DPR
-
173 కిలో మీటర్లు.. నాలుగు లైన్లు..
సాక్షి, హైదరాబాద్ : ఒక్క రైలు మార్గం.. నాలుగు లైన్ల ట్రాక్.. దేశంలోనే అరుదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు లేదు. ఇప్పుడు తొలిసారిగా నాలుగు రైల్వే లైన్లతో కూడిన కారిడార్ సిద్ధం కాబోతోంది. సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని వాడీ మధ్య ఉన్న మార్గాన్ని నాలుగు లైన్లకు విస్తరించాలని రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ను సిద్ధం చేసి ఇటీవలే రైల్వే బోర్డుకు పంపింది. 173 కిలోమీటర్ల పొడవున చేపట్టే ఈవిస్తరణకు దాదాపు రూ.4,446 కోట్లు అవసరమని అంచనా వేశారు. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేస్తే.. వచ్చే బడ్జెట్లోనే నిధులు కేటాయించేఅవకాశం ఉంది. ఈ విస్తరణతో వంద అదనపు రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.ప్రస్తుతం రెండు లైన్లతో..సికింద్రాబాద్–వాడీ మధ్య ప్రస్తుతం 183 కిలోమీటర్ల మేర రెండు వరుసల రైల్వే కారిడార్ ఉంది. ఇది ముంబైకి ప్రధాన మార్గం కాగా.. బెంగళూరుకు ప్రత్యామ్నాయ మార్గం. ఈ రూట్లో నిత్యం 66 ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయి. ఇక తాండూరు– వాడీ మధ్య పదుల సంఖ్యలో సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా పరిశ్రమలనూ నిర్మిస్తున్నారు. సేడం, నాగులపల్లి ప్రాంతాల్లో స్టీలు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. నిత్యం వందల టన్నుల సిమెంటు, స్టీలు ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుంది. ఇక ఈ ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు తరలుతుంటాయి. వీటన్నింటికీ సంబంధించి నిత్యం 70 వరకు గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో రైల్వే ట్రాఫిక్ 120 శాతంగా ఉంది. అంటే సామర్థ్యం కంటే 20శాతం అదనంగా రైళ్లు నడుస్తున్నాయి. పైగా సరుకు రవాణాకు, ప్రయాణికుల రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. కానీ రైళ్లను పెంచలేని పరిస్థితి. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం మూడో లైన్ నిర్మించాలని నిర్ణయించారు.రైల్వే బోర్డు జోక్యంతో నాలుగోలైన్..దేశవ్యాప్తంగా కీలక కారిడార్లపై ఇటీవల రైల్వే బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో సికింద్రాబాద్–వాడీ సెక్షన్ను పరిశీలించింది. ఇక్కడ మూడోలైన్ నిర్మించిన కొంతకాలానికే నాలుగోలైన్ అవసరం ఏర్పడుతుందని, మళ్లీ భూసేకరణ సహా సమస్యలు వస్తాయని గుర్తించింది. ఒకేసారి రెండు అదనపు లైన్లు నిర్మిస్తే మంచిదని తేల్చింది. పీఎం గతిశక్తిలో భాగంగా ఉన్న రైల్వే నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ దీనికి ఆమోదముద్ర వేసింది. అధికారులు ఇటీవలే ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసి, డీపీఆర్ రూపొందించి రైల్వే బోర్డుకు సమర్పించారు.హఫీజ్పేట వరకు 4 లైన్లు.. సనత్నగర్ వరకు 3 లైన్లు.. సికింద్రాబాద్ వరకు నాలుగు లైన్లు నిర్మించాలనుకున్నా.. మధ్యలో భారీ నిర్మాణాలు ఉన్నందున భూసేకరణ కష్టమని గుర్తించారు. దీంతో వాడీ నుంచి నగరంలోని హఫీజ్పేట వరకు నాలుగు లైన్లకు విస్తరించి.. అక్కడి నుంచి సనత్నగర్ వరకు మూడు లైన్లకు పరిమితం చేస్తారు. సుమారు 600 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంటుందని, రూ.330 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక ఈ మార్గంలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 202 వంతెనలు ఉన్నాయి. ఆయా చోట్ల కొత్త లైన్ల కోసం వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే నెల రోజుల్లో టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు.భవిష్యత్లో బందరు పోర్టుతో అనుసంధానంమరో రెండేళ్లలో ఏపీలోని బందరు పోర్టు సిద్ధం కాబోతోంది. తెలంగాణకు దగ్గరి పోర్టు ఇదే కావటంతో నేరుగా అనుసంధానం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి డెడికేటెడ్ రైల్వే కారిడార్ కావాలని ఇటీవలే సీఎం రేవంత్ ప్రధానిని కోరారు.ఆ లైన్ అందుబాటులోకి వస్తే, దానితో వాడీ లైన్ను అనుసంధానించే అవకాశం ఉంది. ఈ మార్గంలో వచ్చే సిమెంటు, స్టీలు, వ్యవసాయ ఉత్పత్తులువేగంగా బందరు పోర్టుకు చేరుతాయి. -
దక్షిణ వలయం.. అయోమయం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం గందరగోళంగా మారింది. జాతీయ రహదారిగా నిర్మిస్తున్నందున, ఆ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్ రెండు భాగాలూ ఎన్హెచ్ఏఐ పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం నేషనల్ హైవేస్ (ఒరిజినల్) జాబితాలో ఉత్తర భాగం ఉండగా, విజన్ 2047 పార్ట్ 2 జాబితాలో దక్షిణ భాగం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగానికి డీపీఆర్ను రూపొందించే పనిలో ఉంది.గతంలో పిలిచిన టెండర్లకు స్పందన లేకపోవటంతో దాని గడువును పెంచింది. మరోవైపు దాని అలైన్మెంటును ఖరారు చేసేందుకు అధికారులతో గతంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఎన్హెచ్ఏఐ చేపట్టే ప్రాజెక్టులకు అలైన్మెంట్లు, డీపీఆర్లను అదే సొంతంగా ఖరారు చేసుకుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై కసరత్తు చేస్తుండటం అయోమయానికి కారణమవుతోంది. సీఎం సమీక్షలు, కమిటీలుఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో అధికారులు ట్రాఫిక్ సర్వే నిర్వహించినప్పుడు దక్షిణ భాగం పరిధిలో వాహనాల రద్దీ అంత ఎక్కువగా ఉండదని తేలింది. టోల్ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండే రోడ్లపై భారీ వ్యయం చేయటం సబబు కాదన్న ఉద్దేశంతో కేంద్రం అంత ఆసక్తి చూపలేదు. చివరకు రాష్టప్రభుత్వ ఒత్తిడితో సరేనంది. తొలుత ఉత్తర భాగాన్ని చేపట్టి ఆ తర్వాత దక్షిణ భాగంపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర భాగాన్ని భారత్మాల పరియోజనలో చేర్చింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాలతో జాప్యం జరిగి, భారత్మాల పరియోజన గడువు తీరిపోయింది.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ దాన్ని చేపట్టేందుకు నిర్ణయించి నిధులు, టెండర్ల ప్రక్రియ చేపట్టింది. దక్షిణ భాగాన్ని మాత్రం భవిష్యత్తులో చేపట్టేలా విజన్–2047 రెండో జాబితాలో చేర్చింది. అయితే ఆ భాగాన్ని తానే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సొంతంగా అలైన్మెంటు రూపొందించటంతో పాటు డీపీఆర్ కూడా సిద్ధం చేయాలని భావించి సీఎం పలుదఫాలు సమీక్షలు నిర్వహించారు. అధికారులతో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు.ఎవరి పనిలో వారు..!దక్షిణ భాగం నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో మనసు మార్చుకుని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులు కూడా ప్రారంభించాలని కేంద్రాన్ని లిఖి తపూర్వకంగా కోరింది. కానీ ఆ భాగం ఎన్హెచ్ఏఐ అధీనంలోనే ఉన్నందున కేంద్రం తన పనితాను చేసుకుపోతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం డీపీఆర్ తయారీ కసరత్తును కొనసాగిస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వం ఈ భాగానికి సంబంధించి ఓ డ్రాఫ్ట్ అలైన్మెంటును రూపొందించి ఎన్హెచ్ఏఐకి అందించింది.అయితే అది అనుకూలంగా లేదని కేంద్రం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ వేరే అలైన్మెంటును తయారు చేసి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. అది ఖరారైతే ఆ కన్సల్టెన్సీ డీపీఆర్ను రూపొందిస్తుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డీపీఆర్ తయారీకి టెండర్లు కొనసాగిస్తుండటం ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం, అటు కేంద్రం అధీనంలోని ఎన్హెచ్ఏఐ అధికారుల్లో అయోమయానికి కారణమవుతోంది.మేమే కసరత్తు చేస్తాం: ఎన్హెచ్ఏఐ‘దక్షిణ భాగం ముందునుంచీ మా అధీనంలోనే ఉంది. దా నిపై మేమే కసరత్తు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చే స్తోందో మాకు తెలియదు. తానే సొంతంగా నిర్మిస్తానంటూ మాకు అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. ఉత్తర భాగంతోపాటు దక్షిణ భాగాన్ని కూడా పూర్తి చేయాలన్న లేఖ మాత్రం వచ్చింది. ఇలాంటప్పుడు అలైన్మెంటు, డీపీఆర్ తదితరాలు మేమే పూర్తి చేయాల్సి ఉంటుంది..’ అని ఎన్హెచ్ఏఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
విశాఖ–ఖరగ్పూర్ మధ్య హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్లో భాగంగా దీనిని నిర్మించనుంది. గ్రీన్ఫీల్డ్ హైవే ప్రధాన అంశాలివీ⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. ⇒ విశాఖపట్నం– ఖరగ్పూర్ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్పూర్కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.⇒ విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్ చేపడతారు.⇒ డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి వారానికి ఎన్హెచ్ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. ⇒ 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.⇒ ఏడాదిన్నరలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
మెట్రో రైల్ రెండో దశ పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరబాద్ : మెట్రో రైల్ రెండో దశ పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం జరగనుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశలో కొత్త ఫ్యూచర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్పోర్టు నుంచి స్కిల్ వర్సిటీ వరకు 40 కి.మీ. మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే మెట్రో రైలు రెండో దశ డీపీఆర్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మార్పులు చేశారు. ఆరాంఘర్ – బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో ఖరారు చేశారు. నాగోల్ – శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపారు. ఎయిర్పోర్ట్ కారిడార్లో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రో వెళ్లనుంది.రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయంతో ఫోర్త్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం త్వరలోనే మెట్రో రెండో దశ డీపీఆర్లు పంపనున్నారు. మొదటి దశలో 3 కారిడార్లలో 69 కి.మీ. మేర మెట్రో నడుస్తుంది. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కి.మీ. మేర మెట్రో ప్రయాణించనుంది. రెండో దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కి.మీ. మెట్రో పరుగులు తీయనుంది. -
సిద్దిపేట మీదుగా ఫోర్వే
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట మీదుగా నాలుగు వరుసల సరికొత్త జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. సిద్దిపేట సమీపంలోని దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు రూ.1,100 కోట్ల వరకు వ్యయం రోడ్డు నిర్మించడానికి జాతీయ రహదారుల విభాగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. వచ్చేనెలలో కేంద్ర ఉపరితల రవాణాశాఖకు జాతీయ రహదారుల విభాగం దానిని సమర్పించనుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా, అలైన్మెంట్ కూడా ఖరారైంది. ఎన్హెచ్ 365 బీకి కొత్త రూపు.. సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు 184 కి.మీ. మేర ఉన్న 365బీ రోడ్డును కేంద్రం విస్తరిస్తోంది. దీనిని జాతీయ రహదారిగా గుర్తించినా, చాలా ఇరుకుగా ఉండి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం విస్తరిస్తోంది.సూర్యాపేట నుంచి రాజీవ్ రహదారి మీద ఉన్న దుద్దెడ వరకు రెండు వరుసలుగా రోడ్డుగా 10 మీటర్లకు విస్తరించింది. సూర్యాపేట నుంచి జనగామ వరకు పనులు గతంలోనే పూర్తి కాగా, జనగామ నుంచి చేర్యాల మీదుగా దుద్దెడ వరకు పనులు ఇప్పుడు పూర్తి అవుతున్నాయి.ఇక రాజీవ్ రహదారి నుంచి ఈ రోడ్డుకు కొత్తరూపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని నాలుగు వరుసలుగా 20 మీటర్ల వెడల్పునకు విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ పనులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ భాగం 365బీలో అంతర్భాగమే అయినా, ఇందులో సింహభాగం గ్రీన్ఫీల్డ్ హైవేగా పూర్తి కొత్త రోడ్డుగా ఏర్పడబోతోంది. రాజీవ్ రహదారి మీదుగా కాకుండా.. ప్రస్తుతం 365బీ జాతీయ రహదారి చేర్యాల మీదుగా వచ్చి దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిలో కలుస్తుంది. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ఆ రోడ్డులోనే భాగంగా కొనసాగుతోంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా విడదీసి కొత్తరోడ్డుగా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిని క్రాస్ చేసి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వెనక ఉన్న సామాజిక అటవీ భాగం వెనుక నుంచి కోమటి చెరువు పక్క నుంచి సిద్దిపేటకు చేరుతుంది. పట్టణ వెనుక భాగం నుంచి కోటిలింగేశ్వర దేవాలయ సమీపం మీదుగా ముందుకు సాగి రామంచ గ్రామం వద్ద ప్రస్తుతం ఉన్న 365బీ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. అక్కడి వరకు కొత్త అలైన్మెంటుతో రహదారిగా నిర్మిస్తారు. ఆ తర్వాత జక్కాపురం, రామచంద్రాపూర్, నేరెళ్ల, సారంపల్లి, తంగళ్లపల్లి గ్రామాల వద్ద బైపాస్లతో రోడ్డుగా రూపొందనుంది. అనంతరం సిరిసిల్ల పట్టణం వద్ద మానేరు నదిని దాటుతుంది. అక్కడ దీనికోసం వంతెన నిర్మిస్తారు. ప్రస్తుతం నేరుగా సిరిసిల్లలోకి చేరే పాత హైవేను కాదని, సిరిసిల్ల బైపాస్ రోడ్డుతో పట్టణం దాటిన తర్వాత బైపాస్ కూడలి వద్ద ఇతర రోడ్లతో అనుసంధానమవుతుంది. 100 మీటర్లు – 150 మీటర్ల వెడల్పు.. ఇలా రెండు ప్రణాళికలను డీపీఆర్లో చేర్చనున్నారు. వీటిల్లో కేంద్రం దేనికి మొగ్గుచూపితే అంత వెడల్పుతో రోడ్డుకు భూమిని సేకరిస్తారు. డీపీఆర్ ఆమోదం తర్వాతే వివరాలు వెల్లడవుతాయి. రాజీవ్ రహదారిని క్రాస్ చేసే చోట, సిరిసిల్ల వద్ద మానేరు మీద ఫ్లైఓవర్లు ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని చిన్న వంతెనలు కూడా నిర్మిస్తారు. డీపీఆర్కు ఆమోదం తర్వాతనే వీటిల్లో వేటికి కేంద్రం ఆమోదం తెలిపిందో స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
మెట్రోకు మళ్లీ మోకాలడ్డు!
విశాఖపట్నం వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెట్రోపై మళ్లీ చంద్రబాబు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అభివృద్ధి అంతా ఒక్కచోటకే పరిమితం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు విశాఖ నగరాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయి. ముందు అమరావతికి మెట్రో రైలు వచ్చేవరకు రాష్ట్రంలో ఇంకెక్కడా మెట్రో ఉండకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే వైజాగ్ మెట్రో ప్రాజెక్టు పనులకు అంతా సిద్ధమవుతున్న సమయంలో.. వాటిని మరింత ఆలస్యం చేసేందుకు మళ్లీ మొదటికి తీసుకొస్తోంది. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే దీన్ని రద్దు చేసి కొత్త డీపీఆర్ను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు మెట్రో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఇందుకు నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, విశాఖపట్నంచంద్రబాబుకి నచ్చలేదట.. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపటా్నన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం ముందడగు వేసింది. లైట్ మెట్రో ప్రాజెక్టును పట్టాలక్కెంచేందుకు రోడ్ మ్యాప్ను సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంటూ గతేడాది డిసెంబర్ 29న ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వాల వాటా 40 శాతం కాగా, టెండరు దక్కించుకున్న సంస్థ 60 శాతం భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ని కూడా పంపింది. అయితే.. కూటమి ప్రభుత్వం రావడంతో ఆలస్యం, అలసత్వం చోటు చేసుకుంటున్నాయి. విశాఖ అభివృద్ధి తమకు ఇష్టం లేదన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇటీవల విశాఖలో పర్యటించిన ఆయన మెట్రో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తిస్థాయిలో మెట్రో డీపీఆర్ తయారు చేసినట్లు వివరించినా.. తనకు ఆ డీపీఆర్ నచ్చలేదని చంద్రబాబు చెప్పేశారు. మళ్లీ కొత్తగా డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.ఇలాగైతే మోక్షమెప్పుడో.. జాతీయ రహదారుల నిర్మాణాల్లో తలమునకలైన ఎన్హెచ్ఏఐతో కలిసి మెట్రో డీపీఆర్ రూపొందించడం అనేది అంతులేని కథగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. ఆలస్యం, అలసత్వంతో వైజాగ్కు మెట్రో రాకుండా చేసేందుకే చంద్రబాబు ఈ తరహా ఆదేశాలు జారీ చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందు గన్నవరం నుంచి అమరావతి వరకు మెట్రో రైలు నిర్మించడమే చంద్రబాబు లక్ష్యమని తెలుస్తోంది. అది పూర్తయ్యే వరకూ రాష్ట్రంలో ఎక్కడా మెట్రో మాటే లేకుండా కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం. కొత్త డీపీఆర్ తయారీకి.. ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. దానిలో మార్పులు చేర్పులు అంటూ మెలికపెడితే.. మరో ఆరు నెలలు గడిచిపోతుంది. దాన్ని కేబినెట్ ఆమోదించి.. కేంద్రానికి పంపించేందుకు మరో 6 నెలలు.. కేంద్రం ఆమోదించేందుకు మరో ఏడాది.. ఇలా.. ఈ ఐదేళ్లు విశాఖ మెట్రో ప్రాజెక్టు కాగితాల్లోనే కునారిల్లేలా చేయడమే చంద్రబాబు ఉద్దేశమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఏదో వంక.. అటకెక్కించడం పక్కా..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైజాగ్ మెట్రో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వడివడిగా అడుగులు వేసింది. విశాఖపట్నం భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. మొత్తం 76.90 కి.మీ మేర లైట్మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్ను అధికారులు సిద్ధం చేశారు. దీన్ని కేబినెట్ కూడా ఆమోదించింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) విధానంలో మెట్రో నిర్మించడానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని.. ఇందులో ప్రభుత్వాలు రూ.5,723.6 కోట్లు భరించాల్సి ఉండగా ప్రైవేట్ డెవలపర్.. వీజీఎఫ్ కింద రూ.8,585.4 కోట్లు భరిస్తూ పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు టెండర్లు ఖరారైనప్పటి నుంచి మూడేళ్లకే తొలి మార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో అడుగులు వేసింది. భవిష్యత్తులో విశాఖలో నిర్మించే ఫ్లైఓవర్లను కూడా దృష్టిలో పెట్టుకొని డీపీఆర్ డిజైన్లు సిద్ధం చేశారు. అయితే చంద్రబాబు.. మెట్రో ఫ్లైఓవర్ల ఎత్తు, వెడల్పులు సరిగా లేవని.. అందులో మార్పులు చేయాలని సూచించడం గమనార్హం. మెట్రో పిల్లర్ల ఎత్తు ఎలా పెంచాలి? ఏ ప్రాంతంలో ఫ్లైఓవర్ పొడవుగా ఉండాలి.. ఎక్కడ వెడల్పు తక్కువగా ఉండాలో నిపుణులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇలా.. ఏదో ఒక వంకతో.. వైజాగ్ మెట్రో ప్రాజెక్టుని నెమ్మదిగా అటకెక్కించేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడుతోంది. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖని వెనక్కి నెట్టేందుకు కుట్రలు పన్నడంపై నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Fact Check: ఎందుకీ ‘తొందరపాటు’?
