10 అడుగుల వరకు (సర్వే నెంబరు 276లో 2 సెంట్ల మేర) ఆయన ఆక్రమించారని ఇరిగేషన్ శాఖతోపాటు రెవెన్యూ శాఖ తేల్చింది. కాలువ కుచించుకుపోయి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు సమీపంలోని పొలాలు ముంపునకు గురవుతాయి. ఈనెల 2న నోటీసులు జారీ అక్రమ నిర్మాణం తొలగించాలని ఈనెల 2న అధికారులు అయ్యన్నకు నోటీసులు జారీచేశారు. అయినా.. ఆయన స్పందించకపోవడంతో ఆర్డీఓ గోవిందరావు, ఏఎస్పీ విజయ మణికంఠ చందోలు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, తహసీల్దార్ కె. జయ రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో ఆదివారం వేకువజామున జేసీబీలతో అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. గోడను పాక్షికంగా కూల్చివేశారు. ఇది జరుగుతుండగా అయ్యన్న సతీమణి పద్మావతి, తనయుడు రాజేష్ వారిపై దౌర్జన్యంచేస్తూ అడ్డుకున్నారు. రాజేష్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అయ్యన్న నివాసానికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకుంటూ తిరగబడ్డారు. టీడీపీ కార్యకర్తల రాకతో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులను బెదిరిస్తున్న అయ్యన్న కుమారుడు రాజేష్ అయ్యన్న తనయుడి అభ్యర్థన మన్నించినా.. ప్రభుత్వ సర్వేయర్తో సర్వే చేయించాలని, ఆక్రమణ జరిగినట్లు అందులో రుజువైతే తామే తొలగిస్తామని అయ్యన్న తనయుడు రాజేష్ ఆర్డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన అభ్యర్థన మేరకు ఆర్డీఓ అప్పటికప్పుడు సర్వేకు ఏర్పాట్లు చేశారు. కానీ, సర్వే చేయమని కోరిన టీడీపీ నేతలే మళ్లీ సర్వేను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా సిబ్బంది నుంచి బలవంతంగా చెయిన్లు లాక్కుని, రెవెన్యూ రికార్డులు ఎత్తుకుపోయారు. ఈ తతంగాన్ని సెల్ఫోన్లో రికార్డు చేస్తున్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేయిచేసుకుని సెల్ఫోన్ లాక్కున్నారు. ఈ దశలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయ్యన్న నివాసంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, వంగలపూడి అనిత, కేఎస్ఎన్ఎస్ రాజు, అయ్యన్న మరో కుమారుడు చింతకాయల విజయ్ బరితెగించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వ్యాన్ తీసుకొచ్చి అయ్యన్న ఇంటి ముందుపెట్టారు. కానీ.. సర్వేను అడ్డుకుని కానిస్టేబుల్పై చేయి చేసుకున్న టీడీపీ కార్యకర్తలను తరలిస్తారని భావించిన ఆ పార్టీ నేతలు రోడ్డుపై ఉన్న కార్యకర్తలను లోపలకు తీసుకుపోయి గేట్లు మూసేశారు. అయితే, టౌన్ సీఐ మోహన్రావు టీడీపీ నేతల వద్దకు వెళ్లి రెవెన్యూ రికార్డులు తిరిగి ఇవ్వాలని కోరడంతో రికార్డులు ఇచ్చేశారు. అనంతరం మళ్లీ సర్వే ప్రారంభించగా టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తూ అడ్డుకున్నారు. రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అయ్యన్న ఇంటి వద్దే మోహరించి ఉండడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ నిర్మాణాలు తొలగించకుండా ఉత్తర్వులివ్వాలని అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ వేసినట్లు సమాచారం. కాలువను కబ్జాచేసి కట్టేశారు ఇక మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ నీలంపేట చానల్ను ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టంచేశారు. కాలువను 10 అడుగుల మేర ఆక్రమించారని.. ఇంటి ప్రహరీ గోడతోపాటు వంట షెడ్డు నిర్మించారని వారు తెలిపారు. -
త్వరలో 704 ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెకానికల్ (84), సివిల్ (320), అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (100), ఎలక్ట్రికల్ (200) విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆయా విభా గాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హుల వుతారు. ఇందులో 259 పోస్టులు మల్టీ జోన్–1కు, 445 పోస్టులు మల్టీ జోన్–2 కు కేటాయించారు. వీటితో పాటు మరో 227 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఉద్యోగాల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో సివిల్ (182), మెకానికల్ (45) పోస్టులు ఉన్నాయి. 112 పోస్టులు మల్టీ జోన్–1కు, 115 పోస్టులు మల్టీజోన్–2 కు కేటాయించారు. బీటెక్ పట్టభద్రుల తో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. -
‘కృష్ణా’లో మా వాటా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను ఖరారు చేసే అంశాన్ని తక్షణమే కృష్ణా ట్రిబ్యునల్–2కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84 (3) (4) కింద జల వివాదాలను నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్కు అప్పగించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకు న్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. ఈ విషయంలో విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి కేంద్రంతో సహా ఏ అథారిటీకి అధికారం లేదంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ) 1956లోని సెక్షన్–3 కింద 2014 జూలై 14న ఏపీపై చేసిన ఫిర్యాదును దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంచడం.. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా హక్కులను తెలంగాణకు నిరాకరించడమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ గురువారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. 574.6 టీఎంసీలు కేటాయించాలి కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తూ 2015లో తీసుకున్న తాత్కాలిక నిర్ణయం ఆధారంగానే ఇప్పటికీ కృష్ణా బోర్డు రెండు రాష్ట్రా లకు కేటాయింపులు చేయడంపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్లో సాగు విస్తీర్ణం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి 574.6 టీఎంసీలను కేటాయించాలని కోరినా బోర్డు పట్టించుకోవడం లేదంది. ఈ అంశం తమ పరిధిలో లేదని, ట్రిబ్యునల్ మాత్రమే సమీక్షించగలదని బోర్డు పేర్కొందని వెల్లడించింది. ట్రిబ్యునల్కు అప్పగించండి: సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ఫిర్యాదును ట్రిబ్యునల్కు అప్పగించాలని 2020 అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేసును ఉపసం హరించుకున్నామని తెలంగాణ తెలిపింది. న్యాయ సల హా మేరకు కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలా లేదా కృష్ణా ట్రిబ్యునల్–2కు బాధ్యత అప్పగించాలా అనే అం శంపై నిర్ణయిస్తామని అప్పట్లో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిందని గుర్తు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–2 రద్దు కానందున తెలంగాణ ఫిర్యాదును దీనికే అప్పగించడం సముచితమని అభిప్రాయపడింది. కృష్ణా జలాల్లో తమ చట్ట బద్ధ హక్కులనే కోరామని.. ఇతర రాష్ట్రాల హక్కులు, ప్ర యోజనాలకు భంగం కలుగుతుందని భావించొద్దని స్ప ష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి పరిమితులుండటంతోనే ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టం కింద ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాలు జరుపుతూ కృష్ణా ట్రిబ్యునల్–2 జారీ చేసిన మధ్యంతర నివేదికలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, కర్ణాటక, మహారాష్ట్రల ప్రయోజనాలకు ఈ కేసుతో నష్టం ఉండదని అభిప్రాయపడింది. -
డీపీఆర్లపై కాలయాపన వద్దు
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్లోని అయిదు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కాలయాపన లేకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి పంపాలని తెలంగాణ మరోమారు గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల, మోదికుంటవాగు ప్రాజెక్టులు కొత్తవి కావని.. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించి, ప్రారంభించిన ప్రాజెక్టులని లేఖలో తెలిపారు. ఈ దృష్ట్యా అయిదు ప్రాజెక్టులు విభజన చట్టం క్లాజు 85 (8) పరిధిలోకి రావని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు కేటాయించిన నీరు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టీఎంసీలో భాగంగా ఉన్నాయన్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు ఏవిధమైన ప్రభావాన్ని కలిగించవని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్లో ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా విలువలు, డిజైన్, నీటి లభ్యత తదితర సాంకేతిక అంశాలను పరిశీలించే పరిధి చట్టం ప్రకారం బోర్డులకు లేదని స్పష్టం చేశారు. ఈ అంశాలను పరిశీలించేందుకు కేంద్ర జల సంఘంలో ప్రత్యేకమైన డైరెక్టరేట్లు ఉన్నాయని వివరించారు. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జల శక్తి మంత్రి సైతం డీపీఆర్లను త్వరితగతిన పరిశీలించి ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ దృష్ట్యా గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్లను కాలయాపన చేయకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరారు. -
కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను అక్రమంగా తరలించడాన్ని తక్షణమే ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు గురువారం మరో లేఖ రాసింది. నీటి తరలింపు కేడబ్లు్యడీటీ–1 (కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్) తీర్పునకు వ్యతిరేకమని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్చీఫ్ మురళీధర్, కేఆర్ఎంబీ చైర్మన్కు రాసిన లేఖలో వివరించారు. 1976–77 అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే జూలై నుంచి అక్టోబర్ వరకు మద్రాసు (చెన్నై)కు తాగునీటి కోసం మళ్లించాలని పేర్కొన్నారు. 15 వేల క్యూసెక్కుల సామర్థ్యం మించకుండా చెన్నైకి నీటిని తరలించాలని ఒప్పందంలో పేర్కొన్న విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు. ఈఎన్సీ రాసిన లేఖలోని ముఖ్యాంశాలు.. ►సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్కు మాత్రమే అనుమతించింది. ►ఎస్కేప్ రెగ్యులేటర్ను తరువాతి కాలంలో అనుమతి లేకుండా నిర్మించారు. ►అనుమతి లేకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. ►పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని విడుదల చేయడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేదు. ఈ నేపథ్యంలో నీటి తరలింపు ఆపేయాలి. ►గెజిట్ నోటిఫికేషన్లోని షెడ్యూల్ 2లో అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ కాలువ, ఎస్కేప్ రెగ్యులేటర్, తెలుగు గంగా ప్రాజెక్టు రెగ్యులేటర్లను అనుమతిలేని ప్రాజెక్టులుగా పేర్కొనాలి. ►శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్ ప్రాజెక్టుగానే కృష్ణా ట్రిబ్యునల్ పరిగణించింది. ►19 టీఎంసీలను శ్రీశైలం కుడి కాలువకు, 15 టీఎంసీలు చెన్నై తాగునీటికి మొత్తం 34 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుం చి మళ్లించడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతించింది. అంతకు మించి నీటి తరలింపును అనుమతించరాదని ఆ లేఖలో పేర్కొన్నారు. -
విద్యుదుత్పత్తిలో బోర్డుల జోక్యం తగదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేస్తున్న విద్యుదుత్పత్తిపై కృష్ణా బోర్డు జోక్యం ఏమాత్రం సరికాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు తేల్చిచెప్పారు. బచావత్ ట్రిబ్యునల్లో పేర్కొన్న మేరకే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నామని, ఈ విషయంలో తమను నిలువరించాలని చూడటం చట్టవిరుద్ధమే అవుతుందని వెల్లడించారు. ఏ ప్రాతిపదికన విద్యుదుత్పత్తి ఆపమంటున్నారో తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. సోమవారం షెకావత్తో కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలు, గెజిట్ నోటిఫికేషన్ అమలు, ప్రాజెక్టుల అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.. గంటపాటు కృష్ణా జలాల అంశాలనే చర్చించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టేనని, విద్యు దుత్పత్తి ద్వారా నీటిని దిగువ సాగర్ అవసరాలకు విడుదల చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీశైలం నుంచి కేవలం 38 టీఎంసీల నీటిని మాత్రమే ఏపీ మళ్లించుకునే అవకాశం ఉందని, కానీ అందుకు భిన్నంగా ఏటా వందల టీఎంసీల నీటిని బేసిన్ అవతలికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అదీగాక రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు నడిచేందుకు విద్యుత్ అవసరాలు గణనీయంగా ఉన్నాయని, అందువల్ల శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయడం మినహా తమకు మరో దారిలేదని తెలిపారు. ఈ విషయంలో బోర్డుల జోక్యం తగదని, బచావత్ అవార్డు తీర్పు అమలయ్యేలా మాత్రమే బోర్డు చూడాలని కోరినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని తాము మరోమారు పరిశీలిస్తామని షెకావత్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం. డీపీఆర్లపై సీడబ్ల్యూసీ వద్దకు ఇంజనీర్లు ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రాష్ట్ర ఇంజనీర్లు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులకు సమర్పించారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాల డీపీఆర్లను సమర్పించడంతోపాటు అందులోని కొన్ని అంశాలపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు. కాళేశ్వరం అదనపు టీఎంసీలో అదనంగా నీటిని వినియోగించడం లేదని, తమకిచ్చిన 240 టీఎంసీల కేటాయింపుల్లోంచే వాడుకుంటామని స్పష్టం చేశారు. -
‘ర్యాలంపాడు’కి బీటలు
గద్వాల రూరల్: ‘ర్యాలంపాడు జలాశయం ప్రమాదపుటంచుల్లోకి వెళ్లింది. కట్ట తెగితే ఏకంగా 20గ్రామాలు పూర్తిగా ఊడ్చుపెట్టుకుని పోవడం ఖాయం.’ ఇదేదో స్థానికులు చెబుతున్న మాట కాదు.. సాగు నీటిపారుదల శాఖ అధికారులే ప్రభుత్వానికి పంపిన హెచ్చరికలు. ఈ క్రమంలో ఇద్దరు సీఈలతో కూడిన ఇంజనీర్ల బృందం శనివారం ర్యాలంపాడు జలాశయాన్ని సందర్శించింది. ఎక్కడ్కెడ లీకేజీలున్నాయో తెలుసుకునేందుకు డ్యాం చుట్టూ ఇంజనీర్లు కలియదిరిగారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ►జోగుళాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ధరూరు మండలం ర్యాలంపాడు వద్ద రూ.192 కోట్ల వ్యయంతో జలాశయాన్ని నిర్మించారు. 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం నుంచి 1.36లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. 2014లో అందుబాటులోకి వచ్చిన ఈ జలాశయంలో మొదటి నాలుగేళ్లు రెండు టీఎంసీల కంటే తక్కువగానే నీటిని నిల్వ చేశారు. 2018, 2019, 2020లో వరుసగా జలాశయంలో పూర్తిస్థాయి 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. అయితే ఈ ఏడాది కూడా భారీగా వరద నీరు జూరాలకు వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలోనే నీటిని ర్యాలంపాడు జలాయంలోకి ఎత్తిపోశారు. ఈ క్రమంలోనే జలాశయం ఆనకట్ట నుంచి పెద్ద ఎత్తున నీరు లీకేజీ కావడం మొదలైంది. ఈ విషయాన్ని 25 రోజుల కిందట అధికారులు గురించి.. పొంచి ఉన్న ముప్పును రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేశారు. 3 కిలోమీటర్ల మేర నీరు లీకేజీ.. జలాశయం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర రాళ్లకట్ట నిర్మించారు. సహజంగా జలాశయాల్లో లీకేజీలు ఎర్త్స్లోపుల నుంచి విడుదలవుతాయి. కానీ ర్యాలంపాడులో మాత్రం 3 కిలోమీటర్ల మేర ఉన్న రాక్టోల్ నుంచి భారీగా నీరు లీకేజీ అవుతుంది. జలాశయంలో పూర్తిస్థాయిలో అంటే 4 టీఎంసీల మేర నీటిని నిల్వ చేస్తే కట్టకు గండి పడి దాని కింద ఉన్న 20 గ్రామాలు పూర్తిగా నీటిలో కొట్టుకుపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో గద్వాల పట్టణం, అయిజ, మల్దకల్తో పాటు ధరూరు, గద్వాల, మల్దకల్, అయిజ మండలాల్లోని 17 గ్రామాల వరకు పూర్తిగా నీటమునుగుతాయి. ప్రమాదకరమే.. ర్యాలంపాడు కట్ట చుట్టూ రాక్పోల్ ద్వారా నీరు లీకేజీ అవుతున్న విషయాన్ని 25 రోజుల క్రితం గుర్తించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. శనివారం ప్రత్యేక బృందం జలాశయాన్ని పరిశీలించింది. ర్యాలంపాడు నుంచి వెలువడు తున్న లీకేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని, 2 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయవద్దంటూ సూచించింది. కట్ట తెగితే దాని కింద ఉన్న గ్రామాలు ముంపునకు గురవుతాయని పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం లేదు. వానాకాలం పంటకు ఇబ్బంది లేకుండా ఆయకట్టుకు నీటిని అందిస్తాం. యాసంగికి మాత్రం కష్టం. – శ్రీనివాస్రావు, ఎస్ఈ, జిల్లా సాగునీటిపారుదల శాఖ -
‘మల్లన్న’ చెంతకు గోదారి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతలు పథకంలో భాగంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి భారీ సామర్థ్యంతో చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 18 లేదా 20న వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య తుక్కాపూర్ పంప్హౌస్లోని మోటార్లను ఆన్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎత్తిపోతలు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ప్రాథమిక సమాచారం అందించింది. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. రంగనాయక్సాగర్ టు మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ఈ ఏడాది జూన్ నాటికే సిద్ధంచేయాలని భావించినా కరోనా లాక్డౌన్, తొలకరి వర్షాల కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ చేసేలా పనులు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది మొదట 10 టీఎంసీలు నిల్వ చేయనున్నారు. ఆ తర్వాత ఐదేసి టీఎంసీల చొప్పున నిల్వ పెంచనున్నారు. రంగనాయక్సాగర్లోని నీటిని తుక్కాపూర్ వద్ద నిర్మించిన పంప్హౌస్లోని 8 మోటార్ల ద్వారా మల్లన్నసాగర్కు తరలించేలా ఇప్పటికే పనులన్నీ మొదలయ్యాయి. ప్రస్తుతం రంగనాయక్సాగర్లో 3.5 టీఎంసీలకు గానూ 3 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక్కడి నిల్వలు ఖాళీ అయితే మిడ్మానేరు నుంచి నీటిని తరలిస్తూ మల్లన్నసాగర్ నింపనున్నారు. మిడ్మానేరులో ప్రస్తుతం 27.50 టీఎంసీలకు గానూ 25 టీఎంసీల మేర నిల్వలున్నాయి. అత్యంత ఎత్తున.. భారీ సామర్థ్యంతో.. ►కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఒడిసి పట్టుకొని రెండు సీజన్లలోనూ ఆయకట్టుకు నీటి లభ్యత పెంచే లక్ష్యంతో మొత్తం 141 టీఎంసీల సామర్థ్యంతో 18 రిజర్వాయర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో అత్యంత భారీగా ఏకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో, సముద్ర మట్టానికి 555 మీటర్ల ఎత్తున.. మల్లన్నసాగర్ రిజర్వాయర్ను రూ.6,805 కోట్లతో చేపట్టారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఏకంగా 22.60 కిలోమీటర్ల పొడవైన కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, కట్ట గరిష్ట ఎత్తు 58.5 మీటర్లుగా ఉంది. ►కట్ట నిర్మాణానికి 13.58 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 2.77 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే 96 శాతం పనులు పూర్తి చేశారు. ►ఈ రిజర్వాయర్ నుంచే కొండపోచమ్మ సాగర్, గంధమల, బస్వాపూర్లతో పా టు, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ స్టేజ్–1 ఆయకట్టుకు నీళ్లు చేరనున్నాయి. ►మొత్తంగా ఈ రిజర్వాయర్పై ఆధారపడిన కొత్త ఆయకట్టు 8.33 లక్షల ఎకరాలు ఉండగా, స్థిరీకరణ ఆయకట్టు మరో 7.37 లక్షల ఎకరాలు ఉంది. ►ఈ ప్రాజెక్టుకు అవసరమైన 17,871 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణంతో రాంపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, లక్ష్యాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవెల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా, 4,298 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. ►మట్టి పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు తలెత్తకుండా ప్రతి రీచ్కు ఐదుగురు ఇంజనీర్లతో పర్యవేక్షణ ఉండేలా గజ్వేల్ కేంద్రంగా ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ డివిజన్ ఏర్పాటు చేశారు. -
గోదావరిలో జల సవ్వడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు.. మొన్నటి వరకు కొనసాగిన కాళేశ్వరం ఎత్తిపోతల నేపథ్యంలో గోదావరిలో జల సవ్వడి నెలకొంది. మేడిగడ్డ మొదలు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎల్లంపల్లి, కడెం, మిడ్మానేరు, లోయర్ మానేరులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి సైతం ప్రవాహాలు పెరిగాయి. ప్రస్తుత సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని లోయర్ మానేరు నుంచి ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ శాఖ సిద్ధమవుతోంది. అవసరాలకు తగ్గట్లు ఆయకట్టుకు.. జూన్ తొలి వారంలో వర్షాలు కురిసినా ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. జూన్ మూడో వారం నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టింది. ప్రాణహితలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా 12 టీఎంసీల మేర నీటిని మేడిగడ్డ నుంచి దిగువ కొండపోచమ్మ వరకు తరలించింది. ప్రస్తుతం పంపులను పూర్తిగా నిలిపివేయగా మేడిగడ్డ వద్ద 55 వేల క్యూసెక్కులకుపైగా నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 25 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారంలో 10.87 టీఎంసీలకుగాను ప్రస్తుతం 8.50 టీఎంసీల మేర నిల్వ ఉండగా సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 6 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను సోమవారం 17.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండగా 15 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతోపాటు కాళేశ్వరం ద్వారా ఇప్పటికే లోయర్ మానేరు, మిడ్ మానేరును నింపారు. లోయర్ మానేరులో 24 టీఎంసీలకుగాను 21.10 టీఎంసీలు నిల్వ ఉండగా 4 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. ఇక్క డి నుంచి సూర్యాపేట వరకు ఎస్సారెస్పీ కాల్వల కింద నీటిని అందించేందుకు గేట్లు ఎత్తాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. మిడ్మానేరులో సైతం 25.87 టీఎంసీలకుగాను 23.34 టీఎంసీల నిల్వ ఉంది. ఇక మిడ్మానేరు నుంచి నీటిని ఎత్తిపోయ డంతో మలక్పేట, రంగనాయక్సాగర్లలో మూడే సీ టీఎంసీల నిల్వలు ఉండగా 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్లో సైతం 6.80 టీఎంసీల నిల్వ ఉం ది. బ్యారేజీలు, రిజర్వాయర్లలో ఉన్న నీటితో అవసరాలకు తగ్గట్లుగా ఆయకట్టు కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. ఇక గోదావరి బేసిన్లోని ఎస్సారెస్పీకి వరద ప్రవాహం పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి ఇన్ఫ్లో సోమవారం రాత్రి 9 గంటలకు 90 వేల క్యూసెక్కులకు చేరింది. నీటి మట్టం 1075.20 (40.203 టీఎంసీలు) అడుగులకు చేరింది. సమ్మక్క బ్యారేజీ నుంచి 1.35 లక్షల క్యూసెక్కులు విడుదల ఏటూరునాగారం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ గేట్లను ఇరిగేషన్ అధికారులు సోమవారం తెరిచారు. 59 గేట్లలో 36 గేట్లను తెరిచి లక్షా 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 6.9 టీఎంసీలుకాగా ప్రస్తుతం 1.3 టీఎంసీలను నిల్వ చేశారు. -
ఏపీ: సాగుపై సాధికారత దిశగా ముందడుగు
సాక్షి ప్రతినిధి కడప: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి అన్నదాతను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పంటల సాగు మొదలుకుని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ తదితర అన్ని విషయాల్లోనూ రైతుకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. దిగుబడులు పెంచడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలనూ మరింత మెరుగుపరిచి అన్నదాతకు అండగా నిలిచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందుకోసం రైతులతో పాటు సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లకూ రాష్ట్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించతలపెట్టింది. దీనిలో భాగంగా కడప కేంద్రంగా నీరు, భూమి నిర్వహణ శిక్షణ, పరిశోధన కేంద్రం (వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.150 కోట్లతో 37 ఎకరాల్లో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ శిక్షణ కేంద్రాన్ని ఇప్పుడు కడపలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరో మూడు చోట్ల.. డీపీఆర్ సిద్ధం చేసే పనులను త్వరలోనే ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించనున్నారు. ఇప్పటికే తొలి దశలో అద్దె భవనాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. డీపీఆర్ సిద్ధమైన మరుక్షణమే మొదట మామిళ్లపల్లె ప్రాంతంలోని కొన్ని ప్రభుత్వ భవనాలతో పాటు మరికొన్ని అద్దె భవనాల్లో శిక్షణ కార్యాలయాలను ప్రారంభిస్తామని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(కడ) కమిషనర్, ఈ శిక్షణ, పరిశోధన కేంద్రం ఇన్చార్జి రాఘవయ్య ‘సాక్షి’తో చెప్పారు. ఈ ఆరి్థక సంవత్సరంలోనే వీటిని ప్రారంభిస్తామన్నారు. కడపలో ప్రధాన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా నెల్లూరు, అమరావతి, విశాఖపట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తారు. అన్నిచోట్లా సొంత భవనాలు నిర్మిస్తారు. అన్నదాతలకు ఫీల్డ్ విజిట్ ► శిక్షణ, పరిశోధన కేంద్రం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యం. ► పంటల సాగు మొదలుకుని ఉత్పత్తి, మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పిస్తారు. ► ఆధునిక పంటల సాగుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ► అధిక దిగుబడులిచ్చే పంటలు సాగవుతున్న ప్రాంతాలకు రైతులను ఫీల్డ్ విజిట్కు తీసుకెళ్లి వారికి మరింత అవగాహన కల్పిస్తారు. ► ఈ కేంద్రాల్లో రైతులకు భోజనం, వసతి సమకూరుస్తారు. సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లకూ ఇక్కడే శిక్షణ రైతులతో పాటు సాగునీటి పారుదల శాఖ పరిధిలోని ఇంజినీర్లకు సైతం ఇక్కడే శిక్షణ ఇస్తారు. ఎం.బుక్ల నిర్వహణ, చెక్ మెజర్మెంట్తో పాటు అన్ని అంశాలపై ఇంజినీర్లతో పాటు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లకూ శిక్షణ కార్యక్రమాలుంటాయి. ప్రధానంగా సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా శిక్షణ కార్యక్రమాలుంటాయి. ఇందుకోసం నిపుణులైన టీచింగ్ స్టాఫ్ను ఏర్పాటు చేస్తారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు ప్రిన్సిపాల్ను కూడా ఈ శిక్షణ కేంద్రంలో నియమిస్తారు. టీచింగ్ స్టాఫ్కు వసతి గృహాలు, రైతులకు హాస్టల్ వసతి సైతం ఇక్కడే ఏర్పాటు చేస్తారు. రైతులను ఫీల్డ్ విజిట్కు తీసుకెళ్లేందుకు వాహనాలను సైతం సిద్ధం చేయనున్నారు. -
రూ.150 కోట్లతో కృష్ణా కరకట్ట అభివృద్ధి
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): కృష్ణా నది ఎగువ ప్రాంతంలోని ఉండవల్లి జీరో పాయింట్ నుంచి వైకుంఠపురం వరకు ఉన్న కరకట్టను మరింత పటిష్టం చేసి రహదారి నిర్మించేందుకు నీటిపారుదల శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఈ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి జీరో పాయింట్ వద్ద ఏర్పాటు చేస్తున్న పైలాన్ పనులను ఇరిగేషన్ ఈఈ రాజ్ సంపత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉండవల్లి – అమరావతి కరకట్ట వైకుంఠపురం వరకు 23 కిలోమీటర్ల పొడవు ఉందని, ఇందులో 15.25 కిలోమీటర్ల వరకు 10 మీటర్ల మేర వెడల్పు చేస్తున్నామని చెప్పారు. కాగా, ఈ రహదారి ప్రకాశం బ్యారేజీని కలపడంతోపాటు రాజధాని పరిధిలోని ఎన్ఎ–1 (ఉండవల్లి) నుంచి ఎన్ఎ–13 (ఉద్దండరాయుడిపాలెం) వరకు రోడ్డును కలుపుకుంటూ సచివాలయం వరకు వెళుతుంది. అంతేకాకుండా కృష్ణానది మీద ఇబ్రహీంపట్నం –వెంకటపాలెం మధ్య నిర్మించనున్న ఐకాన్ బ్రిడ్జి, కాజ టోల్ గేట్ నుంచి వెంకటపాలెం వరకు నిర్మించనున్న రహదారికి కూడా ఇది అనుసంధానమయ్యేలా అధికారులు డిజైన్ చేశారు. -
ప్రమాద హెచ్చరికలు మూడే మూడు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గోదావరి వరదల సీజన్ ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. వరద ఉధృతిని అంచనా వేసి, అప్రమత్తం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు 3 ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తుంటారు. మొదటి ప్రమాద హెచ్చరిక : 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తూ నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. నీటిపారుదల, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను అప్రమత్తం చేస్తారు. ఏటిగట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. రెండో హెచ్చరిక : 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తూ 13.75 అడుగులకు నీటిమట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వెంటనే వరదకు సంబంధించిన అధికారులు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులకు హాజరవుతారు. బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలు చేపడతారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో కలిసి ఇరిగేషన్ అధికారులు పనిచేస్తుంటారు. మూడో హెచ్చరిక : 18 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలు విడుదల చేస్తూ నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. వెంటనే జిల్లా యంత్రాంగం ముఖ్యంగా లంక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన పటిష్ట చర్యలను చేపడతారు. గోదావరిలో అన్ని రకాల పడవలు, పంట్ల రాకపోకలపై పూర్తి నిషేధం ఉంటుంది. -
