Global Markets
-
టారిఫ్లు, ప్రపంచ మార్కెట్లపై దృష్టి
ముంబై: ప్రధానంగా ప్రపంచ పరిణామాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల కారణంగా నేలచూపులకే పరిమితమవుతున్నాయి. ఈ బాటలో మరోసారి ఆటుపోట్లు చవిచూడనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనా ఎఫెక్ట్ యూఎస్ టారిఫ్లు తదితర పాలసీ నిర్ణయాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. కొద్ది నెలలుగా మార్కెట్లు దిద్దుబాటు ధోరణిలో సాగుతున్నాయి. దీంతో మార్కెట్లు ఎక్కడ టర్న్అరౌండ్ అయ్యేదీ అంచనా వేయడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మరోసారి చైనా మార్కెట్లవైపు విదేశీ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టినట్లు పేర్కొంటున్నారు. ఫలితంగా దేశీ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. దీంతో పలువురికి ఆదాయపన్ను ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్, వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టిన ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్లు ప్రస్తావించారు. వారాంతాన... గత కేలండర్ ఏడాది(2024) చివరి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు శుక్రవారం(28న) వెల్లడికానుంది. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లో దేశ జీడీపీ పురోగతి గణాంకాలు విడుదలకానున్నాయి. జులై–సెప్టెంబర్(క్యూ3)లో జీడీపీ 5.4 శాతం వృద్ధి చూపింది. మరోపక్క యూఎస్ క్యూ4 జీడీపీ రెండో అంచనాలు 27న వెలువడనున్నాయి. ముందస్తు అంచనాలు 2.3 శాతం వృద్ధిని సంకేతించాయి. గత మూడు త్రైమాసికాలలో ఇది తక్కువకాగా.. క్యూ3లో 3.1 శాతం పురోగతి నమోదైంది. ఇదే రోజు జనవరి నెలకు యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు, డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు, వ్యక్తిగత ఆదాయం, వ్యయాలు తదితర గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ అంశాలపైనా దృష్టి పెట్టనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసె స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.గత వారమిలా..గత వారం(17–21) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోవారంలోనూ డీలా పడ్డాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ నికరంగా 628 పాయింట్లు(0.85 శాతం) క్షీణించి 75,311 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 133 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 22,796 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.6 శాతం, 1 శాతం చొప్పున బలపడటం గమనార్హం!ఇతర అంశాలురష్యా– ఉక్రెయిన్ యుద్ధం సంబంధిత వార్తలు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి తీరు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు ఖేమ్కా పేర్కొన్నారు. దేశీ మార్కెట్లలో బలహీన సెంటిమెంటు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు వినోద్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఆర్జన మెరుగుపడటం, గ్లోబల్ లిక్విడిటీ, కరెన్సీ నిలకడం వంటి సానుకూల పరిస్థితులు నెలకొనేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యే వీలున్నట్లు నిపుణులు వివరించారు. యూఎస్ విధిస్తున్న టారిఫ్లపై ఆందోళనలు దేశీ మార్కెట్లతోపాటు.. పలు ఇతర మార్కెట్లను సైతం ప్రభావితం చేయనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. సమీప భవిష్యత్లో టారిఫ్ వార్తలు ట్రెండ్ను నిర్దేశించవచ్చని అంచనా వేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు కీలక భాగస్వామ్య దేశాలను ప్రభావితం చేయనున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. దీనికితోడు దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు కొంతమేర నిరాశపరుస్తున్నట్లు తెలియజేశారు. -
రూపాయి మరింత క్రాష్ ..
ముంబై: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు ప్రతి రోజు సరికొత్త రికార్డు కనిష్టాలకు పడిపోవడం కొనసాగుతోంది. సోమవారం మరో 49 పైసలు క్షీణించి 87 స్థాయిని కూడా దాటేసింది. 87.11 వద్ద క్లోజయ్యింది. కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా టారిఫ్ల మోత మోగించడమనేది వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు క్షీణించడం .. మన రూపాయిపైనా ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా డాలరు పటిష్టంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి బలహీనంగానే ట్రేడయ్యే అవకాశాలు ఉన్నాయని మిరే అసెట్ షేర్ఖాన్ రీసర్చ్ ఆనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అమెరికా టారిఫ్లపై ఆందోళన వల్ల కూడా రూపాయి మీద ఒత్తిడి పెరగవచ్చని వివరించారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకుంటే రూపాయి పతనానికి కాస్త బ్రేక్ పడొచ్చని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న 85.61 వద్ద ఉన్న రూపాయి మారకం విలువ ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి 1.8 శాతం క్షీణించింది.మార్కెట్ ఆధారితమైనదే..: రూపాయి మారకం విలువ మార్కెట్ ఆధారితంగానే ఉంటుందే తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగ్గించడమనేది జరగదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. డాలర్ ఇండెక్స్, పెట్టుబడుల ప్రవాహాలు, వడ్డీ రేట్లు, క్రూడాయిల్ కదలికలు, కరెంటు అకౌంటు లోటు తదితర జాతీయ, అంతర్జాతీయ అంశాలెన్నో రూపాయిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రూపాయి క్షీణత వల్ల ఎగుమతులపరంగా పోటీపడేందుకు వీలవుతుందని, ఇది ఎకానమీకి సానుకూలమని చెప్పారు. -
ట్రంప్ చర్యలు.. ఆర్థిక ఫలితాలే కీలకం!
గతవారం స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగాయి. ప్రధాన సూచీలు దాదాపు 1 శాతం పడిపోయాయి. ఇందుకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. వెంటాడుతున్న చమురు ధరల భయం, ఈరోజు అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోయే డొనాల్డ్ ట్రంప్ విధానాలపై స్పష్టత కొరవడటం. ఈ మూడు అంశాలు ప్రధానంగా మార్కెట్లను పడగొట్టాయి. మరోపక్క రిలయన్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ప్రకటించిన ఆర్థిక ఫలితాలూ మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి. వాస్తవానికి ఫలితాలు ఫర్వాలేదు అనిపించినప్పటికీ మార్కెట్లను బలహీనత ఆవరించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ఫలితాలు మదుపర్లను మెప్పించలేకపోయాయి. ఇన్ఫోసిస్ రూ.113, యాక్సిస్ బ్యాంకు రూ.45 దాకా క్షీణించాయి. దాదాపు రూ.35 దాకా పెరిగిన రిలయన్స్ మార్కెట్లని కాస్త ఆదుకోబట్టి సరిపోయింది కానీ, ఈ పతనం మరింత ఎక్కువగా ఉండేది. ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, వాహన, ఐటీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు రంగానికి చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 760 పాయింట్లు కోల్పోయి 77619 వద్ద, నిఫ్టీ 228 పాయింట్లు నష్టపోయి 23203 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయినప్పటికీ... చివరకు ప్రతికూలంగానే ముగిశాయి. ఈవారం ఇలా..గత వారం మాదిరిగానే ఈవారం కూడా మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగానే సాగే అవకాశం ఉంది. మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన సంఘటనలు తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ట్రంప్ చేయబోయే ప్రకటనలపై కూడా మార్కెట్ ఓ కన్నేసి ఉంచుతుంది. ముఖ్యంగా టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. గతంలో మాదిరి దేశీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ సంస్థలను ఏమైనా ఇరకాటంలో పెడతారా? లేదంటే విధానాలు మార్చుకుని కొంత సరళంగా వ్యవహరిస్తారా? అన్న విషయాన్ని మార్కెట్ సునిశితంగా గమనిస్తుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదే సమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు అగ్గికి ఆజ్యం పోస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆర్థిక ఫలితాలు కీలకంఈవారం హిందుస్థాన్ లీవర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, హిందూస్థాన్ పెట్రోలియంలు ఫలితాలు ప్రకటించబోయే ప్రధాన కంపెనీలు. డీఎల్ఎఫ్, జొమాటో, ఎల్ & టీ ఫైనాన్స్, డిక్సాన్ టెక్నాలజీస్, పీఎన్బీ హౌసింగ్, ఇండియా మార్ట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జేకే సిమెంట్, టొరెంట్ ఫార్మా, జేఎస్ డబ్ల్యు స్టీల్, లారస్ లాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జిందాల్ సా, గోద్రెజ్ సీపీ, ఎంఫసిస్, సియెంట్, అదానీ గ్రీన్, పాలీక్యాబ్, హడ్కో, పెర్సిస్టెంట్, పెడిలైట్, హెరిటేజ్ ఫుడ్స్, కోఫర్జ్లు మరికొన్ని ప్రధాన కంపెనీలు.ఎఫ్ఐఐల సరళిఅమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉండటం రూపాయి సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది. ఇది విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) పెట్టుబడులను ప్రభావితం చేస్తోంది. గత ఏడాది మొత్తం మీద భారీ స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. గత వారం వీరు దాదాపు రూ.25,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. నెల మొత్తానికి వీరి నికర అమ్మకాలు రూ.46,576 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.49367 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.సాంకేతిక స్థాయులుమార్కెట్లు ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్లను ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉన్నా ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలకు బేర్స్ అడ్డుగానే నిలుస్తున్నారు. మార్కెట్ కు కొనుగోళ్ల మద్దతు లభిస్తే మాత్రం మొదట దృష్టి పెట్టాల్సింది 23350 స్థాయి. దీన్ని అధిగమించనంతవరకు మార్కెట్ కొద్దిగా పెరిగినట్లు కనిపించినా మళ్లీ క్షీణత వైపే అడుగులేయవచ్చు. ఒకవేళ 23350 దాటితే తదుపరి నిరోధ స్థాయి 23500. దీన్ని కూడా దాటి ముందుకెళ్తే 23700, 23900 స్థాయిలను అందుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ప్రతికూలంగా ఉన్నా సూచీలు పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుత స్థాయి నుంచి దిగజారితే మాత్రం మొదటి మద్దతు 23050 వద్ద లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేసుకుని కిందకు పడిపోతే 22850 స్థాయిని టెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాతి దశలు 22600, 22400 గా భావించాలి. ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000-24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24000 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22200 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 5.58 శాతం పెరిగి 15.75 దగ్గర ఉంది.రంగాలవారీగా...బ్యాంకింగ్ షేర్లు తమ బలహీనతలను కొనసాగించే అవకాశం ఉంది. టెలికాం సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగానే చలించే అవకాశం ఉంది. క్షీణిస్తున్న రూపాయి ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ ఫలితాలు నిరుత్సాహపరచడం ఐటీ రంగ షేర్లలో ఒత్తిడిని పెంచుతోంది. సిమెంట్ ధరలు పెరగవచ్చన్న వార్త నేపథ్యంలో ఈ రంగంలోని షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
మార్కెట్కు మాంద్యం భయం
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 886 పాయింట్లు క్షీణించి 81 వేల దిగువన 80,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 293 పాయింట్లు పతనమై 25వేల స్థాయిని కోల్పోయి 24,718 వద్ద నిలిచింది. ఇటీవల వెల్లడైన దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం, దలాల్ స్ట్రీట్ వరుస రికార్డు ర్యాలీతో అధిక వాల్యుయేషన్ల ఆందోళన పరిణామాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణ వైపు పురిగొల్పాయి. ఒక దశలో సెన్సెక్స్ 999 పాయింట్లు క్షీణించి 80,869 వద్ద, నిఫ్టీ 324 పాయింట్లు కుప్పకూలి 24,686 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. రియలీ్ట, మెటల్, ఆటో, ఐటీ, కమోడిటీ, టెక్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల భారీ పతనంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.58% 1.19 శాతం నష్టపోయాయి. సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.4.46 కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.457 లక్షల కోట్లకు దిగివచి్చంది.ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం అమెరికాలో జూలై తయారీ రంగ పీఎంఐ, ఉద్యోగ ఉద్యోగ కల్పన గణాంకాలు నిరాశపరచడంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తాయి. అలాగే ఫెడరల్ రిజర్వ్ సెపె్టంబర్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను బలహీనపరిచింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలైన టెస్లా, ఆల్ఫాబెట్, ఎన్విడీయా, మైక్రోసాఫ్ట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడం ఆగ్నికి ఆజ్యం పోశాయి. నాస్డాక్ 3% క్షీణించి 16,683 వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీల షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ జూలై 10న జీవితకాల గరిష్టం (18,671) నుంచి ఏకంగా 10%పైగా కుప్పకూలింది. డోజోన్స్ ఇండెక్స్ 2.5% నష్టపోయి 39,430 వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లూ డీలా పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో జపాన్ సూచీ నికాయ్ 6% క్షీణించింది. తైవాన్ ఇండెక్స్ 5%, కోప్సీ సూచీ 4%, హాంగ్కాంగ్ సూచీ 2% కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలతో చైనా షాంఘై సూచీ ఒకశాతం నష్టపోయింది. ఇక మధ్య ప్రాచ్యంలో విస్తరిస్తున్న యుద్ధ భయాలతో యూరప్ మార్కెట్లూ 2.50% నుంచి రెండుశాతం పైగా నష్టపోయాయి. -
Wedding Insurance: పెళ్లిళ్లకూ బీమా ధీమా..
మన దగ్గర వివాహ వేడుకనేది ఓ భారీ కార్యక్రమం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి థీమ్తో బ్యాండ్ బాజా బారాత్, షాన్దార్, వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాలు, అనేక టీవీ షోలు కూడా వచ్చాయి. వివాహానికి సంబంధించి భావోద్వేగాల అంశాన్ని కాస్సేపు అలా ఉంచితే, ఈ వేడుకల్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు కూడా ఇమిడి ఉంటాయి. అంతర్జాతీయంగా ఇదో పెద్ద పరిశ్రమ. 2020లో 160.5 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ వెడ్డింగ్ సర్వీసుల మార్కెట్ 2030 నాటికి ఏకంగా 414.2 బిలియన్ డాలర్లకు చేరగలదన్న అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ వ్యయంతో తలపెట్టే వివాహ వేడుకలకు ఏదైనా అనుకోని అవాంతరం వచి్చందంటే బోలెడంత నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వేదిక, వాతావరణం మొదలైన వాటికి సంబంధించి ఏ సమస్య వచి్చనా కార్యక్రమం మొత్తం రసాభాస అవుతుంది. అందుకే, అలాంటి వాటికి కూడా బీమాపరమైన రక్షణ పొందేలా ప్రస్తుతం బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేడుక స్థాయి, సరీ్వసులను బట్టి వీటికి ప్రీమియంలు ఉంటున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సరీ్వసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని కానీ ఇలాంటి ప్లాన్తో వచ్చే నిశి్చంత వెలకట్టలేనిది. వివిధ రకాలు.. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది .. పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటివేమైనా జరిగితే కవరేజీనిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ అనేది థర్డ్ పారీ్టకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు. మరోవైపు, ఏదైనా కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిన సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు కూడా కవరేజీ ఉంటుంది. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ను అందించే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి. యాడ్ ఆన్లు, రైడర్లు .. సంప్రదాయాలు, అభిరుచులను బట్టి ప్రతి వివాహ వేడుకలు విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా .. అటైర్ కవరేజీ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. పాలసీదార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. -
అమెరికా ఆంక్షలు.. చైనా కంపెనీ కొత్త ప్రణాళిక
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఎక్కువవుతున్న తరుణంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి, విక్రయిస్తున్నాయి. అయితే మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో లేదా వినియోగంలో చైనా కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. చైనా కార్ల ధరలు ఇతర బ్రాండ్ కార్ల కంటే తక్కువగా ఉండటమే..!ఇప్పటికే కొన్ని దేశాలు చైనా వాహనాల దిగుమతి పూర్తిగా నిషేధించాయి, మరికొన్ని భారీ సుంకాలను విధించాయి. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్లో చైనా కంపెనీ సరసమైన కార్లను విక్రయించడానికి సర్వత్రా సిద్ధమైంది. ఇందులో బీవైడీ ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే భారతదేశంలో కూడా ఈ కంపెనీ ఉత్తమ అమ్మకాలను పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది.ప్రపంచ మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి.. దానికి అవసరమైనన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి బీవైడీ కమకారీలోని పాత ఫోర్డ్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగానే కంపెనీ బ్రెజిల్లో కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమైంది.బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా గత సంవత్సరం చైనాను సందర్శించినప్పుడు, అతను బీవైడీ బిలియనీర్ వ్యవస్థాపకుడు, చైర్ వాంగ్ చువాన్ఫును కలిశారు. ఆ సమావేశం తరువాత, బీవైడీ ఆసియా వెలుపల మొదటి కార్ల తయారీ కేంద్రంగా దేశాన్ని ఎంచుకుంది.బీవైడీ ఈ సంవత్సరం బహియా రాష్ట్రంలోని సైట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఆటోమొబైల్స్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తోంది. ఇక్కడ బస్సులు, ట్రక్కులు మాత్రమే కాకుండా ప్రాసెస్ బ్యాటరీ పదార్థాలను కూడా తయారు చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో.. బీవైడీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఎదుగుతుందా? అనే సూచనలు కూడా కనిపిస్తున్నాయని పలువురు నిపుణులు భావిస్తున్నారు.గత నెలలో అమెరికా అధ్యక్షుడు.. జో బైడెన్ చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం సుంకం ప్రకటించారు. స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచడానికి.. చైనా ఉత్పత్తుల సంఖ్యను తగ్గించడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలో చైనా ఉత్పత్తుల సంఖ్య తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తోంది. -
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే అనేక సంస్థలు ఈవీలను లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. ఇప్పటి వరకు హోండా మాత్రం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఈ సంస్థ 2030 నాటికి ఏడు 0 సిరీస్ మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది.హోండా కంపెనీ లాంచ్ చేయనున్న 7 మోడల్స్ 480 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందిస్తోంది. జపనీస్ ఆటో మేకర్ లాంచ్ చేయనున్న 0 సిరీస్ మోడల్స్ సరికొత్త బెస్పోక్ ప్లాట్ఫారమ్ ఆధారంగా తయారవుతాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ల బాడీ ఫ్రేమ్లు తేలికగా ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా డిజైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది.హోండా లాంచ్ చేయనున్న 0 సిరీస్ కార్లు మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. లెవెల్ 3 ADAS టెక్నాలజీని కూడా పొందుతాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.0 సిరీస్ కింద లాంచ్ కానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు CES.. ఇప్పటికే ఈ కారు లాస్ వెగాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే.. హోండా లాంచ్ చేయనున్న కార్లు ఎలా ఉండబోతున్నాయనేది స్పష్టమైపోతోంది. కాగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రోజు రోజుకు ఊపందుకుంటున్న తరుణంలో హోండా భారీ పెట్టుబడులను పెట్టడానికి యోచిస్తున్నట్లు సమాచారం. -
Iran-Israel Tensions: మార్కెట్లకు యుద్ధ భయం
ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రికత్తలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్ 930 పాయింట్ల 73,315 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు క్షీణించి 22,339 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 845 పాయింట్లు పతనమై 2 వారాల కనిష్టం దిగువున 73,400 వద్ద నిలిచింది. నిఫ్టీ 247 పాయింట్లు క్షీణించి 22,272 వద్ద స్థిరపడింది. ఒక్క ఆయిల్అండ్గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్, సరీ్వసెస్, ఐటీ, బ్యాంకింగ్ ఇండెక్సులు మెటల్, ఆటో షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,763 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో ఒక్క చైనా(1%) మినహా అన్ని దేశాల సూచీలు దాదాపు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో యూరప్ మార్కెట్లు కోలుకున్నాయి. ► సెన్సెక్స్ 845 పాయింట్ల పతనంతో బీఎస్ఈలో రూ.5.18 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.394 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా ఈ సూచీలో 30 షేర్లకు గానూ మారుతీ సుజుకీ (1%), నెస్లే (0.62%), సన్ఫార్మా(0.10%) మాత్రమే లాభపడ్డాయి. ► ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.3942 వద్ద నిలిచింది. క్యూ4 ఫలితాలు మెప్పించడంతో ట్రేడింగ్ ప్రారంభంలో 1.50% పెరిగి రూ.4063 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే నష్టాల మార్కెట్ ట్రేడింగ్లో భాగంగా ఈ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశీయ ఆయిల్అండ్గ్యాస్ కంపెనీల షేర్లకు కలిసొచి్చంది. ఓఎన్జీసీ 6%, ఐజీఎల్ 2%, ఐఓఎల్, గెయిల్ 1.50% చొప్పున లాభపడ్డాయి. జీఎస్పీఎల్ 1% లాభపడ్డాయి. ► ప్రతి ఈక్విటీ షేరుకు రూ.118 ప్రత్యేక డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదించడంతో ఆస్టర్ డీఎం హెల్త్కేర్ షేరు 7% లాభపడి రూ.523 వద్ద నిలిచింది. ట్రేడింగ్లో 14% ఎగసి రూ.558 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ప్రథమార్థపు ట్రేడింగ్లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్సెషన్లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్అండ్గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఆయిల్అండ్గ్యాస్ 2.61%, యుటిలిటీస్ 2.59%, పవర్ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్, ► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు బీఎస్ఈలో 5% లోయర్ సర్క్యూట్తో రూ.325 వద్ద లాకైంది. ► ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► బ్లాక్డీల్ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి రూ.268 వద్ద ముగిసింది. -
ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయం!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా మందగమన ప్రభావాలు భారత ఎకానమీపై కూడా ప్రభావం చూపవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ వి. శ్రీవత్స. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచి్చన ఇంటర్వు్యలో తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఫండ్స్లోకి భారీగా పెట్టుబడులు .. సాంప్రదాయ పెట్టుబడి సాధనాలతో పోలిస్తే మ్యుచువల్ ఫండ్స్ ప్రయోజనాలు, అధిక రాబడులపై అవగాహన పెరుగుతున్న కొద్దీ గత పదేళ్లుగా ఫండ్స్లోకి పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగవచ్చు. సిప్ల ధోరణి ఇదే సూచిస్తోంది. పొదుపు యోచన, దీర్ఘకాలికంగా సిప్ల ద్వారా సంపద సృష్టి మొదలైన అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గరిష్ట స్థాయుల్లో మార్కెట్లకు రిస్క్లు.. అధిక ద్రవ్యోల్బణం, ఖర్చులు చేయడం తగ్గుతుండటం వంటి ధోరణుల కారణంగా చాలా మటుకు సంపన్న మార్కెట్లలో మాంద్యం అవకాశాలు ఎంతో కొంత ఉన్నాయి. ఇప్పటికీ పూర్తిగా కోలుకోని గ్లోబల్ మార్కెట్లకు పొంచి ఉన్న చెప్పుకోతగ్గ రిస్క్ల్లో ఇది కూడా ఒకటి. అలాగే అంతర్జాతీయంగా మందగమనం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటమనేది మన దగ్గర కూడా అధిక ధరలు, ఎగుమతి ఆధారిత రంగాలు బలహీనపడటం రూపంలో భారత ఎకానమీపైనా ప్రభావం చూపవచ్చు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. వేల్యుయేషన్పరంగా దీర్ఘకాలిక సగటులతో పోలిస్తే మన మార్కెట్లు కొంత ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే నిర్దిష్ట విభాగాలు, రంగాలు చాలా ఎక్కువ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. లార్జ్క్యాప్తో పోల్చి చూస్తే మిడ్, స్మాల్ క్యాప్స్ .. ప్రీమియం ధరలకు ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ ధోరణి నిలబడేది కాకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానంగా లార్జ్ క్యాప్ ఆధారిత ఫండ్స్, అలాగే డెట్, ఈక్విటీ కలయికతో ఉండే ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్పై దృష్టి పెడితే శ్రేయస్కరం. సిప్లు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ సిప్లను కొనసాగించవచ్చు. సిప్ లేదా ఎస్టీపీ (సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్) ద్వారా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పెట్టుబడులకు అనువైన రంగాలు.. పటిష్ట రుణ వృద్ధి, తక్కువ రుణ వ్యయాలతో ప్రైవేట్ రంగ బ్యాంకులు చాలా ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్లో లభిస్తున్నాయి. కాబట్టి వాటిపై మేము సానుకూలంగా ఉన్నాం. అలాగే వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉండటం, వేల్యుయేషన్లు సముచితంగా ఉండటం వల్ల ఆటోమొబైల్స్పై కూడా బులి‹Ùగా ఉన్నాం. ఇక దూరంగా ఉండతగిన రంగాల విషయానికొస్తే .. అధిక వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న కన్జూమర్ డ్యూరబుల్స్, అలాగే వేల్యుయేషన్లకు తగ్గట్లుగా లేని కన్జూమర్ సరీ్వసెస్, ఎఫ్ఎంసీజీ రంగాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లార్జ్ క్యాప్లపై సానుకూలంగా ఉన్నాం. అలాగే దీర్ఘకాలికంగా మెరుగైన చరిత్ర కలిగి, చౌకగా ట్రేడవుతున్న కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆశావహంగా ఉన్నాయి. మా యూటీఐ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్, యూటీఐ అగ్రెసివ్ హైబ్రీడ్ ఫండ్ల విషయానికొస్తే నాణ్యమైనవి స్టాక్స్, దీర్ఘకాలిక వేల్యుయేషన్ల కన్నా తక్కువ స్థాయిలో ట్రేడవుతున్న రంగాలవైపు మేము మొగ్గు చూపుతాం. మిడ్, స్మాల్ క్యాప్స్లోనూ సముచిత వేల్యుయేషన్లతో ట్రేడవుతూ వృద్ధి అవకాశాలు ఉన్నవి ఎంచుకుంటాం. -
సెంటిమెంట్ సానుకూలం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, బడ్జెట్(2024–25)పై సమగ్ర విశ్లేషణ తర్వాత మార్కెట్ వర్గాల ప్రశంసనీయ వ్యాఖ్యలు, గతవారం వెలువడిన కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర అంశాలు సూచీలను లాభాల వైపు నడిపిస్తాయంటున్నారు. ఇక మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ నిర్ణయాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. బడ్జెట్లో ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యం, మూలధన వ్యయ కేటాయింపు పెంపుతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకోవడంతో గతవారంలో సూచీలు 2% ర్యాలీ చేశాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రికార్డు ర్యాలీ నేపథ్యంలో వారం మొత్తంగా సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ‘‘నిఫ్టీ కొత్త రికార్డు(22,127) నమోదు, పాలసీ వెల్లడికి ముందు స్టాక్ మార్కెట్లో కొంత స్థిరీకరణ జరగొచ్చు. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు బుల్స్కు అనుకూలంగా ఉన్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 21,850 స్థాయిపై ముగిసింది. లాభాలు కొనసాగితే ఎగువున 22,350 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 21,640 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుంది’’ అనిమాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా ఈ వారంలో 1,200 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎల్ఐసీ, లుపిన్, నైనా, జొమాటో, టాటా పవర్, అలెంబిక్ ఫార్మా, అశోక్ లేలాండ్, వరణ్ బేవరేజెస్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, అపోలో టైర్స్, మణిప్పురం ఫైనాన్స్, బయోకాన్, ఎస్కార్ట్స్, పతంజలీ ఫుడ్స్, ఎంసీఎక్స్ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమా న్యం అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు చైనా, యూరోజోన్, జపాన్ దేశాలు జనవరి సేవారంగ పీఎంఐ డేటాను(సోమవారం) వెల్లడించనున్నాయి. భారత సేవారంగ డేటా ఫిబ్రవరి 5న విడుదల అవుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జనవరి 26తో ముగిసి వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు జనవరి 2తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. 4 పబ్లిక్ ఇష్యూలు, ఒక లిస్టింగ్ ఈ వారంలో నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.2,700 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఏపీజే సురేంద్ర పార్స్ హోటల్ ఐపీఓ జనవరి 5న, రాశి పెరిఫెరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలు జనవరి7న ప్రారంభం కానున్నాయి. ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్(ఫిబ్రవరి 7న) కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి ఫెడ్ ద్రవ్య పాలసీ, మధ్యంతర బడ్జెట్ ప్రకటన తర్వాత దలాల్ స్ట్రీట్కు ఆర్బీఐ ద్రవ్య సమావేశ నిర్ణయాలు కీలకం కానున్నాయి. సమీక్ష సమావేశం మంగళవారం(జనవరి 6న) ప్రారంభం అవుతుంది. కమిటీ నిర్ణయాలను బుధవారం గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. రెపో రేటు (6.5%) యథాతథ కొనసాగింపునకే కమిటీ మొగ్గుచూపొచ్చు. అయితే వడ్డీ రేట్లు తగ్గింపు సైకిల్, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక స్థితిగతులు, వృద్ధి అవుట్లుక్పై గవర్నర్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చు. డెట్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్టానికి ఎఫ్ఐఐల పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు జనవరిలో దేశీయ డెట్ మార్కెట్లో రూ. 19,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడిచిన ఆరేళ్లలోనే అత్యధిక నెలవారీ పెట్టుబడులు కావడం విశేషం. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్లో చేర్చడం ఇందుకు ప్రధాన కారణం. అమెరికాలో పెరుగుతున్న బాండ్ల రాబడితో గత నెల ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు రూ. 25,743 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, క్రితం నెల డెట్ మార్కెట్లలో ఎఫ్పీఐలు రూ.19,836 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, 2017, జూన్లో వచి్చన రూ. 25,685 కోట్ల తర్వాత ఇది రెండో అత్యధికం. బడ్జెట్ ప్రకటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక లోటును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి తగ్గిస్తామని చెప్పడం, డెట్ మార్కెట్లో నిధుల పెరుగుదలకు దోహదపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
నిఫ్టీ 20,000 స్థాయికి..?