సాక్షి, అమరావతి: ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్పీ)కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 2022 సెపె్టంబరులో తయారైంది. అప్పటి ధరల ప్రకారం వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్ తయారు చేసింది. అంటే ఈ ప్రాజెక్టు డీపీఆర్ 18 నెలల క్రితం ధరలతో తయారైంది. ఏ ప్రాజెక్టుకైనా ఏటా 6 శాతం ధరల పెరుగుదల ఉంటుంది. ఎగువ సీలేరు పీఎస్పీకి అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి, రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరిగింది. ఇందులో 9.87 శాతం ఎక్కువకు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్–1 (తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థ)గా ఎంపికైంది. దానికే ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ధరల పెరుగుదల 6 శాతం పోగా మేఘా సంస్థ కోట్ చేసిన మొత్తం ఎక్కువేమీ కాదు. ఈ విషయం విష పత్రిక ఈనాడు అధినేత రామోజీకి తెలియనిదీ కాదు. పైగా, గత ఏడాది జూన్లో టెండర్లు పిలిచి, అన్ని నిబంధనలను పాటిస్తూ, రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లను ఏపీ జెన్కో ఖరారు చేసింది. అంటే 8 నెలలపాటు టెండర్ల ప్రక్రియ సాగింది. ఇందులో తొందరపాటేమీ లేదన్నదీ రామోజీకి తెలుసు. అయినా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏదోలా విషం చిమ్మి, ప్రజలను మభ్య పెట్టేయాలన్న తొందరపాటులో విషయం లేని ఈ కథనాన్ని అచ్చేశారు. ఈనాడు ప్రచురించిన ఈ అసత్య కథనాన్ని ఏపీ జెన్కో, ఇంధన శాఖ ఖండించాయి. ఆ రెండు సంస్థలు అసలు టెండర్లలో పారదర్శకత, నిబంధనలు అమలు తీరును ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆ వివరాలు.. ♦ 2022 సెప్టెంబరు ధరల ప్రామాణికంగా ఈ పీఎస్పీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘‘వ్యాప్కోస్’ డీపీఆర్ తయారు చేసింది. డీపీఆర్ తయారై 18 నెలలు గడిచిపోయింది. డీపీఆర్ ఆధారంగా ఈ ప్రాజెక్టుకు టెండరు పిలిచిన మొత్తం రూ. 6,717 కోట్లు కాగా మేఘా రూ.7,380 కోట్లకు (9.87 శాతం ఎక్కువకు) టెండరు పొందింది. ఏడాదిన్నర క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు మేఘా కోట్ చేసిన బిడ్లో ఏడాదికి 6 శాతం పెరుగుదలా ఉంది. అందువల్ల ప్రతిపాదిత టెండరు మొత్తంకంటే 9.87 శాతం ఎక్కువనడానికి లేదు. అన్ని అంశాలను విశ్లేషించిన తర్వాతే ప్రభుత్వ ఆమోదంతో ఏపీజెన్కో ఈ టెండరును ఆమోదించింది. ♦ ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ అవసరాలు తీర్చడం ద్వారా గ్రిడ్ను స్థిరీకరించడం, అధిక ధరకు మార్కెట్లలో విద్యుత్ కొనుగోళ్లు తగ్గించడం, కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలుగా ప్రభుత్వ ఆదేశంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిరి్మంచాలని ఏపీజెన్కో నిర్ణయించింది. ♦ కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలకు ఈ ప్రాజెక్టు అనుమతికి సంబంధించిన అన్ని పత్రాలు అందజేసి, త్వరితగతిన వివరణలు ఇవ్వడం ద్వారా ఏపీజెన్కో చట్టబద్ధమైన అనుమతులు సాధించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అనుమతి పొందిన తర్వాత గత ఏడాది జూన్లో పీఎస్పీ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. పూర్తిగా నిబంధనలు, విధివిధానాలను అనుసరించి ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండరు ఖరారు చేసింది. అన్ని నిబంధనలు పాటించినందునే టెండరు ఖరారుకు ఎనిమిది నెలలు పట్టింది. టెండర్ల ఖరారులో ఎలాంటి తొందరపాటు లేదనడానికి ఇదే నిదర్శనం. ♦ ఈ ఏడాది జనవరికల్లా పనులు ప్రారంభించి 2028 డిసెంబరుకల్లా ప్రాజెక్టు పూర్తి చేసి అందుబాటులోకి తేవడం ద్వారా ఐఎన్డీసీ, సీఓపీ మార్గదర్శకాల ప్రకారం కర్బన ఉద్గారాలను, భూతాపాన్ని తగ్గించాలని సీఈఏ షెడ్యూలు ఇచ్చింది. కర్బన ఉద్గారాల తగ్గింపు, భూతాపం (వేడి) నియంత్రణకు 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాదనకు పీఎస్పీ, బ్యాటరీలే మార్గాలు. ఇంత పెద్ద పరిమాణంలో బ్యాటరీల ఏర్పాటు సాధ్యంకానందున పీఎస్పీల నిర్మాణమే ఉత్తమ మార్గం. అందువల్లే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఈ పీఎస్పీ నుంచి డిస్కంలు విద్యుత్ తీసుకునేందుకు ఏపీఈఆర్సీ, ఏపీపీసీసీ అనుమతులు కూడా లభించాయి. భూసేకరణ ప్రణాళిక కూడా రూపొందించిన తర్వాత సీఈఏ అనుమతించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మొదటి దశ పర్యావరణ అనుమతి ఇచ్చింది. ♦ భూసేకరణ, జీఎస్టీ, ఐడీసీ, ధరల పెరుగుదల వల్ల పెరిగే వ్యయం, చట్టబద్ధమైన అనుమతులు అన్నీ కలిపి 2022 ధరల ప్రాతిపదికన ఈ పీఎస్పీ నిర్మాణానికి రూ. 11,881.50 కోట్లవుతుందన్న అంచనాతో 2022సెప్టెంబర్ లో వ్యాప్కోస్ డీపీఆర్ రూపొందించింది. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా రూ. 6,717 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహా్వనించి రూ. 7,380 కోట్లకు (జీఎస్టీ కాకుండా).. అంటే 9.87 శాతం ఎక్కువకు కాంట్రాక్టు ఖరారు చేసింది. -
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్తోపాటు పశ్చిమ బెంగాల్లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
గోదావరి– కావేరి అనుసంధానంపై వచ్చేనెలలో సీఎంల భేటీ
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై వచ్చేనెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ మేరకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డట్లూ్యడీఏ) రాష్ట్రాలకు ప్రాథమికంగా సమాచారం పంపించింది. ఈ రెండు నదుల అనుసంధానానికి సంబంధించి సవివర ప్రణాళిక నివేదిక(డీపీఆర్) త్వరలోనే రాష్ట్రాలకు పంపించి అ«ద్యయనం చేయడానికి గడువు ఇచ్చిన తర్వాత ఈనెలాఖరులో ఆయా ప్రభావిత రాష్ట్రాల నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్ను ఎన్డబ్లు్యడీఏ హైదరాబాద్ విభాగం కేంద్రానికి పంపించింది. దీనికి ఎన్డబ్లు్యడీఏ ఆమోదముద్ర వేసిన వెంటనే సంబంధిత రాష్ట్రాలకు ఆ నివేదిక పంపిస్తారు. రెండు నదుల అనుసంధానికి రూ.74,329 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు చేపట్టిన ఐదేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా అందులో పేర్కొన్నారు. ఈ పాజెక్టు పూర్తయితే ప్రతీ సంవత్సరం రూ.9824.49 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని లెక్కకట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడతారు. దీనికి రూ.3381 కోట్లు అవుతుందని అంచనా. ఇక ఛత్తీస్గఢ్ వినియోగించుకోని149 టీఎంసీల నీటిని గోదావరి–కావేరి అనుసంధానం కింద తరలించాలని కేంద్రం భావిస్తున్న సంగతి విదితమే. ఒకవేళ ఛత్తీస్గఢ్ ఈ 140 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పక్షంలో.. మహానది–గోదావరి మధ్య 230 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. వాటిని కావేరికి తరలిస్తామని వెల్లడించింది. ఇప్పటికే పలు సమావేశాల్లో గోదావరి–కావేరి నదుల అనుసంధానికి సంబంధించి సమ్మతి లభించింది. త్వరలోనే గోదావరి బోర్డు సమావేశం కూడా... గోదావరినది యాజమాన్య బోర్డు సమావేశం త్వరలోనే జరగనున్నట్టు సమాచారం. తదుపరి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల సమాచారం అందులో చేర్చాలని ఏపీ ప్రభుత్వం గతంలో కోరింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి లేఖ కూడా రాశారు. ఎల్లంపల్లి బ్యారేజీ పరిసర ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాలతోపాటు కుప్తి, ఎస్సారెస్పీ రెండో దశ వినియోగం, ఇందిరమ్మ వరద నీటి కాలువ, కాళేశ్వరం అదనపు టీఎంసీల వినియోగంపై చర్చించాలని కోరింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని గోదావరి యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలకు 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం కోటాను సాగర్కు మళ్లించింది. ఉమ్మడి జలాశయాల నుంచి ఇరు రాష్ట్రాలకు 80 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే. శ్రీశైలంలో కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోయామని, అందువల్ల నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి ఐదు టీఎంసీల నీటి విడుదల చేయాలని ఏపీ కోరిక మేరకు బోర్డు అనుమతినిచి్చంది. బోర్డు ఆర్థిక పరిస్థితిపై ఈనెల 12వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
విశాఖలో మోడరన్ ట్రామ్ ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ప్రతిపాదించిన మెట్రో లైట్ (మోడరన్ ట్రామ్) ప్రాజెక్టుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. మంత్రి బుధవారం మెట్రో ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు డీపీఆర్ను మరింత మెరుగ్గా తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ అధునాతన ట్రామ్ ప్రాజెక్టును మెట్రో రైలు సిస్టంకు అనుసంధానంగా నగరం నలు దిక్కులా నాలుగు కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 60.05 కిలోమీటర్ల పరిధిలో 58 స్టేషన్లతో రూ.5,332 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రి వివరించారు. ప్రజా అవసరాలు, డిమాండ్ తదితర ప్రాధాన్యతలకు అనుగుణంగా ఒక్కొక్క కారిడార్కు తగిన ఆర్థిక నమూనా (ఫైనాన్షియల్ మోడల్)లో అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో పురపాలక, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్లు వై.శ్రీలక్ష్మి , ఎస్ఎస్ రావత్, మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.21 వేల కోట్లతో సీతారామ–సీతమ్మసాగర్!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల– సీతమ్మసాగర్ ఉమ్మడి ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కొత్తగా ఇల్లందు కాల్వను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను అనుమతుల కోసం తాజాగా ఢిల్లీలో కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమర్పించింది. రూ.13,700 కోట్ల అంచనాలతో సీతారామ ఎత్తిపోతల పథకం, రూ.5,200 కోట్ల అంచనాలతో సీతమ్మసాగర్ బ్యారేజీ, రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ఇల్లందు కాల్వ కలిపి మొత్తం రూ.21,100 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు డీపీఆర్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. 1.13 లక్షల కొత్త ఆయకట్టు సీతారామ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందని ఎగువ ప్రాంతాల్లోని 1.13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడానికి ఇల్లందు కాల్వను నిర్మించనున్నారు. ఇల్లందు నియోజకవర్గానికి అధిక ప్రయోజనం కలగనుండగా, మధిర, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలకు సైతం ప్రయోజనం చేకూరనుంది. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ఎత్తిపోతలను నిర్మిస్తుండగా, కొత్తగా ప్రతిపాదించిన ఇల్లందు కాల్వతో సీతారామ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టు 7.84 లక్షల ఎకరాలకు పెరగనుంది. సీడబ్ల్యూసీకి రెండో సవరణ డీపీఆర్ విద్యుదుత్పత్తి అవసరాలకు 37 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన సీతమ్మ బ్యారేజీ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 70.4 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పనులు సైతం 55 శాతం వరకు పూర్తయ్యాయి. దీనికి దాదాపుగా అన్ని రకాల అనుమతులను ఇప్పటికే సీడబ్ల్యూసీ ఇచ్చేయగా, అపెక్స్ కౌన్సిల్ తుది అనుమతులు ఇవ్వాల్సి ఉంది. సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచే సీతారామ ఎత్తిపోతలకు నీళ్లను తరలిస్తున్న నేపథ్యంలో బ్యారేజీని సైతం సీతారామ ఎత్తిపోతల పథకంలో కలిపేసి ఒకే ప్రాజెక్టుగా అనుమతులు పొందాలని గతంలో సీడబ్ల్యూసీ సూచించింది. పర్యావరణ అనుమతుల కోసం రెండు ప్రాజెక్టులను కలిపేసి ఒకే ప్రాజెక్టుగా కేంద్ర పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. సీడబ్ల్యూసీకి వేర్వేరు ప్రాజెక్టులుగా ప్రతిపాదించడం పట్ల అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులను కలిపేసి ఒకే ప్రాజెక్టుగా ప్రతిపాదిస్తూ మళ్లీ సీడబ్ల్యూసీకి నాలుగు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీపీఆర్ను సమర్పించింది. తాజాగా ఇల్లందు కాల్వ నిర్మాణం పనులను సైతం డీపీఆర్లో చేర్చి సవరించిన డీపీఆర్ను మరోసారి సీడబ్ల్యూసీకి ఇచ్చింది. ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉందని, మరో నెల రోజుల్లో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ముందుకు డీపీఆర్ వెళ్లే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. గోదావరిలో సీతారామ–సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు నీటి లభ్యతతోపాటు పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఇటీవల గోదావరి బోర్డు సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటికే సీడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ అనుమతులు లభించిన నేపథ్యంలో గోదావరి బోర్డు లేఖతో ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
కావేరికి ‘గోదారే’!
సాక్షి, అమరావతి : గోదావరి–కావేరి అనుసంధానానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఛత్తీస్గఢ్ సర్కార్ అంగీకరించకున్నా.. ఆ రాష్ట్ర వాటాలో వాడుకోని 141.3 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించడాన్ని వారు తప్పుపడుతున్నారు. మా నీళ్లను కావేరికి ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్గఢ్ సర్కార్ అభ్యంతరం తెలపడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ 141.3 టీఎంసీలపై ఛత్తీస్గఢ్ సర్కార్ హక్కులను వదులుకోవడానికి అంగీకరించినా ఆ జలాలను కావేరికి తరలించడానికి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని స్పష్టంచేస్తున్నారు. ఛత్తీస్గఢ్ వదులుకున్న 141.3 టీఎంసీలను పునఃపంపిణీ చేయాలని గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలు ట్రిబ్యునల్ను ఆశ్రయించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ మొహిలే చెబుతున్నారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల మిగులు జలాలను జతచేసి.. 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2018లో ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదన రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు తలా 80 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించారు. ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం.. గోదావరి–కావేరి అనుసంధానానికి ఎన్డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనపై ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 106 టీఎంసీలను ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో గోదావరి–కావేరి అనుసంధానంలో ఎన్డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా డీపీఆర్ను రూపొందించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు అందిస్తామని పేర్కొంది. దీనిపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో గత మార్చి 6న టాస్క్ఫోర్స్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ఛత్తీస్గఢ్ అభ్యంతరం చెబుతున్నా.. టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్వహించిన ఈ సమావేశానికి ఛత్తీస్గఢ్ సర్కార్ను ఆహ్వానించలేదు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తావిస్తూ.. ఛత్తీస్గఢ్ సర్కార్ను ఆహ్వానించకుండా, ఆ రాష్ట్ర కోటా నీటి తరలింపుపై ఎలా చర్చిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రశ్నించాయి. ఛత్తీస్గఢ్ సర్కార్తో ఉన్నతస్థాయిలో చర్చించి.. ఆ రాష్ట్ర కోటా నీటిని తరలించడానికి అంగీకరింపజేస్తామని కమిటీ చెప్పుకొచ్చింది. కానీ, ఇది ఆచరణ సాధ్యంకాదని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ మొహిలే స్పష్టంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ కేటాయించని జలాలపై పూర్తి హక్కు తమకుందని.. తమ నీటిని ఎలా తరలిస్తారని ఛత్తీస్గఢ్ సర్కార్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్డబ్ల్యూడీఏ ఎలా ముందడుగు వేస్తుందన్నది వేచిచూడాల్సిందే. -
నదుల అనుసంధానానికి ప్రాధికార సంస్థ
సాక్షి, అమరావతి : నదుల అనుసంధానం పనులను పర్యవేక్షించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ తరహాలో నేషనల్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ (నిరా) పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించింది. నదుల అనుసంధానానికి సంబంధించి సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీ నుంచి.. ప్రధాన పనులకు సంబంధించిన టెండర్లు, వాటి పర్యవేక్షణ వరకూ అన్ని బాధ్యతలను ఆ సంస్థే నిర్వహించనుంది. ఆయకట్టుకు నీళ్లందించే బ్రాంచ్ కెనాల్స్ (ఉప కాలువలు), డి్రస్టిబ్యూటరీల (పిల్ల కాలువల) పనులను మాత్రమే రాష్ట్రాలకు అప్పగించాలని ప్రతిపాదించింది. అప్పుడే నదుల అనుసంధానం వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తూ కేంద్ర మంత్రి మండలికి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. వాటిపై కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) నిరాగా రూపాంతరం చెందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ ప్రాజెక్టుల కంటే అధికంగా.. జాతీయ ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో 90% నిధులను కేంద్రం సమకూర్చేది. కానీ.. ఇటీవల ఆ వాటాను 60 శాతానికి తగ్గిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ.. నదుల అనుసంధానం ప్రాజెక్టులకు మాత్రం 90 శాతం నిధులను కేంద్రం విడుదల చేస్తుందని, మిగతా 10 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరించాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కెన్–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు (కేబీఎల్పీ) నుంచే ఈ మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కేబీఎల్పీ మధ్యప్రదేశ్లో 8.11 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్లో 2.51 లక్షల హెక్టార్లు వెరసి 10.62 లక్షల హెక్టార్లకు నీళ్లందించనున్నారు. కేబీఎల్పీ అంచనా వ్యయం 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఇందులో 90 శాతం కేంద్రం భరిస్తుంది. మిగతా 10 శాతం ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ భరిస్తాయి. మిగతా నదుల అనుసంధాన ప్రాజెక్టులకూ ఇదే విధానం వర్తిస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ పేర్కొంది. నదుల అనుసంధానం వేగవంతం హిమాలయ, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడం ద్వారా కడలి పాలవుతున్న జలాలను మళ్లించి దేశాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఎన్డబ్ల్యూడీఏ 30 అనుసంధాన ప్రాజెక్టులను సిద్ధం చేసింది. కానీ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, నిధుల కొరత, జల వివాదాలు, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం తదితర సమస్యల వల్ల నదుల అనుసంధానం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. ఇటీవల కెన్–బెట్వా నదుల అనుసంధానానికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఆ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. నదుల అనుసంధానం కోసం ప్రత్యేకంగా ‘నిరా’ను ఏర్పాటు చేస్తే.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం నుంచి పనులు చేపట్టడం వరకూ వేగవంతమయ్యే అవకాశం ఉందని నీటి పారుదలరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
గోదావరి–కావేరి అనుసంధానానికి రూ. 39,275 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి (జీ–సీ) నదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.39,274.92 కోట్ల వ్యయం కానుందని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) అంచనా వేసింది. ఈ మేరకు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)ను రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరితో కృష్ణాను, కృష్ణాతో పెన్నాను, పెన్నాతో కావేరి నదులను అనుసంధానిస్తామ ని ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ప్రాజెక్టు మొత్తం పొడవు 1,211 కి.మీగా ఉండనుందని పేర్కొంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ మార్చి 6న హైదరాబాద్లోని జలసౌధలో సమావేశమై గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా నోట్లో ఈ విషయాలను ఎన్డబ్ల్యూడీఏ వెల్లడించింది. భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాల మేరకు డీపీఆర్లకు తుదిరూపు ఇచ్చామని, ఇక ఈ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొంది. ఏ బేసిన్కు ఎంత వాటా?: గోదావరి బేసిన్లో మిగులు జలాల లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే తేల్చిచెప్పింది. గోదావరిలో ఛత్తీస్గఢ్ వాటాగా ఉన్న 283 టీఎంసీల నుంచి ప్రస్తుతం ఆ రాష్ట్రం వాడుకోని 141 టీఎంసీలనే తరలిస్తామని ఎన్డబ్ల్యూడీఏ పేర్కొంటోంది. 141 టీఎంసీల్లో 45.1 టీఎంసీలను కృష్ణా బేసిన్లో, 35.3 టీఎంసీలను పెన్నా బేసిన్లో, 38.7 టీఎంసీలను కావేరి బేసిన్లో, 9.8 టీఎంసీలను మలప్రభ సబ్బేసిన్లో వాడుకోనుండగా 10.1 టీఎంసీలను చెన్నై నగరానికి, 2.2 టీఎంసీలను పుదుచ్చేరికి తరలిస్తామని ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణకు 42.6 టీఎంసీలు, ఏపీకి 41.8 టీఎంసీలు, తమిళనాడుకి 38.6 టీఎంసీలు, కర్ణాటకకు 9.8 టీఎంసీ లు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలను కేటాయించనున్నారు. రాష్ట్రంలో 2.38 లక్షల హెక్టార్ల ఆయకట్టు గోదావరి–కావేరి అనుసంధానంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మొత్తం 3,98,490 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించడంతోపాటు 1,75,407 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. మొత్తం 5,73,897 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో 9.46 టీఎంసీలతో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు 24.96 టీఎంసీలతో 1,58,236 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరపనున్నట్టు ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి మొత్తం 34.43 టీఎంసీలతో 2,38,236 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. మరో 3 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5.19 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం రాష్ట్రానికి కేటాయించనున్నారు. ఏపీలో 2.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏపీలో 31.39 టీఎంసీలతో 2,19,271 హెక్టార్ల కొత్త ఆయకట్టుతోపాటు 0.6 టీఎంసీలతో 2727 హెక్టార్ల స్థిరీకరణను ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. మొత్తం 31.99 టీఎంసీలతో 2,21,998 హెక్టార్లకు ఏపీలో లబ్ధి కలగనుంది. తాగునీటి అవసరాలకు 4.2, పారిశ్రామిక అవసరాలకు 5.65 టీఎంసీలను ఆ రాష్ట్రానికి కేటాయించింది. తమిళనాడులో 13.13 టీఎంసీలతో 99,219 హెక్టార్ల కొత్త ఆయకట్టు, 3.67 టీఎంసీలతో 14,444 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణను ప్రతిపాదించింది. 9.35 టీఎంసీలను ఆ రాష్ట్ర తాగునీటి, 12.46 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు కేటాయించింది. రూ.2817.62 కోట్లతో బెడ్తి–వార్ధా అనుసంధానం కర్ణాటకలోని బెడ్తి–వార్ధా అనుసంధానం ప్రాజెక్టుకు రూ.2,817.62 కోట్ల అంచనాలతో డీపీఆర్ను సిద్ధం చేసినట్లు ఎన్డబ్ల్యూడీఏ పేర్కొంది. గోదావరి–కావేరి, బెడ్తి–వార్ధా అనుసంధానికి మొత్తం రూ.42,092.54 కోట్లు కానుందని ఎజెండా నోట్లో పేర్కొంది. 52 కి.మీల బెడ్తి–వార్ధా అనుసంధానంతో 18.5 టీఎంసీలను తరలించి 1.05 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు పేర్కొంది. -
జల రవాణా ప్రాజెక్టు పట్టాలెక్కేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదితో బకింగ్ హామ్ కాలువను పునరుద్ధరించటం ద్వారా అనుసంధానించి జల రవాణా చేపట్టాలన్న ప్రణాళిక పట్టాలెక్కేలా లేదు. మహా రాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. నాలుగు రాష్ట్రాలతో ముడిపడిన ఈ అద్భుత ప్రాజెక్టు ద్వారా సరుకు రవాణా ఖర్చును నాలుగో వంతుకు తగ్గించే గొప్ప అవకాశం చేజారిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. నదుల అనుసంధానం ద్వారా జల రవాణాకు ఊతమివ్వనున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాతి క్రమంలో దీనిపై మౌనం దాల్చడమే ఇందుకు కారణం. డీపీఆర్ తయారీ కసరత్తు వరకు హడావుడిగా జరిగినా, ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో అడుగు ముందుకు పడలేదు. జలరవాణాకు, ముఖ్యంగా గోదావరి నదిలో కారిడార్ ఏర్పాటుకు విఘాతం లేని విధంగా, నదిపై నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పుడు దానితో ప్రమేయం లేకుండా పనులు జరుగుతున్నాయి. వీటివల్ల భవిష్యత్తులో ప్రాజెక్టు చేపడితే ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కేంద్రం జోక్యం చేసుకోకపోవడంతో ఊరించిన జలరవాణా ప్రాజెక్టు అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటీ ప్రాజెక్టు.. గోదావరి నదిలో సరుకు రవాణాకు వీలుగా ప్రత్యేక కారిడార్ ఏర్పాటును 2015లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఆంధ్ర మీదుగా చెన్నై వరకు సరుకులు తరలించేలా ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు గోదావరి ప్రవహిస్తోంది. దీనిని అతిపురాతన బకింగ్హామ్ కెనాల్ ద్వారా అతిపెద్ద ఓడ రేవు ఉన్న చెన్నైతో అనుసంధానిస్తే సరుకు రవాణాలో సరికొత్త విప్లవం వస్తుందని గడ్కరీ యోచించారు. నిపుణులతో సర్వే చేయించారు. బ్రిటిష్ పాలనలో కాకినాడ నుంచి తమిళ నాడులోని విల్లుపురం వరకు 796 కి.మీ. మేర బకింగ్హామ్ కెనాల్ను నిర్మించారు. అప్పట్లో ఈ కాలువను సరుకు రవాణాకు ముమ్మరంగా వాడారు. స్వాతంత్య్రానంతరం దీని ప్రాభవం క్రమంగా తగ్గిపోయింది. తాజాగా దీన్ని పునరుద్ధరించటం ద్వారా పులికాట్ సరస్సుకు అనుసంధానించి పుదుచ్చేరి వరకు విస్తరించాలన్న ప్రణాళిక రూపుదిద్దుకుంది. గోదావరిని ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం (గోదావరి చివరి బ్యారేజీ) నుంచి కృష్ణా కెనాల్ ద్వారా కృష్ణా నదికి, అక్కడి నుంచి కొమ్ముమూరు కెనాల్ (గుంటూరు జిల్లా దుగ్గిరాల) ద్వారా (ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద) బకింగ్హామ్ కెనాల్కు అనుసంధానించాలన్నది ప్రతిపాదన. ఈ మేరకు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడ ఎలా అనుసంధానించాలో వివరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించింది. కానీ ఇప్పుడు ఆ అంశం మరుగున పడిపోవడం సందేహాలకు తావిస్తోంది. సందేహాలకు తావిస్తున్న వంతెనల నిర్మాణం పడవలు నడవాలంటే నదిలో ఎప్పుడూ నీటి నిల్వ ఉండాలి. కానీ గోదావరిలో భద్రాచలం సహా చాలా ప్రాంతాల్లో వేసవిలో నీళ్లు ఇంకిపోతుంటాయి. అందువల్ల జల రవాణాకు వీలుగా ప్రత్యేకంగా కారిడార్ను నిర్ధారించి ఛానెల్ ఏర్పాటు ద్వారా అన్ని సమయాల్లో నిర్ధారిత పరిమాణంలో నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు నది దాటేందుకు నిర్మించే వంతెనలు పడవల రాకపోకలకు ఆటంకం కలిగించకుండా ప్రత్యేక డిజైన్ను ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు ఆ డిజైన్తో సంబంధం లేకుండా పలుచోట్ల వంతెనల పనులు జరుగుతుండటం ఈ ప్రాజెక్టుపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జల రవాణాతో ఎంతో ఆదా.. ప్రస్తుతం సరుకు రవాణా సింహభాగం రోడ్డు మార్గాన జరుగుతోంది. రైల్వే లైన్ అందుబాటులో ఉన్న చోట ఎక్కువగా రైళ్ల ద్వారా సాగుతోంది. రోడ్డు మార్గాన సరుకు రవాణాకు నాలుగు రూపాయలు ఖర్చయితే, రైలు మార్గాన తరలించేందుకు మూడు రూపాయలు వ్యయం అవుతుంది. అదే జల రవాణా ద్వారా అయితే అర్ధ రూపాయితో సరిపోతుందన్నది నిపుణుల మాట. ఇటీవల ఆ ఊసెత్తని గడ్కరీ.. గతంలో జాతీయ రహదారుల విస్తరణ పనుల ప్రారంభం కోసం తెలంగాణకు వచ్చిన సందర్భంలో గడ్కరీ గోదావరి ఇన్లాండ్ వాటర్ వే గురించి మాట్లాడారు. నాటి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో దీనిపై చర్చించారు. కానీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం దీని ప్రస్తావన తేకపోవడం గమనార్హం. ‘గతంలో ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ గత నాలుగైదేళ్లుగా దీనిపై ఎలాంటి ఆదేశాలు, సూచనలు లేవు. మేం మా పని చేసుకుపోతున్నాం. వంతెనలకు ప్రత్యేక డిజైన్ విషయంలో కూడా ఎలాంటి సూచనలు అందలేదు..’ అని జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
మియాపూర్ టు సంగారెడ్డి ట్రాఫిక్ రద్దీకి చెక్.. ఆరు వరుసలుగా రోడ్డు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్–సంగారెడ్డి మార్గంలో నిత్యం నరకప్రాయంగా ఉన్న ట్రాఫిక్ రద్దీకి తెరపడనుంది. ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోత్రెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా 60 మీటర్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైంది. వారం రోజుల్లో ఇది కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రిత్వ కార్యాలయ అనుమతి కోసం ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. 31 కి.మీ. నిడివి ఉన్న ఈ రోడ్డు విస్తరణకు రూ.1,400 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రోడ్డునిర్మాణ పనులకు రూ.వేయి కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.400 కోట్లు ఖర్చు కానుంది. నగరంలోనే పెద్ద రోడ్డుగా.. ఈ మార్గంలోనే ఉన్న కూకట్పల్లి వద్ద అత్యంత రద్దీ ట్రాఫిక్ వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును విస్తరించింది. అక్కడి నుంచి రోడ్డు విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల విభాగం తీసుకుంది. ఈ రోడ్డు 60 మీటర్లకు వెడల్పు కానుంది. ప్రధాన క్యారేజ్ వే, దాని పక్కన సర్వీస్ రోడ్లు కలిపి 200 అడుగుల విశాలంతో రోడ్డు ఏర్పడుతుంది. నగరంలో విశాలంగా ఉన్న ప్రధాన రోడ్డు ఇదే కానుంది. ప్రస్తుతం రోడ్డు నాలుగు వరుసలుగా ఉన్నా.. 60 మీటర్ల స్థలం మాత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ మొత్తం రోడ్డుగా మారబోతోంది. అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు ఈ రోడ్డులో వాహనాలకు క్రాసింగ్ రోడ్లతో ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లను నిర్మిస్తారు. ఇందులో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లైఓవర్ రానుంది. దీనిని ఈ రోడ్డులో భాగంగానే నిర్మించాల్సి ఉంది. అక్కడ ట్రాఫిక్ చిక్కుల దృష్ట్యా ఆ పనులను విడదీశారు. త్వరలో అక్కడ నిర్మాణ పనులు జరగబోతున్నాయి. ఇక పటాన్చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం,కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా 60 మీటర్ల స్థలం అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో తప్ప పెద్దగా నిర్మాణాలు అడ్డుగా లేవు. బీహెచ్ఈఎల్ దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. ఏప్రిల్ నాటికి టెండర్లు పూర్తి చేసి జూలై నాటికి పనులు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు ప్రారంభమైన రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ, రెండున్నరేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. -