‘సాగునీటి’ ప్రక్షాళన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ శరవేగంగా పూర్తి కావస్తుండటం.. అదే సమయంలో కాల్వలు, పంపులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో సాగునీటి శాఖ సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా శాఖను పునర్విభజన చేయనుంది. భారీ, మధ్య, చిన్నతరహా, ఐడీసీ ఎత్తిపోతల పథకాల విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు తేనుంది. ప్రతి చీఫ్ ఇంజనీర్ (సీఈ) పరిధిలో సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయిస్తూ పని విభజన చేయనుంది. సీఎం ఆదేశాలతో చకచకా కసరత్తు సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణకు నీటిపారుదల శాఖను పునర్విభజించాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న మాదిరి భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ విభాగాలు వేర్వేరుగా కాక ఒకే గొడుగు కిందకు తేవాలని సూచిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ జోన్లు ఏర్పాటుచేసి, ప్రతి జోన్కు ఒక సీఈని నియమించి, అతని పరిధిలోనే భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు, ఐడీసీ ఎత్తిపోతల పథకాలు ఉంచాలని చెబుతూ వస్తున్నారు. ఆ దిశగా శాఖ ప్రక్షాళన ఉండాలని ఇటీవల సమీక్ష సందర్భంగానూ సూచించారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ ఈఎన్సీ, సీఈలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీలు, సీఈల పరిధిలో ఏయే ప్రాజెక్టులుంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉండాలన్న దానిపై కసరత్తు పూర్తి చేశారు. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో, మెకానికల్, ప్రెషర్ మెయిన్స్, పంప్హౌస్ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్ల వారీగా ఇద్దరు సీఈలను నియమించాలని నిర్ణయించారు. చెక్డ్యామ్లు, చెరువుల పనులు చూసేందుకు ప్రస్తుతం బేసిన్కు ఒకరు చొప్పున ఇద్దరు సీఈలు ఉండగా వారిని తొలగించనున్నారు. ప్రాజెక్టులు – పని విభజన ఇలా.. ప్రతి పూర్వ జిల్లాకు ఒక సీఈని నియమించి, వారికే భారీ, మధ్యతరహా, చెరువులు, ఐడీసీ పథకాలను కట్టబెట్టనున్నారు. ► ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఇద్దరు ఈఎన్సీలు ఉండగా, కరీంనగర్ డివిజన్లోని ఈఎన్సీ కింద మూడు బ్యారేజీలు, ఎల్లంపల్లితో పాటు దానికింద మిడ్మానేరు వరకు ఉన్న పనులన్నీ ఉండనున్నాయి. మరో ఈఎన్సీ పరిధిలో మిడ్మానేరు దిగువన ఉన్న ప్యాకేజీ పనులతో పాటు మెదక్ జిల్లాలోని సింగూరు, ఘణపూర్ ప్రాజెక్టులను తేనున్నారు. ► ఎస్సారెస్పీ పరిధిలో లోయర్ మానేరు వరకు ఒక సీఈని, ఆ తర్వాత ఉన్న ఆ యకట్టుతోపాటు, ఎస్సారెస్పీ–2 ఆయకట్టుకు మరో సీఈని నియమిస్తారు. ► ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం సీఈ లేనందున కొత్త సీఈని నియమిస్తారు. ఆయన పరిధిలో సీతారామ, సీతారామసాగర్, పాలేరు దిగువనున్న నాగార్జునసాగర్ ఆయకట్టు, భక్తరామదాసతో పాటు మధ్యతరహా ఎత్తిపోతల పథకాలు ఉంటాయి. ► పాలమూరు–రంగారెడ్డికి ఉన్న సీఈని యథావిధిగా కొనసాగిస్తారు. ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ ఒక సీఈ, మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు మరో సీఈ పరిధిలో ఉండనున్నాయి. ► నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు, డిండి, ఎస్ఎల్బీసీ, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి. ► దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులకు వేర్వేరు సీఈలు ఉండగా, రెండింటికీ కలిపి ఒక సీఈని నియమిస్తారు. ► నిజామాబాద్ ప్రాజెక్టుల కింద కొత్తగా సీఈని నియమించనున్నారు. ► పరిపాలన ఈఎన్సీ పోస్టును రద్దుచేసే అవకాశాలున్నాయి. పరిపాలనతో పాటు ఈ ఈఎన్సీ చూసే కమిషనర్ ఆఫ్ టెండర్ (సీఓటీ) బాధ్యతలను ఇకపై ఇరిగేషన్ ఈఎన్సీ ఒక్కరే చూడనున్నారు. -
‘జూరాల’ పునరుజ్జీవానికి అడుగులు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో ఎగువ నుంచి వరద కొనసాగే రోజులు తగ్గుతుండటంతో వరదున్నప్పుడే ఆ నీటిని ఒడిసిపట్టేలా ప్రభుత్వం బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బేసిన్లో ఎగువన ఉన్న జూరాల నుంచే కృష్ణా వరద జలాలను మళ్లించి నిల్వ చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్ల బృందం జూరాల ఫోర్షోర్లో 20.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ను ప్రతిపాదించగా దీన్ని నీటిపారుదల శాఖ పరిశీలించి ఆమోదం తెలిపింది. భరోసా ఇచ్చేలా... జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా లైవ్ స్టోరేజీ మాత్రం కేవలం 6.50 టీఎంసీలే. అయితే జూరాలపై దాని సొంత ఆయకట్టుకు అవసరమయ్యే 19.74 టీఎంసీల నీటితోపాటు నెట్టెంపాడుకు 21.42 టీఎంసీలు, భీమా 20 టీఎంసీలు, కోయిల్సాగర్ 5.50 టీఎంసీలు, గట్టు 4 టీఎంసీలు, మిషన్ భగీరథ కోసం 4.14 టీఎంసీలు కలిపి మొత్తంగా 73.20 టీఎంసీల అవసరాలున్నాయి. వాటి కింద 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. అయితే నెట్టెంపాడు పరిధిలో 11 టీఎంసీలు, భీమా పరిధిలో 8.57, కోయిల్సాగర్ కింద 2.27, జూరాల కింది రిజర్వాయర్లలోని నీటి నిల్వలతో కలిపి మొత్తం 28 టీఎంసీల మేర మాత్రమే నిల్వ చేయగలిగే రిజర్వాయర్లున్నాయి. ప్రస్తుతం ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ల నుంచి వరద కొనసాగుతున్న రోజులు తగ్గుతూ వస్తుండటంతో ప్రాజెక్టులకు నీటి లభ్యత ఉండట్లేదు. కొన్ని సంవత్సరాల్లో ప్రవాహాలు పూర్తిగా రానప్పుడు తాగునీటికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ దృష్ట్యా జూరాలకు నీటి లభ్యత పెంచడం, దానిపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి వీలుగా జూరాల పునరుజ్జీవ పథకాన్ని ప్రభుత్తం తెరపైకి తెచ్చింది. రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్రెడ్డి, అనంతరాములు, ఖగేందర్, మహేందర్ నేతృత్వంలోని బృందం గతేడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యటించి జూరాల ఫోర్షోర్లోని నాగర్దొడ్డి వద్ద 20.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదించింది. వరదతో నింపి... ఆగగానే వదిలి జూరాలకు కుడిపక్క ఫోర్షోర్లో కేవలం కిలోమీటర్ దూరంలో ఈ రిజర్వాయర్ను ప్రతిపాదించారు. వరద ఉండే 20 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని తరలించేలా ఒక పంపుహౌస్ నిర్మించి దాని ద్వారా రిజర్వాయర్ను నింపేలా ప్రణాళిక వేశారు. దీనికి రూ. 5,200 కోట్లు అంచనా కట్టారు. ఈ రిజర్వాయర్ను నిర్మిస్తే గతం లో రూ. 554 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన గట్టు ఎత్తిపోతల పథకం అవసరం ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. వరద ఉండే రోజుల్లో నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్ నింపుకొని, జూరాలలో నీటి నిల్వలు తగ్గితే మళ్లీ రిజర్వాయర్ నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ జూరాలకు నీటిని విడుదల చేసి నింపేలా ఈ ప్రతిపాదన సిద్ధమైంది. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఈ ప్రతిపాదనపై ఎలా ముందుకెళ్లాలో తెలపాలని కోరుతూ ఈఎన్సీకి లేఖ రాశారు. ప్రభుత్వం అనుమతిస్తే ఈ ప్రతిపాదనపై సమగ్ర సర్వే చేస్తామని ప్రతిపాదించారు. -
‘పాలమూరు’ గడువు.. మరో రెండేళ్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు మరో రెండేళ్లు అయితే కానీ పూర్తయ్యేలా లేవు. ఈ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టిన 18 ప్యాకేజీల పనుల గడువు మరో రెండేళ్లు పెంచక తప్పేలా లేదు. పూర్తికాని భూసేకరణ, సహాయ, పునరావాసంలో ఇబ్బందులు, ఎన్జీటీ, కోర్టు కేసులు ప్రాజెక్టుల ముందరి కాళ్లకు బంధమేయడంతో 2022 జూన్ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామంటూ ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ త్వరలో సమీక్షించనున్నారు. భూసేకరణే అసలు సవాల్.. శ్రీశైలం నుంచి రోజుకి 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని తరలించి సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. 2015లో ఈ ప్రాజెక్టుకు 35,200 కోట్లతో పరిపాలనా అనుమతులు చేపట్టగా, 2016 జూన్లో ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులను రూ.29,312 కోట్లతో చేపట్టారు. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఒప్పంద సమయంలో నిర్ణయించారు. అయితే భూసేకరణ సమస్యతో తొలి రెండేళ్లలో పనులు ముందుకు కదల్లేదు. దీనికితోడు ఎన్జీటీ కేసులు సైతం అవాంతరం సృష్టించాయి. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 27 వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇంతవరకు 23,500 ఎకరాలు సేకరించారు. మరో 3,500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2018 నుంచి మరో రెండేళ్లు అంటే 2020 జూన్ వరకు ప్యాకేజీల గడువు పొడిగించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అన్ని ప్యాకేజీల్లో 28 శాతం పనులు, అంటే రూ.8వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా ప్రాజెక్టులోని తొలి ప్యాకేజీ అయిన నార్లాపూర్ పంపింగ్ స్టేషన్ పనులు చాలాకాలంగా పెండింగ్లో పడ్డాయి. దీన్ని భూగర్భంలో నిర్మించాలా లేక భూఉపరితలం మీదా అన్న అంశం తేలకపోవడంతో ఇక్కడ కేవలం 4 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో పాటే భూసేకరణ సమస్యలతో ప్యాకేజీ–5, 7, 8, 16, 17, 18 పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ ప్యాకేజీల్లో కేవలం 15–30 శాతం పనులే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కొన్ని ప్యాకేజీలకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు, మరికొన్ని ప్యాకేజీల గడువును 2022 మే చివరి వరకు పొడిగించాల్సి వస్తోంది. అప్పటికి ప్రాజెక్టు పనులు నూటికి నూరుశాతం పూర్తి చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్కు ప్రాజెక్టు ఇంజనీర్లు విన్నవించారు. ఈ నేపథ్యంలో ప్యాకేజీల గడువు పొడిగింపులపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం చేశాక తుది ఆమోదం తీసుకోనున్నారు. ఇక ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు గతంలోనే రూ.4,268 కోట్లతో అంచనాలు సిద్ధం చేసినా పనులు మాత్రం మొదలు పెట్టలేదు. ఈ పనులకు కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల ప్రకారం కొత్త అంచనాలు సిద్ధంచేసి ఇవ్వాలని ప్రభు త్వం సూచించింది. ఈ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త రేట్ల ప్రకారం ఈ అంచనా రూ.7వేల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటికి ఆమోదం రాగానే ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు. -
సాగునీటి శాఖకు కొత్త రూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి శాఖ పూర్తిగా కొత్త రూపును సంతరించుకోనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ మార్పుచేర్పులతో కూడిన ప్రక్రియ ముగింపు దశకు రాగా దీనికి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం దక్కనుంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి కావస్తుండటం.. కాల్వలు, పంపులు, పంప్హౌస్లు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో విప్లవాత్మక చర్యలు అత్యంత కీలకం కానున్నాయి. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేనున్నారు. ఈఎన్సీలు, సీఈల వారీగా ఏయే ప్రాజెక్టులు ఉంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉంటుందన్న దానిపై కసరత్తు పూర్తయింది. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో మెకానికల్, ప్రెషర్ మెయిన్స్, పంప్హౌస్ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్ల వారీగా ఇద్దరు సీఈలను నియమించనున్నారు. చెరువులు, చెక్డ్యామ్ల పనులు చూసేందుకు బేసిన్ల వారీ ఇద్దరు సీఈలు ఉండే అవకాశం ఉంది. ప్రక్షాళన ఇలా... - కరీంగనర్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో 3 బ్యారేజీలు, పంప్హౌస్లతో పాటు ఎల్లంపల్లి బ్యారేజీతో పాటు దానికింద మిడ్మానేరు వరకు నీటిని ఎత్తిపోసే ప్యాకేజీలన్నీ రానున్నాయి. ఈ బ్యారేజీల పరిధిలో కొత్తగా చేపట్టే ఎత్తిపోతలు దీని పరిధిలోనే ఉండనున్నాయి. ఈఎన్సీ కింద మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టు ఉండనుంది. - శ్రీరాంసాగర్ సీఈ పరిధిలో లోయర్మానేరు వరకు మాత్రమే ఆయకట్టును పరిమితం చేయనున్నారు. దీంతోపాటుగా కడెం, సదర్మఠ్, ఆదిలాబాద్లోని కాళేశ్వరం ఆయకట్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ఉండనున్నాయి. మొత్తంగా 7.42లక్షల ఆయకట్టు ఉంటుంది. - కరీంనగర్లోని మరో ఈఎన్సీ పరిధిలో లోయర్మానేరు నుంచి దిగువన సూర్యాపేట వరకు ఉన్న ఆయకట్టును కొత్తగా చేర్చారు. దీంతో పాటే ఎల్లంపల్లి దిగువ ఆయకట్టు, మిడ్మానేరు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్, దానికింద ఆయకట్టును తెచ్చారు. మధ్యతరహా ప్రాజెక్టులు ఈఎన్సీ కిందే ఉండనున్నాయి. మొత్తంగా 13లక్షల ఎకరాల ఆయకట్టు ఈఎన్సీ పరిధిలో ఉండనుంది. - నిజామాబాద్ సీఈ పరిధిలోకి కాళేశ్వరంపై ఆధారపడ్డ నిజాంసాగర్ ఆయకట్టు, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి. సీఈ కింద 6.82 లక్షల ఆయకట్టు ఉంటుంది. - వరంగల్ సీఈ పరిధిలో దేవాదుల, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండగా కొత్తగా సమ్మక్క బ్యారేజీని చేర్చారు. ఆయకట్టు 6.07 లక్షల ఎకరాలు. - ఆదిలాబాద్ సీఈ పరిధిలో ప్రాణహిత, చనాకా–కోరటా, పెనుగంగ, కుప్టి, కొమరంభీంతో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు. మహబూబ్నగర్ సీఈ పరిధిలో జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు, గట్టు, భీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి ఉండ నుండగా, ఆయకట్టు 11.95 లక్షల ఎకరాలు. - పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ఒక్క సీఈ పరిధిలో ఉండనుంది. ఆయకట్టు 12.30 లక్షల ఎకరాలు. - నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు పాలేరు వరకు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు, డిండి, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఆయకట్టు 10.97 లక్షల ఎకరాలు. - ఖమ్మం సీఈ పరిధిలో సీతారామ, సీతమ్మసాగర్, పాలేరు దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు, భక్తరామదాస, మధ్యతరహా పథకాలు ఉంటాయి. ఆయకట్టు 7.16 లక్షల ఎకరాలు. - హైదరాబాద్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో మిడ్మానేరు నుంచి గంధమల వరకు ఉన్న ప్యాకేజీలతో పాటు, కొత్తగా సింగూరు, ఘణపూర్, మధ్యతరహా ప్రాజెక్టులను చేర్చారు. ఆయకట్టు 11.54 లక్షలు. -
నేడు ‘పోలవరం’పై సమీక్ష
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం విజయవాడలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టు పనుల తీరును రెండ్రోజులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిటీ ఈ సీజన్లో పూర్తి చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేయనుంది. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాక, 3 నెలలకు ఒకసారి పనులను పరిశీలించి, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని ఇటీవల కేంద్రం పునర్ వ్యవస్థీకరించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్కే హల్దార్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ పీపీవో సీఈ ఆర్కే పచౌరీ కనీ్వనర్గా ఉన్న ఈ కమిటీలో సీఎస్ఆర్ఎంఎస్ డైరెక్టర్ ఎస్ఎల్ గుప్తా, కృష్ణా గోదావరి బేసిన్ విభాగం సీఈ డి.రంగారెడ్డి, పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి బీపీ పాండే, ఎన్హెచ్పీసీ మాజీ డైరెక్టర్ డీపీ భార్గవ, జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టర్ భూపేందర్సింగ్, డిప్యూటీ డైరెక్టర్ నాగేంద్రకుమార్, సీడబ్ల్యూసీ(హైదరాబాద్) డైరెక్టర్ దేవేంద్రకుమార్ను సభ్యులుగా నియమించింది. శనివారం విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడమ కాలువ పనులను పరిశీలించింది. ఆదివారం పోలవరం హెడ్ వర్క్స్లో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఎడమ గట్టు, కుడి గట్టు, అనుసంధానాలు (కనెక్టివిటీస్), ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)లను తనిఖీ చేశారు. పనులపై పోలవరం సీఈ సుధాకర్బాబును ఆరా తీశారు. ఈ సీజన్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను కొలిక్కి తెస్తామని పోలవరం అధికారులు తెలిపారు. తద్వారా వచ్చే సీజన్లో వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి ప్రధాన ఆనకట్ట ఈసీఆర్ఎఫ్ పనులను నిర్విఘ్నంగా చేయడం ద్వారా 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని వారు వివరించారు. పునరావాస పనులు వేగవంతం 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల్లోని 18,620 కుటుంబాలకుగానూ ఇప్పటిదాకా 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించామని పోలవరం అధికారులు కమిటీకి తెలిపారు. మిగతా 14,698 కుటుంబాలకు మేలోగా పునరావాసం కలి్పంచే పనులను వేగవంతం చేశామని వివరించారు. కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులు పూర్తి చేయాలంటే నిధులు అవసరమని, సవరించిన అంచన వ్యయ ప్రతిపాదనల (రూ.55,548.87 కోట్లు)కు ఆమోదముద్ర వేసి నిధులు విడదలయ్యేలా చూడాలని కేంద్ర కమిటీని కోరారు. ఇప్పటివరకూ చేసిన పనులకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.5,103 కోట్లను విడుదల చేసేలా చూడాలని కోరారు. అనంతరం కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ హెచ్కే హల్దార్ విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులతో పోల్చితే నిర్వాసితుల సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయమే అధికమని, నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే ప్రధానమని చెప్పారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు ఫలాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు. -
ప్రగతికి శ్రీకారం
-
మీ రుణం తీర్చుకుంటున్నా..
సాక్షి ప్రతినిధి కడప: ‘నాన్నను మీరు అమితంగా ప్రేమించారు.. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరన్న సందర్భంలో మీ వెనుక మేమంతా ఉన్నామని కుటుంబంలా నాకు తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డగా నన్ను దీవించారు.. ఆశీర్వదించారు. ఇవాళ మీ బిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున మీ రుణం తీర్చుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు బుధవారం ఉదయం ఆయన పులివెందుల ధ్యాన్చంద్ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున హాజరైన స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పలు గ్రామాల్లో కొత్త చెరువుల తవ్వకం.. ‘‘గండికోట ప్రాజెక్టు దిగువన ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె, దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు సర్వే చేశారు. రాబోయే రోజుల్లో ఈ డ్యామ్కు శంకుస్థాపన చేస్తాం. దీంతో జిల్లాలో కరువు పరిస్థితిని అధిగమిస్తాం. ముద్దనూరు – కొడికొండ చెక్పోస్టు (పులివెందుల–బెంగుళూరు) రోడ్డును విస్తరిస్తాం. పెండింగ్లో ఉన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), లింగాల బ్రాంచ్ కెనాల్, గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో చెరువులు లేని గ్రామాల్లో కొత్త చెరువులు తవ్వుతాం. సర్వే చేయించి.. ఆ చెరువులకు దగ్గరలో ఉన్న కాలువలతో అనుసంధానం చేసి పూర్తిగా నింపే కార్యక్రమం చేస్తాం. ఆ చెరువులకు మైక్రో ఇరిగేషన్తో లింక్ చేసి ఆయకట్టుకు నీరందిస్తాం. మొత్తం పీబీసీ ఆయకట్టును మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి డీపీఆర్లు సిద్ధమవుతున్నాయి. రాబోయే పర్యటనల్లో వాటికి శంకుస్థాపనలు చేస్తాను. ఇవాళ 24 పనులకు (జాబితా చదివారు) శంకుస్థాపన చేస్తున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎంలు ఎస్బీ అంజద్బాష, ఆళ్ల నాని, మంత్రులు శంకర నారాయణ, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ మేయర్, కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. సీఎం శంకుస్థాపన చేసిన పనుల వివరాలు.. ►పులివెందులలో రూ.347 కోట్లతో వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు. ►గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా వేముల, వేంపల్లె మండలాల్లోని 15 వేల ఎకరాల స్థిరీకరణ. రూ.58 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కొత్తగా అలవలపాడు, పెండ్లూరు, నాగూరు గ్రామాలకు జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి) నుంచి నీళ్లందించడమే కాకుండా పీబీసీ ఆయకట్టు చివర ఉన్న వి.కొత్తపల్లె, గిడ్డంగివారిపల్లె, టి.వెలమవారిపల్లె, ముచ్చుకోన చెరువులకు నీరందుతుంది. (తర్వాత ఈ నీళ్లు పాపాగ్నిలో కలుస్తాయి) తద్వారా నందిపల్లి, ఉప్పాలపల్లె, ముసల్రెడ్డిపల్లె గ్రామాలకు సైతం ప్రయోజనం చేకూరుతుంది. ►చిత్రావతి నుండి ఎర్రబల్లి చెరువుకు నీటిని నింపి, వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వల్ల ప్రభావితమయ్యే ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం. రూ.350 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కోమన్నూతల, ఎగువపల్లి, మురారిచింతల, అంబకపల్లె, ఎర్రబల్లి చెరువు, మోటూన్నూతలపల్లె వంక, తదితర గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. గిడ్డంగివారిపల్లెలో 1.1 టీఎంసీ రిజర్వాయర్ నిర్మించి యూసీఐఎల్ పల్లెలకు నీటి సరఫరా చేయొచ్చు. ►పులివెందులలో రూ.100 కోట్లతో 55.36 కిలోమీటర్లు భూగర్బ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు. ►పులివెందులలో రూ. 65 కోట్లతో 142.56 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం పైపులైన్ నిర్మాణం. ►వేంపల్లె గ్రామ పంచాయతీలో రూ.63 కోట్లతో 85.50 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.114 కోట్ల పాడా నిధులతో సీసీ రోడ్లు, పులివెందుల పట్టణ సుందరీకరణ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, పీబీసీ, సీబీఆర్ పరిధిలో వివిధ చెరువులకు సాగునీటి సరఫరా, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. దీంతోపాటు పీబీసీ నుంచి దొండ్లవాగు చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల చెరువు నుంచి వనం బావి చెరువుకు ఎత్తిపోతల పథకం, నాయనిచెరువు నుంచి బత్తెనగారి చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల బ్రాంచ్ కెనాల్ కింద రామట్లపల్లె చెరువు, గుణకనపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల కెనాల్ కింద సోత్రియం ఎత్తిపోతల పథకం నుంచి నల్లపురెడ్డిపల్లె, కమ్మాయిగారిపల్లె కుంటకు నీళ్లందిస్తారు. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.13.21 కోట్లతో ఏడు మార్కెట్ గిడ్డంగులతోపాటు పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల కల్పన ►పులివెందులలో హార్టికల్చర్ పంటల కోసం రూ.13 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రీకూలర్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు. ►నల్లచెరువుపల్లె గ్రామంలో రూ.27 కోట్లతో 132 కేవీ విద్యుత్ ఉప కేంద్రం ద్వారా 14 గ్రామాలకు లబ్ధి కలిగేలా పనులు. ►రూ.10 కోట్లతో ఐదు 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం.. 10 గ్రామాల్లోని 2,100 వ్యవసాయ, 10,200 గృహ విద్యుత్ సర్వీసులకు లబ్ధి. ►రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.19.60 కోట్లతో కడప – పులివెందుల రోడ్డులోని వేంపల్లె పట్టణం నుంచి నూలివీడు, పందికుంట, కోళ్లకుంట రోడ్డు పనులు. ►రూ.11.52 కోట్లతో పులివెందులలో ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి. ►రూ.9.30 కోట్లతో 30 పడకల నుంచి 50 పడకలకు వేంపల్లెలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విస్తరణ. ►రూ.17.50 కోట్లతో పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి ఏర్పాటు. తద్వారా 14 రకాల స్పోర్ట్స్కు అన్ని రకాల వసతులతో శిక్షణ. ►రూ.20 కోట్లతో ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.16.85 కోట్లతో 51 దేవాలయాల పునరుద్ధరణ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 18 కొత్త దేవాలయాల నిర్మాణం. ►పులివెందులలో రూ.10 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (మినీ సచివాలయం) ఏర్పాటు. ►రూ.11.20 కోట్లతో నియోజకవర్గంలో 32 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం. ►రూ.4.50 కోట్లతో వేంపల్లెలో నూతన ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణం. ►రూ.20 కోట్లతో వేంపల్లెలో కొత్తగా డిగ్రీ కళాశాల నిర్మాణం. ►పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రూ.20 కోట్లతో లెక్చర్ కాంప్లెక్స్, నైపుణాభివృద్ది కేంద్రం ఏర్పాటు. ►రూ.4 కోట్లతో వేంపల్లెలో బీసీ బాలురు, బాలికల వసతి గృహాల నిర్మాణం. ►పులివెందులలో రూ.3.64 కోట్లతో మోడల్ పోలీసుస్టేషన్ నిర్మాణం. ►పులివెందులకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలలను మంజూరు చేస్తున్నాం. నాన్నగారి హయాంలో నిర్మించిన.. ప్రస్తుతం దైన్యస్థితిలో ఉన్న ఐజీ కార్ల్ భవనాల్లో ఈ కళాశాలలను ఏర్పాటు చేస్తాం. త్వరలో వీటికి పునాది రాయి వేస్తాం. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లిస్తాం. దేవుడి ఆశీర్వాదంతో మరిన్ని గొప్ప పనులు చేసేలా దీవించాలని పేరుపేరునా ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. – సీఎం వైఎస్ జగన్ -
‘సీతారామ’...పూడిక తీసేద్దామా..!
సాక్షి, హైదరాబాద్ : పూర్వ ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకానికి పూడికమట్టి సమస్య వెన్నాడుతోంది. ఈ ఎత్తిపోతలకు అవసరమయ్యే నీటిని తీసుకునే దుమ్ముగూడెం ఆనకట్ట ఎగువ ప్రాంతంలో భారీగా మట్టి, ఇసుక మేటలు వేయడంతో అది పంప్హౌస్లోకి చేరి, పంపులు, మోటార్లకు సమస్యలు తెచ్చే అవకాశం ఏర్పడనుంది. దీన్ని గుర్తించిన నీటి పారుదల శాఖ డ్రెడ్జింగ్ ద్వారా పూడికతీత తీయాలని నిర్ణయించింది. కేవలం 50 రోజుల వ్యవధిలో సుమారు 35వేల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక క్యూబిక్ మీటర్ పూడికను తీసేందుకు రూ.800 ఖర్చు కానుంది. ప్రస్తుతం నీటి పారుదల శాఖ ఫిబ్రవరి రెండో వారానికి మొదటి పంప్హౌస్లో 3 మోటార్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. -
ముగింపు ..తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారింది. మరీ ముఖ్యంగా ముగింపు దశలోని ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు భారీగా తగ్గాయి. మరో రూ.వెయ్యికోట్లు కేటాయించినా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తయ్యేవి. కానీ, ప్రభుత్వం కేవలం రూ.87 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు. కోయిల్సాగర్ల కింద మొత్తంగా 8.78 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 6.16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తిచేయగా, మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన పనుల పూర్తికి, 12 శాతం మేర మిగిలిన భూసేకరణకు రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కల్వకుర్తి ప్రాజెక్టుకు కనిష్టంగా రూ.400 కోట్లు కేటాయించాలని కోరినా కేవలం రూ.4 కోట్లతో సరిపెట్టారు. ఈ ప్రాజెక్టు కింద పనులకు సంబంధించి రూ.70 కోట్లు, భూసేకరణకు సంబంధించి రూ.17 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఈ ప్రాజెక్టు కింద 4.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే 3 లక్షల ఎక రాల కు నీరిచ్చే అవకాశాలుండగా, మిగతా ఆయకట్టు ను వచ్చే ఏడాదికి సిద్ధం చేయాల్సి ఉంది. ఈ నిధులతో అధి సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక భీమా, నెట్టెంపాడుల పరిధిలోనూ పెండింగ్ బిల్లులు రూ.33 కోట్ల మేర ఉన్నాయి. భూసేకరణకు మరో రూ.17 కోట్లు అవసరం. వీటి కింద నిర్ణయించిన చెరో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే కనిష్టంగా రూ.400 కోట్లు అవసరంకాగా కేవలం రూ.50 కోట్లు కేటాయించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్.. ప్రాణహిత మూలకే.. ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లోని టన్నెల్ పనులు గాడిన పడే అవకాశం కనబడటం లేదు. పనుల పూర్తికి నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడమే దీనికి కారణం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. మొదటి టన్నెల్ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్నగర్లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా, మరో 10 కి.మీ లకు పైగా టన్నెల్ను తవ్వాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కి.మీ. టన్నెల్ పూర్తవగా తర్వాత ఐదేళ్లలో 9 కి.మీ. మేర తవ్వారు. కన్వేయర్ బెల్ట్, ఇతర యంత్రాలను మార్చాల్సి రావడంతో వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ఏజెన్సీకి రూ.80 కోట్లను అడ్వాన్సు కింద చెల్లించాలని ప్రతిపాదన వచ్చినా తుది రూపం తీసుకోలేదు. పనులకు సంబంధించి రూ.80 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈ ప్రాజెక్టు పనులకు రూ.22 కోట్లు, భూసేకరణకు రూ.270 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ దృష్ట్యా ప్రాజెక్టుకు రూ.300 కోట్ల మేర కేటాయింపులు కోరినా రూ. 17.31 కోట్లను మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ్మిడిహెట్టి కాకుండా దానికి ఎగువన వార్ధా నదిపై దీన్ని నిర్మించాలని భావిస్తుండ టంతో ప్రభుత్వం కేటాయింపులు తగ్గించింది. -
టీడీపీ వరద రాజకీయం
సాక్షి, అమరావతి: ‘డ్రోన్ల ద్వారా నాపై దాడికి కుట్ర పన్నారు. వరదల్ని కావాలని రప్పించి నా ఇంటిని ముంచేలా ప్లాన్ చేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవల్ని అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచుతున్నారు. చంద్రబాబు ఇంటిపై బాంబులు వేసేందుకు ఇద్దరు వచ్చారు’.. కృష్ణా నది వరదల సాక్షిగా టీడీపీ బురద రాజకీయానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ఉండవల్లి కరకట్టపై ఉన్న తన ఇంటిని ముంచేందుకు ఉద్దేశపూర్వకంగా వరద సృష్టించారని చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న హంగామా చూసి అధికారులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తనను అంతమొందించేందుకు డ్రోన్లు ప్రయోగించారని చంద్రబాబు నెత్తీ నోరూ కొట్టుకోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నీటిపారుదల శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ ఏజెన్సీ శుక్రవారం డ్రోన్ కెమెరాతో బ్యారేజీ ఎగువన వరద పరిస్థితిని చిత్రీకరించింది. అందులో భాగంగానే చంద్రబాబు ఇంటి వద్ద చిత్రీకరిస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకులు డ్రోన్ల ద్వారా చంద్రబాబు ఇంటిపై బాం బులేయడానికి వచ్చారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నీటి పారుదల శాఖ ఖండించింది. డ్రోన్ల ద్వారా చిత్రీక రణకు తామే ఒక ఏజెన్సీ ద్వారా ఇద్దరు వ్యక్తుల్ని పంపా మని చెప్పడంతో టీడీపీ నాయకులు వ్యూహం మార్చారు. బాబు ఇంటిని ముంచే ందుకు ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా బ్యారేజీలో వరదను సృష్టిం చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గేట్లకు బోట్లు అడ్డుపెట్టి వరదను ఆపారట! ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవలను అడ్డుగా పెట్టి ఉండవల్లిలోని నివాసాన్ని ముంచాలని చూస్తున్నారని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆరోపణలకు దిగడం చూసి ప్రజలు నివ్వెరపోయారు. కృష్ణా నది కరకట్టపై ఉన్న తన అక్రమ నివాసం ముంపునకు గురైన విషయాన్ని పక్కదారి పట్టించి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు, ఆయన పరివారం ఈ రాద్ధాంతం సృష్టించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నదుల అనుసంధానంలో నవయుగకు నజరానాలు!