ముంబై: నిఫ్టీ సూచీ ఈ వారంలో 20,000 స్థాయికి చేరొచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సూచీ జీవితకాల గరిష్టం (19,992) స్థాయికి 172 పాయింట్లు, 20వేల స్థాయికి 180 పాయింట్లు దూరంలో ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్ను నిర్దేశిస్తాయన్నారు. అంచనాలకు మించి జీడీపీ, పీఎంఐ డేటా నమోదు, ఆర్థిక వ్యవస్థపై బలమైన అవుట్లుక్ నేపథ్యంతో గతవారం సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. మెటల్, రియలీ్ట, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా వారం మొత్తంగా సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు ఆర్జించాయి. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు 4.3 శాతానికి చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్ 105 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లకు చేరింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ మార్కెట్ స్థిరంగా ముందుకు కదలింది. గత వారాంతంలో ఆర్బీఐ అదనపు నగదు నిల్వల నిష్పత్తిని దశల వారీగా రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో బ్యాంకుల షేర్లు రాణించవచ్చు. ఈ పరిమాణాలు నిఫ్టీని 20,000 స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువున 19,500–19,650 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల డేటా దేశీయంగా జూలై పారిశ్రామికోత్పత్తి డేటా, వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఆగస్టు ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు గణాంకాలు ఈ వారంలో వెల్లడి కానుంది. అలాగే చైనా వాహన అమ్మకాలు, అమెరికా ద్రవ్యల్బోణ, యూరోజోన్ పారిశ్రామికోత్పత్తి డేటా, ఇదే వారంలోనే విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, డిపాజిట్ – బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. నేడు రెండు లిస్టింగులు రత్నవీర్ ప్రెసిíÙన్ ఇంజరీంగ్, రిషిభ్ ఇన్్రసూ్టమెంట్ ఐపీఓలు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్టుకానున్నా యి. ఈఎంఎస్ ఐపీఓ మంగళవారం ముగిస్తుంది. ఆర్ఆర్ కేబుల్, షమీ హోటల్స్ పబ్లిక్ ఇష్యూలు బుధ, గురువారాల్లో ప్రారంభం కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు వరుస ఆరు నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్లో అమ్మకాలను మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,200 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం, డాలర్ విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఐఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో వారం, రెండు వారాల పాటు ఎఫ్ఐల నిధుల ఉపసంహరణ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఎఫ్ఐఐలు నాలుగు నెలల కనిష్టంతో రూ. 12,262 కోట్ల విలువైన నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు భారత మార్కెట్లలో రూ. 1.74 లక్షల కోట్ల నిధులను పెట్టుబడి పెట్టారు. -
స్పోర్టియస్ట్ డిజైన్తో హ్యుందాయ్ సొనాటా సరికొత్తగా
సాక్షి,ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త హ్యుందాయ్ సొనాటాకారును ఆవిష్కరించింది. లాంచ్ చేసింది. మిడ్ సెగ్మెంట్లో 8వ జెనరేషన్ సొనాటాను కొత్త బ్యాడ్జ్, లాంగ్ హుడ్, ఫ్రంట్-ఎండ్ లేఅవుట్తో స్పోర్టియస్ట్ డిజైన్తో పరిచయం చేసింది. స్పోర్ట్, స్టాండర్డ్ , N లైన్ వేరియంట్లలో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. హ్యుందాయ్ సొనాటా వెర్నా, కోనా ఎలక్ట్రిక్, స్టారియా పోలిన స్టయిల్తోపాటు, డ్రైవర్-సెంట్రిక్ ఇంటీరియర్ లేఅవుట్తో ఆల్ న్యూ హ్యుందాయ్సొనాటా రానుంది. ముఖ్యంగా హ్యుందాయ్ మోడల్లో తొలిసారిగా సొనాటా డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్లు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో కర్వ్డ్ డిస్ప్లేను జోడించింది. సిగ్నేచర్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ బార్, రియర్ ఎల్ఈడీ టెయిల్లైట్ స్ట్రిప్, బ్లాక్ బార్, మధ్యలో హ్యుందాయ్ లోగో, డిఫరెంట్ గ్రిల్తో దీన్ని అప్డేట్ చేసింది. అలాగే స్పోర్టియర్ ఎక్స్టీరియర్ ఇమేజ్తో ఆధునిక జీవనశైలికి మద్దతుగా భవిష్యత్ మొబిలిటీ సెన్సిబిలిటీతో దీన్ని తీర్చిదిద్దింది. 12.3 ఇంచ్ ట్విన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్లీ ఎక్స్టెండెడ్ ఎయిర్ వెంట్స్, న్యూ సెంట్రల్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, న్యూ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ మార్పులు కూడా చేసింది. ఇంజీన్ 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్స్ తో ఇది రానుంది. అలాగే ఎన్ లైన్లో మరొకటి వస్తోంది. ఈ ఇంజీన్ 285హెచ్పీ పవర్, 422 ఎన్ఎం టార్క్ను అందిస్తుంది. మార్చి 30నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్న 2023 సియోల్ మొబిలిటీ షోలో దీన్ని ఆవిష్కరించనుంది. #Hyundai #SONATA inherits the identity of the 4-door coupe with Absolute Sportiness. And its futuristic and progressive interior is completed with our new technology, Panoramic Curved Display. On March 30th, #ThenewSONATA will be fully unveiled.#HyundaiDesign #SONATADesign pic.twitter.com/1r91CvNBIQ — Hyundai Motor Group (@HMGnewsroom) March 26, 2023 -
ట్రై-ఫోల్డ్ స్మార్ట్ఫోన్: శాంసంగ్ మరో వినూత్న ఆవిష్కారం!
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మరో కీలక ఆవిష్కారానికి సిద్ధమవుతోంది. మూడు ఫోల్డింగ్స్తో ఒక స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోందిట. టిప్స్టర్ యోగేష్ బ్రార్ షేర్ చేసిన వివరాల ప్రకారం, శాంసంగ్ ట్రై-ఫోల్డ్ డిస్ప్లేతో ఒక స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. మరోవైపు ఈ ఏడాది చివర్లో లాంచ్ చేయనుందని భావిస్తున్న ఫ్లాగ్షిప్ గెలాక్సీ S23 సిరీస్ స్మార్ట్ఫోన్ 'ఫ్యాన్ ఎడిషన్’ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ సంస్థ డెవలప్ మెంట్లో లేదని టిప్స్టర్ తెలిపింది. మూడు మడతలతో కాన్సెప్ట్ డిస్ప్లే పిక్స్ను షేర్ చేసింది. గతంలో CES 2022లో ట్రై-ఫోల్డ్ డిస్ప్లేలతో కాన్సెప్ట్ పరికరాలను ప్రదర్శించింది. జెడ్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్ల మెరుగైన వెర్షన్పై పని చేస్తోందనీ, ముఖ్యంగా జెడ్ ఫోల్డ్ 5 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5గా తోపాటు మూడు మడతల ఫోన్ తీసుకు రానుందని తెలిపింది. ఫ్లెక్స్ ఎస్, ఫ్లెక్స్ జీ పేరుతో ఇవి రానున్నాయని అంచనా. కాగా జనవరిలో Samsung CES 2023లో 360-డిగ్రీల రొటేటింగ్ స్క్రీన్తో “ఫ్లెక్స్ ఇన్ అండ్ అవుట్” డిస్ప్లే కోసం ప్రోటోటైప్ను ప్రదర్శించింది. డిస్ప్లే లోపలికి బుక్ కవర్లా, లేదా వార్తాపత్రికలా బయటకి మడవగలదు. సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్తో ఫంక్షనల్ “ఫ్లెక్స్ ఇన్ అండ్ అవుట్” డిస్ప్లే జోడిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. There is no Galaxy S23 FE in the development chain unlike what the recent rumours have been pointing.. Samsung is instead working on the improved Z Fold 5 & Flip 5 along with a Tri-Fold that might finally ship this year FE fans should look elsewhere... — Yogesh Brar (@heyitsyogesh) March 24, 2023 -
March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!
సాక్షి,ముంబై: పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకుని వినియోగదారులకు షాకిస్తోంది. బులియన్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఆల్ టైం రికార్డులను బ్రేక్ చేసింది. దేశీయంగా గతం వారం రోజుల వ్యవధిలో ధర రూ.3,520కు పైగా పెరిగింది. బంగారం ధర ఈ మధ్యకాలంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ నమోదు కాలేదు. అమెరికా బ్యాంక్ సంక్షోభం పసిడి ధరలకు ఊతమిస్తోంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,300గా వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,320 రూపాయలను దాటేసింది. శుక్రవారం నాటి ధరతో పోలిస్తే ఏకంగా 10 గ్రాములకు రూ. 1500 పెరిగింది. అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగార ధర 10 గ్రాములు రూ. 60,320 వద్ద ఉంది. సుమారు రూ. 1,630 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ. 1300 పెరిగి రూ. 74,400 వద్దకు చేరింది. గ్లోబల్గా కూడా అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే శనివారం రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. 1,988 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు వారం ముగింపుతో పోలిస్తే ఔన్స్కు 6.48 శాతం పెరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ధర 2వేల డాలర్లను కూడా దాటేసి 2,500 డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వెండి కూడా బంగారంతోసమానంగా వారానికి దాదాపు 9.22 శాతం భారీ లాభాలను ఆర్జించింది. ఇదే రేంజ్లో దేశీయంగా కూడా ధరలు ప్రభావితం కానున్నాయని మార్కెట్ నిపుణుల అంచనా. మార్చి 21న జరిగే ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ ముఖ్యంగా అమెరికా బ్యాంకింక్ సంక్షోభం నేపథ్యంలో బ్యాంకింగ్ రంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోకపోతే పసిడి ధరలు మరింత పెరుగుతాయనేది విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అమెరికా చరిత్రలో రెండవ అతిపెద్ద బ్యాంక్ క్రాష్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) పతనంతో వడ్డీ రేట్ల పెంపు ఆందోళనకు దారి తీసింది. అటు క్రెడిట్ సూయిస్ షేర్లలో పతనం ప్రపంచ మార్కెట్ గందరగోళానికి దారితీసింది. దీంతో అంతర్జాతీయంగా శుక్రవారం బంగారం ధరలు 2 శాతానికి పైగా పెరిగిన సంగతి తెలిసిందే. -
ఈ వారం అమ్మకాల ఒత్తిడిలో మార్కెట్లు!
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశమున్నట్లు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) మూసివేత తదితర అంశాలు కారణంకానున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా పలు గణాంకాలు విడుదల కానుండటంతో ఇన్వెస్టర్లు వీటన్నిటినిపైనా దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. ద్రవ్యోల్బణం, వాణిజ్యం.. సోమవారం(13న) దేశీయంగా ఫిబ్రవరి నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు విడుదల కానున్నాయి. అంతకుముందు నెల అంటే జనవరిలో సీపీఐ మూడు నెలల గరిష్టం 6.52 శాతంగా నమోదైంది. ఇక మంగళవారం(14న) ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. 2022 డిసెంబర్లో నమోదైన 4.95 శాతం నుంచి జనవరిలో 4.73 శాతానికి డబ్ల్యూపీఐ స్వల్పంగా తగ్గింది. ఈ బాటలో ఫిబ్రవరి వాణిజ్య గణాంకాలను సైతం ఇదే రోజు ప్రభుత్వం ప్రకటించనుంది. జనవరిలో వాణిజ్య లోటు 17.75 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశీ అంశాలు గత వారాంతాన ఇన్సూర్డ్ డిపాజిట్ల రక్షణకు వీలుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్వీబీని మూసివేసినట్లు కాలిఫోర్నియా ఆర్థిక పరిరక్షణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పరిస్థితులను చక్కదిద్దే బాటలో ఎస్వీబీని ఫైనాన్షియల్ నియంత్రణ సంస్థ ఎఫ్డీఐసీకి అప్పగించినట్లు వెల్లడించింది. ప్రధానంగా సిలికాన్ వ్యాలీ, టెక్ స్టార్టప్లకు పెట్టుబడులు అందించే ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ ఆర్థిక సంక్షోభంలో పడటంతో గత గురువారం కంపెనీ షేరు 60 శాతం కుప్పకూలింది. దీంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్ఫార్గో తదితర బ్యాంకింగ్ దిగ్గజ షేర్లు 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. దీంతో సోమవారం బ్యాంకింగ్ పరిశ్రమపై ఈ ప్రభావం ఏమేర ఉండబోయేదీ వేచిచూడవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. అంచనాలకంటే అధికంగా వడ్డీ రేట్లను పెంచే వీలున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ గత వారం పేర్కొన్నారు. అయితే వారాంతాన యూఎస్ నిరుద్యోగ గణాంకాలు అంచనాలను మించి వెలువడ్డాయి. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు కొంతమేర చెక్ పడేవీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు ఊహిస్తున్నాయి. ఈ నెల 22న ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలను వెల్లడించ నుంది. గ్లోబల్ గణాంకాలు ఫిబ్రవరి నెలకు యూఎస్ సీపీఐ గణాంకాలు 14న వెలువడనున్నాయి. చైనా పారిశ్రామికోత్పత్తి వివరాలు 15న వెల్లడికానున్నాయి. యూఎస్ ఉత్పాదక ధరల ద్రవ్యోల్బణం, రిటైల్ విక్రయ గణాంకాలు ఇదే రోజు వెలువడనున్నాయి. ఈ బాటలో 16న జపాన్ వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. ఇక దేశీయంగా ఇటీవల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎఫ్పీఐల అమ్మకాలు, ఎస్వీబీ వైఫల్యంతో వారం చివర్లో దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గత వారం సెన్సెక్స్ నికరంగా 674 పాయింట్లు కోల్పోయి 59,135కు చేరగా.. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 17,413 వద్ద ముగిసింది. -
Tecno Phantom V Fold అద్బుత ఫీచర్లతో టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ కంపెనీ టెక్నో తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను త్వరలోనే విడుదల చేసింది. ఫాంటమ్ వీ ఫోల్డ్ పేరుతో దీన్ని ఈ నెల ఫిబ్రవరి 27 నుండి స్పెయిన్లోని బార్సిలోనాలో ప్రారంభమయ్యే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో పరిచయం చేయనుంది. ఫిబ్రవరి 28న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ పేజీ ఇప్పటికే MWC 2023 వెబ్సైట్లో లిస్ట్ అయి ఉంది. మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ఫాం టమ్ వీ ఫోల్డ్ను ఫిబ్రవరి 28న MWC 2023 సందర్భంగా ఆవిష్కరిస్తున్నట్లు అధికారికంగా టెక్నో ప్రకటించింది. అంతేకాదు ప్రపంచంలోని మొట్టమొదటి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్గా కూడా ఉంటుందని తెలిపింది. MediaTek డైమెన్సిటీ 9000+ SoC ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణ అనీ, చిప్సెట్ మొత్తం AnTuTu టెస్ట్ స్కోర్ను 1.08 మిలియన్లకు పైనే కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను టిప్స్టర్ పరాస్ గుగ్లానీ లీక్ చేశారు. దీని ప్రకారం వీ ఫోల్డ్ డిస్ప్లేను సెంట్రల్-ప్లేస్డ్ హోల్-పంచ్ హౌసింగ్ సెల్ఫీ కెమెరాను, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తెలుస్తోంది. ఫాంటమ్ వీ ఫోల్డ్ అంచనా ఫీచర్లు 7.1, 5.54 అంగుళాల అమెలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 56+16+8 ఎంపీ రియర్ కెమెరా 32+32 సెల్ఫీ కెమెరా 12 జీబీ ర్యామ్, 256/512 జీబీ స్టోరేజ్ 4500 బ్యాటరీ 67 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ Tecno Phantom V Fold 🔥 pic.twitter.com/mEnzA7whn3 — Sudhanshu Ambhore (@Sudhanshu1414) February 2, 2023 -
బడ్జెట్పై అంచనాలు, క్యూ3 ఫలితాలు కీలకం
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే ఈ వారంలో బడ్జెట్పై అంచనాలు, కార్పొరేట్ క్యూ3 ఫలితాలు, ప్రపంచ పరిణామాలు దేశీయ స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో ఒడిదుడుకుల ట్రేడింగ్కు అవకాశం ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. క్యూ3 ఆర్థిక ఫలితాల సీజన్ కొనసాగుతున్నందున స్టాక్, రంగాల ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. కొంత కాలం నిఫ్టీ 17,800–18,250 పరిధిలోనే ట్రేడవుతోంది. ఈ వారంలోనూ అదే శ్రేణిలో కదలాడొచ్చు. బడ్జెట్ వెల్లడి తర్వాత తదుపరి మూమెంటమ్ చూడొచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. తీవ్ర ఒడిదుడులకులకు లోనవుతూ.., పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు గతవారం స్వల్ప లాభాలను ఆర్జించగలిగాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్ స్టాకులకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్ఐఐల బేరీష్ వైఖరి ఈ కొత్త ఏడాదిలో దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ జనవరి 20 నాటికి రూ.15,236 కోట్ల షేర్లను అమ్మేశారు. చైనా లాక్డౌన్ ఎత్తివేతతో ఎఫ్ఐఐల అక్కడి మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులేస్తుంనే భయాలు ఇందుకు కారణమయ్యాయి. ఫైనాన్స్, ఐటీ, టెలికాం షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. కేవలం మెటల్, మైనింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో(జనవరి 21 నాటికి) సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.16,000 వేల షేర్లను కొనుగోలు చేసి మద్దతుగా నిలుస్తున్నారు. ‘‘బడ్జెట్పై ఆశలు నెలకొన్నప్పటికీ.., బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కారణంగా రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత క్యూ3 గణాంకాలను వెల్లడించింది. ఈ ఫలితాల ప్రభావం సోమవారం (23న) ట్రేడింగ్లో ప్రతిఫలించే అవకాశముంది. ఇదే వారంలోనే యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్సహా 300కి పైగా కంపెనీలు తమ మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనవచ్చు. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్కు ఆసక్తి చూపవచ్చు. బుధవారమే ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం జనవరి 26 గణతంత్ర దినోవత్సం సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్ ఆఫ్ లేదా రోలోవర్ అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. నిఫ్టీకి ఎగువ స్థాయిలో 18,100–18,200 శ్రేణిలో నిరోధం, దిగువ స్థాయిలో 18,000–17,800 వద్ద తక్షణ మద్దతు ఉందని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన సమావేశపు నిర్ణయాలు నేడు విడుదల కానున్నాయి. అమెరికాతో పాటు యూరోజోన్ జనవరి తయారీ, సేవా రంగ గణాంకాలు రేపు(మంగళవారం) వెల్లడి కానుంది. యూఎస్ గృహ విక్రయాలు, నిరుద్యోగ గణాంకాలు, క్యూ4 జీడీపీ అంచనా గణాంకాలు గురువారం(జనవరి 26న) విడుదల కానున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్ను ప్రభావితం చేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ప్రీ బడ్జెట్ అంచనాలు వచ్చే ఏడాది(2024)లో జరిగే సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇది. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించి మూలధన వ్యయానికి భారీగా నిధులు కేటాయించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, రైల్వేలు, రోడ్డు, రక్షణ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చంటున్నారు. బడ్జెట్ సంబంధిత ముఖ్యంగా మౌలిక వసతులు, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, ఎరువుల రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. -
నవంబర్లో సేవలకు పటిష్ట డిమాండ్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం నవంబర్లో మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 56.4గా నమోదయ్యింది. అక్టోబర్లో ఇది 55.1 వద్ద ఉంది. పీఎంఐ 50 శాతంలోపు ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన దేశ ఎకానమీలో మెజారిటీ పాత్ర పోషిస్తున్న సేవల రంగం వరుసగా 20 నెలల నుంచి వృద్ధి ధోరణిలోనే కొనసాగుతోంది. ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా తెలిపిన సమాచారం ప్రకారం, నవంబర్లో సేవల రంగానికి పటిష్ట డిమాండ్ నెలకొంది. మార్కెటింగ్, అమ్మకాలు బాగున్నాయి. సేవల రంగం నవంబర్లో చక్కటి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. అయితే కంపెనీలు అత్యధిక నిర్వహణా వ్యయాలను ఎదుర్కొన్నాయి. సేవలు–తయారీ కలిపినా.. స్పీడే! ఇక తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ అక్టోబర్లో 55.5గా ఉంటే, నవంబర్లో 57.7కు ఎగసింది. ఈ రెండు విభాగాల్లో ప్రైవేటు రంగ క్రియాశీలత పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు డీ లిమా తెలిపారు. ఒక్క తయారీ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) చూస్తే, నవంబర్లో 55.7గా నమోదయ్యింది. అక్టోబర్లో ఈ సూచీ 55.3 వద్ద ఉంది. గడచిన మూడు నెలల్లో సూచీ ఈ గరిష్ట స్థాయిల్లో నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీ 50పైన ఉంటే వృద్ధిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన పీఐఎం వరుసగా 17 నెలల నుంచి వృద్ధి బాటనే పయనిస్తోంది. -
కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి!
