directors
-
గురూ.... కొత్త కాంబినేషన్ షురూ
జానర్ మాత్రమే కాదు... ఒక్కోసారి కాంబినేషన్స్ కూడా ఆడియన్స్ను థియేటర్స్కు రప్పిస్తాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ మూవీస్కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు స్టార్ హీరోలు ఇప్పటివరకు తమతో సినిమాలు చేయని దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న కొన్ని కొత్త కాంబినేషన్స్ కథా కమామీషుపై ఓ లుక్ వేయండి.ప్రభాస్తో లోకేశ్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లోని ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. అయితే తనతో ‘సలార్’ వంటి మాస్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్తో ప్రభాస్ మూడు సినిమాలు కమిటయ్యారు. ఈ మూడు సినిమాలు వరుసగా 2026, 2027, 2028లలో విడుదల కానున్నాయి.కాగా వీటిలో ఓ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే లోకేశ్ కార్తీతో ‘ఖైదీ 2’ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభాస్–లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లోని మూవీ చిత్రీకరణ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యే చాన్సెస్ ఉన్నాయి.అలాగే ‘హనుమాన్’ తో భారీ బ్లాక్బస్టర్ హిట్ సాధించిన ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ‘జై హనుమాన్’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్తో ప్రశాంత్ వర్మ సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ సమాచారం.గ్రీన్ సిగ్నల్తమిళంలో రజనీకాంత్తో ‘జైలర్’ సినిమా తీసి సూపర్హిట్ అందుకున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్. ప్రస్తుతం రజనీకాంత్తోనే ‘జైలర్ 2’ సినిమా చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నెల్సన్. అయితే ‘జైలర్’కు, ‘జైలర్ 2’కు మధ్య తనకు లభించిన గ్యాప్లో ఓ కథ రాసుకున్నారట నెల్సన్. ఈ కథను ఎన్టీఆర్కు వినిపించగా, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.అయితే ఇటీవలే హిందీలో ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో తాను కమిటైన ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ సినిమా కోసం కావాల్సిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్.ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత నెల్సన్ సినిమాను ఎన్టీఆర్ సెట్స్కు తీసుకువెళతారని ఊహించవచ్చు. అలాగే ‘హాయ్ నాన్న’ వంటి ఫీల్గుడ్ మూవీ తీసిన శౌర్యువ్ కూడా ఎన్టీఆర్కుప్రాథమికంగా ఓ లైన్ చెప్పారని, స్టోరీ కుదిరితే శౌర్యువ్తోనూ ఎన్టీఆర్ మూవీ చేస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.అర్జున్తో అట్లీ‘పుష్ప: ది రూల్’ సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు అల్లు అర్జున్. ఈ సక్సెస్ను ఎంజాయ్ చేసేందుకు ప్రస్తుతం స్పెయిన్లో ఉన్నారు అల్లు అర్జున్. కాగా ‘పుష్ప’ సినిమా నిర్మాణం సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నట్లుగా అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అయితే ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీతో సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉండటంతో అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్తో చేస్తారనే టాక్ వినిపించింది.కానీ త్రివిక్రమ్తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాకు మైథలాజికల్ బ్యాక్డ్రాప్ ఉంటుందట, చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరం అవుతుందట. ఇలా ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ ఇంకా సమయం పడుతుందట. దీంతో తన నెక్ట్స్ మూవీ కోసం తమిళ టాప్ డైరెక్టర్ అట్లీతో చర్చలు జరిపారట అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్లోనే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ సెట్స్పైకి వెళ్లనుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారని, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని భోగట్టా. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా రూ. 1871 కోట్ల వసూళ్లు రాబట్టింది.మరోవైపు దర్శకుడిగా షారుక్ ఖాన్తో రూ. 1000 కోట్ల ‘జవాను’ను తీశారు అట్లీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్పై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మూవీ పై మరింత సమాచారం బయటకు రానుందని తెలిసింది. అలాగే ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ఇటీవల ముంబైలో కలిశారు అల్లు అర్జున్. వీరి మధ్య ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయి. సో... భన్సాలీతో కూడా అల్లు అర్జున్ సినిమా చేసే చాన్స్ ఉందని ఊహించవచ్చు.మాస్ ప్లస్ క్లాస్ ఎక్కువగా మాస్, వీలైనప్పుడు క్లాస్ మూవీస్ చేస్తుంటారు రవితేజ. అయితే రీసెంట్ టైమ్స్లో రవితేజ మాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’ మాస్ అప్పీల్ ఉన్న సినిమాయే. దీంతో ఓ క్లాస్ మూవీ చేయాలని రవితేజ అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కిశోర్ తిరుమల రెడీ చేసిన ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీకి రవితేజ పచ్చజెండా ఊపారని, త్వరలోనే ఈ వీరి కాంబినేషన్లోని మూవీపై స్పష్టత రానుందని ఫిల్మ్నగర్ సమాచారం.ఓకే చెప్పిన నానీశివ కార్తికేయన్తో తమిళంలో ‘డాన్’ (2022) వంటి క్యాంపస్ డ్రామా ఫిల్మ్ తీసి హిట్ సాధించారు తమిళ యంగ్ డైరెక్టర్ సిబీ చక్రవర్తి. అప్పట్నుంచి సిబీ చక్రవర్తితో ఓ మూవీ చేయాలని నానీ అనుకుంటున్నారట. ఆ సమయం ఇప్పడు వచ్చిందని, నానీ–సిబీ చక్రవర్తి కాంబినేషన్లోని మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నానీ ‘హిట్ 3’ మూవీతో బిజీగా ఉన్నారు.మే 1న ఈ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత తనకు ‘దసరా’ వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నానీ ‘ప్యారడైజ్’ అనే మూవీ చేస్తారు. అయితే ‘ప్యారడైజ్’ చిత్రానికి సమాంతరంగా సిబీ సినిమాను కూడా నానీ చేస్తారా? లేక ‘ప్యారడైజ్’ చిత్రాన్ని పూర్తి చేశాక సిబీ చక్రవర్తి సినిమాను స్టార్ట్ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన ఓ కథ నానీని ఇంప్రెస్ చేసిందని, నానీ ప్రస్తుత కమిట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత శేఖర్ కమ్ములతో చేసే మూవీపై ఓ స్పష్టత వస్తుందని సమాచారం. ఈ నెల 24న నానీ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ హీరో తదుపరి చిత్రాలపై అధికారిక అప్డేట్స్ ఏమైనా వస్తాయా? అనేది చూడాలి.కిల్ డైరెక్టర్తో..!హిందీలో ‘కిల్’ వంటి మాస్ యాక్షన్ ఫిల్మ్ తీసి, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యారు దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్. ఈ దర్శకుడు ఇప్పుడు ఓ క్రేజీ తెలుగు హీరోతో భారీ బడ్జెట్ మూవీ తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్లో విజయ్ దేవరకొండను కలిశారు నిఖిల్ నగేశ్. వీరి మధ్య ఓ కొత్త సినిమా గురించిన చర్చలు జరిగాయి. ప్రస్తుతం ‘కింగ్డమ్’ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.మే 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్తో రాయలసీమ నేపథ్యంలో ఓ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్, రవికిరణ్ కోలాతో ఓ విలేజ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలు పూర్తయ్యాక విజయ్ దేవరకొండ–నిఖిల్ నగేశ్ల కాంబినేషన్లోని మూవీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
దర్శకులపై కంగనా సంచలన వ్యాఖ్యలు..
-
కోలీవుడ్ టార్చ్ బేరర్స్
కొంతకాలంగా నడక మార్చుకుంటోంది తమిళ సినిమా. వెండితెర నిర్వచనాన్ని మార్చే బాధ్యతను భుజానకెత్తుకున్నారు కోలీవుడ్ కొత్త కథనాయకులు. ఇక్కడ కథానాయకులు అంటే తెరపై కనిపించే హీరోలు కారు. సిల్వర్ స్క్రీన్ను రీ డిఫైన్ చేస్తూ ఇండస్ట్రీకే టార్చ్ బేరర్స్గా మారిన దర్శకులు. హీరోల ఇమేజ్ చుట్టూ తిరిగే కథలకు ఎండ్ కార్డ్ వేసి రొటీన్ ఫార్ములా సినిమాలకు మంగళంపాడేశారు ఈతరం దర్శకులు.సమాజం పెద్దగా పట్టించుకోని అంశాలనే ముడి సరుకుగా తీసుకుని ఈ దర్శకులు తెరకెక్కిస్తున్న చిత్రాలు తమిళ సినిమాను కొత్త పంథాలోకి తీసుకెళ్తున్నాయి. అట్టడుగు ప్రజల జీవితాలే ఆ చిత్రాల కథా వస్తువులు. ప్రతి ఫ్రేమ్లోనూ సామాజిక స్పృహ ఉట్టిపడేలా సోషల్ కమిట్మెంట్తో సినిమాలు తీస్తున్నారు. కోలీవుడ్ స్థాయిని పెంచుతున్న ఆ ముగ్గురు దర్శకుల గురించి తెలుసుకుందాం.సామాజిక వివక్షే కథగా...అణిచివేతకు గురైన వాడికే వివక్ష వికృత రూపం తెలుస్తుంది. తమిళనాడులో అణగారిన వర్గానికి చెందిన మారి సెల్వరాజ్ తాను అనుభవించిన, తన చుట్టూ ఉన్నవాళ్లు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షనే సినిమా కథలుగా మార్చుకున్నారు. అట్టడుగు ప్రజల గళంగా మారారు ఈ దర్శకుడు. తమిళ సంస్కృతి నేపథ్యంలో వాస్తవ జీవిత గాథలను ఆవిష్కరిస్తున్నారు.2018లో తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ నుంచి ‘కర్ణన్, మామన్నన్’, మొన్నటి ‘వాళై’ వరకు ప్రతి చిత్రంలోనూ కులం కట్టుబాట్లు, ప్రజల హక్కులు, గౌరవప్రదమైన జీవితం... మారి సెల్వరాజ్ చర్చకు పెట్టే అంశాలు ఇవే. మెయిన్ స్ట్రీమ్ సినిమా పట్టించుకోనిపాత్రలకు వాయిస్ ఇస్తూ తన సినిమా ద్వారా సామాజికపోరాటం చేస్తున్నారు. మారి సెల్వరాజ్ సినిమాల్లో కల్చరల్ రిప్రజంటేషన్ తప్పక ఉంటుంది. బడుగు బలహీన వర్గాల గ్రామీణ జీవన విధానాన్ని నిజాయితీగా కళ్లకు పట్టే ప్రయత్నంలో ఈయన ప్రతి సందర్భంలోనూ సక్సెస్ అవుతున్నారు.పోరాట యోధులుగా...సినిమా అంటే ఏదో ఒక కథ చెప్పడం కాదు. వివక్ష కారణంగా పూడుకుపోయిన గొంతులకు వాయిస్ ఇవ్వాలి. శతాబ్దాల నుంచి వివక్షను అనుభవిస్తున్న కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తి స్వరం సినిమాగా చూపించాల్సి వచ్చినప్పుడు ఘాటుగానే ఉంటుంది.పా. రంజిత్ సినిమాలు కూడా అంతే. అంబేద్కర్ ఆలోచనా విధానానికి తగ్గట్టు దళిత్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసేందుకు చిత్ర పరిశ్రమలో రాజీలేనిపోరాటమే చేస్తున్నారాయన.కబాలి (2016), కాలా (2018)... ఈ రెండు చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ ఇమేజ్కి సామాజిక న్యాయం కోసంపోరాడే యోధుడిపాత్రను మేళవించిపా. రంజిత్ చిత్రించిన విధానం తరాలుగా అన్యాయాలకు గురవుతున్న వర్గాలకు కొత్త బలాన్ని ఇచ్చింది. రంజిత్ సినిమాలకు రజనీకాంత్ కూడా ఫిదా అయిపోయారు. సామాజిక అంశాలు... వాటిని ప్రభావితం చేసే ΄పొలిటికల్ డైనమిక్స్ రంజిత్ సినిమాలో నిండి ఉంటాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి దళితుల సంఘర్షణలను, వారి ఆత్మగౌరవపోరాటాలను వెలికి తీసి ఈ ఏడాది ‘తంగలాన్’ రూపంలోపా. రంజిత్ సృష్టించిన సునామీ సినీ విమర్శకుల మెప్పు ΄పొందింది.దర్శకుడిగా దృశ్య రూపం ఇవ్వడంతో సరిపెట్టకుండా నిర్మాతగా మారి ఈ తరహా చిత్రాలెన్నింటికో బ్యాక్బోన్గా నిలిచారు. మారి సెల్వరాజ్ తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ అందులో ఒకటి. దళిత జీవితాలను తెరకెక్కించే క్రమంలో వారిని బాధితులుగా కాకుండాపోరాట యోధులుగా చూపిస్తూ అవసరమైన చోట కమర్షియల్ ఎలిమెంట్స్ను కూడా జోడించి సాగిస్తున్న మూవీ జర్నీ తమిళ ఇండస్ట్రీలోపా. రంజిత్కు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది.కఠినమైన వాస్తవాలతో...తమిళనాడులోని సామాజిక–రాజకీయ వాతావరణాన్ని నిజ జీవితాలకు దగ్గరగా చూపించడంలో వెట్రిమారన్ది ప్రత్యేక శైలి. వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో వెట్రిమారన్ సినిమాలు కూడా అంతే. విభిన్న వర్గాల జీవితాలను సజీవంగా చూపించడంలో వెట్రిమారన్ ముందుంటారు. ఈయన సినిమాల్లో కనిపించే సామాజిక సమస్యల పరిధి విస్తృతంగా ఉంటుంది. ‘ఆడుగళం, విశారణై, అసురన్’... ఏ సినిమా తీసుకున్నా వాటి నేపథ్యంలో కనిపించేది ప్రజలపోరాటాలే. కళను వినోదానికి పరిమితం చేయకుండా సామాజిక మార్పుకు ఆయుధంగా మార్చుకున్న దర్శకులుగా మారి సెల్వరాజ్,పా. రంజిత్, వెట్రిమారన్ కనిపిస్తారు. కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించినా సరే ఈ ముగ్గురి సినిమాలో పీడిత ప్రజలే ప్రధానపాత్రలుగా ఉంటారు. వాళ్లే హీరోలుగా సినిమాను నడిపిస్తారు. భిన్న చిత్రాల ద్వారా వీళ్లు సంధిస్తున్న ప్రశ్నలు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లోనూ వీళ్ల ముద్ర కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ వినోద సాధనంగా మారి, నేల విడిచి సాము చేస్తున్న సందర్భంలో వాస్తవికత, సామాజిక చైతన్యాన్ని నమ్ముకుని స్టోరీ టెల్లింగ్కు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురు. దర్శకులుగా వీరిది బాధ్యతాయుతమైన ప్రయాణం. – ఫణి కుమార్ అనంతోజు -
పనితీరు బాగుంటే ప్రోత్సాహకాలు
ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థంగా పని చేసేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బ్యాంకులను సారథ్యం వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, హోల్టైమ్ డైరెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్ఐ)’లో సవరణలు చేస్తున్నట్లు ప్రకటించింది.పీఎల్ఐ అందుకోవాలంటే అర్హతలురిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్ఓఏ): బ్యాంకులకు పాజిటివ్ ఆర్ఓఏ ఉండాలి. మొత్తం బ్యాంకు మిగులుపై మెరుగైన రాబడులుండాలి.ఎన్పీఏ: నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం 25 బేసిస్ పాయింట్లు ఎన్పీఏ తగ్గించాలి.కాస్ట్ టు ఇన్కమ్ రేషియో (సీఐఆర్): సీఐఆర్ 50% లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల మధ్య నిష్పత్తిని అది సూచిస్తుంది. ఒకవేళ ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఏడాదిలో మెరుగుదల చూపించాలి.ప్రోత్సాహకాలు.. ఇతర వివరాలునిబంధనల ప్రకారం బ్యాంకులు మెరుగ్గా పనితీరు కనబరిస్తే వారి సారథులకు పీఎల్ఐలో భాగంగా ఒకే విడతలో నగదు చెల్లిస్తారు. లేటరల్ నియామకాల్లో వచ్చిన వారు, డిప్యుటేషన్ పై ఉన్న అధికారులు సహా స్కేల్ 4, ఆపై అధికారులు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగం నుంచి తొలగించిన వారు దీనికి అనర్హులు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!2023-24 ఆర్థిక సంవత్సరం పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు ఆడిట్ చేసిన గణాంకాల ఆధారంగా పనితీరును లెక్కించనున్నారు. -
ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!
చమురు రంగ పీఎస్యూ దిగ్గజాలకు వరుసగా ఐదో త్రైమాసికంలోనూ జరిమానాలు తప్పలేదు. నిబంధనల ప్రకారం సంస్థల్లో స్వతంత్ర, మహిళా డైరెక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో ఈ చర్యకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.జరిమానా విధించిన కంపెనీల జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఉన్నాయి. లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల బోర్డుల్లో అవసరమైనమేర స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను ఎంపిక చేసుకోకపోవడంతో జరిమానాల వడ్డింపు కొనసాగింది.ఇదీ చదవండి: ఫెడ్వైపు ఇన్వెస్టర్ల చూపుఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను తగిన సంఖ్యలో నిమమించుకోవడం వల్ల జరిమానాలు తప్పలేదు. గత కొద్దికాలంగా ఈ తంతు కొనసాగుతోంది. ఆయా కంపెనీలు పెనాల్టీ చెల్లిస్తున్నా తీరుమార్చుకోకపోవడం కొంత ఆందోళన కలిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ గరిష్టంగా రూ.5,36,900, కనిష్టంగా రూ.2,41,900 మధ్య జరిమానాలు విధించాయి. -
ఆ కష్టాలు ఎలా ఉంటాయో చూశాను : విజయ్ దేవరకొండ
‘‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్’ నిర్వహిస్తున్న దర్శక సంజీవని మహోత్సవంలో భాగం కావడం సంతోషంగా ఉంది. మీరంతా ఎన్నో కలలు కంటుంటారు. డ్రీమర్స్ కష్టాలు ఎలా ఉంటాయో హీరోగా ఎదగక ముందు చూశాను. స్థిరమైన ఆదాయం ఉండదు... భవిష్యత్ మీద భరోసా ఉండదు. కానీ, కలను సాకారం చేసుకోవడానికి ముందుకు సాగుతుంటారు’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీని ‘దర్శక సంజీవని మహోత్సవం’ పేరుతో హైదరాబాద్లో నిర్వహించింది. దివంగత దర్శకుడు డా. దాసరి నారాయణరావు పేరు మీద దాసరి హెల్త్ కార్డులను అందించారు. ‘‘మధ్యాహ్న భోజనం పెట్టడంతో పాటు ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ అసోసియేషన్కు నా సహకారం ఉంటుంది’’ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ. ‘‘అసోసియేషన్లోని 720 మంది హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 1920 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాం’’ అన్నారు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
ప్రభుత్వ ఒత్తిడితో రాజీనామాలు చేసిన నలుగురు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు
-
చంద్రబాబు సర్కార్ ఒత్తిడి.. విద్యుత్ సంస్థల డైరెక్టర్ల రాజీనామా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఒత్తిడితో విద్యుత్ సంస్థల డైరెక్టర్లు రాజీనామా చేశారు. పది మంది ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల డైరక్టర్లచే చంద్రబాబు సర్కార్ బలవంతంగా రాజీనామాలు చేయించింది. రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. డైరెక్టర్లచే రాజీనామా చేయించాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పది మంది డైరెక్టర్ల రాజీనామాలను విద్యుత్ శాఖ ఆమోదించింది.ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ సీఎంవో నుంచి కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. రాజీనామా చేసేంత వరకు గ్రూప్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేశారు.దేశంలో అన్ని రాష్ట్రాలలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో లీకేజీ ఆరోపణలు ఉన్నాయి.. ఏపీలో మాత్రమే లీకేజీ ఆరోపణలు లేకుండా చైర్మన్ గౌతం సవాంగ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహించారు. రికార్డు స్థాయియిలో ఆరోపణలకు తావులేకుండా ఫలితాలు వెల్లడించారు. చివరికి ప్రభుత్వ ఒత్తిడితో గౌతం సవాంగ్.. చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా లేఖను ఆయన గవర్నర్కి పంపించగా, రాజీనామాను ఆమోదించారు.ఇదీ చదవండి: ‘రింగ్’లో మింగారు!ఏపీపీఎస్సీ సభ్యులపైనా రాజీనామా చేయాలని తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ ఒత్తిడితోనే మెయిన్స్ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించడానికి ఏపీపీఎస్సీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే. -
ఎల్బీ స్టేడియంలో ఘనంగా ‘డైరెక్టర్స్ డే’ సెలబ్రేషన్స్ ( ఫొటోలు)
-
సౌత్ డైరెక్షన్కి సై అంటున్న బాలీవుడ్ హీరోలు!
బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలతో దక్షిణాది సినిమా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.సౌత్ డైరెక్టర్ల క్రేజ్ కూడా బాగా పెరిగింది. అందుకే బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి సై అంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తమిళ దర్శకుడు అట్లీ వంటి వారు బాలీవుడ్లో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణాది దర్శకులతో ఉత్తరాది హీరోలు చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. సికందర్ సిద్ధం దాదాపు పదిహేనేళ్ల క్రితమే హిందీ ‘గజిని’ కోసం హిందీ హీరో సల్మాన్ ఖాన్, తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కలిసి పని చేయాల్సింది. అయితే ఆ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించగా మురుగదాస్ దర్శకత్వం వహించారు. ‘గజిని’ బ్లాక్బస్టర్గా నిలిచింది. కానీ మురుగదాస్ మాత్రం సల్మాన్ ఖాన్తో ఎలాగైనా ఓ సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్కు ఓ కథ చెప్పారు మురుగదాస్. ఈ కథ సల్మాన్కు నచ్చలేదట. దీంతో సెట్ కాలేదు. కానీ తనతో సినిమా చేయాలనుకుంటున్న మురుగదాస్కు మరో నరేషన్ ఇచ్చే చాన్స్ ఇచ్చారు సల్మాన్. ఈసారి సల్మాన్కు కథ నచ్చడంతో సినిమా సెట్ అయ్యింది. ఈ సినిమాకు ‘సికందర్’ టైటిల్ పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ఆరంభం కానుందట. వచ్చే ఏడాది ఈద్కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ ‘ది బుల్’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు ‘షేర్షా’ వంటి హిట్ ఇచ్చిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. బాలీవుడ్ అపరిచితుడు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘అన్నియన్’ (‘అపరిచితుడు’) సినిమా బ్లాక్బస్టర్. ఈ సినిమాను రణ్వీర్ సింగ్తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు శంకర్. దాదాపు మూడేళ్ల క్రితం ఈ సినిమా ప్రకటించినా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సినిమాల పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్, ‘గేమ్ చేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నారు శంకర్. ఈ సినిమాలు విడుదలయ్యాక రణ్వీర్ సింగ్తో శంకర్ సినిమా ఉంటుందట. అయితే ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ విషయంలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో రణ్వీర్తో ‘అన్నియన్’ సినిమానే శంకర్ చేస్తారా? లేక కొత్త కథతో సెట్స్పైకి వెళ్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. దసరాకు దేవా ఈ దసరాకి షాహిద్ కపూర్ను ‘దేవా’గా థియేటర్స్కు తీసుకురావాలనుకుంటున్నారు మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్. షాహిద్ కపూర్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. హిందీలో రోషన్ ఆండ్రూస్కు ‘దేవా’ తొలి చిత్రం. కాగా షాహిద్ కపూర్ నెక్ట్స్ ఫిల్మ్ కూడా దక్షిణాది దర్శకుడుతోనే ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్ రవితో ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ ఫిల్మ్ కమిటయ్యారు షాహిద్. ‘దేవా’ పూర్తి కాగానే ‘అశ్వత్థామ: ది సాగా...’ షూటింగ్ ఆరంభం అవుతుందట. బేబీ జాన్ వస్తున్నాడు వరుణ్ ధావన్ను ‘బేబీ జాన్’గా మార్చేశారు తమిళ దర్శకుడు కాలిస్. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న సినిమా ‘బేబీ జాన్’. కాలిస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లు. ఈ సినిమా మే 31న రిలీజ్ కానుంది. హిట్ రీమేక్తో... తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ హిందీలో ‘సర్ఫిరా’గా రీమేక్ అవుతుండగా, అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. మాతృతకు దర్శకత్వం వహించిన సుధ కొంగరయే ‘సర్ఫిరా’కు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘సూరరై పోట్రు’లో నటించిన సూర్య ‘సర్ఫిరా’కు ఓ నిర్మాతగా ఉంటూ, గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రం జూన్లో విడుదల కానుంది.ఇంకా తెలుగు దర్శకులు తేజ, గోపీచంద్ మలినేని, ప్రశాంత్ వర్మ, తమిళ దర్శకుడు పా. రంజిత్ తదితరులు చెప్పిన కథలను హిందీ హీరోలు విన్నారని సమాచారం. -
ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ డైరెక్టర్స్ వీరే.