సాక్షి, అమరావతి: సాగునీటి పనుల చాటున గత సర్కారు హయాంలో జరిగిన అక్రమాలకు ఇది మరో తార్కాణం! గోదావరి–పెన్నా తొలి దశలో రెండో ప్యాకేజీ పనులు చేయకున్నా సరే నవయుగ–ఆర్వీఆర్ సంస్థకు రూ.26.55 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక కూడా రూ.351 కోట్లకుపైగా ఖజానాను కొల్లగొట్టేందుకు టీడీపీ పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. చేయని పనులను చేసినట్లుగా చిత్రీకరించి కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేయించేందుకు ఆర్థికశాఖ ఉన్నతాధికారి ద్వారా ప్రయత్నాలు సాగించారు. కాంట్రాక్టర్తో కుమ్మక్కైన జలవనరుల శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రూ.351,11,54,057 చెల్లించాలంటూ గత మార్చి 20న ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే ఖజానా నిండుకోవడంతో దీనికి బ్రేక్ పడింది. పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ అంశం బహిర్గతమైంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ రూ.26.55 కోట్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించేందుకు రూ.6,020 కోట్లతో గోదావరి–పెన్నా తొలి దశ పనులను గత సర్కార్ చేపట్టింది. రెండు ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 2వ ప్యాకేజీ (45 కి.మీ. నుంచి 66.600 కి.మీ. వరకు ఏడు వేల క్యూసెక్కులను ఎత్తిపోయడం) పనులను 4.41 శాతం ఎక్సెస్ ధరలకు అంటే రూ.2,655.49 కోట్లకు నవయుగ–ఆర్వీఆర్ దక్కించుకుంది. ఒప్పందం చేసుకున్నాక సర్వే, ఇన్వెస్టిగేషన్ కోసం ఒక శాతం అంటే రూ.26.55 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద గుంటూరు జిల్లా ఎస్ఈ బాబూరావు చెల్లించారు. పెండింగ్ బిల్లులపై సమీక్షతో వెలుగులోకి.. నిబంధనల ప్రకారం సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు పూర్తయిన తర్వాత నాలుగు శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించవచ్చు. అయితే సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులే ఇంతవరకూ పూర్తి కాకపోవడం గమనార్హం. లేబర్ కాంపొనెంట్ కింద నాలుగు శాతం (రూ.106,23,57,216), పనులు చేయకున్నా చేసినట్లు చూపిస్తూ మరో రూ.244,87,96,841 వెరసి మొత్తం రూ.351,11,54,057 మేరకు బిల్లులు చెల్లించాలంటూ గత మార్చి 20న ఆర్థిక శాఖకు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీన్ని పరిశీలించిన ఆర్థిక శాఖ ఉద్యోగులు నివ్వెరపోయారు. అసలు చేయని పనులకు బిల్లులు ఎలా చెల్లిస్తామంటూ నిలదీశారు. దీంతో రంగంలోకి దిగిన నాటి ప్రభుత్వ పెద్దలు ఆర్థికశాఖ ఉన్నతాధికారి ద్వారా బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే అప్పటికే ఖజానా ఖాళీ కావడంతో తెరచాటు యత్నాలు బెడిసికొట్టాయి. పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇటీవల సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ విషయాన్ని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడైంది. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో కూడా తట్టెడు మట్టెత్తకుండానే నవయుగ సంస్థకు రూ.787.2 కోట్లు ఇచ్చారని నిపుణుల కమిటీ నిర్ధారించిన విషయం తెలిసిందే. గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశ పనుల్లోనూ ఇదే రీతిలో నవయుగకు ఖజానా నుంచి ధారపోయటాన్ని బట్టి గత సర్కారు పెద్దలకు ఆ సంస్థతో ఎంత ధృఢమైన బంధం ఉందో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
తెలంగాణలో ఆర్థిక సంక్షోభం:రాకేశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిపోయిందని, ఈ విషయాన్ని చర్చించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం కట్టాల్సిన బకాయిలే రూ.35 వేల కోట్లకు అంటే రికార్డు స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. భగీరథలోనే రూ.10 వేల కోట్ల బకాయిలున్నాయని, ఇక ఇరిగేషన్ శాఖలో మరొక రూ.10 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయి ఉన్నట్లు చెప్పారు. ‘ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆర్థిక పరిస్థితి మీద వివరణ ఇవ్వాలి. దీన్ని సరిచేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి’ అని రాకేశ్ డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితిపై అఖిలపక్షం: చాడ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చేసిన ప్రకటన వాస్తవాలను కప్పిపుచ్చేదిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనను తమ పార్టీ ఖండిస్తోందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్థికస్థితి గురించి పారదర్శకంగా వ్యవహరించాలి అనుకుంటే ఆర్థిక నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తే ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు పనులను ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని చాడ డిమాండ్ చేశారు. -
మళ్లీ మళ్లీ పొడిగింపు..!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టుల పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఏఐబీపీ పరిధిలో ఉన్న 11 రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులను గత ఏడాది జూన్ నాటికే పూర్తి చేయాలని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. చాలా ప్రాజెక్టుల కింద భూసేకరణ, నిధుల విడుదలలో జాప్యం వల్ల ప్రాజెక్టులను ఈ సీజన్లో పూర్తి చేయలేమని వచ్చే జూన్ వరకు గడువు పొడగించాలని నీటి పారుదల శాఖ కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి స్పష్టం చేసింది. పొడిగింపు జాబితాలో భారీ ఆయకట్టు లక్ష్యాలున్న దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, ఎస్సారెస్పీ–2, భీమా వంటి ప్రాజెక్టులు ఉండటం గమనార్హం. మూడు పూర్తి.. ఎనిమిది అసంపూర్తి.. ఏఐబీపీ కింద రాష్ట్రంలోని కొమురం భీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగ న్నాధ్పూర్, భీమా వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.24,719 కోట్లు అవసరం ఉండగా ఇప్పటికే 18,838 కోట్లు ఖర్చు చేశా రు. మరో రూ.5,881 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ మొత్తం అవసరాల్లో కేంద్రం తన సాయం కింద రూ.4,513 కోట్లు అందించాల్సి ఉండగా ఇంతవరకు రూ.3,949 కోట్లు అం దించింది. మరో రూ.564 కోట్ల మేర అందించాలి. ఈ ప్రాజెక్టులను 2014 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు వాటి గడువును 4 సార్లు పొడిగించారు. 2017 మార్చిలో దీనిపై ప్రధాని మోదీ సమీక్షించినపుడు ఆ ఏడాది జూన్ నాటికే దేవాదుల, భీమా, ఎస్సారెస్పీ–2, మత్తడివాగులు పూర్తి చేస్తామని తెలిపింది. గొల్లవాగు, జగన్నాధ్పూర్ పెద్దవాగు, పాలెంవాగు, కొమురం భీం, ర్యాలివాగు, నీల్వాయిలను 2018 జూన్ నాటికి పూర్తి చేస్తామంది. గొల్లవాగు, ర్యాలివాగు, మత్త డి వాగే పూర్తయ్యాయి. మరో 8 ప్రాజెక్టుల పరిధిలో 15 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండటంతో ఆలస్యమయ్యాయి. భూ సేకరణలో జాప్యం: దేవాదుల ప్రాజెక్టుకు మొత్తంగా 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, ఇంతవరకు 11వేల హెక్టార్లు సేకరించగా, మిగతా 3,900 హెక్టార్లను సేకరించాలి. దీంతో పాటే ఇందిరమ్మ వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్ పనులను, భీమా, కొమురం భీంలో మిగిలిపోయిన భూ సేకరణను వేగిరం చేసి పనులు పూర్తి చేయాల్సి ఉండగా అది పూర్తవలేదు. దీంతో పనులు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో మంగళవా రం దీనిపై కాడా అధికారులతో కేంద్ర జల సంఘం సీఈ రంగారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రాజెక్టు పూర్తికి కొత్త లక్ష్యాలను నిర్ణయించారు. పాలెంవాగును ఈ ఏడాది డిసెంబర్కు, దేవాదుల, ఎస్సారెస్పీ–2, భీమా, నీల్వాయి, కుమురం భీం, జగన్నాధ్పూర్లను వచ్చే ఏడాది జూన్ నాటికి, ఇందిరమ్మ వరద కాల్వ పనులను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ హామీ ఇచ్చిం ది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సత్వ రం విడుదల చేస్తే నిర్ణీత సమయానికి పూర్తి చేయడం సాధ్యమేనని తేల్చి చెప్పింది. -
4 ఏళ్లలో.. అరవై ఏళ్ల ప్రగతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి శాఖ దేశానికే దిక్సూచిగా నిలిచిందని.. తెలంగాణ సాగునీటి రంగంలో 60 ఏళ్లపాటు జరిగినదానికి సమానంగా గత నాలుగేళ్లలో అద్భుతమైన ప్రగతి చోటుచేసుకుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గత అరవై ఏళ్లలో తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాలు సాగులోకి వస్తే.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అంతే స్థాయిలో అదనపు ఆయకట్టు సాగులోకి వస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టుల రీ–డిజైనింగ్లో సోషల్ ఇంజనీర్గా వ్యవహరిస్తే.. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు, ఇతర సిబ్బంది సైనికుల్లా పనిచేశారని ప్రశంసించారు. గురువారం హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ‘సాగునీటి ప్రాజెక్టులు– నాలుగేళ్ల ప్రగతి’అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సీఎస్ ఎస్కే జోషితోపాటు సాగునీటి శాఖ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, సీఈలు సునీల్, శంకర్, మధుసూదన్రావు ఇతర ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రగతిపై మంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తన పదేళ్ల హయాంలో 5.71 లక్షల ఎకరాలకే నీరిచ్చిందని, అన్ని ప్రాజెక్టులను పెండింగ్లోనే పెట్టిందని హరీశ్ ఆరోపించారు. అదే తమ ప్రభుత్వం వచ్చాక పాత వాటిని పూర్తి చేస్తూనే.. కొత్త ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోందని చెప్పారు. అందరి సహకారంతో విజయం.. నిజాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ల కింద మొత్తంగా 18.6 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంటే.. ఈ ఏడాది రబీలో ఏకంగా 13 లక్షల ఎకరాలకు నీరందిందని హరీశ్రావు తెలిపారు. ‘‘ఇప్పుడు రైతాంగం ఎక్కడా నీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం లేదు. రైతులకు ఈ ఏడాది 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన ఘనత మన కేసీఆర్కే చెల్లింది. ప్రతిసారి శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆయకట్టు చివరి భూములకు నీరు ఇవ్వాలన్న డిమాండ్లతో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేవి. కానీ ఇప్పుడు అలాంటి డిమాండ్ లేకపోవడం మా శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేసింది. నీటి యాజమాన్య పద్ధతులు, ఇంజనీర్ల నిరంతర పర్యవేక్షణ, వివిధ శాఖలతో సమన్వయం కారణంగా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీరు అందించగలిగాం.’’అని పేర్కొన్నారు. ఇక మిషన్ కాకతీయ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దాని అమలుకు ముందుకొచ్చాయని చెప్పారు. కాళేశ్వరం 19 ప్రాజెక్టులతో సమానం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుత ప్రయోగమని, ఇది 19 ప్రాజెక్టుల నిర్మాణంతో సమానమని హరీశ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతుల సాధన ఓ రికార్డయితే.. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేలా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని చెప్పారు. 139 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో నడిచే పంపులు వినియోగించడం ఆసియాలోనే తొలిసారని వివరించారు. ఈ ఏడాదిలోనే పాత వరంగల్ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాకు ఈ ప్రాజెక్టు తొలి ఫలితాలు అందుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనా విధానం, దాన్ని అమలుచేస్తున్న సాగు నీటి శాఖ గొప్పతనంతో ప్రాజెక్టు పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,832 కిలోమీటర్లు నీటిని సరఫరా చేసే మార్గాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టన్నెళ్లు, 98 కిలోమీటర్ల ప్రెషర్ పైప్లైన్లు, 22 లిఫ్టులు, 21 పంపుహౌజ్లు, 4,627 మెగావాట్ల విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయని హరీశ్ చెప్పారు. ఇలా ఒక ప్రాజెక్టులో భాగంగా ఇన్నింటిని నిర్మించడం ప్రపంచ రికార్డన్నారు. సాగునీటి శాఖలో సుదీర్ఘ కాలం ఒకే ఐఏఎస్ అధికారి పనిచేయడం అరుదైన విషయమని, అలాంటి ఘనత సీఎస్ ఎస్కే జోషి గడించారని కొనియాడారు. ఈ సందర్భంగా నీటి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారుల ను మంత్రి మొమెంటోలతో సత్కరించారు. ప్రజెంటేషన్లోని ముఖ్యాంశాలివీ.. ♦ 2004–2014 మధ్య కాలంలో సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు 5.71 లక్షల ఎకరాలుకాగా.. స్థిరీకరణ జరిగింది 93 వేల ఎకరాలే. ఇందులో ఏఎంఆర్పీ, ఎస్సారెస్పీ–2 కింద 5.56 లక్షల ఎకరాలకు నీరిచ్చినట్టు చెప్పినా పారింది 1.5 లక్షల ఎకరాలు మాత్రమే. ♦ టీఆర్ఎస్ నాలుగేళ్ల హయాంలో ఎనిమిది పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగా.. మరో 11 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసింది. దీంతో కొత్తగా 10 లక్షల ఎకరాలకు నీరివ్వడంతోపాటు మరో 15.72 లక్షల ఎకరాలను స్థిరీకరించడం జరిగింది. 2018–19లో మరో 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ♦ మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించిన చెరువుల కింద మొదటి దశలో 6.73 లక్షల ఎకరాలు, రెండో దశలో 4.29 లక్షలు, మూడో దశలో 1.45 లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 12.47 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. చెరువుల్లో 8.10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. కొత్తగా 1.05 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ♦ మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు (కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్) ఎత్తిపోతల పథకాల కింద 2016–17లో 4.5 లక్షల ఎకరాలకు, 2017–18 ఏడాది రబీలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు 700 చెరువులు నిండాయి. దీంతో వలసలు ఆగాయి. ♦ప్రభుత్వం తెలంగాణలో పాత సాగునీటి ప్రాజెక్టులను పునరుద్ధరించాలని సంకల్పించింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, ఘనపూర్ ఆనకట్ట కాలువల ఆధునీకరణ పనులను పూర్తిచేసి మొత్తం ఆయకట్టుకు నీరందిస్తున్నాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేసింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
మంత్రికి మహిళా అధికారి బురిడీ!
సాక్షి, హైదరాబాద్: ఆమె సాగునీటి శాఖలో మహి ళా అధికారి.. పౌర సరఫరాల శాఖ పరిధిలో పని చేస్తున్న తన భర్తను బదిలీ చేయించుకునేందుకు ఏకంగా మంత్రి ఈటల రాజేందర్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ బదిలీ వీలుపడదంటూ ఫైలుపై ఉన్న కొర్రీలను వైట్నర్తో చెరి పేసి.. మంత్రితో సంతకం చేయించుకున్నారు. చివరికి మంత్రి ఓఎస్డీ పరిశీలనలో ఈ ‘చిట్టి’మోసం బయటపడింది. ఈ మోసంలో ఈటల పర్యవేక్షిస్తున్న పౌరసరఫరాల శాఖ సిబ్బంది పాత్ర ఉన్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలుకుబడి ఉపయోగించినా.. సాగునీటి శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తు న్న ఓ మహిళా అధికారి భర్త.. పౌర సరఫరాల విభాగంలో వికారాబాద్ మేనేజర్గా పనిచేస్తున్నా రు. ఆయన్ను హైదరాబాద్కు బదిలీ చేయించుకునేందుకు సదరు అధికారి ప్రయత్నం మొదలుపెట్టారు. దీనికోసం అదనపు కార్యదర్శిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకున్నారు. పౌరసరఫరాల శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి పేషీ లోని సిబ్బంది సహకారంతో.. ఆ బదిలీ ఫైల్ను కిందిస్థాయి నుంచి కమిషనర్ కార్యాలయం చేర్చారు. కానీ హైదరాబాద్లో ఆ స్థాయి పోస్టు ఏదీ ఖాళీగా లేదంటూ పౌరసరఫరాల శాఖ ఇన్చార్జి కమిషనర్ సునీల్శర్మ ఫైలుపై కొర్రీ రాశారు. దీంతో ఫైలు ఆగిపోయింది. వెనక్కి తగ్గని ఆ అధికారి.. మంత్రి పేషీ సాయంతో అదే ఫైలును మరోసారి ముందుకు కదిపారు. ఆ ఫైలు పై కమిషనర్ రాసిన కొర్రీపై వైట్నర్ పూసి.. కొర్రీ ఏమీ లేనట్టుగా మార్చేశారు. అనంతరం ఆ అధి కారి తన భర్తను బదిలీ చేయాలంటూ స్వయంగా ఫైలును మంత్రి ఈటల వద్దకు తీసుకెళ్లారు. కమిషనర్ రాసిన కొర్రీ కనబడకుండా చేయడంతో.. మంత్రి ఆ ఫైలుపై సంతకం చేసేశారు. ఓఎస్డీ అప్రమత్తతతో..: మంత్రి సంతకం తర్వాత ఆ బదిలీ ఫైలు ఓఎస్డీకి చేరింది. దానిని పరిశీలించిన ఓఎస్డీ.. వైట్నర్ పూసినట్లు గుర్తించి, ఫైలును వెనక్కి పంపి మంత్రిని అప్రమత్తం చేశా రు. దాంతో అసలు తతంగం బయటపడింది. సాధారణంగా మంత్రి తాను సంతకం చేయాల్సిన ఫైళ్లపై ఓఎస్డీని సంప్రదించిన తర్వాతే సం తకం చేస్తుంటారు. కానీ ఈ వివాదాస్పద బదిలీ ఫైలును మంత్రి పేషీలోని సిబ్బందే.. ఓఎస్డీ లేని సమయంలో ముందుకు కదిపినట్టు తెలుస్తోంది. మంత్రి పేషీలోని సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. తన కళ్లు గప్పి బదిలీ ఫైలును ముందుకు కదిపిన వ్యవహారంపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ ఫైలును పక్కన పడేయటంతోపాటు, వైట్నర్ పెట్టిందెవరనే దానిపై సిబ్బందిని నిలదీసినట్టు తెలిసింది. ఈ బదిలీ విషయంగా మహిళా అధికారి వ్యవహరించిన తీరును ఆమె పనిచేస్తున్న శాఖా మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. వెంటనే స్పందించిన మంత్రి హరీశ్.. ఆమెను సాగునీటి శాఖ నుంచి బదిలీ చేయాలని సిఫార్సు చేయగా, ఆమెను జీఏడీ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. -
హిమాలయాల నుంచి గోదావరి వరకు..
సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధానానికి సంబంధించి సరికొత్త ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తెరపైకి తీసుకురానుంది. హిమాలయాల నుంచి మానస్–సంకోశ్–తీస్తా–గంగా–సువర్ణరేఖ–మహానదుల మీదుగా గోదావరికి నదుల అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరనుంది. మంగళవారం హైదరాబాద్లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సులో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఈ అంశాన్ని ప్రతిపాదించనున్నారు. హిమాలయాల నుంచి గోదావరికి నదీ ప్రవాహాలు మళ్లిస్తే భవిష్యత్ తరాలకు నీటి కొరత ఉండదని వివరించనున్నారు. 938 టీఎంసీల నీటితో గోదావరికి అనుసంధానం చేస్తే దక్షిణాది వాటర్ గ్రిడ్ పటిష్టమవుతుందని, కృష్ణా బేసిన్లో భవిష్యత్ నీటి కొరతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రకటించనున్నారు. ‘గోదావరి–కావేరీ’నే ప్రధానం..! హైదరాబాద్లోని బేగంపేట తాజ్ వివాంటా హోటల్లో జరగనున్న సదస్సుకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల సాగునీటి శాఖ మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్రావు, ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు హాజరవనున్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై సదస్సులో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్కు ఎత్తిపోసి, అటునుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దానిపై ఇదివరకే కేంద్రం ఓమారు సమావేశం నిర్వహించగా.. నీటి లభ్యత, ముంపు తదితరాలపై రాష్ట్రం అనేక అనుమానాలు లేవనెత్తింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరింది. 575 టీఎంసీలపై పట్టు.. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికున్న 811 టీఎంసీల వాటాలో 575 టీఎంసీలు రాష్ట్ర వాటా కింద కేటాయించాలని రాష్ట్రం కోరనుంది. పోలవరం, పట్టిసీమల కింద దక్కే వాటాలతో పాటు, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కూడా తేల్చిన తరువాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించాలని పట్టుబట్టే అవకాశముంది. కాళేశ్వరం జాతీయ హోదాపైనా కేంద్రాన్ని కోరనుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించిన తరువాతే బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను నిర్ణయించాలని డిమాండ్ చేయనుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటిని అడ్డగోలుగా తరలిస్తున్న విషయాన్ని భేటీలో లేవనెత్తాలని సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీశ్ నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే తెలంగాణ ప్రాంతాల పరిరక్షణ అంశాన్నీ ప్రస్తావించనున్నారు. -
పదోన్నతులపై కదిలిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదలశాఖలో విభజనకు ముందున్న ఇంజనీర్ల సీనియార్టీ జాబితాను తమకు ఇవ్వాలని కోరిన ఆంధ్రప్రదేశ్ వినతిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఉమ్మడి జాబితాను అనుభవమున్న అధికారి ద్వారా వీలైనంత త్వరగా ఏపీ జలవనరుల శాఖకు అందించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి శాఖ ఈఎన్సీ(అడ్మిన్)కు శుక్రవారం మెమో జారీ చేశారు. ఏపీకి పంపే జాబితాను ప్రభుత్వానికి సైతం సమర్పించాలని సూచించారు. ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. -
బ్రిజేశ్ ముందుకు బ్రహ్మాస్త్రం!
ట్రిబ్యునల్ ముందు స్వయంగా వాదనలు వినిపించనున్న కేసీఆర్! - హాజరుకావాల్సిందిగా ఆహ్వానించిన అధికారులు, న్యాయవాదులు - దీనిపై ముఖ్యమంత్రితో ప్రాథమిక చర్చలు - కేసీఆర్ దాదాపుగా ఓకే చెప్పినట్లు నీటి పారుదల వర్గాల వెల్లడి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదం, నీటి లెక్కలు, తెలంగాణకు దక్కాల్సిన వాస్తవ వాటాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట సీఎం కె.చంద్రశేఖర్రావు స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఈ అంశంలో అధికారుల విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తుది వాదనల సమయంలో కచ్చితంగా ట్రిబ్యునల్ ముందు హాజరై వాదనలు వినిపిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణా జలాల్లో వాస్తవ కేటాయింపులు, జరుగుతున్న వినియోగం, ఉమ్మడి ఏపీలో జరిగిన నష్టం, కొత్త ప్రాజెక్టులకు వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ న్యాయవాదులు, నీటి పారుదల శాఖ అధికారులు దీనిపై ముఖ్యమంత్రితో చర్చలు సైతం జరిపినట్లు తెలిసింది. కేంద్రం, ట్రిబ్యునల్ల తీరుతో నిరాశ కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాలంటూ మూడున్నరేళ్లుగా రాష్ట్రం విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. కేంద్రం రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ కృష్ణా జలాల పంపిణీపై విచారణను తెలంగాణ, ఏపీలకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటు బ్రిజేశ్ ట్రిబ్యునల్ కూడా తెలంగాణ గోడును ఏమాత్రం వినిపించుకోవడం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు జరిపిన నికర, మిగులు జలాల కేటాయింపుల జోలికి వెళ్లకుండా.. కేవలం క్యారీ ఓవర్ జలాలు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అటు కేంద్ర నిర్ణయం, ఇటు ట్రిబ్యునల్ తీరు రెండూ తెలంగాణకు అశనిపాతంగా మారాయి. ‘పూడిక’ లెక్కలు తీద్దాం! ఇక నాగార్జున సాగర్ నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలుకాగా పూడిక కారణంగా సామర్థ్యం ప్రస్తుతం 312 టీఎంసీలకు తగ్గిపోయిందని.. శ్రీశైలంలోనూ 312 టీఎంసీల నుంచి 215 టీఎంసీలకు తగ్గిందని కేసీఆర్ అధికారులకు వివరించినట్లు తెలిసింది. రెండు ప్రాజెక్టుల్లో పూడికతో తగ్గే నీటిని పాలమూరు, డిండి ప్రాజెక్టులకు మళ్లిద్దామని ప్రాతిపాదన చేద్దామని పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాలపై తానే స్వయంగా ట్రిబ్యునల్ ముందుకు వస్తానని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బోర్డు ముందు ముఖ్యమంత్రి ఏ హోదాలో హాజరవుతారు? దానికి ముందుగానే బోర్డు అనుమతి తీసుకోవాలా? అన్నదానిపైనా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నా.. అవి ఇరు రాష్ట్రాలు సమ ర్పించిన అఫిడవిట్లు, కౌంటర్లు కేంద్రంగా ఉండనున్నాయి. దీంతో తీర్పు వెలువరించే ముందు పూర్తిస్థాయిలో జరిగే తుది వాదనల సమయంలో ముఖ్యమంత్రి హాజ రయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్యాయాన్ని ఎండగడదాం.. కృష్ణా జలాల అంశంపై నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయవాదులతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి వాటాలు మాత్రం మొత్తం కేటాయింపుల్లో 35 శాతం మేర మాత్రమే ఉన్నాయని... పరీవాహకాన్ని, ఆయకట్టును పరిగణనలోకి తీసుకొని అయినా కేటాయింపులు పెంచాల్సిందేనని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇక గతంలో జరిగిన ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్కు, రాయలసీమలోని సుంకేశుల కేసీ కెనాల్కు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా.. ఆర్డీఎస్కు 12 టీఎంసీలు ఇచ్చి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించిన అంశాన్ని వివరించారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో సైతం ఈ అంశాలను లేవనెత్తినా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ట్రిబ్యునల్ ముందు తేల్చుకోవాల్సిందేనని నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయవాదులు ఇటీవల ముఖ్యమంత్రికి తేల్చిచెప్పినట్లు తెలిసింది. చివరి అస్త్రంగా మీరే స్వయంగా ట్రిబ్యునల్ ముందుకు రావాలని వారు కేసీఆర్ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు నీటి పారుదల ఉన్నత స్థాయి వర్గాలు స్పష్టం చేశాయి. -
5 శాతమే.. ఎజెండా!
- కాంట్రాక్టు పనుల జీఎస్టీపై ప్రభుత్వ తాజా ప్రతిపాదన - వచ్చే నెలలో జరిగే కౌన్సిల్ సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా - కసరత్తు చేస్తున్న అధికారులు.. - పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కాంట్రాక్టు పనులకు 18 శాతంగా విధించిన జీఎస్టీని 12 శాతానికి తగ్గించడంలో సఫలీకృతమైన ఉత్సాహంతో దీన్ని మరింత తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు వచ్చే నెల 9న తొలిసారి హైదరాబాద్లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలనే వేదికగా చేసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్టు పనులపై 12 శాతం విధించిన జీఎస్టీని 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనే ప్రధాన ఎజెండాగా పెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం వాణిజ్య పన్నులు, సాగు నీటి శాఖ అధికారులు, బోర్డ్ ఆఫ్ ఇంజనీర్ల బృందం ఇప్పటికే పని మొదలుపెట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇతర రాష్ట్రాల మద్దతు ఎలా ఉంటుందన్నది ఆసక్తి కలిగి స్తోంది. గతంలో 18 శాతం నుంచి 12 శాతా నికి తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కు పశ్చిమబెంగాల్ రాష్ట్రం మాత్రమే అండ గా నిలిచింది. మరో రాష్ట్రం కొంత మద్దతిచ్చి నా కేవలం తెలంగాణ, పశ్చిమబెంగాల్ ప్రతినిధుల ఒత్తిడి మేరకు కేంద్రం 12 శాతానికి తగ్గించింది. అప్పుడు మిగిలిన రాష్ట్రాలన్నీ మౌనంగా ఉండగా, ఇప్పుడు ఈ 5 శాతం ప్రతిపాదనకు ఎన్ని రాష్ట్రాలు మద్దతిస్తాయో వేచిచూడాల్సిందే. ప్రగతిభవన్లో సీఎం విందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి తొలిసారి ఆతిథ్యం ఇస్తున్నందున ఏర్పాట్లు భారీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సిల్ చైర్మన్ హోదాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు ఈ సమావేశానికి రానున్నారు. నోవాటెల్ వేదికగా జరగనున్న ఈ సమావేశం ముందు, తర్వాత ప్రతినిధులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేసే బాధ్యతను వాణిజ్య పన్నుల శాఖ తీసుకుంది. ఇందుకోసం అనేక కమిటీలను ఏర్పాటు చేసుకుని కౌన్సిల్ సమావేశానికి సిద్ధమవుతోంది. మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వచ్చే అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు ప్రగతి భవన్లో విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చేనెల 9న ఈ విందును ఏర్పాటు చేస్తున్నారని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఆయకట్టుకు ‘శ్రీరామ’రక్ష!
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు - ఎస్సారెస్పీ–వరద కాల్వ లింకుతో 11 లక్షల ఎకరాల స్థిరీకరణ సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ఇక కళకళలాడనుంది! ప్రాజెక్టు పరిధిలోని లక్షల ఎకరాల ఆయకట్టుకు ‘కాళేశ్వరం’ నీళ్లతో భరోసా లభించనుంది. ఎగువ నుంచి వరదొచ్చినా రాకున్నా, ప్రాజెక్టు పరిధిలో వర్షాలు కురిసినా కురవకున్నా.. ఇక నీళ్లకు ఢోకా ఉండబోదు. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి వెళ్లే ప్రధాన కాల్వ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 రోజులపాటు 60 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సారెస్పీ–ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) లింకు పథకం ద్వారా 11 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 40 ఎకరాల భూసేకరణ మాత్రమే అవసరం కానుంది. తక్కువ వ్యయం, తక్కువ ముంపు గరిష్ట ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వం ఈ పథకానికి ప్రాధాన్యం ఇస్తోంది. వెయ్యి కోట్లతో అనుమతులు.. గోదావరిలోని 75 శాతం డిపెండబులిటీ జలాల ప్రకారం ఎస్సారెస్పీకి 196 టీఎంసీల నీటి లభ్యత ఉండాల్సింది. అయితే ఎగువన మహారాష్ట్ర కట్టిన వివిధ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కారణంగా దిగువకు ప్రవాహాలు పడిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చే గోదావరిలో నీటి లభ్యత గత ఇరవై ఏళ్లలో 196 టీఎంసీల నుంచి 54 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు ఈ నీటిపై ఆధారపడిన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాల్వల కింది ఆయకట్టుకు, గుత్పా, అలీసాగర్, చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన 95 టీఎంసీల నీటి అవసరాల్లో భారీగా కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం నీటిని హల్దీవాగు ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ఒక ప్రతిపాదన రాగా, ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరకు వరుసగా 11 బ్యారేజీలు నిర్మాంచాలని మరో ప్రతిపాదన వచ్చింది. అయితే దీనికి సుమారు రూ.30 వేల కోట్ల భారీ వ్యయం అయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేసి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ నీటిని ఎఫ్ఎఫ్సీ (ఇందిరమ్మ వరద కాల్వ) ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని నిర్ణయించింది. దీనికి రూ.1,067 కోట్లతో అనుమతులు ఇచ్చింది. ఈ పథకం అమల్లోకి వస్తే ఎస్సారెస్పీ పరిధిలోని కాకతీయ కెనాల్ కింద 5.50 లక్షల ఎకరాలు, సరస్వతి కెనాల్ కింద 40 వేలు, లక్ష్మీ కెనాల్ కింద 20 వేలు, కాళేశ్వరం ప్యాకేజీ 27, 28 కింద లక్ష ఎకరాలు, ప్యాకేజీ 21, 22 కింద 3.50 లక్షలు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వివిధ లిఫ్ట్ పథకాల కింద మిగతా ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఇలా ఎఫ్ఎఫ్సీకి ఇరువైపులా దాదాపు లక్ష ఎకరాల గ్యాప్ ఆయకట్టు ఉన్నది. ఇందిరమ్మ వరద కాల్వ తవ్వకాలు జరిపినపుడు చుట్టు పక్కలలో ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎండిపోయాయి. కాల్వల దగ్గర తలపెట్టిన తూముల నిర్మాణంతో నీటిని లిఫ్ట్ చేసుకొని రైతులు పంపుల ద్వారా నీటిని తరలించుకోవచ్చు. దీంతో పాటే మిషన్ భగీరథకు అవసరమైన 7.76 టీఎంసీల నీటి అవసరాలను సైతం ఈ పథకం తీర్చుతుంది. ఇక ఎస్సారెస్పీకి ప్రవాహాలు పెరిగి వరదలు వచ్చినా ముందున్న ప్రణాళికల ప్రకారం ఎఫ్ఎఫ్సీ నుంచి మిడ్ మానేరుకు నీటిని మళ్లించవచ్చు. నీళ్లున్నప్పుడు ఎగువ నుంచి దిగువకు ప్రవాహాలు కొనసాగనుండగా, నీళ్లు లేనప్పుడు దిగువ నుంచి ఎగువకు నీటిని తీసుకుంటారు. నీటి రివర్స్ పంపింగ్ ఇలా.. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 రోజులపాటు 60 టీఎంసీలను మూడు స్టేజ్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేసి ఎస్సారెస్పీకి తరలిస్తారు. ► కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి వెళ్లే ప్రధాన కాల్వను 102వ కి.మీ. వద్ద వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ) క్రాస్ చేస్తుంది. ఇక్కడ్నుంచి ఒక టీఎంసీ నీటిని 68వ కి.మీ., 32వ కి.మీ. వద్ద రెండు దశల్లో 5 పంపుల ద్వారా 8828 క్యూసెక్కుల నీటిని 10 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తారు. ► తర్వాత 18వ కి.మీ. వద్ద మరో 5 మోటార్లతో 11 మీటర్ల మేర నీటిని లిఫ్ట్ చేస్తారు. ► ఈ మూడు స్జేజీల విధానం ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీ జలాశయానికి చేరతాయి. నేడు టెండర్లు.. ఈ పథకానికి సోమవారం టెండర్లు పిలిచేలా నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. 20 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఏడాదిలో దీన్ని పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకుంది. -
2,437 పోస్టులకు నోటిఫికేషన్!