సాక్షి,ముంబై: బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ధరలు దూసు కెడుతున్నాయి. ఇటీవల కాస్త స్తబ్దుగా ఉన్న పసిడి ధర భారీగా పెరిగింది. అటు వెండి ధర గణనీయంగా పుంజుకుంది. తాజాగా గ్రాము బంగారం రూ.54 వేల మార్క్ను దాటేసింది. దీంతో త్వరలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకునే సూచనలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మరో విలువైన మెటల్ వెండి కూడా ఇదే బాటలో ఉంది. వెయ్యిరూపాయలకు పైగా జంప్ చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర 350 రూపాయలకు పైగా పెరిగింది. ఎంసీఎక్స్ ఫిబ్రవరి కాంట్రాక్ట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.362 లేదా 0.67 శాతం పెరిగి రూ. 54212కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో కిలో వెండి ధర రూ.850-900 పెరిగింది. ఫిబ్రవరి డెలివరీ వెండి ధర ప్రస్తుతం రూ.851 లేదా 1.28 శాతం పెరిగి కిలో రూ.67300కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక డిమాండ్ పెరగడం ఈ గణనీయమైన పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత ఆరు నెలల్లో ఎంసీఎక్స్ బంగారం ధర రూ.54,000కి చేరడం ఇదే తొలిసారి. (StockMarketUpdate: కోలుకున్న మార్కెట్లు, కుప్పకూలిన రూపాయి) దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.227 పెరిగి రూ.54,386కి చేరుకుంది. వెండి కూడా కిలోకు రూ.1,166 పెరిగి రూ.67,270కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో సానుకూల సంకేతాల మధ్య డిసెంబర్ 5 సోమవారం ముంబై స్పాట్ మార్కెట్లోరం 999 స్వచ్ఛత బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ.53,972గా ఉంది, శుక్రవారం ముగింపు ధర రూ.53,656 నుంచి రూ.316 పెరిగింది. అలాగే 999 స్వచ్ఛత వెండి కిలో రూ. 65,891గా ఉంది. (ఈ స్కీంలో నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు) ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 11.15 డాలర్లు లేదా 0.62 శాతం పెరిగి 1,820.75 డాలర్ల వద్ద, వెండి ఔన్స్కు 0.245 డాలర్లు లేదా 1.01 శాతం బలంతో 23.485 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో ట్రెండ్ బుల్లిష్గా ఉందని బులియన్ వర్తకులు చెబుతున్నారు. డాలర్ బలహీనత కారణంగా, చమురు ధరల సెగ కారణంగా బంగారం ధరలు పెరిగాయని ఎనలిస్టుల అంచనా. (అందాల ఐశ్వర్యమా, కింగ్ లాంటి కుర్రాడా? ఎవరు కావాలి?) -
బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం ఆర్బీఐ గవర్నర్
ముంబై: అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల ఎదుదయ్యే ఎటువంటి సవాళ్లనైనా తట్టుకొనగలిగే శక్తి సామర్థ్యాలను భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ మార్కెట్లు కలిగి ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫిమ్డా) వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ, అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునేలా అధిక ఫారెక్స్ నిల్వల (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) పరిస్థితిని పొందడానికి అలాగే భారత్ బ్యాంకింగ్ పటిష్టతకు కేంద్రం, సెంట్రల్ బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం దిగివస్తుంది... దేశంలో ద్రవ్యోల్బణం భయాలు క్రమంగా వచ్చే త్రైమాసికాల్లో తగ్గుతాయని అన్నారు. ఇక దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై ప్రస్తుతం ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని కూడా ఉద్ఘాటించారు. డాలర్ మారకంలో భారత్ కరెన్సీ పతనం విషయంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలతో పోల్చితే భారత్ రూపాయి పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. అలాగే పలు దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బలపడిందనీ పేర్కొన్నారు. కరెన్సీ తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి తగిన అన్ని చర్యలూ సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటుందని అన్నారు. ఇక దేశ పురోగతి, ద్రవ్యోల్బణం కట్టడికి తగిన ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ అనుసరిస్తుందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీపై ప్రభుత్వం– సెంట్రల్ బ్యాంక్ చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రుణ మేళాలతో మొండి బాకీల భారం బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆందోళన ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహించే ’రుణ మేళా’లను వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎంఎస్బీ ఈఎఫ్) ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాల్లో సరైన మదింపు లేకుండా ఇచ్చే రుణాలు.. మొండిపద్దులుగా పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతలు ఈ తరహా లోన్లను తిరిగి చెల్లించడాన్ని మానేస్తున్న ట్లు గత అనుభవాలు చెబుతున్నాయని పేర్కొంది. రుణాల రికవరీ ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీ కూడా సహకరించదని, ఎన్నికల సమయంలో మాత్రం ఓటర్లను ఆకట్టుకునేందుకు రుణాల మాఫీ డిమాండ్ను తెరపైకి తెస్తుంటాయని ఎంఎస్బీఈఎఫ్ వ్యాఖ్యానించింది. మొండిబాకీల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టి, దాన్ని సాకుగా చూపి ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. -
ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడులు కీలకం
ముంబై: దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం ప్రపంచ పరిణా మాలు, విదేశీ పెట్టుబడుల సరళీ స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నా రు. ‘‘దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్, మార్జిన్లపై యాజమాన్యపు వ్యాఖ్యలు, ప్రభుత్వ మూల ధన వ్యయం, గ్రామీణ వృద్ధి తది తర అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల కదలికలు, ఆర్థిక వృద్ధి, సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధాన నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్పై ప్రభావం చేయవచ్చు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 17,450 వద్ద తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోయితే 17,250–17, 150 శ్రేణిలో మరో తక్షణ మద్దతు స్థాయి లభించొచ్చు. ఎగువ స్థాయిలో 17,700 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ మార్కెట్ హెడ్ అపూర్వ సేథ్ తెలిపారు. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు మరోసారి తెరపైకి రావడంతో పాటు దేశీయ జూన్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడంతో గతవారం సూచీలు స్వల్ప నష్టంతో ముగిశాయి. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 31 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లను కోల్పోయాయి. ప్రపంచ పరిణామాలు యూరోజోన్తో పాటు చైనా, జపాన్ దేశాల ఎస్అండ్పీ గ్లోబల్ సర్వీసెస్ కాంపోసైట్ పీఎంఐ డేటా నేడు(సోమవారం) విడుదల అవుతుంది. అమెరికా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలను మంగళవారం వెల్లడించనుంది. యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ, చైనా వాణిజ్య గణాంకాలు బుధవారం వెలువడుతాయి. అదేరోజున ఈసీబీ వడ్డీరేట్ల ప్రకటన, ఫ్రాన్స్ ట్రేడ్ డేటా, జపాన్ జీడీపీ గణాంకాలు, అమెరికా నిరుద్యోగ గణాంకాలు గురువారం విడుదల అవుతాయి. చైనా ద్రవ్యోల్బణ డేటాను శుక్రవారం ప్రకటించనుంది. కీలకమైన ఈ స్థూల ఆర్థిక గణాంకాల నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. 20 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరగడం, క్రూడాయిల్ ధరల స్థిరీకరణల ప్రభావంతో ఆగస్టులో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్పీఐ) భారత ఈక్విటీల్లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇది 20 నెలల్లోనే అత్యధికమని డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. 2020, డిసెంబర్లో వచ్చిన రూ. 62,016 కోట్ల పెట్టుబడుల తర్వాత ఇదే అత్యధికం. అంతకుముందు జూలైలో ఎఫ్పీఐలు దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గతేడాది (2021) అక్టోబర్ నుంచి తొమ్మిది నెలల పాటు ఎఫ్పీఐలు మొత్తం రూ. 2.46 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారు. ‘‘యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందనే స్పష్టత వచ్చింది. ఆగస్టుతో పోలిస్తే పెట్టుబడుల వేగం తగ్గినప్పటికీ ప్రస్తుత నెల(సెప్టెంబర్)లోనూ ఎఫ్పీఐ నిధుల రాక కొనసాగవచ్చు. అధిక ద్రవ్యోల్బణం, డాలర్ మారకం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఎఫ్పీఐలను ప్రభావితం చేస్తాయి’’ అని ట్రేడ్స్మార్ట్ చైర్మన్ విజయ్ సింఘానియా తెలిపారు. నేటి నుంచి తమిళ్ మెర్కంటైల్ బ్యాంక్ ఐపీవో తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు జరిగే ఈ ఐపీఓ సెప్టెంబర్ 7న ముగుస్తుంది. ధరల శ్రేణి రూ. 500 – 525గా ఉంది. గతవారాంతాన యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.363 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. ఇష్యూలో భాగంగా 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 832 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. -
నష్టాల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు
బ్యాంకాక్: ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ విక్రయ గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఎక్సే్చంజీ షాంఘై సూచీ ఒక పాయింటు స్వల్ప నష్టపోయి 3,276 వద్ద ఫ్లాటుగా ముగిసింది. సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లు సైతం 0.50–0.20% మధ్య నష్టపోయాయి. తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ అతి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కాగా జపాన్ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడి ఏడు నెలల గరిష్టం 28,871 స్థాయి వద్ద స్థిరపడింది. కోవిడ్ ఆంక్షల సడలింపుతో రెండో క్వార్టర్ నుంచి తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అక్కడి అధికార వర్గాల ప్రకటన మార్కెట్ ర్యాలీకి కారణమైంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నట్లు సంకేతాలు రావడంతో యూరప్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మన్ దేశాల స్టాక్ సూచీలు 0.14–0.16 % మధ్య నష్టపోయాయి. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్టీయస్సీ పావుశాతం పతమైంది. ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు ఈ వారం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. క్రూడాయిల్ ధరల పతనం, ఆర్థిక మాంద్య భయాలతో పాటు నాలుగు వారాల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
పోకో సరికొత్త స్మార్ట్ఫోన్, స్పెషల్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: పోకో మరో కొత్త స్మార్ట్ఫోన్ను గ్లోబల్గా లాంచ్ చేయనుంది. జూన్ 23 సాయంత్రం వర్చువల్ ఈవెంట్లో పోకో ‘ఎఫ్ 4 5జీ’ స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. పోకో బ్రాండింగ్తో ఫ్లాట్ బాడీ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్తో ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు వ్లాగ్ మోడ్ కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ కోసం ఈ స్మార్ట్ఫోన్ లాంచ్ చేస్తున్నట్టు పోకో ట్వీట్ చేసింది. ఫీచర్లు, అంచనాలు ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు రెడ్మి కే40ఎస్కి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో పాటు 7లేయర్ గ్రాఫైట్ షీట్ల లిక్విడ్ కూల్ 2.0, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడిన స్టీరియో స్పీకర్లు , 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉంటాయట. బ్లాక్ అండ్ గ్రీన్ రంగులలో ఇది లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ 12 OS ఆధారిత ఎంఐయుఐ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో కూడిన అమెలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 SoC 12 జీబీ ర్యామ్, 126 జీబీ స్టోరేజ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 ఎంపీ మెయిన్గా, ట్రిపుల్ కెమెరా, దీంతోపాటు పోకో ఎక్స్ 4జీటీ అనే మరో స్మార్ట్ఫోన్ను కూడా లాంచ్ చేయనున్నట్టు పోకో ట్విటర్ ద్వారా వెల్లడించింది. A new thinnest #POCOF4 that's sure to make some big waves. Watch our global launch event on June 23rd for more. See you in two days. #AllTheStrengths pic.twitter.com/6umW3TrZti — POCO (@POCOGlobal) June 21, 2022 పోకో ఎక్స్ 4 జీటీ ఫీచర్లు 6.6అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే మీడియా టెక్ డైమెన్సిటీ 8100 SOC 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64ఎంపీ రియర్ కెమెరా 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Every action will feel a lot more magical when you record moments using Clone Mode on the POCO F4 5G. Get ready to create even cooler videos starting 23-06-2022 - https://t.co/k1MjtkjFVq pic.twitter.com/XZw58DHRaT — POCO India (@IndiaPOCO) June 21, 2022 -
భారీగా క్షీణించిన వెండి, బంగారం ధరలు, కారణం ఏమిటంటే
సాక్షి,ముంబై: ఇటీవలి కాలంలో ఆకాశానికి చేరిన బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్ల సంకేతాలతో దిగి వస్తున్నాయి. బంగారం ధరలతోపాటు వెండి ధర కూడా మంగళవారం క్షీణించింది. అంతర్జాతీయంగా ధరలు ఏడు రోజుల కనిష్టానికి చేరగా, దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా వెయ్యి రూపాయలు పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర 52,760 వద్ద ఉంది. వెండి ధర కిలోకి 1500 రూపాయలు క్షీణించి 61,500గా ఉంది. దేశీయ మార్కెట్లలో మే నెల అంతా వెండి బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రెండు రోజుల క్రితం నెల రోజుల గరిష్టాన్ని తాకిన పసిడి ధర ఈ రెండు రోజుల్లో రూ.1300 మేర తగ్గడం విశేషం. అటు ఎంసీఎక్స్ గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 0.4 శాతం క్షీణించి10 గ్రాముల ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.50,445కి చేరుకుంది. వెండి ధరలు కూడి ఇద్దే బాట పట్టాయి. జూలై ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గి కిలోకు రూ. 59,867 వద్దకు పడిపోయింది. యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేటును దాదాపు 50 బీపీఎస్ పాయింట్లు పెంచననుందని ఇదిడాలర్కు మరింత బలమని పెట్టబడిదారులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణకోసమే వడ్డీ రేటును పెంచనుందని అంచనా. ఇది పసిడి ధరలకు నెగిటివ్గా ఉంటుందని, ఈ స్థాయిలలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనాలో మాంద్యం భయాలు, రికార్డు స్థాయికి బలపడుతున్న డాలరు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక వారం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు తాజా కోవిడ్ ఆంక్షలతో గ్లోబల్గా ఆయిల్ ధరలు లాభనష్టాల మధ్య ఊగిస లాడాయి. గత సెషన్లో 78.03 వద్ద స్థిరపడిన దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం అమెరికా డాలర్తో 78.02 వద్ద ప్రారంభమై 77.98 వద్ద ముగిసింది. ఇక డాలర్ 20 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అటు స్టాక్మార్కెట్లో సోమవారం నాటి బ్లడ్ బాత్ ఛాయలు మంగళవారం కూడా కనిపించాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిస లాడిన సూచీలు చివరకు కనీస మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. -
తగ్గిన బంగారం, భారీగా తగ్గిన వెండి ధర
సాక్షి,ముంబై: గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పుంజుకున్న నేపథ్యంలో మంగళవారం దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు మరో విలువైన మెటల్ వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఈ వారం చివర్లో అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఎంసీఎక్స్లో బంగారం10 గ్రాముల ధర రూ. 50,862గా ఉండగా, వెండి కిలో ధర 61,830కి చేరుకుంది. అటు హైదరాబాద్లో పది గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర 270 రూపాయలు తగ్గి 51,930గా ఉంది. వెండి కిలో ధర సుమారు 800 రూపాయలు తగ్గి రూ. 67770 పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లలో పసిడి ఔన్సు ధర 1842 డాలర్ల వద్ద వారం కనిష్టానికి చేరింది. వెండి 0.6 శాతం పడి 21.92 డాలర్లుగా ఉంది. గత నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 5.5శాతంగా ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేస్తుండగా, 6శాతానికి పైనే నమోదు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా అధిక చమురు ధరల రూపంలో రిస్క్ ఉంటుందని అంచనా. పెరుగుతున్న ఇంధన ధరలు, ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతుల అనిశ్చితి, ఉత్తర కొరియా టెన్షన్లాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ప్రపంచవృద్ధి ఆందోళనల మధ్య పసిడి ధర 1850 డాలర్లు సమీపంలో కదలాడవచ్చని, అయితే అమెరికా డాలర్ బలం గోల్డ్ ధరలపై ఒత్తిడిని కొనసాగుతుందని కోటక్ సెక్యూరిటీస్లోని విపి- హెడ్ కమోడిటీ రీసెర్చ్ రవీంద్ర రావు అన్నారు. #Gold and #Silver Opening #Rates for 07/06/2022#IBJA pic.twitter.com/BYWCDRNpYu — IBJA (@IBJA1919) June 7, 2022 -
గ్లోబల్ మార్కెట్లపై గోధుమ ఎగుమతుల నిషేధ ప్రభావం నిల్: కేంద్ర మంత్రి
దావోస్: భారతదేశ గోధుమ ఎగుమతులు ప్రపంచ వాణిజ్యంలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కమోడిటీ ఎగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై ఎంతమాత్రం ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. బలహీన అలాగే పొరుగు దేశాలకు ఎగుమతులను భారతదేశం కొనసాగిస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతర్జాతీయ గోధుమల మార్కెట్లో భారతదేశం ఎప్పుడూ కీలకప్రాత్ర పోషించలేదని వివరించారు. ఇంకా చెప్పాలంటే రెండేళ్ల క్రితం వరకూ భారత్ గోధుమలను ఎగుమతే చేయలేదని తెలిపారు. దేశం 2 మిలియన్ టన్నులతో ఎగుమతులను ప్రారంభించిందని, గత సంవత్సరం ఈ పరిమాణం ఏడు మిలియన్ టన్నులుగా ఉందని గోయల్ చెప్పారు. ఉక్రెయిన్–రష్యాల మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడిన తర్వాత గత రెండు నెలల్లో దేశ గోధుమ ఎగుమతులు పెరిగినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో జరిగిన సెషన్లో అన్నారు. మొదట్లో ఉత్పత్తి దాదాపు 7 లేదా 8 శాతం పెరుగుతుందని భారత్ అంచనా వేసిందన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చాలా తీవ్రమైన వేడి వాతావరణం వల్ల ఉత్పత్తిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించడానికి, అలాగే పొరుగు, బలహీన దేశాల ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం గోధుమ ఎగుమతులను మే 13న నిషేధించింది. అయితే, ఇతర దేశాల (వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా) ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి, ప్రభుత్వం అనుమతుల మేరకు ఎగుమతులకు వెసులుబాటు కల్పించింది. ఉత్పత్తి-గుమతి ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ గోధుమల ఎగుమతులు 7 మిలియన్ టన్నులు. దీని విలువ 2.05 బిలియన్ డాలర్లు. విదేశాల నుండి భారత్ గోధుమలకు మెరుగైన డిమాండ్ ఉంది. మొత్తం గోధుమ ఎగుమతుల్లో 50 శాతం సరుకులు గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్కు ఎగుమతయ్యాయి. గోధుమ పంటపై మే 14న వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రకటన ప్రకారం, 2021–22 పంట సంవత్సరంలో (జూలై–జూన్) దిగుబడి అంచనా పరిమాణం 111.32 మిలియన్ టన్నులు. అయితే 105–106 మిలియన్ టన్నులకు పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. 2020–21 పంట కాలంలో ఉత్పత్తి 109 మిలియన్ టన్నులు. India wheat exports are less than 1% of world trade and our export regulation should not affect global markets. We continue to allow exports to vulnerable countries and neighbors. pic.twitter.com/N61929BNt5 — Piyush Goyal (@PiyushGoyal) May 25, 2022 -
గ్లోబల్ సంకేతాలు: లాభాల్లో స్టాక్మార్కెట్..అయినా
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య ఇండియన్ మార్కెట్లు గురువారం ఓపెనింగ్లో లాభాల శుభారంభాన్ని చేశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు ఎగిసి 54,053 వద్దకు చేరుకోగా ఎన్ఎస్ఇ నిఫ్టీ 85 పాయింట్లు ఎగబాకి 16,111 వద్ద ట్రేడయింది. కానీ ఎఫ్ అండ్వో ఎక్స్పైరీ కావడంతో ట్రేడర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 54 దిగువకు చేరింది. బ్యాంక్, ఫైనాన్షియల్ ఐటీ షేర్లు లాభపడుతున్నాయి. హెచ్డీఎఫ్సీ భారీ లాభాల్లో కొనసాగుతుండగా, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, నెస్లే ఇండియా, హిందాల్కో, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా టాప్ గెయినర్లలో ఉన్నాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, మారుతీ, ఐటీసీ, ఎంఅండ్ఎం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం సెన్సెక్స్ 303 పాయింట్లు క్షీణించి,53,749 వద్ద , నిఫ్టీ 99 పాయింట్లు నష్టంతో 16,026 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
మార్కెట్పై యుద్ధ మేఘాలు
ముంబై: రష్యా – ఉక్రెయిన్ దేశ సరిహద్దుల్లో కమ్ముకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనాన్ని శాసించాయి. ప్రపంచ చమురు అవసరాలను తీర్చడంతో కీలకపాత్ర పోషిస్తున్న ఈ దేశాల మధ్య ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయి 95 డాలర్లకు చేరింది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను మార్చి కంటే ముందుగానే పెంచవచ్చనే భయాలు వెంటాడాయి. దీంతో ఆసియా మార్కెట్ల నుంచి యూరప్ సూచీలు, అమెరికా ఫ్యూచర్ల వరకు నష్టాల కడలిలో కుంగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్పైనా ఆ ప్రభావం కనిపించింది. ఇక దేశీయ ప్రతికూలతలను పరిశీలిస్తే.., ఇంటర్ బ్యాంక్ పారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 24 పైసలు నష్టపోయి 9 వారాల కనిష్ట స్థాయి 75.60కి పడిపోయింది. దేశీయ మార్కెట్లో సోమవారం ఎఫ్ఐఐలు రూ.4,254 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాది తొలి నెల జనవరి హోల్సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,747 పాయింట్లు క్షీణించి 56,406 వద్ద స్థిరపడింది. గతేడాది(2021) ఫిబ్రవరి 26 తరువాత ఈ సూచీకిదే అతిపెద్ద నష్టం. నిఫ్టీ 532 పాయింట్లు పతనమైన ఈ ఏడాదిలో తొలిసారి 17,000 స్థాయి దిగువన 16,843 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలోని మొత్తం 19 రంగాల ఇండెక్సులు నష్టపోయాయి. అత్యధికంగా మెటల్, బ్యాంకింగ్ షేర్ల సూచీలు ఐదుశాతానికి పైగా క్షీణించాయి. విస్తృతస్థాయిలో అమ్మకాలు జరగడంతో స్మాల్, మిడ్, లార్జ్క్యాప్ ఇండెక్సులు నాలుగు చొప్పున నష్టపోయాయి. ఆసియాలో స్టాక్ సూచీలన్నీ ఒకశాతం నుంచి రెండున్న శాతం నష్టపోయాయి. యూరప్లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మార్కెట్లు 1.50%– 3% చొప్పున క్షీణించాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండున్నర శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. ఆదిలోనే హంసపాదు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 1,433 క్షీణించి 56,720 వద్ద, నిఫ్టీ 299 పాయింట్ల పతనంతో 17,375 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. భారీ నష్టాల నేపథ్యంలో దిగువస్థాయిల వద్ద కొంత కొనుగోళ్ల మద్దతు లభించినా.., ఆదిలోనే హంసపాదులాగా విక్రయాలు వెల్లువెత్తడంతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. ఒక దశలో సెన్సెక్స్ 1,858 పాయింట్ల నష్టంతో 56,295 వద్ద, నిఫ్టీ 565 పాయింట్లను కోల్పోయి 16,810 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలకు దిగివచ్చాయి. లాభాలు ఒక్క షేరుకే... సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఒక్క టీవీఎస్(ఒకశాతం లాభం) మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండెక్సుల్లో దిగ్గజాలైన టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ షేర్లు అత్యధికంగా ఐదున్నర శాతం క్షీణించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్బ్యాంక్, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, విప్రో షేర్లు నాలుగు శాతం నష్టపోయాయి. సూచీలో అధిక వెయిటేజీ షేరు రిలయన్స్ షేరు రెండు శాతం నష్టపోయింది. రెండురోజుల్లో రూ.12.43 లక్షల కోట్లు... ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు, ప్రపంచ ప్రతికూలతలతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాల్ని చవిచూశాయి. సెన్సెక్స్ సూచీ 2,520 పాయింట్లు, నిఫ్టీ 763 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీల భారీ పతనంతో గడిచిన రెండురోజుల్లో బీఎస్ఈలో రూ.12.43 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. గతవారాంతపు రోజైన శుక్రవారం రూ. 3.91 లక్షల కోట్లు, ఈ సోమవారం రూ.8.47 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.255 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘ఊహించినట్లే ప్రపంచ ప్రతికూలతలు దేశీయ మార్కెట్ పతనాన్ని శాసించాయి. కొన్ని వారాల స్థిరీకరణ తర్వాత మార్కెట్పై బేర్స్ పట్టు సాధించాయి. రష్యా – ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. పెరుగుతున్న క్రూడ్ ధరలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. రానున్న రోజుల్లో సూచీలకు అంతర్జాతీయ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయి’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 23 శాతం ఎగసి 22.98 స్థాయికి చేరుకుంది. ► నష్టాల మార్కెట్లో టీసీఎస్ షేరు మాత్రమే ఒకశాతం లాభపడి రూ.3734 వద్ద ముగిసింది. బైబ్యాక్ రికార్డు తేదీ(ఫిబ్రవరి 23)ని ప్రకటించడం షేరు రాణించేందుకు కారణమైంది. ► స్పైస్జెట్ ఆఫర్ను కళానిధి మారన్ తిరస్కరించడంతో ఆ షేరు ఐదున్నర శాతం క్షీణించి రూ.59 వద్ద స్థిరపడింది. ► బ్యాంకింగ్ షేర్ల పతనంలో భాగంగా ఐసీఐసీఐ షేరు పదినెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. బీఎస్ఈలో 5% పతనమై రూ.754 వద్ద ముగిసింది. -
ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రపంచ పరిణామాలు...! స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయా..?
ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత వార్తలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశా నిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్, ఓపెక్ సమావేశ నిర్ణయాలపై మార్కెట్ వర్గాలు ఓ కన్నేయొచ్చు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది(2021) చివరి వారంలో మార్కెట్ తీవ్ర అస్థిరతను ఎదుర్కొన్నప్పటికీ.., రెండు శాతం ర్యాలీ చేసింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 1,130 పాయింట్ల, నిఫ్టీ 350 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘గత రెండు వారాలుగా మార్కెట్ రికవరీ దశలో ఉంది. అయినంత మాత్రాన పరిస్థితులు చక్కబడ్డాయనే అంచనాకు రావడం తగదు. ఒమిక్రాన్ వేరియంట్ అసాధారణ వేగంతో వ్యాప్తి చెందుతోంది. ట్రేడర్లు అప్రమతత్త వైఖరి కొనసాగిస్తూ.., రక్షణాత్మకంగా హెడ్డింగ్ పొజిషన్లను తీసుకోవడం ఉత్తమం. సాంకేతికంగా నిఫ్టీ నిర్ణయాత్మకమైన 17350 స్థాయిని చేధించి 17354 వద్ద ముగిసింది. అప్ట్రెండ్ కొనసాగితే 17,650 వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులతో అమ్మకాలు జరిగితే దిగువస్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది.’’ రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తే.., ఒమిక్రాన్ ప్రభావం.. ఒమిక్రాన్ వేరియంట్ రోజుకు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. గతేడాది అక్టోబర్ రెండో తేదీ తర్వాత అత్యధిక ఈ ఏడాది తొలిరోజు(జనవరి 1న) 22,775 కేసుల నమోదయ్యాయి. కేసుల కట్టడికి దేశంలో ఇప్పటికే ప్రధాన రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆంక్షలను మరి కొంతకాలం పొడిగించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా అమెరికా, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, అర్జెంటీనా, కెనడా దేశాల్లో రోజుకు రెండు లక్షల చొప్పున కేసులు నమోదుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగితే ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిళ్లు పెరిగి, అనిశ్చితికి దారి తీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ ముందుగా ఇప్పటికే విడుదలైన డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలు, జీఎస్టీ వసూళ్లపై స్పందించాల్సి ఉంది. భారత్తో పాటు యూరోజోన్, అమెరికాలు నేడు (సోమవారం) డిసెంబర్ మార్కిట్ మాన్యుఫ్యాక్చరింగ్ డేటాను విడుదల చేయనున్నాయి. ఇవే దేశాలు బుధవారం(జనవరి 5న) సేవా రంగ పీఎంఐ గణాంకాలు ప్రకటించనున్నాయి. ఓపెక్ దేశాలు సమావేశం మంగళవారం జరగనుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పా లసీ కమిటీ మినిట్స్ బుధవారం వెలువడున్నాయి. యూరోజోన్ రిటైల్ డేటా.., అమెరికా ఉద్యోగ గ ణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ కీ లకమైన ఈ స్థూల గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. విదేశీ, దేశీయ విక్రయాల ప్రభావం గత రెండు నెలల ట్రెండ్ను కొనసాగిస్తూ డిసెంబర్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. మొత్తం రూ.35,494 ల కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నా యి. 2021 ఏడాదిలో రూ.91,600 కోట్ల షేర్లను ఉపసంహరించుకున్నారు. ఎఫ్ఐఐల వరుస విక్ర యాలు సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు)ను ప్రభావితం చేయలేకపోయాయి. డీఐఐలు డిసెంబర్లో రూ.31,231 కోట్ల షేర్లను, గత సంవత్సరంలో రూ.94,800 కోట్ల కొన్నారు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ ఎన్నికలు, ఒమిక్రాన్ కేసులు, వడ్డీరేట్ల వంటి పరిణామాల నేపథ్యంలో., భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకం కానుంది. చదవండి: కొత్త ఏడాదిలో భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..! -
చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..!
Elon Musk Sell Tesla Shares: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చెప్పినట్లే చేశాడు..అన్నట్లుగానే టెస్లా 10 శాతం షేర్లను పూర్తిగా అమ్మేశాడు.ఈ ఏడాది నవంబర్ ప్రారంభం నుంచి టెస్లాకు చెందిన 15 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. మస్క్ తన షేర్ల అమ్మకాలను దాదాపు పూర్తి చేసినట్లు బుధవారం చెప్పాడు. నియమాల ప్రకారమే..! టెస్లాకు చెందిన పదిశాతం షేర్లను పూర్తిగా అమ్మేసినట్లు మంగళవారం అమెరికాకు చెందిన వెబ్సైట్ బాబిలోన్ బీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ పేర్కొన్నాడు. షేర్ల అమ్మకాలకు సంబంధించిన నియమాల మేరకు షేర్లను విక్రయించనట్లు తెలిపాడు. కారణం అదే..! ఇటీవల వాషింగ్టన్లో డెమోక్రాట్లు బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘సోషల్ స్పెండింగ్ ప్లాన్’ కోసం సెనేటర్లు ఒక ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం.. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేయొచ్చు. దీంతో పన్నుల భారం తగ్గించుకునేందుకే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. 10 శాతం టెస్లా షేర్లను అమ్మకాలతో స్పేస్ఎక్స్లో మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఎలన్ మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. టెస్లా షేర్ల అమ్మకాలపై విచారణ..! టెస్లా షేర్ అమ్మకాల విషయంలో డేవిడ్ వాగ్నెర్ అనే షేర్ హోల్డర్, టెస్లా, ఎలన్ మస్క్పై అమెరికా సెక్యూరిటీస్ రెగ్యులేటర్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టెస్లాబోర్డు సభ్యులు వారి విశ్వసనీయ విధులను పాటించడంలో విఫలమయ్యారనే విషయంపై దర్యాప్తు చేయాలని కోర్టులో దావా వేశాడు. ఈ దావా అమెరికాలోని డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో వ్యాజ్యం దాఖలు చేశారు. స్టాక్ విక్రయాలపై ఎలన్ వేసిన ట్విట్స్పై సమీక్ష జరపాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు. చదవండి: ‘ఎలన్మస్క్, టెస్లాపై విచారణ చేయాల్సిందే..!’ -
ప్రపంచ మార్కెట్లను వెంటాడిన ఒమిక్రాన్!
ముంబై: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు మరోమారు ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయి. ఈ కొత్త రకం కేసుల సంఖ్య అంతకంతా పెరగడానికి తోడు ప్రపంచ మార్కెట్లలో అనూహ్య అమ్మకాలతో భారత మార్కెట్లో మరో ‘‘బ్లాక్ మండే’’ నమోదైంది. వైరస్ కట్టడికి ఆయా దేశాల లాక్డౌన్ల విధింపులు ఆర్థిక రికవరీ విఘాతం కలిగించవచ్చనే ఆందోళనల ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గు చూపుతుండటం.., విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయ ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 56 వేల స్థాయిని కోల్పోయి 1,189 పాయింట్ల నష్టంతో 55,822 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 371 పాయింట్లు క్షీణించి 16,614 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 23 తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టాల ముగింపు. శాతం పరంగా చూస్తే.., సెన్సెక్స్ మూడుశాతం, నిఫ్టీ రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో 2 షేర్లు.. నిఫ్టీ50 షేర్లలో 4 షేర్లే లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల పెద్ద మొత్తంలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లను విక్రయిస్తుండటంతో ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో పాటు యూఎస్ నాస్డాక్ ఇండెక్స్ పతన ప్రభావంతో దేశీ ఐటీ షేర్లు పతనమయ్యాయి. ఆర్థిక వృద్ధి ఆందోళనలతో మెటల్, మౌలిక రంగ షేర్లు కరిగిపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ ఇండెక్స్లు మూడున్నర శాతం నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,565 కోట్ల షేర్లను అమ్మేయగా.., విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,764 కోట్ల షేర్లను కొన్నారు. సోమవారం సెషన్ సాగింది ఇలా..! ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 495 పాయింట్ల పతనంతో 56,517 వద్ద, నిఫ్టీ 161 పాయింట్లు క్షీణించి 16,824 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. తొలి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 1879 పాయింట్ల పతనమై 55,132 వద్ద, నిఫ్టీ 575 పాయింట్లు నష్టపోయి 16,410 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ స్థాయిలు సూచీలకు ఎనిమిది నెలల కనిష్టస్థాయిలు కావడం గమనార్హం. మిడ్ సెషన్ తర్వాత ఆయా షేర్లకు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో రికవరీ బాట పట్టాయి. ఫలితంగా సూచీల నష్టాలు ఎనిమిది నెలల కనిష్టం నుంచి 4 నెలల కనిష్టానికి పరిమితమయ్యాయి. ► అమెజాన్తో కుదిరిన ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిలివేయడతో ఫ్యూచర్ లైఫ్స్టైల్ (20%), ఫ్యూచర్ రిటైల్ (19.92%), ఫ్యూచర్ కన్జ్యూమర్ (19.91%) షేర్లు రాణించి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. ► ఇటీవల లిస్టయిన నైకా, కార్ట్రేడ్, జొమాటో పేటీఎంలు (న్యూ ఏజ్ స్టాక్లు) ఎనిమిది శాతం క్షీణించాయి. నష్టాలకు నాలుగు కారణాలు... ► వణికించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ ఇన్వెస్టర్లలో భయాలను సృష్టిస్తోంది. యూరప్లో కేసులు పెరగడంతో ఆయా దేశాలు లాక్డౌన్ యోచనలు చేస్తున్నాయి. రెండు కోవిడ్ వ్యాక్సిన్లతో పాటు బూస్టర్ షాట్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఇటీవల అమెరికా ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ కేసుల పెరిగింది. వైరస్ వ్యాప్తి కట్టడికి అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు అమలు కావచ్చని అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ► వడ్డీ రేట్ల పెంపు భయాలు ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాలు వడ్డీరేట్ల పెంపునకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను పెంచగా.., వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కీలకరేట్ల పెంపును ప్రారంభిస్తామని యూఎస్ ఫెడ్ ప్రకటించింది. దీంతో ఫలితంగా ఈ ఏడాదిలో అత్యుత్తమ స్థాయికి డాలర్ ఇండెక్స్ చేరింది. అధిక వడ్డీ రేట్ల భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్ సూచీలపై పడింది. ► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో సెంటిమెంట్ బలహీనపడింది. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,696 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఒమిక్రాన్ పరిణామాలు, అధిక వాల్యూయేషన్లు, ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు దిశగా యోచనలు చేస్తుండటంతో ఎఫ్ఐఐలు భారత్ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ► ప్రపంచ మార్కెట్ల పతనం క్రిస్మస్, నూతన సంవత్సర సీజన్కు ముందు ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు 2% క్షీణించాయి. కేసుల కట్టడికి ఐరోపా దేశాల్లో మరోమారు లాక్డౌన్ విధింపు ఉండొచ్చనే వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ లాక్డౌన్ విధించింది. పండుగ వేళ లాక్డౌన్లు, ఆంక్షల నిర్ణయాలు వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయాలు ఈక్విటీ మార్కెట్ల పతనానికి కార ణమయ్యాయి. ఆసియాలో చైనా, జపాన్ దేశాల స్టాక్ సూచీలు 2% వరకు క్షీణించాయి. యూరప్లో ఇటలీ, ఫ్రాన్, బ్రిటన్ మార్కెట్లు 2–1% నష్టపోయాయి. యూఎస్ మార్కెట్లు 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. డిస్కౌంట్లో శ్రీరాం ప్రాపర్టీస్ లిస్టింగ్ శ్రీరాం ప్రాపర్టీస్ షేర్లు లిస్టింగ్ రోజు నష్టాలను పంచాయి. ఇష్యూ ధర రూ.118తో పోలిస్తే బీఎస్ఈలో 24 శాతం క్షీణించి రూ.94 వద్ద లిస్టయ్యాయి. ఒక దశలో 22 శాతం మేర పతనమైన రూ.92 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 16% నష్టంతో రూ.118 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.1,686 కోట్ల వద్ద స్థిరపడింది. రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్లో గడచిన రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. సూచీలు సోమవారం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో ఈ ఒక్క రోజే రూ.6.81 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.252 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 2078 పాయింట్లు, నిఫ్టీ 634 పాయింట్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో 1879 పాయింట్లు డౌన్ 55,132కు పతనం ముగింపు 1190 పాయింట్లు డౌన్ 55,822 వద్ద క్లోజ్ -
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కార్ సంచలన నిర్ణయం..!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎఈలోని ఉద్యోగుల పనిదినాలను అక్కడి ప్రభుత్వం మార్చింది. ఉద్యోగులు ఇక వారానికి నాలుగున్నర రోజుల మాత్రమే పనిచేయవచ్చునని పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో పోటీతత్వాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో శని, ఆదివారాలను వారాంతపు సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమలులోకి రానుంది. యూఏఈలో శుక్రవారం, శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. ఇకపై ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం సెలవు కావడంతో ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా సెలవు ప్రకటించడానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2022జనవరి 1వ తేదీ నుంచి వారాంతపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆదివారం ముగిసే వరకు కొనసాగుతాయి. యూఏఈ ఆర్థిక వ్యవస్థను సౌదీకి పోటీగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు విదేశీ పెట్టుబడులను, ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఇప్పటికే గతేడాది పలు నిర్ణయాలు తీసుకొంది. మొదటి దేశంగా యూఎఈ రికార్డు..! ప్రపంచంలో ఐదు రోజుల కంటే తక్కువ జాతీయ పని వారాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం యూఎఈగా నిలుస్తోందని డబ్లూఏఎం తెలిపింది. మాజీ బ్రిటీష్ ప్రొటెక్టరేట్ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వారంలోపే ప్రకటించడం విశేషం. 2006 వరకు గురువారం-శుక్రవారం సెలవులుగా ప్రకటించగా...అది శుక్ర, శనివారాలకు ప్రైవేట్ రంగానికి అనుమతినిచ్చింది. చదవండి: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి -
ఫలితాలు, ప్రపంచ సంకేతాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం(18–22) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ సంకేతాలపై ఆధారపడి కదలనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై మరిన్ని కంపెనీలు ఆర్థిక పనితీరును వెల్లడించనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ తదితర ఐటీ బ్లూచిప్ కంపెనీలతోపాటు ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ బాటలో ఫలితాల సీజన్ మరింత వేడెక్కనున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2 జాబితా ఇలా ఈ వారం రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న దిగ్గజాల జాబితాలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీతోపాటు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఇవేకాకుండా జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్తాన్ జింక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ సైతం క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇక మరోవైపు చైనా క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెపె్టంబర్ నెలకు యూఎస్పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. సెంటిమెంటుపై ఎఫెక్ట్ ఈ వారం దలాల్ స్ట్రీట్లో త్రైమాసిక ఫలితాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. తదుపరి కాలానికి కంపెనీలు ప్రకటించే ఆదాయ అంచనాలు(గైడెన్స్) తదితరాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆయా కంపెనీలు విడుదల చేసే ప్రోత్సాహకర లేదా నిరుత్సాహకర ఫలితాల ఆధారంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. వారాంతాన ఫలితాలు వెలువడిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎవెన్యూ సూపర్మార్ట్స్ కౌంటర్లలో నేడు(సోమవారం) అధిక యాక్టివిటీ నమోదుకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటితోపాటు ఈ వారం ఎఫ్ఎంసీజీ, సిమెంట్ దిగ్గజాలుసహా ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ తదితర ఫలితాలు మార్కెట్లను నడిపించే వీలున్నట్లు అంచనా వేశారు. కరెక్షన్ తదుపరి కొద్ది రోజుల దిద్దుబాటు తదుపరి ఈ వారం గ్లోబల్ మార్కెట్లు జోరందుకునే వీలున్నట్లు సంతోష్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఫలితాలకు ఇవి జత కలిసే అవకాశమున్నట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగం కీలకంగా నిలవనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు క్యూ2 పనితీరు వెల్లడించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ ఆర్జనల్లో పటిష్ట రికవరీపట్ల పెరుగుతున్న అంచనాలు మార్కెట్లలో బుల్ రన్ కొనసాగేందుకు దోహదపడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్ అంచనాలు విఫలమైతే ఆయా రంగాలలో స్వల్పకాలానికి దిద్దుబాటు జరగవచ్చని అంచనా వేశారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ఇటీవల జోరు చూపుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడుల తీరు తదితర అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. కాగా.. గత గురువారం ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,247 పాయింట్లు(2 శాతం) పుంజుకోవడం ద్వారా మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో నిఫ్టీ 18,000 పాయింట్ల మార్క్ ఎగువన నిలిచింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గత శుక్రవారం మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. రుణ మార్కెట్లో ఎఫ్పీఐల అమ్మకాలు అక్టోబర్లో నికరంగా వెనకడుగు అక్టోబర్లో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా నిలిచారు. గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్కు విరుద్ధంగా ఎఫ్పీఐలు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు రూపాయి మారకపు విలువ పతనం, ప్రపంచ పరిణామాలు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్పీఐలు రూ. 1,472 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా రుణ(డెట్) మార్కెట్లో అమ్మకాల ట్రెండ్ నమోదైంది. ఫలితంగా రూ. 1,698 కోట్లు విలువైన సెక్యూరిటీలను విక్రయించారు. ఇదేసమయంలో మరోపక్క రూ. 226 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు. -
ఐఫోన్13 ఎంట్రీతో షావోమీకు భారీ షాక్...!
ఎట్టకేలకు గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లలో ఆపిల్ ప్రముఖ చైనీస్ కంపెనీ షావోమీని అధిగమించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (క్యూ 3) ఆపిల్ 15 శాతం వాటాతో గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్కు వీపరితమైన డిమాండ్ రావడంతో షావోమిను వెనక్కి నెట్టేసింది. ఎప్పటిలాగానే శాంసంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లలో శాంసంగ్ 23 శాతం వాటాను దక్కించుకుంది. చదవండి: నోకియా నుంచి టఫెస్ట్ స్మార్ట్ఫోన్...! లాంచ్ ఎప్పుడంటే.. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ అందించిన ప్రాథమిక డేటా ప్రకారం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లలో షావోమీ 14 శాతం వాటాను దక్కించుకోగా వివో, ఒప్పో స్మార్ట్ఫోన్స్ 10 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 6 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. చిప్స్ కొరత.. అంతర్జాతీయంగా సెమికండక్టర్స్ కొరతతో పలు దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలు తీవ్రంగా సతమతమయ్యాయి. చిప్స్ కొరత ఉన్నప్పటికీ పలు స్మార్ట్ఫోన్ కంపెనీలు ఉత్పత్తి విషయంలో రాజీ పడలేదు. చిప్స్ కొరత పలు స్మార్ట్ఫోన్ కంపెనీలు ఫోన్ ధరలను కూడా పెంచాయని కానలిస్ ప్రిన్సిపల్ ఆనలిస్ట్ బెన్ స్టాన్టాన్ వెల్లడించారు. స్మార్ట్ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత 2022 వరకు వేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు -
క్యూ1 ఫలితాలు, ప్రపంచ పరిణామాలే కీలకం
ముంబై: కార్పొరేట్ల తొలి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకంగా మారొచ్చని చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికల అంశాలు సైతం ట్రేడింగ్ ప్రభావితం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు. అలాగే కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మార్కెట్ సోమవారం ముందుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక గణాంకాలు, రిలయన్స్ – జస్ట్ డయల్ విలీన ప్రక్రియ అంశాలపై స్పందించాల్సి ఉంటుంది. బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. కావున ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ‘‘దేశీయంగా సానుకూల సంకేతాలు నెలకొన్నప్పటికీ.., ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. సూచీల తాజా గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. ఈ అంశాలు ఒడిదుడుకుల ట్రేడింగ్ను ప్రేరేపించవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,950 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది’’ అని ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నిరాలి షా తెలిపారు. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కావడంతో పాటు కంపెనీలు ఆశాజన ఆర్థిక ఫలితాల ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో నెలరోజుల తర్వాత గతవారంలో సూచీలు తిరిగి సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఆర్థిక, బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, మెటల్స్ షేర్లు రాణిండంతో క్రితం వారంలో సెన్సెక్స్ 754 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లను ఆర్జించగలిగాయి. కీలక దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సందడి... దేశీయ కార్పొరేట్ల తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల ప్రకటన సందడి కీలక దశకు చేరుకుంది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాలకు చెందిన అనేక పెద్ద కంపెనీలు ఈ వారంలో తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఐసీసీఐ బ్యాంకులతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్లోని మొత్తం పది కంపెనీలున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. నేడు రెండు లిస్టింగ్లు... ఇటీవల ఐపీఓ ఇష్యూలను పూర్తి చేసుకున్న రోడ్ల నిర్మాణ సంస్థ జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ క్లీన్ సైన్స్ టెక్నాలజీ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్కానున్నాయి. గ్రే మార్కెట్లో ఇరు కంపెనీల షేర్లు 55–60 శాతం ప్రీమియం ధర పలుకుతున్నాయి. కావున లాభదాయక లిస్టింగ్కు అవకాశం ఉందని ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై తొలి భాగంలో రూ.4,515 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. సూచీలు రికార్డు గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
ఆర్థిక గణాంకాల లాభాలు
ముంబై: సానుకూల ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు స్టాక్ మార్కెట్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవ్వడం కూడా కలిసిరావడంతో ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా 397 పాయింట్లు పెరిగి 52,769 పాయింట్ల వద్ద స్థిరపడింది. దీంతో మూడురోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. అలాగే మే 31 తర్వాత ఈ సూచీ ఒకరోజులో అత్యధిక లాభాలను గడించింది. మరో సూచీ నిఫ్టీ 120 పాయింట్లు ఎగసి 15,812 వద్ద నిలిచింది. ఇండెక్స్ల్లో అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడం సూచీలకు అధిక లాభాలొచ్చాయి. లార్జ్ క్యాప్తో పాటు అధిక నాణ్యత కలిగిన మిడ్క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ క్యూ1 ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)కు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 30 షేర్లలో తొమ్మిది షేర్లు నష్టపోగా, మిగిలిన షేర్లన్నీ లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.114 కోట్ల షేర్లను., దేశీయ ఇన్వెస్టర్లు రూ.344 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ తొమ్మిది పైసలు బలహీనపడి 74.49 వద్ద స్థిరపడింది. ‘‘మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. పతనాన్ని నాణ్యమైన షేర్ల కొనుగోళ్లకు అవకాశంగా మలుచుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీ 15,750 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,915 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది’’ రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. ఇంట్రాడేలో స్థిరమైన కొనుగోళ్లు... ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 322 పాయింట్ల లాభంతో 52,695 వద్ద మొదలైంది. నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 15,794 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. భారీ లాభాల ప్రారంభం నేపథ్యంలో తొలుత కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అయితే జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. ఒక దశలో సెన్సెక్స్ 434 పాయింట్లు ర్యాలీ చేసి 52,807 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 15,821 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. లాభాలు ఎందుకంటే... ఆర్థిక గణాంకాల ఉత్సాహం: ఈ ఏడాది మేలో పారిశ్రామికోత్పత్తి 29.3 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే మేలో ఐఐపీ గణాంకాలు 33.4 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలతో పోలిస్తే జూన్లో దిగివచ్చింది. సమీక్షించిన నెలలో 6.26%గా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగిరావడం, పారిశ్రామికోత్పత్తి ఊపందుకోవడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది. ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు: ఆసియాలో ఒక్క ఇండోనేషియా తప్ప మిగిలిన అన్ని దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు్ల లాభాలతో ముగిశాయి. చైనా మెరుగైన ఆర్థిక గణాంకాలను ప్రకటించడంతో పాటు అక్కడి టెక్నాలజీ కంపెనీలు రాణించడంతో ఆసియా మార్కెట్లు రాణించాయి. రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో యూరప్తో పాటు యూఎస్ మార్కెట్లు జీవితకాల సరికొత్త రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. -
ఏప్రిల్ 1 విడుదల... ధర దడ
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ వడ్డింపు ఉండనుంది. ఓపెన్–సెల్ ప్యానెళ్లు ఖరీదు కావడమే ఇందుకు కారణం. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం వరకు అధికమైందని కంపెనీలు అంటున్నాయి. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెంచాలని ప్యానాసోనిక్, హాయర్, థామ్సన్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎల్జీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 5–7 శాతం ధర పెరిగే చాన్స్ ఉంది. టీవీ స్క్రీన్ తయారీలో ఓపెన్–సెల్ ప్యానెల్ అత్యంత కీలక విడిభాగం. మొత్తం ధరలో దీని వాటాయే అధికంగా 60% వరకు ఉంటుంది. కంపెనీలు టెలివిజన్ ప్యానెళ్లను ఓపెన్–సెల్ స్థితిలో దిగుమతి చేసుకుంటాయి. చైనా సంస్థలే ఓపెన్–సెల్ తయారీ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇక అప్లయెన్సెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో టీవీలదే అగ్రస్థానం. దేశంలో ప్రస్తుతం ఏటా 1.7 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటి విలువ రూ.25,000 కోట్లు. 2024–25 నాటికి మార్కెట్ 2.84 కోట్ల యూనిట్లకు చేరుతుందని సియామా, ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ అంచనా. మరో మార్గం లేకనే..: ప్యానెళ్లు ప్రియం అవుతూనే ఉన్నందున టీవీల ధర కూడా అధికం అవుతుందని ప్యానాసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి టీవీల ధర వచ్చే నెలకల్లా 5–7 శాతం అధికం కానుందని ఆయన వెల్లడించారు. ధరల సవరణ తప్ప తమకు మరో మార్గం లేదని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఓపెన్–సెల్ ప్రైస్ గణనీయంగా పెరిగిందని, ట్రెండ్ ఇలాగే కొనసాగనుందని అన్నారు. ఓపెన్–సెల్కు అనుగుణంగా టీవీల ధరలను సవరించాల్సిందేనని స్పష్టం చేశా రు. తాము టీవీల ధరను పెంచడం లేదని ఎల్జీ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిలో ధరలను సవరించామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం అప్లయెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తెలిపారు. వాటికి కొరత ఉన్నందునే.. మార్కెట్లో ఓపెన్–సెల్ ప్యానెళ్లకు కొరత ఉందని సూపర్ ప్లాస్ట్రానిక్స్ తెలిపింది. గడిచిన ఎనిమిది నెలల్లో వీటి ధర మూడింతలైందని కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అంతర్జాతీయంగా ప్యానెళ్ల మార్కెట్ మందగించిందని, అయినప్పటికీ నెల రోజుల్లో ధర 35% అధికమైందని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఒక్కో టీవీ ధర కనీసం రూ.2–3 వేలు పెరగనుందన్నారు. ఫ్రాన్స్ కంపెనీ థామ్సన్, యూఎస్ సంస్థ కొడాక్ టీవీల లైసెన్స్ను భారత్లో సూపర్ ప్లాస్ట్రానిక్స్ కలిగి ఉంది. అత్యధికంగా అమ్ముడయ్యే 32 అంగుళాల టీవీల ధర రూ. 5–6 వేలు పెరగ వచ్చని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ చెప్పారు. -
40 వేల దిగువకు సెన్సెక్స్
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల సునామీ బుధవారం భారత మార్కెట్ను ముంచెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 40,000 స్థాయిని కోల్పోయి 600 పాయింట్ల నష్టంతో 39,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,730 వద్ద స్థిరపడింది. అమెరికా, ఐరోపా దేశాలలో రెండో దశ కోవిడ్–19 కేసుల విజృంభణతో మరోసారి లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థకు అండగా ప్రతిపాదించిన ఉద్దీపన ప్యాకేజీపై ఇప్పటికీ అధికారిక సమాచారం రాకపోవడం నిరుత్సాహపరిచింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఈ ప్రతికూలాంశాలకు తోడుగా దేశీయంగా రూపాయి బలహీనపడడం, మెప్పించని కంపెనీల క్యూ2 ఫలితాలు, డెరివేటివ్ సిరీస్ ముగింపునకు ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత లాంటి అంశాలు మన మార్కెట్ సెంటిమెంట్ మరింత దెబ్బతీశాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీల భారీ పతనాన్ని ఖరారు చేశాయి. ఏ ఒక్క రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో సెనెక్స్ 747 పాయింట్లను కోల్పోయి 39,775 దిగువన కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 200 పాయింట్లను నష్టపోయి 11,685 ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చింది. నగదు విభాగంలో బుధవారం ఎఫ్పీఐలు రూ.1130.98 కోట్ల షేర్లను విక్రయించారు. డీఐఐలు అతి స్వల్పంగా రూ.1.48 కోట్ల షేర్లను కొన్నారు. ఆవిరైన రూ.1.56 లక్షల కోట్ల సంపద... స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.1.56 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.158 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో వారు నిరాశచెందారు. గురువారం అక్టోబర్ డెరివేటివ్ కాంటాక్టు ముగింపు కావడంతో మార్కెట్లో మరింత ఒడిదుడుకులకు లోనైంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ల పట్ల అప్రమత్తత అవసరమని మా కస్టమర్లను హెచ్చరించాము. స్టాక్ ఆధారిత షేర్ల కొనుగోళ్లు ఉత్తమని సలహానిచ్చాము.’’ అని రెలిగేర్ బ్రోకరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. 4 శాతం లాభపడ్డ ఎయిర్టెల్ షేరు కన్సాలిడేటెడ్ ప్రతిపాదికన ఒక క్వార్టర్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించినట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించడంతో కంపెనీ షేరు బుధవారం 4 శాతం లాభంతో రూ.450 వద్ద ముగిసింది. క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఉదయం సెషన్లో దాదాపు 13 శాతం రూ. 488కు చేరింది. తదుపరి మార్కెట్ భారీ పతనంలో భాగంగా లాభాలన్ని హరించుకుపోయాయి. టాటా మోటార్స్ 6 శాతం జంప్... రానున్న రికవరీ క్రమంగా పెరగడంతో పాటు డిమాండ్ ఊపందుకుంటుందనే ఆశాభావ ప్రకటనతో టాటా మోటర్స్ షేరు 6% లాభంతో రూ.143 వద్ద స్థిరపడింది. క్యూ2 ఫలితాలు నిరుత్సాహపరచడం గమనార్హం. -
బుల్ పరుగుకు బ్రేక్!