-
పేటీఎంలో మరో కీలక పరిణామం..
ఆర్బీఐ ఆంక్షల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేసేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి డైరెక్టర్లు షింజినీ కుమార్, మంజు అగర్వాల్ వైదొలిగినట్లుగా తెలిసింది. దీంతో ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో అరవింద్ కుమార్ జైన్, పంకజ్ వైష్, రమేష్ అభిషేక్ అనే ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు మాత్రమే మిగిలారు. షింజినీ కుమార్ గతంలో సిటీ బ్యాంక్, పీడబ్ల్యూసీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ వంటి సంస్థల్లో సీనియర్ పదవులను నిర్వహించారు. మంజు అగర్వాల్ ఎస్బీఐలో 34 ఏళ్లపాటు పనిచేశారు. అక్కడ ఆమె చివరి అసైన్మెంట్ డిప్యూటీ ఎండీ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో ఇప్పుడు మిగిలిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లలో అరవింద్ కుమార్ జైన్ మాజీ పంజాబ్ & సింద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. పంకజ్ వైష్ యాక్సెంచర్ మాజీ ఎండీ కాగా రమేష్ అభిషేక్ డీపీఐఐటీ మాజీ కార్యదర్శి. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు -
ఆస్కార్లో కొత్త అవార్డు
ఆస్కార్ అవార్డుల్లో ఓ కొత్త కేటగిరీ చేరనుంది. ప్రస్తుతం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. కొత్తగా క్యాస్టింగ్ డైరెక్టర్స్కు ఓ కేటగిరీని చేర్చినట్లు అకాడమీ వెల్లడించింది. దీంతో ఆస్కార్ అవార్డుల విభాగాల సంఖ్య 24కు చేరనుంది. కానీ ఈ ఏడాది మార్చి 10న జరగనున్న 96వ ఆస్కార్ అవార్డ్స్లో కానీ, 2025లో జరిగే 97వ ఆస్కార్ అవార్డ్స్లో కానీ ‘క్యాస్టింగ్ డైరెక్టర్స్’ విభాగంలో అవార్డును ప్రదానం చేయరు. 2026లో జరిగే 98వ ఆస్కార్ అవార్డ్స్లో ఈ విభాగంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. అంటే.. 2025లో రిలీజయ్యే సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ 98వ ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అవుతారు. ‘‘ఫిల్మ్ మేకింగ్ విభాగంలో, ఆస్కార్ ప్రదానోత్సవంలో క్యాస్టింగ్ డైరెక్టర్స్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇప్పుడు వారిని ఈ ప్రదానోత్సవంలో భాగం చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జానెట్ యంగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ క్రామెర్. ‘‘క్యాస్టింగ్ డైరెక్టర్స్ ఆస్కార్ అవార్డు’ అనేది మా కృషికి గుర్తింపుగా భావిస్తున్నాం. ఆస్కార్ అకాడమీకి «థ్యాంక్స్’’ అని క్యాస్టింగ్ డైరెక్టర్ బ్రాంచ్ గవర్నర్లు రిచర్డ్ హిక్స్, కిమ్ టేలర్–కోల్మన్, డెబ్రా జేన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆస్కార్ అవార్డ్స్కు సంబంధించి ఓ కేటగిరీని చేర్చారని, చివరిసారిగా 2001లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ను చేర్చారని హాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. -
డిస్కమ్ల డైరెక్టర్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లోని డైరెక్టర్లను ప్రభుత్వం తొలగించింది. వారి తొలగింపు తక్షణమే అమలులోకి వస్తుందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్ రిజ్వీ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు 2012లో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిస్కమ్ల సీఎండీలను ఆయన ఆదేశించారు. దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 11 డైరెక్టర్లు కొనసాగుతున్నారు. ఈ 11 మందిలో కేవలం ఇద్దరు డైరెక్టర్లు టి.శ్రీనివాస్ (డైరెక్టర్, ప్రాజెక్ట్స్), టీఎస్ఎన్పీడీసీఎల్ వెంకటేశ్వరరావు (డైరెక్టర్ హెచ్ఆర్) మాత్రమే 2013లో నిబంధనలకు అనుగుణంగా డైరెక్టర్లుగా నియామకమయ్యారని పేర్కొన్నారు. మిగిలిన తొమ్మిదిమంది డైరెక్టర్లు ఆరేళ్ల క్రితం ఎలాంటి నిబంధనలు పాటించకుండా నియామకమయ్యారని ఆ ఉత్తర్వుల్లో రిజ్వీ స్పష్టం చేశారు. తొలగించిన ఆ 11మంది ఎవరెవరంటే.. సోమవారం తొలగించిన 11 మంది డైరెక్టర్లలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలోని జె, శ్రీనివాస్రెడ్డి(ఆపరేషన్స్), శ్రీనివాస్(ప్రాజెక్ట్స్), కె.రాములు(కమర్షియల్, ఎనర్జీ ఆడిట్), జీ. పార్వతం(హెచ్ఆర్), సీహెచ్ మదన్మోహన్రావు(ప్రణాళిక, నిర్వహణ), ఎస్,స్వామిరెడ్డి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ), గంపా గోపాల్(ఎనర్జీ ఆడిట్).. కాగా ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో బి. వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), పి.మోహన్రెడ్డి (ప్రాజెక్ట్స్), పి. సంధ్యారాణి (కమర్షియల్), పి. గణపతి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ) ఉన్నారు. కొత్త డైరెక్టర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ.. ఇంటర్వ్యూలు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త డైరెక్టర్లను నియమించనున్నట్లు సమాచారం, ఇప్పటికే జెన్కో, ట్రాన్స్కోలో డైరెక్టర్లకు ప్రభుత్వం ఉద్వాసన పలికిన విషయం విదితమే. ఇప్పుడు పంపిణీ సంస్థల డైరెక్టర్లకు కూడా ఉద్వాసన పలకడం ద్వారా విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేసినట్లయింది. ఏళ్ల తరబడి డైరెక్టర్లుగా వాళ్లే కొనసాగడం వల్ల విద్యుత్ సంస్థల్లో పురోగతి లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నప్పటికీ.. నష్టాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై వాళ్లు దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా రూ.వేల కోట్లలో నష్టాలు పేరుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలున్నాయి, కాగా, వచ్చేనెలలో ఈ డైరెక్టర్ల పోస్టుల భర్తీ పూర్తి చేయనున్నట్లు సమాచారం. -
డిజాస్టర్ డైరెక్టర్లకు వరంలా ఎన్టీఆర్...ఎలాగంటే ?
-
పెట్టుబడులకు టెమాసెక్ ఆసక్తి
ముంబై: గ్లోబల్ పెట్టుబడుల దిగ్గజం టెమాసెక్.. దేశీయంగా పెట్టుబడులపై మరోసారి దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా సింగపూర్ సంస్థ బోర్డు డైరెక్టర్లు దేశీయంగా పర్యటనకు వచి్చనట్లు తెలుస్తోంది. ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను తాకడం, మరోపక్క రాజకీయ స్థిరత్వ పరిస్థితులు ఇందుకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ వెలుగుతున్న నేపథ్యంలో 11మంది సభ్యులుగల టెమాసెక్ బోర్డు దేశీయంగా పెట్టుబడులపై అత్యంత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న మూడేళ్ల కాలంలో 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే వ్యూహంతో టెమాసెక్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, ముంబైలలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేషన్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. సగటున 1.5 బిలియన్ డాలర్లు దాదాపు గత రెండు దశాబ్దాలలో టెమాసెక్ సగటున ఏడాదికి 1–1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. ఈ బాటలో ప్రస్తుతం పెట్టుబడులను మూడు రెట్లు పెంచే యోచనలో ఉంది. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీయంగా పెట్టుబడులకు తరలి వస్తున్న నేపథ్యంలో టెమాసెక్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలలో అధికార బీజేపీ విజయం సాధించడంతో పాలసీలు కొనసాగనున్నట్లు విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పటిష్ట వృద్ధిని సాధించడం జత కలుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో హెల్త్కేర్ రంగంలోని మణిపాల్ హాస్పిటల్స్లో 2 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చించి టెమాసెక్ మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. ఇది భారీ డీల్కాగా.. ఇప్పటికే ఓలా, జొమాటో, డాక్టర్ అగర్వాల్స్ హెల్త్కేర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, క్యూర్ఫిట్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇషా అంబానీకి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా మరో ఇద్దరు
జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ'తో పాటు అన్షుమాన్ ఠాకూర్, హితేష్ కుమార్ సేథియాలను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్బీఐ ఈ నియామకాలకు నవంబర్ 15న ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం నియామక తేదీ నుంచి ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ గడువులోపల ప్రతిపాదనలను అమలు చేయడంలో కంపెనీ విఫలమైతే.. ముందుగా ప్రతిపాదించిన మార్పులను అమలు చేయకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. 'ఇషా అంబానీ' యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్బీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తరువాత రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్లో చేరింది. ఆ తరువాత రిలయన్స్ రిటైల్ విభాగాన్ని చేపట్టి కంపెనీకి లాభాలు రావడానికి కృషి చేసింది. ఇటీవల ఈమె నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంపికైంది. అన్షుమాన్ ఠాకూర్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్, ఐఐఎం అహ్మదాబాద్లో MBA పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి విభిన్న పరిశ్రమలలో పనిచేశారు. ప్రస్తుతం ఇతడు జియో ప్లాట్ఫారమ్ లిమిటెడ్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ హితేష్ కుమార్ సేథియా.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పృథివీ విద్యార్ధి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. యితడు ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా వంటి దేశాల్లో సుమారు 20 సంవత్సరాలు ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఆ తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ కెనడా, ఐసీఐసీఐ బ్యాంక్ జర్మనీ, యూకే, హాంకాంగ్లలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించారు. -
భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంచాలి.. సింగరేణి డైరెక్టర్ల దిశానిర్దేశం..!
పెద్దపల్లి: భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణి డైరెక్టర్లు జి.వెంకటేశ్వర్రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూగర్భ గనుల్లో పూర్తిస్థాయి యంత్రాల వినియోగం పెంచాలన్నారు. షిఫ్ట్ల వారీగా భూగర్భ గనుల్లో మ్యాన్పవర్ గురించి తెలుసుకున్నారు. రక్షణ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. కాన్ఫరెన్స్లో ఆర్జీ–1 జీఎం చింతల శ్రీనివాస్, ఏరియ ఇంజినీర్ రామ్మూర్తి, ఓసీ–5 ప్రాజెక్ట్ అధికారి కె.చంద్రశేఖర్, ఏజెంట్ చిలక శ్రీనివాస్, బానోతు సైదులు, ఏజీఎం ఐఈడీ ఆంజనేయులు, క్వాలిటీ డీజీఎం శ్రీధర్, మేనేజర్లు నెహ్రూ, రమేష్బాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వకీల్పల్లిగనిలో.. రామగుండం డివిజన్–2 వకీల్పల్లిగనిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలని డైరెక్టర్లు సూచించారు. శుక్రవారం ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు మాట్లాడారు. ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లి భూగర్భగనుల్లో ఉన్న యంత్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఎల్హెచ్డీ, ఎస్డీఎల్, కంటిన్యూస్ మైనర్యంత్రాల పనితీరు మరింత మెరుగుపర్చాలన్నారు. వకీల్పల్లిగని ఆగస్టులో 119శాతం బొగ్గు ఉత్పతి సాధించడంపై అభినందించారు. కాన్ఫరెన్స్లో ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, ఇన్చార్జి మేనేజర్ తిరుపతి, గ్రూప్ ఇంజినీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
సుమన్కి నటకేసరి
శతాధిక చిత్ర దర్శకులు దివంగత కోడి రామకృష్ణ జయంతి వేడుకలు వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక సేవాతత్పరులు, ప్రతిభావంతులకు ఈ పురస్కారాలు అందించారు. నటుడు సుమన్కి ‘నట కేసరి’ బిరుదు ప్రదానం చేశారు. ‘‘కోడి రామకృష్ణగారి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేయడమే ఈ పురస్కారాల ముఖ్యోద్దేశం’’ అన్నారు నిర్వాహకులు టి. రామ సత్యనారాయణ, వీబీజీ రాజు, కొత్త వెంకటేశ్వరరావు. దర్శకులు కార్తీక్ వర్మ దండు, రామ్ అబ్బరాజు, వెంకట్ పెదిరెడ్ల, రచయిత భాను తదితరులు పురస్కారాలు అందుకున్నారు. కోడి రామకృష్ణ కుమార్తె, నిర్మాత కోడి దివ్య పాల్గొన్నారు. -
డైరెక్టర్ అసభ్య ప్రశ్న.. కౌంటర్ ఇచ్చిన టాప్ హీరోయిన్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లలో షెర్లిన్ చోప్రా ఒకరు. అక్కడ ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. 2012లో 'ప్లేబోయ్' అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది షెర్లిన్ చోప్రా. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు వివాదస్పద విషయాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈమె పక్కా హైదరాబాదీనే తన చదవు, బాల్యం అంతా ఇక్కడే.. సినిమాలపై ఆసక్తితో తను ముంబయిలో అడుగు పెట్టింది. గతంలో కొంతమంది సినీ దర్శకులు తనను బాడీషేమింగ్ చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా బయటపెట్టింది. (ఇదీ చదవండి: 'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే) 'నా వక్షోజాల గురించి చాలా మంది దర్శకులు ఓపెన్గానే సర్జరీ చేయించుకున్నావా అని అడిగేవారు. ఇలాంటి వారి లిస్ట్ చాలానే ఉంది. నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి అవును.., చేయించుకున్నాననే చెప్పాను. ఎందుకంటే నాపై భాగం ఫ్లాట్గా ఉంటడం నాకు నచ్చలేదన్నాను. దీంతో వెంటనే వాళ్లు ఓసారి టచ్ చేయొచ్చా..? సైజ్ ఎంత..? అని అడిగారు. ఆ సమయంలో నాకు చాలా ఆశ్చర్యమేసింది. హీరోయిన్ల కప్ సైజు తెలుసుకున్న తర్వాతే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారా? అంటూ.. ఆ డైరెక్టర్ను ఇలా అడిగాను. నీకు పెళ్లయింది. కాబట్టి స్త్రీ శరీర నిర్మాణ శాస్త్రం గురించి తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్లండని చెప్పాను. దానికి అతను తన భార్యతో మాత్రం ఓపెన్గా మాట్లడలేడంట. కానీ నాతో మాత్రం ఇలా మాట్లాడుతానంటున్నాడు.' అని పేర్కొంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ షో ఫేక్.. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు) ఇలా సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకుల నుంచి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అలాంటి వారిలో కొందరైతే ఏకంగా డిప్రెషన్ ఎపిసోడ్ల నుంచి బయటపడేందుకు డ్రగ్స్లో మునిగిపోవాలని చాలాసార్లు సూచించారని, కానీ అలాంటి వాటికి దూరంగానే ఉండేదానినని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sherlyn Chopra (@_sherlynchopra_) -
హాలీవుడ్లో సమ్మె సైరన్.. 60 ఏళ్ల తర్వాత ఇలా..