జూన్ 2న ప్రకటన... అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న వివిధ కేటగిరీలకు చెందిన 2,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షలో వెల్లడించింది. ఆ 2,437 పోస్టుల్లో అధిక సంఖ్యలో గురుకుల డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, నీటి పారుదల శాఖ, ఆర్ అండ్ బీ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల్లో సివిల్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. అలాగే ములుగులోని ఫారెస్ట్స్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్లు, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా జూన్ 2న 2437 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
బీళ్లు తడవాలి.. సిరులు పండాలి
భారీ లక్ష్యాలను ఛేదించేందుకు పరుగులు పెడుతున్న నీటి పారుదల శాఖ - ఈ ఖరీఫ్లో నీరందించాల్సిన ఆయకట్టు.. 8.73 లక్షల ఎకరాలు - పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు.. 12 సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్లోనే 8.73 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లివ్వాలి..! వర్షాలు మొదలయ్యే నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి చేయాలి..! సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సర్కారు నిర్దేశించుకున్న లక్ష్యాలివీ. గడువు ముంచుకొస్తుండటంతో సాగునీటి పారుదల శాఖ వేగం పెంచింది. మంత్రి హరీశ్రావు ప్రాజెక్టుల వారీగా పర్యటనలు చేస్తున్నారు. ఆయకట్టుపై సమీక్షలకు శ్రీకారం చుట్టారు. అనుకున్న లక్ష్యం మేరకు నీరందిస్తామని దీమా వ్యక్తంచేస్తున్నారు. అయితే చాలా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, రైల్వే, రోడ్డు క్రాసింగ్, çపునరా వాస సమస్యలు, అధికారులు, కాంట్రాక్టర్ల అలస త్వం లక్ష్యానికి అడ్డుగా నిలిచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో ఎంత ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంది? గత మూడేళ్లలో ప్రాజెక్టుల్లో పురోగతి ఎంత? తదితర అంశాలపై సమగ్ర కథనం.. ఇప్పటివరకు ఫర్వాలేదు.. 2004–05లో జలయజ్ఞం కింద నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి రూ.1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే 3 ప్రాజెక్టులు పూర్తి కాగా.. మరో 14 ప్రాజెక్టుల్లో ఆయకట్టు పాక్షికంగా వృద్ధిలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 2013–14 నాటికి 6,14,897 ఎకరాలు కొత్తగా సాగులోకి రాగా.. మరో 92,584 ఎకరాల స్థిరీకరణ జరిగింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలం గాణ మరో రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టడంతో 36 ప్రాజెక్టుల వ్యయం రూ.1.90 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.58,606 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఆయకట్టుకు సంబంధించి 2014లో పెద్దగా ఫలితాలు రాకున్నా.. 2015 మార్చి నుంచి ప్రాజెక్టులు వేగం అందుకున్నాయి. ప్రాజెక్టుల కోసం 2014–15లో రూ.5,285.03 కోట్లు, 2015–16లో రూ.7,189.21 కోట్లు, 2016–17లో రూ.15 వేల కోట్లు వెచ్చించడంతో ఆయకట్టు గణనీయంగా పెరిగింది. దీంతో 2004 నుంచి 2014 వరకు 6 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు రాగా.. ఈ మూడేళ్లలో మరో 6.29 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందింది. 5.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. మొత్తంగా 2004 నుంచి ఇప్పటిదాకా కొత్తగా వచ్చిన ఆయకట్టు 12.29 లక్షల ఎకరాలకు చేరింది. ఈ ఖరీఫ్లో భారీ లక్ష్యం.. ఈ ఏడాది ఖరీఫ్లో 12 ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేయాలని, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ లక్ష్యంగా నిర్దేశిం చుకుంది. దీంతో సుమారు 8.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వాలని సంకల్పిం చింది. ఇందుకు ఈ బడ్జెట్లో ఏకంగా రూ.11 వేల కోట్ల మేర కేటాయింపులు చేసింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు పూర్తి చేసేందుకు కొన్ని కీలక అడ్డంకులను ప్రభుత్వం దాటాల్సి ఉంది. అది పూర్తయితేనే నిర్ణీత ఆయకట్టుకు నీరందుతుంది. ప్రధాన ప్రాజెక్టుల స్వరూపం ఇదీ.. కల్వకుర్తి అంచనా వ్యయం: 4,896.24 కోట్లు చేసిన వ్యయం: 3,520.21 కోట్లు ప్రధాన సమస్యలు: మరో 1,346 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. కాల్వల సామర్థాన్ని పెంచాల్సి ఉంది. గుడిపల్లిగట్టు లిఫ్టు కింద 150 హెక్టార్ల మేర అటవీ భూమిని బదలాయించాల్సి ఉంది. స్టేజ్–1కు క్లియరెన్స్ వచ్చినా.. స్టేజ్–2కు ఇంకా రావాల్సి ఉంది. భీమా అంచనా వ్యయం: 2,658.48 కోట్లు చేసిన వ్యయం: 2,331.71 కోట్లు ప్రధాన సమస్య: 1,117 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. లిఫ్ట్–1 కింద పంచదేవ్పాడ్ గ్రామం, లిఫ్టు–2 కింద శంకరసముద్రం రిజర్వాయర్ కోసం అవసరమైన ఆర్అండ్ఆర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడ సైతం కాల్వల సామర్థ్యం పెంచాల్సి ఉంది. నెట్టెంపాడు అంచనా వ్యయం: 2,331.47 కోట్లు చేసిన వ్యయం: 2,044.50 కోట్లు సమస్యలు: ఇంకా 1,222 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. 5 చోట్ల రైల్వే క్రాసింగ్ సమస్యలను అధిగమించాల్సి ఉంది. గట్టు లిఫ్ట్ కింద ఆయకట్టును 3 వేల నుంచి 28 వేలకు పెంచాలని నిర్ణయించగా.. డీపీఆర్ ఇంకా పూర్తి కాలేదు. ఎస్సారెస్పీ స్టేజ్–2 అంచనా వ్యయం: 1,220.41 కోట్లు చేసిన వ్యయం: 1,068.78 కోట్లు సమస్యలు: 1,274.67 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 22 చోట్ల రోడ్ల క్రాసింగ్ సమస్యలున్నా యి. 3 గ్రామాలు పాక్షికంగా ముంపు ప్రాంతం లో ఉండగా.. 332 కుటుంబాలు ప్రభావితం అవుతున్నాయి. 173 కుటుంబాలను తరలించ గా.. మిగతావారిని తరలించాల్సి ఉంది. దేవాదుల అంచనా వ్యయం: 13,445.73 కోట్లు చేసిన వ్యయం: 8,751.81 కోట్లు సమస్యలు: ప్యాకేజీ–1లో ఇన్టేక్ నుంచి ధర్మ సాగర్ వరకు 344 హెక్టార్లు, ప్యాకేజీ–3లో రంగ య్య, ఎర్రయ్య ట్యాంక్ల పరిధిలో, డిస్ట్రిబ్యూ టరీల్లో కలిపి మొత్తంగా 1101.68 హెక్టార్ల అటవీ భూములను బదలాయించాల్సి ఉంది. ఇంకా 5,642 ఎకరాల మేర భూసేకరణ చేయాలి. -
నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.954 కోట్లు
సవరించిన అంచనాలకు ప్రభుత్వ ఆమోదం సాక్షి, హైదరాబాద్: నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనుల కోసం రూ.954.77 కోట్లతో సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి విడతలో రూ.96.69 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాగర్ ప్రధాన కాల్వ, పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు రూ.549.60 కోట్లకు, ఉప పంపిణీ వ్యవస్థల కోసం రూ.83.77 కోట్లకు 2008 జూన్లో అనుమతిచ్చారు. మొత్తంగా రూ.633.54 కోట్లతో 155 కిలోమీటర్ల మేర కాల్వలను 2015 నాటికి ఆధునికీకరణ చేయాలని నిర్ణరుుంచారు. మధ్యలో ఈ మొత్తాలను సవరించి వ్యయాన్ని రూ.742.82 కోట్లకు పెంచారు. తర్వాత మరిన్ని పనులను చేర్చడంతో వ్యయం రూ.954.77కోట్లకు పెరిగింది. -
ఎస్సారెస్పీ కింద 8 లక్షల ఎకరాలకు నీరు
► అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశం ► కొన్ని కాల్వల్లో ’టేల్ టు హెడ్’ పద్ధతిన ఇవ్వాలని సూచన ► భూసేకరణకు ఇదే అనువైన సమయమని అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రబీ కార్యాచరణ ప్రణాళికను ఇరిగేషన్ శాఖ ఖరారు చేసింది. ప్రాజెక్టు ద్వారా రబీలో 8 లక్షల ఎకరాలకు సాగునీరందిం చాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికా రులకు ఆదేశాలిచ్చారు. సోమవారం ఇరిగేషన్ ఇంజనీర్లతో మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రబీ ప్రణాళికపై వరంగల్, కరీంనగర్, జగి త్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన సాగునీటి పారుదల శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి చెందిన లక్ష్మి, సరస్వతి, కాకతీయ కాల్వలు, కడెం పరిధిలో ఖరీఫ్లో జరిగిన ఆయకట్టుతో పాటు రబీకి సాగునీరందించే కార్యాచరణ ప్రణాళికపై మంత్రి సమీక్షించారు. కాలువల వెంట ఇంజనీర్లు స్వయంగా నడిచి పరిశీలిం చాల ని, ఎక్కడెక్కడ లీకేజీలున్నా యో గుర్తించా లన్నారు. శాశ్వత ప్రాతిపదికన మరమ్మ తులు చేపట్టేందుకు వ్యయ అంచనాలతో కూడిన ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా పంపించాలని ఆదేశించారు. ఆయా పనుల ను ఆమోదించి నిధులు మంజూరు చేస్తే వచ్చే వేసవిలోగా పనులు పూర్తవుతాయ న్నారు. మధ్యప్రదేశ్లో అమలు చేస్తున్న ’టేల్ టు హెడ్’ పద్ధతిన సాగునీటి పంపిణీని ప్రయోగాత్మకంగా కొన్ని డిస్ట్రిబ్యూటరీలు, లేదా మైనర్ కెనాల్లలో అమలు చేయాలని మంత్రి కోరారు. ఈ విధానం వల్ల ఆయకట్టు చివరి రైతులకు నీరందకుండా పోయే సమస్యలు రావన్నారు. రబీ కార్యాచరణపై త్వరలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తానన్నారు. నీటి లభ్యతపై రైతులకు సరైన సమాచారం ముందుగానే ఇవ్వాలని, ఏ పొలం కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయ తీల ఆఫీసుల నోటీసు బోర్డులపై తప్పని సరిగా ఆ ప్రాంతానికి చెందిన జేఈ పేరు, మొబైల్ ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది చివరికల్లా ఎల్ఎండీకి నీరు 2017 డిసెంబర్ కల్లా మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్కు నీరందిస్తామని మంత్రి హరీశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్ఎండీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో రైతులు భూములిచ్చేందుకు ముందుకు వస్తారని, ప్రభుత్వం వైట్ మనీ ఇస్తుంది కనుక భూసేకరణకు ఇప్పుడు అనువైన సమయమని మంత్రి అభిప్రాయపడ్డారు. -
నిధులు పొంగాయి నీళ్లే పారాలి!
సాగునీటి పారుదల శాఖకు 25,000కోట్లు ప్రణాళిక బడ్జెట్ కింద 25 వేల కోట్ల కేటాయింపు * మొత్తంగా రూ.26,625.32 కోట్లు * పాలమూరు, ప్రాణహిత, సీతారామ ప్రాజెక్టులకు పెద్దపీట * పాలమూరుకు రూ.7,861 కోట్లు, కాళేశ్వరానికి రూ.6,286 కోట్లు, భక్తరామదాసు, సీతారామకు రూ.1151 కోట్లు * మహబూబ్నగర్, ఆదిలాబాద్ ప్రాజెక్టులకు భారీగా నిధులు సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగానికి నిధులు పొంగాయి! ముందునుంచి చెబుతున్నట్లుగానే 2016-17 బడ్జెట్లో నీటిపారుదల శాఖకు ప్రణాళికా వ్యయం కిందే మొత్తంగా రూ.25 వేల కోట్ల కేటాయింపులు చేశారు. గతేడాది ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కన్నా సుమారు రూ.15 వేల కోట్లు అధికంగా కేటాయించి సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. టెండర్ల దశను దాటి పనులకు సిద్ధమవుతున్న పాలమూరు-రంగారెడ్డి, రీ డిజైన్ పూర్తయి ఇటీవల మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్న ప్రాణహిత-కాళేశ్వరం, కొద్దిరోజుల కిందట శంకుస్థాపన చేసిన సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దక్కింది. ఈ మూడు ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా రూ.15 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇక వీటితోపాటే తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇచ్చిన ఆర్థికమంత్రి ఈటల.. ఇతర ప్రాజెక్టులకూ ఊపిరి పోసేలా నిధుల కేటాయించారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కలిపి సాగునీటి రంగానికి బడ్జెట్లో మొత్తంగా రూ.26,625.32 కోట్లు కేటాయించిన ఆర్థికమంత్రి.. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.23,893.66 కోట్లు, చిన్ననీటి పారుదలకు రూ.2,452.52 కోట్లు కేటాయించారు. పరీవాహక అభివృద్ధి విభాగానికి రూ.30.14 కోట్లు, వరద నిర్వహణకు రూ.249 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది కలుపుకొని ప్రాజెక్టుల కింద 16 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా కదులుతున్న ప్రభుత్వం ఆ మేరకు ప్రాజెక్టు పరిధిలో పనుల పురోగతిని దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించింది. కరువు జిల్లాకు కావాల్సినంత కరువు, వలసలతో కొట్టుమిట్టాడుతున్న పాలమూరు జిల్లాలో సాగునీటిని పారించేందుకు కావాల్సినన్ని నిధులు కేటాయించారు. గత ఏడాదే శంకుస్థాపనకు నోచుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు గతేడాది బడ్జెట్లో రూ.100 కోట్ల నిధులే కేటాయించారు. ఈ ఏడాది ఏకంగా రూ.7,861 కోట్లు కేటాయించారు. రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తొలి ఏడాదే సుమారు 30 శాతం నిధులు కేటాయించడం గమనార్హం. ఇక జిల్లాలోని నాలుగు ప్రధాన భారీ, మధ్య తరహా ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు ఈ ఏడాది అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సుమారు 70 టీఎంసీల కృష్ణా జలాలు వినియోగంలోకి వస్తుండటం, వీటితో వచ్చే ఖరీఫ్ నాటికే సుమారు 4 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశాలు ఉండడం, పెండింగ్లో ఉన్న భూసేకరణ, సహాయ పునరావాసం అంశాలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం భారీ కేటాయింపులకు మొగ్గు చూపింది. ఈ ప్రాజెక్టులకు మొత్తంగా రూ.950 కోట్ల వరకు అవసరం ఉండగా రూ.600 కోట్ల వరకు కేటాయించారు. భారీ ప్రాజెక్టులకు అంతే భారీగా రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టులకు అంతే భారీస్థాయిలో కేటాయింపులు చేశారు. రెండేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని భావిస్తున్న సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టులకు కలిపి రూ.1,151 కోట్ల మేర నిధులు కేటాయించారు. వచ్చే జూన్ నాటికి పూర్తి ఆయకట్టునిచ్చే ప్రాజెక్టుల్లో ఉన్న దేవాదులకు రూ.695 కోట్లు, ఇందిరమ్మ వరద కాల్వకు రూ.505 కోట్లు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు రూ.1,417 కోట్ల మేర కేటాయింపులు చేశారు. టన్నెల్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో గతేడాది ఈ ప్రాజెక్టుకు రూ.600 కోట్ల మేర కేటాయింపులు చేస్తే.. ఈ ఏడాది రెట్టింపు చేశారు. ఇక అంతర్రాష్ట్ర వివాదాలకు పరిష్కారం దొరికిన దిగువ పెన్గంగకు రూ.124 కోట్లు కేటాయించగా, నిజాంసాగర్, నాగార్జునసాగర్ ఆధునీకరణకు కలిపి మొత్తంగా రూ.660 కోట్లు కేటాయించారు. వీటితోపాటు ఎస్సారెస్పీ-1, 2లకు రూ.300 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టులకు తగినన్ని నిధుల కేటాయించారు. ప్రాణహిత, కాళేశ్వరానికి విడివిడిగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత, కాళేశ్వరం ఎత్తిపోతలకు బడ్జెట్లో విడివిడిగా కేటాయింపులు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేసిన ప్రాణహితకు రూ.685 కోట్లు కేటాయించగా.. కాళేశ్వరానికి రూ.6,286 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుకు రూ.6,971 కోట్లు కేటాయించారు. గడిచిన ఆరేళ్లలో ఈ ప్రాజెక్టుకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించారో దానికి సమానంగా ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు ఉండటం విశేషం. రెండేళ్లలో మేడిగడ్డ-ఎల్లంపల్లి బ్యారేజీ నిర్మాణం పూర్తి, ఆయకట్టులో కనీసం 2 నుంచి 4 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో కేటాయింపులు పెరిగాయి. -
భారీ ప్రాజెక్టుల్లోనూ పూడికతీత
♦ తొలిసారి ఎస్సారెస్పీ, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల్లో పనులు ♦ దాదాపు 30 టీఎంసీల మేర వాస్తవ నిల్వ సామర్ధ్యం తగ్గిన ఎస్సారెస్పీ ♦ నీటి నిల్వ డెడ్స్టోరేజీకి చేరడంతో పూడిక తీయడంపై ప్రతిపాదన ♦ ఉపాధిహామీతో అనుసంధానంపై ప్రభుత్వం సానుకూలం సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువుల్లో పూడికతీత చేపట్టిన నీటి పారుదల శాఖ ప్రస్తుతం భారీ సాగునీటి ప్రాజెక్టుల్లోనూ ఈ చర్యలు చేపట్టే ఆలోచనలు చేస్తోంది. గత రెండేళ్లుగా సరైన వర్షాలు లేక నీటి నిల్వలు పడిపోయి నిర్జీవంగా మారిన ప్రాజెక్టుల్లో సారవంతమైన పూడిక(మట్టి) ఉందని, దాన్ని తరలించుకునేందుకు రైతులు సైతం ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో పూడికతీత అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పనులను ‘ఉపాధి హామీ’తో అనుసంధానించి, కరువు మండలాల్లోని రైతు కూలీలకు సాయపడాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో పూడికతీతపై కలెక్టర్ నుంచి నీటి పారుదల ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదన రాగా, దాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో పూడిక సమస్య పెరిగిపోయింది. కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఇప్పటికే పూడిక కారణంగా భారీగా నిల్వ సామర్ధ్యం తగ్గిపోగా, గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల్లోనూ అదే పరిస్థితి ఉంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, పోచారం ప్రాజెక్టుల్లోనూ పూడిక సమస్య తీవ్రంగా ఉంది. ఇక ఎస్సారెస్పీని 112 టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టగా పూడిక కారణంగా అది ప్రస్తుతం 90 టీఎంసీలకు పడిపోయింది. 2014లో చేపట్టిన హైడ్రాలిక్ సర్వేలో మరో 10 టీఎంసీల మేర తగ్గి 80.10 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తేల్చారు. ఇక నిజాంసాగర్ను 1931లో 28 టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టగా భారీ పూడిక కారణంగా 1973 నాటికి అది 11.8 టీఎంసీలకు చేరింది. తర్వాతి కాలంలో నిల్వ సామర్ధ్యాన్ని పెంచడంతో 6 టీఎంసీల మేర పెరిగి ప్రస్తుతం 17.8 టీఎంసీల సామర్ధ్యంతో ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ డెడ్స్టోరేజీకి చేరింది. వీటిలోని సారవంతమైన పూడికను తరలించడం ద్వారా రైతులకు, రైతు కూలీలకు, ప్రాజెక్టులకు మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజామాబాద్ నుంచి అందిన ప్రతిపాదన.. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, పోచారం, రామడుగు, కౌలాస్నాలా ప్రాజెక్టుల్లో పూడికతీతకు సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదన వచ్చింది. నిజాంసాగర్లో 2,670, శ్రీరాం సాగర్లో 13,546.95, పోచారం 273, రామడుగులో 144.90, కౌలాస్నాలాలో 185.70 మిలియన్ క్యూబిక్ ఫీట్ల మేర పూడిక ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో ఉన్న 13,546 ఎంసీఎఫ్టీల పూడిక దాదాపు 13 టీఎంసీలకు సమానం కాగా, నిజాంసాగర్ లోని పూడిక 2 టీఎంసీలకు సమానమని నీటి పారుదల అధికారులు చెబుతున్నారు. ఉపాధిహామీతో అనుసంధానం.. ప్రాజెక్టు ల్లో పూడికతీత పనులను ఉపాధిహామీతో అనుసంధానించాలని జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారు. పూడిక మట్టిని తరలించే విషయంలో గ్రామీణాభావృద్ధి శాఖ కొంత సహకారం అందిస్తోందని, నీటి పారుదల శాఖ సైతం మిషన్ కాకతీయ నిధుల నుంచి మరికొంత సహకారం ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ ప్రతిపాదన సానుకూలమైనదేనని, దీనిద్వారా అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనే భావనను నీటి పారుదల శాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
‘మిషన్’ రెండో విడతకు అనుమతులు
331 చెరువులకు రూ.112.79 కోట్లు కేటాయిస్తూ తొలి ఉత్తర్వు సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రెండో విడత చెరువుల పనులకు అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం నాలుగు జిల్లాల పరిధిలోని 331 చెరువుల పనులకు రూ. 112.79 కోట్లకు పరిపాలనా అనుమతులిస్తూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం నుంచి కూడా వరుసగా ‘మిషన్’ పనులకు అనుమతులు ఇస్తారని, వారంలోగా మూడు వేల చెరువులకు అనుమతులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చిన్న నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. మొదటి విడతలో మిగిలిన769 చెరువులతో కలిపి ఈ ఏడాది మొత్తంగా 10,355 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకుంది. వీటి కోసం రూ. 2,083 కోట్లు ఖర్చు చేయనున్నారు. లక్ష్యాలను చేరుకునేందుకు ఏయే ప్రక్రియను ఎప్పట్లోగా పూర్తి చేయాలన్నది ఇప్పటికే నిర్ణయించారు. రెండో విడతలో జనవరి నెలాఖరు నాటికి 40 శాతం పనులు ప్రారంభించాలనే లక్ష్యానికి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
కాళేశ్వరం కార్పొరేషన్ రిజిస్ట్రేషన్కు అనుమతి
♦ రూ. 82.32 లక్షలు చెల్లించడానికి ఉత్తర్వులు ♦ వాటాల్లో 7 షేర్లు మినహా మిగతావన్నీ గవర్నర్ పేరిటే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రీ ఇంజనీరింగ్ చేస్తూ చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అమలు, నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్’ ను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద నమోదు చేయించడానికి అయ్యే రూ.82.32 లక్షల ఫీజును చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు శనివారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో కార్పొరేషన్లో వాటాల అంశాన్ని స్పష్టంగా తెలియజేశారు. కార్పొరేషన్లో మొత్తం నూరు శాతం వాటాలూ ప్రభుత్వానికే ఉంటాయి. రూ.10 ముఖ విలువ కలిగిన రూ.10 కోట్ల షేర్లలో ఏడు షేర్లు మినహా మిగతావన్నీ గవర్నర్ పేరిట ఉండనున్నాయి. మిగతా ఏడు షేర్లు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఈఎన్సీ, ట్రాన్స్కో డెరైక్టర్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ప్రాజెక్టు సీఈ, నీటి పారుదల శాఖ డిప్యూటీ సెక్రటరీ, భూగర్భ శాఖ డెరైక్టర్ పేరిట ఒక్కోటి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రాజెక్టు డిజైన్ మొదలు, ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణ, వినియోగం, నిర్ణీత కాలంలో ప్రాజెక్టు పూర్తి.. తదితర బాధ్యతలన్నీ ఈ కార్పొరేషన్ చూసుకుంటుంది. పూర్తి స్వేచ్ఛతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు దీనికి కల్పించారు. కార్పొరేషన్కు రూ.100 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం సమకూర్చనుండగా, మిగతా నిధులను కార్పొరేషనే సమకూర్చుకోవాల్సి ఉంది. కార్పొరేషన్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నేతృత్వం వహిస్తారు. -
వేగంగా మదింపు.. సత్వరమే పరిహారం!
ముంపు ప్రాంతాల గృహ నిర్మాణ పరిహారంలో కొత్త విధానం ♦ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో శ్రీకారం ♦ గతంలో మాదిరి ఇంటింటి సర్వే విధానానికి స్వస్తి ♦ గుడిసె, మట్టి, మిద్దె తదితర గృహాలుగా విభజించి చదరపు అడుగుకు వెల కట్టి ధర నిర్ణయం ♦ పరిహారంలో జాప్యం నివారణకు ప్రభుత్వ కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణ ప్రక్రియను వేగిరం చేసేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ముంపు ప్రాంతాల్లో గృహాల పరిహారం చెల్లింపు కూడా వేగంగా జరిగేలా నూతన విధానాన్ని తీసుకురానున్నది. గతంలో ముంపు ప్రాంతాల్లో గృహాలపై పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ శాఖల సర్వేలు, విలువను మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లించే విధానం ఉండగా... ప్రస్తుతం గృహ నిర్మాణ రకాన్ని బట్టి చదరపు అడుగును ప్రాతిపదికగా తీసుకొని సత్వరమే చెల్లింపులు చేసేలా సరికొత్త విధానాన్ని తెచ్చేందుకు యోచిస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే 8 రకాల గృహ నిర్మాణాలను గుర్తించి, వాటికి చదరపు అడుగుకు చెల్లించే పరిహారాన్ని నిర్ణయించింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఈ విధానం అమల్లోకి రానుంది. ఆర్అండ్బీ నిబంధనల్లో సడలింపులు సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర ప్రజోపయోగ ప్రాజెక్టుల నిర్మాణంలో గృహాలు కోల్పోయేవారికి చెల్లించే పరిహారం విషయంలో ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ) కొత్త నిబంధనలను రూపొందించింది. గతంలో నీటి పారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు విడివిడిగా నిబంధనలను అమలు చేస్తూ రాగా, కొత్తగా భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొత్త నిబంధనావళి తెచ్చింది. దీని ప్రకారం గృహ నిర్మాణ ప్రాథమిక అంచనా మొత్తం రూ.4 లక్షలు, అంతకంటే తక్కువగా ఉంటే నిర్మాణ వైశాల్యం (ప్లింథ్ ఏరియా) రేట్ల ఆధారంగా లెక్కిస్తారు. ఆ మొత్తం రూ. 4 లక్షల కంటే ఎక్కువగా ఉంటే నిర్మాణం పూర్తి కొలతలు స్వీకరించి ఇంజనీరింగ్ అధికారులు రూపొందించే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు(ఎస్ఎస్ఆర్) ప్రకారం లెక్క గడతారు. అయితే ఇక్కడ ఆర్అండ్బీ శాఖ నిబంధన మేరకు రూ. 4 లక్షల కన్నా తక్కువగా ఉన్న నిర్మాణాలకు, ఎక్కువగా ఉండే నిర్మాణాలకు వేర్వేరు నిబంధనలు తెచ్చారు. ఈ విధానాన్ని పాలమూరు ప్రాజెక్టులో అమలు చేస్తే తీవ్ర జాప్యం జరుగుతుంద ంటూ నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఆర్అండ్బీ నిబంధనల మేరకు పరిహారాన్ని లెక్కించేందుకు రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, అటవీ శాఖల మధ్య సమన్వయం కుదరాలని, అది సమయానుకూలంగా జరగకుంటే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుందని వివరించింది. ఈ దృష్ట్యా రూ.4 లక్ష ల పైచిలుకు ఉన్న గృహ నిర్మాణాలకు సైతం గృహ నిర్మాణ రకాన్ని అనుసరించి ముం దుగా నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా చదరపు మీటర్ చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. అందుకు అనుగుణంగా 8 రకాల గృహ నిర్మాణాలకు చదరపు మీటర్ లెక్కన ధరలను నిర్ణయించింది. కలపకు ధర నిర్ణయం ఇదే సమయంలో నిర్మాణాల్లో వాడే సాధారణ కలప, టేకు కలపకు చెల్లించే ధరలను నీటి పారుదల శాఖ నిర్ణయించింది. సాధారణ కలపతో పోలిస్తే దాదాపు రెట్టింపు ధర టేకు కలపకు చెల్లించేలా ధర నిర్ణయం చేసింది. గృహ నిర్మాణం విలువలో అందులోని కలప విలువ 25 శాతానికి మించితే... ఆ కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 100 శాతం విలువను చెల్లిస్తుంది. ఒకవేళ యజమానే ఆ కలపను తీసుకుంటే దాని విలువలో 40 శాతం మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ కలపను మరోప్రాంతానికి తరలించాలంటే రిహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్(ఆర్అండ్ఆర్) అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. కలప పేరుతో అక్రమంగా పరిహారం పొందకుండా ఈ ఏర్పాటు చేశారు. నీటి పారుదల శాఖ రూపొందించిన ఈ విధానానికి ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపాల్సి ఉంది. -
‘గోదావరి’పై రంగంలోకి దిగండి
♦ ప్రాజెక్టుల పనులను జనవరిలో ప్రారంభించండి ♦ నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం ♦ మహారాష్ట్ర సీఎంకు ఫోన్ ♦ కాళేశ్వరం, తుమ్మిడిహెట్టిల వద్ద బ్యారేజీలతో ముంపు ఉండదని స్పష్టీకరణ ♦ పూర్తి వివరాలు సమర్పించాక ఒప్పందానికి ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు తలపెట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పని కొలిక్కి వచ్చినందున ఇక కార్యరంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నీటిపారుదల శాఖకు సూచించారు. గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల పనులను జనవరిలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని...ప్రాజెక్టుల ద్వారా బీడు భూములకు నీరు అందుతుందనే ఆశతో ఉన్నారని, వారి ఆకాంక్షలకు తగ్గట్లు వేగంగా ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు (ప్రాణహిత-చేవెళ్ల) పనులను ఏకకాలంలో ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. సమీక్షకు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, సీఈలు హరిరామ్, వెంకటేశ్వర్లు, వ్యాప్కోస్ ఎండీ శంభూ ఆజాద్లు పాల్గొన్నారు. కనిష్ట ముంపు.. గరిష్ట నీటి వినియోగం.. ప్రాజెక్టులను కనిష్ట ముంపు-గరిష్ట నీటి వినియోగం పద్ధతిన నిర్మించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీనివల్ల అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణ సమస్యలు ఎక్కువగా ఉండవన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులోనే బ్యారేజీని నిర్మించాలని, ఆదిలాబాద్ జిల్లాకు నీరు పారించడానికి అనువుగా రెండు, మూడు రిజర్వాయర్లకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీని కూడా వీలైనంత తక్కువ ముంపు ఉండేట్లు డిజైన్ చేసినందున వీటికి సంబంధించిన తుది ముసాయిదాలు సిద్ధం చేసి పనులను ప్రారంభించాలన్నారు. ఈ నెలాఖరు వరకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి కార్యచరణ రూపొందించాలని, జనవరిలో పనులు ప్రారంభించాలని సూచించారు. వచ్చే ఏడాది వర్షాలు కురిసేలోగా చాలా పని జరగాలని ఆదేశించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్.. కాళేశ్వరం ప్రాజెక్టు (ప్రాణహిత-చేవెళ్ల)లో భాగంగా బ్యారేజీల నిర్మాణ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఫోన్లో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం వద్ద నిర్మించే బ్యారేజీలు, ప్రాజెక్టు రీ డిజైన్ గురించి ఆయనకు వివరించారు. ఈ బ్యారేజీల నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపు ఉండదని సీఎం స్పష్టం చేశారు. మంత్రి హరీశ్రావు నేతృత్వంలోని బృందం త్వరలోనే మహారాష్ట్రలో పర్యటించి ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. దీనికి ఫడ్నవిస్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ బృందాన్ని తమ వద్దకు పంపాలని, తాము సైతం తమ నీటిపారుదలశాఖ మంత్రి, అధికారులను సిద్ధం చేస్తామన్నారు. -
చివరికి చెన్నై బలి!