న్యూఢిల్లీ: సూచీల పదిరోజుల సుదీర్ఘ ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. అలాగే మార్కెట్ 10 రోజుల ర్యాలీతో ఆయా షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపారు. ట్రేడింగ్ ప్రారంభంలో మొదలైన అమ్మకాల సునామీ మార్కెట్ ముగిసేవరకు కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 1,066 పాయింట్లను నష్టపోయి 40,000 దిగువన 39,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 291 పాయింట్లను కోల్పోయి 11,680 వద్ద ముగిసింది. అన్ని రంగాలకు షేర్లలో విపరీతమైన విక్రయాలు జరిగాయి. సెన్సెక్స్లోని మొత్తం 30 షేర్లలో ఒక్క ఏషియన్ పెయింట్స్(0.32 శాతం)మాత్రమే లాభపడింది. ఇక నిఫ్టీలోని 50 షేర్లలో 3 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. గురువారం ఎఫ్ఐఐలు రూ.604 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.808 కోట్ల షేర్లను అమ్మారు. బీఎస్ఈ ఎక్సే్చంజ్లో మిడ్క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.75 శాతం నష్టాన్ని చవిచూశాయి. ఆరంభ లాభాల్ని కోల్పోయిన ఇన్ఫీ.. ఆరంభ లాభాల్ని కోల్పోవడంతో ఇన్ఫోసిస్ షేరు గురువారం బీఎస్ఈలో 2.50 శాతం లాభపడి రూ.1,108 వద్ద ముగిసింది. రెండో త్రైమాసికపు ఫలితాల్లో లాభాల పంట పండిచిన ఇన్ఫీ షేరు ఉదయం సెషన్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో షేరు 4 శాతం లాభపడి రూ.1,185 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో మార్కెట్ క్యాప్ రూ.5 లక్షల కోట్లను తాకింది. అనంతరం మార్కెట్ పతనంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనై 2.5% లాభంతో ముగిసింది. ప్రపంచమార్కెట్ల తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ గురువారం మన మార్కెట్ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరుకూ ఎలాంటి ప్యాకేజీ ఉండదని తేటతెల్లం కావడం ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాగే రెండో దశ కరోనా కేసుల విజృంభణతో యూరప్ దేశాల్లో విధించిన ఆంక్షలు, లాక్డౌన్ మార్కెట్ సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. రిలిగేర్ బ్రోకింగ్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ‘అమెరికా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన’’ అంశం ఈక్విటీ మార్కెట్లను నడిపింది. అయితే భారత్ మరోమారు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకపోవడం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ వాయిదా పడటం ఈక్విటీలను నష్టాల వైపు మళ్లించాయి’అని జియోజిత్ ఫైనాన్షియల్ వినోద్ నాయర్ తెలిపారు. నష్టాల్లో ప్రపంచమార్కెట్లు ప్రపంచమార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల వరకు ఎలాంటి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలుండవన్న అమెరికా ప్రకటనతో అమ్మకాలు నెలకొన్నాయి. యూరప్లో రెండో దశ కరోనా వైరస్ కేసులు విజృంభణ, అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధాలు మరోసారి తెరపైకి రావడం తదితర కారణాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా నేడు ఆసియా మార్కెట్లు 2% వరకు నష్టాలతో ముగిశాయి. యూరప్లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు 2–3శాతం క్షీణించాయి. అలాగే అమెరికా సూచీలు భారీ నష్టంతో మొదలయ్యాయి. రూ. 3.23 లక్షల కోట్ల సంపద ఆవిరి మార్కెట్ పతనంతో రూ. 3.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం విలువ గురువారం రూ.157.22 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇటీవలే ఈ సంపద రూ. 160.68 లక్షల కోట్ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. పతనానికి కారణాలు ► అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆశలు ఆవిరి... అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన ఆశలు ఆవిరయ్యాయి. ఈ నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలోపు అమెరికా స్వల్ప మొత్తంలో ఉద్దీపన ప్యాకేజీని ప్రపంచ మార్కెట్లు ఆశించాయి. అయితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మునుచిన్ ఈ ఆశలపై నీళ్లు చల్లారు. ఎన్నికలయ్యేంత వరకు ఎలాంటి ఆర్థిక ఉద్దీపనలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ► తెరపైకి మరోసారి లాక్డౌన్ ఆందోళనలు... రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తుండడంతో లాక్డౌన్ విధింపు ఆందోళనలు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. యూరప్లో రోజుకు లక్షకు మించి కోవిడ్ –19 కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ –19 కట్టడి చర్యల్లో భాగంగా యూరప్లోని పలు దేశాలు కఠినతరమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. బ్రిటన్లో బడులను మూసేశారు. శస్త్రచికిత్సలను నిషేధించారు. లాక్డౌన్ విధింపుపై అక్కడి ప్రభుత్వాలు చర్చిస్తున్నాయి. ► అమెరికా–చైనా ఉద్రిక్తతలు... చైనాకు చెందిన కొన్ని కంపెనీల చర్యలు అమెరికా జాతీయ సమగ్రత, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయంటూ అమెరికా వాణిజ్య గూఢచార విభాగం దేశాధ్యకుడు ట్రంప్నకు ఫిర్యాదు చేశాయి. ఈ కంపెనీలను బ్లాక్లిస్ట్లో పెట్టాలంటూ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చర్యలతో అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి వచ్చాయి. ► ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు... సూచీల పది రోజుల వరుస ర్యాలీకి ప్రాతినిధ్యం వహించిన ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. మెరుగైన క్యూ2 ఫలితాలు, భారీ బైబ్యాక్ ప్రకటనల నేపథ్యంలో కేవలం నెలరోజుల్లో 6 శాతం లాభపడిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గురువారం 3 శాతం నష్టాన్ని చవిచూసింది. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలు కూడా సూచీల పతనానికి కారణమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 3.50 శాతం నష్టంతో ముగిసింది. -
స్వల్ప లాభాలతో సరి..!
చివరి వరకూ లాభనష్టాల మధ్య, ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడిన బుధవారం నాటి స్టాక్ మార్కెట్ చివరకు స్వల్పలాభాలతో గట్టెక్కింది. కొన్ని ఆర్థిక, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగడం, డాలర్తో రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకొని 73.76 వద్దకు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, పై స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇంట్రాడే లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు పెరిగి 38,068 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,248 పాయింట్ల వద్ద ముగిశాయి. మెప్పించని తొలి డిబేట్.... అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష అభ్యర్థుల తొలి డిబేట్ ప్రపంచ మార్కెట్లను మెప్పించలేకపోవడం, కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు గురయ్యాయి. మన మార్కెట్ లాభాల్లో మొదలైనా, అరగంటకే నష్టాల్లోకి జారిపోయింది. చివరి వరకూ పరిమిత శ్రేణిలో లాభనష్టాల మధ్య కదలాడింది. ఒక దశలో 145 పతనమైన సెన్సెక్స్ మరో దశలో 263 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 408 పాయింట్ల రేంజ్లో కదలాడింది. టెక్ మహీంద్రా 3 శాతం లాభంతో రూ.790 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టస్థాయిలను తాకాయి. అపోలో హాస్పిటల్స్, ఎస్కార్ట్స్, రామ్కో సిస్టమ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. -
త్వరలో భారీ ప్యాకేజీ!
కేంద్రం గత ప్యాకేజీకి మించి, భారీ ఉద్దీపన ప్యాకేజీని రూపొందిస్తోందన్న వార్తల జోష్తో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 73.79కు చేరినా, కరోనా కేసులు పెరుగుతున్నా మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20,000 కోట్ల పెట్టుబడులు అందనున్నాయన్న వార్తలు, ప్రపంచ మార్కెట్లు లాభపడటం..... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 593 పాయింట్లు లాభపడి 37,982 పాయింట్ల వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు ఎగసి 11,228 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 1.6 శాతం పెరిగాయి. వరుసగా రెండో రోజూ ఈ సూచీలు లాభపడ్డాయి. రూ. 3 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 2.81 లక్షల కోట్లు పెరిగి రూ. 155.10లక్షల కోట్లకు ఎగసింది. చివర్లో మరింత జోరు... ఆసియా మార్కెట్ల జోరుతో మన మార్కెట్టు లాభాల్లోనే మొదలైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. చివర్లో కొనుగోళ్ళు మరింత జోరుగా సాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38 వేల పాయింట్లపైకి ఎగబాకింది. ఆర్థిక, వాహన, ఫార్మా రంగ షేర్లు మంచి లాభాలు సాధించాయి. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–హిందుస్తాన్ యూనీలీవర్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియాలు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 8% లాభంతో రూ.40.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► షేర్ బైబ్యాక్ ఆఫర్ ముగియడంతో సన్ ఫార్మా షేర్ 5 శాతం లాభంతో రూ. 20.75 వద్ద ముగిసింది. ► ఒక్కో షేర్ ఐదు షేర్లుగా నేడు(మంగళవారం)విభజన చెందనుండటంతో లారస్ ల్యాబ్స్ షేర్ 10 శాతం లాభంతో రూ.1,460 వద్ద ముగిసింది. ► పశ్చిమ బెంగాల్లో వచ్చే నెల 1 నుంచి సినిమా హాళ్లు ప్రారంభం కానుండటంతో పీవీఆర్, ఐనాక్స్ విండ్ షేర్లు 6–10 శాతం రేంజ్లో పెరిగాయి. ► వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టస్థాయిలకు ఎగిశాయి. ఇండి యామార్ట్ ఇంటర్మెష్, అపోలో హాస్పిటల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. డిష్ టీవీ, ఫ్యూచర్ గ్రూప్ షేర్లు, అదానీ గ్రీన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► నేటి నుంచి మూడు ఐపీఓలు–మజగావ్ డాక్ షిప్బిల్డర్స్, యూటీఐ ఏఎమ్సీ, లిఖిత ఇన్ఫ్రా ప్రారంభం కానున్నాయి. చైనా పరిశ్రమల లాభాలు ఆగస్టులో పెరిగాయి. ఈ లాభాలు వరుసగా నాలుగో నెలలోనూ పెరగడం ఇన్వెస్టర్లలో జోష్ని నింపింది. చైనా తయారీ రంగ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నేడు (మంగళవారం)తొలి డిబేట్ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. షాంఘై మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు 1–2 % రేంజ్లో లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 2–3% లాభాల్లో ముగిశాయి. -
‘బేర్’ బాజా !
ఆర్థిక రికవరీపై అనుమా నాలు, ఆందోళనతో ప్రపంచమార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,850 పాయింట్ల దిగువకు పడిపోయాయి. రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ భయాలతో కలవరపడుతున్న ఇన్వెస్టర్లు ఎడాపెడా అమ్మకాలకు దిగారు. మరోవైపు వివిధ దేశాల కేంద్ర బ్యాంక్లు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వకపోవడంతో సెంటిమెంట్ దెబ్బతిన్నది. డాలర్తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి దాదాపు నెల కనిష్ట స్థాయి, 73.89కు పడిపోవడం, సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ చివరి రోజు కావడంతో అమ్మకాలు జోరుగా సాగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,115 పాయింట్లు పతనమై 36,554 పాయింట్ల వద్ద, నిఫ్టీ 326 పాయింట్లు నష్టపోయి 10,806 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 3 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్కు ఇది ఈ ఏడాది మూడో అతి పెద్ద పతనం. 7 నెలల్లో తొలిసారి... స్టాక్ సూచీలు వరుసగా ఆరో రోజూ క్షీణబాటలోనే సాగాయి. ఈ ఆరు రోజుల్లో సెన్సెక్స్ 2,749 పాయింట్లు, నిఫ్టీ 799 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఈ రెండు సూచీల నష్టాలు ఇన్నేసి రోజులు కొనసాగడం గత 7 నెలల్లో ఇదే తొలిసారి. ఆరంభం నుంచి నష్టాలే... బుధవారం అమెరికా స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో గురువారం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. మన మార్కెట్ కూడా క్షీణబాటలోనే మొదలైంది. సెన్సెక్స్ 386 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. రోజు గడుస్తున్న కొద్దీ ఈ నష్టాలు పెరిగాయే కానీ, తగ్గలేదు. చివర్లో అమ్మకాల సునామీ కారణంగా నష్టాలు మరింతగా ఎగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,172 పాయింట్లు, నిఫ్టీ 342 పాయింట్ల మేర నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్లో క్షీణించాయి. ► సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హిందుస్తాన్ యూనిలివర్ షేర్ మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి. ► గత ఐదు నెలలుగా పుంజుకుంటూ వస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు బాగా నష్టపోయాయి. ► మార్కెట్ భారీ పతనంలోనూ 100కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. రూట్ మొబైల్, మాజెస్కో, అపోలో హాస్పిటల్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 380కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. పతనానికి ప్రధాన కారణాలు ► అగాధంలోకి అమెరికా ఎకానమీ: డిమాండ్ బలహీనంగా ఉండటం, ఉద్యోగ కల్పన కొరవడడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ అగాధంలోకి కూరుకుపోయిందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైస్ చైర్మన్ రిచర్డ్ క్లారిడ తాజాగా వ్యాఖ్యానించారు. ఆర్థికవ్యవస్థ రికవరీని అతిగా అంచనా వేశారని, మార్కెట్లు ఊహించిన స్థాయిలో రికవరీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► పెరుగుతున్న కరోనా కేసులు: దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ప్రబలి దాదాపు పది నెలలు కావస్తున్నా, కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయే కానీ, తగ్గడం లేదు. ► మళ్లీ లాక్డౌన్ భయాలు: యూరప్ దేశాల్లో రెండో దఫా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల కట్టడికి మళ్లీ లాక్డౌన్ విధించాలని పలు దేశాలు యోచిస్తున్నాయి. లాక్డౌన్ విధిస్తే, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కుంటుపడి రికవరీ మరింత ఆలస్యమవుతుందనే భయాలు నెలకొన్నాయి. ► ప్రపంచ మార్కెట్ల పతనం: కరోనా కేసులు పెరుగుతుండటం, మళ్లీ లాక్డౌన్ భయాలు మొదలవ్వడం, రికవరీకి ఊతమిచ్చేలా వివిధ దేశాల కేంద్ర బ్యాంక్లు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోవడంతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. ► హెవీ వెయిట్స్లో అమ్మకాలు: సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► 32 పైసలు పతనమైన రూపాయి: రూపాయి మళ్లీ పతనబాట పట్టింది. డాలర్తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి 73.89కు చేరింది. ఇది దాదాపు నెల కనిష్ట స్థాయి. ► ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ: సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు చివరి రోజు కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. 6 రోజులు... రూ.11 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ. 3.95 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.95 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.148.76 లక్షల కోట్లకు పడిపోయింది. గత 6 రోజుల నష్టాల కారణంగా మొత్తం రూ.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. మరింత తీవ్రంగా ఒడిదుడుకులు.! ప్రస్తుతం నిఫ్టీ 200 రోజులు సింపుల్ మూవింగ్ యావరేజ్(ఎస్ఎమ్ఏ–10,839 పాయింట్లు), దిగువకు పతనమైంది. 200 రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్(ఈఎమ్ఏ–10,761 పాయింట్లు)కు చేరువయింది. దీంతో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు మరింత తీవ్రంగా ఉంటాయని, ట్రేడర్లు, ఇన్వెస్టర్లు జాగరూకతతో వ్యవహరించాలనేది విశ్లేషకుల సూచన. ఆర్థిక రికవరీపై అధిక అంచనాలు నెలకొన్నాయని, షేర్ల విలువలు అధికంగా ఉన్నాయని, దీంతో మార్కెట్లో కరెక్షన్ తప్పనిసరి అని వారంటున్నారు. ప్రపంచ మార్కెట్ల గమనాన్ని బట్టే మన మార్కెట్ కదలికలు ఉంటాయని నిపుణులంటున్నారు. సెన్సెక్స్ టాప్10 పతనాలు తేదీ నష్టం(పాయింట్లు) మార్చి9, 2020 1,942 ఆగస్టు 24,2015 1,625 ఫిబ్రవరి 28, 2020 1,448 జనవరి 21, 2008 1,408 సెప్టెంబర్ 24,2020 1,115 అక్టోబర్ 24,2008 1,071 ఫిబ్రవరి1, 2020 988 మార్చి 17,2008 951 మర్చి 3, 2008 901 మార్చి6,2020 894 -
కెవ్వు క్రాష్!
యూరప్లో రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్డౌన్లు విధిస్తారనే భయాలు చెలరేగాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో 2 లక్షల కోట్ల డాలర్ల మేర అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా భారీగానే నష్టపోయింది. సెన్సెక్స్ 38 వేల పాయింట్ల ఎగువన నిలదొక్కుకోగలిగినా, నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు పడిపోయింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 812 పాయింట్ల నష్టంతో 38,034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు పతనమై 11,251 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 2 శాతం మేర క్షీణించాయి. 1,052 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ బలహీనంగానే మొదలైంది. మధ్య మధ్యలో లాభాల్లోకి వచ్చినా, ఎక్కువ భాగం నష్టాల్లోనే ట్రేడైంది. యూరప్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఆరంభం కావడంతో మధ్యాహ్నం తర్వాత అమ్మకాల జోరు పెరిగింది. చివరి గంటలో నష్టాలు బాగా పెరిగాయి. ఒక దశలో 145 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, మరోదశలో 907 పాయింట్ల మేర పతనమైంది. మొత్తం మీద రోజంతా 1,052 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు– కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 9 శాతం నష్టంతో రూ.560 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే కావడం గమనార్హం. ► మార్కెట్ భారీగా నష్టపోయినా దాదాపు 140 షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, వీఎస్టీ టిల్లర్స్, మైండ్ ట్రీ, లారస్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఎందుకీ పతనం.. బ్యాంకుల్లో భారీగా అక్రమ లావాదేవీలు...! ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంక్లు 2 లక్షల కోట్ల డాలర్ల మేర అక్రమ లావాదేవీలకు పాల్పడ్డాయని ఇంటర్నేషనల్ కన్సార్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్(ఐసీఐజే) వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు పుట్టాయి. ఇక భారత్ విషయానికొస్తే, 2010–17 మధ్య ఇలాంటి అక్రమ లావాదేవీలు 400కు పైగా జరిగాయని వీటి విలువ వంద కోట్ల డాలర్ల మేర ఉంటుందని అమెరికాకు చెందిన ఫిన్సెన్(ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్) పేర్కొంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదం, డ్రగ్స్, ఆర్థిక అవకతవకలు తదితర అక్రమ లావాదేవీలు జరిగాయని పేర్కొంది. ఈ లావాదేవీల కారణంగా దేశంలోకి 48 కోట్ల డాలర్లు అక్రమంగా వచ్చాయని, 40 కోట్ల డాలర్లు వెళ్లాయని ఫిన్సెన్ పేర్కొంది. దాదాపు భారత్లోని అన్ని బ్యాంకులకు ఈ లావాదేవీల్లో ప్రమేయం ఉందన్న వార్తల కారణంగా బ్యాంక్ షేర్లు బాగా నష్టపోయాయి. యూరప్లో మళ్లీ లాక్డౌన్! రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో డెన్మార్క్, గ్రీస్, స్పెయిన్ దేశాల్లో తాజాగా ఆంక్షలు విధించారు. మరోవైపు రోజుకు 6,000 మేర కరోనా కేసులు నమోదవుతుండటంతో (మన దేశంలో రోజుకు లక్ష కరోనా కేసులు వస్తున్నాయి) దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వచ్చాయి. దీంతో బెంబేలెత్తిన యూరప్ ఇన్వెస్టర్లు బ్యాంక్, టూరిజమ్, వినియోగ రంగ షేర్లను తెగనమ్మారు. ఆసియా మార్కెట్లు 1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ఆరంభంలోనే 3 శాతం మేర క్షీణించిన యూరప్ మార్కెట్లు చివరకు 4 శాతం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు ఆవిరి కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. అమెరికా తదుపరి సుప్రీంకోర్ట్ జడ్జి ఎవరనే విషయంలో డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు మధ్య పోరు తప్పదనే భయాలతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నివురుగప్పిన నిప్పులా సరిహద్దు ఉద్రిక్తతలు... సరిహద్దు ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తాజాగా భారత్–చైనాల మధ్య చర్చలు ప్రారంభమైనా, సరిహద్దుల్లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని, ఈ పరిస్థితి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోందని నిపుణులు అంటున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ ఈ గురువారమే ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటం, నిఫ్టీ కీలకమైన 11,500 పాయింట్ల రేంజ్లో ఉండటంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. రూ. 4.23 లక్షల కోట్ల సంపద ఆవిరి... స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.4.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,23,140 కోట్లు దిగజారి రూ.154.76 లక్షల కోట్లకు పడిపోయింది. విలువలు అధికంగా ఉన్నాయ్.. షేర్ల విలువలు అసమంజసమైన స్థాయిల్లో ఉన్నాయని, ఈ విలువలను షేర్లు నిలుపుకోలేవన్న ఆందోళన నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షి యల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. కొంత కాలం పాటు మార్కెట్ అనిశ్చితిగానే ఉంటుందని, ఒడిదుడుకులు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
పడేసిన ఫెడ్ !