ప్రపంచవ్యాప్త్తంగా సినిమా పరిశ్రమకు ‘పెద్దన్న’ అని హాలీవుడ్కి పేరు. భారీ బడ్జెట్ చిత్రాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సం΄ాదించుకుంది హాలీవుడ్. ఇప్పుడు ఆ హాలీవుడ్ నిరసనలతో భగభగమంటోంది. సమ్మె సైరన్ తప్ప యాక్షన్.. సౌండ్లాంటి షూటింగ్ లొకేషన్లో వినిపించే మాటలు వినిపించడంలేదు. నటీనటులు మేకప్ వేసుకోవడంలేదు.. రచయితలు కలం మూత తెరవడంలేదు. దాంతో షూటింగులు నిలిచిపోయాయి. కరోనా టైమ్లో వెలవెలబోయినట్లు స్టూడియోలు కళ తప్పాయి. ఇన్నాళ్లుగా సమ్మె చేస్తూ వచ్చిన రచయితల సంఘానికి నటీనటుల సంఘం మద్దతు తెలిపింది. ‘వేతనాలు పెంచండి... గౌరవించండి... సౌకర్యాలు సమకూర్చండి..’ అంటూ పలు నినాదాలతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళదాం.. హాలీవుడ్ చిత్ర పరిశ్రమని డబుల్ స్ట్రయిక్ కుదిపేస్తోంది. ఓ వైపు కొన్నాళ్లుగా ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. తాజాగా ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెకు పిలుపునిచ్చింది. తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తున్న నిర్మాణ సంస్థలు తమకు కనీస వేతనాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో పదకొండు వారాలుగా రచయితలు సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ నటీనటులు సైతం రైటర్స్ సమ్మెలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణ సంస్థలు, ఓటీటీలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో భారతీయ కాలమానం ప్రకారం గురువారం రాత్రి సమ్మె ఆరంభమైంది. దీంతో షూటింగ్లు ఆగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథస్సు) హాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కృత్రిమ మేథస్సుతో పని చేసే ఓ యాంకర్ని ఇటీవలే పరిచయం చేశారు. ఈ సెగ హాలీవుడ్కు బాగానే తాకింది. కృత్రిమ మేథస్సుతో ముప్పు పొంచి ఉందని, తమ భవిష్యత్తుకి భరోసా ఇవ్వడంతోపాటు జీతాలు పెంచాలని, సరైన పని నిబంధనలను కల్పించాలని ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ‘ఏ’ లిస్ట్ యాక్టర్స్తో సహా 1,60,000 మంది నటీనటులకు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్’ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రధాన నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ నిరవధిక సమ్మెకు దిగింది. ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’, ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెతో ప్రస్తుతం కొనసాగుతున్న హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ‘ఓపెన్ హైమర్’ ప్రీమియర్ నుండి నిష్క్రమణ... క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ఓపెన్ హైమర్’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా లండన్లో గురువారం ఈ సినిమా ప్రీమియర్ వేశారు. అయితే గురువారం అర్ధరాత్రి ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెప్రారంభం కావడంతో ‘ఓపెన్ హైమర్’ ప్రీమియర్ నుండి యాక్టర్స్ రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫీ, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్ వంటి స్టార్స్తో సహా పలువురు నటీనటులు వెళ్లిపోయినట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. హాలీవుడ్ ప్రముఖ సంస్థలు ‘పారామౌంట్, వార్నర్ బ్రదర్స్, డిస్నీ, నెట్ ఫ్లిక్స్’ వంటి వాటి ప్రధాన కార్యాలయాల వద్ద శుక్రవారం ఉదయం పికెటింగ్ (సమ్మె)ప్రారంభించారని టాక్. ఎమ్మీ, ఆస్కార్ అవార్డ్ వాయిదా? హాలీవుడ్లో మొదటిసారి 1960లో నటుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో రచయితల సంఘం, నటీనటుల సంఘం కలిసి డబుల్ స్ట్రైక్ చేశాయి. అలానే 1980లో స్క్రీన్ యాక్టర్స్ సమ్మె మూడు నెలలపాటలు జరిగింది. మళ్లీ 63 ఏళ్లకు ఇప్పుడు రచయితల, నటీనటుల సంఘం కలసి డబుల్ స్ట్రైక్ చేస్తుండటం విశేషం. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే పెద్ద చిత్రాల విడుదల వాయిదా పడే పరిస్థితి. అలాగే సెప్టెంబర్ 18న జరగనున్న ఎమ్మీ అవార్డ్స్, టెలివిజన్ వెర్షన్ ఆస్కార్ అవార్డులు కూడా నవంబర్ లేదా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందని హాలీవుడ్ మీడియాలోవార్తలొస్తున్నాయి. ∙ సమ్మె బాధాకరం ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెను స్టూడియోలకుప్రాతినిధ్యం వహిస్తున్న ‘అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్’ తప్పుబట్టింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సినిమాలు, టీవీ కార్యక్రమాలకు జీవం పోసే నటీనటులు లేకుండా స్టూడియోలు పని చేయవు. కాబట్టి సమ్మె అనేది ఆశించిన ఫలితం ఇవ్వదు. పరిశ్రమపై ఆధారపడిన వేల మంది కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు దారి తీసే మార్గాన్ని యూనియన్ ఎంచుకోవడం బాధాకరం’’ అని పేర్కొంది. -
బైజూస్లో ఏం జరుగుతోంది? ఆడిటర్గా తప్పుకున్న డెలాయిట్.. డైరెక్టర్ల రాజీనామా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కంపెనీ ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ తప్పుకోగా మరోవైపు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. వివరాల్లోకి వెడితే .. 2021–22 ఆర్థిక సంవత్స ఆర్థిక ఫలితాల రూపకల్పనలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తమ కాంట్రాక్టు ముగియడానికి మూడేళ్ల ముందే రాజీనామా చేసినట్లు డెలాయిట్ తెలిపింది. ఆడిటింగ్ కోసం తాము తరచుగా బైజూస్ ఎండీ బైజూ రవీంద్రన్కి లేఖలు రాస్తూనే ఉన్నప్పటికీ తమకు ఎటువంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఫలితంగా ఇప్పటివరకూ ఆడిట్ ప్రారంభించలేకపోయామని డెలాయిట్ వివరించింది. దీంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్ బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది. డెలాయిట్ 2016 నుంచి బైజూస్కి ఆడిటర్గా వ్యవహరిస్తోంది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తించేలా అయిదేళ్ల పాటు బీడీవో (ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్)ను చట్టబద్ధ ఆడిటర్లుగా నియమించుకున్నట్లు బైజూస్ మరో ప్రకటనలో తెలిపింది. బీడీవో ప్రస్తుతం ఐసీఐసీఐ, సిస్కో వంటి దిగ్గజాలకు ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. టర్నోవరుపరంగా టాప్ అయిదు గ్లోబల్ ఆడిట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఇక బైజూ రవీంద్రన్తో అభిప్రాయభేదాల కారణంగా డైరెక్టర్ల బోర్డులో ముగ్గురు రాజీనామా చేశారు. పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా క్యాపిటల్)కి చెందిన జీవీ రవిశంకర్, చాన్ జకర్బర్గ్ ఇనీíÙయేటివ్ ప్రతినిధి వివియన్ వూ, ప్రోసస్కి చెందిన రసెల్ డ్రీసెన్స్టాక్ వీరిలో ఉన్నారు. బోర్డులోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో మిగతా ముగ్గురు బైజూ రవీంద్రన్, దివ్యా గోకుల్నాథ్, రిజూ రవీంద్రన్ ఉన్నారు. అటు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టే వరకూ ఆగాలని బైజూస్ భావించడమే ఆడిటింగ్ జాప్యానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైజూస్ కొత్త గ్రూప్ సీఎఫ్వోగా అజయ్ గోయల్ నెల రోజుల క్రితమే చేరారని, వచ్చే వారం తర్వాత నుంచి ఆడిటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించాయి. -
కథ మళ్లీ కలిపింది
ఒక హీరో–ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమా ఇస్తే.. వారిది ‘హిట్ కాంబో’ అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్లో రెండో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తమ కాంబో రిపీట్ అవ్వాలని హీరో–డైరెక్టర్కి కూడా ఉంటుంది. కానీ కథ కుదరాలి. అలా కొందరు హీరో–దర్శకులను మళ్లీ కథ కలిపింది. రెండోసారి రిపీట్ అవుతున్న ఆ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. దశాబ్దాల తర్వాత హీరోగా కమల్హాసన్, దర్శకుడిగా మణి రత్నంలది ఇండస్ట్రీలో సుధీర్ఘ ప్రయాణం. కానీ కమల్హాసన్, మణిరత్నంల కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రం ఒక్కటే. అదే ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’–1987). అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్బాస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ కమల్, మణిరత్నంల కాంబినేషన్లో మరో సినిమా సెట్స్పైకి వెళ్లలేదు. ముప్పైఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమల్, మణిరత్నంల కాంబో రిపీట్ కానుంది. మరోవైపు దర్శకుడు శంకర్తో ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు కమల్హాసన్. శంకర్, కమల్ కాంబోలోనే 1996లో రిలీజైన బ్లాక్బస్టర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్ ఇది. సో.. కమల్–శంకర్ కాంబో మళ్లీ సెట్ అవ్వడానికి పాతికేళ్లు పైనే పట్టింది అన్నమాట. దేవర ఎన్టీఆర్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్’ ఒకటి. క్లాస్ టచ్తో మాస్ ఎలిమెంట్స్ను జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా సెట్స్పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. విస్మరణకు గురైన భారతదేశ తీర ప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్లోని పవర్ఫుల్ మాస్ యాంగిల్ని ‘ఇస్మార్ట్ శంకర్’ (2019)లో వెండితెరపైకి తెచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్ కెరీర్లకు ఆ సమయంలో బాగా బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేయనున్నారు రామ్ అండ్ పూరి. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ ‘గీత గోవిందం’ (2018)తో రూ. వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. ఐదేళ్ల తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో సెకండ్ ఫిల్మ్గా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. కాగా ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్ని పరిశీలిస్తున్నారని సమాచారం. అడ్వంచరస్ డ్రామా రెండున్నరేళ్ల క్రితం కోవిడ్ సమయంలో విడుదలైన ‘భీష్మ’ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పుడు నితిన్–వెంకీ కుడుమల రెండోసారి మరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల మొదలయ్యాయి. అడ్వెంచరస్ ఎంటర్టైనర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాక్షస రాజు ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రంలో జోగేంద్ర పాత్రలో హీరో రానా కాస్త నెగటివ్ షేడ్స్లో మెప్పించారు. అలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తేజ. అయితే రానా, తేజ కాంబోలో మరో సినిమా కన్ఫార్మ్ కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. రానా, తేజ కాంబినేషన్లోని సెకండ్ ఫిల్మ్ ‘రాక్షస రాజు’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. భైరవ కోనలో... ‘టైగర్’ (2015) చిత్రం కోసం తొలిసారి చేతులు కలిపారు హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. సస్పెన్స్, థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు, దర్శకులు తమ కాంబోలో రెండో సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. -
ధూమ్ ధామ్ రసూల్ మాటలు వింటే మస్తు నవ్వుకుంటారు
-
చిరంజీవి దారిలో దూసుకుపోతున్న బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్
-
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
సినిమాల్లో క్లైమాక్స్ అదుర్స్
-
ఫ్లోప్ డైరెక్టర్స్ కు మాస్ రాజా హెల్పింగ్ హ్యాండ్
-
జాతీయ, అంతర్జాతీయ ఎకానమీపై ఆర్బీఐ చర్చ
హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీక్షించింది. సవాళ్లను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 601వ సమావేశం హైదరాబాద్లో జరిగింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు సతీష్ కే మరాఠే, సచిన్ చతుర్వేది, పంకజ్ రామన్భాయ్ పటేల్, రవీంద్ర హెచ్ ధోలాకియా పాల్గొన్నారు. డిప్యూటీ గవర్నర్లు మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్లు కూడా హాజరయ్యారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషిలూ సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ చర్యలపై సమీక్ష జరపడంతోపాటు, 2023–24 అకౌంటింగ్ ఇయర్ బడ్జెట్ను ఆమోదించింది. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభం, అయినప్పటి కీ అమెరికా, ఈయూ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్సహా పలు దేశాలు కీలక రేట్ల పెంపు బాటలోనే ఉన్న నేపథ్యంలో తాజా సమావేశం జరిగింది. కాగా, భారత్ బ్యాంకింగ్ పటిష్టతపై విధాన నిర్ణేతలు, నిపుణులు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. -
ఇండస్ట్రీ హిట్స్కి గురి పెడుతోన్న దర్శకులు, హీరోలు
-
రీమేక్ సినిమా చేస్తే ఆ డైరెక్టర్ కెరీర్ క్లోజ్ అయినట్టే
-
తెలుగు డైరెక్టర్స్ కి తమిళ హీరోలు ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా ..?
-
ఆ సినిమా దెబ్బకు ఉన్న ఇల్లు కూడా అమ్మేశా: మహేశ్
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మహేష్ కొఠారే మరాఠీ, హిందీలో పలు చిత్రాలను తెరకెక్కించారు. చైల్డ్ ఆర్టిస్ట్గా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆయన పలు సినిమాలు నిర్మించారు. కొఠారే రాజా ఔర్ రంక్, ఛోటా భాయ్, మేరే లాల్, ఘర్ ఘర్ కి కహానీ వంటి చిత్రాలలో నటించారు. ఆ తర్వాత ధూమ్ ధడకా (1985) సినిమాతో దర్శకత్వం ప్రారంభించారు. అయితే ఆయన తాజాగా తన జీవితంలోని అనుభవాలను వివరిస్తూ ఓ పుస్తకాన్ని రచించారు. గతవారమే ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. తన జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్ట పరిస్థితులను మహేశ్ కొఠారి వివరించారు. హిందీ, మరాఠీలో పలు హిట్ చిత్రాలు నిర్మించిన మహేశ్ 'యామ్ ఇట్ ఆనీ బరాచ్ కహి' పేరుతో గతవారం పుస్తకం విడుదల చేశారు. తన జీవితంలోని అత్యంత కష్టతరమైన దశ గురించి పుస్తకంలో వివరించారు. తన 60 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. మహేశ్ పుస్తకంలో వివరిస్తూ..' నేను 1962లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ వన్, ఇప్పుడు డిజిటల్ సినిమాలు చేశా. నా జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూశా. నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో నేను చాలా అవమానానాలు ఎదుర్కొన్నా. నేను 1999లో లో మైన్ ఆగయా అనే హిందీ సినిమా తీశా. ఈ చిత్రంలో గోవింద మేనల్లుడు విజయ్ ఆనంద్ హీరో. అది నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ ప్రభావం నాపై దాదాపు 15 ఏళ్లు కొనసాగింది. ఆ కష్టకాలాన్ని అధిగమించేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ దెబ్బకు మా ఇంటిని కూడా అమ్మేశాం. నా కొడుకు ఎంబీఏ అడ్మిషన్ కోసం ఫీజు చెల్లించలేని పరిస్థితి. కానీ నా పరిస్థితిని కొడుకు అర్థం చేసుకుని డబ్బులు అడగలేదు. కానీ ఈ ప్రభావం నా కుటుంబంపై పడకుండా ఉండేందుకు నేను నా వంతు ప్రయత్నం చేశా.' అని వివరించారు. -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ టాలీవుడ్ డైరెక్టర్స్
-
టాలీవుడ్ డైరెక్టర్ల వైపు చూస్తున్న ధనుష్
-
సైలెంట్గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే
ప్రతి ఏడాది కొత్త దర్శకులు పరిచయం అవుతుంటారు. ఈ ఏడాది కూడా కొత్త డైరెక్టర్లు వచ్చారు. దాదాపు పదిహేనుకు పైగా కొత్త దర్శకులు వస్తే.. అందులో హిట్ బొమ్మ (సినిమా) ఇచ్చిన దర్శకులు ఎక్కువగానే ఉన్నారు. ఇలా హిట్ డైరెక్షన్తో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. డీజే సౌండ్ అదిరింది ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవానికి రెండు రోజుల ముందు వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ రోల్లో సిద్ధు జొన్నలగడ్డ నటించగా, నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రను నేహా శెట్టి చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్, ‘పటాస్ పిల్ల’ పాటలు శ్రోతలను ఊర్రూతలూగించాయి. ఈ డీజే హిట్ సౌండ్ ఇచ్చిన కిక్తో సీక్వెల్గా ‘డీజేటిల్లు స్వై్కర్’ను తీస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పసందైన కళ్యాణం ‘రాజావారు రాణిగారు, అద్భుతం’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా చేసిన విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్ సేన్కు ఈ సినిమాతో క్లాస్ ఇమేజ్ తెప్పించారు విద్యాసాగర్. ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి దర్శకత్వం వహించిన రవికిరణ్ కోల ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ప్లే ఇచ్చి షో రన్నర్గా వ్యవహరించారు. భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ ‘అర్జున కళ్యాణం’ మే 6న విడుదలై, ప్రేక్షకులకు పసందైన అనుభూతినిచ్చింది. కలెక్షన్ కింగ్ కల్యాణ్రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘బింబిసార’. ఈ హిట్ ఫిల్మ్తో దర్శకుడిగా పరిచయం అయ్యారు వశిష్ఠ. రాజుల కాలం, ప్రస్తుత కాలం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి కలెక్షన్ కింగ్ అనిపించుకుంది. ఇక ‘బింబిసార– 2’ కూడా ఉండొచ్చనే హింట్ ఇచ్చారు వశిష్ఠ. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా కె. హరికృష్ణ నిర్మించిన ‘బింబిసార’ ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైంది. డబుల్ ధమాకా తెలుగు, తమిళ ప్రేక్షకుల మెప్పును ఒకే సినిమాతో పొందిన డబుల్ ధమాకా శ్రీకార్తీక్ దక్కింది. శర్వానంద్ హీరోగా అక్కినేని అమల, ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాష్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకుడు. సెప్టెంబరు 9న ఈ సినిమా విడుదలైంది. తల్లీకొడుకుల సెంటిమెంట్కు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మిళితం చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీకార్తీక్. మంచి ముత్యం సరోగసీ కాన్సెప్ట్తో వినోదాత్మకంగా ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందారు దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ. ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ తర్వాత లక్ష్మణ్ దర్శకత్వంలో వచ్చిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘స్వాతి ముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అయితే హీరో బెల్లంకొండ గణేష్కు కూడా ఇది తొలి చిత్రమే. వీరిద్దరూ మంచి ముత్యంలాంటి సినిమా ఇచ్చి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్కడ హిట్.. ఇక్కడా హిట్టే... ‘ఓ మై కడవులే’ (2020)తో తమిళ పరిశ్రమకు దర్శకునిగా పరిచయమయ్యారు అశ్వత్ మారిముత్తు. ఇదే సినిమా రీమేక్ ‘ఓరి.. దేవుడా’తోనే తెలుగులోనూ దర్శకునిగా పరిచయం అయ్యారు అశ్వత్. ‘ఓరి.. దేవుడా..’ కూడా ఓ మాదిరి హిట్గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. అక్టోబరు 21న విడుదలైన ఈ చిత్రానికి ‘దిల్’ రాజు, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మాతలు. థ్రిల్లింగ్ హిట్ ‘అంబులి’ సినిమాతో తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు దర్శక–ద్వయం హరి శంకర్–హరీష్ నారాయణ్. ఈ ఇద్దరూ తెరకెక్కించిన ‘యశోద’ గత నెల రిలీజై, హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత టైటిల్ రోల్లో, వరలక్ష్మీ శరత్కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో తెలుగుకు దర్శకులుగా పరిచయం అయ్యారు హరి–హరీష్. సరోగసీ నేపథ్యంలో జరిగే క్రైమ్స్ నేపథ్యంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 11న విడుదలై, థ్రిల్లింగ్ హిట్ ఇచ్చింది. హిట్ హారర్ ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్గా నిలిచిన చిత్రాల జాబితాలో ‘మసూద’ ఉంది. సూపర్ నేచురల్ హారర్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకుడు. సంగీత, తీరువీర్, కావ్య కళ్యాణ్రామ్, ‘శుభలేఖ’ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం నవంబరు 18న విడుదలైంది. ఇంకొందరు... రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో శరత్ మండవ (తెలుగులో శరత్కు తొలి చిత్రం) వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా ‘గని’తో కిరణ్ కొర్రపాటి, నితిన్ పొలిటికల్ డ్రామా ‘మాచర్ల నియోజకవర్గం’ తో ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీ విష్ణు ‘అల్లూరి’ తో ప్రదీప్వర్మ, ‘టెన్త్క్లాస్ డైరీస్’తో సినిమాటోగ్రాఫర్ అంజి, సుమ కనకాల ‘జయమ్మ పంచాయితీ’ తో విజయ్కుమార్ కలివరపు, హర్ష్ కనుమిల్లి ‘సెహరి’తో జ్ఞానశేఖర్ ద్వారక, రాజ్తరుణ్ ‘స్టాండప్ రాహుల్’తో శాంటో, వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా..’తో గిరీశాయ (తెలుగులో...), ‘ముఖచిత్రం’ సినిమాతో గంగాధర్ వంటి దర్శకులు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేశారు. -
తెలుగులో కొత్త కథలు లేవా..? పరభాష చిత్రాలనే అరువు తెచ్చుకోవాలా..?
-
కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వెబ్ సిరీస్లివే!
ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అంటే గతంలో థియేటరే.. కానీ, ప్రస్తుతం బుల్లితెర కూడా ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతోంది. పైగా కరోనా లాక్డౌన్లో ప్రేక్షకులకు ఓటీటీలు మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యాయి. ఇంట్లో కూర్చునే అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్లు, షోలు చూస్తున్నారు. వెబ్ సిరీస్లకు ఆదరణ బాగా ఉండటంతో సినిమా దర్శకులు సైతం ‘ఓటీటీకి సై’ అంటూ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు ఓటీటీలోకి ఎంటర్ కాగా తాజాగా ఈ జాబితాలోకి కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వంటి దర్శకులు చేరారు. ఈ దర్శకుల ఓటీటీ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్షన్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ.. ఇలా ఏ జోనర్ సినిమా అయినా తన మార్క్ చూపించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. తదుపరి ప్రాజెక్ట్గా దాదాపు రూ. 300 కోట్లతో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు కృష్టవంశీ. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్ సిరీస్గా మలచనున్నట్లు తెలిపారాయన. ఒక్కో సీజన్కు 10 ఎపిసోడ్స్ చొప్పున 5 సీజన్స్గా ఈ సిరీస్ని రూపొందించనున్నారట. ఇక సమాజంలోని వాస్తవ అంశాలను, నవలలను, చారిత్రక అంశాలను కథలుగా మలిచి వెండితెరపైకి తీసుకురావడంలో క్రిష్ జాగర్లమూడిది ప్రత్యేక శైలి. ఇప్పటికే ‘మస్తీస్, 9 అవర్స్’ వంటి వెబ్ సిరీస్లకు షో రన్నర్గా వ్యవహరించిన ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేయనున్నారని టాక్. ఒక వేశ్య జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా ‘హరి హర వీర మల్లు’ షూటింగ్లో బిజీగా ఉన్న క్రిష్ ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్ను పట్టాలెక్కిస్తారని భోగట్టా. కాగా ‘కన్యాశుల్కం’ నవలను కూడా వెబ్ సిరీస్గా తీయాలనుకుంటున్నార ట క్రిష్. మరో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ వినూత్న కథాంశాలతో ‘24’, ‘మనం’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రేమ కథలతో యువతని, కుటుంబ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన విక్రమ్ కె. కుమార్ బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టనున్నారు. తొలిసారి ఆయన ‘దూత’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ద్వారా హీరో నాగచైతన్య ఫస్ట్ టైమ్ డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘మనం, థ్యాంక్యూ’ చిత్రాల తర్వాత చైతన్య–విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘దూత’ హారర్, థ్రిల్లర్ జానర్లో ఉంటుందని సమాచారం. నాగచైతన్య పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇందులో హీరోయిన్లు పార్వతి, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రముఖ ఓటీటీలో ‘దూత’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘అందాల రాక్షసి’ వంటి ప్రేమకథా చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, గత శుక్రవారం విడుదలైన ‘సీతారామం’ వరకూ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కిస్తూ లవ్స్టోరీస్ స్పెషలిస్టు అనిపించు కున్నారు హను రాఘవపూడి. ప్రేమకథలకు సెంటిమెంట్, భావోద్వేగాలను జత చేసే ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్కి పచ్చజెండా ఊపారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. అయితే ఈ సిరీస్లోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ రాలు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్ ప్రకటించినవారిలో దర్శకుడు తేజ ఉన్నారు. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటించారాయన. అయితే ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలియాల్సి ఉంది. కొందరు యువదర్శకులు కూడా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘పిట్ట కథలు’లో ఓ ఎపిసోడ్కి దర్శకత్వం వహించారు. తాజాగా సోనీ లివ్ కోసం ఓ వెబ్ సిరీస్ కమిట్ అయ్యారు. అలాగే ‘బెస్ట్ యాక్టర్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్, వజ్ర కవచధర గోవింద’ వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ ‘బిగ్ బాస్’ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘అసుర’ మూవీ డైరెక్టర్ కృష్ణ విజయ్ కూడా ‘పరంపర’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. గోపీచంద్ హీరోగా ‘పంతం’ సినిమాని తెరకెక్కించిన కె. చక్రవర్తి రెడ్డి ‘పులి–మేక’ అనే ఓ వెబ్ సిరీస్కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంటోంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు వెబ్ సిరీస్ల కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటీటీలో రిలీజ్ కానున్న అమలాపాల్ విక్టిమ్
వినూత్న ప్రయోగాత్మక చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తరువాత నిర్మాతలకు మరింత లిబర్టీ లభిస్తుందనే చెప్పాలి. దర్శకుల భావాలను స్వేచ్ఛగా ఆవిష్కరించే అవకాశం లభిస్తోంది. ఆ విధంగా రూపొందుతున్న వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఒక సరికొత్త ప్రయోగమే విక్టిమ్ వెబ్ సిరీస్. నాలుగు ఎపిసోడ్స్తో రూపొందిన ఈ ఆంథాలజీ సిరీస్ను నలుగురు ప్రముఖ దర్శకులు రూపొందించడం విశేషం. ఒకే కాన్పెప్ట్ను నలుగురు దర్శకులు కలిసి తెరకెక్కించారు. దర్శకుడు వెంకట్ ప్రభు కన్ఫెషన్ పేరుతోనూ, పా.రంజిత్ దమ్మమ్ పేరుతోనూ, శింబుదేవన్ మొట్టై మాడి సిద్ధర్ పేరుతోనూ, ఎం.రాజేష్ విరాజ్ పేరుతోనూ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఫైనల్గా విక్టిమ్ పేరుతో రిలీజవుతోంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకులు వెంకట్ ప్రభు, పా.రంజిత్, సింబుదేవన్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ముందుగా దర్శకుడు శింబుదేవన్ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. దానికి రూపమే ఈ వెబ్ సిరీస్ అని తెలిపారు. దర్శకులు అందరం మాట్లాడుకుని ఒకే కాన్సెప్ట్ తమ ఆలోచనల మేరకు రూపొందించాలని అనుకున్నామన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా సాగే సిరీస్ అని, ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అవుతారని పేర్కొన్నారు. పా.రంజిత్ మాట్లాడుతూ ఈ కాన్సెప్ట్ గురించి తనకు చెప్పగానే తాను నిజ జీవితంలో చూసిన సంఘటనకు దగ్గరగా ఉందని భావించానన్నారు. తాను రూపొందించిన దమ్మమ్ ప్లాట్ తనను నిజజీవితంలో ఇన్స్పైర్ చేసిన సంఘటన అని తెలిపారు. కాగా ఇందులో నటుడు ప్రసన్న, ప్రియా భవాని శంకర్, అమలాపాల్, నట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: స్టార్ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! వచ్చే నెల నుంచి కొత్త వీపీఎఫ్ చార్జీలు అమలు! -
ముందే స్క్రిప్ట్ ఇస్తే నటులు ఇంకా బాగా చేస్తారు: చిరంజీవి
-
టాలీవుడ్ డైరెక్టర్లకు చిరంజీవి చురకలు..