♦ నగరంలో 40 శాతం చెంబరబాక్కం నీరే... ♦ ప్రజాపనులశాఖ బాధ్యతారాహిత్యమే కారణం! చెన్నై, సాక్షి ప్రతినిధి : నీటిని అదిమిపడితే ముంచుకొచ్చే ముప్పు.. ఒక్కసారిగా విడిచిపెడితే తలెత్తే విపత్తు.. ఈ రెండింటిపై అవగాహన లేకే చెన్నై చెరువైందా? దీనికి నీటిపారుదలశాఖ ఇంజనీర్లు మాత్రం అవుననే అంటున్నారు. చెన్నై నగరం దాదాపు 40 శాతం మునకకు చెంబరబాక్కం చెరువే కారణమని, అధికారులు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలవల్లే ఈ దుస్థితి దాపురించిందని చెబుతున్నారు. వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.., ఓవైపు పైనుంచి నీరు పోటెత్తుతున్నా పట్టించుకోకుండా చెంబరబాక్కం చెరువులో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరేదాకా చూసి, ఆ తర్వాత అకస్మాత్తుగా నీటిని వదలడంతోనే ఈ విపత్తు తలెత్తిందని చెబుతున్నారు. అకస్మాత్తు నిర్ణయం.. అపార నష్టం చెన్నై ప్రజల దాహార్తిని తీర్చే చెంబరబాక్కం చెరువులో నీటి మట్టం ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో నవంబర్ 16వ తేదీ నుండి ఉపరితల నీటిని వదులుతున్నారు. ఇలా విడుదల చేస్తున్న నీటి ప్రవాహాన్ని క్రమేణా 10 వేల ఘనపుటడుగులకు పెంచారు. ఆ తర్వాత ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టడంతో ఔట్ఫ్లోను సైతం తగ్గించారు. దీంతో పైనుంచి వచ్చే ప్రవాహంతో చెరువు నిండుకుండలా మారింది. అదే సమయంలో ఒక్కసారిగా మరోసారి వరుణుడు విరుచుకుపడ్డాడు. 24 గంటల వ్యవధిలో 49 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నీటిమట్టం ప్రమాదకర స్థితికి చేరడంతో మంగళ, బుధవారాల్లో నీటి విడుదలను అకస్మాత్తుగా పెంచేశారు. దీంతో చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. అనుకోని ముప్పుతో అతలాకుతలం.. అకస్మాత్తుగా ఇళ్లలోకి వరద ప్రవాహం పోటెత్తడంతో ప్రజలు భీతావహులయ్యారు. ప్రాణాలు ఉగ్గపట్టుకుని రక్షించేవారి కోసం ఎదురుచూశారు. బోట్లు, పడవల సాయంతో బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు. విలువైన సామగ్రినిసైతం వదిలి ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అధికారులే ముంచేశారు.. చెన్నైలో జనావాసాల మధ్య నుండి ప్రవహించే అడయారు చెరువులో నీటి మట్టం ఎంత ఉందో అంచనావేయకుండా చెంబరబాక్కం చెరువును కాపాడుకుంటే చాలని ప్రజాపనుల శాఖ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం నగరాన్ని నిలువునా ముంచేసిందని స్థానికులు దుయ్యబట్టారు. చెంబరబాక్కం నుండి ఉరకలు వేస్తూ ప్రవహించిన నీటికి.. వరదనీరు తోడవడంతో నగరంలోని సైదాపేట, తేనాంపేట, ఆలందూర్, కొట్టూరుపురం, అడయారు, కున్రత్తూరు తదితర ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయని ఆరోపించారు. చెంబరబాక్కం చెరువును కాపాడుకోవడం కోసం నగరంలోని లక్షలాది ప్రజలను నిరాశ్రయులను చేశారని, వేలాది ఇళ్లను ముంచేశారని వాపోయారు. అధికారుల బాధ్యతారాహిత్యం: రిటైర్డు ఇంజనీరు చెంబరబాక్కం చెరువు నుండి నీటి విడుదలలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ప్రజాపనుల శాఖ రిటైర్డు ఇంజనీరు ఒకరు వ్యాఖ్యానించారు. చెంబరబాక్కం చెరువు నుండి భారీస్థాయిలో నీటిని విడుదల చేయాలని అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయమే ఈ దారుణానికి కారణమన్నారు. చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాలన్నీ నివాస గృహాలతో చాలా ఇరుకుగా ఉంటాయని, దీనిపై ప్రజాపనుల శాఖాధికారులు అవగాహనారాహిత్యంతో వ్యవహరించడం చె న్నైకి శాపంగా పరిణమించిందని అన్నారు. సహాయ కార్యక్రమాల్లో కొత్త పంథా న్యూఢిల్లీ: తమిళనాడు వరదబాధితులకు కనీస సహాయాన్ని అందించడం కోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) సోషల్ మీడియాను అనుసంధానంగా ఉపయోగించుకుంటోంది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వరద బాధితులను, సహాయం అవసరమైన వారిని గుర్తించే కొత్త ప్రయత్నాన్ని చేస్తోంది. దీని కోసం ఢిల్లీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ సంస్థ. అనునిత్యం ఫేస్బుక్లో, ట్విటర్లను గమనిస్తూ... సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన పోస్టుల విషయంలో స్పందించడమే ఈ విభాగం పని. వరదల్లో చిక్కుకున్న ప్రజల్లో కొంతమంది తమ పరిస్థితిని సోషల్నెట్వర్కింగ్ సైట్ల ద్వారా బాహ్యప్రపంచానికి తెలియజేయగలుగుతున్నారు. తమిళనాడు వరద బాధితుల నుంచి ఎలాంటి పోస్టులు కనిపించినా వాటికి స్పందనగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి పోస్టులు వస్తున్నాయి. వారి సమాచారాన్ని తెలుసుకుని.. చెన్నైలో సహాయ కార్యక్రమాల విధుల్లో ఉన్న బృందాలకు ఆ సమాచారాన్ని అందిస్తోంది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్హెచ్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ పేరుతో సోషల్నెట్వర్కింగ్ సైట్లలో హ్యాష్ట్యాగ్లతో పోస్టులు ప్రచురితం అవుతున్నాయి. సాయానికి సిద్ధం: అమెరికా వాషింగ్టన్: చెన్నై వరదల సహాయకార్యక్రమాల్లో భారత్కు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈ విషయంలో ఇండియా నుంచి సహాయం కోసం ఎలాంటి విజ్ఞప్తి రానప్పటికీ.. మానవతా దృక్పథంతో ఎలాంటి సహాయ చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిఘటిస్తున్నామని, ఇప్పటికీ వరదల్లో చిక్కుకున్న ప్రజల పట్ల సానుభూతితో ఉన్నామని ఆయన అన్నారు. భారత ప్రభుత్వంతో అమెరికన్ గవర్నమెంటు సంప్రదింపులు జరుపుతోందని గురువారం ఆయన ప్రకటించారు. ఇలాంటి విపత్తును ఎదుర్కొన శక్తిసామర్థ్యాలు భారత్కు ఉన్నాయని, నమ్మకమైన మిత్రదేశం కాబట్టి ఇండియా విషయంలో తాము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్డులు, సర్టిఫికెట్లు.. సర్వం పోయాయి చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రతి ఒక్కదానికీగుర్తింపుకార్డు కోరే ఈ రోజుల్లో చెన్నై నగరంలోని ముంపు బాధితులు సర్వం కోల్పోయారు. ఖరీదైన జీవితానికి పేరైన సినీనటీనటులు, దర్శక నిర్మాతల ఇళ్లు సైతం ముంపునకు గురయ్యాయి. ఓటర్, ఆధార్, రేషన్, పాన్ కార్డులు నీట మునిగిపోయాయి. కొందరి ఇళ్లలో అవి మొత్తం కొట్టుకుపోయాయి. ఇప్పుడు నువ్వు ఎవరు? అంటే తాను తానేనని రుజువు చేసుకోవడానికి కావలసిన ‘గుర్తింపు’ కార్డేదీ లేని దయనీయ స్థితిలో చెన్నైవాసులు ఆందోళన చెందుతున్నారు. రేపన్నాక పరిహారం అందాలన్నా, కొత్త ఇళ్లు మంజూరవ్వాలన్నా ఆ కార్డులే ఆధారమైన నేపథ్యంలో వాటిని మళ్లీ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడాలో అన్నది వారి ఆవేదన. ఇక విద్యార్థుల పరిస్థితి అయితే మరీ ఘోరం. ఇన్నాళ్లూ కష్టపడి చదివి సంపాదించుకున్న చాలా మంది విద్యార్థుల సర్టిఫికెట్లు వరదలో గల్లంతైపోయాయి. వాటిని మళ్లీ తెచ్చుకోవడానికి ఎన్ని తంటాలు పడాలో ఆ దేవుడికే ఎరుక! ఇది ఓ కోణమైతే.. మరోవైపు గత నెల 6వ తేదీ నుంచీ వర్షాల వల్ల పాఠశాలలకు, కాలేజీలకూ సెలవులివ్వడంతో సెమిస్టర్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మళ్లీ వాటిని ఎప్పుడు నిర్వహిస్తారో, వాటికి ఎలా ప్రిపేర్ కావాలో అన్న ఆందోళన మరికొందరు విద్యార్థులది. -
రెండు, మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి
♦ నీటిపారుదలశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ ♦ నిర్మాణంలో జాప్యం నివారణకు చర్యలు ♦ పనులకు తగినట్లు చెల్లింపులు ♦ నీటిపారుదల శాఖ ద్వారానే నిధుల ఖర్చు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను రెండు, మూడేళ్లలోనే పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు కృష్ణా నదిపై పాలమూరు, డిండి... గోదావరిపై కాళేశ్వరం, ప్రాణహిత, దుమ్ముగూడెం వంటి పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు వీలుగా ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడాన్ని అత్యధిక ప్రాధాన్యతగల అంశంగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లతో వేగంగా పనులు చేయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, వారికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడానికి అనువుగా బడ్జెట్ కేటాయింపులను నేరుగా నీటిపారుదలశాఖ ఖర్చు పెట్టేలా విధానాన్ని రూపొందించాలని సూచించారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలకు అనేక ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో పాలనాపరమైన జాప్యాన్ని వీలైనంత వరకు తొలగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని, అదే క్రమంలో రైతులకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా భూసేకరణ విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, వేగంగా భూసేకరణ జరుగుతోందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. పనులకు తగినట్లు చెల్లింపులు.. ఏటా రూ. 25 వేల కోట్లను నీటిపారుదలశాఖకు కేటాయిస్తున్నందున ఈ నిధులను పనులు జరుగుతున్నదాన్నిబట్టి నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయకు చెల్లింపులు జరపాలని సీఎం కేసీఆర్ సూచించారు. కాంట్రాక్టర్లను మూడు షిఫ్టుల్లో పనిచేయించడం ద్వారా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్నాది ప్రభుత్వ సంకల్పమన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ఒక శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని, గడువులోగా పూర్తి చేయకుంటే జరిమానా విధించే విధానం ఉండాలన్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లలో ఉత్సాహం, బాధ్యత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్చంద్ర, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ కార్యదర్శులు శివశంకర్ , రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
పనులన్నీ ఏకకాలంలో
♦ 2017 నాటికి గోదావరి ప్రాజెక్టుల నుంచి తొలిదశ సాగునీరు ♦ బ్యారేజీల పనులకు సమాంతరంగా కాలువలు, టన్నెల్, లిఫ్టుల పనులు ♦ శరవేగంగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించండి ♦ మూడు షిఫ్టుల్లో పనులు.. ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపు ♦ సుదీర్ఘ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం ♦ శాఖలో కొత్త పోస్టులు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులన్నీ తొలిదశలో 2017 వర్షాకాలం నాటికి సాగునీరును అందించేలా కార్యాచరణ రూ పొందించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గోదావరిపై ఏకకాలంలో కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి బ్యారేజీలతోపాటు దేవాదులకు నీరందించేలా కొత్తూరు(తుపాకులగూడెం) వద్ద మరో బ్యారే జీ నిర్మాణం జరగాలని సూచించారు. వీటితోపాటు కాలువలు, టన్నెళ్లు, లిఫ్టులు, రిజర్వాయర్ల పనులు కూడా సమాంతరంగా జరగాలని... ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. వీలయితే ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో రైతులంతా రెండు పంటలు పండించి సంతోషంగా ఉండాలన్నదే తన లక్ష్యమని, తెలంగాణ సాధించుకున్న ఫలితాన్ని రైతులు అనుభవించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్దేశ్ పాండే, సీఈలు పురుషోత్తమరాజు, హరిరామ్లతో సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. కాంట్రాక్టర్లు మూడు షిప్టుల్లో 24 గంటల పాటు పనులు చేయించాలని, బిల్లులు కూడా ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మిడ్మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లకు అదనంగా కాళేశ్వరం, ఎల్లంపల్లి, ఇమాంబాద్, అనంతగిరి, గంధమల, బస్వాపూర్, గౌరవల్లి, పాములపర్తి, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా చేపట్టాలన్నారు. రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను కూడా తెలంగాణ అవసరాలకు తగినట్లుగా రూపొందించాలని చెప్పా రు. భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని, ఆయా కలెక్టర్ల వద్ద భూసేకరణ కోసం పరి హారం ఇవ్వడానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నీటి పారుదల శాఖకు ఏటా రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నందున నిధుల కొరత లేదని, పనులు త్వరితగతిన జరగడమే ముఖ్యమని స్పష్టం చేశారు. గోదావరిపై వీలైనన్ని ఎక్కువ బ్యారేజీలు కట్టుకోవడం ఉత్తమమైన మార్గమని సమావేశంలో అంతా అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టర్ల విషయంలో జాగ్రత్త కాంట్రాక్టర్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. టెండర్లను లెస్లో దక్కించుకొని తర్వాత పనులు చేయకుండా వదిలివేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని.. దాంతో ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం లేదని పేర్కొన్నారు. అలాంటి కాంట్రాక్టర్ల విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఓ విధానం రూపొందించాలన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు రెండు శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులంటే ఏళ్లకేళ్లు సాగడం ఆనవాయితీగా మారిందని... తెలంగాణలో రెండు, మూడే ళ్లలోనే పనులు పూర్తయి సాగునీరు అందాలని స్పష్టం చేశారు. కొత్త పోస్టులకు ఆమోదం కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు శ్రీరాంసాగర్ వంటి పాత ప్రాజెక్టులను మెరుగుపరుస్తున్నందున అందుకు అవసరమైన అధికారులను నియమించుకోవాలని సీఎం కేసీఆర్ నీటి పారుదల శాఖను ఆదేశించారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా ఏఈలు, ఏఈఈల నియామక ప్రక్రియ సాగుతున్నందున సీనియర్ అధికారులకు పదోన్నతులు కల్పించాలని సూచించారు. కొత్తగా 108 మంది ఉన్నతాధికారుల పోస్టులను కూడా మంజూరు చేస్తూ ఫైలుపై సంతకం చేశారు. ప్రస్తుతమున్న 14 మంది సీఈలకు తోడుగా మరో 8 మంది, 39 మంది ఎస్ఈలకు అదనంగా ఏడుగురిని, 183 మంది ఈఈలకు తోడుగా 21 మంది, 619 మంది డీఈఈలకు తోడుగా 55 మందిని మంజూరు చేశారు. కొత్తగా 15 మంది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లు, ఇద్దరు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ల పోస్టులను ఇచ్చారు. శాఖపరమైన పదోన్నతుల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. -
‘గుడిసె గృహా’నికి కోటి పరిహారం
♦ జూరాల ముంపుగ్రామం నాగర్దొడ్డి గృహ పరిహార అంచనాల్లో అక్రమాలు ♦ 20 కోట్ల రూపాయల మేర అవకతవకలు ♦ గుడిసెలను గృహాలుగా చూపి తప్పుడు పరిహారాలు ♦ కమిటీ విచారణలో అక్రమాల నిర్ధారణ.. ప్రభుత్వానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: అడ్డగోలు అంచనాలు.. ఇష్టారీతిన పరిహార మదింపు.. అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు అంతా కుమ్మక్కు. వెరసి కోట్లు కొట్టేసేందుకు పక్కావ్యూహం. రూ. 5 లక్షలు కూడా విలువ చేయని గుడిసెల్లాంటి నిర్మాణాలకు ఏకంగా రూ. 20 లక్షల నుంచి కోటి వరకు అంచనాలు రూపొందించారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ముంపు గ్రామం నాగర్దొడ్డిలో ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ గుర్తించిన వాస్తవాలివీ. 148 గృహాల నిర్మాణానికి ఏకంగా రూ.20 కోట్లతో అంచనాలు రూపొందించి పరిహారాన్ని ఫలహారం చేద్దామనుకున్న గుట్టును కమిటీ నిర్ధారించింది. ఇందులో అటవీ, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారుల ప్రమేయం ఉందని తన నివేదికలో బల్లగుద్ది చెప్పింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద మొత్తంగా 11 ముంపు గ్రామాలను గుర్తించారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లా ధారూర్ మండలం నాగర్దొడ్డి గ్రామం ప్రాజెక్టు ముంపుభాగంలోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ మట్టం (ఎఫ్ఆర్ఎల్) నుంచి 100 మీటర్ల పరిధిలోని భూమిని సేకరించాలని ముందుగా నిర్ణయించారు. ఈ పరిధిలోకి వచ్చే గృహాలు, చెట్లు, స్థలాలు, వ్యవసాయ బావులు, ఇతర నిర్మాణాలు ఏవి ఉన్నా వాటికి ప్రభుత్వం నిర్ధారించిన రేట్లతో పరిహారం చెల్లించాలి. ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో.. 100 మీటర్ల పరిధి అన్న నిబంధనను మార్చి మరింత ఎక్కువ పరిధితో లెక్కలుగట్టి పరిహారాన్ని పెంచారు. ఇందు లో భాగంగానే నాగర్దొడ్డిలో 148 నిర్మాణాలను రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖలు ముంపు గృహా లుగా గుర్తించి, పరిహార అంచనాలు సిద్ధం చేశాయి. ఇందులో అధికారులతో పాటు అన్ని పార్టీల నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో దీనిపై గత నెల 18న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. విచారణ నివేదికను ఆర్ అండ్ ఆర్ కమిషనర్ మాణిక్రాజ్ మంగళవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషికి అందజేశారు. గుడిసెకు రూ.కోటి అంచనా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. నాగర్దొడ్డిలో వాస్తవంగా చూపిన గృహ నిర్మాణాలన్నీ అప్పటికప్పుడు, హడావుడిగా ఎక్కువ పరిహారాన్ని కొట్టేసేందుకు వేసినవేనని కమిటీ గుర్తించింది. రూ.లక్ష కూడా విలువ చేయని ఇంటికి పది లక్షలు, పది లక్షల విలువ చేసే ఇంటికి రూ.1.05 కోట్ల వరకు అంచనాలు రూపొందించారు. కొన్ని గృహాల్లో 2 మీటర్లకో పిల్లర్ చొప్పున నిర్మాణాలు చేసినట్లుగా చూపారు. ఇక గృహ నిర్మాణంలో 25-30 శాతం మాత్రమే కలప వాడాల్సి ఉన్నా, 60 శాతానికి తక్కువ కాకుండా వాడినట్లు చూపారు. కొన్ని గృహాల్లో 90 శాతం కలప వినియోగించినట్లు చూపారు. కలపకు అటవీ శాఖ నిర్ణయించిన ధర అధికంగా ఉన్నందునే గుడిసెల్లాంటి నిర్మాణాలకు ఉద్దేశపూర్వకంగా కలపను వాడినట్లు కమిటీ నిర్ధారించింది. పూర్తిగా అతుక్కున్నట్లుగా నిర్మించిన ఈ గృహాల్లోకి వెళ్లడానికి కనీసం మనిషి కూడా పట్టనంత ఇరుకుగా సందుల నిర్మాణం, నివాసానికి యోగ్యం కాని రీతిలో నిర్మించడం సైతం అనుమానాలకు తావిస్తోందని తేల్చింది. ఇలా మొత్తంగా 148 గృహాలకు రూ. 20 కోట్ల పరిహారాలను లెక్కించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ నీటి పారుదల శాఖకు లేఖ రాశారని, దీనికి అనుగుణంగా శాఖ ఈఎన్సీ సైతం సంబంధిత అధికారులకు మెమో జారీ చేసినట్లు చెబుతున్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వండి
♦ కేంద్ర మంత్రి ఉమాభారతికి మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి ♦ {పాణహితకు జాతీయ హోదా ప్రకటించాలని వినతి ♦ మిషన్ కాకతీయ రెండో దశ ప్రారంభోత్సవానికి ఆహ్వానం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఏడు జలవనరుల ప్రాజెక్టులకు వెంటనే నిధులు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరారు. మంగళవారం ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, వినోద్కుమార్, ప్రభాకర్రెడ్డి, నీటిపారుదలశాఖ సలహాదారు విద్యాసాగర్రావు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్లతో కలసి ఉమాభారతితో సమావేశమైన హరీశ్రావు ఈ మేరకు ఆమెకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మిషన్ కాకతీయకు సంబంధించి రూ.428 కోట్లు, నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.978 కోట్లు, మోడికుంట వాగు ప్రాజెక్టుకు రూ.456 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఉమా భారతిని కోరామన్నారు. అలాగే వరంగల్ జిల్లాలో చేపట్టిన చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుకు గత మూడేళ్ల పెండింగ్ నిధులతోపాటు ఈ ఏడాది రావాల్సిన నిధులు మొత్తం రూ.400 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రాజెక్టుకు రూ. 5,887 కోట్ల సవరణ వ్యయంపై కేంద్ర జలవనరుల సంఘానికి పంపిన పరిపాలన మంజూరీని ఆమోదించి నిధులు విడుదల చేయాలని విన్నవించామన్నారు. రాష్ట్రంలో 42 మండలాల్లో భూగర్భ జలాలను పెంచడానికి రూ. 736 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టుకు మంజూరి ఇవ్వాలని కోరామన్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం రెండో దశ ప్రారంభోత్సావానికి రావాల్సిందిగా ఉమా భారతిని ఆహ్వానించినట్టు హరీశ్ చెప్పారు. మిషన్ కాకతీయకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులివ్వాలన్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో చేసిన మార్పుచేర్పులతో కూడిన నివేదికను త్వరలోనే కేంద్రానికి సమర్పించనున్నామని హరీశ్ చెప్పారు. జలవనరుల శాఖ బడ్జెట్ పెంపుపై ప్రధాని మోదీతో మాట్లాడతానని ఉమా భారతి హామీ ఇచ్చినట్లు హరీశ్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను ముందుకు తీసుకెళ్లడం, కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పర సహకార సంబంధాలను మెరుగుపర్చుకోవడం, పెం డింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి త్వరలోనే రాష్ట్ర సాగునీటిశాఖల మంత్రులు, కార్యదర్శులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని ఉమా భారతి చెప్పారన్నా రు. తెలంగాణకు న్యాయమైన నీటి వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కృష్ణా జలాల కేటాయింపు అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను హరీశ్ ప్రస్తావిస్తూ ‘‘ఏడాదిలోపు కేంద్రం నిర్ణయం తీసుకోనప్పడు ఆ ప్రభుత్వం ఇచ్చిన పిటిషన్ను ట్రిబ్యునల్కు పంపాలి. ట్రిబ్యునల్ ద్వారా మళ్లీ నీటి కేటాయింపులు చేపట్టాలని గతంలో తీర్పులున్నాయి. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. గోదాముల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వాలి రాష్ట్రంలో 1,024 కోట్ల వ్యయంతో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములు నిర్మిస్తున్నామని...ఇందుకుగాను తమ ప్రభుత్వానికి 25 శాతం సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ను కలసి కోరినట్లు హరీశ్ చెప్పారు. అలాగే కేంద్రం, రాష్ట్రం ఉమ్మడి భాగస్వామ్యంతో రైతులకు భారం లేకుండా పంట బీమా పథకంలో తక్కువ ప్రీమియం వసూలు చేయాలని, కరువు మండలాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయాలని, రూ. 212 కోట్లు నిధులు విడదుల చేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ కార్యదర్శి బృందా స్వరూప్ను కలసి కోరామన్నారు. -
విపక్షాల నోళ్లు మూయించాం
♦ మిషన్ కాకతీయతో అద్భుత ఫలితాలు సాధించాం: హరీశ్ ♦ మొదటి విడత స్ఫూర్తితో రెండో విడతకు సిద్ధం కావాలి ♦ జనవరి నుంచే పనులకు శ్రీకారం చుట్టాలని అధికారులకు సూచన ♦ సంకుచిత రాజకీయాలకు ప్రభుత్వ చేతలే సమాధానం: ఈటల ♦ 1,200 మంది ఇంజనీర్లతో మిషన్ కాకతీయపై జేఎన్టీయూలో సదస్సు సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అంటూ విమర్శించిన విపక్షాల నోళ్లను మూయించామని సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అనేక జిల్లాల్లో అద్భుత ఫలితాలు సాధించామని చెప్పారు. చెరువుల పునరుద్ధరణ పనులు ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో మంచి ఫలితాలనిచ్చాయన్నారు. కరువు పరిస్థితుల్లోనూ ఖమ్మంలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైందని చెప్పారు. 22 శాతం లెస్కు టెండర్లు ఖరారు కావడంతో రూ.600 కోట్లు, రైతులు పూడిక మట్టిని తరలించుకోవడం ద్వారా మరో రూ.400 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా అయిందని తెలిపారు. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ మొదటి విడత పనుల సమీక్ష, రెండో విడత పనుల సన్నద్ధతపై సోమవారం కూకట్పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో నీటి పారుదల శాఖ సదస్సు నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సూపరింటెండెంట్ అధికారి నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ల వరకు మొత్తం 1,200 మంది ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. మొదటి విడత స్ఫూర్తితో రెండో విడతకు సిద్ధం కావాలని, జనవరి నాటికే అంచ నాలు, అనుమతులు, టెండర్ల ప్రక్రియ ముగించి పనులు ఆరంభించాలని సూచించారు. రెండో విడతకు రూ.2,083 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయలో 411 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మరో 150 మంది రిటైర్డ్ ఇంజనీర్ల సేవలను వినియోగించుకుంటామని వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇంజనీర్లకు మంత్రి ప్రశంసా పత్రాలు అందించారు. కూకట్పల్లికి చెందిన వెంకట్రాంరెడ్డి అనే వ్యక్తి మిషన్కు రూ.2 లక్షల విరాళం ప్రకటించగా.. యాదగిరిగుట్ట అర్చకులు తమ ఒకరోజు వేతనాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. సత్తా చాటాం.. తెలంగాణ సంకల్ప బలం, సత్తా ఎలాంటిదో మిషన్ కాకతీయ ద్వారా మరోమారు ప్రపంచానికి చాట గలిగామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ పాలకులకు పరిపాలించుకునే సామర్థ్యమే కాదు.. రాష్ట్రాన్ని ప్రపంచంలో నంబర్వన్గా నిలిపే సామర్థ్యం ఉందని కేవలం 18 నెలల పాలనతో నిరూపించామని పేర్కొన్నారు. రాజకీయ కుట్రలకు, సంకుచిత రాజకీయాలకు ప్రభుత్వం మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా సమాధానం చెబుతోందన్నారు. ఎవరైనా మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాన్ని విమర్శిస్తే వారు సూర్యుడిపై ఉమ్మి వేసినట్లేనని, వారంతా పాతాళానికి పోతారని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో రైతును ఆదుకునేందుకు ఇప్పటికే రూ.17 వేల కోట్ల రుణమాఫీని ప్రకటించాం. అందులో 50 శాతం మాఫీని పూర్తి చేశాం. వ్యవసాయాన్ని గాడిన పెట్టి రైతులను ఆదుకునేందుకు దీర్ఘ, మధ్యకాలిక వ్యూహాలతో ప్రభుత్వం ముందుకు పోతోంది. ఇందులో భాగంగానే చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటోంది’’ అని అన్నారు. నీటి పారుదల శాఖ పరిధిలో జటిలమైన చట్టాలుంటే వాటిని సరళతరం చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. అవసరమైతే చట్టాన్ని వంద మార్లు అయినా మార్చేందుకు సిద్ధమని, చట్టాల పేరిట అభివృద్ధి ఆగొద్దని సీఎం తమతో పదేపదే అంటారని చెప్పారు. -
రెండో విడత.. 10,355 చెరువులు!
♦ ‘మిషన్ కాకతీయ’లో {పభుత్వ లక్ష్యం ఇదీ ♦ రూ.2,083 కోట్ల ఖర్చు.. జనవరిలోనే పనులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా ఈ ఏడాది 10,355 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రూ.2,083 కోట్ల మేర ఖర్చు చేయనుంది. ఈ పనులను ఎప్పట్లోగా పూర్తి చేయాలన్న దానిపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించింది. మొదటి విడతలో మిగిలిన పనులను మార్చి 31 నాటికి వంద శాతం పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా చేపట్టిన మిషన్లో మొత్తంగా 9,586 చెరువుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోగా.. 8,817 మాత్రమే పనులు చేపట్టారు. మిగతా 769 పనులను రెండో విడతతో కలిపి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. తొలి విడతలో చేసిన పనుల్లో చెరువుల పూడిక తీత పనులు ముగిసినా.. కాలువల మరమ్మత్తులు, వియర్ల నిర్మాణం తదితర పనులు ఇంకా చేయాల్సి ఉంది. అధికారుల లెక్కల ప్రకారం మొత్తంగా రూ.2,200 కోట్ల పనుల్లో రూ.607 కోట్ల విలువైన పనులు పూర్తయ్యా యి. ఇందులో రూ.505 కోట్ల మేర బిల్లులు సమర్పించగా.. రూ.475 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. మరో రూ.1,600 కోట్ల పనులు చేయాల్సి ఉంది. వర్షాకాల సీజన్ ముగిసినందున ఈ పనులను మార్చి నాటికి వంద శాతం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం కాంట్రాక్టర్లు, అధికారులకు నిర్దేశించింది. జనవరి కల్లా పనులు షురూ: లక్ష్యాలను చేరుకునేందుకు ఏయే పనులు ఎప్పట్లోగా పూర్తి చేయాలన్నది చీఫ్ ఇంజనీర్ నాగేంద్రరావు జిల్లాల అధికారులకు వివరించారు. జనవరి 7 నాటికి 40 పనులు, మిగతా 60% పను లు జనవరి 22 నాటికి ప్రారంభం కావాలని నిర్ణయించారు. సరిహద్దులను ఇప్పటి వరకు 3,808 చెరువులకు మాత్రమే గుర్తించగా... మిగతావాటికి మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు. పనుల సత్వర పూర్తి, అంచనాల తయారీ, సాంకేతిక అనుమతుల విషయంలో గతంలో మాదిరే ఈసారి 150 మంది రిటైర్డ్ ఇంజనీర్ల సాయం తీసుకోవాలని చిన్ననీటి పారుదల శాఖ నిర్ణయించింది. చెరువుల కింద పెరిగిన భూగర్భ జలాలు మిషన్ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల కింద గణనీయంగా భూగర్భ జలాలు పెరిగి నట్లు భూగర్భ జల విభాగం తేల్చింది. ఆదిలాబాద్ జిల్లా దిల్వార్పూర్లో 2.8, మెదక్ జిల్లా సిద్ధిపేటలో 0.02, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో 0.69, వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో గరిష్టంగా 6.37, ఖమ్మం జిల్లా సుబ్లేడులో 2.42, నల్లగొండ జిల్లాలోని బి.వెల్లంల చెరువుల కింద 3.08 శాతం మేర భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపింది. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు లేని కారణంగా భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో లేదని శాఖ నివేదిక పేర్కొంది. -
‘ఇందిరమ్మ’ అక్రమాల్లో 2 వేల మందికి జైలే!