కాళేశ్వరానికి ‘అదనపు’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనపు టీఎంసీ ఎత్తిపోసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాళేశ్వరం అదనపు టీఎంసీ డీపీఆర్కు అనుమతుల జారీ ప్రక్రియ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు ఇటీవల లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాల్లో స్టేటస్ కో కొనసాగించాలని కేంద్ర న్యాయ శాఖ సూచించినట్లు గోదావరి బోర్డుకు జలశక్తి శాఖ తెలియజేసింది. దీంతో కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను ప్రస్తుతానికి గోదావరి బోర్డు పక్కనబెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అదనపు టీఎంసీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అనుమతుల ప్రక్రియకు సైతం బ్రేక్ పడినట్టు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూ. 85 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అదనపు టీఎంసీ సహా ఇతర పనుల పూర్తికి మరో రూ. 30 వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. డీపీఆర్ పరిశీలనకు గోదావరి బోర్డు నో గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అన్ని రకాల అనుమతులతో చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ తర్వాత అదనపు టీఎంసీ తరలింపు పనులను మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండానే మొదలుపెట్టింది. అయితే ఈ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిన కేంద్ర జలశక్తి శాఖ... 6 నెలల్లోగా అనుమతి పొందాలని 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఆదేశించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... అదనపు టీఎంసీ తరలింపు కోసం చేపడుతున్న పనులు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని... అందువల్ల అనుమతిలేని ప్రాజెక్టుల జాబితా నుంచి దీన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సవరించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. కేంద్ర జలసంఘానికి ఇప్పటికే సవరించిన డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించగా హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు లభించాయి. అనంతరం సవరించిన డీపీఆర్ను గోదావరి బోర్డుకు సాంకేతిక అనుమతుల కోసం పంపింది. బోర్డు ఈ డీపీఆర్ను పరిశీలించి సంతృప్తి చెందితే కేంద్ర జలశక్తి శాఖలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం కోసం సిఫారసు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియను తాజాగా గోదావరి బోర్డు పక్కన బెట్టింది. మరికొంత కాలం తప్పని జాప్యం... పరిహారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొందరు ప్రాజెక్టు భూనిర్వాసితులు... రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే అదనపు టీఎంసీ పనులు చేపడుతోందని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అంశాలపై స్టేటస్ కో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ తుది తీర్పునకు లోబడి చర్యలు ఉండాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
కాళేశ్వరం సవరణ డీపీఆర్ వెనక్కి.. పరిశీలించలేమన్న గోదావరి బోర్డు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్పై పరిశీలన జరిపి, అనుమతుల కోసం కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి సిఫారసు చేసేందుకు గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) నిరాకరించింది. ఈ ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులుండటం వల్ల తాము డీపీఆర్ను పరిశీలించలేమని రాష్ట్ర నీటిపారుదల శాఖకు తేల్చిచెప్పింది. తొలుత రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2 టీఎంసీల పనులకు సంబంధించిన డీపీఆర్కు ఇప్పటికే కేంద్రం నుంచి అన్ని అనుమతులు లభించాయి. తర్వాత కా లంలో రోజుకు అదనపు టీఎంసీ తరలించే పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టుకూ అనుమతులు తీసుకోవాలని గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కేంద్రం ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేనందున అదనపు టీఎంసీ పనులపై హైకోర్టు సైతం స్టే విధించింది. 2 టీఎంసీల పనులతో పాటు అదనపు టీఎంసీ పనులు సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినవేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కేంద్రం సూచనతో 2టీఎంసీల పనుల డీపీఆర్లో అదనపు టీఎంసీ పనులను సైతం చేర్చి సవరించిన డీపీఆర్కు అనుమతుల కోసం ఇటీవల గోదావరి బోర్డు కు సమర్పించింది. కోర్టు కేసులను కార ణంగా చూపి డీపీఆర్ను పరిశీలించడా నికి బోర్డు నిరాకరించగా, పనుల నిలుపుదలకే హైకోర్టు ఆదేశించిందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు తెలియజేసింది. డీపీఆర్ను పరిశీలించి నిబంధనల ప్రకారం సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి పంపించాలని కోరింది. -
Andhra Pradesh: కొత్తగా రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలోని పామర్రు–గుడివాడ, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి బైపాస్ రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. గతంలో రెండు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ఈ రహదారుల్లో ట్రాఫిక్రద్దీ పెరిగిన దృష్ట్యా నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఆమోదించింది. అందుకోసం త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో మార్పులు చేసి పనులు ప్రారంభించనుంది. చదవండి: (విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది) -
గోదావరి బోర్డుకు కాళేశ్వరం సవరణ డీపీఆర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్ను గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ)కు సమర్పించింది. తొలుత రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలు ఎత్తిపోసే లక్ష్యంతో కాళేశ్వరాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దానికి సంబంధించిన అనుమతులన్నీ కేంద్రం నుంచి పొందింది. తర్వాత మరో టీఎంసీ అదనంగా తరలించే పనులను చేపట్టింది. అయితే కేంద్రం ఈ మూడో టీఎంసీ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చుతూ.. ఆరునెలల్లో అనుమతి తీసుకోవాలని 2021 జూలై 15న ఆదేశించింది. అయితే రోజుకు రెండు టీఎంసీలు తరలించే ప్రాజెక్టు, అదనపు టీఎంసీ తరలించే పనులు వేర్వేరు కాదని, రెండూ కాళేశ్వరంలో అంతర్భాగమేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనితో సవరించిన కాళేశ్వరం డీపీఆర్ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సవరణ డీపీఆర్ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు సమర్పించి హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు పొందింది. తాజాగా రూ.1.15 లక్షల కోట్ల అంచనాతో సవరించిన డీపీఆర్ను గోదావరి బోర్డుకు అందించింది. గోదావరి బోర్డు డీపీఆర్పై సాంకేతిక పరిశీలన జరిపాక.. సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఓకే చేస్తుంది. చివరిగా అపెక్స్ కౌన్సిల్లో డీపీఆర్పై చర్చించి ఆమోదముద్ర వేస్తారు. మరో రూ.30వేల కోట్లు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.85 వేలకోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. కొత్త డీపీఆర్ ప్రకారం మిగతా పనుల పూర్తికి ఇంకో రూ.30వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఆర్ఈసీ, పీఎఫ్సీతోపాటు పలు బ్యాంకుల నుంచి కాళేశ్వరం కార్పొరేషన్కు రావాల్సిన రుణాలు ఏప్రిల్ నుంచి నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర బడ్జెట్ నిధులే దిక్కు అని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కాళేశ్వరం వృథా కాదు.. ఆదా! -
మహిళల ఆర్థిక పరిపుష్టికి జగన్ సర్కారు చర్యలు.. రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం
కోవిడ్ మహమ్మారి ఎంతోమంది మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివిధ రకాల ప«థకాల ద్వారా ఆయా వర్గాలను ఆదుకుంటోంది. అందులో ఒకటి పీఎంఎఫ్ఎంఈ పథకం. ఇది ఆహార శుద్ధి రంగానికి సంబంధించినది. ఈ పథకం ద్వారా ఆహార పరిశ్రమలో రాణించాలనుకునే మహిళలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో సహాయం చేయనుంది. అనంతపురం అర్బన్: అక్కచెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ద్వారా శ్రీకారం చుట్టింది. ఆగస్టు నెలాఖరులోగా 110 యూనిట్లు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి విడతగా 34 యూనిట్ల కోసం డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను బ్యాంకులకు పంపింది. ప్రస్తుతం ఉన్న ఆహార శుద్ధి యూనిట్లకు, కొత్త యూనిట్లకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టింది. పరిశ్రమలు నెలకొల్పే సభ్యులకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సాంకేతిక సహకారం అందించనుంది. ఆర్థిక సాయం ఇలా... సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పీఎంఎఫ్ఎంఈ పథకం కింద బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. పెట్టుబడి కింద యూనిట్ విలువలో 10 శాతం మొత్తాన్ని లబ్ధిదారు చెల్లించాలి. బ్యాంక్ లింకేజీ ద్వారా 90 శాతం రుణం ఇస్తారు. ఇందులో 35 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పటికే ఉన్న యూనిట్లకు సంబంధించి యంత్రాల ఏర్పాటుకు రుణం ఇస్తారు. కొత్తగా యూనిట్ ఏర్పాటుకు, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రుణ సౌకర్యం కల్పిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం వర్కింగ్ క్యాపిటల్, 75 శాతం మిషనరీకి పెట్టాల్సి ఉంటుంది. పథకం ముఖ్య ఉద్దేశం ► ఆహార శుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం ► సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం ► పరిశ్రమల సామర్థ్యాల అభివృద్ధి, పనికి కావాల్సిన సాంకేతిక సహాయం అందించడం ► ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్ తోడ్పాటు ► సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మౌలిక ► సదుపాయాలు కల్పించడం ఆహారశుద్ధి పరిశ్రమలు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద వేరుశనగ నూనె మిల్లు, దాల్ మిల్లు, పిండిమిషన్, బొరుగుల బట్టీ, బేకరీ, రోటీ మేకర్, పచ్చళ్ల తయారీ, శనగల ప్రాసెసింగ్, పొటాటో చిప్స్ తయారీ, మురుకులు, మిక్చర్, చెక్కిలాలు, నిప్పట్ల తయారీ తదితర ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళల ఆర్థికాభివృద్ధి సాధన దిశగా.. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా పీఎంఎఫ్ఎంఈ పథకం కింద ఆగస్టు నెలాఖరుకు మండలానికి మూడు ఆహార శుద్ధి పరిశ్రమలు, అవసరమున్న చోట ఐదు చొప్పున జిల్లా వ్యాప్తంగా 110 యూనిట్లు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తొలి విడతగా 34 యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను బ్యాంకులకు పంపించాం. – ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్ -
నీటి పంపిణీ తర్వాతే డీపీఆర్లు
సాక్షి, అమరావతి: ‘కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా మదింపు చేసి, రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలి. అప్పటివరకు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల డీపీఆర్లకు సాంకేతిక అనుమతి ఇవ్వకూడదు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలి’ అని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. తెలంగాణ చేపట్టిన చనాకా – కొరటా, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లను మదింపు చేయవద్దని కోరింది. గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తు చేసింది. వాటికి అనుమతి ఇస్తే గోదావరి డెల్టా, పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. విభజన చట్టం ప్రకారం వాటికి సాంకేతిక అనుమతి ఇచ్చి, సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని పట్టుబట్టింది. గోదావరి బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్సింగ్ ఏపీ వాదనతో ఏకీభవించారు. తెలంగాణ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్లకు సాంకేతిక అనుమతి ఇవ్వకుండా రెండు రాష్ట్రాల వాదనలను సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. హైదరాబాద్లోని గోదావరి బోర్డు కార్యాలయంలో బుధవారం చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, సీఈ మోహన్కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిధిపై తలోమాట గోదావరి ప్రధాన పాయపై ఎస్సారెస్పీ నుంచి సీతారామసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలోకి తేవాలని అన్నారు. దీనికి ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. పరిధిపై మరో మారు చర్చిద్దామని, బోర్డుకు తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని చైర్మన్ కోరారు. ఇందుకు ఏపీ సుముఖత వ్యక్తం చేయగా.. తెలంగాణ అంగీకరించలేదు. జూలై 15లోగా అనుమతి తీసుకోవాల్సిందే గోదావరి బేసిన్లో అనుమతి లేని ప్రాజెక్టులకు జూలై 15లోగా అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటి ద్వారా నీటి వినియోగాన్ని అనుమతించబోమని ఛైర్మన్ స్పష్టంచేశారు. గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మదింపు చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కోరామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడానికి కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ వేయాలని కోరామన్నారు. వీటిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ రెండు అంశాలు బోర్డు పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బోర్డు చైర్మన్ చెప్పారు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి సంప్రదించాలని ఏపీ అధికారులకు సూచించారు. -
3 డివిజన్లు.. 54,500 మంది ఉద్యోగులు
సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల నెరవేర్చేందుకు రైల్వే అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దక్షిణ కోస్తా జోన్కు సంబంధించిన డీపీఆర్ ఆధారిత తుది ప్రక్రియ చివరి దశకు చేరుకుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్త జోన్లో 54,500 మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని డీపీఆర్లో పొందుపరిచిన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపైనా కసరత్తులు జరుగుతున్నాయి. కొత్త జోన్ ఏర్పాటైతే.. ప్రస్తుతం ఉన్న వనరుల ఆధారంగా వార్షికాదాయం సుమారు రూ.15 వేల కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. సిబ్బంది సర్దుబాటు విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్ను సమర్థంగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా జోన్ ఏర్పాటు అయినప్పుడు 30 నుంచి 40 వేల మంది ఉద్యోగులతో విధులు మొదలు పెట్టేవారు. క్రమంగా ఆ సంఖ్యను పెంచుతుంటారు. కానీ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు మాత్రం 65,800 అవసరం అని డీపీఆర్లో పొందుపరిచారు. అయితే కార్యకలాపాలు ప్రారంభమైన సమయంలో మాత్రం 54,500 మంది అవసరమని నిర్ధారించారు. వాల్తేరు డివిజన్ కార్యాలయంలో 17,985 మంది, వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయంలో 930 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని రెండు డివిజన్లకు సర్దుబాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అలాగే విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. ఈ మూడు డివిజన్లలో కలిపి మొత్తం 50 వేల ఉద్యోగులను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆదాయం పెరిగే అవకాశం కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)ని రైల్వే బోర్డు అధికారులు స్టడీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు జోన్లో ఉండనున్నాయి. జోన్ కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఎలా మొదలు పెట్టాలి? ఉద్యోగుల సర్దుబాటు ఎలా నిర్వహించాలి? డివిజన్లతో సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి? జోన్ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు మొదలైన అంశాలపై కసరత్తులు జరుగుతున్నాయి. అదేవిధంగా వివిధ కేటగిరీల రైల్వే స్టేషన్లు, వాటిని కొత్త జోన్లో అభివృద్ధి చేసేందుకు ఉన్న వనరులు, జోన్ కేంద్రంగా కొత్తగా నడపాల్సిన రైళ్లు, తదితర అంశాల్ని క్రోడీకరిస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. మూడు డివిజన్ల నుంచి వచ్చే ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకొని ఈ జోన్ నుంచి వార్షికాదాయం 2018–19 గణాంకాల ప్రకారం రూ.12,200 కోట్లు(డీపీఆర్ తయారు చేసినప్పుడు)గా గణించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రూ.15 వేల కోట్లు సమకూరే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. జోన్ స్వరూపమిదీ.. జోన్ : సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జోన్ పరిధిలో డివిజన్లు : విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రూట్ లెంగ్త్ : 3,496 కి.మీ రన్నింగ్ ట్రాక్ లెంగ్త్ : 5,437 కి.మీ సరకు రవాణా : 86.7 మిలియన్ టన్నులు రాకపోకలు సాగించే ప్రయాణికులు : 192.5 మిలియన్లు జోన్ పరిధిలో ఉన్న పోర్టులు : విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ మేజర్ స్టేషన్లు : విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి జంక్షన్లు : 26 ఏ–1,ఏ,బీ కేటగిరీ స్టేషన్లు : 46 సీ,డీ,ఈ,ఎఫ్ కేటగిరీ స్టేషన్లు : 141 పాసింజర్ హాల్ట్ స్టేషన్లు : సుమారు 170 వైఫై సౌకర్యం ఉన్న స్టేషన్లు : 61 స్టేషన్లు జోన్ నుంచి నడిచే రైళ్లు : సుమారు 500 జోన్ పరిధిలో ఉన్న మెకానికల్ వర్క్షాపులు : తిరుపతి, రాయనపాడు, వడ్లపూడి (త్వరలో ఏర్పాటు కానుంది) కోచ్ మెయింటెనెన్స్ డిపోలు : విశాఖపట్నం, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం విజయవాడ, గుంటూరు, తిరుపతి, గుంతకల్లు డీజిల్ లోకో షెడ్లు : విశాఖపట్నం, గూటీ, గుంతకల్లు, విజయవాడ ఎలక్ట్రికల్ లోకోషెడ్లు : విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు రైల్వే హాస్పిటల్స్ : విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, రాయనపాడు, గుంటూరు -
డీపీఆర్లపై ఢీ!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ బేసిన్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల విషయంలో తెలంగాణ, గోదావరి బోర్డుల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. డీపీఆర్లను అధ్యయనం చేసి వాటిని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలనకు పంపించే క్రమంలో అనేక అంశాలపై బోర్డు వివరణలు కోరుతుండటం తెలంగాణ రాష్ట్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. డీపీఆర్లో పేర్కొన్న నీటి లభ్యత అంశాలు, వ్యయ వివరాలు, ఆయకట్టుకు నీటి మళ్లింపు, విద్యుత్ అవసరాలపై సరైన వివరణలు లేవంటూ బోర్డు అంటుంటే..లేని అధికారాలను వాడుతూ డీపీఆర్లను కేంద్రానికి పంపకుండా బోర్డు అనవసర జాప్యం చేస్తోందంటూ తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వరుస లేఖలు..భిన్న అంశాలపై ప్రశ్నలు కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆరు నెలల్లో గోదావరి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లు అందించడంతో పాటు వీటికి సంబంధించి బోర్డు, సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం సీతారామ, తుపాకులగూడెం, చనాకా–కొరట, చౌట్పల్లి హన్మంత్రెడ్డి, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్లను బోర్డుకు అందజేసింది. అయితే డీపీఆర్లను సునిశితంగా పరిశీలిస్తున్న బోర్డు అనేక అంశాలపై రాష్ట్రం నుంచి వివరణ కోరుతూ లేఖలు రాస్తోంది. చౌట్పల్లి ప్రాజెక్టు విషయంలో..హైడ్రాలజీ వివరాలతో పాటు కాల్వల ఆధునికీకరణ, ప్రవాహ సామర్థ్యాలను పెంచడం ద్వారా పొదుపు అవుతున్న నీటి వివరాలు, కాల్వల డిజైన్, వాటి సామర్థ్యాలు, ఇరిగేషన్ ప్లానింగ్, బెనిఫిట్ కాస్ట్ రేషియో, టోపోషీట్ మ్యాపులు, ఈ ప్రాజెక్టు ద్వారా నిండుతున్న చెరువులు, వాటికింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. మోదికుంటవాగు విషయంలో జియాలజీ పరిశీలన, డ్యామ్ నిర్మిత ప్రాంత అధ్యయనాలు, కేంద్ర జల సంఘం చెప్పిన హైడ్రాలజీ లెక్కలు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన డ్రాయింగ్ల వివరాలు తమకు సమర్పించాలని అడిగింది. చనాకా–కొరటకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 2015–16 ధరల ప్రకారం ఒక రకంగా, 2021–22 ధరల ప్రకారం మరోలా ఉన్నాయని ఎత్తిచూపుతూ వివరణ కోరింది. ఇక సీతారామ విషయంలో అయితే వరుసగా లేఖలు రాస్తూనే ఉంది. దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద ఉన్నప్పుడు హెడ్ రెగ్యులేటర్కు ఉండే ముంపు, ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు నిర్ణయించిన నీటి కేటాయింపు, విద్యుత్ వినియోగ లెక్కల్లో తేడాలు, విద్యుత్ ఛార్జీల అంశాల్లో తేడాలపై వివరణలు ఇవ్వాలని కోరింది. దీంతో పాటే ప్రాజెక్టు కింద చేసిన వ్యయం, ఆ పనుల వివరాలు తమకు అందించాలంటూ లేఖలు రాసింది. ఆ అధికారం మీకెక్కడిదంటున్న తెలంగాణ ఇలా డీపీఆర్ల పరిశీలన పేరుతో బోర్డు సంధిస్తున్న ప్రశ్నలు, కోరుతున్న వివరణలపై తెలంగాణ కస్సుమంటోంది. లేని అధికారాలను తమపై ప్రయోగిస్తోందని మండిపడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని క్లాజ్ 85(8)(డీ) ప్రకారం.. కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులు అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశాలను మాత్రమే బోర్డులు పరిశీలించాల్సి ఉంటుందని, అంతకుమించి అధికారాలేవీ బోర్డులకు లేవంటూ తెలంగాణ ఇటీవల రాసిన లేఖలో తెలిపింది. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయాలకు సంబంధించి పరిశీలన చేసి వివరణలు కోరే అధికారం బోర్డులకు ఉండదని, దీనిపై సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు పరిశీలన చేస్తాయని స్పష్టం చేసింది. లేని అధికారాలతో హద్దుమీరి అతిగా వ్యవహరించొద్దంటూ కాస్త ఘాటుగా స్పందించింది. అనవసర జాప్యం చేయకుండా ప్రాజెక్టుల డీపీఆర్లను తక్షణమే సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని కోరింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని బోర్డు మోదికుంటవాగు, చిన్న కాళేశ్వరం హైడ్రాలజీ, వ్యయాలపై ఇటీవల మళ్లీ లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. దీంతో వ్యవహారం మరింత ముదిరే అవకాశాలున్నట్లు కనబడుతోంది. ఒకవేళ బోర్డు ఇదే వైఖరి కొనసాగిస్తే తెలంగాణ దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని ఇరిగేషన్ వర్గాలు అంటున్నాయి. -
డీపీఆర్లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను ఆమోదించే విషయంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డీపీఆర్ల పరిశీలనల పేరిట అనవసర కాలయాపన చేస్తోందని గోదావరి బోర్డు తీరును తప్పుపట్టింది. పరిధికి మించి వ్యవహరిం చడం మాని డీపీఆర్లను వెంటనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి పంపాలని కోరింది. ఈ మేరకు గురువారం నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, గోదావరి బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని క్లాజ్ 85(8)(డి) ప్రకారం కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులతో అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలన చేయాల్సి ఉంటుందని, ట్రిబ్యునల్లు తమ అవార్డులో పేర్కొన్న నీటి లభ్యతకు నష్టం కలిగించే అంశాలపైనే తమ పరిశీలనలు తెలపాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. అలాకాకుండా విభజన చట్టంలో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రిమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, వ్యయ అంచనాలకు సంబంధించి పరిశీలనకు కేంద్ర జల సంఘంలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దృష్ట్యా క్లాజ్ 85(8)(డి)లో పేర్కొన్న అంశాలకే బోర్డు పరిమితం కావాలని సూచించారు. -
భారీగా పెరగనున్న కాళేశ్వరం అంచనా వ్యయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం అంచనా వ్యయం భారీగా పెరగనుంది. రీడిజైనింగ్లో భాగంగా మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని తీసుకునే ప్రతిపాదనకు అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు చేపట్టిన నేపథ్యంలో దీని వ్యయం లక్ష కోట్లను దాటనుంది. బుధవారం జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో, గురువారం ఢిల్లీలో కేంద్ర జల సంఘానికి సమర్పించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)లో అదనపు టీఎంసీ వ్యయాన్ని రూ.30,435.97 కోట్లుగా ప్రభుత్వం చూపింది. గతంలో రెండు టీఎంసీలు తీసుకునేలా సమర్పించిన మొదటి డీపీఆర్లో పేర్కొన్న ప్రాజెక్టు వ్యయాన్ని కలిపితే మొత్తం వ్యయం దాదాపు రూ.1.11 లక్షల కోట్లకు చేరుతోంది. మార్పుల కొద్దీ పెరిగిన వ్యయం ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడానికి ముందు 2006–07లో ప్రాజెక్టు వాస్తవ అంచనా వ్యయం రూ.17,875 కోట్లుగా ఉంది. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ అంచనా వ్యయాన్ని రూ.38,500 కోట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టును పూర్తిగా రీ డిజైన్ చేసి 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు, మరో 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా 18 రిజర్వాయర్ల సామరŠాధ్యన్ని 14 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచారు. దీనికి అనుగుణంగా అంచనా వ్యయం రూ.80,190 కోట్లకు చేరినట్లు కేంద్రానికి సమర్పించిన తొలి డీపీఆర్లో సాగునీటి శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే 2015–16 స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లతో తయారు చేసిన ఆ అంచనాలను ఇటీవల సవరించారు. పెరిగిన స్టీలు, సిమెంట్, ఇంధన ధరలతో పాటు జీఎస్టీలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణ వ్యయాన్ని రూ.88,557.44 కోట్లకు పెంచారు. అయితే ఇప్పటివరకు మొదటి డీపీఆర్నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునే సామరŠాధ్యన్ని 3 టీఎంసీలకు పెంచేలా పనులు చేపట్టారు. ఈ అదనపు టీఎంసీకి రూ.30,435.97 కోట్ల వ్యయం అవుతోంది. ఒక్కో లింకులో ఇలా... లింక్–1లో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు పనులకు రూ.4,227 కోట్లు, లింక్–2లో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు రూ.11,806 కోట్లు, లింక్–4లో మిడ్మానేరు నుంచి అనంతగిరి వరకు రూ.4,412కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు రూ.10,260 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొదటి డీపీఆర్లో పేర్కొన్న వ్యయం, ప్రస్తుతం సమర్పించిన డీపీఆర్ వ్యయాలు కలిపితే మొత్తం వ్యయం రూ.1,10,625.97 కోట్లకు చేరుతోంది. ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల ఖర్చు ప్రాజెక్టు మొత్తం వ్యయంలో ఇప్పటివరకు సుమారు రూ.65 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. ఇందులో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల ద్వారానే రూ.45 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. 50 టీఎంసీల మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద 14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండటం, దీనికి అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత పెంచేందుకే అదనపు టీఎంసీ పనులు చేపట్టామని డీపీఆర్లో పేర్కొన్నారు. మొదటి డీపీఆర్లో పేర్కొన్న మేరకు మేడిగడ్డ నుంచి మళ్లించుకునే 195 టీఎంసీలు, ఎల్లంపల్లి వద్ద లభ్యతగా ఉండే 20 టీఎంసీలు, భూగర్భ జలాల ద్వారా లభ్యతగా ఉండే మరో 25 టీఎంసీలు కలిపి మొత్తం 240 టీఎంసీల్లోనే అదనపు టీఎంసీ నీటి వినియోగం ఉంటుందని, అదనపు నీటి వినియోగం చేయబోమని వెల్లడించారు. -
డీపీఆర్లపై కదలిక
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాలని, వాటికి కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలని అటు కేంద్రం, ఇటు బోర్డులు చెబుతున్న నేపథ్యంలో డీపీఆర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నిర్ణయించింది. మూడు రోజుల కింద ఇంజనీర్లతో ç సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. డీపీఆర్ల తయారీపై దృష్టిపెట్టి అనుమతులు తెచ్చుకునే పనిని ఆరంభించాలని సూచించారు. దీంతో 10 ప్రధాన ప్రాజెక్టుల డీపీఆర్లపై ఇరిగేషన్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాన ప్రాజెక్టులు టార్గెట్... కృష్ణా, గోదావరి నదీ బేసిన్లో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు మొదలైన నాటి నుంచే కేంద్ర జలశక్తి శాఖ ప్రాజెక్టుల డీపీఆర్ల సమర్పణ, అనుమతుల అంశాన్ని ప్రస్తావిస్తోంది. దీనిపై పలుమార్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రభుత్వానికి లేఖలు రాశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రాగా డీపీఆర్లు ఇచ్చేందుకు తెలంగాణ సుముఖత తెలిపింది. ఇంతవరకు సమర్పించలేదు. కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్లోనూ కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ ఎత్తిపోతలు, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, రామప్ప సరç స్సు నుంచి పాకాల లేక్కు నీటి మళ్లింపు, పాల మూరు–రంగారెడ్డి, డిండి, మోడికుంటవాగు, తుమ్మిళ్ల ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం అనుమతులు లేవని పేర్కొంటూ.. ప్రాజెక్టులకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లో అనుమతులు పొందాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీటి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లతో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పాలమూరు–రంగారెడ్డికి సంబంధించిన పర్యావరణ అనుమతుల ప్రక్రియను మొదలు పెట్టించారు. మిగతా ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను సైతం మొదలుపెట్టేలా డీపీఆర్లను సిద్ధం చేయాలని, వాటిని కేంద్రానికి పంపి అనుమతులు పొందాలని సూచించారు. దీంతో ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్కుమార్ శుక్రవారం జలసౌధలో ప్రాజెక్టుల ఈఎన్సీలు, సీఈలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీపీఆర్ల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొందుపరచాల్సిన అంశాలు, సేకరించాల్సిన వివరాలు తదితరాలపై మార్గదర్శనం చేశారు. శనివారం నుంచే డీపీఆర్ల తయారీ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. -
Krishna And Godavari River: ముప్పేట ఒత్తిడి!