Chiranjeevi Shocking Comments On Tollywood Directors: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ ఆదివారం (జులై 24) గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేసిన చిరంజీవి టాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ నటన గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అమీర్లా తమకు చేయాలని ఉన్నా పలు పరిధుల వల్ల తాము చేయలేకపోతున్నామని చిరు చెప్పిన విషయం తెలిసిందే. అలాంటి పరిధుల గురించి ఈ కార్యక్రమంలో చిరంజీవి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ డైరెక్టర్లకు చురకలు అంటించారు. ''కొందరు డైరెక్టర్లు షూటింగ్ స్పాట్లో అప్పటికప్పుడు డైలాగ్లు ఇస్తున్నారు. ఇది నటులను చాలా ఇబ్బంది పెడుతోంది. నాకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది. స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్లు మరింత శ్రమించాలి. స్క్రిప్ట్ గురించి మిగతా టెక్నిషియన్స్కు ముందుగానే తెలిస్తే వారు పనిచేసే విధానం వేరు. దానికి వచ్చే ఫలితం వేరేలా ఉంటుంది. ఆ ఫలితం సినిమాపై చూపిస్తుంది. చదవండి: చిరంజీవికి పానీపూరి తినిపించిన అమీర్ ఖాన్.. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు ఏమైపోయిందంటే.. సినిమాలో ప్రధాన హీరోకు సీన్స్ తెలుసేమో గానీ, అప్పుడే వచ్చిన కమెడియన్స్కు గానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు మాత్రం తెలియదు. అప్పటికప్పుడు ఆ డైలాగ్లు చెప్పి చేయించడంతో ఇన్వాల్వ్మెంట్ అంతంతమాత్రంగానే ఉంటుంది. అందుకే వర్క్షాప్లు నిర్వహించాలి. ముందుగా డైలాగ్లు ఇవి అని చెప్పాలి. ఆ డైలాగ్లు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి. గదిలో రౌండ్టేబుల్పై కూర్చొని ఆ సీన్లు అనుకుని వాళ్లు గనుక చేయగలిగితే తర్వాత సెట్స్కు వెళ్లాక నా డైలాగ్ ఏంటని.. అది ఎలా గుర్తుంచుకోవాలని.. డైలాగ్ గుర్తుపెట్టుకోవండపై మనసు పెట్టక్కర్లేదు. అప్పుడు కేవలం నటనపైనే మనసు పెడితే చాలు. అది రావాలి. ఇదే వారు చేసేది (అమీర్ ఖాన్ గురించి)'' అని చిరంజీవి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. -
మోసం చేసేందుకు సహాయపడ్డారు
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్నకు రిటైల్ స్టోర్ల బదలాయింపు విషయంలో ఫ్యూచర్ రిటైల్తో (ఎఫ్ఆర్ఎల్) ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ వివాదం కొనసాగుతోంది. ఈ ’మోసపూరిత వ్యూహం’ అమలుకు ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు సహాయం చేశారంటూ అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఎఫ్ఆర్ఎల్ భారీ అద్దె బకాయిలు కట్టలేకపోవడం వల్లే 835 పైచిలుకు స్టోర్లను రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుందన్న వాదనలన్నీ తప్పుల తడకలని పేర్కొంది. స్టోర్స్ స్వాధీనానికి నెల రోజుల ముందే ఈ బకాయిలు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఉంటాయంటూ ఎఫ్ఆర్ఎల్ వెల్లడించిందని.. ఆ కాస్త మొత్తానికి అన్ని స్టోర్స్ను రిలయన్స్కు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు ఈ మేరకు లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న ఎఫ్ఆర్ఎల్కు తాము ఆర్థిక సహాయం అందిస్తామంటూ ఆఫర్ చేసినప్పటికీ అప్పట్లో రిలయన్స్కు రిటైల్ వ్యాపార విక్రయ డీల్పై చర్చల సాకును చూపించి స్వతంత్ర డైరెక్టర్లు తమ ప్రతిపాదన తిరస్కరించారని పేర్కొంది. ఆ తర్వాత కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు మొదలైన వారంతా రిలయన్స్ గ్రూప్తో కుమ్మక్కై ఎఫ్ఆర్ఎల్ నుంచి రిటైల్ స్టోర్స్ను వేరు చేశారని, ఈ మోసాన్ని అడ్డుకోవడానికి స్వతంత్ర డైరెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెజాన్ ఆరోపించింది. తద్వారా ప్రజలు, నియంత్రణ సంస్థలను మోసం చేశారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ప్రమోటర్లతో పాటు డైరెక్టర్లకు కూడా జైలు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్లో వాటాల ద్వారా రిటైల్ వ్యాపారమైన ఎఫ్ఆర్ఎల్లో అమెజాన్కు స్వల్ప వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్కు రూ. 24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పం దం కుదుర్చుకుంది. అయితే, ఇది తన ప్రయోజనాలకు విరుద్ధమంటూ అమెజాన్ న్యాయస్థానాలు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ను ఆశ్రయించగా పలు చోట్ల దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై ఇంకా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఎల్ డీల్ను రిలయన్స్ రద్దు చేసుకుంది. రిటైల్ స్టోర్స్ లీజు బకాయిలు తమకు కట్టనందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్న పర భాష డైరెక్టర్లు వీళ్లే..
ఇప్పుడు తెలుగు సినిమా తెలుగు సినిమా కాదు. మరి ఏంటీ అంటే.. ‘పాన్ ఇండియా సినిమా’ అయిపోయింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి. ఇతర భాషల దర్శకుల చూపు కూడా మన హీరోలపై పడింది. తమిళం, కన్నడ, హిందీ భాషల దర్శకులు తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వణక్కమ్, నమస్కార, నమస్కార్ అంటూ మన హీరోలకు వాళ్ల భాషల్లో ‘నమస్కారం’ చెబుతున్నారు. ఇక ఆ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా రేంజ్ కావడం విశేషం. హిందీ దర్శకులు ప్రభాస్తో సినిమా చేయడానికి ఆసక్తి చూపగా దర్శకుడు ఓం రౌత్కి ముందుగా అవకాశం ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అలాగే హిందీ చిత్రం ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ప్రభాస్ ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’తో పర భాషల్లో కూడా స్టార్డమ్ను పెంచుకున్న ఎన్టీఆర్, రామ్చరణ్లతో సినిమా చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకముందే ఇతర ఇండస్ట్రీ దర్శకులు ఆసక్తి చూపారు. ఆల్రెడీ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా కన్ఫార్మ్ అయింది. దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ కథలోకి వెళ్తారు ఎన్టీఆర్. సేమ్ ఎన్టీఆర్లానే రామ్చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాక ముందే తమిళ దర్శకుడు శంకర్తో ఓ సినిమా కమిటయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్తో కూడా రామ్చరణ్ కథా చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఓ ప్రముఖ ముంబై నిర్మాణ సంస్థ రామ్చరణ్తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటు నాగచైతన్య, రామ్ తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కోలీవుడ్లో ‘మానాడు’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తారు. ఇక ‘పందెంకోడి’తో హిట్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన లింగుసామి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా సినిమా చేస్తున్నారు. ‘ది వారియర్’ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ హీరో. ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇంకా దర్శకుడు శ్రీ కార్తీక్తో హీరో శర్వానంద్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్కు రెడీగా ఉంది. తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైఖేల్’ చేస్తున్నారు. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు హీరోల డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో.. మరికొన్ని కాంబినేషన్స్ సెట్ కావొచ్చు. కుదిరితే... వార్తల్లో ఉన్న ప్రకారం మరికొందరు తెలుగు హీరోలు కూడా వేరే భాషల దర్శక-నిర్మాతలతో సినిమాలు చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆ చిత్రాలు కూడా పట్టాలెక్కుతాయి. నటుడు, దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్, సాయిధరమ్తేజ్లు నటిస్తారని, హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు హరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘తగ్గేదే లే’ అంటూ.. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లోనూ సత్తా చాటిన అల్లు అర్జున్ ఇటీవల హిందీ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీని కలిశారు. బాలీవుడ్లో బన్నీ చేయనున్న స్ట్రయిట్ సినిమా కోసమే ఈ మీటింగ్ అనే టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరోలు అఖిల్, విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేశారట. కీలక పాత్రల్లో... తెలుగు హీరోలను కీలక పాత్రలకు కూడా తీసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకులు. రణ్బీర్ కపూర్ హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో వెంకటేశ్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకుడు అని టాక్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు. అలాగే అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్కుమార్ హీరోగా నటించిన ‘రామసేతు’లో సత్యదేవ్ ఓ ముఖ్య పాత్ర చేశారు. -
ఏపీ: 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం ఊసే లేదన్నారు. రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారన్నారు. చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్గానే చూశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియమకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చామన్నారు. మహిళలకు 52 శాతం అవకాశం కల్పించామన్నారు. ఓసీలకు 42 శాతం పదలిచ్చామని తెలిపారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యమని సజ్జల అన్నారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన: మంత్రి వేణుగోపాల కృష్ణ బీసీలంటే చంద్రబాబుకు చులకన అని, వారిని ఓటు బ్యాంక్గానే చూశారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. బలహీన వర్గాలకు సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. సీఎంకు, సామాన్యుడికి మధ్యలో ఎవరూ లేరన్నారు. మహిళలకు 52 శాతం పదవులు: సుచరిత మహిళలకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని హోంమంత్రి సుచరిత అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకంలో మహిళలకు 52 శాతం పదవులు ఇచ్చారన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలన్నీ మహిళల పేరు మీదే ఇచ్చి వారి ప్రాధాన్యం ఏమిటో చెప్పారని సుచరిత అన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నిమామకంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. కొంతమంది కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన దాన్ని పదవి అనుకోకుండా బాధ్యతలా పని చేయాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
ఆ ఇరువురు డైరెక్టర్లను నియమించండి!
న్యూఢిల్లీ: ఎంక్వైరీ అండ్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్లను త్వరగా నియమించాలని కేంద్రప్రభుత్వాన్ని లోక్పాల్ కోరింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ పంపినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు లోక్పాల్ బదులిచ్చింది. ప్రభుత్వధికారుల అవినీతిపై ఫిర్యా దులను పరిశీలించడం, ప్రాసిక్యూషన్ ప్రక్రియ జరపడమనే రెండు ప్రధాన విధులను ఈ ఇరువురు డైరెక్టర్లు నిర్వహిస్తారు. 2019 మార్చిలో లోక్పాల్కు ఛైర్పర్సన్ను, సభ్యులను నియమించారు. అయితే ఎంక్వైరీ డైరక్టర్, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ల నియామకం జరగలేదు. దీనిపై అజయ్ దూబే అనే యాక్టివిస్టు ఆర్టీఐ కింద లోక్పాల్ను ప్రశ్నించారు. లోక్పాల్ అండ్ లోకాయుక్త చట్టం కింద వీరివురి నియామకం జరపాల్సిఉందని, కేంద్రం పంపిన పేర్ల నుంచి ఇద్దరిని లోక్పాల్ చైర్పర్సన్ ఎంపిక చేయాల్సి ఉందని అజయ్ చెప్పారు. చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్ ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్.. మార్కెట్ విలువ రూ.126 కోట్లు -
మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం
సాక్షి, గుంటూరు: మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. వివాదం కారణంగా డైరెక్టర్లు ముక్కామల అప్పారావు, నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారే తమకు మెజార్టీ డైరెక్టర్ల మద్దతు ఉందంటూ కొత్త కమిటీలను ప్రకటించుకున్నారు. 19 మంది డైరెక్టర్ల మద్దతు ఉందంటూ ముక్కామల.. కొత్త కమిటీ ఏర్పాటు చేయగా, 17 మంది డైరెక్టర్ల మద్దతు ఉందంటూ మరో కమిటీని ఉపేంద్రనాథ్ ఏర్పాటు చేశారు. మాజీ కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ, డైరెక్టర్ల మధ్య విభేదాలు వాస్తవమని.. ఆర్ధికపరమైన అవకతవకలపై విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరారు. చదవండి: మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ వీరంగం పోర్ట్స్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: గౌతమ్రెడ్డి -
కాపు కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకానికి ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్కు అధికార, అనధికార డైరెక్టర్ల నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిగా డైరెక్టర్లుగా ఏడుగురు, అనధికార డైరెక్టర్లుగా 12 మంది నియమించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. చదవండి: థర్డ్వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక ‘ఆ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచాడు’ -
జీడీఆర్: సెబీ భారీ జరిమానా
న్యూఢిల్లీ: ఆరు కంపెనీలకు చెందిన జీడీఆర్ ఇష్యూల కృత్రిమ లావాదేవీల(మ్యానిప్యులేషన్) కేసులో 14 సంస్థలు, వ్యక్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ భారీగా రూ. 31 కోట్లకుపైగా జరిమానాను విధించింది. సెబీ కన్నెర్ర చేసిన సంస్థలు, వ్యక్తులలో అరుణ్ పంచారియా, పాన్ ఆసియా అడ్వయిజర్స్ తదితరాలున్నాయి. వ్యక్తిగతంగా పంచారియాకు రూ. 25 కోట్ల జరిమానా విధించగా.. పాన్ ఆసియా అడ్వయిజర్స్, అల్టా విస్టా(వింటేజ్ ఎఫ్జెడ్ఈ)లపై రూ. 3 కోట్లు చొప్పున జరిమానా చెల్లించమని ఆదేశించింది. ఆరు కంపెనీలకు చెందిన జీడీఆర్ ఇష్యూలలో అక్రమ పథకం ద్వారా పంచారియా తదితర సంస్థలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణ. -
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ల రాజీనామా
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. మొత్తం పది మంది డైరెక్టర్లు ఉండగా... ఆరుగురు సభ్యులు ఆదివారమే సీఎస్ఏ నుంచి వైదొలగగా... మిగిలిన నలుగురు సోమవారం తప్పుకున్నారు. ఈ విషయాన్ని సీఎస్ఏ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. గతంలో బోర్డుపై అవినీతి, జాతి వివక్ష, పరిపాల దుర్వినియోగం, ఆటగాళ్ల జీతాల చెల్లింపుల్లో అవకతవకలు వంటి ఆరోపణలు రావడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆ దేశపు క్రీడా మంత్రి నాతి మెథ్వా స్వయంగా రంగంలోకి దిగారు. అయితే బోర్డు డైరెక్టర్ల నుంచి çసహకారం అందకపోవడంతో ఆగ్రహించిన మెథ్వా... తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలిపేలా ఈ నెల 27లోపు వాదనలు వినిపించాలని సీఎస్ఏ డైరెక్టర్లను ఆదేశించారు. అంతేకాకుండా బోర్డును రద్దు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. దాంతో ఆదివారం సమావేశమైన సీఎస్ఏ డైరెక్టర్లు... తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాలో క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి రిహాన్ రిచర్డ్స్ను నియమించిన దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ కాన్ఫడరేషన్, ఒలింపిక్ కమిటీ (ఎస్ఏఎస్సీఓసీ)... త్వరలోనే సీఎస్ఏ స్థానంలో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని నియమిస్తామని ప్రకటించింది. -
సింగరేణికి కొత్త డైరెక్టర్లు..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఇద్దరు కొత్త డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ప్రాజెక్టులు, ప్లానింగ్ (పి–పి) విభాగం డైరెక్టర్గా బి.వీరారెడ్డి, ఎలక్ట్రికల్–మెకానికల్ విభాగం డైరెక్టర్గా డి.సత్యనారాయణను నియమించింది. ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పోస్టుల భర్తీకి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నేతత్వంలోని ఎంపిక కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించి వీరిద్దరి పేర్లను ఖరారు చేసింది. కమిటీలో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, కోలిండియా నుంచి శేఖర్ సరన్, కేంద్ర బొగ్గు శాఖ సెక్రటరీ పి.ఎస్.ఎల్.స్వామి ఉన్నారు. వీరారెడ్డి గతంలో అడ్రియాల లాంగ్ వాల్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. డి.సత్యనారాయణ రావు ప్రస్తుతం భూగర్భ గనుల జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. డైరెక్టర్ (పి–పి) పోస్టులకు మొత్తం ఐదుగురు సీనియర్ జనరల్ మేనేజర్ హోదాలు కలిగిన వీరారెడ్డి, జి.వెంకటేశ్వరరెడ్డి, ఎస్.డి.ఎం. సుభానీ, కె.గురవయ్య, హబీబ్ హుస్సేన్లను, డెరైక్టర్ (ఎక్ట్రికల్–మెకానికల్) పోస్టులకు సీనియర్ జనరల్ మేనేజర్ హోదా కలిగిన డి.సత్యనారాయణ రావు, జి.ఎస్. రాంచంద్రమూర్తి, ఎం.నాగేశ్వర్ రావు, డి.వి.ఎస్.సూర్యనారాయణలను పిలిచారు. -
కరోనా నియంత్రణకు వైద్య సిబ్బంది ప్రత్యేక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారించేందుకు జీహెచ్ఎంసి పరిధిలోని టీచింగ్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి సూపరింటెండెంట్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 1)ప్రతి ఆస్పత్రిలోని వైద్యులతో పాటు ఇతర సిబ్బందిని రెండుగా విభజించాలి. 2)ప్రతి బ్యాచ్కు 7రోజులు క్వారంటైన్లో ఉంచాలి. ఒక బ్యాచ్ ముగిసిన వెంటనే మరో బ్యాచ్ను క్వారంటైన్ చేయాలి. 3)కరోనా విజృంభణ నేపథ్యంలో సెలవులు రద్దు చేయాలి. 4)డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్, కరోనా టెస్టులు చేసి ట్రీట్మెంట్ అందించాలి. 5)ప్రతి ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న వాళ్లందరు విధిగా వ్యక్తిగత రక్షణ కోసం పీపీఈ కిట్, మాస్కు ధరించాలి. -
నటులుగా మారిన ప్రముఖ దర్శకులు
హీరోయిన్ జ్యోతిక లీడ్ రోల్లో నటిస్తున్న ‘పొన్మగల్ వంధల్’ త్వరలో అమెజాన్ ప్రైంలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కోర్టు కేసు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు పార్తీబన్, కె. భాగ్యరాజ్, త్యాగరాజన్, ప్రతాప్ పోటెన్, పాండియన్రాజన్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినీ చరిత్రలో ఒకేసారి ఇంతమంది దర్శకులు కెమెరా ముందు నటించడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. హీరో సూర్య సోంత బ్యానర్ 2డీ ప్రోడక్షన్లో రూపొందించిన ఈ సినిమాకు నిర్మాతలు సూరియా శివకుమార్, జేజే ఫ్రెడ్రిక్ తొలిసారిగా దర్శకత్వం వహిరించారు. కోర్టు నేపథ్యంలో సాగే ‘పొన్మగల్ వంధల్’ సస్పెన్స్ థ్రిల్లర్ కేసును చేదించే శక్తివంతమైన మహిళ న్యాయవాదిగా జ్యోతిక కనిపించనున్నారు. దాదాపు 200పైగా దేశాలలో ఈ చిత్రం మే 29న ఓటీటీ ప్లాట్ఫాం ఆమెజాన్ ప్రైంలో విడుదల కానుంది. (ఓటీటీకే ఓటు) (చదవండి: బంగారు తల్లి వచ్చింది) -
స్వతంత్ర డైరెక్టర్లు.. గుడ్బై!!