రూ. 350 కోట్ల దుర్వినియోగం: హరీశ్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై సీబీసీఐడీ చేసిన ప్రాథమిక విచారణలో రూ.350 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు తేలిందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే 2 వేల మంది జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తే మరింత అవినీతి బయటకి వచ్చే అవకాశం ఉందని హరీశ్ అన్నారు. వారం రోజుల్లో హైదరాబాద్కు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లు తరలిస్తామని పేర్కొన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో మిషన్కాకతీయ పథకం తొలివిడత ఫలాలు అందాయని, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు సాగు చేసినట్లు చెప్పారు. -
పరుగులు పెట్టాలంటే... పైసలివ్వాల్సిందే
♦ ప్రాజెక్టుల్లో పూర్తయిన పనులకు తక్షణం నిధులు చెల్లించాలి ♦ ప్రణాళిక బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో ఆటంకాలు లేకుండా చూడాలి ♦ లక్ష్యం మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఇవి తప్పనిసరి ♦ రాష్ట్ర ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ విన్నపాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలంటే.. అందుకు తగ్గట్లే నిధుల కేటాయింపుతో పాటు వాటి విడుదలలో ఆర్థిక శాఖ సహకారం అవసరమని నీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నొక్కి చెప్పింది. పూర్తయిన పనులకు నిధులు విడుదల చేయడంలో ఆటంకాలు లేకుండా చూడటం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారాల కల్పనలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేసింది. ఆర్థిక సాంత్వన కల్పిస్తేనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయగలమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి కావాల్సిన సహకారంపై నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి వినతితో కూడిన ప్రత్యేక నోట్ను సమర్పించింది. సీఎం సూచనల మేరకే... రాష్ట్రంలో ప్రస్తుతం 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తే వీటి పనులు పూర్తవుతాయి. వీటితో పాటే కొత్తగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటికి మరో రూ.80 వేల కోట్ల మేర నిధులు అవసరం. అలాగే చిన్న నీటి వనరుల కోసం సుమారు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని భావిస్తోంది. ఇందుకు తొలి దశలో ఇప్పటికే రూ.2,600 కోట్ల మేర నిధులు కేటాయించగా, రెండో విడతకు మరో రూ.3 వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. కొత్త ప్రాజెక్టులను పాక్షికంగా అయినా పూర్తిచేయాలని భావిస్తోంది. అయితే నిర్ణీత లక్ష్యం మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఆర్థిక శాఖ సహకారం ఎంతో అవసరం. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ఆర్థిక నివేదికల తయారీ, విధానాల ప్రక్రియను సరళతరం చేయాల్సి ఉంటుంది. పరిపాలనా అనుమతులు, మంజూరు, విడుదలలో ఆటంకాలు లేకుండా చూడాల్సి ఉంటుందని ఇటీవల ప్రాజెక్టులపై సమీక్ష సంసదర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. విధాన ప్రక్రియ సరళీకరణ, ఆర్థిక శాఖ సహకారంపై నోట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించి దానిపై చర్చించాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు నోట్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. నిధుల విడుదలలో ఆటంకాలు ఉండొద్దు.. ప్రాజెక్టులకు నిధుల విడుదలలో ఆర్థిక శాఖ ఎలాంటి ఆటంకాలు కల్పించరాదని నీటి పారుదల శాఖ గట్టిగా కోరుతోంది. సాగునీటి రంగానికి చెందిన ప్రణాళిక బడ్జెట్ను ఎప్పుడు అడిగినా ఇవ్వాలంటోంది. జరిగిన పనులకు జరిగినట్లుగా నిధుల విడుదల చేయాలని కోరుతోంది. సీఈ, ఎస్ఈ, ఈఈ స్థాయి అధికారుల బదిలీలను ప్రతిసారీ ఆర్థిక శాఖకు చెప్పి చేయడం కాక.. వారిని శాఖ పరిధిలోనే మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతోంది. దీంతో పాటే మిషన్ కాకతీయ పనులను డిసెంబర్ లేదా జనవరిలో ఆరంభించేలా కసరత్తు చేస్తున్న దృష్ట్యా, అందుకు అనుగుణంగా చెరువుల పరిపాలనా అనుమతులను నవంబర్ నెలాఖరుకే పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి విన్నవించింది. -
తోటపల్లి దారిలోనే మోతె రిజర్వాయర్!
మోతె రిజర్వాయర్నూ రద్దుచేయాలని ప్రభుత్వ నిర్ణయం {పాణహిత నీళ్లొస్తున్నందున వరద కాల్వ కింద రిజర్వాయర్ అవసరం లేదు.. అధికారులతో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, ఎస్కే జోిషీ సమీక్ష హైదరాబాద్: శ్రీరాంసాగర్ ఇందిరమ్మ వరద కాల్వ పథకంలో భాగంగా ఉన్న తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మోతె రిజర్వాయర్ను కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు దీనిపై నీటి పారుదల శాఖ త్వరలోనే ఉత్తర్వులు సైతం వెలువరించే అవకాశం ఉంది. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా ప్రస్తుతం మిడ్మానేరు వరకు నీళ్లిచ్చే యత్నాలు కొనసాగుతున్నందున అంతకుముందే ఆమోదించిన మోతె రిజర్వాయర్తో పెద్దగా అవసరం లేదన్న భావనతో ప్రభుత్వం ఉంది. ఈ రిజర్వాయర్ల టెండర్లను సైతం ప్రభుత్వం రద్దు చేయనుంది. ఎస్సారెస్పీ ఇందిరమ్మ వరద కాల్వ పథకంలో భాగంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలో సాగునీరు అందించడానికి మిడ్మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్లతో పాటు మోతె, తోటపల్లి, గండిపల్లి రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ఇందులో తోటపల్లి కింద 49 వేల ఎకరాలు, మోతె కింద 20 వేల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. అయితే, మిడ్మానేరు రిజర్వాయర్ ద్వారానే తోటపల్లి నిర్దేశిత ఆయకట్టుకు కూడా నీరిచ్చే అవకాశం ఉండడంతో 2,227 ఎకరాలు, ఆరు గ్రామాలు ముంపునకు గురయ్యే ఈ రిజర్వాయర్ అవసరం లేదని భావించిన ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దీనిపై విపక్షాల నుంచి నిరసనలు కొనసాగుతుండగానే ఎస్సారెస్పీ దిగువన, మిడ్మానేరు ఎగువన 1.6 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించదలిచిన మోతె రిజర్వాయర్ను రద్దు చేయాలని నిర్ణయించడం గమనార్హం. రూ.140 కోట్లతో ఈ రిజర్వాయర్ నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఏళ్లయినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. దీనికి తోడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మెయిన్ కెనాల్ సైతం ఇక్కడి నుంచే మిడ్మానేరు వెళుతుంది. ఆ కెనాల్ల నుంచి డిస్ట్రిబ్యూటరీల ద్వారా మోతె కింది ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా మధ్యలో మోతె రిజర్వాయర్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఎందుకు రద్దు చేశామో చెబుదాం.. కాగా, ఈ నెల 16న లేక 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అఖిలపక్షం ముందు ప్రవేశపెట్టనున్న జల విధానం సందర్భంగా తోటపల్లి, మోతె రిజర్వాయర్ల రద్దుకు సంబంధించిన కారణాలను స్పష్టంగా వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జలసౌధలో జల విధానంపై నాలుగు గంటల పాటు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి సమీక్షించినట్టు తెలిసింది. రీ ఇంజనీరింగ్లో భాగంగా ఎక్కడ రిజర్వాయర్లు అవసరమో, ఎక్కడ అవసరం లేదో వంటి అంశాలతో పాటు, వాటికి గల కారణాలను అన్ని ప్రజల ముందు పెట్టాలని నిశ్చయించారు. ఇదే సమీక్షలో ప్రధానంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో జరుగుతున్న మార్పులు, ప్రాణహిత, ఇంద్రావతి నదులను ఒడిసి పట్టుకునేందుకు ఉన్న అవకాశాలను వివరించేలా అన్ని నివేదికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వ సలహాదారు ఆదేశించారు. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టులను పొరుగు రాష్ట్రాల తో వివాదం లేకుండా ఏ విధంగా రీ ఇంజనీరింగ్ చేస్తున్న అంశాలను జల విధానంలో భాగంగా వివరించాలని నిర్ణయించారు. -
ఇంకా ‘ఉమ్మడి’ జాబితానా?
♦ పదోన్నతుల లిస్ట్పై మండిపడుతున్న నీటి పారుదల ఉద్యోగులు ♦ సీఎం వద్దకు చేరిన ఫైలు ♦ తమకు అన్యాయం జరుగుతోందని జోన్-6 ఉద్యోగుల ఆందోళన ♦ అన్యాయం చేయొద్దని ముఖ్యమంత్రి, సీఎస్లకు వినతి సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల శాఖలో పదోన్నతుల వివాదం ముదురుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పదోన్నతుల అంశాన్ని పరిష్కరించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ వైఖరిపై జోన్-6 ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత శాఖా మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కానరాకపోవడం, ఉమ్మడి రాష్ట్రంలో తయారు చేసిన సీనియార్టీ లిస్టునే అధికారులు ముఖ్యమంత్రి ఆమోదానికి పంపడం ఇప్పుడు ఆ శాఖలో దుమారం రేపుతోంది. అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జోన్-6 ఉద్యోగులు ఈ అంశాన్ని పరిష్కరించాలని రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ శర్మకు వినతులు సమర్పించారు. ఒకవేళ అక్కడా స్పందన లేకుంటే సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నారు. ఇరిగేషన్ శాఖలో జోన్-6 ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతుల వ్యవహారం 2004లో తెరమీదకు వచ్చింది. రాజధాని హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయ ఉద్యోగులు పదోన్నతుల్లో అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ సమస్యను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గిర్గ్లానీ కమిషన్ వేయగా, హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను జోన్ 6 కింద పరిగణించి పదోన్నతులు ఇవ్వాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఇవేవీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇరిగేషన్ విభాగంలో అన్ని స్థాయిల్లో ఇంజనీర్లకు పదోన్నతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సిద్ధం చేసిన పదోన్నతుల అర్హుల జాబితాలో జోన్ 5కు సంబంధించిన ఉద్యోగులే అధికులు ఉన్నారు. ఒకే బ్యాచ్కు చెందిన ఇంజనీర్లు కొందరు ఐదో జోన్లో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో వుంటే, అదే బ్యాచ్కు చెందిన ఇంజనీర్లు ఆరో జోన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్ల స్థాయిలోనే పనిచేస్తున్నారని జోన్-6 ఉద్యోగులు అంటున్నారు. దీన్ని పట్టించుకోకుండా నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో తయారు చేసిన సీనియార్టీ లిస్టునే సీఎం ఆమోదానికి పంపారు. అక్కడ ఆమోదం దక్కితే తమకు మళ్లీ అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలో ఉద్యోగులు సీఎం, సీఎస్లకు ప్రత్యేకంగా విన్నవించుకున్నారు. మళ్లీ అన్యాయం చేయద్దు.. పదోన్నతుల అన్యాయంపై జోన్-6 ఉద్యోగులు సీఎం, సీఎస్లకు ప్రత్యేకంగా లేఖ ద్వారా తమ వినతులు తెలియజేశారు. ‘సీఈఎస్ఈ పదోన్నతులు, ఇన్ఛార్జి నియామకాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీనియార్టీ లిస్టును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా తయారైన జాబితా. గిర్ గ్లానీ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా గతం లో సీనియార్టీ జాబితాను తయారు చేశారు. దీంతో జోన్-5, జోన్-6 ఉద్యోగుల మధ్య విబేధాలకు తెరలేచింది. అత్యున్నత పోస్టులన్నీ జోన్-5 ఉద్యోగులకే వెళ్లాయి. వాటిని ఏవీ సవరించకుండానే ప్రస్తుత పరిపాలనా విభాగపు ఈఎన్సీ అవే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీంతో జోన్-6 ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ఈ దృష్ట్యా గిర్గ్లానీ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఇన్ఛార్జీల నియామకం చేపట్టాలి’ అని వారు కోరారు. -
ధరలు పెరిగితే.. అదనపు చెల్లింపులు
♦ కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు ♦ ‘పాలమూరు-రంగారెడ్డి’లో ప్రవేశపెట్టే అవకాశం సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పటికప్పుడు పెరిగే ధరలకు అనుగుణంగా ధరల సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కాంట్రాక్టర్లకు కల్పించే అంశమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాల మూరు కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న బిడ్ డాక్యుమెంట్లో ఈ వెసులుబాటును నీటి పారుదల శాఖ పొందుపరచగా, దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిజానికి ఇప్పుడు అమలవుతున్న ఈపీసీ విధానంలో సిమెంట్, స్టీలు, ఇంధన ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు కాం ట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయాలనే నిబంధన ఉంది. కార్మికుల వ్యయాన్ని పెంచకూడదనే నిబంధనను ప్రభుత్వం అనుసరిస్తోంది. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో తమకు గిట్టుబాటు కావడం లేదంటూ కాం ట్రాక్టర్లు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. సకాలంలో భూ సేకరణ పూర్తి కాకపోవడం, అటవీ అనుమతులు రాకపోవడంతో మెటీరియల్, లేబర్ ధరలు భారీగా పెరిగి ఆర్ధిక నష్టాలను కలిగిస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ వినతిని పరిశీలించిన నీటి పారుదల శాఖ పాలమూరు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బిడ్ డాక్యుమెంట్లో లేబర్, ఇసుక, కంకర వంటి ఇతర మెటీరియల్కు పెరిగే ధరలకు అనుగుణంగా ధరలను సర్దుబాటు చేయాలనే వెసులుబాటును చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ విధానం ప్రపంచబ్యాంకు, జైకా సహకారంతో జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో మా త్రమే అమల్లో ఉంది. దీన్ని ప్రస్తుతం కొత్తగా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ బిడ్ డాక్యుమెంట్ను న్యాయ, ఆర్థిక శాఖ ఆమోదించాల్సి ఉండగా ఇప్పటికే న్యాయ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆర్ధిక శాఖ దీనిపై పరిశీలన చేస్తోంది.. అక్కడ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ధరల సర్దుబాటు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైనా కారణంతో ఆలస్యం జరిగి, ధరలు పెరిగినా కాంట్రాక్టర్ వెనక్కిపోకుండా ఉండేందుకే ఇలాంటి వెసులుబాటును చేర్చామని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. -
జలవిధానానికి తుది మెరుగులు
అధికారులతో మంత్రి హరీశ్రావు సమావేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో నిర్ణీత వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ నూతన జల విధానం సిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గానికీ లక్ష ఎకరాలకు నీరిచ్చేలా జిల్లాల వారీగా జలవిధానం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి ఉపనదుల్లో లభ్యతగా ఉన్న సుమారు 600 టీఎంసీల నీటి వినియోగం, బ్యారేజీలు, చెక్డ్యామ్లు నిర్మించడమే లక్ష్యంగా జలవిధానం తయారవుతోంది. ప్రాజెక్టుల నిర్మాణం, భూసేకరణ, పరిహారం, చిన్ననీటి వనరుల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు, ఆయకట్టుకు నీటి సరఫరాపై స్పష్టతనివ్వనుంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దీన్ని వివరించనున్నారు. దీని కంటే ముందు సీఎం ఇరిగేషన్ సీఈలు, ఎస్ఈలతో భేటీ అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీశ్రావు బుధవారం అధికారులతో నీటి పారుదల శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. -
అక్కడ కొంటే కాస్త జాగ్రత్త
యథేచ్ఛగా 111 జీవోలో వెంచర్లు, ప్రాజెక్ట్లు {పగతి ఇక్కడేనంటూ నిలువెల్లా ముంచేస్తున్న బిల్డర్లు అసలు నిర్మాణాలే చేపట్టరాదంటున్న జీవో ఎన్నారై అయిన శ్రీధర్.. భాగ్యనగరంలో స్థిరాస్తి కొనుగోలుకు ముందడుగేశాడు. విమానాశ్రయం ఉందనో.. ఔటర్కు దగ్గరుందనో.. మెట్రో రానుందనో.. చెప్పి.. ఫ్లాటో/ప్లాటో కొనకపోతే సువర్ణావకాశాన్ని కోల్పోయినట్టేనని బిల్డర్లు, రియల్టర్లు నమ్మించారు. దీంతో తొందరపడి స్థిరాస్తిని కొనుగోలు చేశాడతను. తీరా చూస్తే.. తాను కొన్న స్థిరాస్తి బయో కన్జర్వేషన్ జోన్ కిందికొస్తుందని.. అసలక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలూ చేపట్టరాదని తెలిసింది. దీంతో ఎటూ పాలుపోలేదు శ్రీధర్కు.. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి సంఘటనలు నగరంలో చాలా మందికి అనుభవమే. ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా అలాంటి సంఘటనలు ఎవరికైనా పునరావృతమవుతాయనేది నిపుణుల సూచన. ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పారిశ్రామిక విధానం, త్వరలో తెరమీదికి రానున్న హౌసింగ్ పాలసీ వంటి వాటితో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెద్ద ఎత్తున రానున్నాయి. దీంతో మళ్లీ భాగ్యనగరంలో స్థిరాస్తికి మంచి రోజులు రానున్నాయి. ఇలాంటి సమయంలోనే రియల్టర్లు అందమైన మాటలతో, కలలోని అభివృద్ధిని అరచేతిలో చూపిస్తూ అక్రమ నిర్మాణాలను కొనుగోలుదారులకు అంటగడతారు. ఇలాంటి పరిస్థితుల్లో 111 జీవో పరిధిలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలను కాపాడేందుకు, నీటి పరివాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలోని 84 గ్రామాలను జీవ పరిరక్షణ ప్రాంతం (బయో కన్జర్వేషన్ జోన్) పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 2006 మార్చిలో ప్రభుత్వం జీవో నంబర్ 111ను విడుదల చేసింది. జీవో పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే-అవుట్లు వేయకూడదని స్పష్టం చేసింది కూడా. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 90 శాతం భూమిని బయో కన్జర్వేషన్ జోన్ కిందికి తీసుకొచ్చారు. మిగిలిన 10 శాతంలో నిర్మాణాలుంటాయి. రెండు చెరువుల్లోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) 10 కి.మీ. చుట్టూ కాలుష్య పరిశ్రమలు, హోటళ్లు, నివాస, వాణిజ్య సముదాయాల వంటి నిర్మాణాలను అనుమతించరు. 84 గ్రామాల్లోని 90 శాతం భూమి రిక్రియేషనల్, కన్వర్జేషన్ కింద ఉంటుంది. మిగిలిన 10 శాతం స్థలంలో గ్రౌండ్+2 అంతస్తుల వరకే అనుమతిస్తారు. ఉల్లంఘనలు జరుగుతున్నదిక్కడే.. జీవో పరిధిలో 10 శాతంలో నిర్మాణాలను అనుమతిస్తారు అంటే దానర్థం.. మాస్టర్ ప్లాన్ ప్రకారం జీవో పరిధిలోని మొత్తం స్థలంలో 10 శాతం భూమన్నమాట. ఇప్పటికే ఇక్కడ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ పట్టణం, 84 గ్రామ కంఠాలు, ఇతర అభివృద్ధి పనులకు స్థలాన్ని కేటాయించారు. అంటే 10 శాతం స్థలం పూర్తయింది. కానీ, రియల్టర్లు ఏం చేస్తున్నారంటే.. 111 జీవో పరిధిలోని ప్రతి లే-అవుట్లో 10 శాతం స్థలాన్ని నివాస సముదాయాలకు కేటాయించొచ్చంటూ బుకాయిస్తున్నారు. ‘ప్రగతి’ ఇక్కడే అంటూ.. దశాబ్దకాలంగా 111 జీవో పరిధిలో సుమారు 5,000కు పైగా అక్రమ నిర్మాణాలు వెలిశాయని అంచనా. నిర్మాణాలే కాదు.. ఇక్కడ లెక్కలేనన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, రెండు మెడికల్ కాలేజీలూ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ అనుమతులు లేవు. ఇదిలా ఉంటే అంతరించిపోతున్న ఔషద మొక్కలు పెంచుతున్నాన ంటూ వేల ఎకరాల్లో రిసార్ట్ను నిర్మించి.. వాటి మధ్యలో రియల్టీ వ్యాపారం చేస్తున్నారు కొందరు రియల్టర్లు. పచ్చని ప్రకృతి మధ్యలో ఆహ్లాదకరంగా జీవించొచ్చని చెబుతూ కొనుగోలుదారులను నిలువునా ముంచుతున్నాయీ సంస్థలు. ఇవే కాదు. 111 జీవో పరివాహక ప్రాంతాల్లో లెక్కలేనన్ని ఫామ్ హౌస్లు, రిసార్టులు వెలిశాయి. ఈ అక్రమ నిర్మాణాలను కొనుగోలు చే సిన వారిలో సామాన్యులే కాదు ఉన్నతోద్యోగులు, ప్రవాసాలూ ఉండటం గమనార్హం. ఇక్కడ ఆకాశహర్మ్యాలు నిర్మించడానికీ అనుమతి లేదు. ఎఫ్ఎస్ఐ (బిల్టప్ స్పేస్ ఏరియా), పరివాహక ప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా) 1:0.5 నిష్పత్తిలో ఉండాలి కూడా. కానీ ఇక్కడ చాలా నిర్మాణాలు జీ+3 అంతస్తులను దాటిపోతున్నాయి. ఎప్పుడో ఒకనాడు ప్రభుత్వం కనక కొరఢా ఝుళిపిస్తే ఈ రియల్టర్ల దగ్గర కొనుగోళ్లు చేసిన సామాన్యులు రోడ్డున పడతారన్నది నిపుణుల మాట. ఇవి చూడాల్సిందే.. ‘బఫర్’ అంటే భయమే.. బఫర్ జోన్ అంటే నీటి పరివాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారన్నమాట. ఉస్మాన్సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్జోన్ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనొద్దు కూడా. ఎఫ్టీఎల్ అంటే జేబు నిల్లే.. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతాన్ని ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అలాగే సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్ఓ), జీహెచ్ఎంసీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పసరండోయ్. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటి లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికుంది. -
పెండింగ్కు సర్కారు బాసట
* ప్రాజెక్టుల పూర్తికి ఆర్థిక శాఖ మద్దతు * నీటి పారుదల శాఖ వినతికి సుముఖం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తమవంతు సహాయం అందించేందుకు ఆర్థిక శాఖ సమ్మతించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నిలిచిపోయిన పనులకు మద్దతుగా నిలవడంతో పాటు, జిల్లాలో 2,500 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.100కోట్ల నిధులను ఇచ్చేందుకు అంగీకరించింది. పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ శాఖ ఫైళ్ల పరిష్కార విషయమై మంగళవారం ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్తో సచివాలయంలో సమావేశమయ్యారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు సైతం హాజరయ్యారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల జైకా, నాబార్డ్, ట్రిపుల్ ఆర్, ఏఐబీపీ, ఎస్సీపీ నిధులతో జరగాల్సిన 96 సాగునీటి పథకాల పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పథకాలను పూర్తి చేస్తే 96వేల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వస్తుందని, వీటికి అవసరమైన భూసేకరణకు నిధులు మంజూరు చేస్తే వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆగిపోయిన పనులకు కాంట్రాక్టులను రద్దు చేసే అధికారాన్ని చీఫ్ ఇంజనీర్లకు కట్టబెట్టాలనే ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. మిగిలిన పనులను కొత్తరేట్లతో అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని, వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఒప్పందాలు చేసుకొని పనులు ఆరంభించాలని సమావేశంలో నిర్ణయించారు. వీటితో పాటే ప్రైస్ ఎస్కలేషన్ జీవో ఆర్థిక శాఖ వద్దకు రాగానే క్లియర్ చేయాలని, తోటపల్లి రిజర్వాయర్ టెండర్ రద్దు ప్రతిపాదన ఫైల్కు ఆమోదం తెలపాలని కోరగా అందుకు సానుకూలత వ్యక్తమైంది. కాగా, ఇదే సమయావేశంలో నాగార్జునసాగర్ పరిధిలో ప్రపంచబ్యాంకు నిధులతో జరుగుతున్న ఆధునికీకరణ పనులపైనా చర్చ జరిగింది. ఈ పనుల తీరుపై ఇటీవల ప్రపంచబ్యాంకు బృందం సంతృప్తి వ్యక్తం చేసిన అంశాన్ని మంత్రి హరీశ్రావు వివరించారు. -
కమీషన్ల గోల !
సాక్షి ప్రతినిధి, గుంటూరు : నీరు-చెట్టు పథకానికి సంబంధించి కమీషన్ల వివాదం ముదురుతోంది. చెరువుల మరమ్మతులు చేసిన జన్మభూమి కమిటీల నుంచి జలవనరుల శాఖ, పే అండ్ అకౌంట్స్ విభాగాల అధికారులు కమీషన్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఆ శాఖలు డిమాండ్ చేసిన కమీషన్లు ఇవ్వకపోతే మరమ్మతులకు సంబంధించిన బిల్లులను పెండింగ్ పెడుతున్నారు. ఆ బిల్లులకు సంబంధించిన వివరాలు లేవంటూ కొర్రీలు వేస్తున్నారు. చెరువులకు అసలు మరమ్మతులు చేయకుండా, తవ్వగా వచ్చిన మట్టిని అమ్ముకుని గ్రామ కమిటీలు కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాయని ఈ శాఖల అధికారుల వాదన. సులభంగా గడించిన ఆదాయంలోనూ తమకు కమీషన్లు ఇవ్వకుండా పొలిటికల్ పవర్ చూపిస్తూ బెదిరించే స్థితికి వచ్చాయంటున్నారు. మొత్తం మీద ఈ కమీషన్ల వివాదం కారణంగా రూ.4 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపులకు నోచుకోలేదు. 330 చెరువుల్లో మెరకతీత పనులు పూర్తి జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద మే నెలలో చెరువుల తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 611 చెరువుల్లో మెరక తీసే పనులను గ్రామ కమిటీలు ప్రారంభించాయి. క్యూబిక్ మీటరు మట్టిని తవ్వినందుకు రూ.29 లను ప్రభుత్వం గ్రామ కమిటీలకు అందజేసింది. దాదాపు 330 చెరువుల్లో మెరక పనులు పూర్తి చేస్తే మిగిలిన చెరువుల్లో తవ్వకాలు అసంపూర్తిగా మిగిలి పోయాయి. సుమారు 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఈ కమి టీలు తవ్వాయి. ఇందుకు రూ.23.20 కోట్లను జన్మభూమి కమిటీలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.15 కోట్ల వరకు గ్రామ కమిటీలకు నగదు చెల్లింపులు జరిగాయి. కొన్ని కమిటీలు ఈ శాఖలు డిమాండ్ చేసిన కమీషన్లు చెల్లిస్తే, మరికొన్ని కమిటీలు తిరస్కరించాయి. కమీషన్లు భారీగా చెల్లించాలంటూ ఈ శాఖల అధికారులు డిమాండ్ చేశారని ఈ కమిటీలు ఆరోపిస్తున్నాయి. ఇతర పనులకు కమీషన్లు ఇలా..సాధారణంగా ఇరిగేషన్శాఖ ఇంజినీర్లు ఇతర కాంట్రాక్టర్ల నుంచి బిల్లు మొత్తంపై 10 నుంచి 12 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారు. ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, డిప్యూటీ ఎస్ఈ, ఆ సర్కిల్ సూపరింటెండెంట్ వరకు వాటాలు ఉంటాయి. ఈ వాటాల పంపిణీ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంది. అసాధారణ లాభాలు .. అయితే నీరు-చెట్టు పథకం పనులు చేపట్టిన అభివృద్ధి కమి టీలకు అసాధారణ లాభాలు వచ్చాయి. తవ్విన మట్టికి క్యూబిక్ మీటరుకు రూ.29లను ప్రభుత్వం నుంచి పొందడమే కాకుండా తవ్విని మట్టిని ఆ గ్రామాల్లోని రైతులకు విక్రయించాయి. ట్రాక్టరు ట్రక్కు రూ.400 నుంచి రూ.600 లకు విక్రయించి అసాధారణ లాభాలు పొందాయి. ఇది బహిరంగ రహస్యం కావడంతో కొందరు ఇరిగేషన్శాఖ ఇంజినీర్లు, పే అండ్ అకౌంట్స్ విభాగ అధికారులు బిల్లుపై అధిక మొత్తంలో కమీషన్ డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శాఖ 20 శాతం కమీషన్ తీసుకుంటే, పే అండ్ అకౌంట్స్ విభాగం 8 నుంచి 10 శాతం కమీషన్ తీసుకుంది. కొన్ని జన్మభూమి కమిటీలు వీరితో వివాదానికి దిగకుండా తమకు వచ్చిన అసాధారణ లాభంలో ఈ కమీషన్ చెల్లించాయి. మరి కొన్ని కమిటీలు ఇంత కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ వివాదానికి దిగాయి. రాజకీయంగా పలుకుబడి కలిగిన కొన్ని జన్మభూమి కమిటీలు ఈ శాఖల అధికారులను బ్లాక్మెయిల్ చేశాయి కూడా. ఈ వివాదం, ఇతర కొర్రీల కారణంగా రూ.4 కోట్ల విలువైన బిల్లులు పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో పెండింగ్లో ఉండిపోయాయి. -
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిరాజ్యం
నెల్లూరు(క్రైమ్) : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది. చేయి తడపందే ఫైళ్లు కదలడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరాలన్నా...ఫించన్ మంజూరు కావాలన్నా... భూమికి పట్టాదారు పాసుపుస్తకం తీసుకోవాలన్నా.. ఇలా ప్రభుత్వ శాఖల్లో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కలెక్టరేట్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. చేయి తడపకపోతే పనుల్లో జాప్యం తప్పదు. నిబంధనలకు అనుగుణంగా అన్నీ సవ్యంగా ఉన్నా దక్షిణ ఇచ్చుకుంటే తప్ప పనులు జరగడం లేదు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వారి అవకాశాలను బట్టి జేబులు నింపుకుంటున్నారు. అవినీతిని అంతమొందించేందుకు ఏర్పాటు చేసిన అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) పనితీరు సైతం అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాలో గడిచిన రెండేళ్లలో కేవలం 21 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జాఢ్యం రేషన్కార్డు నుంచి ఇళ్లపట్టాల వరకు, జనన సర్టిఫికేట్ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం వరకు ఆయా శాఖల సిబ్బందికి చేయి తడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదవీ విరమణ చేస్తున్న సమయంలో వారికి రావాల్సిన నిధులు ఇచ్చేందుకు లంచం ఇవ్వాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం ఇవ్వందే పనికావడం లేదు. లెసైన్సు మొదలు బండి రిజిస్ట్రేషన్ వరకు ఆర్టీవో కార్యాలయ సిబ్బందికి చేయి తడపాల్సిందే. వాణిజ్య పన్నులశాఖలో వసూళ్ల రాజాలు ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ, నగరపాలకసంస్థ, అటవీశాఖ, నీటిపారుదళశాఖ, విద్యుత్, ఉమ్మడి తనిఖీ కేంద్రంలో అవినీతి పతాకస్థాయికి చేరింది. పోలీసు కార్యాలయంలో చేయి తడపందే పనికావడం లేదన్న ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది బాధితులు నేరుగా జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసుస్టేషన్లలో డబ్బులు కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. కానిస్టేబుల్ నుంచి అధికారి వరకు పోలీసు కార్యాలయంలో పనిచేయించుకోవాలంటే అమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిందేననన్న ఆరోపణలున్నాయి. రెవెన్యూ విభాగంలో ప్రతి పనికోరేటు విధించారన్నది బహిరంగ రహస్యమే. ఎక్సైజ్శాఖ మామూళ్లు మత్తులో జోగుతోంది. వైద్యారోగ్యశాఖతో పాటు పలు కార్యాలయాలకు సంబంధించిన కేసుల్లో ఏసీబీ అధికారులు విచారణ ఇంకా పూర్తిచేయలేదు. దీంతో వాటి దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది. నామమాత్రంగా దాడులు... జిల్లాలో కొంతకాలంగా ఏసీబీ తన ఉనిఖి కోసం నామమాత్రపు దాడులతో సరిపెడుతోందన్న విమర్శలున్నాయి. రెండేళ్లు గణాంకాలు పరిశీలిస్తే 2014లో కేవలం 8 ట్రాప్, ఒక ఆదాయానికి మించిన ఆస్తులు, రెండు సర్ప్రైస్ చెక్లకే పరిమితమైంది. 2015లో ఇప్పటి వరకు కేవలం 8 ట్రాప్లు, రెండు సర్ప్రైస్ చెక్లకే పరిమితమైంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పతాకస్థాయికి చేరింది. సుమారు 10నెలలుగా నెల్లూరు ఏసీబీ కార్యాలయం ఇన్చార్జి డీఎస్పీ ఆర్వీఎస్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పనిచేస్తోంది. సిబ్బంది కొరత ఉంది. ఇటీవల ఏసీబీ సిబ్బందిపై పలు అవినీతి, ఆరోపణలు వినిపించాయి. ఇక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది వివిధ ప్రభుత్వ కార్యాలయ అధికారులతో లోపాయకారి సంబంధాలు నెరుపుతూ నెలమామూళ్లు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అందుకు గాను దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీడీ ఉన్నతాధికారులు ఈ ఘటనలపై విచారణ జరపడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. -
పోలీస్ బాస్ వచ్చేశారు
ఇక నెలలో 15 రోజులు ఇక్కడే క్యాంపు కార్యాలయం ప్రారంభం దశలవారీగా ఇతర విభాగాల రాక ఇకపై డీజీపీ జె.వి.రాముడు కూడా నెలలో సగం రోజులు నగరంలోనే మకాం వేస్తారు. బుధవారం ఆయన తన క్యాంపు ఆఫీసును ప్రారంభించి పనుల పురోగతిని పరిశీలించారు. విజయవాడ సిటీ : పోలీస్ బాస్ డీజీపీ జె.వి.రాముడు ఇకపై నెలలో 15 రోజులు ఇక్కడే ఉంటారు. ఇదే విషయాన్ని బుధవారం నగరానికి వచ్చిన ఆయన స్పష్టం చేశారు. వారంలో కొన్ని రోజులు తాను ఇక్కడే అందుబాటులో ఉంటానని వెల్లడించారు. తన క్యాంప్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎస్ఐ ఎదురుగా ఉన్న ఇరిగేషన్ శాఖ ఎస్ఈ బంగళాను డీజీపీ నివాస భవనంగా తీర్చిదిద్దుతున్నారు. పక్కనే ఉన్న ఆఫీసర్స్ క్లబ్ స్థలంలో పోలీసు ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేయాలనేది అధికారుల నిర్ణయం. అనంతరం డీజీపీ క్యాంపు కార్యాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు. చేయలేని పక్షంలో మరొకరికి అప్పగిస్తామని హెచ్చరించారు. ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి, ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో వారికి వివరించారు. వెంటనే ఆయా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. తొలి అడుగు... ఇది తొలి అడుగని, రానున్న రోజుల్లో అన్ని విభాగాలూ దశలవారీగా ఇక్కడికి తరలి వస్తాయని డీజీపీ రాముడు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయం ప్రారంభించిన తర్వాత పోలీసు అతిథి గృహంలో కొద్దిసేపు ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి కమిషనరేట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఎప్పుడో పంపామని, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళతామని చెప్పారు. రాజధాని పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంటుందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో వీటిని అధిగమించనున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసింగ్... స్మార్ట్ సిటీల నిర్మాణంలో పోలీసు శాఖ నుంచి భద్రత కల్పించటం ప్రధాన అంశమని డీజీపీ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పోలీసింగ్కు చర్యలు చేపడతామన్నారు. ఇందులో భాగంగా సీఆర్డీఏ కమిషనర్తో చర్చించనున్నట్టు చెప్పారు. డీజీపీ వెంట నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్, ఐజీలు రాజీవ్కుమార్ మెహతా, సంజయ్, డీసీపీలు ఎల్.కాళిదాస్, జి.వి.జి.అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విజయకుమార్, రైల్వే ఎస్పీ షిమోషీ బాజ్పాయ్ తదితరులున్నారు. -
రూ. లక్ష కోట్లు..!
భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కొత్త వ్యయ అంచనా * అధికారిక లెక్కల ప్రకారమే అవసరమయ్యే వ్యయం రూ.89,426 కోట్లు * రీ ఇంజనీరింగ్ చేసినా ఈ అంచనా దాటకుండా కార్యాచరణ * బడ్జెట్ పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాప్కోస్కు సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి మున్ముం దు భారీ వ్యయ అవసరాలు ఉండనున్నాయి. అన్ని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ.లక్ష కోట్ల మేర అవసరమని ప్రభుత్వం ఇటీవలే నిర్ధారించుకుంది. ప్రాజెక్టుల పరిధిలో జరుగుతున్న రీ ఇంజనీరింగ్ పూర్తి చేసినా బడ్జెట్ రూ.లక్ష కోట్లకు దాటకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే రీ ఇంజనీరింగ్ బాధ్యతలు మోస్తున్న వ్యాప్కోస్ సర్వే సంస్థ, నీటి పారుదల శాఖకు సైతం బడ్జెట్ పరిమితులపై స్పష్టమైన సూచనలు చేసింది. లక్ష్యం చేరాలంటే ‘లక్ష’ కావాల్సిందే.. నిర్మాణ పనులు కొనసాగుతున్న వాటితోపాటు, కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు కలిపి 21 భారీ, మరో 12 మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో రూ.1,31,987.81 కోట్ల పనులకు ఇప్పటివరకు పరిపాలనా అనుమతులు లభించాయి. ఇందులో ఈ ఏడాది మార్చి బడ్జెట్ ముగిసే నాటికి రూ.41,699.54 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది బడ్జెట్లో మరో రూ.5,220.65 కోట్ల మేర కేటాయింపులు జరుపగా ఇందులోనూ రూ. 862.20 కోట్ల వరకు పనులు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ నెల 20 నాటికి జరిగిన మొత్తం ఖర్చు రూ.42,561 కోట్ల మేర ఉండగా మరో రూ.89,426 కోట్ల పనులు మిగిలినట్లుగా ఇటీవల సీఎం వద్ద సమీక్ష సందర్భంగా అధికారులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం రీ ఇంజనీరింగ్లో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చుకుంటుండగా, కంతనపల్లి మరింత ముందుకు జరుగుతోంది. డిండి నిర్మాణానికి ఇటీవలే తుది రూపమిచ్చారు. వీటన్నింటికీ కొత్తగా అంచనా వ్యయాలను కలుపుకుంటే అది మరో రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. వీటితో పాటే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్కలేషన్కు మరో రూ.3వేల కోట్ల మేర అవసరమవుతాయి. వీటన్నింటినీ కలుపుకుంటే తుది అంచనా వ్యయం రూ.లక్ష కోట్లకు ఉంటుందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. వ్యాప్కోస్కు పరిమితి పాఠాలు.. కాగా, ఈ అంచనా వ్యయాన్ని మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ కావొద్దని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే రీ ఇంజనీరింగ్లో భాగంగా జరుగుతున్న మార్పులు చేర్పుల్లో ప్రభుత్వం కీలక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కువగా ముంపు లేకుండా చూసుకోవడం, ఎత్తిపోతల విధానాన్ని పక్కనపెట్టి గ్రావిటీ ద్వారా నీరిచ్చే అంశాలకు ప్రాధాన్యమివ్వడం, టన్నెల్ల అవసరాన్ని తగ్గించడం వంటివి చేస్తోంది. ఎత్తిపోతలుగా ఉన్న డిండి ప్రాజెక్టును ఇటీవలే పూర్తి గ్రావిటీ ప్రాజెక్టుగా మార్చగా, పాలమూరు-రంగారెడ్డిలో టన్నెల్ విధానాన్ని తగ్గించి ఓపెన్ ఛానల్ విధానానికి కార్యరూపం ఇచ్చారు. ప్రాణహిత, కంతనపల్లి, ఎల్లంపలి సహా ఇతర బ్యారేజీల నిర్మాణం విషయంలోనూ ఇదే తరహా సూత్రాన్ని అమలు చేసి ప్రాజెక్టుల డిజైన్ చేయాలని వ్యాప్కోస్ సర్వే సంస్థకు ప్రభుత్వం సూచనలు చేసింది. -
‘రాజీవ్ సాగర్’ను పూర్తి చేస్తాం..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు జిల్లాలు సస్యశ్యామలం లక్షల ఎకరాలకు సాగునీరు అశ్వాపురం : ఖమ్మం, నల్లగొండ జిల్లాలను సస్యశ్యామలం చేసే దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ను త్వరలోనే పూర్తి చేస్తామని రోడ్లు, భవనాలు, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అమ్మగారిపల్లి పంచాయతీ పరిధిలోని పాములపల్లి వద్ద నిర్మిస్తున్న దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ను మంత్రి తుమ్మల, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ ఆంధ్రాలో కలిసిందని, దీంతో తెలంగాణలోని దుమ్ముగూడెం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తయూరు చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయూంలో నిధులు వృథా అరుు.. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దాని డిజైన్ మార్చి.. కోట్ల వ్యయంతో పనులు చేసి సాగు, తాగునీరు అందిస్తామన్నారు. దీంతో రెండు జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ను త్వరలోనే సీఎం కేసీఆర్ పరిశీలించి ప్రాజెక్ట్ విధివిధానాలు ఖరారు చేస్తారన్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతలతో కలిసి పరిశీలించేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మువ్వావి జయబాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, చర్ల మార్కెట్ చైర్మన్ దుర్గాప్రసాద్, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ శంకర్నాయక్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, అశ్వాపురం సీఐ సాంబరాజు, తహసీల్దార్ అంజం రాజు, ఎంపీడీఓ కె.శ్రీదేవి, టీఆర్ఎస్ నాయకులు కందుల కృష్ణార్జున్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిటికెన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యాన్ని సహించను : తుమ్మల భద్రాచలం నుంచి సాక్షి బృందం : ‘జిల్లాలోని ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. ప్రజలకు పట్టెడన్నం పెట్టేది రైతాంగమే. నీరు లేకుంటే రైతులు ఏం చేస్తారు. కోట్లాది రూపాయలు వెచ్చించినా పనులు పూర్తికాకపోతే ప్రయోజనం ఏమిటి’ అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. భద్రాచలంలో పుష్కర ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఐబీ ఈఈ రాములు అక్కడ ఉండటంతో ‘ఈఈ గారు.. పాలెంవాగు ప్రాజెక్టు పనులు ఎక్కడ వరకు వచ్చాయి. ఏం పనులు చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల తీరు మారడం లేదు. కాంట్రాక్టర్లు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏమిటీ వ్యవస్థ’ అంటూ ప్రశ్నించారు. పాలెంవాగు గేట్ల ఏర్పాటు విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. త్వరలో పనులు పూర్తికాకపోతే జరిగే పరిణామాలకు కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పుష్కరాల తర్వాత జిల్లా పాలనపై దృష్టి సారిస్తానని, కాంట్రాక్టర్లతోనే ప్రక్షాళన ప్రారంభిస్తానని హెచ్చరించారు. పుష్కరాల తర్వాత గోదావరి స్నానఘట్టాలకు రంగులు వేయాలని ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్కు సూచించారు. -
6 వేల చెరువుల్లోనే ‘మిషన్’!
9,577 చెరువుల పునరుద్ధరణ లక్ష్యం ఎండమావే అనుమతులు, ఒప్పందాల జారీలో జాప్యమే కారణం జూన్ వరకు 6 వేల చెరువుల పనులు చేయాలని ప్రభుత్వ యోచన మిగతా 3 వేల చెరువుల పనులు వచ్చే ఏడాదిలోనే మొదలు హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులు ఈ ఏడాది నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించట్లేదు. మరో 10-15 రోజుల్లో వర్షాకాలం మొదలు కానుండటంతోపాటు పరిపాలనా అనుమతులు పొందిన చెరువులకు ఒప్పందాలు కుదిరి పనులు జరగడం సాధ్యమయ్యేలా లేదు. దీంతో ఇప్పటివరకూ కుది రిన ఒప్పందాల మేరకైనా జూన్లోగా ఎంత వీలైతే అంత పని పూర్తి చేయాలని, మిగతా పనులను వచ్చే ఏడాది ప్రారంభించాలని చిన్న నీటిపారుదలశాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో మొత్తంగా గుర్తించిన 46,531 చెరువులకుగానూ ఈ ఏడాది 9,577 చెరువుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకోగా అంచనాల తయారీ, పరిపాలనా అనుమతులు, ఒప్పం దాల ప్రక్రియలో జరిగిన జాప్యం కారణంగా పనులు ఫిబ్రవరి వరకు మొదలుకాలేదు. దీంతో మొత్తం లక్ష్యంలో ఇప్పటివరకు 7,879 చెరువులకు మాత్రమే పరిపాలనా అనుమతులు లభించగా, ఇందులో 6,261 చెరువులకు మాత్రమే కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాయి. ఇందులో 5,557 చెరువుల్లో పనులు మొదలయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 82 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి. హడావుడి పనులతో లక్ష్యానికి విఘాతం ప్రస్తుతం ఒప్పందాలు కుదుర్చుకున్న చెరువుల్లోనే మరో 704 పనులను త్వరితగతిన ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం పనులు మొదలు పెట్టినా జూన్లో వర్షాలు మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ హడావుడిగా పనులు చేసినా, అది ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా అనే సందేహం కూడా కలుగుతోంది. ప్రస్తుతం పనులు జరుగుతున్న చెరువుల పరిధిలో పూడికతీతతోపాటు కట్టు కాల్వల మరమ్మతులు, అలుగు పనులు చేయాల్సి ఉంది. ఇంకా ఆ పనులు చాలా చెరువుల పరిధిలో పూర్తి కాలేదు. అయితే జూన్ మొదటివారం నుంచే వర్షాలు మొదలైనా భారీ వర్షాలు కురిసేందుకు సమయం పడుతుందని, ఈలోగా వీలైనన్ని ఎక్కువ పనులు చేసేలా కసరత్తు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. అదే నిజమైనా మొత్తంగా 6 వేల చెరువులకు మించి ఈ ఏడాది చెరువుల పునరుద్ధరణ సాధ్యం కానందున అంతవరకు లక్ష్యాన్ని చేరుకోవాలని నీటిపారుదలశాఖ యోచిస్తోంది. మిగతా 3,500 చెరువుల పనులను వచ్చే ఏడాదే చేపట్టాలని భావిస్తోంది. ఖమ్మం ఫస్ట్.. మహబూబ్నగర్ లాస్ట్ ఇప్పటికే పునరుద్ధరణ ప్రారంభమైన చెరువుల్లో మొత్తంగా 70 శాతం పనులు పూర్తైట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో కృష్ణా బేసిన్ పరిధిలో 63 శాతం, గోదావరి బేసిన్లో 78 శాతం పనులు పూర్తైట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 90 శాతం పనుల పూర్తితో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉండగా 55 శాతం పనుల పూర్తితో మహబూబ్నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. -
దారి కాచిన తమ్ముళ్లు
►అవినీతి బయటకుండా ఉండేందుకు పథకం ►విజిలెన్స్ అధికారులను ప్రసన్నం చేసుకునే యత్నం ►కాళంగి, స్వర్ణముఖి నదిలో పొర్లుకట్టల నిర్మాణాల్లో అవినీతి సాక్షి ప్రతినిధి, నెల్లూరు : స్వర్ణముఖి.. కాళంగి నదిలో ఏర్పాటు చేసిన పొర్లుకట్ట పనుల్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు చేపట్టిన పొర్ల్లుకట్టల పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చి కోట్ల నిధులు దుర్వినియోగం చేశారానే ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు.అందులోభాగంగా మంగళవారం సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న తమ్ముళ్లు అవినీతి బాగోతం బయటపడకుండా ఉండేందుకు విజిలెన్స్ అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.కోట్ల నిధులతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. పనులను ఎక్కువ శాతం టీడీపీకి చెందిన నేతలే బినామీ పేర్లతో చేపట్టినట్లు సమాచారం. ప్రపంచబ్యాంక్ నిధులతో స్వర్ణముఖి, కాళంగి, చెరువు పనులు చేపట్టారు. నదిలో చేపట్టిన పొర్లకట్టల పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. స్వర్ణముఖి, కాళంగి నది కుడి, ఎడమవైపున గ్రావెల్, మట్టితో కట్టలా పోసి లెవల్ చేయాల్సి ఉంది. అయితే టీడీపీ నేతలు చేపట్టిన పొర్లకట్ట పనుల్లో నదిలోని ఇసుకనే తీసి కట్టలా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దానిపై మట్టిచల్లి భారీ ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ జిల్లా కార్యదర్శి ఒకరు రూ.2 కోట్ల పనులు చేపడితే.. అందులో రూ.కోటి వరకు నిధులు స్వాహా చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఓ ముఖ్యనాయకుడొకరు రూ.10 కోట్లు విలువచేసే వివిధ పనులు చేపట్టారు. అందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా జిల్లాలో చేపట్టిన 127 చెరువులకు ఖర్చుచేసిన రూ.90 కోట్ల నిధులు సైతం భారీఎత్తున దుర్వినియోగం అయినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో తమ్ముళ్లు పొర్లకట్టలు.. చెరువు పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ మనోహర్, అడిషనల్ డెరైక్టర్ శ్రీనివాస్, రీజినల్ ఏఎస్పీ రాంప్రసాద్, డీఈ సుధాకర్, నీటిపారుదలశాఖ ఎస్ఈ రెడ్డెప్ప తదితరులు మంగళవారం నాయుడుపేట పరిధిలోని గ్రద్దగుంట చెరువు, స్వర్ణముఖి నదిలో చేపట్టిన పొర్లకట్టల పనులు, ఓజిలి మండలపరిధిలోని చెరువు పనులను పరిశీలించారు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న టీడీపీ నేతలకు చెందిన రెండు బృందాలు నాయుడుపేట పరిధిలో ఎదురుచూడటం కనిపించింది. అయితే అధికారులు వారు వేచి ఉన్న ప్రాంతం వైపు నుంచి కాకుండా వేరొకమార్గం నుంచి వెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న తమ్ముళ్ల బృందం వారు ఎక్కడ ఏ పనులు పరిశీలిస్తున్నారో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కా గా విజిలెన్స్ అధికారులు పనులు నాశిరకంగా జరి గిన ప్రాంతంలో కాకుండా మెరు గ్గా ఉన్నచోట్ల పరి శీలించడం స్థాని కులను ఆశ్చర్యానికి గురిచేసింది. -
దాళ్వా ఉన్నట్టా? లేనట్టా?
టీడీపీ నేతలు, అధికారుల దాగుడుమూతలు నీరివ్వలేమంటున్న నీటిపారుదలశాఖ ఎస్ఈ స్పష్టత లేక రైతుల్లో ఆందోళన టీడీపీ నేతలు, అధికారులు మధ్య సమన్వయ లోపంతో చేస్తున్న ప్రకటనలతో దాళ్వా సాగుపై రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. రబీలో దాళ్వాకు సాగునీరందిస్తామని మంత్రులు దేవినేని, కామినేని , టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు హామీలిస్తుండగా... నీటిపారుదల శాఖ ఎస్ఈ రామకృష్ణ మాత్రం నీటి విడుదలకు అసలు అవకాశమే లేదంటున్నారు. దాళ్వాపై ఇంతవరకూ స్పష్టమైన ప్రకనటన చేయకపోవడ ంతో జిల్లా రైతులు కలవరపాటుకు గురవుతున్నారు. చల్లపల్లి : ఈ ఏడాది ఖరీప్సాగు నెలరోజుల ఆలస్యంగా ప్రారంభమయిన విషయం విదితమే. దీనికితోడు దోమపోటు వరిపొలాలను చుట్టేసింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో దాళ్వాకు అనుమతిస్తే దానిద్వారానైనా నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆశపడుతున్నారు. మంత్రులు, ముఖ్య అధికారులు పొంతనలేని ప్రకటనలు చేస్తుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు నీరిస్తామని చెబుతున్నా... ఇప్పటికే తన పరిధిలో 54 టీఎంసీల సాగునీటి కొరత ఉందని, దాళ్వాకు నీరు విడదల చేసే అవకాశం లేదని నీటిపారుదలశాఖ ఎస్ఈ రామకృష్ణ శుక్రవారం ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో సార్వా వరికోతలు ప్రారంభమయ్యాయి. దాళ్వా అదునుకు విత్తనాలు జల్లుకోవడం, వరినారు పోసుకోవడం చేయాలి. అయితే పరిస్థితులను గమనిస్తుంటే ఈ ఏడాది జిల్లాలో చాలా తక్కువ ప్రాంతంలో మాత్రమే దాళ్వాకు అనుమతిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది జిల్లాలో 2.80లక్షల ఎకరాల్లో దాళ్వాసాగుకు అనుమతిచ్చారు. ఈ ఏడాది ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టంగా తేలేవరకు రైతులకు ఆందోళన తప్పదు. దాళ్వా రైతును ఆదుకోవాలి... ఈ ఏడాది ఖరీప్సాగు ఆలస్యం కావడం, వరికి చీడపీడలు తీవ్రస్ధాయిలో ఆశించడం, దోమపోటు ఎక్కువ కావడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది దిగుబడులు తీవ్రస్ధాయిలో తగ్గిపోతాయని రైతులు చెబుతున్నారు. గత ఏడాది మూడుసార్లు తుపాన్లు, వాయుగుండాల గాలులకు జిల్లాలో భారీగా దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు చాలానష్టపోయారు. గతంలో దాళ్వా సాగుచేసిన రైతులు ఖరీప్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకున్నారు. దాళ్వాగా వరి లేదంటే మొక్కజొన్న వేసేందుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది జిల్లాలో 90వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అనధికారింగా మరో పదివేల ఎకరాలు ఎక్కువగానే ఉంటుంది. మొక్కజొన్న సాగుచేసిన రైతులు ఎకరాకు రూ.20వేల నుంచి 35వేల వరకూ లాభాలు గడించారు. ఈ దృష్ట్యా ఈ ఏడాది దాళ్వాకు అనుమతివ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
చెరువులపై చిన్నచూపు
ఏలూరు : జిల్లాలో చిన్నతరహా సాగునీటి చెరువులు ప్రక్షాళనకు నోచుకోవడం లేదు. గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద వీటిని అభివృద్ధి చేసినట్టు చెబుతున్నా.. ఎక్కడా అవి బాగుపడిన పరిస్థితి కనిపించడం లేదు. ఉపాధి హామీ పనులపై పర్యవేక్షణ కొరవడటంతో ఈ దుస్థితి తలెత్తింది. జిల్లాలో 1,406 చిన్నతరహా సాగునీటి చెరువులు ఉండగా, వీటికింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువులు కుచించుకుపోవడంతో రైతులు ఏటా సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువుల అభివృద్ధిని నీటిపారుదల శాఖ గొడుగు కిందకు తీసుకొచ్చారు. మొత్తం చెరువులను మూడు రకాలుగా విభజించి, వాటి అభివృద్ధికి రూ.200 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రతిపాదనలు పంపించారు. మూడురకాల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ (రిపేర్స్, రెనోవేషన్, రెస్టోరేషన్) పథకం కింద 40 హెక్టార్ల కన్నా తక్కువ ఆయకట్టు ఉన్న చెరువులను అభివృద్ధి చేస్తారు. దీనికింద రూ.32 కోట్లతో 92 పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రపంచ బ్యాంక్ స్కీమ్-2 కింద రూ.8.50 కోట్లతో 105 పనులను చేపట్టాలని ప్రతిపాదించారు. మూడో విధానంలో ఉపాధి హామీ పథకం కింద మిగిలిన చెరువులను అభివృద్ధి చేయడానికి రూ.160 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ పథకంలో 40 హెక్టార్ల కన్నా తక్కువ ఆయకట్టుకు నీరందించే చెరువులను పునరుద్ధరించాల్సి ఉంటుంది. చెక్డ్యామ్లు, ఇతర నిర్మాణాలు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో, కూలీలతో చేపట్టే పనులు డ్వామా ఆధ్వర్యంలో చేపట్టేలా ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ నిధులు దశలవారీగా మూడేళ్లలో విడుదల అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ పథకం విషయంలో చెరువుల అభివృద్ధి పారదర్శకంగా జరుగుతుందా, చెరువును తవ్వినా నీరు నిల్వ సామర్థ్యం ఉంటుందా అనే అనుమానాల నేపథ్యంలో నిధులు విడుదల చే సేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. ఏదేమైనా పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. -
కాలుష్య కాసారం
ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తున్న గుంటూరు ఛానల్ (కాలువ) కాలుష్యంతో నిండి పోతోంది. ప్రజారోగ్యానికి హాని కలిగిస్తోంది. గుర్రపు డెక్క, చెత్త చెదారంతో పాటు మురుగు నీరు కలిసి ఛానల్ పూర్తిగా కలుషితమవుతోంది. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్య ఫలితమే ఛానల్కు ఈ దుస్థితి దాపురించిందనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. చినకాకాని(మంగళగిరి రూరల్): కృష్ణా జలాలను మోసుకు వచ్చే గుంటూరు ఛానల్ తాడేపల్లి వద్ద ప్రారంభ మై గుంటూరు వరకు వెళుతోంది. దాదాపు 27 కిలోమీటర్ల విస్తరించి తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు రూరల్ మండలాలకు తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తోంది. ప్రధానంగా మంగళగిరికి సమీపంలోని ఆత్మకూరు, చినకాకాని, కాజ వరకు ఛానల్లోకి వ్యర్థాలు చేరుతుండడంతో కలుషితమవుతోంది. మంగళగిరి మునిసిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల నుంచి వచ్చే చెత్తాచెదారం, మురుగు నీరు సైతం ఈ ఛానల్లోనే కలుస్తున్నాయి. ఏటా ఛానల్లో పేరుకుపోతున్న గుర్రపుడెక్కను అధికారులు మొక్కు బడిగా తొలగిస్తున్న కారణంగా వర్షాకాలంలో గండ్లు పడి పంట పొలాలు మునిగిపోతున్నాయి. 47 గ్రామాలకు దాహార్తి తీరుస్తూ... గుంటూరు ఛానల్ 47 గ్రామాల దాహార్తి తీరుస్తోంది. దీని ద్వారానే గ్రామాల్లోని చెరువులు నిండుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాల ద్వారా నిత్యం తాగునీటి సరఫరా జరుగుతోంది. అంతేకాక, నాలుగు మండలాల్లోని సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతోంది. ఇలా తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తున్న గుంటూరు ఛానల్ నిత్యం కాలుష్యంతో నిండి వుంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కాలుష్యం పెరుగుతోందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి పట్టణం నుంచి మురుగు మంగళగిరి పట్టణం నుంచి వచ్చే మురుగు నేరుగా గుంటూరు ఛానల్లో కలుస్తోంది. దీంతో పంట కాలువ కాస్తా మురుగు కాలువగా మారుతోందని రైతులు వాపోతున్నారు. మండలంలోని చినకాకాని ఎన్నారై ఆసుపత్రి ఎదుట నుంచి మునిసిపాలిటీకి చెందిన మురుగు, చెత్తాచెదారం సైతం గుంటూరు ఛానల్లో కలసిపోతోండటంతో తాగునీరు కలుషితమై వ్యాధులు సోకుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాలు కలవకుండా చూడాలి... గుంటూరు ఛానల్లో వ్యర్థాలు కలవకుండా నీటి పారుదల శాఖ, డ్రైనేజి శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రజల దాహార్తి తీరుస్తూ, పొలాలకు సాగునీరు అందిస్తూ ఎంతో ఉపయోగ పడుతున్న కాలువను శుభ్రపరిచి కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. - కె.శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు, చినకాకాని పంట పొలాలు సైతం మునిగిపోతున్నాయి... వర్షాకాలంలో డ్రైనేజి నీరు ఛానల్లో కలవడంతో పంట పొలాలు సైతం మురుగునీటిలో మునిగిపోయి రైతులు నష్టపోతున్నారు. తాగునీరు సైతం కలుషితమయంగా మారడంతో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. - మర్రి వెంకటేశ్వరరావు, రైతు, చినకాకాని -
నాలాపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్ను
నాలాపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్నుపడింది. కబ్జాకు పథక రచన చేస్తోంది. వీరి పన్నాగం విజయవంతమైతే.. నీటితో కళకళలాడాల్సిన 5 కుంటల ఉనికి సమీప భవిష్యత్తులో ప్రశ్నార్థకం కానుంది. దీంతో ఇక్కడి పంట పొలాలు ఎడారిగా మారి.. వందలాది రైతుల జీవనాధారం ఛిద్రమయ్యే పరిస్థితి నెలకొంది. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రియల్టర్ల అక్రమాలతో నాలా నామరూపాల్లేకుండా కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. ఇటీవలే ప్రారంభమైన నాలా కబ్జా వ్యవహారాన్ని తక్షణం అడ్డుకోకపోతే ఎంతో మంది రైతుల ఉపాధికి ప్రమాదం వాటిల్లడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటే ముప్పు పొంచి ఉంది. కుంటలు మూసుకుపోతే జాలర్ల జీవితాలపై కూడా పెను ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలంలోని రాయ్పోల్ గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న సాకలామెకుంట ప్రధాన నాలాను కొంతమంది రియల్టర్లు మూసివేసేందుకు యత్నిస్తున్నారు. నాలాకు కొనసాగింపుగా ఉన్న కాల్వను ఇప్పటికే పెద్దపెద్ద బండరాళ్లతో దిగ్బంధనం చేశారు. సాకలామెకుంట నాలాను మూసేస్తే.. ఈ నాలా నుంచి పారే నీటితోనే నల్ల కంచె, ఎర్ర కంచె, మొగుళ్లవంపు కుంట, దిల్వానికుంట, పెద్దకుంట తదితర కుంటల్లోకి చుక్క నీరు కూడా చేరదు. మారిన రూపురేఖలు కిలో మీటర్ల మేర ఉన్న నాలా స్వరూపం ప్రస్తుతం పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. నాలా పరీవాహక ప్రాంతంలో తీవ్రంగా శ్రమిస్తే తప్ప దీని ఉనికిని కనిపెట్టడం సాధ్యం కాదు. ప్రారంభంలో 20 అడుగుల పొడవు ఉండే నాలా ప్రస్తుతం 2 అడుగుల మేర కుంచించుకుపోయింది. 15 అడుగులు మేర ఉండాల్సిన నాలా 5 అడుగుల వరకు కుదించుకుపోయింది. ఓ వైపు నాలా మూసివేతలు మరోవైపు కొరవడిన నిర్వహణ లోపం.. భారీ వర్షాలు కురిసినా వీటిలోంచి నీరు పారని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన జలాశయం తట్టిఖానా చెక్డ్యాం వరకు ఉన్న నీటి కుంటలకు నీరందించే ప్రధాన నాలాను చెడగొట్టి రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు కొంతమంది అడ్డుకొని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తులు నాలాను ఆధునికీకరించే పనులు చేపట్టారు. అయితే నాలాకు అంతర్గతంగా ఉన్న కాల్వను మాత్రం యథేచ్ఛగా మూసివేసే కార్యక్రమం కొనసాగుతోంది. దీన్ని యథాతథంగా పునరుద్ధరిస్తే స్థానిక రైతులకు ఊరట కలుగుతుంది. అధికారుల స్పందనపైనే రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎటువంటి సమాచారం అందలేదు.. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్ను వివరణ కోరగా.. నాలా కబ్జాకు సంబంధించి మాకు ఎలాంటి సమాచాం అందలేదు. కబ్జా వివరాలు వీఆర్వోలు చూసుకోవాలి. నాలా వివరాలు విలేజ్ మ్యాప్లో ఉంటాయి. సర్వేనంబర్ తదితర అంశాలు రెవెన్యూ రికార్డుల్లో ఉంటాయి. అయినా కూడా మేం పరిశీలిస్తాం. నాలాల మూసివేతకు సంబంధించి ఎలాంటి వివరాలు తమ దృష్టికి రాలేదని తహసీల్దార్ వెంకట ఉపేందర్రెడ్డి అన్నారు. ఆక్రమణలు జరిగితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ముంపునకు కళ్లెం!
సుదీర్ఘకాలంగా రెండు నియోజకవర్గాల ప్రజలను ‘ముంపు'తిప్పలు పెడుతున్న కొండవీటి వాగు ఆగడాలకు కళ్లెం వేసే దిశగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మంగళగిరి, తాడికొండ ప్రాంత రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న వాగు వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చేసిన సూచనలను పరిగణలోకి తీసుకున్న నిపుణుల కమిటీ ఎట్టకేలకు శనివారం హైదరాబాద్లో సమావేశమైంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు : కొత్త రాజధానిని కొండవీటివాగు వరద ముంచెత్తకుండా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఇరిగేషన్ శాఖ ఉన్నతస్థాయి సమావేశం శనివారం హైదరాబాద్లో జరిగింది. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 20 వేల హెక్టార్లలో పంటను కొండవీటి వాగు వరద నుంచి కాపాడడమే కాకుండా కొత్త రాజధాని తాగు నీటి అవసరాలు తీర్చాలని ఈ కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఇందుకు మూడు లేక నాలుగు చెరువుల్లో నీటిని నిల్వచేయాలని నిర్ణయం తీసుకున్నారు. డెల్టా ఆధునీకరణపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ నెల 12న జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా సాగునీటి, మురుగు నీటి ాలువల పరిస్థితులను పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కొండవీటివాగు ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని, డెల్టా ఆధునీకరణకు ముందే కొండవీటివాగు సమస్య పరిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిపుణుల కమిటీని కోరారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న నిపుణుల కమిటీ కొండవీటివాగు ముంపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి ఒక నివేదిక అందచేసింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో నిపుణుల కమిటీతోపాటు ఇరిగేషన్శాఖ ఫీల్డు స్థాయి ఇంజినీర్లు సమావేశమయ్యారు. కొండవీటి వాగు పరీవాహక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతోపాటు పలువురు పాల్గొన్నారు. కొండవీటి వాగు వల్ల ప్రతి ఏటా తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, అమరావతి మండలాల్లో 20 వేల హెక్టార్లలో వాణిజ్య పంటలు నీట మునిగి ఆ ప్రాంత రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వాగుకు వచ్చే 5,600 క్యూసెక్కుల వరదనీరు వల్ల ఉల్లి, పత్తి, కూరగాయలు, మిరప, చెరకు, పసుపు, కంద, వరి తదితర పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వారు తెలిపారు. వాగు ప్రవహించే గ్రామాల్లో చిన్న, చిన్న రిజర్వాయర్లు, చెరువులు నిర్మించి, వర్షం నీరు నిల్వ చేయడం వల్ల, భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తే, రవాణా సౌకర్యం మెరుగుపడి, రైతులు తమ పంటలను త్వరితగతిన మార్కెట్కు తరలించే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఇచ్చిన సూచనలను కూడా కమిటీ పరిశీలనలోకి తీసుకున్నది. అయితే వాగుకు వచ్చే 5,600 క్యూసెక్కులలో వరద నీటి కోసం కనీసం మూడు లేక నాలుగు చెరువులను నిర్మించి నిల్వ చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. కొత్త రాజధాని కృష్ణానదికి సమీపంలోని తాడికొండ, వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో నిర్మించనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు, మంగళగిరి, తాడేపల్లి తదితర ప్రాంతాల ప్రజల అవసరాలకు ఈ నీటిని చెరువుల్లో నిల్వ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. -
మూడు నెలలుగా మూతే!