కృష్ణా, గోదావరి జలాల ఆధారంగా నిర్మిస్తున్న, నిర్మించ తలపెట్టిన కొత్త ప్రాజెక్టులపై ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ముదిరిన నేపథ్యంలో డీపీఆర్ల అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. డీపీఆర్లు సమర్పించాలంటూ బోర్డులు రెండు రాష్ట్రాలకు లేఖాస్త్రాలు సంధిస్తున్నాయి. తమకు చెల్లించాల్సిన నిధులు వెంటనే డిపాజిట్ చేయాలని కూడా కోరుతుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. గెజిట్లో పేర్కొన్న ఒక్కో అంశాన్ని పరిశీలిస్తున్న బోర్డులు.. వాటి అమలు ప్రక్రియను షురూ చేశాయి. గెజిట్ వెలువరించిన మరుసటి రోజే ఆ కాపీలను తెలుగు రాష్ట్రాలకు అధికారికంగా పంపిన బోర్డులు.. తదనుగుణంగా చర్యలు మొద లుపెట్టాలని సూచించాయి. నోటిఫికేషన్లో పేర్కొ న్న మాదిరి తమకు డబ్బులు చెల్లించాలని, ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని వరుసగా లేఖలు రాస్తున్నాయి. మరోపక్క అనుమతులు లేని ప్రాజెక్టులకు రుణాల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రుణ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. కేంద్రం విడుదల చేసిన గెజిట్తో ప్రాజెక్టుల నిర్మాణంపై పడే ప్రభావం, రుణ సంస్థలకు ఎదురయ్యే చిక్కులపై ఆరా తీయడం మొదలుపెట్టాయి. డీపీఆర్ల కోసం ఒత్తిడి అక్టోబర్లో అపెక్స్ భేటీ జరిగింది. అప్పట్నుంచే రెండు బోర్డులు ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు)లు సమర్పించాలని రాష్ట్రాలను కోరుతున్నాయి. అయినా తెలంగాణ ఇంతవరకు ఎలాంటి డీపీఆర్లు సమర్పించలేదు. ఇటీవల కొత్త ప్రాజెక్టుల విషయంలో వివాదాలు ముదిరిన నేపథ్యంలో.. అపెక్స్ ఆమోదం లేకుండా, కేంద్ర జల సంఘంతో పాటు తమ అనుమతి లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదని బోర్డులు తాజాగా మరోసారి ఆదేశించాయి. అలాగే అన్ని ప్రాజెక్టుల డీపీఆర్లు వెంటనే సమర్పించాలని కూడా కోరాయి. తాజాగా తెలంగాణ చేపట్టిన 37 ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డు వాటి డీపీఆర్లు ఇవ్వాల్సిందిగా రెండ్రోజుల కిందట లేఖ రాసింది. మరోపక్క గోదావరి బోర్డు గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్–3, సీతారామ, కంతనపల్లి, మిషన్ భగీరథ, లోయర్ పెనుగంగపై చేపట్టిన మూడు బ్యారేజీలు, రామప్ప–పాకాల నీటితరలింపు, కాళేశ్వరంలోని మూడో టీఎంసీకి సంబంధించిన పనుల డీపీఆర్లు సమర్పించాలని కోరింది. అయితే డీపీఆర్లు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్నా.. తెలంగాణ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు ఇవ్వండి ఇలావుండగా కేంద్ర ప్రభుత్వం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్కు అనుగుణంగా బోర్డులు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున చెల్లించాలని బోర్డులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాయి. నోటిఫికేషన్ వెలువడ్డ రోజునుంచి 60 రోజుల్లో ఈ నిధులు చెల్లించాలని గెజిట్లో పేర్కొన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరాయి. అనుమతులపై రుణ సంస్థల ఆరా.. ఈ పరిస్థితుల్లో రుణ సంస్థలు ప్రాజెక్టులకు అనుమతులపై దృష్టి సారించాయి. ముఖ్యంగా తెలంగాణలోని కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులతో పాటు సీతారామ సాగర్, సీతమ్మ బ్యారేజీ, తుపాకులగూడెం, దేవాదుల, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్ఈసీ), నాబార్డ్ వంటి సంస్థలు రుణాలు అందించాయి. ప్రస్తుతం ఈ సంస్థలు ప్రాజెక్టులకు అనుమతులపై కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల నుంచి సమాచారం కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేని పక్షంలో ప్రాజెక్టుల నిర్మాణాలను ఎలా ముందుకు తీసుకెళ్తారు? అనుమతుల ప్రక్రియకు కార్యాచరణ ప్రణాళిక ఏంటీ అన్న విషయాలపై రుణ సంస్థలు లేఖలు రాసినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులకు ఆర్ఈసీ రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. మరో కార్పొరేషన్కు పీఎఫ్సీ, ఆర్ఈసీలు మరో రూ.2 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో కొంతమేర ఇప్పటికే మంజూరు చేయగా, మరికొంత విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ల నేపథ్యంలో అవి తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాయి. గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన నిర్మించ తలపెట్టిన సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,426.25 కోట్ల రుణం ఇచ్చేందుకు పీఎఫ్సీ ముందుకు వచ్చింది. అయితే అనుమతులు లేవన్న కారణంగా ప్రాజెక్టును నిలిపివేస్తే తమ రుణాలను బేషరతుగా వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ షరతులు విధించింది. -
కుంటాల సందర్శకులకు గుడ్ న్యూస్
సాక్షి, ఆదిలాబాద్: కుంటాల.. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. కుంటాల అందాలను వీక్షించేందుకు వచ్చేవారి అవస్థలను తొలగించడానికి మార్గం సుగమమైంది. పర్యాటకుల వసతి కోసం రిసార్ట్స్, కుటీరాలు నిర్మిస్తున్నారు. ఇందుకుగాను రూ.3.81 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేస్తున్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. గిరిజన సర్క్యూట్ అమలులో భాగంగా కేంద్ర స్వదేశీ దర్శన్ పథకం కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే పనులు నడుస్తున్నాయి. కేంద్ర టూరిజం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్వదేశీ దర్శన్ పథకం కింద పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోంది. ఈ పనులను ఐటీడీఏ అమలు చేస్తుండగా రాష్ట్ర పర్యాటక శాఖ అనుసంధానంగా పనిచేయనుంది. జూలై నుంచి అక్టోబర్ వరకు జలపాతం వద్ద పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది పర్యాటకులు ఈ జలపాతం అందాలను వీక్షించేందుకు వస్తుంటారు. అయితే, ఇక్కడ పర్యాటకులకు సరైన వసతి, ఇతర సౌకర్యాలు లేవు. తాజాగా కుంటాలకు దగ్గరలో గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఎకో ఎథెనిక్ రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఈ జలపాతం వద్ద అటవీ ప్రాంతం ఉంటుంది. దానికి తగ్గట్టు పర్యాటకులు ఉండేలా పర్యావరణానికి అనువుగా కుటీరాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పర్యాటకులు భోజనం చేసేందుకు డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా కుంటాల జలపాతానికి వచ్చే పర్యాటకులు ఇక్కడ విడిది చేయాలన్న ఉద్దేశంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైల్ ఫోటో -
వెంటనే డీపీఆర్లు సమర్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్లు వెంటనే సమర్పించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. నిర్మాణంలోని ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. గతేడాది అక్టోబర్ 6న ఇరు రాష్ట్రాల సీఎంలతో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని షెకావత్ లేఖల్లో పేర్కొన్నారు. తెలంగాణలో కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టేందుకు లేదా కొనసాగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ అనుమతి తప్పనిసరని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. గతేడాది డిసెంబర్ 11న సీఎం కేసీఆర్తో భేటీ అయి న సందర్భంగా డీపీఆర్లు సమర్పించాలని కోరినప్పటికీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఒక్క డీపీఆర్ కూడా సమర్పించలేదని తెలిసిందని లేఖలో షెకావత్ పేర్కొన్నారు. కృష్ణా నదిపై 8, గోదావరిపై 7 ప్రాజెక్టుల డీపీఆర్లు తెలంగాణ ప్రభుత్వం వెంటనే సమర్పించాలని సూచించారు. -
దగదర్తి ఎయిర్పోర్ట్ డీపీఆర్కు టెండర్లు
సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ టెండర్లను పిలిచింది. ప్రయాణికులు, కార్గో ఎయిర్క్రాఫ్ట్లను నిర్వహించే విధంగా డీపీఆర్ తయారు చేయడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్క్యాప్) నోటిఫికేషన్ జారీ చేసింది. నెల్లూరు జిల్లా చుట్టుపక్కల పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుండటంతో కార్గో రవాణాకు ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ఎండీ వి.ఎన్.భరత్రెడ్డి తెలిపారు. ఇప్పటికే చెన్నై ఎయిర్పోర్టులో కార్గో హ్యాండలింగ్ గరిష్ట స్థాయికి చేరడం, కృష్ణపట్నం పోర్టుకు అదనంగా ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు, వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, కృష్ణపట్నం సమీపంలో భారీ పారిశ్రామిక పార్కు వంటివి ఏర్పాటు కానుండటంతో కార్గో రవాణా కేంద్రంగా దగదర్తి ఎయిర్పోర్టును అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికులతో పాటు సరకు రవాణాకు ఉన్న వ్యాపార అవకాశాలను పరిశీలిస్తూ సమగ్ర డీపీఆర్ను తయారు చేయడానికి టెండర్లు పిలిచామని, ఆసక్తి గల సంస్థలు డిసెంబర్ 2లోగా బిడ్లు దాఖలు చేయాలన్నారు. సుమారు 1,350 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని ఏపీఏడీసీఎల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. డీపీఆర్ తయారు కాగానే క్యాబినెట్ ఆమోదానికి పంపి పనులు ప్రారంభించనున్నట్లు భరత్ రెడ్డి తెలిపారు. -
రెండు నెలల్లో బందరు పోర్టుకు టెండర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తొలిదశలో రూ.5,834.51 కోట్లతో బందరు పోర్టు నిర్మాణం చేపట్టనుంది. రైట్స్ సంస్థ తయారు చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఈపీసీ విధానంలో రెండునెలల్లో టెండర్లు పిలవనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ఎన్.రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తొలిదశలో మొత్తం ఆరుబెర్తులు (1 కోల్ బెర్త్, 1 కంటైనర్ బెర్త్, 4 జనరల్ కార్గో బెర్తులు) నిర్మించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం వద్ద సముద్రం లోతు తక్కువగా ఉండటంతో భారీనౌకలు వచ్చేవిధంగా 200 మీటర్ల వెడల్పు, 16.80 మీటర్ల లోతుతో 12.7 కి.మీ. దూరం అప్రోచ్ చానల్ తవ్వనున్నారు. దీంతోపాటు దక్షిణ దిశ వైపు రెండువేల మీటర్లు, ఉత్తరం వైపు 260 మీటర్ల మేర మొత్తం 2.32 కి.మీ. బ్రేక్ వాటర్ పనులు, 44.81 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన టెండర్లు, ఇతర ప్రాజెక్టు నిర్మాణపనుల పర్యవేక్షణకు ప్రాజెక్టు కన్సల్టెంట్గా ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్)ను ఎంపిక చేశారు. 2 నెలల్లో టెండరు డాక్యుమెంట్లు తయారు చేసి, జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం టెండర్లు పిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రామకృష్ణారెడ్డి వివరించారు. 2023–24 నాటికి ఏడాదికి 35.12 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించే విధంగా మౌలిక వసతులు కల్పిస్తారు. ఇందుకు 800 నుంచి వెయ్యి ఎకరాలు అవసరమవుతుంది. మరో 155 ఎకరాలు పోర్డు బేసిన్, డ్రెడ్జింగ్ కోసం వినియోగిస్తారు. మిగిలిన 2వేల ఎకరాలను పోర్టు ఆధారిత పరిశ్రమల అవసరాలకు వినియోగించనున్నారు. -
హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–ముంబై మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ కారిడార్కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి తాజాగా బిడ్లు పిలిచారు. దేశంలో హై స్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ది నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ఈ బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నవంబర్ 5న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నవంబర్ 11 నుంచి టెండర్ పత్రాల దాఖలు మొదలుకానుంది. నవంబర్ 17తో టెండర్ల దాఖలు గడువు ముగుస్తుంది. 18న డీపీఆర్ తయారీ సంస్థను ఎంపిక చేస్తారు. ప్రధాని మోదీ కృతనిశ్చయంతో ముందుకు.. హైదరాబాద్ నుంచి ముంబైకి పుణే మీదుగా 711 కి.మీ. నిడివితో బుల్లెట్ రైల్ కారిడార్ను నిర్మించేందుకు రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. దేశంలో హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే తొలి బుల్లెట్ రైల్ కారిడార్ ముంబై– అహ్మదాబాద్ మధ్య సిద్ధమవుతోంది. 459 కి.మీ. నిడివి ఉన్న ఢిల్లీ–అమృత్సర్–చండీగఢ్, 865 కి.మీ. పొడవైన ఢిల్లీ–వారణాసి, 753 కి. మీ. దూరం ఉండే ముంబై– నాగ్పూర్, 886 కి.మీ. తో రూపొందే ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గాలను హై స్పీడ్ కారిడార్లుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయిం చింది. వీటి డీపీఆర్ల ప్రక్రియ ప్రారంభం కావటం విశేషం. చెన్నై– మైసూరు, వారణాసి–హౌరా ప్రాజెక్టులు కూడా ఉన్నా, వాటి డీపీఆర్ ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. ఈ ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టు పనులు ప్రారంభించే దిశగా కేంద్రం ఏర్పా ట్లు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్– నాగ్పూర్, హైదరాబాద్–చెన్నై సెమీ హైస్పీడ్ కారిడార్లకు సం బంధించిన ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. ఇందు లో రష్యా కంపెనీకి చెందిన ఇంజనీర్లు హైదరాబాద్–నాగ్పూర్ కారిడార్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించారు. అది సాధ్యమే నని అందులో స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తవుతాయని భావిస్తున్నారు. -
రాష్ట్రంలో ఏడు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం (నెడ్క్యాప్) రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. వీటి సామర్థ్యం 6,300 మెగావాట్లు. వీటి ఏర్పాటుకు సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు నెడ్క్యాప్ టెండర్లు పిలిచింది. ఏడు కంపెనీలు సాంకేతిక బిడ్కు అర్హత సాధించాయి. త్వరలో ఆర్థిక బిడ్ తెరిచి టెండర్లు ఖరారు చేస్తామని, డీపీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణ పనులు చేపడతామని నెడ్క్యాప్ ఎండీ రమణారెడ్డి గురువారం తెలిపారు. కోతలకు అవకాశం లేకుండా.. పీక్ డిమాండ్ (ఎక్కువ వినియోగం ఉండే సమయం)లో విద్యుత్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమయంలో విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంటే కోతలకు ఆస్కారం ఉండదు. సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి సమయంలో వినియోగం తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఇలా.. నీటి రిజర్వాయర్ల దగ్గర ఎత్తయిన ప్రదేశంలో ప్రత్యేకంగా నీటి నిల్వ కోసం ఓ రిజర్వాయర్ను నిర్మిస్తారు. కిందకు వెళ్లిన నీటిని పంపుల ద్వారా ఎగువ ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్లోకి పంపుతారు. నాన్ పీక్ అవర్స్ (డిమాండ్ లేని సమయం)లో సౌర, పవన విద్యుత్తో దిగువన ఉన్న నీటిని ఎగువన ఉన్న రిజర్వాయర్కు తరలిస్తారు. దీనివల్ల అవసరమైనప్పుడు జల విద్యుత్కు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో డిమాండ్ ఉండే సమయంలో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ను కొనే ఇబ్బంది తప్పుతుంది. సౌర, పవన విద్యుత్లనూ మనమే ఉపయోగించుకోవచ్చు. ఈ కేంద్రాల కాలపరిమితి దాదాపు 80 ఏళ్లు. నిర్మాణ వ్యయం తొలి 25 ఏళ్లలోనే తీరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత చౌకగా జలవిద్యుత్ అందుతుంది. రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 32 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నాయని గుర్తించారు. -
డీపీఆర్లపై కదలిక..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. డీపీఆర్ల సమర్పణకు సంబంధించి ఇరిగేషన్ శాఖ వాటిని సిద్ధం చేసే పనిలో పడింది. ఈ విషయమై ఇప్పటికే శాఖ ఈఎన్సీ సంబంధిత సీఈలకు లేఖలు రాసినట్లుగా తెలిసింది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల డీపీఆర్ల అప్డేట్ వివరాలతో తమకు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్లుగా ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. డీపీఆర్ల విషయమై అపెక్స్ కౌన్సిల్ నుంచి అధికారికంగా మినిట్స్ అందాక వీటిని సమర్పించే విషయమై తుది నిర్ణయం చేయనుంది. కృష్ణా ప్రవాహ వివరాలపై ఏపీకి లేఖ.. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల్లోకి గత 20 ఏళ్లుగా వచ్చిన ప్రవాహాలు, వినియోగం, దిగువకు విడుదల చేసిన వరద వివరాలు ఇస్తే మిగులు జలాల లెక్క తేల్చుతామని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు కార్యదర్శి హరికేష్ మీనా లేఖ రాశారు. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తేసి.. వరద జలాలు సముద్రంలోకి కలుస్తున్న సమయంలో దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తప్పించడానికి పులిచింతలకు ఎగువన రెండు రాష్ట్రాల్లో ఎవరు మళ్లించినా వాటిని ఆ రాష్ట్ర కోటాగా లెక్కించకూడదంటూ జనవరి 1న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ నిర్వహించిన సమావేశంలో ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. దాంతో ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలసంఘం ఐఎంవో విభాగం సీఈ నేతృత్వంలో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇరు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో 1999–2000 నుంచి 2019–20 దాకా ప్రాజెక్టులోకి వచ్చిన ప్రవాహాల వివరాలు ఇస్తే సమగ్రంగా అధ్యయనం చేసి, రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న మిగులు జలాలను లెక్కలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై నివేదిక ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది. -
2024 నాటికల్లా విశాఖ మెట్రో..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర వీధుల్లో మెట్రో రైలు పరుగు తీసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే లైట్మెట్రో, ట్రామ్ కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసే బాధ్యతల్లో యూఎంటీసీ సంస్థ తలమునకలు కాగా.. ప్రాజెక్టు అంచనాల వ్యయం తయారు చేయడంలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ బిజీగా ఉంది. లైట్ మెట్రో రైలు కారిడార్ నిర్మాణానికి ఒక కిలోమీటరుకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా.. ట్రామ్ కారిడార్కు రూ.100 నుంచి రూ.120 కోట్లుగా భావిస్తున్నారు. లైట్ మెట్రోకు సంబంధించిన డీపీఆర్ని నవంబర్ నెలాఖరుకు, ట్రామ్ కారిడార్కు సంబంధించిన డీపీఆర్ని డిసెంబర్ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదించేందుకు యూఎంటీసీ అంగీకరించింది. నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్ ఉంటోంది.. మెట్రో కారిడార్ రూట్మ్యాప్లలో జరుగుతున్న అభివృద్ధి 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్ మొదలైన అంచనాలతో డీపీఆర్ తయారవుతోంది. కీలక నిర్ణయాలు పూర్తవడంతో.. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి. లైట్ మెట్రోరైలు, మోడ్రన్ ట్రామ్ కారిడార్లకు సంబంధించిన సవివర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ చేతిలో సిద్ధమవుతోంది. లైట్ మెట్రో రైలు ప్రాజెక్ట్కు సంబంధించి గతంలో రూపొందించిన 42.55 కిలోమీటర్ల డీపీఆర్ను అప్డేట్ చేస్తూ.. 79.91 కి.మీకు సంబంధించిన డీపీఆర్ను రూ.5.34 కోట్లకు, 60.20 కి.మీ పొడవున్న ట్రామ్ కారిడార్కు సంబంధించిన డీపీఆర్ను రూ.3.38కోట్లకు అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ లిమిటెడ్ (యూఎంటీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రెండు ప్రాజెక్ట్లకు సంబంధించిన డీపీఆర్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. నవంబర్లో లైట్ మెట్రో.. డిసెంబర్లో ట్రామ్ ఏప్రిల్, మేలో రెండు డీపీఆర్లకు చెందిన బాధ్యతలను అప్పగించి.. ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే.. కోవిడ్–19 కారణంగా లాక్డౌన్ విధించడంతో డీపీఆర్ పనులను యూఎంటీసీ ప్రారంభించడంలో ఆలస్యమైంది. దీంతో ప్రభుత్వం అదనపు సమయం కేటాయించింది. లైట్మెట్రోకు సంబంధించిన డీపీఆర్ను నవంబర్ నెలాఖరుకు, ట్రామ్ కారిడార్కు సంబంధించిన డీపీఆర్ను డిసెంబర్ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదించేందుకు యూఎంటీసీ అంగీకరించింది. ఈ మేరకు నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్ ఉంటోంది.. మెట్రో కారిడార్ రూట్మ్యాప్లలో జరుగుతున్న అభివృద్ధి, 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్ మొదలైన అంచనాలతో డీపీఆర్ తయారవుతోంది. లైట్ మెట్రో ప్రాజెక్ట్ 79.91 కి.మీ మేర రూపుదిద్దుకుంటోంది. వివిధ దేశాల్లో చేపట్టిన ప్రాజెక్ట్లను అధ్యయనం చేసిన అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్సీ) ప్రాజెక్ట్ వ్యయంపై ప్రాథమిక అంచనాలను రూపొందించింది. ఒక కిలోమీటర్ మేర లైట్ మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అదే విధంగా లైట్ మెట్రోతో పోలిస్తే ట్రామ్ కారిడార్ నిర్మాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా గుర్తించారు. ఒక కి.మీ ట్రామ్ కారిడార్ నిర్మించేందుకు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని భావిస్తున్నారు. మొత్తం 79.91 కి.మీ మేర లైట్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.16,000 కోట్లు, 60.20 కి.మీ మేర ట్రామ్ కారిడార్ నిర్మాణానికి రూ.7,320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే ట్రామ్కు సంబంధించి బ్రెజిల్, స్పెయిన్, దుబాయ్, ఫ్రాన్స్ దేశాల ప్రాజెక్ట్ల వివరాలు సేకరిస్తున్నారు. డీపీఆర్ సిద్ధమైతే ఈ అంచనా వ్యయాల్లో స్వల్ప మార్పులుండనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇవీ అంచనాలు లైట్ మెట్రో డీపీఆర్ పూర్తయ్యే సమయం– 2020 నవంబర్ కిలోమీటర్ నిర్మాణానికి లైట్ మెట్రోకు అయ్యే ఖర్చు– సుమారు రూ.200 కోట్లు ట్రామ్ కారిడార్ డీపీఆర్ పూర్తయ్యే సమయం– 2020 డిసెంబర్ కిలోమీటర్ నిర్మాణానికి ట్రామ్ కారిడార్కు అయ్యే ఖర్చు– సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు అగ్రిమెంట్ పూర్తి చేసుకునే సమయం–మార్చి 2021 లైట్ మెట్రో కారిడార్ పనులు ప్రారంభించే సమయం– జూన్ 2021 విశాఖ వీధుల్లో మొదటి మెట్రో సర్వీసు ప్రారంభమయ్యే సమయం– మార్చి 2024 2024 నాటికల్లా పట్టాలెక్కేలా.. ఈ ఏడాది చివరి నాటికల్లా లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్ కారిడార్లకు డీపీఆర్లు పూర్తి కానున్నాయి. వాటిని ప్రభుత్వం అధ్యయనం చేసిన వెంటనే బిడ్డింగ్కు వెళ్లేందుకు సిద్ధమవుతాం. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మార్చి 2021 నాటికి పనులకు సంబంధించి అగ్రిమెంట్ పూర్తి చేస్తాం. జూన్ 2021 నాటికి లైట్ మెట్రో కారిడార్ పనులు ప్రారంభిస్తాం. మార్చి 2024 నాటికి లైట్ మెట్రోలో ఒక కారిడార్ నుంచి ప్రయాణాలు ప్రారంభించేలా.. మెట్రోరైలు ప్రాజెక్ట్ను శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – రామకృష్ణారెడ్డి, ఎండీ, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ -