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అదనపు తాయిలాలను ప్రకటించకపోవడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం పతనమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించి 73.66కు చేరడం, రిలయన్స్, టీసీఎస్ వంటి ఇండెక్స్ షేర్లలో అమ్మకాలు జరగడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడి 38,980 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 11,516 పాయింట్ల వద్ద ముగిశాయి. మరో మూడేళ్లు సున్నా స్థాయిలోనే.... కీలకమైన వడ్డీరేట్లు మరో మూడేళ్లపాటు సున్నా స్థాయిలోనే కొనసాగుతాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది. అదనపు ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వకపోవడం, పైగా భవిష్యత్తు ఆర్థిక స్థితిగతుల అంచనాలపై తీవ్రమైన అనిశ్చితి నెలకొందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. ఈ ప్రతికూల వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. ఆసియా మార్కెట్లు 1 శాతం మేర నష్టపోగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. రోజంతా నష్టాలే.... ఆసియా మార్కెట్ల పతన ప్రభావంతో మన మార్కెట్ కూడా నష్టాల్లోనే మొదలైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. చివరి గంటలో అమ్మకాలు మరింత జోరుగా పెరిగాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, మార్కెట్ అనిశ్చితిగానే ఉంటుందని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ► బజాజ్ ఫిన్సర్వ్ షేర్ 2 శాతం నష్టంతో రూ.6,006 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్ఆర్ఎఫ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మార్కెట్ నష్టపోయినా, 288 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రామ్కో సిస్టమ్స్, గంధిమతి అప్లయెన్సెస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.817ను తాకిన ఈ షేర్ చివరకు 2.3 శాతం లాభంతో రూ.808 వద్ద ముగిసింది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 13 శాతం లాభపడింది. ► డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.4,845ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.4,826 వద్ద ముగిసింది. ఒక్క రోజులో రూ.లక్ష కోట్లు ఆవిరి నష్టాల కారణంగా ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.1,03,248 కోట్ల మేర తగ్గిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ గురువారం ముగింపు నాటికి రూ.159,04,785 కోట్లుగా ఉంది. ‘‘మార్కెట్లు బుధవారం గడించిన లాభాలన్నింటినీ కోల్పోయాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా రోజులో కనిష్టాల వద్ద ముగిశాయి. ఆర్థిక రికవరీ విషయమై యూఎస్ ఫెడ్ ఆందోళన వ్యక్తం చేయడం మన మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యేందుకు దారి చూపింది. బెంచ్ మార్క్ సూచీలు రోజులో పలు విడతలు రికవరీకి ప్రయత్నించినప్పటికీ ఎగువ స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా కనిష్టానికి చేరాయి’’ అని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఆర్థిక రికవరీపై అనిశ్చితిని యూఎస్ ఫెడ్ వ్యక్తీకరించడం సెంటిమెంట్పై ప్రభావం చూపించినట్టు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా సైతం తెలిపారు. -
మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ : ధర?
సాక్షి, న్యూఢిల్లీ: లెనోవాకు చెందిన మోటరోలా కంపెనీ మోటో రేజర్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ను ఆవిష్కరించింది. మోటో రేజర్ కి కొనసాగింపుగా ఆండ్రాయిడ్ 5జీ ఫోన్ను తీసుకొచ్చింది. కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, కెమరాల్లో మార్పులు, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765జీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్తో ముందు మొబైల్ కంటే చాలా చౌకగా దీన్ని విడుదల చేసింది. అలాగే కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 11కి అప్గ్రేడ్ చేయవచ్చని అంచనా. ఈ స్మార్ట్ఫోన్ను సుమారు రూ .102,600 ధరతో లాంచ్ చేసింది. (మోటో రేజర్ ధర రూ.1,24999). గ్రాఫైట్, బ్లష్ గోల్డ్ లిక్విడ్ మెర్క్యురీ మూడు రంగుల్లో లభ్యం. మోటో రేజర్ 5జీ ఫీచర్లు 6.2 అంగుళాల ఫోల్డ్ డిస్ప్లే వెనుక 2.7 అంగుళాల ఫోల్డ్ సెకండరీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 జి ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 48 మెగాపిక్సెల్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 15వాట్స్ టర్బోపవర్ ఛార్జర్ 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రస్తుతానికి చైనా, యూరోపియన్ మార్కెట్లో లభించనుంది. ఇండియాలో లాంచింగ్ తేదీని మోటరోలా ఇంకా ప్రకటించలేదు. -
మార్కెట్పై బేర్ ఎటాక్!
ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావంతో మన మార్కెట్ కూడా శుక్రవారం భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు బాగా క్షీణించడం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింత ముదురుతుండటం, కరోనా కేసులు పెరుగుతుండటం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 33 పైసలు పుంజుకొని 73.14కు చేరినా మన మార్కెట్ పతనం ఆగలేదు. సెన్సెక్స్ 634 పాయింట్లు పతనమై 38,357 పాయింట్ల వద్ద, నిఫ్టీ 194 పాయింట్లు క్షీణించి 11,334 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే సెన్సెక్స్ 1.63 శాతం, నిఫ్టీ 1.68 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్ 1,110 పాయింట్లు, నిఫ్టీ 314 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. భారీ గ్యాప్డౌన్తో మొదలు.. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాప్డౌన్తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 666 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. రోజంతా ఈ నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 741 పాయింట్లు, నిఫ్టీ 224 పాయింట్లమేర నష్టపోయాయి. లోహ, విద్యుత్తు, టెలికం, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. మరిన్ని విశేషాలు.. ► సెన్సెక్స్లోని 30 షేర్లలో ఒక్క మారతీ సుజుకీ షేర్ మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి. ► యాక్సిస్ బ్యాంక్ 4 శాతం నష్టంతో రూ.455 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, దాదాపు వందకు పైగాషేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. వొడాఫోన్ ఐడియా,అదానీ గ్యాస్, గ్రాన్యూల్స్ ఇండియా, వీఎస్టి టిల్లర్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఆస్ట్రాజెనెకా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► అమెరికాలో టెక్నాలజీ షేర్ల పతనం కారణంగా మన దగ్గర కూడా ఐటీ షేర్లు నష్టపోయాయి. ► త్వరలో వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్ పాలసీ) ప్రభుత్వం ప్రకటించనున్నదన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. ► ఫ్యూచర్ గ్రూప్ షేర్లు వరుసగా నాలుగో రోజూ లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఈ షేర్లతో పాటు మరో 200కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్, మ్యాక్స్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2.23 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.2.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.23 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.154.63 లక్షల కోట్లకు తగ్గింది. అప్రమత్తంగా ఉండండి..: నిపుణులు కరోనా కేసుల జోరు, ప్రపంచ మార్కెట్ల పతనం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, మన మార్కెట్ వేల్యూయేషన్లు అధికంగా ఉండటం.. ఇవన్నీ కీలకమైన రిస్క్ అంశాలని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. పతనానికి ప్రధాన కారణాలు అమెరికా స్టాక్ సూచీల పతనం: గత రెండు నెలల్లో భారీగా ఎగసిన టెక్నాలజీ షేర్లలో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో అమెరికా స్టాక్ సూచీలు 3–5 శాతం రేంజ్లో నష్టపోయాయి. ఈ ప్రభావంతో శుక్రవారం ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా నష్టపోవడం మన మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపించింది. బ్యాంక్ షేర్ల పతనం..: మారటోరియం రుణాలపై వడ్డీ వసూలు విషయమై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. హెవీ వెయిట్స్కు నష్టాలు..: సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లలో జోరుగా అమ్మకాలు జరిగాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు..: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. -
మార్కెట్కు ‘ఫెడ్’ భయాలు!
అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆ దేశ కేంద్ర బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ సంశయాలు వ్యక్తం చేయడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం నష్టపోయింది. గత మూడు రోజుల లాభాల నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్తో రూపాయి మారకం విలువ 20 పైసలు పతనమై 75.02కు చేరడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 394 పాయింట్లు పతనమై 38,220 పాయింట్ల వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 11,312 పాయింట్ల వద్ద ముగిశాయి. మరో దఫా నష్టాలు...! సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 459 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్ల మేర పతనమయ్యాయి. మార్కెట్లో మరో దఫా నష్టాలు ఉండొచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫెడ్ భయాలు...! అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకింత రికవరీ అయింది. అయితే ఈ రికవరీ కొనసాగుతుందో,లేదో అన్న సంశయాలను ఫెడరల్ రిజర్వ్ మినట్స్ (జూలై సమావేశం) వెల్లడించాయి. దీంతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–4 శాతం మేర నష్టపోయాయి. ► సెన్సెక్స్ 30 షేర్లలో ఐదు షేర్లు–ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్,హెచ్సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. ► హెచ్డీఎఫ్సీ షేర్ 2.3 శాతం నష్టంతో రూ.1,785 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ఎన్టీపీసీ షేర్ 7 శాతం లాభంతో రూ.101 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా పెరిగిన షేర్ ఇదే కావడం గమనార్హం. ► దాదాపు 170కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. టాటా కమ్యూనికేషన్స్, టాటా కాఫీ, జేబీ కెమికల్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ఒక్కో ఈక్విటీ షేర్కు మూడు బోనస్ షేర్ల జారీకి(3:1) ఆమోదం లభించడంతో ఆర్తి డ్రగ్స్ షేర్ 18 శాతం లాభంతో రూ. 2,839 వద్ద ముగిసింది. ఈ షేర్ ఈ ఏడాది 400 శాతం ఎగసింది. ఇంట్రాడేలో ఆల్టైమ్ హై రూ.2,893ను తాకింది. ► డిస్కమ్ల రుణ పరిమితి పెరగడంతో విద్యు త్ రంగ షేర్లు 12 శాతం వరకూ ఎగిశాయి. ► దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రెప్కో హమ్ ఫైనాన్స్, అరవింద్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ కన్సూమర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
సెన్సెక్స్ 38,600–37,600 శ్రేణి కీలకం
అమెరికా, జపాన్, చైనా స్టాక్ సూచీలు మినహా ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ గతవారం క్షీణతతో ముగిశాయి. కోవిడ్ నియంత్రణల్ని తీవ్రతరం చేయడంతో కొన్ని యూరప్ స్టాక్ సూచీల్లో తగ్గుదల అధికంగా వుంది. అయినా ఈ హెచ్చుతగ్గులన్నీ ఆగస్టు 2 నుంచి కొనసాగుతున్న పరిమితశ్రేణికి లోబడే వున్నందున, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద కరెక్షన్ను ఇప్పట్లో అంచనా వేయలేము. అయితే ఈ స్థాయిల నుంచి గణనీయమైన అప్ట్రెండ్ ఏర్పడే సంకేతాలు సైతం కన్పించడం లేదు. అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్లో జరగనున్న ఎన్నికలపై ఇక నుంచి ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నందున, ఆయా వార్తలకు అనుగుణంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. ఇక భారత్ స్టాక్ సూచీల సాంకేతిక అంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఆగస్టు 14తో ముగిసిన వారంలో 38,556 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్, వారంలో చివరిరోజైన శుక్రవారం తీవ్ర పతనాన్ని చవిచూసి 37,655 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 164 పాయింట్ల నష్టంతో 37,877 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు వారాలుగా 2.5 శాతం శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్న సెన్సెక్స్ ఈ శ్రేణిని (37,600–38,600) ఎటోవైపు ఛేదిస్తేనే, ఆ దిశగా తదుపరి రోజుల్లో స్పష్టమైన ట్రెండ్ నెలకొంటుంది. ఈ వారం మార్కెట్ పాజిటివ్గా ప్రారంభమైతే 38,220 పాయింట్ల సమీపంలో సెన్సెక్స్కు తొలి అవరోధం కలగవచ్చు. ఈ అవరోధస్థాయిని దాటితే 38,440 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 38,620 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. తొలి నిరోధాన్ని సెన్సెక్స్ అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 37,650 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన వేగంగా 37,500 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును సైతం వదులుకుంటే ప్రస్తుతం 200 డీఎంఏ రేఖ కదులుతున్న 36,850 పాయింట్ల స్థాయి అతిముఖ్యమైన మద్దతు. నిఫ్టీ తక్షణ నిరోధం 11,270 గతవారం ప్రథమార్ధంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,370 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన తర్వాత, దాదాపు అదేస్థాయిని పదేపదే పరీక్షించి, శుక్రవారం 11,111 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 36 పాయింట్ల స్వల్పనష్టంతో 11,178 వద్ద ముగిసింది. రెండు వారాలనుంచి నిఫ్టీ ఎదుర్కొంటున్న 11,370 నిరోధాన్ని దాటితేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుంది. అలాగే రానున్న రోజుల్లో 200 డీఎంఏ వద్ద లభించబోయే కీలక మద్దతును నిఫ్టీ కోల్పోతే స్వల్పకాలిక కరెక్షన్ జరగవచ్చు. ఈ వారం మార్కెట్ పెరిగితే, 11,270 పాయింట్ల వద్ద నిఫ్టీకి తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే 11,325 స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే తిరిగి 11,375 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధాన్ని దాటలేకపోతే 11,090 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 11,000 వరకూ క్షీణిం చవచ్చు. ఈ లోపున 200 డీఎంఏ రేఖ కదులుతున్న 10,845 వద్ద ముఖ్యమైన మద్దతు లభిస్తున్నది. -
ఐటీ జోష్..!
కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, మన మార్కెట్ గురువారం ముందుకే దూసుకుపోయింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాలు అంచనాలను మించడం సానుకూల ప్రభావం చూపించింది. దీంతో ఐటీ షేర్లు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచ్చింది. కొన్ని ఆర్థిక రంగ, ఫార్మా షేర్లు పుంజుకోవడం కలసివచ్చింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. సెన్సెక్స్ 420 పాయింట్ల లాభంతో 36,472 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 10,740 పాయింట్ల వద్ద ముగిశాయి. ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గగా, డాలర్తో రూపాయి మారకం విలువ 3 పైసలు పుంజుకొని 75.18 వద్దకు చేరింది. చివరి గంటలో కొనుగోళ్లు: ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్న మన మార్కెట్ మాత్రం మంచి లాభాలతోనే మొదలైంది. అయితే అరగంటలోనే ఈ లాభాలన్నింటినీ కోల్పోయింది. చివరి గంట వరకూ హెచ్చుతగ్గుల్లో కదలాడింది. చివరి గంటలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. స్టాక్ సూచీలు మంచి లాభాలతో ముగిశాయి. ఒక దశలో 14 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 473 పాయింట్ల మేర లాభపడింది. వరుసగా నాలుగు రోజుల నుంచి పతనమవుతూ వస్తున్న ఆర్థిక రంగ షేర్లు ఒకింత కోలుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం.. ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళనతో చైనా షాంఘై సూచీ 4.5 శాతం మేర పతనమైంది. హాంగ్కాంగ్, జపాన్, దక్షిణ కొరియా సూచీలు 2 శాతం మేర నష్టపోయాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, హాంగ్కాంగ్ విషయమై అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు ముదరడం, ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో చైనా జీడీపీ అంచనాల కంటే తక్కువగానే నమోదు కావడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. నష్టాల్లో ఆరంభమైన యూరప్ సూచీలు చివరకు 1 శాతం మేర నష్టపోయాయి. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో ఇన్ఫోసిస్ షేర్ 10 శాతం లాభంతో రూ.911 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 14 శాతం లాభంతో ఆల్టైమ్ హై, రూ.952 ను తాకింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.33,853 కోట్లు ఎగసి రూ.3,87,966 కోట్లకు పెరిగింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 420 పాయింట్ల లాభంలో ఈ షేర్ వాటా సగానికి పైగా (277 పాయింట్లు) ఉండడం విశేషం. ► జూన్ క్వార్టర్లో నికర లాభం 17 శాతం పెరగడంతో లార్సెన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ కంపెనీ షేర్ 4 శాతం లాభంతో రూ.2,291 వద్ద ముగిసింది. ► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ పెరిగినా 350 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. టాటా కన్సూమర్, అర్వింద్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కన్సూమర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
కరోనా 2.0 పంజా!
కొన్ని దేశాల్లో రెండో దశ కరోనా కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయంగా ఆర్థిక రికవరీ ఆశలకు గండి పడింది. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా సోమవారం భారీగా నష్టపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 19 పైసలు తగ్గి 76.03కు చేరడం, మన దేశంలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటం, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడం... ప్రతికూల ్రçపభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 552 పాయింట్ల నష్టంతో 33,229 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 159 పాయింట్లు పతనమై 9,814 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 1.6 శాతం మేర నష్టపోయాయి. వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లోనూ ఈ సూచీలు పతనమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ పుంజుకోవడంతో నష్టాలు ఒకింత తగ్గాయి. బ్యాంక్, ఆర్థిక, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇంధన, ఫార్మా రంగ షేర్లలో వేల్యూ బయింగ్ చోటుచేసుకుంది. రోజుకు లక్ష కరోనా కేసులు... కరోనా వైరస్కు పుట్టినిల్లయిన చైనాతో పాటు అమెరికాతో సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ప్రబలుతున్నాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కొత్త, పాత కరోనా కేసులు కలిపి రోజుకు లక్షకు పైగా తేలుతున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళన నెలకొంది. ఇక మన దగ్గర గత మూడు రోజులుగా రోజుకు 10,000 మేర కరోనా కేసులు వస్తుండటంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. రోజంతా నష్టాలు... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో సెన్సెక్స్ 857 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల మేర పతనమయ్యాయి. యూరప్ సూచీలు నష్టాల నుంచి ఒకింత రికవరీ కావడం, అమెరికా ఫ్యూచర్లు కూడా రికవరీ బాట పట్టడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ పుంజుకోవడంతో మన దగ్గర మధ్యాహ్నం తర్వాత నష్టాలు తగ్గాయి. ఆసియా మార్కెట్లు 1–5 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ 7 శాతం నష్టంతో రూ.490 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినా పలు షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. లుపిన్, క్యాడిలా హెల్త్కేర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ, టెలికం కంపెనీల ఏజీఆర్ » కాయిల విషయమై సుప్రీంకోర్టులో విచారణలు ఈ వారంలోనే ఉండటంతో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం పడింది. మొండిబకాయిలకు సంబంధించి అనిశ్చితులు అధికంగా ఉండటంతో ప్రస్తుతానికైతే ఈ రంగ షేర్లకు దూరంగా ఉండమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ► సెన్సెక్స్ 30 షేర్లలో నాలుగు షేర్లు–రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సన్ఫార్మా, ఓఎన్జీసీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. మళ్లీ 77 దిశగా రూపాయి? 76.03 వద్ద ముగింపు ∙ఆరు వారాల కనిష్టం డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ 77 దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 19 పైసలు పతనమై 76.03 వద్ద ముగిసింది. ఇది ఆరు వారాల కనిష్ట స్థాయి. విదేశీ నిధులు వెనక్కు వెళుతుండటం, బలహీన ఈక్విటీ మార్కెట్, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి అంశాలు దీనికి నేపథ్యం. గత శుక్రవారం రూపాయి ముగింపు 75.84. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 రెండవ దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలూ ఉన్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. ఆల్టైమ్ హైకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో మరో రెండు దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్ చేయడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇంట్రాడేలో ఆల్టైమ్ హై,రూ.1,627ను తాకింది. చివరకు 1.6 శాతం లాభంతో రూ.1,615 వద్ద ముగిసింది. ఈ ఏడాది మార్చి 23న రూ.867కు పడిన ఈ షేర్ మూడు నెలల్లోనే 80 శాతానికి పైగా ఎగియడం విశేషం. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ పాక్షిక చెల్లింపు షేర్లు(పార్ట్లీ పెయిడప్ షేర్స్) మదింపు ధర రూ.646తో పోల్చితే 8 శాతం లాభంతో రూ.698 వద్ద ముగిశాయి. -
రూ. 3.5 లక్షల కోట్లు మటాష్!
సాక్షి, ముంబై : కరోనా వైరస్ మళ్లీ పంజా విసురనుందన్న అంచనాతో అమెరికా మార్కెట్లు భారీ పతనాన్నినమోదు చేశాయి. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చన్న వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా మార్కెట్టు కుప్పకూలాయి. కరోనా వైరస్, లాక్డౌన్ అనంతరం మార్చి తరువాత డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,800 పాయింట్లకు, ఎస్ అండ్ పి 500 5.9 శాతానికి పైగా పడిపోయింది. ఆసియా మార్కెట్లు ఇదే బాటపట్టాయి. జపాన్ నిక్కి 1.52 శాతం చైనా షాంఘై కాంపోజిట్, హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్, దక్షిణ కొరియాకు కోస్పి వరుసగా 0.51 శాతం, 1.03 శాతం, 2.48 శాతం పతనమయ్యాయి. దీంతో నేడు (శుక్రవారం) దేశీయంగా మన స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ ఆరంభంలోనే ఏకంగా 1100 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టోయింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 264,315 పాయింట్లు కోల్పోయాయి. ఇన్వెస్టర్ల సంపద పెద్ద మొత్తం ఆవిరై పోయింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. (స్టాక్ మార్కెట్ భారీ పతనం) పెట్టుబడిదారులు రూ .3.51 లక్షల కోట్లు నష్టపోయారు. అలాగే మార్కెట్ క్యాప్ నిన్నటి (జూన్ 11) 133.14 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే జూన్ 12 న శుక్రవారం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .129.63 లక్షల కోట్లకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్లో గురువారం 805.14 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మారు. దేశీయ పెట్టుబడిదారులు కూడా 874.35 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇండస్ఇండ్ బ్యాంక్, ఒఎన్జీసీ, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి. అయితే ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్న సెన్సెక్స్ ప్రస్తుతం 635 పాయింట్లు క్షీణించి 32,908 వద్ద, నిఫ్టీ 175 పాయింట్లు కోల్పోయి 9723 వద్ద కొనసాగుతుండటం విశేషం. చదవండి: ఈ దుస్తులతో అరగంటలో కరోనా ఖతం! వామ్మో! పెట్రో బాదుడు -
కరోనా కాటుపై సుంకాల పోటు!