దేశీ కార్పొరేట్ రంగంలో తాజాగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు, అవకతవకలు... బోర్డు రూమ్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. స్కామ్ల పాపం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో కంపెనీల నుంచి వైదొలగుతున్న ఇండిపెండెంట్ డైరెక్టర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో మొత్తం 126 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆ సంఖ్య రెట్టింపై 291కి పెరగడం తాజా పరిస్థితికి నిదర్శనం. ఈ వివరాలను ఎన్ఎస్ఈఇన్ఫోబేస్ డాట్కామ్ వెల్లడించింది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్(ఎన్ఎస్ఈ), ప్రైమ్ డేటాబేస్ కలసి ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. తాజా నివేదికలో స్వతంత్ర డైరెక్టర్ల విషయమై కీలకాంశాలు వెలుగుచూశాయి. సాధారణంగా ఒక కంపెనీ డైరెక్టర్ల బోర్డ్లో మూడో వంతు ఇండిపెండెంట్(స్వతంత్ర) డైరెక్టర్లుంటారు. కంపెనీలను వదిలిపోతున్న ఇండిపెండెంట్ డైరెక్టర్లలో సగం మంది వారి పదవీకాలం పూర్తవ్వడంతో వైదొలుగుతున్నారు. ఆరోగ్య, వ్యక్తిగత లేదా ఇతర వృత్తులు, వ్యాపకాల్లో స్థిరపడటం వంటి కారణాలతో చాలా మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 291 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. దీంట్లో 146 మంది తమ పదవీ కాలం పూర్తవ్వడంతో రాజీనామా చేయగా, మళ్లీ ఆ పదవిలో కొనసాగడం ఇష్టం లేదంటూ 36 మంది వైదొలిగారు. ఇతర వృత్తుల్లో స్థిరపడేందుకు రాజీనామా చేసిన వారి సంఖ్య 26గా ఉంది. సెబీ, కంపెనీల చట్టం ప్రకారం తగిన అర్హతలు లేకపోవడంతో 17 మంది రాజీనామా చేశా రు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, ఆసక్తి లేదంటూ రాజీనామా చేసిన వాళ్ల సంఖ్య 40. యాజమాన్యం మారడంతో ఆరుగురు రాజీనామా చేశారు. కాగా, జెట్ ఎ యిర్వేస్ కంపెనీలో ఇబ్బందులు తలెత్తగానే పలువు రు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నుంచి కూడా ఇండిపెండెట్ డైరెక్టర్లు వైదొలిగారు. ఇష్టపడని పదవి.. గతంలో ఇతర కంపెనీలకు ఎగ్జిక్యూటివ్లుగా పనిచేసిన వాళ్లు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవులు నిర్వహించినవాళ్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా రావడానికి ఇష్టపడటం లేదు. కంపెనీల్లో అవకతవకలు ఉంటాయేమోనన్న అనుమానాలతో ఈ పదవులను వారు తిరస్కరిస్తున్నారు. కంపెనీ ప్రమోటర్లు, యాజమాన్యం తీసుకునే నిర్ణయాలకు బలికావలసి వస్తుందనే భయాలతో పలువురు ఈ పదవులను నిరాకరిస్తున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్గా చేరితే, ఒకవేళ కంపెనీ లోటుపాట్లు వెల్లడైన పక్షంలో, అప్పటివరకూ తాము సంపాదించుకున్న పేరు, నమ్మకం అన్నీ కోల్పోవలసి వస్తుందని, న్యాయ వివాదాలు ఎదుర్కోవలసి వస్తుందని, అందుకే ఈ పదవులకు దూరంగా ఉంటున్నామని పలువురు పేర్కొన్నారు. ఇదిలాఉంటే... భారత్లో పలు కంపెనీలు కుటుంబాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దీంతో ఇండిపెండెంట్ డైరెక్టర్లు ప్రమోటర్ల దయ మీదనే ఆధారపడక తప్పటం లేదు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పితే.. ప్రత్యేక తీర్మానం ద్వారా వీరిని సాగనంపే అవకాశాలున్నాయి. ఒకవేళ కంపెనీ అవకతవకల విషయమై తెలిసి కూడా స్పందించకపోతే, వీరి ఆస్తులను కూడా కంపెనీల వ్యవహారాల శాఖ స్తంభింపజేసే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్ల పదవి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని విశ్లేషకులంటున్నారు. వంద శాతం పూర్తిగా నమ్మకం కుదిరితేనే ఈ పదవికి ముందుకొస్తున్నారని చెబుతున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ విధులేంటి? ► ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్...తన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కంపెనీ, వాటాదారులు ముఖ్యంగా మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం బాథ్యతాయుతంగా మెలగాలి. ► తన హోదాను స్వలాభం కోసం దుర్వినియోగం చేయకూడదు. అలాగే తన స్వలాభం కోసం కంపెనీకి నష్టం వచ్చేలా ప్రవర్తించకూడదు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సవ్యంగా సాగేలా తగిన తోడ్పాటునందించాల్సి ఉంటుంది. ► కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ► ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలాగా కంపెనీ రోజువారీ కార్యకలాపాలను ఇండిపెండెంట్ డైరెక్టర్లు చూడాల్సిన పని ఉండదు. వారికి అధికారాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. ► డైరెక్టర్ల సమావేశాలకే కాకుండా బోర్డ్ నియమించే కమిటీల్లో సభ్యుడిగా ఉంటూ, ఈ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కావలసి ఉంటుంది. కంపెనీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే వాటిని వెలుగులోకి తేవలసి ఉంటుంది. ► కంపెనీకి సంబంధించిన రహస్యాలను (టెక్నాలజీ, భవిష్యత్తు నిర్ణయాలు, ఇతర కంపెనీలతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు తదితర అంశాలను) లీక్ చేయకూడదు. ఇక ప్రత్యేక తీర్మానం ద్వారానే ఇండిపెండెంట్ డైరెక్టర్లను తొలగించే వీలుంది. ప్రశ్నించే అధికారం ఉండాలి... ప్రమోటర్లు, వాటాదారుల ఆధిపత్యం ఉన్న కంపెనీల్లో ‘నిజమైన’ ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఎవరూ ఉండరు. ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాను పునఃపరిశీలించాలి. భారత కుటుంబ వ్యాపారాల్లో మెజార్టీ వాటా ప్రమోటర్ గ్రూప్దే. ఇలాంటి కంపెనీల్లో డైరెక్టర్ల స్వతంత్రత చాలా కష్టసాధ్యమైన విషయం. మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ ఇండిపెండెంట్ డైరెక్టర్ల బాధ్యత అయినప్పటికీ, ప్రమోటర్ గ్రూప్ చర్యలను, నిర్ణయాలను ప్రశ్నించే అధికారం వారికి ఉండాలి. – ప్రణవ్ హల్దియా, ఎమ్డీ, ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ సత్యం స్కామ్ నుంచి... సత్యం కంప్యూటర్స్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర కీలకమైందని ప్రభుత్వం గుర్తించింది. అప్పటి వరకూ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఉత్సవ విగ్రహాలేనని చెప్పవచ్చు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 2013 నాటి కంపెనీల చట్టంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనల విషయమై పలు మార్పులు, చేర్పులు చేసింది. మరోవైపు ఇండిపెండెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉన్న రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ తరచుగా సమావేశాలు జరుపుతూ, కంపెనీ స్థితిగతులపై చర్చించాల్సి ఉంటుంది. కానీ ఐఎల్అండ్ఎఫ్ఎస్ కంపెనీలో నాలుగేళ్ల కాలంలో ఇలాంటి ఒక్క సమావేశం కూడా జరగలేదంటే కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇక లిస్టైన కంపెనీల్లో మొత్తం డైరెక్టర్లలో మూడు నుంచి ఐదో వంతు వరకూ ఇండిపెండెంట్ డైరెక్టర్లుండాలి. టాప్1000 కంపెనీల్లో కనీసం ఒక మహిళ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండితీరాలి. -
కొత్త మెడికల్ సీట్లకు కేంద్ర సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు మూడేళ్లలో కొత్తగా వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. ఒక్కో పీజీ, ఎంబీబీఎస్ సీటుకు రూ. 1.20 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ)ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని వైద్య విద్యా విభాగం ఆదేశించింది. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మహబూబ్నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కాలేజీల్లో ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఆ ప్రకారం ఆయా కాలేజీల్లో మొత్తంగా 600 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. దాంతోపాటు ఈ ఏడాది కేంద్రం అగ్రవర్ణాల్లోని ఆర్థిక బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు వివిధ కాలేజీల్లో మరో 190 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. ఇవన్నీ కలిపి 790 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి కొత్తగా వచ్చాయి. వాటితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కలిపి 150 వరకు పీజీ మెడికల్ సీట్లు వచ్చాయి. అంటే ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లు అన్నీ కలిపి 940 మెడికల్ సీట్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మంజూరు చేసింది. వీటన్నింటికీ కలిపి రూ. 1,128 కోట్ల ఆర్థిక సాయం కేంద్రం నుంచి రానుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదనలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం మెడికల్ సీట్లు పెంచినప్పుడు ఆ మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. సీట్లతోపాటు ఆ మేరకు అవసరమైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే హాస్టల్ వసతి, తరగతి గదులు, ప్రయోగశాలలు, లైబ్రరీ విస్తరణ తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలి. అందుకోసం కేంద్రం సీట్లు మంజూరు చేసినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు ఇస్తుంది. రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా వచ్చిన పీజీ, ఎంబీబీఎస్ సీట్లకు కేంద్రం నుంచి నిధులను తీసుకోవడంలో వైద్య, ఆరోగ్యశాఖ విఫలమైంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర వైద్య విభాగం జాయింట్ సెక్రటరీ దీనిపై అధికారులను నిలదీశారు. నిధుల కోసం ప్రతిపాదనలు ఎందుకు పంపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం పీజీ మెడికల్ సీట్లకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థికసాయానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాక, అక్కడినుంచి కేంద్రానికి వెళుతుంది. మరోవైపు ఎంబీబీఎస్ సీట్లకు కేంద్ర సాయం విషయంలో స్పష్టత తీసుకుంటున్నాం. నిబంధనలను పరిశీలిస్తున్నాం. కేంద్ర అధికారి ఎంబీబీఎస్ సీట్లకు ఆర్థికసాయం ఉందని చెప్పారు. ఈసారి ఢిల్లీ వెళ్లాక దీనిపై స్పష్టత తీసుకున్నాక ప్రతిపాదనలు తయారు చేస్తాం. – డాక్టర్ రమేశ్రెడ్డి, డీఎంఈ -
పీఎంసీ కేసులో హెచ్డీఐఎల్ డైరెక్టర్ల అరెస్ట్
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో–ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్డీఐఎల్) డైరెక్టర్లు ఇరువురు అరెస్ట్ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులు రుణ డిఫాల్ట్కు సంబంధించి రాకేష్ వాద్వాన్, ఆయన కుమారుడు సారంగ్ వాద్వాన్లను అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్డీఐఎల్కు చెందిన రూ.3,500 కోట్లను ఈఓడబ్ల్యూ జప్తు చేసినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. బ్యాంకుకు రూ.4,355.43 కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్డీఐఎల్ సీనియర్ అధికారులపై ఈఓడబ్ల్యూ ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్లో సస్పెండయిన పీఎంసీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్, చైర్మన్ వార్యాన్ సింగ్, ఇతర ఎగ్జిక్యూటివ్ల పేర్లను చేర్చారు. కేసులో దర్యాప్తునకు సిట్ కూడా ఏర్పాటయ్యింది. రూ.25,000 వరకు ఉపసంహరణకు అవకాశం కాగా పీఎంసీ బ్యాంకుపై తన ఆంక్షలను ఆర్బీఐ గురువారం మరింత సడలించింది. ఒక్కో ఖాతా నుంచి ఉపసంహరణ పరిమితిని రూ.25,000కు పెంచింది. కొద్ది రోజుల కిందట కేవలం రూ.1,000 వరకే ఉపసంహరణకు అవకాశం ఇవ్వగా, అటుతర్వాత ఈ పరిమితిని రూ.10,000కు పెంచింది. ఈ పరిమితిని తాజాగా రూ.25,000కు పెంచడంతో 70 శాతం మంది కస్టమర్లకు ఉపశమనం లభించినట్టయింది. వీరు 25,000 వరకూ విత్డ్రా చేసుకోగలుగుతారు. ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. -
అతడి కోసం నటులుగా మారిన దర్శకులు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో దర్శకులు విఐ ఆనంద్, కార్తీక్ నరేన్, కథానాయిక మాళవిక నాయర్ నటించారు. వీరు ముగ్గురు సందీప్ కిషన్కి మంచి మిత్రులు. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'టైగర్' చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ 'డిస్కో రాజా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, సందీప్ కిషన్ నటించిన ఓ తమిళ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఓ తమిళ సినిమా తెలుగులో 'డి 16' పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. వీరిద్దరూ సందీప్ కిషన్ అడగ్గానే ఆయన కోసం అతిథి పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ రీరికార్డింగ్ చేస్తున్నారు. ఇటీవలే నీరజ కోన రాసిన టైటిల్ సాంగ్ ‘నిను వీడని నీడను నేనే' విడుదలచేశారు. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే, ఈ సినిమాలో ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్ 'ఎక్స్క్యూజ్ మీ రాక్షసి ...'ను హీరో సిద్ధార్థ్ పాడారు. త్వరలో ఈ పాట కూడా విడుదల కానుంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. -
మూవీ మ్యాటర్స్ నవతరం
-
యస్ 25
ఇండియన్ స్క్రీన్పై టెక్నాల జీని, భారీ హంగును చూపించిన దర్శకుడు శంకర్. భారీ ఖర్చుతో భారీ చిత్రాలను తెరకెక్కిస్తాడని పేరు. ఆయన ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు మిస్కిన్ సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కోలీవుడ్ దర్శకులు మణిరత్నం, కరుణాకరన్, గౌతమ్ మీనన్, లింగుస్వామి, బాలాజీ శక్తివేల్, పాండీరాజ్, అట్లీ, వసంత్ బాలన్, పా. రంజిత్ పాల్గొన్నారు. అందరూ ‘యస్ 25’ అనే లోగో ముద్రించి ఉన్న బ్లూ కలర్ టీ షర్ట్స్ను ధరించారు. స్పెషల్గా డిజైన్ చేయించిన కేక్ను శంకర్ కట్ చేశారు. ∙మణిరత్నం, మిస్కిన్, శంకర్ -
ఒక్క జీవితం.. మూడు సినిమాలు
బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న టైమ్లో తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బయోపిక్స్లో జయలలిత బయోపిక్ ఒకటి. ఒకటీ, రెండు కాదు మూడు యాక్చువల్లీ. జయ జీవితం ఆధారంగా ముగ్గురు దర్శకులు (ఏఎల్ విజయ్, ప్రియదర్శని, భారతీరాజా) బయోపిక్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం జయలలిత జయంతి. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలోని ఆనవాయితీ ప్రకారం ఆయా సినిమాల టైటిల్స్ను, రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న చిత్రానికి ‘తలైవి’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. తలైవి అంటే నాయకురాలు అని అర్థం. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కించనున్నారు. జయలలిత పాత్ర ఎవరు పోషిస్తారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. విద్యా బాలన్, నయనతార.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ కథకు స్క్రిప్ట్ సూపర్వైజ్ చేయనున్నారు. విబ్రీ మీడియా విష్ణు నిర్మాత. ‘ఎన్టీఆర్, ‘83’ (1983 వరల్డ్ కప్) బయోపిక్లు నిర్మాత ఈయనే. సుమారు తొమ్మిది నెలల పాటు ప్రీ–ప్రొడక్షన్ పనులు చేశాం, కథకు కావల్సిన సమాచారాన్ని సేకరించాం అని ‘తలైవి’ చిత్రబృందం తెలిపింది. దర్శకురాలు ప్రియదర్శని సినిమా విషయానికి వస్తే.. ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్తో జయలలితగా నిత్యా మీనన్ నటిస్తారని ఎప్పుడో అనౌన్స్ చేశారు. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న చిత్ర రిలీజ్ను చేస్తున్నాం అని ప్రకటించారు. భారతిరాజా అనౌన్స్ చేసిన సినిమా, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ వెబ్ సిరీస్కు సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతానికి రాలేదు. ఇన్ని సినిమాలు, సిరీస్లు ఒకే వ్యక్తి జీవితంపై తెర మీదకు రావడం విశేషం. -
అనూహ్యం : కోర్టురూమ్లోనే ‘అమ్రపాలి’ డైరెక్టర్లు అరెస్ట్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు రూమ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ అమ్రపాలి ప్రమోటర్ అనిల్ శర్మను, డైరెక్టర్లను కోర్టు రూమ్లోనే అరెస్ట్కు జారీచేసింది సుప్రీంకోర్టు. మీ దాగుడు మూతలు ఆపాడంటూ... అమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లపై సుప్రీంకోర్టు బెంచ్ మండిపడింది. వెంటనే వారిని కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, ఉదయ్ యూ లలిత్ల నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గంట పాటు జరిగిన విచారణలో, ఫోరెన్సిక్ ఆడిట్ కోసం అమ్రపాలి గ్రూప్ సమర్పించాల్సిన పలు డాక్యుమెంట్లను ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడుతుందని డైరెక్టర్లపై మండిపడింది. డాక్యుమెంట్లను సమర్పించకపోవడానికి పలు కారణాలను చెబుతూ తప్పించుకుంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గృహదారులు పెట్టుబడిగా పెట్టిన నగదును, మరో అవసరాల కోసం తరలించారా? అని కోర్టు ప్రశ్నించింది. వెంటనే శర్మకు, ఇద్దరి డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది. అన్ని డాక్యుమెంట్లు ఆడిటర్లకు సమర్పించేంత వరకు మీరు కస్టడీలోనే ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. అది ఒక్క రోజు పట్టవచ్చు లేదా నెల అవ్వొచ్చు అని బెంచ్ పేర్కొంది. గ్రూప్కు సంబంధించిన పత్రాలన్నింటిన్నీ సీజ్ చేయాలని ఢిల్లీ పోలీసులను, నోయిడా పోలీసులను కోర్టు ఆదేశించింది. డాక్యుమెంట్లను రికవరీ చేసుకోవడానికి, ఈ ముగ్గురిని పోలీసులు ఆమ్రపాలి ఆఫీసుల చుట్టూ తిప్పాలని పేర్కొంది. అన్ని డాక్యుమెంట్లను ఆడిటర్లు పొందినట్టు తెలిశాకనే వారిని వదిలి వేయాలని బెంచ్ స్పష్టం చేసింది. ఈ ముగ్గురి పాస్పోర్టులను కూడా కోర్టు రద్దు చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 24కు వాయిదా వేసింది. ఇలా నిందితులను కోర్టు రూమ్లోనే అరెస్ట్ చేయడం ఇది మూడోది. సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ను, మరో వ్యక్తిని కూడా సుప్రీంకోర్టు, కోర్టురూమ్లోనే అరెస్ట్ చేసింది. -
యూనిటెక్ ఆస్తుల వేలానికి సుప్రీం ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలపై కొరడా ఝళింపించేలా దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యూనిటెక్పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. యూనిటెక్ డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని ఆదేశించింది. మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ డింగ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారులను యూనిటెక్ మోసగించింది. కనుక కొనుగోలుదారుల సొమ్మును తిరిగి చెల్లించాలంటే ఆ సంస్థ ఆస్తులను వేలం వేయాల్సిందేనని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీం తాజాగా ఆదేశాలిచ్చింది. సంస్థకు చెందిన కోలకతా ఆస్తులను వేలం/విక్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తద్వారా రూ.25కోట్లను కొనుగోలుదారుల డబ్బును తిరిగి చెల్లిచాలని కోరింది. అలాగే ఈ ప్రక్రియంలో సహకారం అందించేందుకు మరో ఇద్దరు వ్యక్తులను నియమించుకునేలా సుప్రీంకోర్టు సహాయకుడు ఎమికస్ క్యూరీ పవన్శ్రీ అగర్వాల్కు అనుతినిచ్చింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబరు 11కి వాయిదా వేసింది. సంస్థ డైరెకర్ట వ్యక్తిగత ఆస్తులతోపాటు ఇతర ఆస్తుల వివరాలను అందించాలని, మే 11 నాటికి 100 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్ చేయకపోతే వారి ఆస్తులను వేలం వేయాలని సుప్రీం యూనిటెక్ సంస్థను గతంలో హెచ్చరించింది. అయితే యూనిటెక్ సమర్పించిన నివేదికపై అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలోనే యూనిటెక్కు చెందిన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, వారణాసి, తమిళనాడులోని శ్రీపెరంబుదుర్లోని ఆస్తులను విక్రయించి, ఆ సొమ్మును గృహ కొనుగోలుదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని జూలై 5న కమిటీని కోరింది. కాగా కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకుని, వారికి సరైన సమయంలో ఇళ్లను నిర్మించి ఇవ్వలేదన్న ఆరోపణలపై యూనిటెక్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు మరో డైరెక్టర్ అజయ్ చంద్ర గత ఏడాది కాలంగా జైలులో ఉన్నారు. -
ఆర్బీఐ బోర్డులోకి గురుమూర్తి, సతీష్ మరాథే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకు రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డులో ప్రత్యేక సభ్యుడుగా ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు, పాత్రికేయుడు స్వామినాథన్ గురుమూర్తి (తమిళనాడు) ఎంపికయ్యారు. గురుమూర్తితోపాటు సహకార భారతీ చీఫ్ సతీష్ కాశీనాథ్ మరాథెని ఆర్బీఐ బోర్డులో పార్ట్ టైం డైరెకర్లుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వీరి పదవీకాలం నాలుగేళ్లు ఉంటుందని, క్యాబినెట్ అపాయింట్మెంట్ ఆమోదం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. తాజా నియామకాలతో ఆర్బీఐ బోర్డులో సభ్యుల సంఖ్య 10కి చేరింది. కాగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, స్వదేశీ జాగరణ్ మంచ్కు ఉప కార్యదర్శిగా ఉన్న గురుమూర్తి అర్థశాస్త్రవేత్త, సీఏ పూర్తి చేశారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయినా, తమిళంలో తుగ్లక్ అనే రాజకీయ వార పత్రికకు ఎడిటర్గా ఉన్నారు. -
మస్తీ.. మస్తీ...
ఎఫ్ ఫర్ ఫ్రెండ్షిప్. ఎఫ్ ఫర్ ఫన్... ఎఫ్ ఫర్ ఫుడ్. ఎఫ్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్లంతా కలసికట్టుగా ఉంటే చూడ్డానికి బాగుంటుంది. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని స్పష్టం చేస్తుంది. ఇక్కడున్న ఫొటో చూస్తుంటే డైరెక్టర్స్ మధ్య ఆ అట్మాస్పియర్ ఉన్నట్లనిపిస్తోంది కదూ. వీళ్లందరూ ఎఫ్ అండ్ ఎఫ్ (ఫన్ అండ్ ఫుడ్)తో మస్తీ చేశారు. సీనియర్ డైరెక్టర్ రాజమౌళి (ఫొటోలో ఉన్న డైరెక్టర్స్ అందరిలోకల్లా రాజమౌళి ముందు (2001) డైరెక్టర్ అయిన విషయం తెలిసిందే) టు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి... మొత్తం తొమ్మిది మంది దర్శకులు సోమవారం సాయంత్రం కలిశారు. ఈ గెట్ టు గెదర్కి వేదిక డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇల్లు. ఈ పార్టీ ప్లాన్ వంశీ పైడిపల్లి, సుకుమార్లది. అప్పుడప్పుడూ ఇలా కలిస్తే, ఒకరి థాట్స్ మరొకరు షేర్ చేసుకోవడంతో పాటు సాన్నిహిత్యం కూడా పెరుగుతుందన్న ఆలోచనతో ఈ పార్టీని ప్లాన్ చేశారు. వంశీ పైడిపల్లి అతిథి మర్యాదలు చేయడంలో బెస్ట్ అని ఆయన ఆతిథ్యం తీసుకున్నవాళ్లు అంటుంటారు. పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారట. ‘‘నేను హలీమ్ని ఎంజాయ్ చేశాను. జనరల్గా నేను తక్కువ మాట్లాడతా. పార్టీలో కూడా అంతే. బట్.. అందర్నీ కలుసుకోవడం, వాళ్ల అనుభవాలు వినడం చాలా బాగా అనిపించింది’’ అని నాగ్ అశ్విన్ అన్నారు. కొంతమంది దర్శకులు సోషల్ మీడియా ద్వారా ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. నాన్స్టాప్ నవ్వులు – రాజమౌళి ‘‘వంశీ (వంశీ పైడిపల్లి), సుక్కు(సుకుమార్) కలిసి ఇనిషియేట్ తీసుకున్నారు. వంశీ ఇంట్లో అందరం కలిశాం. బాగా ఎంజాయ్ చేశాం. శివ (కొరటాల శివ), హరీష్ శంకర్ చెప్పిన స్టోరీలను మర్చిపోలేను. అలాగే వన్ లైనర్స్ కూడా. సోమవారం రాత్రి కలిసిన అందరం నెక్ట్స్ డే మార్నింగ్ (మంగళవారం) నాలుగు గంటల వరకు నవ్వుతూనే ఉన్నాం’’ అన్నారు రాజమౌళి. ‘‘మీరు (రాజమౌళిని ఉద్దేశించి) మాతో ఉండటం మాకు హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ది వండ్రఫుల్ ఈవెనింగ్. కాదు. కాదు. నిజానికి మార్నింగ్’’ అన్నారు హరీష్ శంకర్. ఈ డైరెక్టర్స్ మీట్ గురించి అల్లు అర్జున్ అభిప్రాయం ఇలా ఉంది. ‘‘సుకుమార్, వంశీ లవ్లీ ఇనిషియేట్ తీసుకున్నారు. బిగ్ డైరెక్టర్స్ అందర్నీ ఒక ఫ్రేమ్లో చూడటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లిని, ఇతర దర్శకులను అడపా దడపా కలిసిన ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ సందీప్రెడ్డి ఈ మీట్ ద్వారానే తొలిసారి రాజమౌళిని కలిశారట. దర్శకులందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారట. -
టాలీవుడ్ అగ్ర దర్శకులంతా ఒకేచోట...