నెలలోగా అపెక్స్ కౌన్సిల్.. ఎజెండా పంపండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరిలపై రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు.. జలాల వినియోగంలో వివాదాలను పరిష్కరించేందుకు జూలైలో అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తామని కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ చెప్పారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లు రెండు రాష్ట్రాలు ఇప్పటికీ ఇవ్వకపోతే మీరేం చేస్తున్నారంటూ కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీఆర్లు ఇవ్వాలని మరోసారి 2 రాష్ట్రాలకు లేఖలు రాయాలని.. ఆ లేఖలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా పంపాలని కోరాలని బోర్డుల చైర్మన్లను ఆదేశించారు. ‘అప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించకపోతే.. మీరే అపెక్స్ కౌన్సిల్కు ఎజెండా సిద్ధం చేసి పంపండి’అని బోర్డు చైర్మన్లకు దిశానిర్దేశం చేశారు. ఆ అంశాల ఆధారంగా ఎజెండా.. కృష్ణా, గోదావరి నదులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లు, నీటి వివాదాలపై బోర్డు చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్లతో గురువారం ఢిల్లీ నుంచి కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014 జూన్ 2 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు, కేంద్ర జలసంఘం నుంచి సాంకేతిక అనుమతి తీసుకోకుండా చేపట్టిన ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలని స్పష్టం చేశారు. ఇదే ప్రాతిపదికగా కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లను రెండు రాష్ట్రాల నుంచి తీసుకుని.. వాటిని పరిశీలించి సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్కు పంపడంలో జాప్యం చేస్తున్నారంటూ బోర్డు చైర్మన్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశాల్లో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లను ఈనెల 10లోగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఆదేశించామని.. కానీ ఇప్పటికీ డీపీఆర్లు ఇవ్వలేదని యూపీ సింగ్కు బోర్డుల చైర్మన్లు వివరించారు. దీనిపై యూపీ సింగ్ స్పందిస్తూ.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాల ని మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని ఆదేశించారు. అప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించకపోతే.. ఈ అంశాన్ని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్కు ఎజెండా పంపకపోతే.. బోర్డు సమావేశాల్లో చర్చించిన అంశాలు, వివాదంగా మారిన ప్రాజెక్టుల ఆధారంగా ఎజెండాను సిద్ధం చేయాలని.. దాన్నే ప్రాతిపదికగా తీసుకుని అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తామని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్కు ఎజెండా పంపితే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి.. వారి వీలును బట్టి వచ్చే నెలలో ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. -
డీపీఆర్లు ఇవ్వాల్సిందే
కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టుల డీపీఆర్లు అడిగాం. అనుమతులు లేని ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని చెప్పాం. ప్రభుత్వాల అనుమతితో డీపీఆర్లు ఇస్తామని ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు చెప్పారు. బోర్డు విజయవాడకు తరలింపుపై కేంద్ర జల శక్తి శాఖ ఆదేశాల కోసం చూస్తున్నాం. అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఎజెండా అడిగాం. రాష్ట్రాలు పంపే ఎజెండా కోసం ఎదురుచూస్తున్నాం. – పరమేశం, బోర్డు చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్ పరిధిలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతి కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కృష్ణాబోర్డు, కేంద్ర జల సంఘానికి ఇవ్వాల్సిం దేనని తెలుగు రాష్ట్రాలను బోర్డు ఆదేశించింది. అలాగే అపెక్స్ కౌన్సిల్ అనుమతి కోసం పంపాలని సూచించింది. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేని ప్రాజెక్టులపై ముందు కెళ్లొద్దని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకొని డీపీఆర్లను అందిస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు. అయితే ఎప్పటిలోగా డీపీఆర్లు ఇవ్వాలన్న దానిపై మాత్రం నిర్ణీత సమయాన్ని ప్రకటించలేదు. కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో ప్రాజెక్టుల కింద ఈ ఏడాది కూడా గతేడాదిలాగే 34:66 నిష్పత్తిన నీటిని పంచుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించాయి. మైనర్ ఇరిగేషన్ కింద జరుగుతున్న నీటి వినియోగం, మళ్లింపు జలాల అంశంపై తేల్చేవరకు పాత వాటాల ప్రకారమే నీటిని పంచుకోవాలన్న బోర్డు సూచనకు ఇరు రాష్ట్రాలు సమ్మతిం చాయి. కృష్ణా నది బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, ఈ ఏడాదిలో నీటి పంపిణీ, డీపీఆర్లు, మళ్లింపు జలాల్లో వాటా, టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు కృష్ణాబోర్డు గురు వారం జలసౌధలో భేటీ అయింది. బోర్డు చైర్మన్ పరమేశం అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కార్య దర్శులు రజత్కుమార్, ఆదిత్యనాధ్ దాస్లతో పాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, తెలంగాణ ఇంజనీర్లు నరసింహారావు, నర్సింహా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు అజెండా అంశాలతో పాటు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై 6 గంటల పాటు చర్చించారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు, నీటి వాటాల అంశంపై వాడీవేడీగా వాదనలు జరిగాయి. అప్పటిదాకా చెరిసగం.. ఇరు రాష్ట్రాలు తమ ప్రాజెక్టుల డీపీఆర్లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడిన అనంతరం డీపీఆర్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు భేటీ అనంతరం కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం వెల్లడించారు. మైనర్ ఇరిగేషన్ కింద నీటి వినియోగం, మళ్లింపు జలాలపై తుది నిర్ణయం చేసే వరకు గతేడాదిలో ఉన్న మేర ఇరు రాష్ట్రాలు 34ః 66 నిష్పత్తిన నీటిని వాడుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించినట్లు తెలిపారు. టెలీమెట్రీ రెండో విడత ఏర్పాటుకు సంబంధించి నిధులు విడుదల చేసేందుకు కూడా ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇక, శ్రీశైలం, నాగార్జునసాగర్ల కింద విద్యుదుత్పత్తిని 50ః 50 నిష్పత్తిన చేసుకునేందుకు ఓకే చెప్పాయి. వరద జలాల వినియోగం సైతం ఏ విధమైన పంపిణీ ఉండాలన్న దానిపై సీడబ్ల్యూసీ సీఈ నేతత్వంలోని కమిటీ తేల్చే వరకు ఇరు రాష్ట్రాలు 50ః 50 నిష్పత్తిన పంచుకునేందుకు అంగీకారం తెలిపాయి. గృహావసరాలకు వినియోగించే నీటిలో 20 శాతాన్ని మాత్రమే వినియోగం కింద చూపాలన్న అంశంపై సీడబ్ల్యూసీ తేలుస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ ఏడాది వినియోగించుకోలేని నీటిని తర్వాతి ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలన్న తెలంగాణ వినతిపై ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపాక నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. ఇక, గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు నీటి మళ్లింపుతో దక్కే నీటి వాటాల పంపిణీ అంశంపై కేంద్ర జల శక్తి పరిశీలనకు పంపినట్లు బోర్డు స్పష్టం చేసింది. ఇక బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించే అంశం జలశక్తి సూచన మేరకు ఉంటుందని తెలిపింది. జలసౌధలో గురువారం జరిగిన కృష్ణా బోర్డు సమావేశం అనంతరం బయటకు వస్తున్న రజత్కుమార్ తెలంగాణ వాదనలు ఇలా.. ► పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తిగా పాతవే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయాలని 2013 ఆగస్టులోనే అప్పటి ప్రభుత్వం జీవో–72 ఇచ్చింది. 2014 ఏప్రిల్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బోర్డు సమావేశంలో మోదీ మాట్లాడిన వీడియోను రజత్కుమార్ ప్రదర్శించారు. ► డిండి ప్రాజెక్టును 2007 జూలైలోనే జీవో–159 ఇచ్చారు. ఇది ముమ్మాటికీ పాత ప్రాజెక్టు. ► తెలంగాణ ఏర్పాటు అనంతరం వీటిని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకున్నాం. రీ–ఇంజనీరింగ్ చేశాం.. తప్పితే కొత్తగా చేపట్టినవి కావు. ► 2016 సెప్టెంబర్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఈ ప్రాజెక్టులు పాతవేనని స్పష్టం చేశాం. అనంతరం పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులు ఇచ్చింది. డిండి ప్రాజెక్టుకు సైతం వివిధ కేంద్ర అనుమతులు పొందేందుకు టీవోఆర్ ఇచ్చింది. ► ఏపీ జీవో 203లో పేర్కొన్న శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని తీసుకుంటూ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డి పాడు కాల్వల సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపు ప్రతిపాదనలు పూర్తిగా కొత్తవి. వీటికి అటు బోర్డు కాని, ఇటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి కానీ లేదు. కావున ఇవి పూర్తిగా కొత్తవే. వీటిని అపెక్స్ ముందు పెట్టాలి. అప్పటివరకు వీటిని ఆపాలి. ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 101 టీఎంసీల మేర మాత్రమే నీటిని తీసుకునే వెసులుబాటు ఉన్నా గడిచిన రెండేళ్లుగా ఏపీ వినియోగం వరుసగా 115 టీఎంసీ, 175 టీఎంసీలుగా ఉంది. ► శ్రీశైలం ఆధారంగా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ 60 వరద దినాలను పరిగణనలోకి తీసుకుంది. కానీ ఏపీ మాత్రం ప్రస్తుతం 30 వరద దినాలనే పరిగణనలోకి తీసుకొని నీటిని తరలించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇది అసంబద్ధం. ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా తాగునీటికి తమకు 3.5 టీఎంసీలు సరిపోతాయని బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు వేసిన అఫిడవిట్లో తెలంగాణ పేర్కొంది కావున ఇప్పుడు దాని సామర్థ్యాన్ని ఇంతలా పెంచాల్సిన అవసరం లేదు. ► పోతిరెపడ్డిపాడు ద్వారా శ్రీశైలంలో 880 అడుగులున్నప్పుడు మాత్రమే 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లే వీలుంది. తగ్గిన పక్షంలో అంత నీటిని తీసుకెళ్లలేమనే ఏపీ వాదన తప్పు. 870 అడుగుల మట్టంలోనే 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లొచ్చు. 865 మట్టంలో 33 వేలు, 859 అడుగుల మట్టంలో 20 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవచ్చు. ► శ్రీశైలం వరద జలాలపై ఆధారపడి కల్వకుర్తి (40 టీఎంసీ), ఎస్ల్బీసీ(30), పాలమూరు–రంగారెడ్డి (90), డిండి (30 టీఎంసీ)ల ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తోంది. ఇవన్నీ ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల అవసరాలు తీర్చేవే. కనీసంగా 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేవి. శ్రీశైలం నీళ్లు ఏపీ తరలించుకుపోతే ఈ ప్రాంతమంతా ఎడారిగా మారుతుంది. ► శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు నీరు రావాలంటేనే సెప్టెంబర్ పడుతుంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నీటిని ఎప్పటికప్పుడు తీసుకుంటే అక్టోబర్, నవంబర్ వరకు నీరు రావడం గగనమే. అదే జరిగితే సాగర్ కింది ఆయకట్టు 6.4 లక్షల ఎకరాలతో పాటు ఏఎంఆర్పీ తాగు, సాగు నీటి అవసరాలకు పూర్తిగా విఘాతమే. ► 1978 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు చేపట్టిన వెంటనే నాగార్జునసాగర్కు ఎగువన ఉన్న రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఆ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాలి. పోలవరం కాకుండా వేరే ఇతర ప్రాజెక్టులు చేపట్టినా అంతే నీటి వాటా దక్కుతుంది. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా నీటి మళ్లింపు జరుగుతున్నందున కనీసంగా 45 టీఎంసీల వాటా తెలంగాణకు ఇవ్వాలి. ఈ ఏడాదే 299 టీఎంసీల వాటాకు కలపాలి. ► ఈ ఏడాదిలో సాగర్ కింద కేటాయింపులు ఉండి, వినియోగించుకోలేకపోయిన నీళ్లు 50 టీఎంసీల వరకు ఉన్నాయి. వాటిని ఈ ఏడాది వాటర్ ఇయర్లో తెలంగాణకు క్యారీ ఓవర్ చేయాలి. ► వరద భారీగా ఉన్న రోజుల్లో చేసే వినియోగాన్ని రాష్ట్రాల వినియోగం కింద చూడరాదన్న ఏపీ వాదన తప్పు. వరద ఉండే రోజుల్లో ఏపీ రోజుకు 48 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించి 300 టీఎంసీల మేర నీటిని నింపుకునేలా రిజర్వాయర్లు ఉన్నాయి. కానీ తెలంగాణకు రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని మాత్రమే మళ్లించే సామర్థ్యం ఉంది. కావున వరద జలాలను వినియోగ లెక్కల్లో చూపాల్సిందే. బోర్డు సమావేశం అనంతరం బయటకు వస్తున్న ఆదిత్యనాథ్ దాస్, మురళీధర్ తదితరులు ఏపీ వాదనలు ఇవి.. ► పాలమూరు ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో వాటినే చేపట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలు తేల్చేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. జూరాల ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి నీటిని తరలించేలా సాధ్యాసాధ్యాల నివేదికకు అనుమతిస్తే, తెలంగాణ దాన్ని శ్రీశైలం నుంచి 90 టీఎంసీలు తరలించేలా చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలపై నివేదికలు రాలేదు. రాష్ట్ర విభజన తర్వాతే తెలంగాణ దాన్ని చేపట్టింది. కావున అది ముమ్మాటికీ కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలి. ► డిండి ప్రాజెక్టుకు సర్వేకు మాత్రమే అనుమతిచ్చారు. తప్పితే అది చేపట్టేందుకు కాదు. దీన్ని తెలంగాణ కొత్తగా చేపడుతోంది. ఇక తుమ్మిళ్ల ఎత్తిపోతలకు ఎలాంటి అనుమతులు లేవు. భక్త రామదాస సైతం కొత్తదే. మా రాష్ట్ర ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టులు విఘాతం. ► కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల సామర్థ్యాలను సైతం పెంచారు. ఈ అన్ని ప్రాజెక్టులకు బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. వీటన్నింటినీ కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలి. ► అనుమతి లేని ప్రాజెక్టులు, నిర్మాణంలోని ప్రాజెక్టు సామర్థ్యం పెంపుతో తెలంగాణ అదనంగా 178 టీఎంసీల మిగులు జలాలు తరలిస్తోంది. వీటి ప్రభావం రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఉంటుంది. ► బేసిన్లోని శ్రీశైలం, సాగర్లను కచ్చితంగా బోర్డు నియంత్రణలోకి తేవాలి. నీటి విడుదల అజమాయిషీ బోర్డు చేతుల్లో ఉంటేనే సజావుగా ఉంటుంది. వివాదాలకు ఆస్కారం ఉండదు. ► రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు బోర్డును విజయవాడకు తరలించాలి. ► పట్టిసీమ ద్వారా మళ్లించే జలాలపై కేంద్ర జల శక్తి శాఖ మాత్రమే నిర్ణయం చేయాలి. తెలంగాణ సైతం గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలిస్తున్నారు. దీనిపైనా తేల్చాల్సి ఉంది. ► శ్రీశైలంలో 800 అడుగుల్లో నుంచి నీటిని తీసుకొని రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను చేపట్టాం. రాష్ట్రానికి ఉన్న 511 టీఎంసీల వాటాల్లోంచే నీటిని వినియోగించుకుంటాం. -
డీపీఆర్ పట్టాలపై విశాఖ మెట్రో
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు అవరోధాల్ని అధిగవిుస్తూ ముందుకు సాగుతోంది. ప్రాజెక్టులో మార్పులకు అనుగుణంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేసేందుకు సర్వం సిద్ధమైంది. మెట్రో ప్రాజెక్టుకి కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్సీ) డీపీఆర్ తయారు చేసేందుకు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. డీపీఆర్ తయారీ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ), రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్(రైట్స్), అర్బన్ మాస్ ట్రాని్సస్ట్ కంపెనీ లిమిటెడ్(యూఎంటీసీ) సంస్థలకు మాత్రమే అనుమతినివ్వడంతో సంబంధిత సంస్థలు తమ టెండర్లను ఏఎంఆర్సీకి అందించాయి. గతంలో రూపొందించిన 42.55 కి.మీ డీపీఆర్ను అప్డేట్ చేస్తూ 79.91 కి.మీ మేర లైట్ మెట్రో కారిడార్కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) బాధ్యతల్ని రూ.5,33,50,600లకు టెండర్ వేసిన అర్బన్ మాస్ ట్రాని్సస్ట్ కంపెనీ లిమిటెడ్(యూఎంటీసీ)కు మార్చి 20వ తేదీన అప్పగించారు. గతంలో రూపొందించిన 46.40 కిలోమీటర్ల మెట్రో డీపీఆర్ని అప్డేట్ చేస్తూ మొత్తం పొడిగించిన మేర రిపోర్టు తయారు చెయ్యాలని ఏఏంఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. పీపీపీ పద్ధతిలో రూపొందించనున్న ఈ ప్రాజెక్టు డీపీఆర్ని ఆరు నెలల్లో పూర్తి చెయ్యాలని సదరు సంస్థకు సూచించింది. అదే విధంగా మార్చి 27న మోడ్రన్ ట్రామ్ కారిడార్ డీపీఆర్ తయారీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనేది తేలాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా వేశారు. ఇటీవల ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో టెండర్లను ఓపెన్ చేసిన ఏఎంఆర్సీ.. అత్యంత తక్కువ రూ.3,37,67,200 కోడ్ చేసిన అర్బన్ మాస్ ట్రాని్సట్ కంపెనీ లిమిటెడ్ (యూఎంటీసీ)కు అప్పగించారు. ఆరు నెలల్లో పూర్తి చేసేలా.... లైట్మెట్రో, మోడ్రన్ ట్రామ్ కారిడార్కు సంబంధించి రెండు డీపీఆర్లు తయారు చేసే బాధ్యతలను యూఎంటీసీ దక్కించుకుంది. ఇప్పటికే 20 శాతం వరకూ లైట్ మెట్రో డీపీఆర్ని పూర్తి చేసింది. వచ్చే వారంలో ట్రామ్ కారిడార్కు సంబంధించిన డీపీఆర్ అగ్రిమెంట్పై ప్రభుత్వం సమక్షంలో యూఎంటీసీ, ఏఎంఆర్సీ సంతకాలు చెయ్యనున్నాయి. అనంతరం సవివర ప్రాజెక్టు తయారీ పనులు చేపట్టనుంది. మొత్తంగా రెండు డీపీఆర్లూ ఆరు నెలల్లో పూర్తి చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 8న బోర్డు సమావేశం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్గా మారుస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 8న విజయవాడలో బోర్డు మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత 9వ తేదీన రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్కి పేరు మార్పు అంశాన్ని పంపించనున్నారు. అక్కడ అప్రూవ్ పొందితే..10వ తేదీ తర్వాత అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్సీ) ఇకపై ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్(ఏపీఎంఆర్సీ)గా పూర్తిగా మార్పు చెందుతుందని అధికారులు తెలిపారు. డీపీఆర్లు పూర్తయిన వెంటనే బిడ్డింగ్కు.. ఆరు నెలల్లో లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్ కారిడార్లకు డీపీఆర్ తయారు చేయాలని గడువు నిర్దేశించాం. లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ 5 నెలల్లో సిద్ధం కానుంది. ట్రామ్ 6 నెలల్లో పూర్తవుతుంది. రెండు డీపీఆర్లు పూర్తయిన వెంటనే వాటిని పరిశీలించి.. బిడ్డింగ్కు వెళ్లేందుకు సిద్ధమవుతాం. మెట్రోరైలు ప్రాజెక్టుని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. – రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ -
విశాఖ మెట్రో ట్రామ్ కారిడార్కు మరో అడుగు
-
విశాఖ: ట్రామ్ కారిడార్ డీపీఆర్కు ఆదేశాలు
సాక్షి, విజయవాడ: విశాఖ మెట్రోలో భాగంగా ట్రామ్ కారిడార్ నిర్మాణానికి మరో అడుగు పడింది. ట్రామ్ కారిడార్ తయారీని అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ (యూఎంటీసీ) దక్కించుకుంది. విశాఖ మెట్రో రీజియన్ పరిధిలోని 60.20 కిలోమీటర్ల ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేయాలని ప్రభుత్వం యూఎంటీసీఎల్కు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, దేశంలోని మిగతా మెట్రో సర్వీసుల మాదిరిగా కాకుండా.. విశాఖ మెట్రోకు అంతర్జాతీయ లుక్ రావాలన్న కాంక్షతో.. ట్రామ్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెట్రో రైలు.. రద్దీ తక్కువగా ఉండే పెందుర్తి, బీచ్రోడ్డు వంటి ప్రాంతాల్లో ట్రామ్ కార్లు ఏర్పాటు చేయనున్నారు. ట్రామ్ కార్ అంటే..? విద్యుదయస్కాంత శక్తితో నడిచే ట్రాక్లెస్ రైలు వ్యవస్థనే ట్రామ్ కార్ అని పిలుస్తారు. ప్రత్యేకంగా రైలు ట్రాక్ మార్గం అనేది లేకుండానే రోడ్లపైనే ప్రయాణించడం ట్రామ్కార్ ప్రత్యేకత. ఒక లగ్జరీ బస్ మాదిరిగానే ఈ ట్రామ్కార్ ఉంటుంది. 300 నుంచి 500 వరకూ ప్రయాణించవచ్చు. ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరానికి తగ్గట్టుగా దారిలో ఉన్న స్టేషన్లో అదనపు బోగీ అనుసంధానం చేసేలా వ్యవస్థ ఉండటం దీని ప్రత్యేకత. అందుబాటులో ఉన్న రోడ్లపై సెన్సార్ సిగ్నల్ విధానంతో వర్చువల్ ట్రాక్ ఆధారంగా ట్రామ్ నడుస్తుంది. బీచ్ రోడ్డుపై ట్రామ్కార్లో ప్రయాణిస్తుంటే విదేశాల్లో విహరిస్తున్న మధురానుభూతికి ప్రయాణికులు లోనవుతారు. (చదవండి: విశాఖపై అభివృద్ధి సంతకం) -
సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదులపై ఆయా నదీ యాజమాన్య బోర్డుల టెక్నికల్ అనుమతి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్ (డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)లు సమర్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఆదేశించాయి. పూర్తి అనుమతులు వచ్చే వరకు ఆయా ప్రాజెక్టుల పనులు చేయొద్దని స్పష్టం చేశాయి. కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, గోదావరి బోర్డు సభ్యుడు పీఎస్ కుటియాల్ తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలను అతిక్రమించి రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లు వెంటనే బోర్డులకు సమర్పించాలని ఆదేశించారు. ఎంపీ సంజయ్ లేఖకు స్పందన ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకా వత్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రమంత్రి ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులపై వెంట నే సమావేశం నిర్వహించాలని కృష్ణాబోర్డును ఆదేశించారు. ఆ ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాలని ఏపీని ఆదేశించాలని సూచించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించా రు. కేంద్రమంత్రి ఆదేశాలతో జలవనరుల శాఖ కృష్ణాబోర్డు అధికారులకు లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, బోర్డు అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముం దుకు వెళ్లకుండా నిలువరించాలని ఆదేశించింది. జూన్ 4న నిర్వహించే కృష్ణా బోర్డు సమావేశంలో ఆయా ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించేలా ఏపీ అధికారులను పట్టుబట్టా లని సూచించారు. గోదావరి బోర్డుకు ఏపీ ఫిర్యాదు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, దేవాదుల ఫేజ్–3, మిషన్ భగీరథ, చనకా – కొరటా సహా పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్లు బోర్డుకు సమర్పించాలని, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేస్తున్న ఈ ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలని బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. చదవండి: గొర్రెల పెంపకంలో మనదే అగ్రస్థానం -