అమెరికా–చైనాల మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తనుండటంతో సోమవారం ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు పొడిగించడం, గత నెలలో తయారీ రంగ పీఎమ్ఐ జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. సెన్సెక్స్ 32,000 పాయింట్లు, నిఫ్టీ 9,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడం, గత వారంలో స్టాక్ సూచీలు 7 శాతం మేర లాభపడిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 2,002 పాయింట్ల పతనంతో 31,715 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 566 పాయింట్లు నష్టపోయి 9,294 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 5.9%, నిఫ్టీ 5.7% క్షీణించాయి. సెన్సెక్స్కు ఇది నాలుగో అతి పెద్ద పతనం. భారీ నష్టాలతో... సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 970 పాయింట్లు, నిఫ్టీ 326 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ను ఆరంభించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,086 పాయింట్లు, నిఫ్టీ 593 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఫార్మా, టెలికం రంగ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఫైనాన్స్, బ్యాంక్, లోహ, కన్సూమర్ డ్యూరబుల్స్, రియల్టీ షేర్లు బాగా పతనమయ్యాయి. మరిన్ని విశేషాలు... ► ఐసీఐసీఐ బ్యాంక్షేర్ 11% నష్టంతో రూ.338 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. నేడు ఈ బ్యాంక్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ► గత క్యూ4లో లాభం తగ్గడంతో రిలయన్స్ షేర్ 2% నష్టంతో రూ.1,435 వద్ద ముగిసింది. ► 30 సెన్సెక్స్ షేర్లలో భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా ఈ రెండు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► గత నెలలో దేశీయంగా ఎలాంటి వాహన విక్రయాలు చోటు చేసుకోకపోవడంతో వాహన షేర్లు 12 శాతం మేర నష్టపోయాయి. రూ.5.8 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.82 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5,82,696 కోట్లు ఆవిరై రూ.123.58 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలకు కారణాలివే.. ► మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు...: కరోనా వైరస్ చైనా సృష్టేనని, దీనికి ప్రతిగా చైనా వస్తువుల దిగుమతులపై వాణిజ్య ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనడానికి సాక్ష్యాలున్నాయని అమెరికా వెల్లడించింది. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగుతాయనే ఆందోళన నెలకొన్నది. ► లాక్డౌన్ 3.0...: లాక్డౌన్ మరో రెండు వారాలు కొనసాగించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి చాలా కాలం పడుతుంద న్న భయాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► తయారీ రంగం ఢమాల్... తయారీ రంగం దారుణంగా దెబ్బతింది. మార్చిలో 51.8గా ఉన్న మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) ఏప్రిల్లో 27.4కు పడిపోయింది. ► ప్రపంచ మార్కెట్ల పతనం...: అమెరికా, చైనాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం చోటు చేసుకుంటుందేమోనన్న భయాలతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. హాంగ్కాంగ్, సియోల్ సూచీలు 4% మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఆరంభమయ్యాయి. చివరకు 4% నష్టాల్లో ముగిశాయి. సెలవుల కారణంగా చైనా, జపాన్ మార్కెట్లు పనిచేయలేదు. ► రూపాయి పతనం..: డాలర్తో రూపాయి మారకం విలువ 64 పైసలు నష్టపోయి 75.73ను తాకింది. ► నిరాశపరిచిన ఫలితాలు...: ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. రిలయన్స్, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ► లాభాల స్వీకరణ... గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 8 శాతం మేర లాభపడిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుం దని కొందరు నిపుణులంటున్నారు. ► జీరో అమ్మకాలు గత నెలలో దేశీయంగా ఎలాంటి వాహన విక్రయాలు చోటు చేసుకోలేదు. దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. ► కొనసాగుతున్న కరోనా కల్లోలం... అంతర్జాతీయంగా, దేశీయంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. భారత్లో కరో నా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. -
సెన్సెక్స్ 32,170 మద్దతుకు ఇటూ...అటూ
అమెరికాతో పాటు పలుదేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని పాక్షికంగా తెరిచినందున ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ గతవారం ప్రథమార్ధంలో జోరుగా ర్యాలీ జరిపినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...తిరిగి చైనాతో ట్రేడ్వార్ను తెరపైకి తేవడంతో ఆ మార్కెట్లన్నీ వారాంతంలో హఠాత్ పతనాన్ని చవిచూసాయి. భారత్ మార్కెట్కు శుక్రవారం సెలవుకావడంతో ప్రపంచ మార్కెట్ల ప్రభావం ఇక్కడ పడలేదు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చినప్పటికీ, దేశంలో పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక రంగ కార్యకలాపాలకు ప్రధానమైన పెద్ద నగరాలన్నీ రెడ్జోన్లు అయినందున, మరో రెండు వారాలు ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా వుండిపోతుంది. అటు అంతర్జాతీయ అంశాలు, ఇటు దేశీయ వార్తల ప్రతికూలతను భారత్ మార్కెట్ తట్టుకోవాలంటే..కేంద్రం కొద్దిరోజులుగా తాత్సారం చేస్తున్న ఆర్థిక ప్యాకేజీని తక్షణమే ప్రకటించాల్సివుంటుంది. అది ఇన్వెస్టర్లను మెప్పించాల్సివుంటుంది. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి..... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఏప్రిల్ 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ అనూహ్యంగా 33,887 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత, అంతక్రితంవారంతో పోలిస్తే 2391 పాయింట్ల భారీలాభంతో 33,718 పాయింట్ల వద్ద ముగిసింది. గత గురు, శుక్రవారాల్లో యూరప్, అమెరికా మార్కెట్లు పతనమైన నేపథ్యంలో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్డౌన్తో మొదలైతే 32,170 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 31,660–31,275 పాయింట్ల శ్రేణి మధ్య గట్టి మద్దతు లభ్యమవుతున్నది. ఈ శ్రేణిని కోల్పోతే ఏప్రిల్ నెలలో జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్మెంట్ స్థాయి అయిన 30,750 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ సోమవారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే క్రమేపీ 33,880 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపైన ముగిస్తే 34,100 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 34,900 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్ వుంటుంది. నిఫ్టీ 9,390 మద్దతు కోల్పోతే... క్రితం వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ...గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రైజింగ్ వెడ్జ్ ప్యాట్రన్ అప్పర్బ్యాండ్ అయిన 9,500 పాయింట్ల స్థాయిని ఛేదించినంతనే 9,889 పాయింట్ల గరిష్టస్థాయికి శరవేగంగా ర్యాలీ జరిపింది. ఈ స్థాయి 12,430 పాయింట్ల గరిష్టం నుంచి 7,511 పాయింట్ల కనిష్టంవరకూ జరిగిన పతనానికి 50 శాతం రిట్రేస్మెంట్ స్థాయి. వచ్చేవారం సైతం ఈ స్థాయిని పరిరక్షించుకుంటేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ సోమవారం మార్కెట్ గ్యాప్డౌన్తో మొదలైతే 9,390 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 9,260–9,140 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 8,980 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. 7,511 పాయింట్ల నుంచి 9,889 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్మెంట్ స్థాయి అయిన 8,980 పాయింట్ల స్థాయిని కోల్పోతే నిఫ్టీ ప్రస్తుత రిలీఫ్ర్యాలీకి తెరపడినట్లే. అయితే ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే మరోదఫా 9,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 9,960 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన కొద్దిరోజుల్లో 10,200 వరకూ కూడా పెరిగే చాన్స్ వుంటుంది. – పి. సత్యప్రసాద్ -
సెన్సెక్స్ 3,935 పాయింట్లు డౌన్
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలం కొనసాగుతుండటంతో స్టాక్ మార్కెట్ నష్టాలు కూడా కొనసాగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ వైరస్ కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు మరింతగా కుంటుపడతాయనే భయాందోళనతో ఇన్వెస్టర్లు సోమవారం ఎడాపెడా అమ్మకాలకు పాల్పడ్డారు. డాలర్తో రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్ట స్థాయి, 76 మార్క్ను దాటిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, ప్రపంచ మార్కెట్ల పతనం తీవ్రమైన ప్రభావమే చూపించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయిలన్నింటినీ కోల్పోవడం ఇన్వెస్టర్ల సెంట్మెంట్ను దెబ్బకొట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ 26,000 పాయింట్లు దిగువకు పడిపోగా, నిఫ్టీ ఒక్క రోజే 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. సెన్సెక్స్ 3,935 పాయింట్లు పతనమై 25,981 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1,135 పాయింట్లు నష్టపోయి 7,610 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 3,400 పాయింట్ల నష్టంతో 16,918 పాయింట్లకు పడిపోయాయి. ఈ సూచీలన్నీ ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పతనం కావడం ఇదే మొదటిసారి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 13.15 శాతం, నిఫ్టీ 12.9%, బ్యాంక్ నిఫ్టీ 16% నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు నాలుగేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 10 శాతం పతనం కావడంతో సర్క్యూట్ బ్రేకర్ నిబంధనల ప్రకారం ట్రేడింగ్ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. ఆ తర్వాత ట్రేడింగ్ మొదలైనప్పటికీ, నష్టాలు కొనసాగాయి. పతనానికి పంచ కారణాలు.. ► ఇండియా లాక్డౌన్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.41 లక్షలకు, మరణాలు 14,700కు, రికవరీలు 99,000కు చేరాయి. ఇక భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 468కు పెరగ్గా, మరణాలు పదికి చేరాయి. ప్రస్తుతం భారత్ కీలక దశలో ఉందని, ఇటలీ గతి పడుతుందా, చైనాలాగా రికవరీ అవుతుందా చూడాల్సి ఉందని నిపుణులంటున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో ఈ వైరస్ కట్టడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. పలు కంపెనీలు తమ తమ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు ఆపేస్తున్నాయని ప్రకటించాయి. మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాట నడవనున్నాయి. ఈ లాక్డౌన్లు, ప్లాంట్ల మూసివేతల కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలు మందగించి ఆర్థిక వ్యవస్థ కుంటుపడగలదనే భయాలతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత నెల 24 నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అయినకాడికి షేర్లను అమ్మేస్తున్నారు. సోమవారం నాటి రూ.2,989 కోట్ల నికర అమ్మకాలను కలుపుకుంటే ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ.54,232 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ► రూపాయి ఢమాల్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మరింతగా కొనసాగుతాయనే భయాలతో డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోతోంది. సోమవారం రూపాయి విలువ జీవిత కాల కనిష్ట స్థాయి, 76.30కు చేరింది. ► ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి పలు దేశాలు లాక్డౌన్లు ప్రకటించాయి. ఈ ప్రపంచవ్యాప్త లాక్డౌన్లు మహా మాంద్యానికి దారి తీస్తాయనే భయాలతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. చైనా, హాంగ్కాంగ్, దక్షిణ కొరియాల సూచీలు 5 శాతం మేర నష్టపోయాయి. ఒక్క జపాన్ నికాయ్ సూచీ మాత్రం 2 శాతం పెరిగింది. ఇక యూరప్ మార్కెట్లు 5 శాతం నష్టాల్లో మొదలై, 3–5 శాతం నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు ఏడేళ్ల కనిష్టాలకు పడిపోయాయి. అమెరికా ఫ్యూచర్స్ 5 శాతం మేర నష్టపోయాయి. ► వృద్ధి అంచనాలు తగ్గింపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.2 శాతంగానే ఉండగలదని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించడం ప్రతికూల ప్రభావం చూపింది. భారత్ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 వాతంగా ఉండగలదని ఈ సంస్థ గతంలో అంచనా వేసింది. మరిన్ని వివరాలు... ► సెన్సెక్స్లోని 30, నిఫ్టీలోని 50 షేర్లు నష్టపోయాయి. ► యాక్సిస్ బ్యాంక్ షేర్ 28 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా నష్టపోయిన షేర్ ఇదే. ► 1,180 పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, ఎస్బీఐ ఈ జాబితాలో ఉన్నాయి. ► బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్లు 20 శాతం మేర నష్టపోయాయి. ► బీఎస్ఈ 500 సూచీలోని వందకు పైగా షేర్లు ఒక్క నెలలోనే 70–50% మేర క్షీణించాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ జాబితాలో ఉన్నాయి. ► పలు వాహన కంపెనీలు తమ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపేశాయి. ఫలితంగా మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటొకార్ప్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్ తదితర వాహన కంపెనీల షేర్లు 10 శాతం మేర పతనమయ్యాయి. ► రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్లు రెండేళ్ల కనిష్టానికి, యాక్సిస్ బ్యాంక్ ఆరేళ్ల కనిష్టానికి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఎనిమిదేళ్ల కనిష్టానికి, ఎం అండ్ ఎం పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. 45 నిమిషాలు ఆగిన ట్రేడింగ్ భారీ నష్టాలతోనే సెన్సెక్స్, నిఫ్టీలు ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 2,718 పాయింట్ల నష్టంతో ఆరంభమైంది. పది గంటల సమయానికే ఈ నష్టాలు 2,992 పాయింట్లు (శుక్రవారం ముగింపుతో పోల్చితే 10 శాతం నష్టం)కు చేరాయి. ఈ సమయానికి నిఫ్టీ 842 పాయింట్లు (9.6 శాతం నష్టం)తో 7,903 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ 10 శాతం నష్టపోవడంతో సర్క్యూట్ బ్రేకర్ నిబంధన ప్రకారం ట్రేడింగ్ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. సర్క్యూట్ బ్రేకర్ కారణంగా ట్రేడింగ్ను నిలిపేయడం పది రోజుల్లో ఇది రెండోసారి. ఈ నెల 13న కూడా ట్రేడింగ్ను 45 నిమిషాల పాటు ఆపేశారు. ఉదయం 11 గంటల అనంతరం ట్రేడింగ్ మళ్లీ ఆరంభమైంది. నష్టాలు కొనసాగాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఒడిదుడుకులను నివారించడానికి షార్ట్ సెల్లింగ్ నిబంధనలను కఠినతరం చేస్తూ, సెబీ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. కరోనా కేసులు తగ్గితేనే మార్కెట్ రికవరీ అవుతుందని నిపుణులంటున్నారు. 14 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ. 14.22 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇది అల్జీరియాతో సహా 130 దేశాల జీడీపీకి సమానం. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.14,22,207 కోట్లు హరించుకుపోయి రూ.1,01,86,936 కోట్లకు పడిపోయింది. భారత్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మార్కెట్లో కూడా అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు కొనసాగుతాయి. కరోనా వైరస్ వల్ల ఆర్థికంగా వాటిల్లే నష్టాన్ని తగ్గించే ఉద్దీపన చర్యల కోసం మార్కెట్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ విశ్లేషకులు మాంద్యం భయాలతో మార్కెట్ సోమవారం భారీగా పడిపోయింది. కరోనా అనిశ్చితి నేపథ్యంలో ఈ పతనం ఇక్కడితో ఆగుతుందా, లేదో అని చెప్పడం కష్టతరమే. అయితే వైరస్కు సంబంధించి స్వల్ప ఊరట లభించినా, మార్కెట్లో స్మార్ట్ రికవరీ ఉండొచ్చు. –సంతోశ్ మీనా, ట్రేడింగ్ బుల్స్, ఎనలిస్ట్ ఇన్వెస్టర్ల భయాన్ని ప్రతిబింబించే ఒలటైల్ ఇండెక్స్ (వీఐఎక్స్) 6.6 శాతం ఎగసి 71.56 స్థాయిలకు చేరింది. ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ.54,232 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ప్రస్తుత స్టాక్ మార్కెట్ సంక్షోభం మరింత భయాందోళనకు దారి తీయనున్నది. ఆర్బీఐ తక్షణం రేట్లను తగ్గించాలి. ప్రభుత్వం కూడా తగిన చర్యలతో ముందుకు రావాలి. మార్కెట్లను మూసేయాల్సిన అవసరం ఉంది. –దేవేన్ చోక్సీ, కేఆర్ చోక్సీ మార్కెట్ గురించి ఒక ఆరు నెలల పాటు మరచిపోండి. యోగా చేయండి. చేతిలో నగదు ఉంచుకోండి. విజయ్ కేడియా, కేడియా సెక్యూరిటీస్ 50కు పైగా షేర్లు 20 శాతం లోయర్ సర్క్యూట్లను తాకాయి. ట్రెంట్, ర్యాలీస్, పాలీక్యాబ్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. మరో 130 షేర్లు 10% లోయర్ సర్క్యూట్లను తాకాయి. మార్కెట్ పతన సమయాల్లో ఒక్క రోజు లాభాలను తర్వాతి రోజుల్లో వచ్చే నష్టాలు హరించివేసే పోకడ... పతనం ఎంత బలంగా ఉందో సూచిస్తోంది. ఇక నిఫ్టీ తదుపరి కీలక మద్దతు 6,825 పాయింట్లు. ఇక్కడి నుంచే 2016, ఫిబ్రవరి నాటి పతనం రివర్స్ అయింది. –నాగరాజ్ శెట్టి, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ -
ఆగని విలయం!
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలం కొనసాగుతుండటంతో స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ల రేట్లను దాదాపు సున్నా స్థాయికి తగ్గించినప్పటికీ, భారత్తో పాటు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లన్నీ పతనబాటలోనే సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ చరిత్రలోనే రెండో అతి పెద్ద పతనాన్ని నమోదు చేసింది. 2,713 పాయింట్లు క్షీణించి 31,390 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 758 పాయింట్లు పతనమై 9,197 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 7.96 శాతం, నిఫ్టీ 7.61 శాతం చొప్పున క్షీణించాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. నిఫ్టీ మూడేళ్లు, సెన్సెక్స్ రెండున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆరంభం నుంచి అదే వరుస.... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,000 పాయింట్ల నష్టంతో 33,103 పాయింట్ల వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 9,588 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను ఆరంభించాయి. ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,827 పాయింట్లు, నిఫ్టీ 790 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఈ నెల 12న సెన్సెక్స్ 2,919 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చరిత్రలో ఇదే అతి పెద్ద పతనం. సోమవారం రెండో అతి పెద్ద పతనం నమోదైంది. వారం వ్యవధిలో స్టాక్ సూచీలు ఇలా భారీ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. శుక్రవారం విరామం అనంతరం స్టాక్ మార్కెట్లో నష్టాలు మళ్లీ కొనసాగాయి. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని రంగాల షేర్లు భారీగా పతనమైనప్పటికీ, యస్ బ్యాంక్ షేర్ మాత్రం 45% ఎగసి రూ.37కు చేరింది. యస్ బ్యాంక్లో వివిధ బ్యాంక్లు రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుండటం, నగదు విత్డ్రాయల్ పరిమితులను మరో 2 రోజుల్లో తొలగించనుండటం సానుకూల ప్రభావం చూపాయి. రూ.7.6 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.6 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7.62 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.121.63 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే.... కోవిడ్–19 వైరస్ కల్లోలం.... కోవిడ్–19 వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతోంది. సోమవారం తాజాగా 9 కొత్త దేశాలకు పాకింది. మరోవైపు ఇటలీ, స్పెయిన్ దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో ఇప్పటివరకూ కరోనా కేసుల సంఖ్య 110కు, మరణాలు రెండుకు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి ఈ వైరస్ సోకగా, 6,500 మందికి పైగా మరణించారు. గణాంకాలతో గజగజ.... చైనా తయారీ రంగ, రిటైల్ అమ్మకాల గణాంకాలు సోమవారం వెలువడ్డాయి. చైనా తయారీ రంగ సూచీ 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. రిటైల్ అమ్మకాలు కూడా బారీగా తగ్గాయి. కోవిడ్–19 వైరస్ కల్లోలం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందనే భయాలను ఈ గణాంకాలు మరింతగా పెంచాయి. ప్రపంచ మార్కెట్ల పతనం..... ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో నష్టపోవడం, యూరప్ మార్కెట్లు ఆరంభంలోనే 8 శాతం పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ముడి చమురు ధరలు మరింత పతనం.... ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో వినియోగం తగ్గి, డిమాండ్ కూడా తగ్గగలదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు 10 శాతం మేర దిగివచ్చాయి. అమెరికా వడ్డీ రేట్లు @ 0 ఫెడ్ మరో అనూహ్య కోత వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ రెండు వారాల్లోనే రెండోసారి వడ్డీ రేట్లలో కోత పెట్టింది. అదీ ఏకంగా 1 శాతం తగ్గించేసింది. వెరసి ప్రస్తుతం ఫెడ్ ఫండ్ రేటు సున్నా (0–0.25 శాతం) స్థాయికి చేరింది. రెండు వారాల్లోనే రేటును ఫెడ్ ఏకంగా 1.5 శాతం తగ్గించడం గమనార్హం. నిజానికి ఈ నెల 17, 18 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాన్ని నిర్వహించవలసి ఉంది. అయితే కోవిడ్–19 సృష్టిస్తున్న విలయం కారణంగా రెండు వారాల క్రితం తొలిసారి అత్యవసర ప్రాతిపదికన 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున) వడ్డీ రేట్లను సున్నా స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా 700 బిలియన్ డాలర్లతో భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు బాండ్లను కొనుగోలు చేయనుంది. తాజా రేటు కోత నేపథ్యాన్ని పరిశీలిస్తే, కరోనా వైరస్తో ప్రపంచం నిలువెల్లా వణుకుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్–19 వైరస్ ప్రభావానికి లోనైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థసైతం తీవ్ర అనిశ్చితిలో పడిపోయింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ 2008 తదుపరి... 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు దారితీసిన సబ్ప్రైమ్ సంక్షోభ సమయంలో వృద్ధికి ఊతం అందించడానికి అమెరికా ఫెడ్ ఫండ్ రేటును సున్నా స్థాయికి తగ్గించడం జరిగింది. తరువాత కొన్ని సానుకూల ఆర్థిక అంశాలతో ఈ రేటు 2.5 శాతం వరకూ పెరుగుతూ వచ్చింది. అటు తర్వాత గడచిన సంవత్సర కాలంలో వేగంగా తిరిగి సున్నా స్థాయికి చేరింది. తాజాగా ఫెడ్ వడ్డీ రేట్లలో భారీ కోతలను చేపట్టడంతోపాటు.. బ్యాంకులు నగదు నిల్వలను వినియోగించుకునేందుకు వీలుగా రిజర్వ్ రిక్వైర్మెంట్స్ నిబంధనలు సడలించింది. అధ్యక్షుని ప్రశంసలు... మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ నిర్ణయాలను ప్రశంసించారు. ఫెడ్ చర్యలను ఊహించలేదని..ఇదెంతో సంతోషకర విషయమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎదురవుతున్న సంక్షోభాల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కినట్లు విశ్వసించేవరకూ కనీస వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే బాటలో ఇటీవల ఫెడ్ 0.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు.. 500 బిలియన్ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేసే చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే. అనుసరించనున్న ఆర్బీఐ! మరోవైపు భారత్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కూడా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) బాటలో నిలు స్తుందన్న సంకేతాలను ఇచ్చారు గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘కరోనా ప్రభావం నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడటానికి ఆర్బీఐ వద్ద తగిన విధానపరమైన సాధనాలు ఉన్నాయి’’ అన్నారు. ఏప్రిల్ 3న పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి పాలసీ సమీక్ష సందర్భంగా రేటు కోత నిర్ణయం ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘‘ప్రస్తుత చట్టం ప్రకారం, రేట్ కోత నిర్ణయాన్ని ద్రవ్య విధాన కమిటీ తీసుకుంటుంది. రేటు కోత నిర్ణయాన్ని తోసిపుచ్చలేను. పరిస్థితులకు అనుగుణంగా తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అన్నారు. వ్యవస్థలో లిక్విడిటీ సమస్యల్లేకుండా చర్యలు తీసుకుంటామని దాస్ పేర్కొ న్నారు. కోవిడ్ ఆందోళనలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్సహా దాదాపు 43 సెంట్రల్ బ్యాంకులు రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి. రూపాయి, క్రూడ్ క్రాష్ ముంబై: డాలర్ మారకంలో రూపాయి పతన ధోరణి కొనసాగుతోంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ఒకేరోజు 50 పైసలు పడిపోయి 74.25 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న కోవిడ్–19 భయాలు, ప్రపంచాభివృద్ధిపై దీని ప్రభావం, రేటు కోతతో వృద్ధికి ఊతం ఇవ్వాలని భావించిన అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ నిర్ణయం... వెరసి మాంద్యం భయాలు భారత్ కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి. ఈక్విటీ భారీ నష్టాలూ ఇక్కడ గమనార్హం. శుక్రవారం రూపాయి ముగింపు 73.75. ట్రేడింగ్ మొత్తంమీద 74.09 గరిష్ట–74.35 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర గురించి చూస్తే ఈ నెల 12, 13తేదీల ఇంట్రాడేల్లో వరుసగా 74.50ని చూసినా, ఇప్పటి వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం 74.39. క్రూడ్, బంగారం ‘బేర్’ మరోవైపు ఈక్విటీ మార్కెట్లతో పాటు కమోడిటీ మార్కెట్లూ కరోనా కాటుకు బలవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్ క్రూడ్ బేరల్ ధర ఈ వార్త రాసే సమయం 10.35కు 8.35 శాతం నష్టంలో (2.68 డాలర్లు) 29.