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్లో సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంట్లో సోమవారం రాత్రి పార్టీని నిర్వహించగా, అగ్ర దర్శకులంతా హాజరయ్యారు. రాజమౌళి, సుకుమార్, క్రిష్, కొరటాల శివ, హరీశ్ శంకర్లతోపాటు అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్, సందీప్ వంగవీటి, వంశీ పైడిపల్లి ఇలా అంతా ఒక్కచోట చేరారు. వీరంతా కలిసి ఓ ఫోటో దిగగా, ‘అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను’ అంటూ వంశీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం చెర్రీ-తారక్ల మల్టీస్టారర్ కోసం కథ సిద్ధం చేస్తుండగా, సుకుమార్ మహేష్ కోసం స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్, వంశీ పైడిపల్లి మహేష్ బాబు 25వ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. అనిల్ ఎఫ్ 2 రెగ్యులర్ షూటింగ్కు సిద్ధం అయ్యాడు. కొరటాల, సందీప్, నాగ్ అశ్విన్, హరీష్ శంకర్లు తమ తర్వాతి ప్రాజెక్టుల కోసం స్క్రిప్ట్లు సిద్ధం చేసుకుంటున్నారు. A memorable evening with these Amazing people at home... Thank You @ssrajamouli Sir, @aryasukku, @sivakoratala , @harish2you, @DirKrish, @AnilRavipudi , #SandeepReddyVanga, #NagAshwin for making this evening happen.. :) pic.twitter.com/9qxHoCA2xo — Vamshi Paidipally (@directorvamshi) 4 June 2018 'FUN'tastic..😀😀....it's great evening...thanks for hosting this amazing meet ..Vamshi Anna.... https://t.co/h6OBG80qhY — Anil Ravipudi (@AnilRavipudi) 4 June 2018 -
మే 4న డైరెక్టర్స్ డే
మే 4... దర్శకరత్న డా. దాసరి నారాయణరావు పుట్టినరోజు. నూట యాభైకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. దాసరి భౌతికంగా దూరమైనా తాను అందించిన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. మే 4న ఆయన జయంతిని పురస్కరించుకుని ఆ రోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించింది తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం. ‘‘స్వర్గీయ దాసరి నారాయణరావుగారి జయంతి సందర్భంగా మే 4న ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లో వేడుక నిర్వహించనున్నాం. తెలుగు దర్శకుల సంఘం సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ తెలిపారు. -
250 కోట్లు కాదు..రూ.4వేలకోట్ల స్కాం
సాక్షి, ముంబై: రూ.250 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణం ఆరోపణలతో ముంబైకి చెందిన పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ (పీఏఎల్) డైరెక్టర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్కాంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పోలీసులు సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేశారు. అంతేకాదు గతకొన్నేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ స్కాం విలువ వేలకోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ స్కాం మొత్తంవిలువ రూ .4,000 కోట్లుగా ఉందని ప్రయివేటురంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు తన తాజా ఫిర్యాదులో పేర్కొంది. 20పైగా బ్యాంకుల గ్రూపును పీఏఎల్ మోసం చేసింది. బూటకపు కంపెనీల పేరుతో మోసపూరితమైన నకిలీ ఇన్వాయిస్లు, బిల్లులతో కుంభకోణానికి పాల్పడ్డారని బ్యాంకు ఆరోపించింది. దీంతో ఫోర్జరీ, నిబంధనల ఉల్లంఘన, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భవార్లాల్ భండారి, ప్రేమల్ గోరఖ్నాథ,కమేలష్ కనుంగోలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్రపై అధికారులు ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. 2011లోనే పరేఖ్ నేతృత్వంలోని పీఏఎల్ రూ. 127.5కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 22 బ్యాంకులతో కలిపి ఇచ్చే రుణ ఒప్పందంలో భాగంగా ఈకుంభకోణం జరిగిందని ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. సంస్థ డైరెక్టర్లు అమితాబ్ పరేఖ్ (2013 లో మరణించారు), రాజేంద్ర గోథీ, దేవన్షు దేశాయ్, కిరణ్ పారిక్, విక్రమ్ మొర్దానీ పేర్లనుకూడా తన ఫిర్యాదులో చేర్చింది. కాగా పరేఖ్ అల్యూమినిక్స్ ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సహా ప్రభుత్వ బ్యాంకులనుంచి ఆరోపణలనెదుర్కొంటోంది. ఇప్పటికే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. -
ఐలవ్యూ అంటే ఐలవ్యూ..!
ఇండియన్ సినిమా గర్వించే దర్శకుల్లో ఒకరైన దర్శకుడు తీసిన క్లాసిక్ సినిమాలోని సన్నివేశాలివి. రొమాన్స్ జానర్ సినిమాల్లో ఈ సినిమాది ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేశారు. తెలుగులో ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? కార్తీక్ ఆమెను మళ్లీ చూశాడు. ఆరోజు ఒక పెళ్లిలో చూసినప్పట్నుంచీ ఆమె గురించే ఆలోచిస్తున్నాడతను. ఆమె మళ్లీ కనిపించదన్న ఆలోచనే అతనికి ఎలాగో ఉండింది ఇన్నాళ్లూ. ఇప్పుడామె మళ్లీ కనిపించింది. కార్తీక్ ఉన్న లోకల్ ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళుతోన్న ట్రైన్లో ఆమె కనిపించింది. ఆమె కార్తీక్నే చూస్తోంది. కార్తీక్ ఆమెనుండి చూపు తిప్పుకోలేకపోయాడు. కొన్ని క్షణాల్లో ఆ రైళ్లు వాటి వాటి దిశల్లో ముందుకెళ్లిపోయాయి. ఇద్దరూ దూరమైపోయారు. కార్తీక్ ఫ్రెండ్స్తో మీటింగ్ పెట్టాడు. ‘‘ఆమె ఎక్కడుంటుందో ఎలాగైనా కనిపెట్టి తీరాలి!’’ అన్నాడు వాళ్లతో. ఆమె మెడిసిన్ స్టూడెంట్ అన్న విషయం, లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుందన్న విషయం తప్ప వాళ్లకు ఇంకేం తెలీదు. కానీ కనిపెట్టారు. ఆ వెంటనే కార్తీక్ ఆమె వెంటపడడాన్ని డైలీ రొటీన్గా మార్చేసుకున్నాడు. ఆమె రైలెక్కే ప్లేస్, ఇల్లు.. అన్నీ రౌండ్లు వేయడం మొదలుపెట్టాడు. ఆమెకూ ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. ఒకవిధంగా కార్తీక్ అలా వెంటపడ్డాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోంది కూడా! ఒకరోజు ఆమె రైల్లో కాలేజీకి వెళుతోంటే, ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు కార్తీక్. ఈ ఐదారు రోజుల్లో అతనామెకు అంత దగ్గరగా వెళ్లడం అదే మొదటిసారి. ఆమె చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని లాక్కొని అందులో పేరు చూశాడు. ‘‘శాంతి..!’’ అన్నాడు నవ్వుతూ. శాంతి ఏం మాట్లాడలేదు. ‘‘నువ్వంటే నాకిష్టం లేదు. నీమీద ఆశ పడటం లేదు. నువ్వు అందగత్తెవు అనుకోవడం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమో అని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు..’’ రైలు కొంచెం కొంచెం కదులుతూ ఉంటే, చెప్పాలనుకున్నదంతా చెప్పేసి అక్కణ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు కార్తీక్. రైలు కూడా వేగమందుకొని ప్లాట్ఫామ్ దాటేసింది. శాంతి సిగ్గుపడుతూ నవ్వింది. తర్వాతిరోజు శాంతి చదువుతున్న కాలేజీకి వెళ్లాడు కార్తీక్. ‘ఇక్కడ కూడా వచ్చిపడ్డాడు..’ అనుకుంటూ శాంతి అతనికి దగ్గరగా వెళ్లింది. అతణ్ని సమీపిస్తున్నా కొద్దీ అంతకంతకూ పెరిగిపోతోన్న సిగ్గుతో ‘‘పేరేంటీ?’’ అనడిగింది. ‘‘కార్తీక్..’’ శాంతి కార్తీక్ వైపు నవ్వుతూ చూసి, ‘‘కార్తీక్! నువ్వు డబ్బున్నవాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిలవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్లే బుద్ధిలేకుండా అన్నీ వదిలేసి ఇలా అమ్మాయిల వెంటపడుతుంటారు..’’ అని తిరిగి వెళ్లిపోతూంటే, ‘‘ఏయ్!’’ అన్నాడు కార్తీక్. శాంతి చిన్నగా నవ్వింది, ఆ పిలుపుకి వెనక్కి తిరుగుతూ. ‘‘హేయ్! తను నన్ను చూసి నవ్విందీ..’’ అంటూ గట్టిగా అరుస్తూ ఆ రోజంతా శాంతి పేరే తల్చుకుంటూ కూర్చున్నాడు కార్తీక్. శాంతి ఫోన్ నంబర్ కనుక్కున్నాడు కార్తీక్. ఫోన్ చేశాడు. శాంతి ఫోన్ ఎత్తింది. ‘‘హలో ఎవరూ?’’ ‘‘హలో!’’ అన్నాడు కార్తీక్. ‘‘ఏయ్! నంబర్ ఎలా తెలిసిందీ?’’ ‘‘నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను.’’ ‘‘పొయ్యి మీద చారు పెట్టొచ్చాను. రేపు ప్రాక్టికల్స్. అమ్మ ఇప్పుడే ఇంటికొచ్చింది. ఫర్వాలేదు.. ఓపిగ్గా వింటాను. చెప్పేంటి విషయం?’’ ‘‘ఆ! రేపు మా ఇంట్లో ఫంక్షన్.’’ ‘‘అయితే?’’ ‘‘అందుకని నువ్వు రావాలి..’’ ‘‘నేనా? ఎందుకు?’’ ‘‘ఇలా చూడూ! నేన్నిన్ను బీచ్కు రమ్మనలేదు. సినిమాకు రమ్మనలేదు. పార్క్కు రమ్మనలేదు. ఇంటికేగా రమ్మందీ..’’ ‘‘నేనెందుకు రావడం?’’ ‘‘నువ్విక్కడికి రాకపోతే, నేనే అక్కడికి వస్తాను. చక్కగా చీర కట్టుకొని రా..’’ తను చెప్పాలనుకున్నదంతా చెప్తూ, అడ్రెస్ కూడా చెప్పేసి ఫోన్ కట్ చేశాడు కార్తీక్. శాంతి చెప్తున్నదేదీ అతను వినిపించుకోలేదు. కార్తీక్ ఇంట్లో ఫంక్షన్. ‘నేనేందుకు రావాలి?’ అన్న శాంతి కూడా ఆ ఫంక్షన్కు వచ్చింది. ఇల్లంతా కార్తీక్ చుట్టాలు. ‘‘ఎవర్రా ఆ అమ్మాయి?’’ కార్తీక్ను అడిగింది వాళ్లమ్మ. ‘‘తనే నేను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి..’’ అన్నాడు కార్తీక్. ఆ మాట కార్తీక్ వాళ్లమ్మతో పాటు అక్కడున్న ఇంకో ఇద్దరు విన్నారు. వెంటనే ‘ఆ అమ్మాయినే అంట.. కార్తీక్ పెళ్లి చేసుకునేది.’ ఇల్లంతా పాకింది ఈ మాట. ఫంక్షన్ అయిపోయింది. శాంతి తిరిగి రైల్లో ఇంటికి వెళ్లిపోతోంది. కార్తీక్ కూడా ఆమెతో పాటే ఉన్నాడు. ‘‘అసలు నువ్వెందుకలా అన్నావ్?’’ అడిగింది శాంతి. ‘‘నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావని అన్లేదే? నేను ఆశపడుతున్నా అన్నాను. అది నిజమేగా!’’ ‘‘నన్నొక మాట అడగొచ్చుగా?’’ ‘‘సరే! ఇప్పుడడుగుతా..’’ ‘‘వద్దు..’’ ‘‘ఏయ్! అడక్కుండా చెప్తే కోప్పడతావ్. అడుగుతానంటే వద్దంటావ్?’’ ‘‘ఏమిటిది పెళ్లీ గిల్లీ అనీ..’’ కార్తీక్ శాంతి చెయ్యి పట్టుకొని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ‘‘ఏయ్! చెప్పనా..?’’ ‘‘ఏంటి?’’ ‘‘ఐలవ్యూ..’’ ‘‘అంటే..? దానర్థమేమిటీ?’’ ‘‘ఐలవ్యూ అంటే ఐలవ్యూ..’’ ‘‘ఇప్పుడీ ప్రేమా గీమా అవసరమా?’’ ‘‘తెలీదు. కానీ ఐ లవ్యూ..’’ కార్తీక్ శాంతికి ఈమాట చెప్పిన కొన్ని రోజులకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఆశపడి. -
‘మీరు భార్యలను మార్చుకుంటారా?!’
ఇండోర్ : బాలీవుడ్ చిత్రం పద్మావతి విడుదలకు ముందే వివాదాలకు దారి తీస్తోంది. తాజాగా ఈ చిత్రంపై ఉజ్జయిని బీజేపీ ఎంపీ చింతమని మణివీయ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కథాంశాలన్ని ఇష్టారీతిగా మారుస్తున్న బాలీవుడ్ దర్శకులు.. తమ భార్యలను కూడా ఇలాగే మార్చుకుంటారా? అంటూ అత్యంత తీవ్ర పదజాలంతో ఆయన విమర్శలకు దిగారు. నాకు ఇప్పటికీ ‘జుహార్’ అంటే అర్థం తెలియడం లేదని ఆయన చెప్పారు. పద్మావతి చిత్రాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సినిమా పరిభాషలోనే మాట్లాడాలంటే.. ఒకరి భార్య.. మరొకరితో సినిమాకు వెళితో ఎంత దారుణంగా ఉంటుందో.. జుహార్కు అర్థం వెతకడం అంతే దారుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. మా చరిత్రను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తే.. వారికి చేతులతోనే సమాధానం చెబుతామని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. -
లక్ష మంది డైరెక్టర్లపై అనర్హత వేటు
సాక్షి, న్యూఢిల్లీ : బ్లాక్మనీపై పోరాటంలో భాగంగా షెల్ కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నేడు(మంగళవారం) షెల్ కంపెనీలకు చెందిన 1,06,578 మంది డైరెక్టర్లపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనర్హత వేటు వేసింది. ఈ చర్యల్లో భాగంగా డైరెక్టర్లను గుర్తించడానికి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల వద్ద ఉన్న షెల్ కంపెనీల డేటాను మంత్రిత్వ శాఖ మరింత లోతుగా విశ్లేషిస్తోంది. ఇటీవలే 2.09 లక్షల కంపెనీలపై కూడా ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఆయా సంస్థల బ్యాంకు అకౌంట్లను కూడా నిర్భందించింది. 1,06,578 మంది డైరెక్టర్లను కంపెనీల చట్టం 2013, సెక్షన్ 164(2) కింద అనర్హులుగా గుర్తించినట్టు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెక్షన్ 164 కింద, ఈ కంపెనీల్లో డైరెక్టర్ ఎలాంటి ఆర్థిక ప్రకటనను లేదా వార్షిక రిటర్నులను మూడేళ్ల వరకు దాఖలు చేయడానికి వీలులేదని, అంతేకాక మరే ఇతర సంస్థకు వీరు ఐదేళ్ల వరకు పునఃనియామకానికి అర్హులు కారని పేర్కొంది. ఈ కంపెనీలు మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కంపెనీలను తమ కనుసన్నల్లో ఉంచుతున్నట్టు కూడా పేర్కొంది. డైరెక్టర్ల బ్యాక్గ్రౌండ్, వారి గతచరిత్ర, ఆ కంపెనీల్లో వారి పనితీరు వంటి అన్నింటిన్నీ ప్రభుత్వం విశ్లేషిస్తోంది. ఈ డిఫాల్టింగ్ కంపెనీల ప్రొఫెషనల్స్ను, చార్టెడ్ అకౌంటెంట్లను, కంపెనీ సెక్రటరీలను, కాస్ట్ అకౌంటెంట్లను మంత్రిత్వ శాఖ గుర్తించింది. వీరిపై కూడా మంత్రిత్వ శాఖ నిఘా ఉంచింది. కొన్ని కేసుల్లో ప్రొఫెషనల్స్ కూడా అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసిందని తెలిపింది. ప్రాధాన్యత క్రమంలో ఈ సమస్యను సంబంధిత ఏజెన్సీలు చేపడతాయని కార్పొరేట్ వ్యవహారాల సహాయమంత్రి పీపీ చౌదరి చెప్పారు. -
ఒత్తిళ్లకు తలొగ్గిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్
బెంగళూరు : ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యుషన్ కార్ప్ తన కంపెనీలోకి కొత్త డైరెక్టర్లను నియమించుకుంది. తన ప్రధాన పెట్టుబడిదారి ఇరియట్ మేనేజ్మెంట్ ఒత్తిళ్లకు తలొగ్గి ముగ్గురు కొత్త డైరెక్టర్లను నియమించుకునేందుకు సమ్మతించింది. అంతేకాక ఇన్వెస్టర్లకు 3.4 బిలియన్ డాలర్ల(రూ.22831కోట్లు)ను రిటర్న్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. నవంబర్లో ఇలియట్కు 4 శాతం కంటే ఎక్కువ స్టాక్ ఉంది. షేర్హోల్డర్ విలువను పెంచడానికి ఈ ఐటీ సర్వీసు ప్రొవైడర్ మరింత సహకరించాలని ఇలియట్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఈ మేరకు ఒత్తిళ్లకు తలొగ్గిన కంపెనీ బోర్డు వచ్చే రెండేళ్లలో షేర్హోల్డర్స్కు రూ. 22,831 కోట్లకు పైగా కేటాయించే ప్లాన్ను బుధవారం ఆమోదించింది. షేర్ల బై బ్యాక్, డివిడెంట్ రూపంలో ఈ మొత్తాన్ని ఐటీ దిగ్గజం షేర్ హోల్డర్స్కు కేటాయించనుంది. 2017-18 ఆర్థికసంవత్సరంలో తొలి క్వార్టర్లో 1.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను, రెండో క్వార్టర్లో 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను పునః కొనుగోలు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. -
నిన్న రాజమౌళి,నేడు శాతకర్ణి డైరెక్టర్ క్రిష్
-
బాబాయ్,అబ్బాయ్ మధ్య ఎక్స్చేంజ్ ఆఫర్ ?
-
గీకకోయి.. గ్రీకువీరుడా!