40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సర్కారు నిర్ణయించింది. ప్రాజెక్టులు పూర్తవుతుండటం, సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం గోదాముల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ 40 లక్షల మెట్రిక్ సామర్థ్యం కలిగిన గోదాములను అన్ని జిల్లాల్లో నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసింది. త్వరలో డీపీఆర్ను ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం ఉంది. దానిపై తుది నిర్ణయం తీసుకున్నాక నిర్మాణానికి అవసరమైన రుణం తీసుకుంటారు. ఈ గోదాముల నిర్మాణానికి సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత సామర్థ్యం 24.75 లక్షల మెట్రిక్ టన్నులు... పంటలకు గిట్టుబాటు ధర వచ్చేదాకా రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములుంటే, ఆ తర్వాత వాటి సామర్థ్యాన్ని 24.75 లక్షల మెట్రిక్ టన్నులకు విస్తరించింది. ప్రస్తుతం 1,250 గోదాములు ఉన్నాయి. అయితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతుండటం, ప్రధానంగా కాళేశ్వరం జలాలు పంట పొలాలకు చేరుతుండటంతో రాష్ట్రంలో వరిసాగు విపరీతంగా పెరుగుతోంది. ఇతర పంటలూ గణనీయంగా సాగవుతున్నాయి. మంచి వర్షాలు కురవడంతో గత ఖరీఫ్లో సాధారణానికి మించి సాగైంది. మున్ముందు పంటల దిగుబడి మరింత పెరగనుంది. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం, నిల్వ చేయడం, వాటిని అమ్మడం క్లిష్టంగా మారింది. అంతా సజావుగా సాగాలంటే గోదాముల్లో నిల్వ సామర్థ్యం పెరగాల్సిందేనని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. సామర్థ్యం సరిపోక పోవడంతో... ప్రస్తుతం ప్రభుత్వం గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. అయితే అంత మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న కాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని సర్కారు భావించింది. అందుకే గోదాముల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. సాగు పెరిగితే ఎరువులు, విత్తనాలు కూడా పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. వీటి నిల్వకు కూడా గోదాముల కొరత వేధిస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లో తగినంత గోదాముల సామర్థ్యం లేదు. దీంతో విత్తనాలు, ఎరువులు కూడా నిల్వ చేసుకునేలా గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ప్రైవేటు గోదాముల్లో నిల్వచేసి, అవి నిండిన తరువాతే ప్రభుత్వ గోదాములను నింపేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ గోదాములు నిండిన తర్వాతనే ధాన్యాన్ని ప్రైవేటు గోదాముల్లో నింపుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ గోదాములు నూటికి నూరు శాతం నిండిపోతున్నాయి. -
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్
-
విశాఖ మెట్రో : ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొటేషన్లు పిలించేందుకు అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్లను రూపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టబోతుంది. (8 కారిడార్లు.. 140.13 కి.మీ) గతంలో డీపీఆర్ రూపకల్పన కోసం ఎస్సెల్ ఇన్ఫ్రా కాన్సార్షియం కు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపాదనల రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా ప్రభుత్వం ఉత్వరుల్లో పేర్కొంది. మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం కోసం డీపీఆర్ల రూపకల్పనతో పాటు 60 కిలోమీటర్ల మేర మోడరన్ ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు మరో డీపీఆర్ను సిద్ధం చేసేందుకు ప్రతిపాదనల్ని స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది. (మెట్రో రీ టెండరింగ్) (విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు) -
హైస్పీడ్ రైల్వే కోసం కారిడార్ల గుర్తింపు
న్యూఢిల్లీ: దేశంలోని 6 మార్గాల్లో హైస్పీడ్, సెమీస్పీడ్ కారిడార్లను గుర్తించినట్లు రైల్వేశాఖ బుధవారం తెలిపింది. ఈ మార్గాలపై ఏడాదిలోపు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్) తయారవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. హైస్పీడ్ కారిడార్లో రైళ్లు గంటకు 300 కి.మీ.ల వేగంతో, సెమీస్పీడ్ కారిడార్లో 160 కిలోమీటర్ల వేగంతో నడవనున్నాయి. ఈ కారిడార్లలో ఢిల్లీ–నోయిడా–ఆగ్రా–లక్నో–వారణాసి, ఢిల్లీ–జైపూర్–ఉదయ్పూర్–అహ్మదాబాద్, ముంబై–నాసిక్–నాగ్పూర్, ముంబై–పుణే–హైదరాబాద్, చెన్నై–బెంగళూరు–మైసూర్, ఢిల్లీ–లూథియానా–జలంధర్–అమృత్సర్ ఉన్నాయి. స్థల సేకరణ, అక్కడ ఉండే ట్రాఫిక్ వంటి వివరాల ఆధారంగా ఆయా సెక్షన్లను హైస్పీడ్ లేదా సెమీస్పీడ్ కారిడార్లుగా గుర్తిస్తామని చెప్పారు. రానున్న ఆరు నెలల్లోనే 90శాతం భూసేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. 2023కల్లా దేశంలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని చెప్పారు. 2021కల్లా ఆర్ఎఫ్ఐడీ టాగ్లు.. దేశంలోని సుమారు మూడున్నర లక్షల రైల్వే కోచ్లు, వాగన్లకు 2021కల్లా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) పూర్తి చేస్తామని రైల్వేశాఖ అధికారులు చెప్పారు. దాదాపు రూ. 112 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 22 వేల వాగన్లు, 1200 కోచ్లకు ఆర్ఎఫ్ఐడీ టాగ్లు పూర్తిచేసినట్లు తెలిపారు. దీనివల్ల రైళ్లను సులువుగా ట్రాక్ చేయవచ్చని, సమయానుగుణంగా నడిచేలా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. -
‘మూసీ’ కేంద్రంగా నదుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై తెలంగాణ మరోమారు తన వైఖరిని కేంద్రానికి స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా అకినేపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి నీటిని మళ్లించే ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా కొత్తగా తెరపైకి తెచ్చి న జనంపేట అలైన్మెంట్ సైతం తమకు ఏమాత్రం సమ్మతం కాదని తెలిపింది. ఈ అలైన్మెంట్ ద్వారా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని, కావు న దీన్ని మార్చాలని సూచించింది. నీటి లభ్యత అం శాలపై సంపూర్ణంగా అధ్యయనం చేయాలంది. ఆ తర్వాతే మూసీని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేసి అక్కడ్నుంచి గొట్టిముక్కలను, అట్నుంచి నాగార్జునసాగర్ను నింపిన అనంతరమే నీటిని దిగువకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. నదుల అనుసంధానంపై జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) సంస్థ బుధవారం ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించింది. జాతీయ జల వనరల శాఖ కార్యదర్శి వీపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ తరఫున ఈఎన్సీ మురళీధర్, అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహారావు, ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వాదనను సమావేశంలో స్పష్టం చేశారు. గోదావరిలో తెలంగాణకు 954 టీఎంసీల నీటి కేటాయింపు ఉందని, ఈ నీటిలోంచి చుక్క నీటిని వదులుకునేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. ముందు ఇక్కడ అదనంగా నీటి లభ్యత ఉందా.. లేదా.. అన్న అం శంపై కూలంకషంగా అధ్యయనం చేయాలన్నారు. అభిప్రాయాల తెలుసుకున్నాకే డీపీఆర్లు.. ఇక నదుల అనుసంధానం విషయంలో ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు, ఆమోదాన్ని పరిగణనలోకి తీసుకున్నాకే డీపీఆర్లు తయారు చేయాలని కోరినా, కేంద్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ అధికారులు దృష్టికి తెచ్చారు. దీనిపై కేంద్ర అధికారులు స్పందిస్తూ.. డీపీఆర్లు తయారు చేసి రాష్ట్రాల ఆమోదం తీసుకుంటామని చెప్పారు. దీనికి తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో రాష్ట్రాల అభ్యంతరాలపై కేంద్రమంత్రితో మాట్లాడి నిర్ణయిస్తామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చారు. -
29న ‘రీజినల్’ డీపీఆర్కు ఆమోదం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించిన అలైన్మెంట్లు దాదాపు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రోడ్లు, భవనాలశాఖ అధికారులు వాటికి తుదిరూపు ఇచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 29న ఢిల్లీలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులతో జరిగే సమావేశంలో అలైన్మెంట్ల వివరాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర అధికారులు సమర్పించనున్నారు. ఈ భేటీలోనే డీపీఆర్ను ఎన్హెచ్ఏఐ ఆమోదించి ఆ తర్వాత రెండు, మూడు రోజులకు అధికారికంగా అనుమతుల మంజూరును ప్రకటించనున్నట్లు తెలిసింది. రెండు వారాల్లో స్పష్టత: ఎన్హెచ్ఏఐకి సమర్పించేందుకు అధికారులు దాదాపు నాలుగు అలైన్మెంట్లు సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టులో ఎక్కడా న్యాయపరమైన, సాంకేతికపరమైన చిక్కులు, వివాదాలు తలెత్తకుండా ఉండేలా పకడ్బందీగా వాటిని రూపొందిస్తున్నారు. దాదాపుగా తుది దశకు వచ్చిన డీపీఆర్ పనులకు అధికారులు ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే ఈ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడినట్లు అవుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. కేంద్రం అనుమతిపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు దశల్లో నిర్మించే ఈ ప్రాజెక్టులో సంగారెడ్డి–గజ్వేల్ రోడ్డుకు జాతీయ రహదారిగా గుర్తింపు రాగా షాద్నగర్–చౌటుప్పల్ రోడ్డుకు ఇంకా గుర్తింపు రావాల్సి ఉంది. ఆమోదం పొందగానే భూసేకరణ... డీపీఆర్ విషయంలో ఎన్హెచ్ఏఐ అధికారుల సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర అధికారులు సమాయత్తమవుతున్నారు. గత సమావేశంలో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు తెలంగాణకు ఎందుకు అవసరమో విపులంగా వివరించి వారిని ఒప్పించగా ఇప్పుడు కీలకమైన డీపీఆర్ ఆమోదానికి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అత్యంత కీలకమైన ఈ భేటీలో డీపీఆర్కు ఆమోదం లభించగానే భూసేకరణ పనులు మొదలవుతాయని సమాచారం. మొత్తం 334 కి.మీ.లతో రెండు దశల్లో (సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–జగదేవ్పూర్–భువనరి–చౌటుప్పల్–దాదాపు 154 కి.మీ., చౌటుప్పల్–షాద్నగర్–కంది–దాదాపు 180 కి.మీ.) నిర్మించనున్న ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి రూ. 12,000 కోట్లు ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్టు కోసం 11,000 ఎకరాలు అవసరమవుతుందని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. భూసేకరణకు ఖర్చయ్యే రూ. 3,000 కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఆర్ఆర్ఆర్ స్వయంగా ప్రతిపాదించిన సీఎం కేసీఆర్.. ఈ పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. -
ప్రభుత్వ ప్రాజెక్టుగా ‘మెట్రో’ రెండో విడత!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశను ప్రభుత్వ ప్రాజెక్టుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశ ప్రాజెక్టు కింద నగర శివార్లలో తక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాలను మెట్రో రైలుతో అనుసంధానం చేస్తుండటంతో భవిష్యత్తులో ఆదాయం రూపంలో పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని తేల్చింది. హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) తొలి దశ కింద నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు కారిడార్ల పరిధిలో ఇప్పటికే రవాణా సేవలు ప్రారంభించగా, ఆశించిన రీతిలో ప్రయాణికుల నుంచి స్పందన లేదు. నగరంలో ఆర్టీసీ బస్సుల ద్వారా సగటున రోజుకు 40 లక్షల మంది ప్రయాణిస్తుండగా, మెట్రో రైలును రోజుకు సగటున 70 వేల మందే వినియోగించుకుంటున్నారు. తొలి దశ ప్రాజెక్టుతో పోల్చితే రెండో దశ ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో జన సాంద్రత చాలా తక్కువగా ఉంది. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులన్నీ నిర్వహణలో తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుల విషయంలోనూ ప్రైవేటు పెట్టుబడిదారులు ముందుకు రాలేదని ప్రభుత్వం గుర్తించింది. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెళితే పెట్టుబడులు వచ్చే అవకాశం అంతంతేనని అంచనాకు వచ్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9,378 కోట్లు ఈ క్రమంలో పూర్తిగా ప్రభుత్వ ప్రాజెక్టుగానే మెట్రో రెండో దశ ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులతో మెట్రో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపించింది. రెండో దశ ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.9,378 కోట్ల అంచనా వ్యయంతో మూడు మార్గాల్లో మొత్తం 62 కి.మీ. పొడవున మెట్రో రైలు నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ యాజమాన్య ప్రాజెక్టు (ఈక్వల్ వోనర్షిప్ ప్రాజెక్టు)గా రెండో దశ చేపట్టాలని, కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడి వాటాలు పోగా మిగిలిన వ్యయ భాగాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరిస్తామని పేర్కొంది. డీపీఆర్ రూపకల్పనకు రూ.50 కోట్ల నిధులు మెట్రో రైలు రెండో విడత సవివర పథక నివేదిక (డీపీఆర్) రూపకల్పన కోసం హెచ్ఎంఆర్కు రూ.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండో దశ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ (డీఎంఆర్సీఎల్)కు హెచ్ఎంఆర్ అప్పగించింది. తొలి దశ కింద ఇప్పటికే మూడు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, రెండో దశ కింద నాలుగో కారిడార్గా గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషా బాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ. పొడవున ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదో కారిడార్లో బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ మీదుగా లక్డీకాపూల్ వరకు 26.2 కి.మీ. మెట్రో రైలు మార్గం ఏర్పాటు కానుంది. అదేవిధంగా తొలిదశలో మూడో కారిడార్ (నాగోల్–రాయ్దుర్గ్) విస్తరణలో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5.1 కి.మీ. మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. -
పోలవరంపై సీడబ్య్యూసీని కలిసిన అధికారులు..
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పోలవరం ఛీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు కేంద్ర జలవనరుల శాఖ అధికారులను సోమవారం కలిశారు. పోలవరం రివైజ్డ్ డీపీఆర్(డీటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను గత ఆగస్టులో కేంద్రానికి అందజేసినట్టు తెలిపారు. డీపీఆర్పై సీడబ్య్యూసీ (సెంట్రల్ వాటర్ కమీషన్)కి ఉన్న అభ్యంతరాలపై వివరణ ఇచ్చామని వారు చెప్పారు. సీడబ్య్యూసీలో పోలవరం డీపీఆర్ పరిశీలన చివరి దశలో ఉన్నట్లు వివరించారు. రివైజ్డ్ డీపీఆర్లో డ్యాం నిర్మాణం, హెడ్ వర్క్స్, కుడి కాలువ, ఎడమ కాలువ, భూ సేకరణ, నష్ట పరిహారం, పునరావాసం తదితర అంశాలన్నీ పొందుపరిచామని వెల్లడించారు. కేంద్రం కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం పాజెక్టు నిర్మాణానికి నిధులు ఖర్చు చేసినట్టు చెప్పారు. కేంద్రం త్వరగా నిధులను విడుదల చేస్తే ప్రాజెక్టు నిర్మాణం వేగవంతమవుతుందని పేర్కొన్నారు. నవయుగ కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగిందని వెల్లడించారు. ‘నిధుల విషయంలో కేంద్రం సాయం మరువలేనిది. అయితే వాటి విడుదలలో జాప్యం జరుగుతోంద’ని అన్నారు. అందరి కృషితో పోలవరం 2019లో నిర్మాణం పూర్తి చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అధికార పార్టీ నేతలే సైంధవులు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నాలుగు వరుసల రహదారి ప్రాజెక్టు అది. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించింది. నిర్మించు–నిర్వహించు–బదలాయించు(బీవోటీ) విధానం కింద నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఏపీఆర్డీసీ రూపొందించిన డీపీఆర్ను సైతం ఆమోదించింది. కానీ, అధికార పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఒప్పుకోలేదు. అంచనా వ్యయాన్ని మూడు రెట్లు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేకుంటే టెండర్ల ప్రక్రియ జరగనివ్వబోమని తేల్చిచెబుతున్నారు. వారి బెదిరింపుల వల్ల కాంట్రాక్టర్లు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆరు నెలలు దాటుతున్నా టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. 51 కిలోమీటర్లు.. రూ.505 కోట్లు హైదరాబాద్–గుంటూరు మార్గంలో నార్కట్పల్లి నుంచి అద్దంకి వరకు రహదారిని గతంలోనే అభివృద్ధి చేశారు. ఈ మార్గంలో కొండమోడు–పేరేచర్ల మధ్య నాలుగు వరుసల రహదారిని ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలని 2016లో నిర్ణయించారు. దీనిద్వారా హైదరాబాద్–విజయవాడ రహదారికి ప్రత్యామ్నాయంగా నాలుగు లేన్ల రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, టోల్ వసూలు, బదిలీ (డీబీఎఫ్ఓటీ) కింద ఈ రహదారిని నిర్మించేందుకు ఏపీఆర్డీసీ కేంద్రం నుంచి అనుమతి పొందింది. ఏపీఆర్డీసీ రెండు చోట్ల హై లెవల్ వంతెనలతో 51 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసింది. జాతీయ రహదారుల ప్రమాణాల ప్రకారం కిలోమీటర్కు రూ.10 కోట్ల చొప్పున 51 కిలోమీటర్లకు రూ.505 కోట్ల వ్యయం అవుతుందని తేల్చింది. ఈ డీపీఆర్ను కేంద్రం ఆమోదించి అనుమతులు జారీ చేసింది. దీంతో టెండర్ల ప్రక్రియలో మొదటి అంకంగా అర్హత గల కంపెనీలు రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్(ఆర్ఎఫ్క్యూ) టెండర్లలో పాల్గొనాలని గతేడాది సెప్టెంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రూ.20 కోట్లు అదనంగా ఇచ్చిన ప్రభుత్వం రహదారి నిర్మాణానికి రూ.505 కోట్లు అవసరమని ఏపీఆర్డీసీ పేర్కొంది. రెండు హైలెవల్ వంతెనల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో రూ.20 కోట్లు అదనంగా మంజూరు చేసింది. హైదరాబాద్–గుంటూరు మధ్య హైలెవల్ బ్రిడ్జికి రూ.15 కోట్లు, సత్తెనపల్లి–అమరావతి మార్గంలో హైలెవల్ బ్రిడ్జికి రూ.5 కోట్లకు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది. మూడు నియోజకవర్గాలు కొండమోడు–పేరేచర్ల మధ్య నాలుగు వరుసల రహదారిని గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల మీదుగా నిర్మించాలి. అయితే ఈ రోడ్డును నిర్మించాలంటే అంచనాలు పెంచాల్సిందేనని ఆయా నియోజకవర్గాల పరిధిలోని అధికార పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. లేకుంటే పనులు జరగనిచ్చేది లేదని చెబుతుండడంతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అంచనా వ్యయాన్ని పెంచితేనే భూ సేకరణ ప్రక్రియ సాఫీగా జరగనిస్తామని హెచ్చరించడం గమనార్హం. పెంచిన అంచనా వ్యయాన్ని దోచుకోవడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు టెండర్లు వాయిదా అంచనా వ్యయాన్ని డీపీఆర్ అంచనా కంటే మూడు రెట్లు.. అంటే రూ.1,500 కోట్లకు పైగా పెంచాలని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి టెండర్లలో పాల్గొనాలంటూ ఆహ్వానిస్తున్నా.. కాంట్రాక్టు సంస్థలేవీ ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు ఏపీఆర్డీసీ నాలుగుసార్లు టెండర్ల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసింది. రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ టెండర్లలో కాంట్రాక్టు సంస్థలు పాల్గొనకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నట్లు ఆర్అండ్బీ వర్గాలు వెల్లడించాయి. చివరగా మార్చి 9న తుది గడువుగా మరో టెండర్ నోటిఫికేషన్ను ఏపీఆర్డీసీ జారీ చేసింది. -
బాబుపై మరో బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
గుంటూరు : టీడీపీ నాయకులపై బీజేపీ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపైనే బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ వృధా ఖర్చులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరింతగా అప్పులపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,500 కోట్లు ఇచ్చినా చిన్న నిర్మాణం కూడా మొదలు పెట్టలేదని విరుచుకుపడ్డారు. ఇచ్చిన సొమ్ముకు లెక్కా, పత్రాలు లేవని, కనీసం డీపీఆర్ ఇవ్వకుండా నిధులు ఇవ్వమంటే ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సినిమా డైరెక్టర్లతో డిజైన్లు వేయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇదివరకే బీజేపీ నేత సోము వీర్రాజు టీడీపీ అక్రమాలపై బహిరంగా విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కూడా చేరడంతో టీడీపీ నేతలకు ఏంచేయాలో తోచడం లేదు. -
రాష్ట్రానికి రెండు సైనిక్ స్కూళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2 సైనిక్ పాఠశాలల ఏర్పాటు కు కేంద్రం అంగీకరించింది. ఇందులో ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మం డలం ఎల్కతుర్తిలో ఒక స్కూల్ను మంజూరు చేయగా, మహబూబ్నగర్ జిల్లా నారాయణ్పేట్లో మరో స్కూల్ మం జూరుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎల్కతుర్తి పాఠశాలను వచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 50 ఎకరాల స్థలంలో దాదాపు రూ.100 కోట్లతో ఈ స్కూల్ ఏర్పాటుకు డీపీఆర్లు సిద్ధం చేసి, కేంద్రానికి పంపగా, అంగీకరించింది. దీంతో త్వరలోనే స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారం.. భవనాలు అందుబాటులోకి వచ్చాకే స్కూల్ ను ప్రారంభించాల్సి ఉంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ చర్యలు చేపట్టాలని భావిస్తోంది. స్కూల్ నిర్మాణం కోసం సేకరించిన భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు దాదాపు రూ.4 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేసింది. భవన నిర్మాణాల కోసం ని«ధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి విద్యా శాఖ లేఖ రాసింది. నిర్మాణ పనులు త్వరగా పూర్త యితే వచ్చే జూన్లో 6వ తరగతిలో ప్రవేశాలకు చర్యలు చేపట్టే అవకాశముంది. ఏపీలోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో ప్రవేశాలను ప్రవేశ పరీక్ష ద్వారా చేపడుతున్నారు. మరోవైపు ఎంపీ జితేందర్రెడ్డి కేంద్రానికి చేసిన విజ్ఞప్తిని స్పెషల్ కేసుగా పరిగణనలోకి తీసుకొని అక్కడ మరో స్కూల్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. నారాయణ్పేట్లో స్కూల్ ఏర్పాటుకు అవసరమైన 50 ఎకరాల స్థలం చూపించాలని, డీపీఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే దాన్ని కేంద్రానికి పంపి అనుమతి రాగానే నిర్మాణాలు పనులను చేపట్టాలని భావిస్తోంది. -
జోక్యం చేసుకోండి!
► గోదావరి ప్రాజెక్టులపై కేంద్ర జలవనరులశాఖకు బోర్డు మొర ► తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వడం లేదని ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను వినియోగించుకుంటున్న కొత్త, పాత ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్)లు తమకు సమర్పించాలని పదేపదే కోరుతు న్నా.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పందన కొరవడిందని గోదావరి బోర్డు కేంద్ర జలవనరులశాఖకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల నీటి వినియోగ వివరాలు చెబితేనే నీటి ప్రణాళిక ఖరారు సులువవుతుందని స్పష్టం చేస్తున్నా పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్రం జోక్యం చేసుకోవాలని బుధవారం రాత్రి గోదావరి బోర్డు చైర్మన్ హెచ్కే సాహూ కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల సహా సీతారామ, తుపాకుల గూడెం, ప్రాణహితతో పాటు ఇప్పటికే చేపట్టిన దేవాదుల, ఎస్సారెస్పీ స్టేజ్–2, వరద కాల్వ తదితర ప్రాజెక్టుల వివరాలు కోరింది. ఇక ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నం, తాడిపూడి, పుష్కర, వెంకటనగరం, పట్టిసీమ, భూపతిపాలెం, ముసురుమల్లితో పాటు సీలేరు, శబరిపై చేపట్టిన హైడ్రో ప్రాజెక్టుల వివరాలు అందించాలని కోరింది. దీనిపై ఇరు రాష్ట్రాలు ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రం తరఫున కాళేశ్వరం ఎత్తిపోతలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బోర్డుకు వివరణ పంపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది కాదని అందులో స్పష్టం చేశారు. ఇక తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతలపైనా తెలంగాణ ఇప్పటికే బోర్డు సమావేశాల్లోనూ, లేఖల ద్వారా వివరణ ఇచ్చింది. అయితే ఈ అంశాలను బోర్డు పరిగణనలోకి తీసుకోలేదు. తమకు ప్రాజెక్టుల పూర్తి డీపీఆర్లు అందించాల్సిందేనని స్పష్టం చేసింది. -
6 నెలల్లో..రీజనల్ రింగ్ రోడ్డు!