- అందుబాటులోలేని కేసీ కెనాల్ అధికారులు - రైతుల సమస్యలు పట్టని వైనం - కాల్వల వెంట పెరిగిన కంపచెట్లు నందికొట్కూరు: కేసీ కెనాల్ అభివృద్ధి అధికారులకు పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువ గట్లు, నీటి పారుదలపై నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రైతులకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు ఇటు కార్యాలయంలోను..అటు ఫీల్డ్లోను కనిపించడం లేదు. వివిధ సమస్యలపై కార్యాలయానికి వెళ్లిన వారు.. ఏ అధికారీ అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలుగా నందికొట్కూరులోని నీటి పారుదల శాఖ ఏఈ కార్యాలయం తలుపులు కూడా తెరుచుకోకపోవడంపై రైతులు మండి పడుతున్నారు. నందికొట్కూరు డివిజన్ పరిధిలోని పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాల పరిధిలోని కేసీ కాల్వకు సంబంధించి నందికొట్కూరు ఏఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడ అధికారులు ఏరోజు కూడా అందుబాటులో లేరని రైతులు ఆరోపిస్తున్నారు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీ కాల్వ, పొలాలకు వెళ్లే కాల్వల వెంట కంపచెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి నీటి సరఫరా సాగడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా అధికారులు తప్పుడు నివేదికలు అందజేస్తూ టీఏ, డీఏ కింద వేల రూపాయలు వేలు డ్రా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు : పుల్లారావు, ఈఈ, కేసీ కెనాల్ విధుల పట్ల నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయం. సిబ్బంది పనితీరుపై విచారణ చేపట్టి జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తాం. -
20 ఏళ్లైనా ప్రాజెక్టులు పూర్తికావు
* సాగునీటి పద్దుపై జరిగిన చర్చలో ప్రభుత్వ తీరును తూర్పారబట్టిన విపక్ష సభ్యులు * తుది దశలో ఉన్న ప్రాజెక్టులకూ నిధులివ్వలేదు * విధానాలు మార్చుకొని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి * చంద్రబాబు శంకుస్థాపనలు మాత్రమే చేశారు * కాటన్ తర్వాత ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన నేత వైఎస్సే * చంద్రబాబు చేసిందేమీ లేకే జలయజ్ఞంపై ఆరోపణలు * 2004 ధరలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? సాక్షి, హైదరాబాద్: ఈ బడ్జెట్లో సాగునీటి శాఖ కేటాయింపులను చూస్తే 20 సంవత్సరాలైనా ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఏ ప్రాజెక్టుకు ఏ నాయకుడు నిధులిచ్చి పూర్తిచేశారనే విషయం ప్రజలకు తెలుసని, శంకుస్థాపనలతో మభ్యపెట్టిన నాయకుడు ఎవరో కూడా ప్రజలకు అవగాహన ఉందనే అంశాన్ని ప్రభుత్వ పెద్దలు మరిచిపోకూడదని హితవు చెప్పారు. చంద్రబాబు తన తొమ్మిది సంవత్సరాల పాలనతో ఇంకుడుగుంతలతో సరిపెట్టారని, ఫలితంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత జగన్ను చూసి భయపడుతున్నారని విమర్శించారు. అందుకే 2004 తర్వాత 23 లక్షల ఎకరాలను సాగులోకి వచ్చిందని బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక మంత్రి, 2004కు ముందు సాగులోకి వచ్చిన భూమి గురించి చెప్పడానికి మనసు రాలేదని ఎద్దేవా చేశారు. సాగునీటి పద్దుపై శాసనసభలో శుక్రవారం చర్చ జరిగింది. చర్చలో ఎవరేం మాట్లాడారంటే.. నిరాశ కలిగించిన బడ్జెట్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి - బడ్జెట్లో సాగునీటి కేటాయింపులు రైతులను తీవ్ర నిరాశ, నిస్పృహలు కలిగించాయి. వైఎస్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని తుది దశకు వచ్చాయి. 10 శాతం పనులు మిగిలిన ప్రాజెక్టులు తక్కువ ఖర్చులో పూర్తి చేయవచ్చు. తద్వారా కొన్ని వేల ఎకరాలకు నీరందించవచ్చు. కానీ ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఈ బడ్జెట్లో తెలుగుగంగ ప్రాజెక్టుకు రూ. 89 కోట్లు, గాలేరు- నగరికి రూ.55కోట్లు ఇచ్చారు. ఇలా నిధులిస్తే 20 ఏళ్లయినా ప్రాజెక్టులు పూర్తికావు. బాబు విధానాలు మార్చుకొని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి. - వైఎస్ హయాంలో సృష్టించిన అదనపు ఆయకట్టు వల్ల ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రపంచ జనాభాలో 17 శాతం మన దేశంలోనే ఉన్నారు. విస్తీర్ణంలో మనది రెండు శాతమే. మరి అందరికీ ఆహారం అందించాలంటే ప్రతి ఎకరాకూ నీరివ్వాలి. - 2001కి ముందు తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ మినహా మరో ప్రాజెక్టునే చేపట్టలేదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃపరిశీలన జరుగుందని తెలిసినా.. చంద్రబాబు ప్రాజెక్టులు నిర్మించాలనే ప్రయత్నమే చేయలేదు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిర్మించుకొని బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ అవార్డులో నికర జలాలు పొందగలిగారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్కు నిబంధలకు విరుద్ధంగా రూ. 200 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ రికార్డులను స్పీకర్ ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు 10 లక్షల ఎకరాలకు నీరిచ్చారు: చీఫ్విప్ కాలువ శ్రీనివాసులు - చంద్రబాబు హయాంలో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసి 10 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. వైఎస్ రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలే సాగులోకి తెచ్చారు. సీమ ప్రాజెక్టులకు నికర జలాలు లేకుండా మిగుల జలాలపై ఆధారపడే పరిస్థితి రావడానికి వైఎస్ అప్పట్లో దాఖలు చేసిన మెమో కారణం. ప్రాజెక్టులు పూర్తైతే రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావు: టీడీపీసభ్యుడు ఆంజనేయులు - జలయజ్ఞంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే 2004-14 మధ్య రైతుల ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. జలయజ్ఞంలో అవినీతివల్లే ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కాంగ్రెస్ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి నిధులు దోచుకున్నారు. కాటన్ తర్వాత వైఎస్సే: జగ్గిరెడ్డి, వైఎస్సార్సీపీ సభ్యుడు - గోదావరి జిల్లాల్లో సర్ ఆర్ధర్ కాటన్ పట్ల ఆరాధనా భావం ఉంటుంది. నీళ్లిచ్చిన వారిని మరిచిపోని తత్వం గోదావరి జిల్లాల ప్రజలకు ఉంది. కాటన్ తర్వాత ఆ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు వైఎస్. కాటన్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ఆధునీకరణకు వైఎస్ నిధులిచ్చారు. - 2004 తర్వాత 23 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2004కు ముందు సాగులోకి వచ్చిన భూమి గురించి చెప్పడానికి ఆర్థిక మంత్రికి మనసు రాలేదు. - చంద్రబాబు తన తొమ్మిది సంవత్సరాల పాలనతో ఇంకుడుగుంతలతో సరిపెట్టారు. సాగునీటి రంగానికి ఆయన చేసిందేమీ లేకపోవడం వల్లే.. జలయజ్ఞం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత జగన్ పట్ల ఉన్న భయాన్ని బయటపెట్టుకుంటున్నారు. జలయజ్ఞాన్ని విమర్శించేది అందుకే. ఏం చేస్తారో చెప్పండని ప్రజలు అధికారం ఇస్తే.. లేనిపోని ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. - స్థూల సాగు విస్తీర్ణం చంద్రబాబు హయాంలో 41.59 శాతం నుంచి 38.28 శాతానికి తగ్గిపోయింది. వైఎస్ దాన్ని 46.19 శాతానికి పెంచారు. సాగునీటి ప్రాజెక్టులు లాభదాయకం కాదని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకం 125 పేజీలో పేర్కొన్నారు. అంచనా వ్యయం పెంచారని టీడీపీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. 2004 ధరలతో ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయగలమని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? రూ. 91.12 కోట్ల అంచనా వ్యయంతో నాగార్జున సాగర్ను ప్రారంభిస్తే.. పూర్తయ్యే నాటికి రూ. 1300 కోట్లు ఖర్చయింది. హంద్రీనీవాకు ఎన్ని శంకుస్థాపనలు చేశారు?: ఎస్వీ మోహన్రెడ్డి - హంద్రీనీవా సుజల స్రవంతికి ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబూ చేశారు. రూ. 6,850 కోట్ల అంచనా వ్యయం ఉండగా, చంద్రబాబు ఇచ్చింది కేవలం రూ. 13 కోట్లే. వైఎస్ 2004-10 మధ్య రూ.3,996 కోట్లు నిధులు విడుదల చేశారు. తర్వాత ప్రభుత్వాలు రూ. 1800 కోట్లు ఇచ్చాయి. హంద్రీనీవాను కూడా చంద్రబాబు తన ఖాతాలోనే వేసుకుంటున్నారు. ప్రాజెక్టును ఎవరు పూర్తి చేసినట్లు? - రూ. 391 కోట్ల అంచనా వ్యయంతో రూపొందిన గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు కూడా చంద్రబాబే శంకుస్థాపన చేశారు. ఇచ్చిన నిధులు రూ. 3 కోట్లే. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 142 కోట్లు ఖర్చు చేసి 6,718 ఎకరాలను సాగులోకి తెచ్చారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు కూడా ఎక్కువ నిధులిచ్చిన ఘనత వైఎస్కే దక్కుతుంది. - గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ బడ్జెట్లో నిధులివ్వలేదు. కర్నూలుకు దిగువన తుంగభద్ర మీద ‘చెక్డ్యాం కమ్ బ్రిడ్జి’ నిర్మించాలని చిన్ననీటి పారుదల శాఖ గతంలో ప్రతిపాదనలు రూపొందించింది. కర్నూలుకు ఎగువన నిర్మిస్తే తాగునీటికి కూడా ఉపయోగపడుతుంది. -
కూలీలు కాదు.. ఇక రైతులే
- భూ పంపిణీతో ఎస్సీ,ఎస్టీల్లో వెలుగులు - ప్రతిష్టాత్మకంగా అమలుకు చర్యలు - సమన్వయంతో లక్ష్యం సాధించేందుకు కృషి - నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు సిద్దిపేట అర్బన్: వ్యవసాయ ఆధారిత ఎస్సీ, ఎస్టీ కూలీలను రైతులుగా మార్చేందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావువు అత్యంత ప్రతిష్టాత్మకంగా భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ కేసీఆర్ భూ పంపిణీ పథకాన్ని ఈ నెల 15న రాష్ట్రంలో ప్రారంభిస్తారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకెళ్లి ఎస్సీ లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. భూ పంపిణీ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో కొనసాగిన ప్రభుత్వాలు సాగుకు యోగ్యం కానీ బంజరు భూములను లబ్ధిదారులకు అందజేసి భూ పంపిణీ చేశామనిపించారన్నారు. ప్రస్తుతం సాగుకు యోగ్యమైన భూమినే లబ్ధిదారులకు అందజేస్తామని, అందుకు అవసరమయ్యే విద్యుత్ను, బోరు బావిని, విద్యుత్ మోటార్ను, మొదటి పంటకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు తదితర పెట్టుబడులను ఉచితంగా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను గుర్తించి అందరికీ మూడు ఎకరాల సాగు భూమిని అందజేస్తామన్నారు. వివిధ గ్రామాల్లో ప్రభుత్వానికి అమ్మే భూములను గుర్తించి అధికారులు నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో భూ పంపిణీ ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. ప్రధాన మంత్రి ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జాతీయ జెండాను ప్రథమంగా ఎగురవేయనున్నారని చెప్పారు. సమావేశంలో సిద్దిపేట ఆర్టీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్వైగిరి, నంగునూరు, చిన్నకోడూరు మండలాల తహశీల్దార్లు శ్రీహరి, వసంతలక్ష్మి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల ఎంపీపీలు ఎర్ర యాదయ్య, కూర మాణిక్యరెడ్డి, జాపశ్రీకాంత్రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
ఏడేళ్లు.. ఏడుసార్లు గడువు..
► రైతులకు తప్పని ఎదురుచూపులు ► అలంకారప్రాయంగా కొమురం భీమ్ ప్రాజెక్టు ► పూర్తికాని కాల్వల నిర్మాణం ► ఆరుతడి పంటలే దిక్కు ► వచ్చే ఏడాది ఖరీఫ్కూ నీళ్లు అనుమానమే ఆసిఫాబాద్ : జల్-జంగల్-జమీన్ అంటూ చివరి వరకూ గిరిజన సంక్షేమం కోసం పోరాడి అసువులు బాసిన యోధుడు.. అడవి బిడ్డల దైవం.. కొమురం భీమ్ పేర నిర్మించిన ప్రాజెక్టు ఏడేళ్లయినా నీళ్లందించడం లేదు. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్నా ఆయకట్టుకు అందని దుస్థితి నెలకొంది. రూ.450 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నవంబర్ 19, 2011న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించారు. ఏడాదిలోగా అసంపూర్తిగా ఉన్న కుడి, ఎడమ కాల్వల నిర్మాణం పూర్తిచేసి ప్రాజెక్టుకు అన్ని హంగులూ కల్పిస్తామని ఆ సమయంలో సీఎం కిరణ్ ప్రకటించారు. 2012 ఖరీఫ్ నాటికి 14 వేల ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. కానీ.. ఆయన మాటలు నీటి మూటలే అయ్యాయి. ఆయన హామీ ఇచ్చి మూడేళ్లయినా కాల్వల నిర్మాణమే పూర్తికాలేదు. గడువు మీద గడువు మాత్రం పెంచుతూనే ఉన్నారు. కొనసాగుతున్న గడువు పొడిగింపు ఆసిఫాబాద్ మండలంలోని అడ వద్ద నిర్మించిన కొమురం భీమ్ ప్రాజెక్టు ద్వారా 44,500 ఎకరాలకు సాగు నీరందాల్సి ఉంది. అయినా.. ఈ ప్రాజెక్టుతో రైతులకు ఒరిగిందేమీ లేకుండాపోయింది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును ప్రారంభించినా.. కాల్వలు నిర్మాణం నేటికీ పూర్తికావడం లేదు. మార్చి 20, 2007లోనే ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్నా.. నిధుల కొరత, అటవీశాఖ క్లియరెన్స్, పునరావాసం పనులు పూర్తి కాక ఇప్పటివరకు ఐదు సార్లు గడువు పొడిగించారు. ప్రాజెక్టును మొదట రూ.274.14 కోట్లతో 24,500 ఎకరాలకు సాగు నీరందించాలని పనులు ప్రారంభించారు. అనంతరం అదనంగా 21 వేల ఎకరాలకు సాగునీరందించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.170 కోట్ల నిధులు మంజూరు చేశారు. 22, జనవరి 2005లో రూ.274.14 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ మంజూరు కాగా, మార్చి 2006లో సాంకేతిక అనుమతి లభించింది. ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టు పనులను నవయుగ కంపెనీ దక్కించుకుంది. 20 మార్చి, 2007లో ఈ పనులు పూర్తికావల్సి ఉంది. అయితే.. అటవీశాఖ అనుమతి, భూసేకరణ, పునరావాస పనుల్లో జాప్యంతో పూర్తి కాలేదు. దీంతో 31 మార్చి, 2009 వరకు గడువు పెంచారు. రెండో దఫా 31 ఆగస్టు, 2009 వరకు పెంచారు. మూడో దఫా డిసెంబర్, 2011 వరకు, నాల్గో దఫా 31, డిసెంబర్ 2011 వరకు పెంచారు. గడువులోగా పూర్తి కాకపోవడంతో 30 జూన్, 2013కు ఐదోసారీ గడువు పెంచారు. ఆరోసారి 30, జూన్, 2014 వరకు పెంచారు. గడువులోగా పూర్తి కాకపోవడంతో ఏడో సారీ 30 జూన్, 2016కు పెంచారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి.. ప్రాజెక్టు ఎర్త్బండ్, ఎడమ హెడ్ రెగ్యులేటర్, 9 గేట్లు పూర్తయ్యాయి. 24వ కిలోమీటర్ నుంచి 54 కిలోమీటర్ వరకు ఐదు చోట్ల ఆసిఫాబాద్, కాగజ్నగర్ మండలాల్లో అటవీశాఖ క్లీయరెన్స్ రావల్సి ఉంది. కాల్వల నిర్మాణం పనులు అటవీ శాఖ అనుమతి లేక నిలిచిపోయాయి. ఇప్పటివరకు సుమారు రూ.365 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇటీవల కుడి కాల్వ పనులు సైతం ప్రారంభించారు. పూర్తై ప్రధాన కాల్వ కింద 5వ డిస్ట్రిబ్యూటర్ వరకు పూర్తి చేసి కనీసం 10 వేల ఎకరాలకైనా సాగునీరందిస్తామని ప్రకటించిన అధికారులు చేతులెత్తేశారు. భూసేకరణే ప్రధాన సమస్య.. ప్రారంభం నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. ఏడేళ్లుగా అటవీ భూ సేకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నా జాప్యం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన 28 అంశాలను పూర్తి చేసి, కలెక్టర్ ఆమోదంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాల్మెంట్కు పంపించారు. రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేక ప్రాజెక్టు పనులు పూర్తికావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘పేట’తోనే మామ, అల్లుళ్లకు మహర్దశ !
సిద్దిపేట జోన్,న్యూస్లైన్: సరిగ్గా 14 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమానికి బీజం నాటిన సిద్దిపేట పట్టణమే నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆయన మేనల్లుడు హరీష్రావును నియోజకవర్గం అక్కున చేర్చుకొని కోటగా నిలిచింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా, కొంతకాలం కరువు సహాయక మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా కొనసాగిన అనవాయితీని నేడు ఆయన మేనల్లుడు హరీష్రావు కొనసాగిస్తున్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్రావు నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన నీటి పారుదల శాఖతో పాటు శాసన సభ వ్యవహరాల శాఖను పర్యవేక్షించనున్నారు. 2004 ఉప ఎన్నికల ద్వారా సిద్దిపేట నుంచి రాజకీయ ప్రవేశం చేసిన హరీష్రావు 2004లో ఉప ఎన్నికతో తన విజయ పరంపరను కొనసాగిస్తూ ఐదుసార్లు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2010 ఉప ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలోనే 95.858 ఓట్లతో అత్యధిక మెజార్టీ సాధించిన హరీష్రావు, మొన్నటి ఎన్నికల్లో 93.354 ఓట్లతో తెలంగాణలో ద్వితీయ స్థానంలో నిలిచారు. 2004 ఉప ఎన్నికల్లో గెలుపొందిన హరీష్రావు అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రి వర్గంలో యువజన సర్వీసుల శాఖను నిర్వర్తించారు. ఈ క్రమంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, హరీష్రావు తొలివిడత మంత్రి వర్గంలో చోటు సంపాదించుకొనిని నీటి పారుదల శాఖ పగ్గాలు చేపట్డం ఆయన పనితనానికి నిదర్శనం. టీఆర్ఎస్ బలోపేతానికి పుష్కరకాలంగా కృషి చేస్తున్న హరీష్రావు 1996 నుంచి మామ కేసీఆర్కు సహాయకారిగా ఉంటూ సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. తనకిష్టమైన నీటి పారుదల శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను పర్యవేక్షించనున్న హరీష్రావు తెలంగాణ ప్రాంతంలో జలవనరుల అభివృద్ధికి కృషి చేయగలరనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. 2004లోనే యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఆయన నియోజకవర్గంలో చిన్ననీటి వనరుల అభివృద్ధికి పుష్కలంగా నిధులను మంజూరు చేయించుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ముందు రూపొందించిన పార్టీ మేనిపెస్టోకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతాన్ని జలవనరులతో సస్యశ్యామలం చేసేందుకు హరీష్రావుకు నీటి పారుదల శాఖను కేటాయించినట్లు సమాచారం. -
సహనమూర్తి...సేవాస్ఫూర్తి..!
వైద్యుడు రోగికి మందుల చీటీ రాసిచ్చి తన పాత్ర పూర్తయిందనుకోకుండా మందులు కొనుక్కోమని డబ్బిస్తుంటే ఏమనాలి? డాక్టర్ ఎం. శ్రీనివాసరావు అనాల్సిందే. ఇలా ఎన్నాళ్లు చేస్తారంటే ‘చేయాలనే మనసు ఉండాలే కానీ ఇదేమంత కష్టం కాద’టారాయన. ‘‘నేను ఇదంతా చేస్తున్నది మా అమ్మకోసమే! అమ్మ కోసం చేసే పని భారమనిపించదు. నన్ను డాక్టర్ని చేయడానికి మా అమ్మ పడిన కష్టంతో పోలిస్తే నేను జనానికి చేస్తున్న సహాయంలో అసలు కష్టమే లేదు. చేతినిండా డబ్బు ఉండి నన్ను డాక్టర్ని చేయలేదు, కొడుకుని డాక్టర్ని చేయాలనే తపనతో పైసాపైసా కూడబెట్టి నన్ను చదివించింది. మనసున్న డాక్టర్గా పేరు తెచ్చుకోమని కోరింది. అందుకే నేను డాక్టర్నయిన తర్వాత మా నాన్న పేరుతో క్లినిక్ తెరిచాను, అమ్మ పేరుతో చారిటీ ప్రారంభించి ఉచితంగా వైద్యం చేస్తున్నాను’’ అని కూడా అంటారు. హైదరాబాద్లోని డి.డి కాలనీలో డాక్టర్ శ్రీనివాసరావు ఇంటికి వెళ్లగానే మొదట వారి తల్లి వెంకటసుబ్బమ్మ కనిపించారు. మాటలు కలిపాక... ‘‘మాది కడప జిల్లా కొత్తనెల్లూరు, మా వారిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర పొనుగోడు. ఆయనకు హైదరాబాద్లో ఇరిగేషన్ డిపార్టుమెంట్లో క్లర్కు ఉద్యోగం వచ్చింది. నాకు ఐదుగురు పిల్లలు. శ్రీనివాస్ ఆఖరివాడు. అబ్బాయిని డాక్టర్ని చేయాలని మావారి కోరిక. ఆయన అలా అంటుంటే నాకూ సంతోషంగా ఉండేది. అనుకున్నట్లే మెడిసిన్లో చేర్చాం. కానీ జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లే జరగవు. ఏడాదిలోపే మా జీవితంలో పిడుగుపడినట్లయింది. మా వారు హఠాత్తుగా పోయారు. ఇల్లు గడవాలి, పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇన్ని బాధ్యతలు నన్ను చుట్టుముట్టాయి. కాంపెన్సేటరీ గ్రౌండ్స్ ప్రకారం మా వారి ఉద్యోగం ఇచ్చారు. నేను పెద్దగా చదువుకోకపోవడంతో స్వీపర్ ఉద్యోగం తప్ప మరే ఉద్యోగానికీ అర్హత లేదు. స్వీపర్గా నాకు వచ్చే జీతంతో ఇల్లు గడుస్తుంది కానీ చదువుల ఖర్చు భారంగా ఉండేది. నా బాధ చూసి శ్రీనివాస్ మెడిసిన్ మానేసి దొరికిన ఉద్యోగంలో చేరతానని పట్టుపట్టాడు. ‘నిన్ను డాక్టర్ని చేయాలన్న మీ నాన్న కోరిక తీర్చడానికి నేనింత కష్టపడుతున్నాను. నిన్ను డాక్టర్ని చేసినప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. నీ చదువు మాన్పించడం నాకిష్టం లేదు. నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసి తెచ్చే జీతం డబ్బుని నేను సంతోషంగా ఖర్చుచేయలేను కూడ. డాక్టర్గా సంపాదించిన డబ్బుతో నన్ను పోషించు. డాక్టర్గా పదిమందికి సహాయం చేయడమే నాకు సంతోషం. ఈ నాలుగేళ్లు కష్టపడడానికి నేను సిద్ధమే’ అని చెప్పాను. ఇక నా కష్టం అంటావా తల్లీ! నేను ఎవరి కోసం కష్టపడ్డాను, నా బిడ్డ కోసమే. పేదోళ్లకు అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకోలేక ఎన్ని అవస్థలు పడతారో తెలుసుకుని మసులుకోమని మాత్రం చెప్పేదాన్ని. అప్పటి నా మాట పట్టుకుని ఇంతమందికి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడని ఊహించలేదు. టీవీల్లో కనిపించే పెద్దోళ్లు, భరణి సారు, కోడి రామకృష్ణ సారు లాంటి గొప్పోళ్లు ఫోన్ చేసి ‘ఎంత మంచి కొడుకుని కన్నావమ్మా, నీ బిడ్డ సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికి వైద్యం చేస్తున్నాడో! లైట్బాయ్లు, జూనియర్ ఆర్టిస్టులకు ఉచితంగా వైద్యం చేస్తాడు అంతా నీ పెంపకంలో గొప్పదనమే’ అని ప్రశంసిస్తుంటే నాకు మనసు నిండిపోతుంటుంది’’ అన్నారామె కళ్లు చెమర్చు తుండగా. రోజుకు మూడుషిఫ్టుల్లో... ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు సరూర్నగర్లో ఇంటి వద్ద ఉచిత వైద్యం, ఆ తర్వాత హాస్పిటల్లో డ్యూటీ. మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగం, సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు అంబర్పేటలో సొంత క్లినిక్ బాధ్యతలు... ఇలా రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు డాక్టర్ శ్రీనివాస్. ఈ తల్లీకొడుకులిద్దరూ స్వతహాగా గాయకులు. ఆకాశవాణి కార్యక్రమాల్లో రేడియో అక్కయ్య, అన్నయ్యలతో గొంతుకలిపిన అనుభవం వెంకటసుబ్బమ్మది. ఆమె ఏడేళ్లపాటు రేడియోలో దేశభక్తి గీతాలు, దైవభక్తి గీతాలు ఆలపించారు. భర్తపోయి, ఉద్యోగంలో చేరిన తర్వాత గాయనిగా కొనసాగడం కష్టమైంది. కానీ తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శ్రీనివాసరావు జానపద గేయాలు పాడతారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. సినిమాల్లో నటిస్తారు. అయితే అవన్నీ డాక్టర్ పాత్రలే. ఇప్పటికి 45 సినిమాలు, సీరియల్స్లో డాక్టర్గా కనిపించారు. అమ్మా! నీకు వందనం!! సినీ పరిశ్రమలోని అభిమానులు సన్మానం చేస్తామన్నప్పుడు డాక్టర్ స్పందించిన తీరులో ఆర్ద్రత వ్యక్తమైంది. ‘మీకు కనిపిస్తున్న ఈ రూపం, ఈ వ్యక్తిత్వం, దయాగుణాలకు కారకురాలైన మా అమ్మకు సన్మానం చేయండి’ అన్నారాయన. అలా 2011లో రవీంద్రభారతిలో వెంకటసుబ్బమ్మకు జరిగిన సన్మానాన్ని తలుచుకుంటూ... ‘‘మా అమ్మ అక్కినేనిగారి అభిమాని. నన్ను ఆయనకు పరిచయం చేసుకుని మా అమ్మకు మీ చేతుల మీదుగా సన్మానం చేయమని అడిగాను. మదర్స్డే రోజున ఆయన చేతుల మీదుగా జరిగిన సన్మానంలో పిల్లలకు దూరమై వృద్ధాశ్రమాల్లో కాలం వెళ్లదీస్తున్న అమ్మలెందరో ఉన్నారు. వారికి కూడా కొడుకుగా మారి చేయగలిగింది చేయమని సూచించారు. వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి ఉచిత వైద్యం చేయడమే కాదు, మాకొచ్చే శాంపిల్ మందులిచ్చేవాడిని. చాలా వృద్ధాశ్రమాల్లో నిర్వహణ సరిగ్గా లేక వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని తెలిసి, ఓ మోడల్ హోమ్ ప్రారంభించాను. నీకు మించిన బరువును తలకెత్తుకుంటున్నావేమో జాగ్రత్త అంటోంది మా అమ్మ. సంకల్పబలమే నడిపిస్తుందనే నమ్మకంతో సాగిపోతున్నాను’’ అన్నారీ డాక్టర్. - వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎస్ఎస్ ఠాకూర్ మాటల్లో చెప్పలేనంత సంతోషం! అప్పుడు మా శ్రీనివాస్ మెడిసిన్ తొలి ఏడాది చదువుతున్నాడు. నాకు వెన్నెముకకు ఆపరేషన్ అయి బెడ్ మీదున్నాను. అప్పుడే కాలేజ్లో ప్రాక్టికల్స్కి కోటుతో వెళ్లాలనగానే మా వారు తెచ్చారు. నిన్ను కోటులో చూడాలని ఉందని అడిగాను. ఇంటికెళ్లి కోటుతో వచ్చాడు. అప్పుడు కంటినిండా చూసుకుని, దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. ఆ రోజు పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. - వెంకట సుబ్బమ్మ, డాక్టర్ శ్రీనివాసరావు తల్లి -
డిసెంబర్ 20 నుంచి ఎస్సారెస్పీ నీరు విడుదల
వరంగల్, న్యూస్లైన్ : రబీకి ఎస్సారెస్పీ నీటి విడుదల ఖరారైంది. ఎస్సారెస్పీ స్టేజ్-1లోని 3.37 లక్షల ఎకరాల ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రెండో దశలో కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉండడం, కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో స్టేజ్-2కు ఈసారి నీరు విడుదల చేసేందుకు సంశయిస్తున్నారు. డిసెంబర్ 20 నుంచి ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ నుంచి నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఏడు విడతల్లో ఏడు తడులు నీరివ్వనున్నారు. నీటి పారుదల శాఖ నుంచి కూడా ఆ మోదం లభించినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 31 వరకు నీటిని ఇవ్వనున్నారు. ఈసారి కూడా ఆన్ ఆఫ్ పద్ధతిలోనే నీరందింస్తామని, 9 రోజులు ఆన్... 6 రోజులు ఆఫ్ ఉంటుందని ప్రాజెక్టు ఎస్ఈ సుధాకర్రెడ్డి చె ప్పారు. ఇప్పటికే ఉప కాల్వల వద్ద చిన్నచిన్న మరమ్మతులు, ప్రధాన కాల్వలో మట్టి తొలగిం చడం, చెట్లు తీసేయడం వంటి పనులు అధికారులు చేపట్టారు. డిసెంబర్ 15 వరకు కాల్వలను సిద్ధం చేసి, 20 నుంచి నీటిని ఇవ్వనున్నా రు. అయితే ఖరీఫ్ సీజన్లోనే కావాల్సినంత నీటిని విడుదల చేయడంతో కొన్ని ప్రాంతాల్లో చెరువులను పూర్తిస్థాయిలో నింపారు. రబీ సీజ న్కు మాత్రం విడుదల చేస్తున్న నీటిని కేవలం పంటల సాగుకే వినియోగించుకోవాలని, రెం డో పంట వేసే రైతులు కొంత మేరకు ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిం చారు. పూ ర్తి ఆయకట్టులో వరిసాగు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.