వన్స్ అపాన్ ఏ టైమ్ గీకితే గ్రీకువీరుడు.. ఇప్పుడు గీకకపోతే క్లీన్ హిట్! హీరోలు.. దర్శకులు.. గడ్డాలు పెంచుతున్నారు. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు.. మన హీరోల పుల్లింగ్ పవర్ అంతా గడ్డంలోనే ఉంది. గడ్డం ఎందుకు పెంచుతున్నారనే చిక్కు ప్రశ్న వీడింది. పెంచితే చాలు.. అందరూ చిక్కుతారట. ఈ గడ్డం బాబుల చిక్కు విప్పుదాం రండి!! ‘మాసిన గడ్డం.. పెరిగిన మీసం.. ఎంత చిరాగ్గా ఉందో ఓసారి అద్దంలో చూసుకోరా!’ - నాన్న క్లాస్ పీకడం కామన్. అమ్మయితే... ‘ఈ అవతారం ఏంట్రా’ అంటుంది. ‘ప్రేమలో ఫెయిలైన పార్వతీశంలా ఎలా ఉన్నావో! ఈ మీసాలు.. గడ్డం.. తీసేయొచ్చుగా’ - గాళ్ఫ్రెండ్ కూడా ఆర్డర్ పాస్ చేస్తుంది. ఎవరేమన్నా.. ఏదేమైనా.. యూత్ ఆన్సర్ మాత్రం నో షేవ్. ఎందుకంటే.. అదొక స్టైల్! ఆ స్టైల్కి సోషల్ కాజ్ కూడా యాడ్ అయితే.. సూపర్ కదా! ఆ సూపర్ ట్రెండ్కి ఈ మంత్ మంచి చాన్స్ గురూ! ‘నో షేవ్ నవంబర్’... ఇప్పుడీ ట్రెండ్... తెలుగులోనూ పాపులర్. మన తెలుగు హీరోలు అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ‘నో షేవ్’తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తూనే ఉన్నారు. గడ్డంలో మనోళ్లు హ్యాండ్సమ్గా కనిపిస్తుంటే.. కుర్రకారు కూడా ఫాలో అయిపోతున్నారు. రీసెంట్గా ‘నో షేవ్’తో నయా లుక్లో మన హీరోలు-దర్శకులు అందర్నీ ఆకట్టుకుంటున్నారు!! ఎప్పుడూ సోగ్గాడిలా చక్కగా క్లీన్ షేవ్తో కనిపించే మన్మథుడు నాగార్జునను ఈ మధ్య చూశారా? మీసాలు.. గడ్డాలు.. బాగా పెంచేశారు. నాగార్జున మ్యాన్లీ లుక్ మహిళాభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా కోసం గడ్డం పెంచారాయన. గడ్డంతో గ్రీకు వీరుడు భలే ఉన్నాడంటున్నారు. మహిళాభిమానులు ఎక్కువున్న మరో స్టార్ హీరో ‘విక్టరీ’ వెంకటేశ్ సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ గడ్డంతో కనిపించడం తక్కువే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే షేవింగ్కి నో చెప్పేస్తారు. ఇప్పుడు సెట్స్పై ఉన్న ‘గురు’ సినిమా కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లోకి వచ్చేశారు. మొన్నీమధ్య విడుదలైన మారుతి సినిమా చూసినోళ్లు వెంకటేశ్ ‘బాబు లుక్ బంగారం’ అన్నారు. సడన్గా ‘గురు’ ఫస్ట్లుక్ చూసి ‘వావ్.. వాట్ ఏ ఛేంజ్ గురూ’ అంటూ క్లాప్స్ కొట్టారు. ఇక, విలన్గా టర్న్ అయిన మరో సీనియర్ హీరో జగపతిబాబు అయితే గడ్డంతో నయా ట్రెండ్ సెట్ చేశారు. హీరోగా ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో.. ఇప్పుడీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కి అంతకు మించి అభిమానులున్నారు. ముఖ్యంగా ఇప్పటి అమ్మాయిల్లో జగపతిబాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఓ కారణం ఈ గడ్డం లుక్కే. యంగ్ హీరోల పద్ధతులూ మారాయ్! పదిహేనేళ్ల కెరీర్లో లుక్ పరంగా చిన్న ఎన్టీఆర్ ప్రయోగాలు చేయడానికి వెనకాడలేదు. ఈ ఏడాది విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ - రెండు సినిమాల్లోనూ రెండు డిఫరెంట్ ‘నో షేవ్’ లుక్స్లో కనిపించారాయన. ప్రస్తుతం ఎన్టీఆర్ గడ్డంతోనే ఉన్నారు. బహుశా కొత్త సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టున్నారు. ‘బాహుబలి’ ప్రభాస్ సంగతి ప్రత్యేకించి చెప్పాలా? ఆ మీసకట్టు.. గడ్డం.. రాజసానికి ప్రతీకగా కనిపిస్తున్నారు. ‘బాహుబలి’తో పాటు మధ్యలో విడుదలైన సినిమాలకు, ప్రస్తుతం సెట్స్లో ఉన్న దర్శకుడు తేజ సినిమా కోసం రానా దగ్గుబాటి రఫ్ అండ్ టఫ్ గడ్డం మెయిన్టైన్ చేస్తున్నారు. ఇక, ఎప్పుడూ ప్రయోగాలకు ముందుండే మంచు మనోజ్ రానున్న ‘ఒక్కడు మిగిలాడు’లో చనిపోయిన ఎల్.టి.టి.ఇ. అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ లాంటి గెటప్లో గడ్డంతో రఫ్గా కనిపించనున్నారు. సెట్స్పై ఉన్న ‘గుంటూరోడు’లో గడ్డంతోనే లవ్లీగా కనిపించనున్నారు. ‘హైపర్’ తర్వాత కొత్త సినిమా ఏదీ అంగీకరించని రామ్.. మరికొంతమంది హీరోలు గడ్డంతో దర్శనమిస్తున్నారు. చూడబోతుంటే... ఈ గడ్డం గ్యాంగ్ లిస్ట్లో చాలామంది చేరేట్లు ఉన్నారు. - సత్య పులగం ‘గడ్డం గ్యాంగ్’లో వీళ్లు పర్మినెంట్! నయా ట్రెండ్ సెట్ చేయాలనో.. క్యారెక్టర్ డిమాండ్ చేసిందనో.. ఆ మ్యాన్లీ లుక్లో ఓ కిక్కుందనో.. హీరోలు మీసాలు, గడ్డాలు పెంచుతారు. దర్శకులు కూడా పెంచవలసిన అవసరం ఉందా? లేదు కదూ! కానీ, కొందరు దర్శకులు ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తూ.. గడ్డం గ్యాంగ్లో పర్మినెంట్ మెంబర్షిప్ తీసేసుకున్నారు. దర్శకుల గడ్డం గ్యాంగ్లో ఎవరెవరున్నా.. పేటెంట్ రైట్స్ మాత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గరే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏదైనా సినిమా మొదలెడితే, అది పూర్తయ్యేంత వరకూ గడ్డం తీయరాయన. ‘బహుశా.. ఈ గడ్డం తీసేస్తే ప్రేక్షకులు నన్ను గుర్తు పట్టరేమో!’ అనేంతలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తారు. ‘సెలూన్కి వెళ్లి షేవింగ్ చేయించుకోవడానికి బద్ధకం. నా గడ్డం వెనక కారణం ఇదే’ అని త్రివిక్రమ్ చెప్పినా.. ఆయన్ను చూసి కొంతమంది ఆ స్టైల్ ఫాలో అవుతున్నారంటే అందులో అబద్ధమేమీ లేదు. దర్శక ధీరుడు రాజమౌళికి సెట్స్పై ఉన్న సినిమాలోని హీరో లుక్ను మెయిన్టైన్ చేయడం అలవాటు. మూడేళ్ల నుంచీ ‘బాహుబలి’ తీస్తున్నారు కదా. ఆ సినిమా హీరో ప్రభాస్, విలన్ రానాలతో పాటు ఆయన కూడా గడ్డం పెంచుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం గడ్డం, మీసాలు పెంచినవాళ్లకు ప్రత్యేకంగా ఓ ‘కిట్’ను గిఫ్ట్గా ఇచ్చారు. అందులో ఏం ఉంటాయో తెలుసా? గడ్డం, మీసాలు చక్కగా మెయిన్టైన్ చేయడానికి కావల్సిన క్రీములూ, లోషన్లూ. ఆ విషయం పక్కన పెడితే... ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి గడ్డం తీసేస్తారో? ఉంచుతారో చూడాలి. ఆయన వాటం చూస్తుంటే మాత్రం అలాగే కంటిన్యూ అయ్యేట్లే కనిపిస్తున్నారు. ఎక్కడ మొదలైందీ ట్రెండ్! ఆస్ట్రేలియాలో... 1999లో కొంతమంది అడిలైడ్ సిటీ యూత్ రెబెక్కాహిల్, బ్రెట్రింగ్దాల్ ఈ ‘నో షేవ్ నవంబర్’ ట్రెండ్ స్టార్ట్ చేశారు. దీన్నే ‘మువంబర్’ అంటారు. ఈ నెల రోజులూ షేవింగ్ చేయకుండా సేవింగ్ చేసిన డబ్బును క్యాన్సర్పై అవగాహన కల్పించిన సంస్థలకు అందిస్తారు. ఈ ఒక్క నెల షేవింగ్ మానేయడం మాత్రమే దీని ఉద్దేశం కాదు. వివిధ రకాల క్యాన్సర్ల కారణంగా మగవారు అనారోగ్యం పాలవుతుంటారు. దీనిపై అవగాహన కల్పించడమే ఈ ‘మువంబర్’ టార్గెట్. -
హైకోర్టు ‘హౌసింగ్’ ఎన్నికల్లో హరికృష్ణారెడ్డి ప్యానెల్ విజయం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ ఎన్నికల్లో పి.హరికృష్ణారెడ్డి–వినోద్ ప్యానెల్ ఘన విజయం సాధించిం ది. తొమ్మిది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల పోస్టుల కోసం 28 మంది పోటీ చేయగా హరికృష్ణారెడ్డి ప్యానెల్ నుంచి 8 మంది, మరో ప్యానెల్ నుంచి ఒకరు విజయం సాధిం చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.హరయ్య శనివారం రాత్రి ప్రకటించా రు. హరికృష్ణారెడ్డి ప్యానెల్ నుంచి కె.వి.బి.జె.శర్మ, జి.అనిల్కుమార్, పల్లా వినోద్కుమార్, పి.అన్నపూర్ణ, పి.హరికృష్ణారెడ్డి, బి.శంకరయ్య, వి.అశోక్, సూదా వెంకటేశ్వరరావు.. మరో ప్యానెల్ నుంచి ఎస్.కిషన్ విజయం సాధించారు. గెలుపొందిన వారిలో హరికృష్ణారెడ్డికి అత్యధికంగా 544 ఓట్లు వచ్చాయి. -
డీసీసీబీ వైస్ చైర్మన్ పదవికి పోటాపోటీ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు(డీసీసీబీ) వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పలువురు డైరెక్టర్లు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం ఈ నెల 15న జరుగనుంది. ఇప్పటికే చైర్మన్ పదవితో పాటు పలు కీలక పదవులు నంద్యాల పార్లమెంటు నియోజక వర్గానికి ఉన్నందున వైస్ చైర్మన్ పదవిని కర్నూలు పార్లమెంటు నియోజక వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. నంద్యాల పార్లమెంటు నియోజక వర్గానికి చెందిన చల్లా రఘునాథరెడ్డి(అవుకు) వైస్ చైర్మన్ పదవి రేస్లో ఉన్నారు. తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ద్వారా వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ఆయన ఉపముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం. అయితే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన డైరెక్టర్లలో ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సుధాకర్, బీసీ సామాజిక వర్గం నుంచి శ్రీనివాసులు, మైనార్టీ సామాజిక వర్గం నుంచి అహ్మద్హుసేన్లు ఎవ్వరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేఈ కుటుంబం ఆశీస్సులు ఉన్నవారికే వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. -
ప్రతిష్టాత్మక సంస్థలకు డైరెక్టర్ల కొరత
న్యూఢిల్లీ : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎమ్లు). కానీ వాటిని చూసుకోవడానికి డైరెక్టర్లే కరువయ్యారట. 20 ఐఐఎమ్స్లో సగం ఇన్స్టిట్యూట్లు డైరెక్టర్ లేకుండానే నడుస్తున్నాయని తేలింది. ప్రపంచ విద్యాసంస్థల సరసన ఒకటిగా నిలుస్తున్న ఐఐఎమ్ బెంగళూరు కూడా డైరెక్టర్ లేకుండానే కొనసాగుతుందని తెలిసింది. గత ఆరు నెలల కిందట ఈ రోజున ఈ విద్యా సంస్థలకు డెరెక్టర్లను షార్ట్లిస్టు చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, సెర్చ్కమ్-సెలక్షన్ కమిటీ భేటీ అయ్యాయి. ఆ భేటీలో 10 ఐఐఎమ్ల్లో నాలుగు సంస్థలు ఐఐఎమ్-రాంచీ, బెంగళూరు, రాయ్పూర్, రోహ్తక్ డైరెక్టర్ల పేరును ఖరారు చేస్తూ ఆ ఫైల్స్ను డీఓపీటీకి పంపించింది. కానీ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో డీవోపీటీ ఆ ఫైల్స్ను తిరిగి హెచ్ఆర్-డీ మంత్రిత్వ శాఖకు అందజేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐఐఎమ్స్లో డైరెక్టర్ల నియామకంపై ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు. మరో ఆరు ఐఐఎమ్లు అమృత్సర్, సిర్మౌర్, నాగ్పూర్, బోధ్గయ, సంబల్పూర్, విశాఖపట్నం పరిస్థితి చూసుకుంటే సెర్చ్కమ్-సెలక్షన్ కమిటీ షార్ట్లిస్టు చేసిన పేర్లను హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ ఇంకా ఖరారు చేసే ప్రక్రియలోనే ఉన్నాయని డీఓపీటీ అధికారులు తెలిపారు. అయితే హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ అధికారులు ఈ కామెంట్లపై స్పందించడానికి తిరస్కరిస్తున్నారు. బెంగళూరును మినహాయిస్తే, తొమ్మిది కొత్త ఐఐఎమ్ సంస్థలు డైరెక్టర్లు లేకుండా తాత్కాలిక క్యాంపస్ల్లో నడుస్తున్నాయి. చాలా ఇన్స్టిట్యూట్ల్లో అపాయింట్మెంట్స్, హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖలోనే మూలుగుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. -
మీ గ్రాఫ్ పడిందా?
నాట్ ఫర్ సేల్ అమ్మకం.. అమ్మకం.. అమ్మకం.. సినిమా అంటే... కథ అమ్మాలి. స్క్రీన్ప్లే అమ్మాలి... మాటలు అమ్మాలి. ఫీల్ అమ్మాలి... టేకింగ్ అమ్మాలి. అయ్యో.. మర్చేపోయాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టికెట్లు అమ్మాలి. ‘‘ఇన్ని అమ్మే క్రమంలో డెరైక్టర్ తన ఉనికిని అమ్ముకోవాలా?’’ అని అడుగుతున్నారు కృష్ణవంశీ. ‘గులాబి’ రిలీజై ఈ ఏడాదికి 20 ఏళ్లయింది. ఇప్పుడు చేస్తున్న ‘నక్షత్రం’తో కలిపి మీవి 20 సినిమాలే. లెక్క తక్కువ..? సినిమా నాకు ఉద్యోగం కాదు.. జీవితం కూడా కాదు. నేను సినిమా తీయాలంటే మంచి పాయింట్ దొరకాలి. దొరికేంతవరకూ వెయిట్ చేస్తా. ఆ సినిమాకి ఎంత టైమ్ పడితే అంత తీసుకుంటా. ఎక్కువ డబ్బు సంపాదించాలని, వంద సినిమాలు తీసేయాలనే టార్గెట్ లేదు. చేసే సినిమా నాకు ఆత్మసంతృప్తిని అయినా ఇవ్వాలి లేదా వందలో పది శాతం ప్రేక్షకుల్లో ఒక ఆలోచన, మంచి భావం రేకెత్తించే విధంగా ఉండాలి. ఆత్మసంతృప్తి సరే.. ఆర్థిక సంతృప్తి..? దానికి లిమిట్ ఏంటి? డబ్బు కోసమే అయితే మనసుకి నచ్చని సినిమాలు తీయాల్సొస్తుంది. నిర్మాత కోసం కొన్ని సూత్రాలు పాటించాల్సి వస్తుంది. వాటితో సినిమాలు తీయాలంటే నాకు మనస్కరించదు. తలొంచి సినిమా తీస్తే వ్యభిచారం చేసినట్లుగా ఫీలవుతా. మనిషిని సమూలంగా చంపేసే వృత్తి వ్యభిచారం అని నా ఫీలింగ్. డబ్బు కోసం చూసుకుంటే ‘సిందూరం’, ‘అంతఃపురం’, ‘ఖడ్గం’ లాంటి సినిమాలొస్తాయా? నేనెవర్నీ తక్కువ చేయడంలేదు. అందరికంటే నేనే గొప్ప అనడంలేదు. అందరూ ఒక రూట్లో వెళితే ఈ రూట్లో ఎవరు వెళతారు? సెపరేట్ రూట్లో వెళ్లడంవల్ల, నిక్కచ్చిగా ఉండటంవల్లే కొంతమంది నిర్మాతలు మీతో సినిమాలంటే భయపడతారేమో? నేనేం కొట్టి చంపేయను కదా. ఏదైనా స్ట్రైట్గా, ఓపెన్గా మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ కావాలి. దానివల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి గట్స్ లేదా నేను చేస్తున్నది కరెక్ట్ అని నమ్మగలిగే మూర్ఖత్వమైనా ఉండాలి. ‘నేనేం తప్పు చేయలేదు.. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అది దేవుడైనా సరే’ అని ‘మురారి’లో డైలాగ్ చెప్పించాను. దాన్ని నమ్మాను కాబట్టే ఆ డైలాగ్ రాశాను. అలాంటి నేచర్ ఉన్నప్పుడు నిర్మాతలు భయపడతారనో, విమర్శిస్తారనో నా ఒరిజినాల్టీని చంపేసుకుని, నక్క వినయాలు నటిస్తూ, మాయ చేస్తే అప్పుడు నాకోసం నేను బతికినట్లవ్వదు. ఇతరుల కోసం బతకలేను. మరి... మిమ్మల్ని మాయ చేసిన నిర్మాతలు ఉన్నారా? కొందరు మోసం చేశారు. వాళ్లకు డబ్బులొచ్చినా రాలేద ని నా దగ్గర్నుంచి తీసుకున్నారు. ఒకడు తన నాలుగైదేళ్ల కూతురు మీద ఒట్టేసి సినిమా చేయించుకున్నాడు. అయిపోయిన తర్వాత 4 కోట్లకు టెండర్ పెట్టాడు. అబద్ధమాడుతున్నాడు, మోసం చేస్తున్నాడని తెలుసు. కానీ, నా సెంటిమెంట్కి కమిట్ అయ్యాను. నేను రోడ్డు మీద పడలేదు. వాడు బాగుపడి అంబానీ అవ్వలేదు. నాలుగు కోట్ల కోసం కక్కుర్తి పడ్డాడు. సరిగ్గా ఉండుంటే ఇంకో మంచి సినిమా చేసేవాణ్ణి. జన్మలో ఇక వాడితో సినిమా చేయను. స్టార్ డెరైక్టర్లు దాదాపు స్టార్ హీరోలతోనే సినిమా తీస్తారు.. ఇప్పుడు మీరు సందీప్ కిషన్తో సినిమా చేస్తున్నారు.. మీ గ్రాఫ్ పడిందా? సందీప్ది పెరిగిందా? నాకు స్టార్ అయినా నాన్-స్టార్ అయినా ఒకటే. కథకు సూటయ్యేవాళ్లతోనే తీశాను. పేర్లెందుకు కాని కథకు సూట్ కాని వాళ్లతోనూ చేశాను. కానీ, అది చేస్తున్నప్పుడు ‘మనకిది కరెక్ట్ కాదు’ అనిపించింది. నేను రామ్చరణ్తో చేస్తే పెద్ద డెరైక్టర్ అన్నట్లా? సందీప్తో సినిమా చేస్తే చిన్న డెరైక్టర్ అన్నట్లా? నేను పడ్డానా? పెరిగానా? తగ్గానా? అని తెలియడంలేదు. నా వరకు నేను ప్రొఫెషనల్గా సక్సెస్ కావడం అంటే ‘చందమామ’, ‘నక్షత్రం’ లాంటి సినిమాలు తీయగలగడం. 60 కోట్లతోనూ సినిమా తీయగలను. 15 కోట్లతోనూ తీస్తాను. 85 లక్షల్లో ‘డేంజర్’ చేశాను. నాకు సినిమా ఇంపార్టెంట్. దానికి పెట్టే పెట్టుబడి, వచ్చే బజ్ నాకు ముఖ్యం కాదు. ఏది పడితే అది కాకుండా ఎలాంటి సినిమా తీస్తున్నామనే విషయంలో దర్శకుడికి సామాజిక బాధ్యత ఉండాలి కదా? కచ్చితంగా. నాకు ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, విజిల్స్ ముఖ్యం కాదు. ఆ తర్వాత ఆ ప్రేక్షకుడి మైండ్లో ఆ సినిమా ఎలా తిరుగుతుందన్నదే ముఖ్యం. నా హీరో రౌడీయో, పోరంబోకో, సిస్టమ్ని లెక్క చేయనివాడో, జేబుదొంగో, హంతకుడో ఉండడు. నా 20 సినిమాల్లో ఒక్క ‘రాఖీ’ సినిమాలోనే హీరో హత్య చేస్తాడు. దానికి రీజన్ ఉంటుంది. ఒకళ్లు మనల్ని ఫాలో అవుతున్నారని తెలిసినప్పుడు మంచి చెప్పాలి. అందుకే ఎంజీఆర్గారు, రజనీకాంత్, కమల్హాసన్ తమ సినిమాల్లో పది మంచి మాటలైనా చెప్పాలని ఇన్సిస్ట్ చేస్తారట. మనం ఎందుకు దాన్ని ఆచరించడంలేదు? నావి ఫెయిల్యూర్ సినిమాలున్నాయి. కానీ, డెరైక్టర్గా నా టాపిక్ ఫెయిల్ కాలేదు. ఎందుకంటే నేనెప్పుడూ బ్యాడ్ ఫిల్మ్ తీయలేదు. లెక్చరర్స్, ఫాదర్స్, మదర్స్ మీద సెటైర్లు వేస్తూ సినిమాలు తీయలేదు. నా బ్రదర్స్ కోసమో, సిస్టర్ కోసమో, నా కొడుకు కోసమో, బంధువుల కోసమో సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలిగా. నాకు పదకొండేళ్ల కొడుకు ఉన్నాడు. వాణ్ణి వెళ్లి, లెక్చరర్ని చంపేయమని చెప్పలేను కదా. అందుకే చూపించను. బౌండ్ స్క్రిప్ట్తో కాకుండా లొకేషన్లో సీన్లు వండుతారట...? నాతో సినిమా చేసిన హీరోనో, ప్రొడ్యూసరో, టెక్నీషియనో నాతో నేరుగా ఈ మాట అంటే సమాధానం చెబుతా. వాళ్లెవరూ కాదు.. ఎవరో అన్నారనుకుందాం. వాడికి ఏం తెలుసని అంటాడు? బౌండ్ స్క్రిప్ట్తో ఎన్ని సినిమాలు తీస్తున్నారో తెలుసా? అసలు బౌండ్ స్క్రిప్ట్తో తీసిన సినిమాల్లో ఎన్ని ఆడాయో తెలుసా? బౌండ్ స్క్రిప్ట్ అంటే వాడికి తెలుసా? ఆ మాట్లాడేవాడి తాలూకు అర్హత ఏంటి? వాడెవడో తెలిస్తే వాడికి తగ్గట్టుగా సమాధానం చెబుతా. బౌండ్ స్క్రిప్ట్తో తీశారా? అక్కడికక్కడ వండి తీశారా? అనేది ప్రేక్షకుడికి అనవసరం. ప్రేక్షకుడికీ, ఫిల్మ్ మేకర్స్కి ఉండే అనుబంధం టికెట్. వాళ్లకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవడు పడితే వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి మీదైనా రాళ్లు వేయడం ఈజీ. వాళ్లకి వేరే పనిలేదు. ఏసుక్రీస్తుని, గాంధీ మహాత్ముడిని చంపేసిన ప్రపంచం ఇది. మహాశక్తిని ఆపడానికి ఒక్క పిచ్చోడు చాలు. అలాంటి కోట్లాదిమంది పిచ్చోళ్లు ఉన్న దేశం మనది. నన్ను మాట అనడం వల్ల సంతృప్తి దక్కుతోందంటే నో అబ్జక్షన్. మీతో పనిచేయడానికి మీ డెరైక్షన్ డిపార్ట్మెంట్, ఇతర టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్.. ఎవరు బాగా ఇబ్బంది పడతారు? నాకు తెలిసి నాతో పని చేస్తున్నప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగని చెప్తారు కూడా. నిజమా? అబద్దమా? నాకు తెలీదు. ఛీఫ్ టెక్నీషియన్ ఆఫ్ ది ఫిల్మ్ కాబట్టి.. నా కథ, ఊహలకు తగ్గట్టు పని చేయమని చెప్తాను. ఉదాహరణకు.. ‘మురారి’లో పెళ్లి పాట చివరిది. అప్పటికి ఓ 20 ఏళ్లుగా చివరి పాట మాంచి మాస్ బీట్ వస్తోంది. హీరో, నిర్మాత, యూనిట్ అందరూ అలాంటి సాంగ్ కావాలని పట్టుబట్టారు. పెళ్లి పాట ఏంటని విసుక్కున్నారు. దాంతో ‘వేరే దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్తో మీకు కావలసిన పాట తీసుకోండి. నా పేరు తీసేసి సినిమా రిలీజ్ చేసుకోండి. ఆ సాంగ్ మినహా ఫస్ట్ కాపీ ఇచ్చేస్తాను. ఇప్పట్నుంచి ఈ సినిమాకి ఎవరు డెరైక్షన్ చేసినా.. నాకు ఓకే. నో అబ్జక్షన్ లెటర్ కూడా ఇస్తాను’ అన్నా. ఇంతవరకూ చేసిన తర్వాత అలా ఎలా కుదురుతుందన్నారు. ‘అలాగైతే ఈ పాటే ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకోండి’ అన్నాను. ఆ పాట మన పెళ్లిళ్ల స్ట్రక్చర్ మార్చేసింది. ఆ పాట పెట్టాలనే నా పట్టుదలను పొగ రుబోతుతనం అంటామా? నమ్మకం అంటామా? ఇతరుల మాట వినకుండా, మీరు నమ్మి తీసినవాటిలో ఫెయిలైనవి ఉండే ఉంటాయ్. అప్పుడు మీ ఫీలింగ్? ‘నువ్ చేస్తున్నది పూర్తిగా తప్పు’ అని నేను నిజంగా గౌరవించే వ్యక్తులు ‘శ్రీఆంజనేయం’ తీసేటప్పుడు చెప్పారు. కొందరు ఈ లోకంలో కూడా లేరు. ఆ రోజున్న నా మానసిక స్థితికి ఎక్కలేదు. నేనే కరెక్ట్ అనుకున్నాను. నిర్మాతను కూడా నేనే కావడంతో కష్టనష్టాలు భరిద్దామనుకున్నాను. ‘మీరు చెప్పినట్టు చేసుంటే బాగుండేదేమో’ అని విడుదల తర్వాత నా తప్పు ఒప్పుకున్నాను. నేను తప్పు ఒప్పుకోవడానికి భయపడను. మీ మనస్తత్వాన్ని మార్చుకోమని రమ్యగారు అనలేదా? యాజ్ ఎ వైఫ్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.. ‘ఎందుకిలా? కరెక్ట్ కాదు’ అంటుంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ‘సరేలే.. ఏం చెప్పి నిన్ను మార్చగలం’ అని సెలైంట్ అయిపోతుంది. ‘అది చూసే కదా నువ్వు పడ్డావ్. ఇప్పుడు మారమని ఎందుకు అంటున్నావ్?’ అనడుగుతా (నవ్వుతూ). ఆవిడ ఏంజిల్ అండి. ‘శ్రీఆంజనేయం’కి రమ్యగారి డబ్బులు పెట్టారనే టాక్ ఉంది? ఇప్పటివరకూ తనది ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ‘ఐ డోంట్ కేర్’. తీసుకోలేదు కాబట్టే, మా జీవితం హాయిగా సాగుతోంది. ఆవిడ డబ్బులు టచ్ చేసిన మరుక్షణం నేను చనిపోయినట్లే. ఆ పరిస్థితి ఇప్పటివరకూ రాలేదు. ఎప్పటికీ రాదు కూడా. మీ లవ్స్టోరీ తెలుసుకోవాలని ఉంది.. మా ఇద్దరి మధ్య ఉన్న ఓ అపురూపమైన అందమైన విషయం అది. చెబితే మా స్పేస్ మిస్సవుతుంది. ముందు ఎవరు ప్రేమలో పడ్డారు? ఎవరు పడేశారు? అనేవి పంచుకునే విషయాలు కావు. కొన్ని అమ్మే విషయాలుంటాయి. కొన్ని అమ్మకూడని విషయాలుంటాయి. కొన్ని అమ్మరానివి ఉంటాయ్. దిసీజ్ నాట్ ఫర్ సేల్ (నవ్వుతూ). మీ సినిమాల్లో పెళ్లిళ్లు చాలా అందంగా చూపిస్తారు. కానీ, మీ పెళ్లి చాలా సింపుల్గా చేసుకున్నారు. నా దృష్టిలో పెళ్లి అంటే అంతే. ‘మురారి’ సినిమాలోని పెళ్లిలో కూడా కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. నా ఫీలింగ్ అది. అందుకే, నా పెళ్లి కూడా అలా చేసుకున్నాను. నేను, రమ్య పెళ్లికి పిలవడం మొదలుపెడితే.. ఎన్ని ఇండస్ట్రీలను పిలవాలి. ‘నువ్వు, నేను పెళ్లి చేసుకున్న ఫీలింగ్ మనలో కలగాలంటే.. బయట వ్యక్తులు ఎవరూ వద్దు. నీకు బాగా దగ్గరైన, నాకు బాగా దగ్గరైన ఫ్రెండ్స్ని పిలుద్దాం’ అని రమ్యతో చెప్పాను. సీతారామ శాస్త్రి గారు, రాఘవేంద్రరావు గారు, జగపతిబాబు, ప్రకాశ్రాజ్.. ఇలా కొందరి, మా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. సింపుల్ మ్యారేజ్ అంటే రమ్యకృష్ణగారు ఒప్పుకున్నారా? మొదట ‘ఉహూ..’ అంది. తర్వాత లాజిక్ చెప్పాను. పెళ్లికి వచ్చినోళ్లలో 90 శాతం మంది ‘భలేవాణ్ణి పట్టిందిరా రమ్యకృష్ణ అని నిన్ను.. ఏం అమ్మాయిని పట్టాడని నన్ను’ జోకులేస్తారు. ఇంతకు మించి ఎవ్వరైనా ఏమైనా అనుకుంటారని నీకుందా? అన్నాను. ‘అందరూ ఇదే అనుకుంటారు’ అని చెప్పింది. ‘మరి గ్రాండ్గా ఎందుకు?’ అన్నాను. పిలిచిన తర్వాత అందరికీ మర్యాదలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అని టెన్షన్ కూడా ఉంటుంది. అలాగే డబ్బులు ఖర్చు. ‘పెళ్లికి ఎంత ఖర్చవుతుందో అంతా డొనేట్ చేద్దాం. కంఫర్ట్గా పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. నాలుగు గంటలు హోమాలు, పూజలు చేసుకుంటూ, కంగారు లేకుండా, చాలా ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నాం. మీడియాలో మీరూ, రమ్యకృష్ణ విడాకులు తీసుకుంటున్నారని, గొడవపడ్డారనీ వార్తలు వస్తుంటాయి. మీ రియాక్షన్? సీరియస్గా తీసుకోం. ఏం న్యూస్ దొరికినట్టు లేదు మాపై పడ్డారనుకుంటా. రమ్యకు తెలుగు రాదు కాబట్టి, చదివి వినిపిస్తా. విని, ‘అవునా?’ అని కూల్గా అంటుంది. ఇద్దరూ బయట ఫంక్షన్స్లో పెద్దగా కనిపించరేం? ఫంక్షన్కి వెళ్లాలనుకుంటే ఇద్దరం కలిసే వెళతాం. అంతేగానీ, నువ్ సపరేట్గా వెళ్లు.. నేను సపరేట్గా వెళతా.. అని ఎప్పుడూ అనుకోం. నేనంత అవుట్డోర్ మనిషిని కాదు. కొంచెం షైగా ఉంటాను. భార్యభర్తల అనుబంధం అనేది పది మందికి చూపించే పబ్లిక్ డిస్ప్లే కాదు. మేమిద్దరం జనాలకు భయపడి బతికేవాళ్లం కాదు. ఇద్దరం కలసి కనిపించి చాలా రోజులైంది, జనాలు ఏమనుకుంటారో? అనే ప్రస్తావన మా మధ్య ఉండదు. ‘నాకు నువ్వు.. నీకు నేను’ అనుకున్నప్పుడు మూడో వ్యక్తి ఏమనుకుంటున్నాడు? అనేది అనవసరం. ఓ అబద్దాన్ని సృష్టించి వాడు హ్యాపీగా ఫీలవుతుంటే.. చావనీ అనుకుని వదిలేస్తా. పవన్కల్యాణ్... లాంటి కొందరు అగ్రహీరోలతో మీరు ఎందుకు సినిమాలు చేయలేకపోయారు? అలాంటి వారితో పని చేస్తేనే నాకు వ్యక్తిత్వం, అస్తిత్వం ఉన్నట్టా? పవన్కల్యాణ్ ఓ క్రౌడ్ పుల్లింగ్ హీరో. కొన్ని కోట్లమంది జనం అతనంటే విపరీతంగా రియాక్ట్ అవుతారు. అంటే.. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఆశిస్తారు. ఆ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ నేను చేయాలి. హీరోతో పాటు అభిమానుల్ని శాటిస్ఫై చేయడం కోసం సినిమా తీయాలా? నాకనిపించిన పాయింట్ మీద సినిమా తీయాలా? నా పాయింట్కి సూట్ అయితే, వెళ్లి అడగడానికి రెడీ. ‘నక్షత్రం’ సినిమా విడుదల ఎప్పుడు? దసరాకి విడుదల చేయాలనుకుంటున్నాం. మీకు హిందూ భావజాలం ఎక్కువట? హిందూ మతం దేవుళ్లకు సంబంధించిన అంశం కాదు. ఓ జీవన విధానం. ఎలా బతకాలి? ఎలా బతికితే బాగుంటుంది? తక్కువ సమస్యలు ఉంటాయి? సంతోషంగా ఎలా బతకొచ్చు? అని చెప్పే ఓ జీవన విధానం. ఇస్లాం, క్రిస్టియానిటీ.. ఏ మతం అయినా ఇలా బతకండని చెబుతుంది. చిన్నప్పట్నుంచి హిందూ మతం తాలూకు పరిసరాల్లో పుట్టాను, పెరిగాను కాబట్టి హిందూ భావజాలం నాలో ఉంది. మనం చేయబోయే పనికి మన తాలూకు లేదా బయట నుంచి వచ్చే ఆటంకాలను తట్టుకోవాలంటే ఓ ఫోర్స్ కావాలి. విఘ్నేశ్వరుడికి దణ్ణం పెడితే.. విఘ్నాలు ఉండవనే ధైర్యం వస్తుంది. దీన్ని హిందూ మతం అంటే నో అబ్జక్షన్. అలాగే డబ్బులు కావాలంటే డబ్బులొచ్చే పని చేయాలి. దాంతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. దీన్ని హిందూ మతం అంటే నో అబ్జక్షన్. గాయత్రీ మంత్రంలో ఉండే బీజాక్షరాల్లో ప్రతి అక్షరానికి ఓ వైబ్రేషన్ ఉంది. బాడీలో ప్రకంపనలొస్తాయి. ఎనర్జీ ఫామ్ అవుతుంది. ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. మంత్రం చదవకుండా నాకు ఎనర్జీ, ధైర్యం వచ్చిందని కొంతమంది అంటారు. అందువల్ల, మంత్రం తప్పని నువ్వెలా అంటావ్? నీకు డ్రైవింగ్ వచ్చు, నాకు రాదు. అందుకే డ్రైవర్ హెల్ప్ తీసుకుంటా. అదే దేవుడు అనుకుంటా. అరబు దేశాల్లో పుట్టి ఉంటే ముస్లిం, అమెరికాలోనో, యూరోప్లోనో పుట్టుంటే క్రిస్టియన్ అయ్యేవాణ్ణి. నీ పుట్టుకను బట్టి నీ మతం డిసైడ్ అవుతున్నప్పుడు, ఇది తప్పు, రైట్ అనడానికి నువ్వెవరు? నీ తల్లితండ్రులను కానీ, మతాన్ని కానీ నువ్వు డిసైడ్ చేయలేదు. హిందూ భావజాలాన్ని అంటరానితనంగానో, పాపం కిందో ఫీల్ అవ్వకూడదు. మనం పుట్టి పెరిగిన భావజాలం. ‘ఖడ్గం’లో ఇదే మాట్లాడడానికి ప్రయత్నించాను. ఇంకొకరిది తప్పు అనడం లేదు. ఇది తప్పు? ఇది రైటు? అని మనం ఎలా అంటాం? ఒక్కో చోట ఒక్కో అలవాటు. కొన్ని వేల సంవత్సరాలుగా సెటిల్ అయిపోయి ఉంది. దాన్ని మార్చాలంటే మళ్లీ మార్టిన్ లూథర్ కింగో, గాంధీగారో వచ్చి చెప్పాలి. మీ అబ్బాయి రిత్విక్ గురించి? బాగా షార్ప్, చార్మింగ్, అల్లరి. మా ఇద్దరి లక్షణాలు సమానంగా వచ్చేశాయి. 4 భాషలు మాట్లాడతాడు. హీరోని చేస్తారా? దర్శకుణ్ణి చేస్తారా? నేను, రమ్య సెల్ఫ్మేడ్. మీరు ఇది అవ్వాలని చెబితే.. అయినవాళ్లం కాదు. మా అబ్బాయి ఓ రోజు ఆస్ట్రోనాట్, ఓ రోజు స్పేస్ మెకానిక్, మరో రోజు కార్ డ్రైవర్, ఇంకో రోజు టెన్నిస్ ప్లేయర్ అంటాడు. ఇంతవరకూ హీరో అవుతానని, దర్శకుడు అవుతానని మాత్రం చెప్పలేదు. డెస్టినీ అనేది ఒకటుంటుంది. ‘వాట్ లైఫ్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్’ అనేది మనకు తెలియదు. - డి.జి. భవాని -
సింగిల్ డైరెక్టర్.. మెనీ స్టోరీస్...
షూటింగ్ పూర్తయ్యిందంటే గుమ్మడికాయ పగలాల్సిందే. షూటింగ్ స్టార్ట్ అయ్యిందంటే కొబ్బరికాయ కొట్టాల్సిందే. ఈ దర్శకులలో ఏ దర్శకుని శ్రీమతిని అడిగినా.. ‘ఏమో అండీ! గుమ్మడికాయ పులుసు ఆరగించి కాస్త విశ్రాంతి తీసుకుంటారనుకున్నా. పొద్దున్నే కొబ్బరి పచ్చడి కావాలని ఒక్కటే గొడవ. మా శ్రీవారి వాలకం ఇది’ అంటున్నారు. ఈ దర్శకులందరూ ఓ సినిమా పూర్తవగానే ఇంకో సినిమా గుర్రం ఎక్కుతున్నారు. ఓ గుర్రం దిగితే ఇంకో గుర్రం ఎక్కడం కామనే కదా అనే డౌట్ వస్తోందా! వీళ్లు గుమ్మడి పులుసులోనే కొబ్బరి పచ్చడి నంజుకుంటున్నారు. అదేనండీ.. ఓ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే మరో సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇలా రెండు మూడు గుర్రాల మీద స్వారీ చేస్తున్న ‘సింగిల్ డైరెక్టర్.. మెనీ స్టోరీస్’ కథ ఇది. డిక్షనరీలో ఆ మాట లేదు రామ్గోపాల్ వర్మ డిక్షనరీలో ఖాళీ అనే పదానికి చోటు లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ పర్సనల్ థియేటర్లో ఎప్పుడూ నాలుగైదు సినిమాలు ఆడుతుంటాయి. స్క్రిప్ట్ వర్క్లో ఒకటి, సెట్స్పై మరొకటి, రిలీజ్కి రెడీగా ఉన్నదొకటి, ప్రకటనలకు పరిమితమైన సినిమా ఇంకొకటి! వర్మ ఏం చేసినా సంచలనమే. ‘రక్త చరిత్ర’, ‘బెజవాడ’ సినిమాలతో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వర్మ మరోసారి రాజకీయ నాయకులకు, మీడియాకు పని కల్పిస్తున్నారు. వంగవీటి రంగా జీవితం ఆధారంగా ‘వంగవీటి’ తీస్తున్నట్టు ప్రకటించారు. ఆయనకు బాగా ఇష్టమైన మాఫియా బ్యాక్డ్రాప్లో వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్లో తీసిన ‘రాయ్’ (కర్ణాటకకు చెందిన మాజీ గ్యాంగ్స్టర్ ముత్తప్పారాయ్ జీవితం ఆధారంగా) విడుదలకు సిద్ధమవుతోంది. ఇక, వర్మ దర్శకత్వంలో సచిన్ జోషీ, మీరా చోప్రా జంటగా నటించిన ‘మొగలిపువ్వు’ ఫస్ట్లుక్, ట్రైలర్లు విడుదలై చాలా రోజులైంది. అలాగే రాజశేఖర్తో ‘పట్ట పగలు’ అనే హారర్ సినిమా తీశారు. ఈ రెండు చిత్రాల విడుదల ఎప్పుడో ఇంకా ప్రకటించలేదు. సెట్స్ మీద ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయని టాక్. రివర్స్ గేర్.. సినిమా హిట్టయితే దర్శకుణ్ణి భేష్ అంటారు. ఫట్టయితే వేస్ట్ అంటారు. కానీ, కృష్ణవంశీ విషయంలో మాత్రం ఇది భిన్నంగా జరుగుతుంది. ఆయన సినిమా ఫట్టయినా.. అందులో మాట్లాడుకోవడానికి నాలుగు మంచి మాటలుంటాయ్. కృష్ణవంశీ క్రియేటివిటీ అలాంటిది. మాములుగా కృష్ణవంశీ సినిమా సినిమాకీ కొంచెం గ్యాప్ తీసుకుంటారు. కానీ, ఈసారి గేర్ రివర్స్లో ఉంది. ఆయన కూడా జోరు మీద ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ తీస్తున్నారు. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ హీరోగా ‘రైతు’ సినిమా చేస్తారు. ఇది బాలకృష్ణకు 101వ సినిమా అవుతుంది. పూరి జ‘గన్’ లోడ్ చేసిన గన్, పూరి జగన్నాథ్ బ్రెయిన్ ఒక్కటే. గన్లో నుంచి బుల్లెట్స్ ఎంత స్పీడుగా వస్తాయో.. పూరి బ్రెయిన్లో ఆలోచనలు అంతకంటే స్పీడుగా వస్తాయి. సినిమాలో మాటల తూటాలు పేల్చడమే కాదు, ఏడాదికి రెండు మూడు సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు. ప్రస్తుతం ‘మహాత్మ’ చిత్ర నిర్మాత సీఆర్ మనోహర్ తనయుడు ఇషాన్ను హీరోగా పరిచయం చేస్తున్న ‘రోగ్’ చిత్రీకరణ పూర్తి చేశారు పూరి. వెంటనే నందమూరి కల్యాణ్రామ్ హీరోగా ‘ఇజం’ మొదలుపెట్టేశారు. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్తో సినిమా ప్రారంభిస్తారు. ఇటీవలే కథ కూడా వినిపించారు. నందమూరి బ్రదర్స్ తర్వాత మహేష్బాబుతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నట్లు టాక్. దానికి ‘జన గణ మణ’ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఎప్పటిలానే పూరి జోరు మీద ఉన్నారు. ఒకటి లేట్ అయినా.. మరోటి! గౌతమ్ మీనన్ది కూడా వర్మ స్టైలే. ఓ సినిమా షూటింగ్కి ఎండ్ కార్డ్ వేయకముందే మరో సినిమాకి క్లాప్ బోర్డ్ రెడీ చేసేస్తారు. అజిత్తో తీసిన ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు గాని’) విడుదలకు సిద్ధమైన సమయంలోనే నాగ చైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ప్రారంభించారు. ఈ కథనే తమిళంలో శింబు హీరోగా తీశారు. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మధ్యలో ఈ సినిమా షూటింగ్ లేట్ కావడంతో తమిళ చిత్రం ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ కథ సిద్ధం చేశారు. ఇందులో ధనుష్ హీరో. రానా దగ్గుబాటి కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓ భారీ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు హీరో సాయిధరమ్ తేజ్, తమిళ హీరో ‘జయం’ రవి, కన్నడ స్టార్ పునీత్ రాజ్కుమార్, మలయాళ హీరో పృథ్వీరాజ్లతో ఈ మల్టీస్టారర్ మూవీ తీయాలనుకుంటున్నారట. అనుష్క, తమన్నాలను కథానాయికలుగా అనుకుంటున్నారని టాక్. జోరుగా... కమర్షియల్ కథలకు సందేశాత్మక సొబగులు అద్ది సినిమా తీయడం దర్శకుడు కొరటాల శివ స్పెషాలిటీ. స్వతహాగా రచయిత కావడంతో ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాల్లో హీరోయిజం, సందేశం, వినోదం, భావోద్వేగాలు అన్నిటినీ మేళవించి ప్రేక్షకులకు విందు భోజనం పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’కి దర్శ కత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత రామ్చరణ్తో ఓ సినిమా చేస్తారు. ‘శ్రీమంతుడు’ కంటే ముందే చరణ్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మాణంలో కొరటాల ఓ సినిమా చేయాల్సింది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆ సినిమా ఆగింది. మళ్లీ ఈ కాంబినేషన్ కుదిరింది. మొత్తం మీద ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూ.. గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు కొరటాల శివ. అక్కడ పూర్తి.. ఇక్కడ మొదలు! విభిన్న కథాంశాలతో మంచి మాస్ మూవీస్ తీసే సత్తా ఉన్న దర్శకుడు మురుగదాస్. ఆయన తీసే అన్ని చిత్రాల కథలూ డిఫరెంట్గా ఊంటాయి. మరి.. ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో కానీ, ఒక సినిమా చేసేటప్పుడే మరో డిఫరెంట్ స్టోరీ రెడీ చేసేస్తారు. హిందీలో సోనాక్షీ సిన్హా కథానాయికగా ‘అఖీరా’ సినిమా చేశారు మురుగదాస్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. మహేశ్బాబు హీరోగా భారీ నిర్మాణ వ్యయంతో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ నెలలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. - సత్య పులగం వీళ్లంతా ఏం చేస్తున్నారంటే.. ఆన్ సెట్స్లో ఓ సినిమా ఉన్నప్పుడే మరో సినిమా ప్లాన్ చేస్తున్న దర్శకుల గురించి పక్కన పెట్టి.. ప్రస్తుతం ఆన్ సెట్స్లో ఒక సినిమాతో బిజీగా ఉన్న దర్శకులు, ఆన్ సెట్స్కి తీసుకెళ్లడానికి సినిమా ప్లాన్ చేస్తున్న దర్శకుల విషయానికొస్తే.. ‘బాహుబలి: ది కన్క్లూజన్’తో రాజమౌళి క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్బాబుతో సినిమా చేస్తారని టాక్. చిరంజీవి 150వ చిత్రంతో వీవీ వినాయక్ ఫుల్ బిజీ. ఈ చిత్రాన్ని రామ్చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తండ్రితో సినిమా పూర్తయ్యాక వినాయక్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. రామ్చరణ్ హీరోగా ‘ధ్రువ’ చిత్రం షూటింగ్లో సురేందర్రెడ్డి నిమగ్నమై ఉన్నారు. ఇటీవల నితిన్తో త్రివిక్రమ్ ‘అఆ’ వంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి సినిమా పవన్ కల్యాణ్తో చేస్తారని వినికిడి. ‘సరైనోడు’ వంటి భారీ కమర్షియల్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్తో ఓ సినిమా చేయనున్నారు. అలాగే, ఈ మధ్య బాలకృష్ణను బోయపాటి కలిశారట. మరి.. ఆయనతో సినిమా చేస్తారా? లేక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పరిచయ చిత్రానికి సంబంధించిన చర్చలేమైనా జరుపుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్తో ‘రాయబారి’ చేస్తారని టాక్. వాస్తవానికి ’కంచె’ తర్వాత ఈ సినిమానే చేయాలనుకున్నారు. ఈలోపు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మొదలుపెట్టారు. ‘రాయబారి’కి పడినది తాత్కాలిక బ్రేకేనా..? అనేది కాలమే చెప్పాలి. వెంకటేశ్ హీరోగా ‘బాబు బంగారం’ చేస్తున్నారు మారుతి. అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహించనున్న చిత్రం త్వరలో సెట్స్కి వెళ్లనుంది. -
హైకోర్టులో హైడ్రామా: అగ్రిగోల్డ్ నిందితులపై దాడి
ముదుపు పేరుతో లక్షల మందికి టోకారా ఇచ్చి, వేల కోట్లు ఎగవేసిన అగ్రిగోల్డ్ సంస్థ యజమానులపై బాధితులు దాడిచేశారు. కేసు విచారణ నిమిత్తం నిందితులను సోమవారం బెంగళూరులోని కర్ణాటక హైకోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. తమ రెక్కల కష్టాన్ని దోచుకున్నారంటూ కోర్టు ఆవరణలో ఆందోళనకు దిగిన బాధితులు.. ఒక్కసారిగా అగ్రిగోల్డ్ యజమానులపై విరుచుకుపడ్డారు. సంస్థ చైర్మన్ అవ్వాసు వెంకటరామారావు, ఆయన సోదరుడు శేషునారాయణతోపాటు మరో ముగ్గురు డైరెక్టర్లపై బాధితులు చెప్పులు, రాళ్లతో దాడిచేశారు. దీంతో హైకోర్టు ఆవరణ రణరంగాన్ని తలపించింది. బాధితులు వందల సంఖ్యలో గుమ్మికూడటంతో పోలీసులు కూడా పరిస్థితిని అదుపుచేయలేకపోయారు. అతికష్టం మీద నిదితులను సరక్షిత ప్రాంతానికి తరలించగలిగారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ అగ్రిగోల్డ్ సంస్థ ముదుపుదారులకు కుచ్చుటోపీ పెట్టింది. ఇదే విషయమై కర్ణాటకలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్ నిందితులను కర్ణాటక సీఐడీ పోలీసులు పది రోజుల కిందటే నెల్లూరు జిల్లా నుంచి కర్ణాటకకు తరలించి అక్కడ విచార్తిస్తున్నారు. అయితే ఇదే కేసుపై హైదరాబాద్ హైకోర్టులో సమగ్ర విచారణ జరుతున్న నేపథ్యంలో కర్ణాటక సీఐడీ విచారణను నిలిపివేయాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. నిందితులైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. జడ్జి ఆదేశానుసారం వారిని హైదరాబాద్ కోర్టుకు తరలించేందుకు వాహన ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. బాధితుల దాడిలో పలువురు లాయర్లకు కూడా గాయాలయ్యాయి.