♦ కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు ♦ సమగ్ర ప్రాజెక్టు నివేదికకు కేంద్రం ఆమోదం తప్పనిసరి.. ♦ అనుమతి కోసం రోడ్లు భవనాల శాఖ నిరీక్షణ ♦ 285 కి.మీ. మార్గంలో రూ.5 వేల కోట్లతో నిర్మాణం అలైన్మెంట్ ఖరారు: ఆర్అండ్బీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల మరో మణిహారం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) పనులపై కదలిక వచ్చింది. సుమారు 285 కి.మీ. మార్గంలో నాలుగు వరుసల్లో రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీకి అవసరమైన అనుమతులు కోరుతూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు కేంద్ర రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఆ శాఖ అనుమతి, మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల్లో డీపీఆర్ సిద్ధం చేయనున్నట్లు ఆర్అండ్బీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. చౌటుప్పల్, సంగారెడ్డి, షాద్నగర్, కంది తదితర ప్రాంతాలను కలుపుతూ వెళ్లే రీజినల్ రింగ్ రోడ్డు.. ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేయనుంది. ఆర్ఆర్ఆర్తో ఆయా ప్రాంతాల్లో రవాణా, వాణిజ్య, విద్య, పారిశ్రామిక అవకాశాలు మెరుగుపడనున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డుతో నగరంలోని పది ప్రధాన రహదారులు అనుసంధానం కానుండటం విశేషం. ఇదీ రీజినల్ రింగ్రోడ్డు ప్రతిపాదన.. 152 కి.మీ. సంగారెడ్డి–నర్సాపూర్–తూ్రప్రాన్– గజ్వేల్–జగదేవ్పూర్– భువనగిరి–చౌటుప్పల్ 133 కి.మీ. చౌటుప్పల్–ఇబ్రహీంపట్నం– ఆమన్గల్–షాద్నగర్–చేవెళ్ల– శంకర్పల్లి–కంది అలైన్మెంట్, భూసేకరణే కీలకం.. రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలంటే తుది అలైన్మెంట్ ఖరారు, భూసేకరణ, బాధితులకు పరిహారం చెల్లింపు వంటి అంశాలు కీలకంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో భూముల విలువ కోట్లకు చేరుకోవడంతో నాలుగు వరుసల రహదారి ఏర్పాటుకు అవసరమైన భూములను సేకరించడం వ్యయ ప్రయాసలతో కూడినదని రోడ్లు, భవనాల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం అలైన్మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన పక్షంలో కన్సల్టెన్సీని నియమించి డీపీఆర్ను సిద్ధంచేసి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులను త్వరితగతిన చేపడతామని పేర్కొంటున్నాయి. తుది అలైన్మెంట్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయని చెపుతున్నాయి. షాద్నగర్–కంది మార్గంలో ఇప్పటికే నాలుగు వరుసల రహదారి అందుబాటులో ఉందని.. ఈ మార్గంలో రహదారిని మరింత విస్తరించాలా? వద్దా? అన్న అంశాలపైనా కసరత్తు చేయాల్సి ఉందని పేర్కొన్నాయి. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పది రాష్ట్ర రహదారులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాయి. ఇప్పటికే సంగారెడ్డి–చౌటుప్పల్ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు వివరించాయి. -
ఎకరాకు బిల్లు47,000
♦ ‘కాళేశ్వరం’ వార్షిక విద్యుత్ వ్యయం రూ.8,677 కోట్లు ♦ కాళేశ్వరం ద్వారా సాగునీటి సరఫరాకు సగటున ఎకరానికి విద్యుత్ బిల్లు రూ.46,732 ♦ డీపీఆర్ ప్రకారం కాళేశ్వరం వార్షిక విద్యుత్ అవసరాలు 13,558 మిలియన్ యూనిట్లు ♦ ఎత్తిపోతల పథకాలకు ప్రస్తుతం యూనిట్ విద్యుత్ చార్జీ రూ.6.40 ♦ నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ సరఫరా వ్యయం ఏటా రూ.8,677 కోట్లు డీపీఆర్లో ప్రభుత్వం చూపిన విద్యుత్ చార్జీలు ఏటా రూ.4,067 కోట్లు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి సరఫరా కోసం సగటున ఎకరానికి రూ.46,732 విద్యుత్ బిల్లు కానుంది! డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు వార్షిక విద్యుత్ అవసరాలు 13,558 మిలియన్ యూనిట్లు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకాలకు యూనిట్కు రూ.6.40 చొప్పున చార్జీలను విద్యుత్ శాఖ వసూలు చేస్తోంది. ఈ లెక్కన కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ సరఫరా వ్యయం ఏటా రూ.8,677 కోట్లు కానుంది. ఈ పథకం కింద 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టును ప్రభుత్వం ప్రతిపా దించగా, సగటున ఎకరా ఆయకట్టుకు నీటి సరఫరాకు ఏటా ఒక పంటకు రూ.47,526 విద్యుత్ బిల్లుల భారం పడనుంది. డీపీఆర్లో లెక్కలు తగ్గించి.. కాళేశ్వరం వార్షిక విద్యుత్ వ్యయాన్ని ప్రభు త్వం డీపీఆర్లో సగానికి తగ్గించి చూపింది. భవిష్యత్తులో రూ.3కే యూనిట్ చొప్పున విద్యుత్ లభ్యత ఉంటుందని, దీంతో ఏటా 13,558 మిలియన్ యూనిట్ల విద్యుత్కు రూ.4,067 కోట్ల వ్యయం కానుందని పేర్కొం ది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ శాఖ యూనిట్కు రూ.6.40 చొప్పున చార్జీ వసూలు చేస్తోంది. ఎత్తు పెరిగే కొద్దీ.. బిల్లుల మోతే.. మేడిగడ్డ బ్యారేజీ నుంచి కొండపోచమ్మ బ్యారేజీ వరకు నీటి తరలింపు కోసం సగటున ఎకరాకు రూ.46,732 నుంచి రూ.47,526 విద్యుత్ బిల్లు కానుండగా, ఒక్కో బ్యారేజీ కింద ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు వ్యయం ఒక్కోలా ఉండనుంది. బ్యారేజీల ఎత్తు పెరుగుతున్న కొద్దీ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ అవసరాలు పెరిగనున్నాయి. సముద్ర మట్టానికి 500/600 మీటర్ల ఎత్తులో ఉండనున్న మల్లన్నసాగర్, కొండపోచమ్మ బ్యారేజీల కింది ఆయకట్టుకు నీటి సరఫరా కోసం ఎకరాకు రూ.80 వేల వరకు విద్యుత్ బిల్లు కానుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 225 టీఎంసీల గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం బహుళార్థక ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 225 టీఎంసీల్లో ఆవిరి, సీపేజీ, ఇతర నష్టాలు, తాగు, పరిశ్రమల అవసరాలను తీసేస్తే సాగునీటికి 124 నుంచి 134 టీఎంసీలు మిగలనున్నాయి. కాళేశ్వరం ద్వారా 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి సరఫరాతో పాటు 18,82,970 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరిస్తామని ప్రభుత్వం డీపీఆర్లో పేర్కొంది. 124–134 టీఎంసీలను 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకే నీటి సరఫరా కోసం కేటాయించినా, సగటున ఒక్కో టీఎంసీతో 17 వేల ఎకరాలకు పైగా సాగు నీటి సరఫరా జరపాల్సి ఉండనుంది. -
‘తుపాకులగూడెం’పై ఛత్తీస్గఢ్ కొర్రీ
బ్యారేజీ వల్ల తమ ప్రాంతంలో ముంపు ఉంటుందని అభ్యంతరం ముంపు అంశం తేలకుండా పనులు చేపట్టరాదంటూ రాష్ట్రానికి లేఖ సాక్షి, హైదరాబాద్: కంతనపల్లి ప్రాజెక్టు రీడిజైనింగ్లో భాగంగా చేపట్టిన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. ఈ బ్యారేజీ నిర్మాణంతో తమ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాలోని మూడు, నాలుగు గ్రామాల్లో ముంపు ఉంటుందని అభ్యంతరాలు లేవనెత్తుతోంది. తమ ప్రాంతంలోని ముంపు తేలకుండా పనులు చేపట్టరాదంటూ అడ్డుపడుతోంది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తమకు సమర్పించాకే ముందుకు కదలాలంటూ రాష్ట్ర నీటిపారుదలశాఖకు ఇటీవల లేఖ రాసింది. ముంపు నదీ గర్భంలోనే... గోదావరిలో 100 టీఎంసీల మేర నీటి వాటా హక్కుగా ఉన్న కంతనపల్లి ప్రాజెక్టుతో వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రాజెక్టు కింద 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండ టంతో ప్రాజెక్టు ప్రతిపాదనను తుపాకులగూడేనికి మార్చింది. ఇక్కడ నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకుపైగా ఉంటుందని, ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తే గ్రామాల ముంపునకు ఆస్కారం ఉండదని వ్యాప్కోస్ సంస్థ సర్వేలో తేల్చింది. ప్రస్తుతం అక్కడ రూ. 2,323 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. పనుల అంశాన్ని తెలుసుకున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బీజాపూర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రాష్ట్ర నీటిపారుదలశాఖకు లేఖ రాశారు. 83 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే తమ ప్రాంతంలోని గ్రామాల్లో ముంపు ఉంటుందనే విషయం టోపోషీట్ల ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా ప్రాజెక్టు పూర్తి వివరాలు తమకు సమర్పించాలని కోరారు. అయితే ఛత్తీస్గఢ్ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. బ్యారేజీ నిర్మాణంతో మొత్తంగా 350 ఎకరాల ముంపు ఉంటుందని, ఇందులో 170 ఎకరాలు తెలంగాణ ప్రాంత నదీ గర్భంలో, మరో 180 ఎకరాలు ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని నదీ గర్భంలోనే ఉంటుందని తేల్చిచెబుతోంది. అదీగాక బ్యారేజీ స్లూయిజ్ నిర్మాణం 77 మీటర్ల లెవల్లోనే ఉంటుందని, ఈ లెవల్లో నిల్వ సామర్థ్యం 2.9 టీఎంసీల వరకే ఉంటుందని, పైన గేట్లు అమరిస్తే బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్లకు చేరి 6.94 టీఎంసీల నిల్వ సాధ్యమవుతుందని చెబుతోంది. బ్యారేజీలో 83 మీటర్ల స్థాయిలో నీరు చేరిన వెంటనే దిగువకు నీటి విడుదల ప్రక్రియ మొదలవుతుందని, ఈ దృష్ట్యా ఛత్తీస్గఢ్లో ముంపు అవకాశమే ఉండదని రాష్ట్రం స్పష్టం చేస్తోంది. వీటిని పేర్కొంటూనే ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ అనుమతుల కోసం విన్నవించగా కేంద్రం అందుకు అంగీకరించిందని చెబుతోంది. ఈ వివరాలతో త్వరలోనే ఆ రాష్ట్రానికి లేఖ రాయనుంది. -
‘భక్త రామదాస’పై ఏపీ తిరకాసు!
⇒ ప్రాజెక్టు ప్రారంభించి ఆయకట్టుకు నీళ్లిచ్చాక కొత్త ప్రాజెక్టంటూ బోర్డుకు ఫిర్యాదు ⇒ ఎలాంటి అనుమతుల్లేకుండా చేపట్టారని, దాని నిర్వహణను అడ్డుకోవాలంటూ గగ్గోలు ⇒ ఏపీ ఫిర్యాదుతో వెంటనే కదిలిన కృష్ణా బోర్డు ⇒ డీపీఆర్ ఇవ్వాలని రాష్ట్రానికి ఆదేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను విని యోగిస్తూ రాష్ట్రం చేపట్టిన భక్తరామదాస పథ కంపై ఆంధ్రప్రదేశ్ పేచీ పెడుతోంది. 2 నెలల కిందటే ప్రాజెక్టును ఆరంభించి, ఆయకట్టుకు నీళ్లిస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రాజెక్టు అనుమ తుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కృష్ణా, గోదావ రి నదీ జలాల విషయంలో ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై నిలదీస్తున్న తెలంగాణకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మాత్రమే హడావుడిగా ఈ అంశా న్ని లేవనెత్తి ఆ రాష్ట్రం, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్వహణను అడ్డుకోవాలని విన్నవించింది. దీనిపై వెంటనే స్పందించిన బోర్డు సైతం తెలంగాణ నుంచి వివరణ కోరింది. కౌంటర్ ఇచ్చేందుకే.. గోదావరి నదిపై పురుషోత్తపట్నం, కృష్ణాపై శివభాష్యం సాగర్, మున్నేరు బ్యారేజీల నిర్మాణాలకు తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తిన విషయం తెలిసిందే. దీనిపై బోర్డులకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తెలంగాణకు కౌంటర్ ఇచ్చేందుకు ఏపీ భక్త రామదాస అంశాన్ని లేవనెత్తింది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో సాగు నీటి పరిధిలోకి రాని ప్రాంతాలకు సాగు నీటిని అందించేందుకు భక్త రామదాస ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. పాలేరు రిజర్వా యర్ నుంచి 5.5 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, దీని ద్వారా 58,958 ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. పనులను పూర్తిచేసి ఈ ఏడాది జనవరిలో జాతికి అంకితం చేశారు. ఈ సమయంలో ఇది కొత్త ప్రాజెక్టని, ఎలాంటి అనుమతులు లేవంటూ బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ‘విభజన చట్టం సెక్షన్ 84(3) ప్రకారం కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి సంబం« దిత బోర్డులు, కేంద్ర జల సంఘం నుంచి అను మతులు కచ్చితంగా తీసుకో వాలి. ఇక సెక్షన్ 85(డి) ప్రకారం నదీ జలాల వినియోగానికి సంబంధించి ఆయా ట్రిబ్యునళ్లు కేటాయించిన నీటి వాటాకు మించి వాడకం లేద ని తేలాకే కొత్త ప్రాజెక్టుల అంశాన్ని పరిగణ నలోకి తీసుకోవాలి. ప్రస్తుతం కృష్ణా జలాల పునఃకేటాయింపులకు సంబంధించి వివాదం ఇంకా ట్రిబ్యునల్ పరిధిలో ఉంది. వీటన్నింటినీ పక్కన పెట్టి తెలంగాణ సీడబ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది’అని ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇక పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే వాటర్ గ్రిడ్ కోసం 3.65 టీఎంసీలు తీసుకుంటోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే సాగర్ ఎడమ కాల్వ కింద ఏపీ ప్రాంతంలోని ఆయకట్టుకు నీరందడం లేదని, తెలంగాణ ఇలా వినియోగం చేస్తూ పోతే తమకు తీవ్ర నష్టమని తెలిపింది. నివేదిక ఇవ్వాలన్న బోర్డు.. ఏపీ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు వెంటనే స్పందిం చింది. భక్త రామదాస ప్రాజెక్టుకు సంబంధిం చిన ప్రాజెక్టు సమగ్ర నివేదికను తమకు వీలైనంత త్వ రగా సమర్పించాలని సూచిస్తూ బోర్డు సభ్య కా ర్యదర్శి సమీర్ చటర్జీ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్కి గురువారం లేఖ రాశారు. -
డీపీఆర్లు లేకుండా టెండర్లు పిలవచ్చా?
టీటీడీపీ నేత రేవంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తాము చేస్తున్న దోపిడి బయటపడుతుందన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు పాలమూరు, డిండి ప్రాజెక్టుల సవివరమైన నివేదికల (డీపీఆర్)ను కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డుకు ఇవ్వడం లేదని తెలంగాణ టీడీపీ నేత రేవంత్రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుకు రూ. 35 వేల కోట్లతో, డిండి ప్రాజెక్టుకు రూ. 6 వేల కోట్లతో టెండర్లు పిలిచారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్లు లేకుండానే టెండర్లు పిలవచ్చా అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకి అంటూ కేసీఆర్ మందిమాగధులు ప్రచారం చేస్తున్నారన్నారు. నీటి లభ్యత లేకుండా కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఎవరూ ఊరుకోరన్నారు. -
పదేపదే కోరుతున్నా డీపీఆర్లు ఇవ్వరేం?
-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై కృష్ణా బోర్డు ఆగ్రహం -ఆర్డీఎస్, పాలమూరు, డిండి డీపీఆర్లు తక్షణమే ఇవ్వాలని ఆదేశం -దీనిపై ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి లేఖలు -ఒక్కో డీపీఆర్కు సంబంధించి నాలుగేసి కాపీలు ఇవ్వాలని సూచన -కృష్ణా బేసిన్లో 47 చోట్ల టెలిమెట్రీ విధానం అమలుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది వరద జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను పదేపదే కోరుతున్నా ఇరు రాష్ట్రాలు సమర్పించకపోవడంపై కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజోలిబండ మళ్లింపు పథకానికి (ఆర్డీఎస్) సంబంధించి ఏపీ.., పాలమూ రు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్లు ఎందుకు సమర్పించడంలేదని ప్రశ్నించింది. తక్షణమే వాటిని సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అపెక్స్ భేటీ నిర్వహించాలన్నా, కేంద్ర జలవనరులశాఖ, కేంద్ర జల సంఘానికి తాము వివరణ ఇవ్వాలన్నా డీపీఆర్లే ప్రధానమని తెలిపింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ శనివారం ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. కృష్ణా జలాల వినియోగంపై పర్యవేక్షణకు ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వివరాలు తమ వద్ద ఉండాలని.. అందుకే డీపీఆర్లను కోరుతున్నామన్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు నీటి వినియోగంపై పరస్పర ఫిర్యాదులు చేశాయని, ఇందులో వాస్తవాలు తేల్చాలంటే ఒక్కో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను నాలుగేసి కాపీల చొప్పున సమర్పించాలని సూచించారు. 47 చోట్ల టెలిమెట్రీ విధానం... కృష్ణా నదీ జలాల వినియోగం, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో తేడా రాకుండా నాగార్జున సాగర్, శ్రీశైలం సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద టె లిమెట్రీ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైన బోర్డు...వాటిని ఎక్కడెక్కడ అమర్చాలన్న దానిపై స్పష్టతకు వచ్చింది. మొత్తంగా 47 చోట్ల టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇరు రాష్ట్రాలకు పంపింది. జూరాలపై భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఆఫ్ టేక్, జూరాల ఎడమ, కుడి కాల్వలు, తుంగభద్రపై ఆర్డీఎస్, కేసీ కెనాల్, పోతిరెడ్డిపాడు, గురు రాఘవేంద్ర ఆఫ్ టేక్, శ్రీశైలం వద్ద ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, హంద్రీనీవా, ముచుమర్రి, వెలిగొండ, ఎస్ఆర్బీసీ, గాలేరు-నగరి, బంకచర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలిగోడు, సోమశిల, కండలేరు, పూండిల వద్ద, సాగర్లో ఎన్ఎస్ఎల్సీ, ఏఎంఆర్పీ, ఎన్ఎస్ఆర్సీ, పులిచింతల స్లూయిజ్, పవర్హౌస్, మూసీ, పాలేరు, మున్నేరు నదీ ప్రాంతాలు, వెంకటాపురం పంపింగ్ స్టేషన్, గుంటూరు చానల్, ప్రకాశం బ్యారేజీ వద్ద 5 చోట్ల పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇరు రాష్ట్రాలు సమ్మతిస్తే ఈ ఏడాది నుంచే నీటి ప్రవాహ లెక్కలను పక్కగా తేలుస్తామని, దీని ఆధారంగా వినియోగం, పంపకాలపై నిర్దిష్ట అంచనాకు వస్తామని తెలిపింది. పోతిరెడ్డిపాడు వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు.. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం వాటాకు మించి ఎక్కువగా కృష్ణా జలాలను తరలించుకుపోతోందని, దీనిపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్వై) భాగంగా రాష్ట్రంలోని 11 ప్రాజెక్టుల పూర్తికి ఈ నెల 6న ఢిల్లీలో నాబార్డ్తో కేంద్రం కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి టి.హరీశ్రావు ఈ అంశాన్ని కేంద్ర మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. నీటి వినియోగ లెక్కలపై టెలిమెట్రీ విధానం అమల్లోకి వచ్చే వరకు నీటి వినియోగం వాటాల మేరకే జరిగేలా చూడాలని కోరనున్నారు. -
వారం రోజుల్లో ఇవ్వండి
పాలమూరు, డిండి డీపీఆర్లు సమర్పించాలని రాష్ట్రానికి కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: పాలమూరు, డిండి ఎత్తిపోతలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు సమర్పించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రాష్ట్రానికి డెడ్లైన్ విధించింది. వారం రోజుల్లో ఈ ప్రాజెక్టుల డీపీఆర్లను సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలన్నా, కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి తాము వివరణ ఇవ్వాలన్నా డీపీఆర్లే ప్రధానమని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషికి లేఖ రాశారు. ‘‘పాలమూరు, డిండిలకు సంబంధించిన డీపీఆర్లు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కోరినా స్పందించలేదు. ఇటీవలే ఈ ప్రాజెక్టుల విషయమై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో ఈ రెండు ప్రాజెక్టుల అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ పరిశీలిస్తుందని తెలిపింది. అందువల్ల డీపీఆర్లు సమర్పించండి. వీటినే కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి సమర్పిస్తాం. అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ వీటినే ముందుంచుతాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటే ఈ రెండు ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతి వివరాలను నివేదిక రూపంలో తమకు సమర్పించాలని బోర్డు సూచించింది. ఈ లేఖతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల కాపీని జత చేసింది. కృష్ణా జలాల విషయంలో తమకున్న కేటాయింపుల్లోంచే నీటిని వాడుకుంటున్నామని, ఎక్కడా పునర్విభజన చట్టాన్ని, ఇతర నిబంధనలను అతిక్రమించలేదని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తున్న తరుణంలో మరోమారు ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు రాసిన లేఖలో.. పాలమూరు ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013లోనే ఉత్తర్వులివ్వగా, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న మరో జీవో వెలువరించారని తెలిపింది. అయితే తాజాగా ఏపీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు, అపెక్స్ భేటీ నిర్వహించి సమస్య పరిష్కరించాలని సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. -
స్మార్ట్సిటీ డీపీఆర్ ఏజెన్సీ ఎంపిక
పనులు దక్కించుకున్న ఐటీఆర్ఏ కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్సిటీ హోదా దక్కించుకునేందుకు తయారు చేయాల్సిన yì టేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) తయారీకి ఏజెన్సీని ఎంపిక చేశారు. టెండర్ల ప్రక్రియ గురువారం పూర్తికాగా.. తక్కువకు కోడ్ చేసి ఐటీఆర్ఏను ఎంపిక చేసినట్లు కమిషనర్ కృష్ణభాస్కర్ తెలిపారు. డీపీఆర్ తయారీకి జాతీయ, అంతర్జాతీయ హోదా గల ఏడు సంస్థలు పోటీపడ్డాయని, నాలుగు టెక్నికల్ బిట్లోనే అర్హత కోల్పోయినట్లు తెలిపారు. మిగతా మూడింటికి సంబంధించి ఫైనాన్స్బిట్ను గురువారం ఓపెన్చేయగా.. ఐఐటీఎస్ రూ.55.54లక్షలు, నియా రూ.46 లక్షలు, ఐటీఆర్ఏ రూ.28.11 లక్షలు కోడ్ చేశాయి. తక్కువకు కోడ్ చేసిన ఐటీఆర్ఏ సంస్థ డీపీఆర్ తయారీ పనులు దక్కించుకుంది. కాగా ఐటీఆర్ఏ గతంలో స్మార్ట్సిటీ దక్కించుకున్న నగరాలకు పనిచేసినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఒప్పందం పూర్తికానుంది. -
హంద్రీ-నీవాపై అలసత్వమెందుకు?
జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేదాకా పోరాటం నేడు వజ్రకరూరు మండలం పొట్టిపాడు వద్ద రైతుల జలజాగరణ ‘అనంత’ అన్నదాతలంతా పాల్గొని విజయవంతం చేయాలి ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు కూడేరు :హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం పనులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం కూడేరులో విలేకరులతో మాట్లాడారు. హంద్రీ-నీవాపై ప్రభుత్వానికి ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. హంద్రీ-నీవా సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)లో జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టు వ్యవస్థలు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాన కాలువ పనులు మాత్రమే చేస్తూ జిల్లాలో సాగునీరిచ్చే విషయాన్ని గాలికి వదిలేసిందన్నారు. డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పక్కన పెట్టాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని, అందుకే వాటి కోసం టెండర్లు పిలవలేదని వివరించారు. అత్యంత తక్కువగా సాగునీటి సౌకర్యమున్న జిల్లాలో హంద్రీ నీవాపై నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీబీ డ్యాం నుంచి రాయలసీమ జిల్లాలకు రావాల్సిన నీటిలో 30 టీఎంసీలను కోల్పోతున్నామన్నారు. ఈ నికరజలాలను హంద్రీ- నీవాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు ఇవ్వాల్సిన 25 టీఎంసీల నీటిని కచ్చితంగా సరఫరా చేయాలని, కానీ సీఎం చంద్రబాబు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో హంద్రీ-నీవాను ఐదు టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా కుదించే ప్రయత్నాన్ని బాబు చేశారని, మళ్లీ ఇప్పుడు చెరువులకు మాత్రమే నీరంటూ జిల్లాకు పది టీఎంసీలతోనే సరిపెట్టే కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి హంద్రీ-నీవా ద్వారా సాగునీటిని పొందేందుకు రైతులతో కలిసి దశలవారీ ఆందోళనలు చేపడతామన్నారు. ఇందులో భాగంగానే శనివారం వజ్రకరూరు మండలం పొట్టిపాడు వద్ద ‘రైతుల జాగరణ’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, అఖిలపక్ష నేతలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేతలు అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ, ఎమ్మెల్యేలు చాంద్బాషా, జయరాం, ఎమ్మెల్సీ గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథ్రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్టీ నేత వై.మధుసూదన్రెడ్డి, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జగదీష్, రాంభూపాల్తో పాటు పలువురు హాజరవుతున్నట్లు తెలిపారు. -
కమీషన్లు కొట్టేయడానికి కొత్త ప్లాన్
మార్క్ఫెడ్ నెత్తిన మల్టీప్లెక్స్ భారం రూ.450 కోట్లతో భారీ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం సంస్థ వద్ద నిధుల్లేవు.. రుణాలింకా మంజూరు కాలేదు డీపీఆర్లు లేకుండానే అంచనా వ్యయంలో 25 శాతం చెల్లింపు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు తెచ్చిన రుణాల వినియోగం! కమీషన్ల కోసం పాలకమండలి కక్కుర్తి వెనకుండి నడిపిస్తున్న అధికార పార్టీ నేతలు సాక్షి, విజయవాడ బ్యూరో: రైతులకు సేవలు చేయాల్సిన మార్క్ఫెడ్ దారి తప్పుతోంది. కమీషన్ల కక్కుర్తితో ‘కమర్షియల్’ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయం తీసుకొని వేగంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారంలో కమీషన్లు కొట్టేయడానికి పాలకవర్గం.. పూర్తయిన నిర్మాణాలను కారుచౌకగా కొట్టేయడానికి అధికార పార్టీ నేతలు వ్యూహం పన్నుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మార్కెఫెడ్కు విజయవాడతోపాటు రాష్ట్రంలోని మరో ఐదు ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో విజయవాడలో ఉన్న స్థలంలో మల్టీప్లెక్స్, మిగిలిన చోట్ల కల్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలని మార్క్ఫెడ్ పాలకమండలి ఇటీవల తీర్మానించింది. దీని వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. విలువైన మార్క్ఫెడ్ స్థలాలు కొట్టేయడానికి ఇదో రాచమార్గమని, రుణాలు తీసుకొని మార్కెఫెడ్ నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత వాటిని చౌకగా లీజుకు తీసుకోవాలని వ్యూహం రూపొందించినట్లు తెలిసింది. నిర్మాణ పనులు చేపడితే భారీగా కమీషన్లు కొట్టేయడానికి పాలకవర్గం.. అధికార పార్టీ పెద్దలు చెప్పినట్లుగా ఆడుతున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే పాలకమండలి తీర్మానం చేసిన మరుసటి రోజే.. కన్సల్టెంట్ ఫీజు పేరిట రూ. 2.5 కోట్లు చెల్లించారు. ఆ సొమ్మంతా పాలకవర్గం సభ్యులే నొక్కేశారని మార్క్ఫెడ్లో ప్రచారం జరుగుతోంది. తీర్మానం చేసి 10 రోజులు తిరగకముందే.. ప్రాజెక్టు నివేదికలు సిద్ధం కాకపోయినా, ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్(ఈపీఐ)కి కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. కన్సల్టెంట్ ద్వారా మొత్తం అంచనా వ్యయంలో 25 శాతం(రూ. 110 కోట్లు) చెల్లించారు. ఈ అడ్డగోలు చెల్లింపులను సంస్థలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీ నేతలు, పాలకమండలి, ఎండీ, జీఎం కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తూ చేసేది లేక మౌనంగా ఉండిపోతున్నారు. అందరూ కుమ్మక్కు కావడం వల్లే ఈ మొత్తం చెల్లించగలిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు, ప్రభుత్వం ఎంపిక చేసిన నోడల్ ఏజన్సీలకు యూరియాను నిల్వ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీపై వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల నుంచి ఈ రూ.110 కోట్లు చెల్లించడం గమనార్హం. ప్రభుత్వ అనుమతి లేకుండానే.. భారీ ప్రాజెక్టులు.. అవి కూడా వాణిజ్య కార్యకలాపాలు చేయడానికి నిర్మించే వాటికి ప్రభు త్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధన ఉంది. ఒకవేళ అనుమతి లభించకపోతే భారీ కమీషన్లు పోతాయనే భయంతోనే హడావుడిగా సొమ్ములు చెల్లించేస్తున్నారని సమాచారం. అసలు వ్యాపారం వదలి కొసరు వ్యాపారం చేయడానికి ప్రభుత్వం నుంచి అ నుమతులు ఇప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని అధికార పార్టీ నేతలు గట్టిగా హా మీ ఇవ్వడం వల్లే.. పాలకవర్గం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక దశలోనే ఉంది కమర్షియల్ ప్రాజెక్టు చేపట్టాలని పాలకమండలి తీర్మానం చేసిన మాట నిజమే. ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ప్రాజెక్టు కార్యరూపం దాల్చే సమయంలో ప్రభుత్వ అనుమతి తీసుకుంటాం. - మార్క్ఫెడ్ చైర్మన్ కంచి రామారావు బ్యాంకులు రుణాలిస్తాయనే గ్యారంటీ లేదు మార్క్ఫెడ్ చేపడుతున్న భారీ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు రుణాలు ఇవ్వడానికి ఏ బ్యాంకూ ముందుకు రాలేదు. గత 10 రోజులుగా అన్ని బ్యాంకులతో సంస్థ పాలకమండలి మాట్లాడినా ఫలితం లేదు. అయినా సరే ఏదో విధంగా రుణం అందుతుందనే నమ్మంతో ప్రస్తుతం సంస్థ వద్ద ఉన్న ఇతర రుణాలను మళ్లించడం గమనార్హం. భారీ ప్రాజెక్టు చేపట్టే ముందే ఆర్థిక వనరులను సమీక్షించుకోకపోవడాన్ని కిందిస్థాయి అధికారులు తప్పుబడుతున్నారు. కనీసం టెండర్లు కూడా పిలవకుండా ఏదో సంస్థను కన్సల్టెంట్ ద్వారా ఎంపిక చేసుకొని, భారీగా సొమ్ము చెల్లిస్తే మునిగిపోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
15 నెలల్లో విశాఖపై డీపీఆర్ ఇవ్వండి
- సీఎం చంద్రబాబు ఆదేశం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి సంబంధించిన సమగ్ర ప్రాజె క్టు నివేదిక(డీపీఆర్)ను 15 నెలల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత బాధ్యుల(కస్టోడియన్)ను ఆదేశించారు. తిరుపతి, విజయవాడ, విశాఖ స్మార్ట్ సిటీ బాధ్యతలు తీసుకున్న అయికాం, కేపీఎంజీ, ఐబీఎం ప్రతినిధులతో మంగళవారమిక్కడ సీఎం సమీక్ష జరిపారు. డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు వీలుగా విశాఖ స్మార్ట్ సిటీ ప్రాథమిక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నగరంలో ఉన్న భూములను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని చెప్పారు. స్వచ్ఛభారత్లో భాగస్వాములుకండి సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2న గుంటూరులో ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ గ్రామాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతోపాటు అందరూ తమ గ్రామం కోసం కేటాయించాలన్నారు. ప్రతినెలా రెండో శనివారం నిర్వహించాలన్నారు. బాగా చేసిన మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు కూడా ఇస్తామన్నారు. స్కూల్ సిలబస్లోనూ స్వచ్ఛ భారత్ ఒక సబ్జక్టుగా పెడతామన్నారు. పీపీపీ పద్ధతిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తిచేసే ప్లాంట్లు ఏర్పాటుచేస్తామన్నారు. -
నెలాఖరులోగా పైప్లైన్ టెండర్లు
సేఫ్ స్టేజ్కి ఇన్టేక్వెల్స్ నిర్మాణం ఐదు డీపీఆర్లకు వ్యాప్కోస్ పచ్చజెండా ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ (వాటర్గ్రిడ్)కు సంబంధించి ప్రధాన పైప్లైన్ ఏర్పాటుకు నెలాఖరులోగా టెండర్లు పిలవాలని గ్రామీణ నీటిసరఫరా విభాగం నిర్ణయించింది. ప్రాజెక్ట్కు సంబంధించి సెగ్మెంట్ల వారీగా అధికారులు రూపొందించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లకు వ్యాప్కోస్ నుంచి ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంగళవారం జరిగిన సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు పైప్లైన్ టెండర్ల అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆర్డబ్ల్యూఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇన్టేక్వెల్స్ అన్నీ దాదాపుగా సేఫ్స్టేజ్కి వచ్చాయని, దీంతో వాటర్గ్రిడ్ పనులను సకాలంలో పూర్తి చేయగలమన్న నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి అయిన వెంటనే ఆయా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. తొలిదశలోనే ఫ్లోరైడ్ బాధిత ప్రాంతమైన నల్లగొండ, కరువు ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లిస్తామని చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ నెట్వర్క్, నీటి ట్యాంకుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా సర్వే చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఐదు డీపీఆర్లకు పచ్చజెండా.. సెగ్మెంట్ల వారీగా రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లను వ్యాప్కోస్ పరిశీలన చేస్తోందని, మొత్తం 26 డీపీఆర్లలో ఇప్పటికే ఐదింటికి ఆమోదం తెలిపిందన్నారు. వారం రోజుల్లోగా డీపీఆర్ల పరిశీలన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే.. వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ పర్యవేక్షణ నిమిత్తం ఔట్ సోర్సింగ్ పద్ధతిన వర్క్ ఇన్ స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్ల నియామకాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. వాటర్గ్రిడ్ పైప్లైన్తో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటుపై ఐటీశాఖ అధికారులతో త్వరలో సమావేశమవుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులున్నారు. ఇదిలా ఉంటే.. పంచాయతీరాజ్ విభాగంలో తెలంగాణకు చెందిన సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్న విషయాన్ని ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారులతో చర్చించి తగిన న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
పులి‘చింతలు’... రెండింతలు!
♦ పెరుగుతున్న విద్యుత్ కేంద్రం అంచనాలు ♦ రూ.380 కోట్ల నుంచి రూ.563 కోట్లకు చేరిన వైనం ♦ మూడింతలైన నిర్మాణ కాలవడ్డీ(ఐడీసీ)లు ♦ రూ.38 కోట్ల నుంచి రూ.108 కోట్లకు పెంపు ♦ నిర్మాణ గడువులు మరోసారి పెంపు సాక్షి, హైదరాబాద్: పులిచింతల జల విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం రెట్టింపు అవుతోంది.2006-07 నాటి సవివర పథక నివేదిక(డీపీఆర్) ప్రకారం రూ.380 కోట్లు ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం తాజాగా... రూ.563.50 కోట్ల కు ఎగబాకింది. అన్ని అనుమతులొచ్చినా అధికారుల నిర్లక్ష్యంతో, గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యే సరికి వ్యయం దాదాపు రెట్టింపై రూ.700 కోట్ల కు చేరే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. నల్లగొండ జిల్లా వజినేపల్లి వద్ద కృష్ణా నదిపై 30.23 టీఎంసీల సామర్థ్యంతో పులిచిం తల డ్యాంతో పాటు 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం పనులకు 2005లోనే కేంద్ర పర్యావరణ శాఖ , 2006లో కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ)లనుంచి అనుమతులు వచ్చాయి. ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆధ్వర్యంలో 2007-14 మధ్య కాలంలో నత్తనడకన పనులు జరిగాయి. వరదలు, వర్షాల వల్ల ప్రాజెక్టు పరిసరాలు ముంపునకు గురవుతున్నాయంటూ నిర్మాణాన్ని ఏడాదిలో కొద్ది కాలమే చేపడుతున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జెన్కో సైతం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని గాడిలో పెట్టలేకపోయింది. సవరించిన అంచనాలతో... తాజాగా ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు. విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పేరుతో రెండు రకాల పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనుల వ్యయంతో పాటు పెట్టుబడి రుణాలపై నిర్మాణ కాల వడ్డీ(ఐడీసీ)లను కలిపి విద్యుత్ ప్రాజెక్టుల అంచనాలను రూపొందిస్తారు. పులిచింతల విద్యుత్ కేంద్రం తొలి అంచనాల్లో సైతం ఇదే తీరుతో వ్యవహరించారు. తాజాగా సవరించిన అంచనాల్లో తెలంగాణ జెన్కో ‘ప్రధాన కార్యాలయాల ఖర్చులు’ పేరుతో కొత్త కేటగిరీని చేర్చింది. జెన్కో ప్రధాన కార్యాలయం(విద్యుత్ సౌధ) నుంచి నిర్మాణ పనుల పర్యవేక్షణ, సిబ్బంది ఖర్చుల కోసం ఏకంగా రూ.49.59 కోట్లను కేటాయించింది. ఇతర కేటగిరీల అంచనా వ్యయాల్లో పెంపును పరిశీలిస్తే .. నిర్మాణ కాల వడ్డీ రూ.38 కోట్ల నుంచి రూ.105.49 కోట్లకు పెరిగి మూడింతలైంది. ఈ ప్రాజెక్టు కోసం పొందిన రుణాలపై గత ఎనిమిదేళ్లకు సంబంధించిన 10.25 శాతం వడ్డీల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదిలో 219.49 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశముంది. -
183 కిలోమీటర్లుగా.. రాజధాని ఔటర్ రింగ్ రోడ్
సాక్షి, హైదరాబాద్: విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాలను కలుపుతూ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాజధాని ఔటర్ రింగు రోడ్డు పొడవు ఎంతుంటుందనే ఊహాగానాలకు ప్రభుత్వం తెరదించింది. ఈ బాహ్య వలయ రహదారి మొత్తం పొడవు 183 కిలో మీటర్లు ఉంటుందని ప్రకటించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్రానికి పంపింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.9,700 కోట్లు అందిస్తామంటూ కేంద్రం గతంలో చేసిన ప్రకటనను దీనిలో పొందుపరిచింది. ఈ రోడ్డు నిర్మాణానికి మొత్తం 4,117 ఎకరాల భూమి అవసరమవుతుందని నివేదికలో స్పష్టం చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రింగ్ రోడ్ డ్రాఫ్ట్ మ్యాప్ ప్రకారం.. ఈ బాహ్య వలయ రహదారి నిర్మాణం.. జాతీయ రహదారి(ఎన్హెచ్)-5 పక్కనే ఉన్న హనుమాన్జంక్షన్ నుంచి రామాపురం, తుమ్మలపల్లి, నందివాడ, గుడివాడ, పామర్రు, భట్లపెనమర్రు వద్ద ఉన్న కృష్ణానది మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి జంపని, చినరావూరు, వలివేరు, వేజండ్ల, పేరేచర్ల, సిరిపురం, లింగంగుంట్ల, పెదకూరపాడు, తమ్మవరం మీదుగా అమరావతి నుంచి కృష్ణానదిపైకి మళ్లించి మళ్లీ కృష్ణా జిల్లాలోని మొగుల్లూరు వద్దకు, అక్కడి నుంచి కంచికచర్ల, అల్లూరు, మైలవరం, నూజివీడు శివారు ప్రాంతాల గుండా మీర్జాపురం, హనుమాన్జంక్షన్ వద్ద కలుపుతారు. దీన్ని ఎన్హెచ్-5, ఎన్హెచ్-9లను కలుపుతూ నిర్మించనున్నారు. రింగ్ రోడ్డు మొత్తం పొడవు= 183 కి.మీటర్లు నిర్మాణానికి అవసరమైన భూమి = 4,117 ఎకరాలు భూ సేకరణకు అయ్యే వ్యయం = సుమారు రూ.4 వేల కోట్లు దీనికిగాను కేంద్రం చేస్తామన్న సాయం = రూ. 9,700 కోట్లు -
ముందడుగు
* ‘స్లమ్ ఫ్రీ సిటీ’కి స్టేట్ స్క్రీనింగ్ కమిటీ గ్రీన్సిగ్నల్ * రూ.2,374 కోట్లతో 183 మురికివాడల అభివృద్ధి * ‘స్మార్ట్ సిటీ’కి డీపీఆర్కు సన్నాహాలు * ‘ఫండ్ యువర్ సిటీ’తో 15 జంక్షన్ల ముస్తాబు * సమావేశంలో నగర కమిషనర్ సువర్ణ పండాదాస్ వరంగల్ అర్బన్ : ఓరుగల్లు రూపురేఖలు మార్చే బృహత్తర ప్రణాళికకు నగర పాలక సంస్థ ముందడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ హోదా దక్కుతుందనే విశ్వాసంతో బల్దియా అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రతిపాదలకు రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్లు ప్రకటించారు. ఫండ్ యువర్ సిటీ కింద 15 జంక్షన్లకు నిధులు సేకరించి మోడల్గా ముస్తాబు చేస్తామని తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన సేవలు, మౌలిక వసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ సువర్ణ పండాదాస్ బుధవారం సాయంత్రం బల్దియా కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రతిపాదనలకు ఆమోదం వరంగల్ స్లమ్ ఫ్రీ సిటీ యాక్షన్ ప్లాన్కు స్టేట్ లెవల్ స్క్రీనింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ నగరాలు స్లమ్ ఫ్రీ సిటీ యాక్షన్ ప్లాన్ ప్రతిపాదించాయి. మొదట వరంగల్ మురికివాడలపై బల్దియా రూపొందించిన డీపీఆర్పై స్క్రీనింగ్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ట్రైసిటీస్లో ఉన్న 183 మురికివాడల్లోని పేదలకు మౌలిక వసతులు, డబుల్బెడ్ రూమ్లతో కూడిన ఇళ్లకు ప్రతిపాదనలు రూపకల్పన చేయడం జరిగింది. గతంలో సింగల్ బెడ్ రూమ్కు 274 స్కేర్ ఫీట్లతో తయారు చేయగా, తాజాగా 458 స్కేర్ ఫీట్లతో తయారు చేయడం జరిగింది. యూనిట్ కాస్ట్ గతంలో రూ.5.72 లక్షలు కాగా ఇప్పడు రూ.8.15 కోట్లుగా అంచనాతో తయూరు చేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.2,374 కోట్లతో తయారు చేసి డీపీఆర్లను సమర్పించడమైనది. 2013-2022లో తొమ్మిదేళ్లలో మురికివాడల్లో మెరుగైన వసతులు సమకూరుస్తాం. తొలి దశగా మురికివాడల్లోని అంబేద్కర్ నగ ర్, గాంధీనగర్, మీరాసాహెబ్ కుంటలను పైలేట్ ప్రాజెక్టు ఎంచుకొని అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.70.76 కోట్ల నిధులు మంజూరు చేసింది. 31 మురికివాడలు అ త్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఉన్నాయని, ఇక్కడి ప్రజల కోసం ప్రభుత్వ స్థలం 62 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నాం. ఈ స్థలంలో 31 మురికివాడల్లోని 6,336 మంది కు టుంబాలకు బహుళ అంతస్తుల్లో డబుల్ బెడ్ రూమ్లతో ఇళ్లను కట్టించి, వసతులు సమకూర్చాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథ కం శంకుస్థాపన చేసేందుకు సన్నహాలు చేస్తున్నాం. స్మార్ట్సిటీకి ప్రతిపాదనలు దేశ వ్యాప్తంగా 100 నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో వరంగల్ నగరం ఒకటి. స్మార్ట్ సిటీ కోసం ప్రతిపాదనలను తయారు చేస్తున్నాం. పబ్లిక్ ట్రాన్స్ఫోర్టు, సిస్టమ్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, పార్కింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్మార్ట్ పవర్ గ్రిడ్ సిస్టమ్, వైఫై సర్వీసు కనెక్టివిటి, ప్రతి ఇంటి నంబరును జీఐఎస్ నమోదు, ఈ-గవర్నెన్సి ఇ-సేవా సెంటర్లు, తాగునీటి సరఫరాలో స్కాడా సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ, సివరేజీ సిస్టమ్స్, ఎస్ఎఫ్సీపీవోఏ సిస్టమ్, ఇంటెలిజెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. అందుకోసం నిట్ ప్రొఫెసర్లు, ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలను తీసుకోనున్నాం. స్మార్ట్సిటీపై త్వరలో స్టేక్ హోల్డర్ల సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఫండ్ యువర్ సిటీతో 15 జంక్షన్ల ముస్తాబు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, వాణిజ్య వర్గాలు, సంస్థల ద్వారా ఫండ్ యువర్ సిటీ నిధులను సేకరించేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రైసిటీస్లో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 15 జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. మడికొండ, కాజీపేట, వడ్డేపల్లి క్రాస్ రోడ్డు, కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ ఆర్టీసీ, రాంనగర్, కిట్స్, వడ్డేపల్లి చర్చి, గోపాలపురం, మిషన్ ఆస్పత్రి, వరంగల్ రైల్వే-ఆర్టీసీ బస్స్టేషన్, పెద్దమ్మ గడ్డ, హంటర్ రోడ్డు ఆర్వోబీ, అబ్బనికుంట, గోకుల్ నగర్ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, క్లబ్లు, చాంబర్ ఆఫ్ కామర్స్, రైస్మిల్లర్స్, కిరాణ మర్చంట్స్, ఫంక్షన్ హాల్స్, కూరగాయల, పండ్ల మార్కెట్, లారీ అసోసియేషన్స్ తదితర వర్గాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్, ఇన్చార్జీ డిప్యూటీ కమిషనర్ గంగుల రాజిరెడ్డి, ఎస్ఈ అబ్దుల్ రహ్మాన్, సీపీ రమేష్బాబు పాల్గొన్నారు. -
‘మెట్రో’ సేవలు విస్తృతం
ప్రయాణికులకు శుభవార్త... నగరంలో మెట్రో రైలు సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇందుకు కారణం నాలుగో దశ కింద 103.93 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మించనుండడమే. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించింది. సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) నాలుగో దశ మెట్రో మార్గ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులోభాగంగా 103.93 కిమీ పొడవైన మెట్రో మార్గాన్ని నిర్మించనుంది. ఈ పనులను 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను డీఎంఆర్సీ... కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖతోపాటు ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రెండింటి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. నాలుగవ దశ కింద రిఠాలా నుంచి నరేలా (921.73కిమీ),పశ్చిమ జనక్పురి నుంచి ఆర్.కె.ఆశ్రం (28.92కిమీ), ముకుంద్ పురి నుంచి మౌజ్పూర్ (12.54 కిమీ), ఇందర్లోక్ నుంచి ఇంద్రప్రస్థ ( 12.58 కిమీ), ఏరోసిటీ నుంచి తుగ్లకాబాద్ ( 20. 20 కిమీ), లజ్పత్నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్ 9 (7.96 కిమీ) వరకు ఆరు కారిడార్లను నిర్మించాలని డీఎంఆర్సీ ప్రతిపాదించింది. రిఠాలా- నరేలా వరకు ఉండే కారిడార్ బర్వాలా, బవానాల మీదుగా, పశ్చిమ జనక్పురి నుంచి ఆర్కెఆశ్రం వరకు ఉండే కారిడార్ పీరాఘడీ మీదుగా ముకుంద్పుర్- మౌజ్పుర్ కారిడార్ వజీరాబాద్, ఖజూరీఖాస్ల మీదుగా, తుగ్లకాబాద్ - ఏరోసిటీ కారిడార్ మెహ్రోలీ, మహీపాల్పుర్ గుండా, ఇందర్లోక్ - ఇందర్బస్తీ కారిడార్ దయాబస్తీ,న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, దిల్లీ గేట్, సచివాలయం మీదుగా నిర్మించాలని డీఎంఆర్సీ ప్రతిపాదించింది. పనులు మొదలుపెట్టిన ప్పటి నుంచి 72 నెలల్లోగా నాలుగోదశ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డీఎంఆర్సీ అంటోంది. 2016, ఏప్రిల్లో పనులు ప్రారంభమైతే 2022 మార్చి నాటికి పూర్తవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. నాలుగో దశలో ఆరు కారిడార్లలో 67 మెట్రో స్టేషన్లను నిర్మిస్తారు. ప్రస్తుతం నగరంలో మెట్రో మార్గం 190 కి.మీ పొడవుతో విస్తరించి ఉంది. ప్రతిరోజూ 25 లక్షల మంది ప్రయాణికులు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. మూడో దశ మెట్రో నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది. 140 కి.మీల ఈ మెట్రో నిర్మాణం పూర్తయిన తరువాత ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ 40 లక్షలకు చేరుకుంటుందని ఆశిస్తున్నారు. నాలుగో దశ నిర్మాణం తరువాత ఢిల్లీ మెట్రో ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ 60 లక్షలకు చేరుకుంటుందని భావిస్తున్నారు.