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో 28.52 డాలర్లనూ చూసింది. బ్రెంట్ బ్యారల్ ధర ఇదే సమయానికి 11.73 శాతం నష్టంతో 29.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 29.55 డాలర్లనూ చూసింది. ఇక పసిడి విషయానికి వస్తే, ఔన్స్ (31.1గ్రా) ధర 5 డాలర్ల నష్టంతో 1,512 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ యల్లో మెటల్ ధర 1,451 డాలర్లనూ చూడ్డం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దేశీయంగా రూ.40,000 లోపునకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తరాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.500కుపైగా నష్టంతో రూ.39,775 వద్ద ట్రేడవుతోంది. ఎస్బీఐ కార్డ్స్కు కరోనా సెగ ఎస్బీఐ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్పై కోవిడ్–19 వైరస్ తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్ కూడా పేలవంగానే జరిగింది. మరోవైపు కొన్ని కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. కాగా పార్క్ హోటల్స్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, ఆమోదం తెలిపింది. 13 శాతం నష్టంతో లిస్టింగ్..... ఇష్యూ ధర, రూ.755తో పోల్చితే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేర్ బీఎస్ఈలో 13 శాతం నష్టంతో రూ.658 వద్ద లిస్టయింది. ఈ షేర్కు ఇదే ఇంట్రాడే కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో ఇష్యూ ధర, రూ.755కు ఎగసినప్పటికీ, చివరకు 9.5 శాతం నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 41.6 లక్షలు, ఎన్ఎస్ఈలో 6.08 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.57,199 కోట్లకు చేరింది. ఈ నెలలోనే వచ్చిన ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 22 రెట్లకు పైగా ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10.000 కోట్ల మేర నిధులు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం.. పేలవంగా లిస్టింగ్ 10% నష్టంతో రూ. 683 వద్ద ముగింపు ఐపీఓలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు (రూ.2 లక్షల కంటే తక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు) 4.27 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించారు. ఇష్యూ ధర రూ.755తో పోల్చితే ఈ షేర్ బీఎస్ఈలో రూ.72 నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. ఒక్కో షేర్కు రూ.72 నష్టం పరంగా చూస్తే, మొత్తం రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం వచ్చింది. అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు రూ.174 కోట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు రూ.132 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. మరిన్ని విశేషాలు.... సెన్సెక్స్లోని అన్ని షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 17.5 శాతం క్షీణించి రూ.663 వద్ద ముగిసింది సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. టాటా స్టీల్ 11 శాతం, హెచ్డీఎఫ్సీ 11 శాతం, యాక్సిస్ బ్యాంక్ 10 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 10% మేర నష్టపోయాయి. ► యస్ బ్యాంక్ తరహానే త్వరలోనే సంక్షోభంలోకి జారిపోగలదన్న భయాలు చెలరేగడంతో ఆర్బీఎల్ బ్యాంక్ 21% నష్టపోయి రూ.163 వద్ద ముగిసింది. ► వివిధ రాష్ట్రాల్లో సినిమా హాళ్లను ఈ నెల 31 వరకూ మూసేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడంతో మల్టీప్లెక్స్లను నిర్వహించే పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు 19 శాతం వరకూ నష్టపోయాయి. ► దాదాపు 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బంధన్ బ్యాంక్, పీవీఆర్, ఆర్బీఎల్ బ్యాంక్, యూపీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఇక్రా, పిరామల్ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఈ జాబితా కొన్ని. ► 600కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. అవెన్యూ సూపర్మార్ట్స్, ఐఆర్సీటీసీ, ఆఫిల్ ఇండియా, సువెన్ ఫార్మా, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, అదానీ గ్రీన్ ఎనర్జీ, డీహెచ్ఎఫ్ఎల్, వెల్స్పన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► సెన్సెక్స్ 2,700 పాయింట్ల నష్టంలో హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్ల వాటాయే దాదాపు నాలుగో వంతుగా ఉంది. ఈ రెండు షేర్లు కలిసి 660 పాయింట్ల మేర సెన్సెక్స్కు పడగొట్టాయి. సెన్సెక్స్ను....రిలయన్స్ ఇండస్ట్రీస్ 276 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 271 పాయింట్లు, ఇన్ఫోసిస్ 211 పాయింట్ల మేర నష్టపరిచాయి. ఫెడ్ తగ్గించినా... నష్టకష్టాలే! అమెరికా ఫెడరల్ రిజర్వ్ అత్యవసర చర్యల్లో భాగంగా ఆదివారం ఫండ్స్ రేట్ను దాదాపు సున్నా స్థాయికి తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫండ్స్ రేటు 0–0.25 శాతం రేంజ్లో ఉంది. ఈ రేట్ల ఆధారంగానే బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. అంతే కాకుండా 70,000 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఒక్క వారంలో ఫండ్స్ రేట్లను ఫెడరల్ రిజర్వ్ తగ్గించడం ఇది రెండోసారి. 2008లో సబ్ప్రైమ్ సంక్షోభం నెలకొన్నప్పుడు కూడా ఇలానే ఫెడ్ రేట్లను తగ్గించింది. సాధారణ పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను తగ్గిస్తే, అదీ సున్నా స్థాయికి వస్తే, ప్రపంచ మార్కెట్లు లాభాలతో ఊగిపోయేవి. కానీ ఈ సారి పరిస్థితి రివర్స్ అయింది. ఆర్థిక సంక్షోభం అంచనాలను మించి ఉంటుందని, ఫెడ్ రేట్లను తగ్గించడం దీనికి సంకేతమన్న భావనతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. పార్క్ హోటల్స్ ఐపీఓ @ రూ.1,000 కోట్లు... పార్క్ హోటల్స్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు రూ.600 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తారు. మొత్తం మీద ఈ ఐపీఓ సైజు రూ.1,000 కోట్లు. ఈ కంపెనీ హైదరాబాద్, విశాఖపట్టణం బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, జైపూర్, జోధ్పూర్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ద పార్క్ బ్రాండ్ హోటళ్లను నిర్వహిస్తోంది. ఐపీఓలు వాయిదా...: కోవిడ్–19 వైరస్ ధాటికి స్టాక్ మార్కెట్ విలవిలలాడుతుండటంతో పలు కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. ఈ నెల 4నే మొదలైనా, ఐపీఓను ఈ నెల 16 వరకూ పొడిగించినప్పటికీ, ఇన్వెస్టర్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ కంపెనీ తన ఐపీఓను ఉపసంహరించుకుంది. కాగా బర్గర్ కింగ్ ఇండియా కంపెనీ తన ఐపీఓను వాయిదా వేసుకుందని సమాచారం. ఈ నెలాఖరులో ఐపీఓకు వచ్చి రూ.400 కోట్లు సమీకరించాలనేది ఈ కంపెనీ ప్రణాళిక. జీడీపీకి కరోనా కాటు! వృద్ధి 50 బేసిస్ పాయింట్లు తగ్గుతుందన్న ఆందోళన ముంబై: కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం మరింత వ్యవధిపాటు కొనసాగితే 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు అర శాతం వరకు తగ్గుతుందన్న ఆందోళన దేశీయ కంపెనీల నుంచి వ్యక్తమైంది. అంతేకాదు, ఈ వైరస్ ప్రభావం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యలోటు మరింత పెరిగిపోవడమే కాకుండా బ్యాంకులకు మొండి బాకీలు (ఎన్పీఏలు) మరింత జోడవుతాయని పేర్కొన్నాయి. కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉండొచ్చన్న దానిపై రేటింగ్ ఏజెన్సీ కేర్ 150 మంది సీఈవోలు, సీఎఫ్వోలు, ఇన్వెస్టర్లు, అనలిస్టులు, ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. వైరస్ ఎక్కువ కాలం పాటు ఉంటే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. జీడీపీ అరశాతం వరకు తగ్గొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాయపడితే, 22 శాతం మంది అయితే ఒక శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేశారు. రేట్ల కోతతో కీడే ఎక్కువ వివిధ దేశాల కేంద్ర బ్యాంక్లు రేట్లను తగ్గించడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. కోవిడ్ వైరస్ ఆర్థికంగా చూపించే ప్రభావం అంచనాల కంటే అధికంగానే ఉండగలదన్న సంకేతాలను కేంద్ర బ్యాంక్ల రేట్ల తగ్గింపు సూచిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. –వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ పతనం కొనసాగే అవకాశాలే అధికం దేశీయంగా కోవిడ్–19 వైరస్ మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఇది ఎక్కడ దాకా చేరుతుందో అంతూ, దరీ తెలియడం లేదు. రానున్న రోజుల్లో ఈ పతనం కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్. -
కోవిడ్ కల్లోలంలో ప్రపంచ మార్కెట్!
చైనాను గడగడలాడిస్తున్న కోవిడ్–19(కరోనా) వైరస్ 28కు పైగా దేశాలకు పాకడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా సోమవారం భారీగా నష్టపోయింది. చైనా, ఇతర దేశాల్లో కోవిడ్–19 వైరస్ కారణంగా తయారీ కార్యకలాపాలు మందగించి సరఫరా సమస్యలు తలెత్తగలవన్న ఆందోళనతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. డాలర్తో రూపాయి మారకం విలువ పతనం కావడం కూడా ప్రభావం చూపించింది. సెన్సెక్స్, నిఫ్టీలు కీలకమైన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ 40,500 పాయింట్లు, నిఫ్టీ 11,900 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 807 పాయింట్లు నష్టపోయి 40,363 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 251 పాయింట్లు నష్టపోయి 11,829 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2 శాతం మేర క్షీణించాయి. స్టాక్ మార్కెట్కు ఇది ఈ ఏడాది రెండో అతి పెద్ద పతనం. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఫిబ్రవరి 1న సెన్సెక్స్ 987 పాయింట్లు పతనమైంది. ఈ కల్లోలం మరికొంత కాలం....! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం కుదిరే విషయమై అనిశ్చితి నెలకొనడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు 4 శాతం మేర పతనమైనా, మన మార్కెట్లో నష్టాలు ఆగలేదు. కోవిడ్–19 వైరస్ కల్లోలం మరికొంత కాలం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా పెట్టుబడులు సురక్షిత సాధనాలైన డాలర్, పుత్తడిలోకి మరలిపోతున్నాయి. ఫలితంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి. పుత్తడి ధర ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఔన్స్ బంగారం 1,700 డాలర్లకు చేరువయ్యింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం రూ.44,000 దాటేసింది. లోహ షేర్లు విలవిల.. ప్రపంచంలో లోహాలను అత్యధికంగా వినియోగించేది చైనా. ఇప్పుడు ఈ దేశంలో కోవిడ్–19 వైరస్ కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలు కుంటు పడుతున్నాయి. ఇది మరికొంత కాలం కొనసాగతే, లోహాల వినియోగం తగ్గగలదన్న భయాలతో ఇన్వెస్టర్లు లోహ షేర్లను తెగనమ్మారు. దీంతో లోహ షేర్లు భారీగా క్షీణించాయి. అన్ని రంగాల సూచీల్లో లోహ సూచీయే అత్యధికంగా నష్టపోయింది. ఈ నష్టాలు ఎందుకంటే... 1. కోవిడ్–19 కల్లోలం చైనాలో కాకుండా కొత్త ప్రాంతాలకు కోవిడ్–19 వైరస్ విస్తరిస్తోంది. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ల్లో కోవిడ్–19(కరోనా) వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. విస్తరిస్తున్న కోవిడ్–19 వైరస్ ప్రభావం అంతర్జాతీయంగా వృద్ధిపై అంచనాల కంటే అధికంగానే ఉండొచ్చన్న భయాందోళనలతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 2–3 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 4 శాతం మేర నష్టపోయాయి. అన్ని దేశాల్లో పర్యాటక, విమానయాన రంగ షేర్లు బాగా నష్టపోయాయి. 2. రూపాయి 34 పైసలు డౌన్... డాలర్తో రూపాయి మారకం విలువ 34 పైసలకు పైగా పతనమై 71.98కు తగ్గడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో 72.01ను తాకింది. 3. సరఫరాలపై ప్రభావం.... వాహన, మొబైల్ ఇతర పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలను మన కంపెనీలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. కోవిడ్–19 వైరస్ కారణంగా ఈ విడిభాగాల సరఫరాల్లో సమస్యలు తలెత్తుతాయని, ఇది డిమాండ్, అమ్మకాలపై తీవ్రంగానే ప్రభావం చూపగలదన్న అంచనాలతో అన్ని రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 4. జీడీపీ అంచనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019–2020) భారత్ వృద్ధి 4.9 శాతం మాత్రమే ఉంటుందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైయిడ్ ఎకనామిక్ రీసెర్చ్(ఎన్సీఏఈఆర్) అంచనా వేస్తోంది. కేంద్ర గణాంకాల సంస్థ 5 శాతం అంచనాల కంటే ఇది తక్కువ. కాగా ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్ జీడీపీ అంచనాలు ఈ వారంలోనే వెలువడుతాయి. రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.18 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.155.33 లక్షల కోట్లకు పరిమితమైంది. మరిన్ని విశేషాలు... ⇔ సెన్సెక్స్లోని అన్ని (30) షేర్లూ నష్టపోయాయి. ⇔ టాటా స్టీల్ 6.3% నష్టంతో రూ.415 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ⇔ ఎయిర్పోర్ట్ బిజినెస్లో 49 శాతం వాటాను ఫ్రాన్స్కు చెందిన గ్రపే ఏడీపీ కంపెనీకి జీఎమ్ఆర్ ఇన్ఫ్రా విక్రయించనున్నది. ఈ విక్రయానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలపడంతో జీఎమ్ఆర్ ఇన్ఫ్రా షేర్ 8 శాతం లాభంతో రూ.25.45 వద్ద ముగిసింది. ⇔ 170కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. జిల్లెట్ ఇండియా, హీరో మోటొకార్ప్, ఎల్ అండ్ టీ, హిందుస్తాన్ జింక్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మార్కెట్ భారీగా నష్టపోయినా, 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. -
స్టాక్ మార్కెట్లో గ్లోబల్ జోష్..
ముంబై : గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్తో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడుతున్నాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, హిందుస్తాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడుతుండగా..వొడాఫోన్, యస్బ్యాంక్, బీహెచ్ఈఎల్, అశోక్ లేలాండ్ షేర్లు స్వల్పంగా నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 381 పాయింట్ల లాభంతో 41,597 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 116 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,223 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చదవండి : స్టాక్ మార్కెట్లకు గ్లోబల్ షాక్.. -
మార్కెట్కు చమురు నష్టాలు
ముడి చమురు ధరలు భగ్గుమనడంతో శుక్రవారం మన మార్కెట్ నష్టపోయింది. అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సులేమాని మరణించడం, దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించడంతో ముడి చమురు ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా నష్టపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 37 పైసలు పతనమై 71.75కు చేరడం ప్రతికూల ప్రభావం చూపించింది.దీంతో కొత్త ఏడాది వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో 278 పాయింట్ల మేర పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 162 పాయింట్లు పతనమై 41,465 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 12,227 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక వారం పరంగా చూస్తే, మార్కెట్ నష్టపోయింది. సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చివర్లో ఒకింత రికవరీ అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీమ్ మరణించడం, దీనికి ప్రతి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరగనున్నాయి. ఈ దాడి నేపథ్యంలో సురక్షిత సాధనాలైన పుత్తడి, జపాన్ కరెన్సీ యెన్ల్లోకి రిస్క్ అధికంగా ఉన్న ఈక్విటీల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ దాడి కారణంగా ముడి చమురు ధరలు 4.4 శాతం మేర పెరిగాయి. మధ్యాసియాలో ఉద్రిక్తతలు చెలరేగుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, మార్కెట్ రికార్డ్ల స్థాయిల్లో ఉండటంతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశాలున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. డాలర్ బలపడటంతో ఐటీ షేర్లు ఎగిశాయని పేర్కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ లాభాల్లో మొదలైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ట్రేడింగ్ చివర్లో కొంత రికవరీ చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. ►రూపాయి పతనం కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ►ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు 0.04–2.1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ముడి చమురును ముడి పదార్థంగా వినియోగిస్తున్న పెయింట్స్, విమానయాన కంపెనీల షేర్లు కూడా నష్టపోయాయి. ►ఏషియన్ పెయింట్స్ షేర్ 2.1 శాతం నష్టంతో రూ.1,752 వద్ద ముగిసింది. పెయింట్ల తయారీలో ముడి పదార్థంగా ముడి చమురు ఉత్పత్తులను వినియోగిస్తారు. -
బేర్ ‘విశ్వ’రూపం!
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధభయాలు, కార్పొరేట్ల ఆదాయాలు బలహీనంగా ఉండటం, రూపాయి క్షీణత, జమ్మూకశ్మీర్ పరిణామాలు.. అన్నీ కలగలిసి సోమవారం మార్కెట్లను కూలదోశాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ఇవన్నీ ప్రతికూల ప్రభావాలు చూపడంతో సెన్సెక్స్ 418 పాయింట్లు క్షీణించి కీలకమైన 36,700 పాయింట్ల దిగువకు పతనమైంది. అయిదు నెలల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఇక నిఫ్టీ సైతం 135 పాయింట్లు పతనమై 10,863 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ, సెన్సెక్స్ రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్ల దాకా కూడా పతనమైంది. చివర్లో కొంత కోలుకుని 418 పాయింట్ల తగ్గుదలతో (1.13 శాతం) 36,699.84 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ 36,417 – 36,844 పాయింట్ల కనిష్ట, గరిష్టస్థాయిల మధ్య తిరుగాడింది. ‘మార్కెట్ హెచ్చుతగ్గులకు అనేక ప్రతికూలాంశాలు కారణమయ్యాయి. జమ్మూకశ్మీర్ పరిణామాలతో రాజకీయ సంక్షోభం తలెత్తవచ్చన్న ఆందోళనలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్పీఐ) సర్చార్జీ నుంచి మినహాయింపునకు సంబంధించి కొత్తగా మరే సంకేతాలు లేకపోవడం వంటివి కూడా మార్కెట్ హెచ్చుతగ్గులకు కారణమయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు ఆఖర్లో కొంత రికవర్ కాగా.. బలహీన రూపాయి వల్ల ఐటీ రంగ షేర్లు ఆసాంతం లాభాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు సంబంధించిన చర్చలకు ప్రతికూలతలు ఉండటం, ఎఫ్పీఐలు రిస్కులకు దూరంగా ఉండాలని భావిస్తుండటం వంటి అంశాల వల్ల.. మార్కెట్ల కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉంది‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విపక్షాల ఆందోళనల మధ్య.. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల సూచీలు క్షీణతలోనే.. ఐటీ మినహా.. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఎనర్జీ 2.7 శాతం తగ్గగా.. మెటల్, బ్యాంక్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఫార్మా తదితర సూచీలు తగ్గాయి. ఇక బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీ కూడా 1 శాతం పైగా తగ్గాయి. యస్ బ్యాంక్ 8 శాతం డౌన్.. ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న యస్ బ్యాంక్ షేర్లకు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రూపంలో మరో షాక్ తగిలింది. అసెట్ క్వాలిటీ దిగజారుతుండటం, ఎన్బీఎఫ్సీలకు భారీగా రుణాలిచ్చి ఉండటం వంటి ప్రతికూల అంశాల కారణంగా బ్యాంక్ రేటింగ్ను డౌన్గ్రేడ్ చేసే అంశం ఇంకా పరిశీలనలోనే ఉందంటూ మూడీస్ వెల్లడించింది. రెండు నెలల్లో మూడీస్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఇది రెండోసారి కావడంతో బ్యాంక్ షేరు భారీగా తగ్గింది. సెన్సెక్స్ షేర్లలో యస్ బ్యాంక్ అత్యధికంగా 8.15 శాతం క్షీణించింది. ఇక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు కూడా రేటింగ్ సెగ తప్పలేదు. రిలయన్స్ రేటింగ్ను న్యూట్రల్ నుంచి అండర్పెర్ఫార్ఫ్కి తగ్గించడంతో పాటు టార్గెట్ రేటును రూ. 1,350 నుంచి రూ. 995కి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ క్రెడిట్ సూసీ ప్రకటించింది. దీంతో రిలయన్స్ షేరు 3.48 శాతం క్షీణించి రూ. 1,141 వద్ద క్లోజయ్యింది. టాటా మోటార్స్ 5.25 శాతం, పవర్గ్రిడ్ 4.42 శాతం, కోటక్ బ్యాంక్ (3.13 శాతం) తగ్గాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో అత్యధికంగా లాభపడిన వాటిల్లో ఉన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ 10 శాతం పతనం.. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) షేరు మరింత పతనమైంది. ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ తప్పుకుందన్న వార్తలతో 10% క్షీణించింది. బీఎస్ఈలో 41.95 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 12.43% క్షీణించి 52 వారాల కనిష్టమైన రూ. 40.85 స్థాయికి కూడా తగ్గింది. ఎన్ఎస్ఈలో 10.07 శాతం క్షీణతతో రూ. 41.95 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 22.03 లక్షలు, ఎన్ఎస్ఈలో 1.97 కోట్ల షేర్లు చేతులు మారాయి. డెలాయిట్ ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదంటూ డీహెచ్ఎఫ్ఎల్ వివరణనిచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్కు రూ. 90,000 కోట్ల రుణభారం ఉంది. నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల సంపద ఆవిరి లార్జ్ క్యాప్, మిడ్.. స్మాల్ క్యాప్ అనే తేడా లేకుండా మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతుండటంతో గడిచిన నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. జూలై 5న రూ. 153.58 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 శాతం తగ్గి సోమవారం నాటికి రూ. 138 లక్షల కోట్లకు పడిపోయింది. ఇదే వ్యవధిలో సెన్సెక్స్ 8 శాతం క్షీణించింది. ఇక కరెన్సీ యుద్ధాలు..! అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఇక కరెన్సీ వార్కు దారితీయనుందన్న భయాలతో వివిధ దేశాల కరెన్సీ విలువలు కుప్పకూలాయి. ఈ ప్రభావం రూపాయి మారకంపై కూడా ప్రభావం చూపింది. ఒకే రోజు 113 పైసలకు పైగా కుప్పకూలింది. కొత్తగా మరో 300 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా ఎగుమతులపై 10 శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయం ప్రభావాలను ఎదుర్కొనే క్రమంలో ఎగుమతిదారులకు ఊతమిచ్చే ఉద్దేశంతో సొంత కరెన్సీ విలువను చైనా తగ్గించుకోనుందన్న(డీ వేల్యూ) వార్తలు వచ్చాయి. దీంతో డాలర్తో పోలిస్తే చైనా యువాన్ విలువ 7.03 స్థాయికి క్షీణించింది. ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలం.. అమెరికా సుంకాల దాడిని ఎదుర్కొనేందుకు చైనా కరెన్సీ అస్త్రాన్ని ప్రయోగించడం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఆసియాలో కీలక సూచీలు భారీగా క్షీణించాయి. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.6 శాతం, జపాన్ నికాయ్ 1.7 శాతం మేర తగ్గాయి. హాంకాంగ్లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల ఆందోళనలు కూడా తోడవడంతో హాంగ్సెంగ్ మూడు శాతం దాకా పడింది. ఈ ప్రభావాలతో అటు యూరప్ స్టాక్స్ కూడా రెండు శాతం దాకా క్షీణించాయి. అమెరికాలో కీలక సూచీలు డోజోన్స్ ఏకంగా 2.6 శాతం, నాస్డాక్ 3.3 శాతం మేర పడ్డాయి. రూపాయి విలవిల... ఆరేళ్లలో అతిపెద్ద పతనం! డాలర్ మారకంలో ఒకేరోజు 113 పైసలు డౌన్ 70.73 వద్ద ముగింపు నాలుగు నెలల కనిష్టస్థాయి ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకేరోజు 113 పైసలు (1.62 శాతం) పతనం అయ్యింది. 70.73 వద్ద ముగిసింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. గడచిన ఆరు సంవత్సరాల్లో (2013 ఆగస్టు తరువాత) రూపాయి ఒకేసారి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన మూడు రోజుల ట్రేడింగ్లో రూపాయి భారీగా 194 పైసలు నష్టపోయింది. మూడు ప్రధాన కారణాలు... ► అమెరికా–చైనా వాణిజ్య భయాలతో విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ మార్కెట్ అమ్మకాలు ► అమెరికా డాలర్ మారకంలో చైనా విదేశీ మారకద్రవ్యం– యువాన్ భారీ పతనం. 2008 తరువాత మొట్టమొదటిసారి డాలర్ మారకంలో చైనా యువాన్ 7% పతనమైంది. ఇది అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కొత్త దశకు సంకేతమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహకర్త వీకే శర్మ పేర్కొన్నారు. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ కరెన్సీ రీసెర్చ్ హెడ్ రాహుల్ గుప్తా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► కశ్మీర్ అంశంపై అనిశ్చితి. ఈ మూడు ప్రతికూలతలతో నిజానికి రూపాయి మరింత పతనం కావాల్సి ఉంది. అయితే అంతర్జాతీయంగా తక్కువ ధర వద్ద ట్రేడవుతున్న క్రూడ్ ధరలు రూపాయి పతనాన్ని కొంత నిలువరించాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్ ట్రేడింగ్ మొదట్లో రూపాయి 70.20 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.74 కనిష్టాన్ని చూసింది. 70.18 గరిష్టస్థాయిని తాకినా.... అంతకుమించి బలపడలేకపోయింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాలతో రూపాయి కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. ఇక్కడ నుంచి రూపాయి మరింత బలపడలేకపోయింది. బంగారం భగభగ ► కరెన్సీల పతనం, వాణిజ్య యుద్ధం నేపథ్యం ► ఔన్స్కు 1,482 డాలర్లకు దూకుడు ► దేశీయంగానూ కొత్త రికార్డులు ► ఢిల్లీలో రూ. 37 వేలకు చేరువ న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీలు డాలర్ మారకంలో పతనం కావడం పసిడికి వరమైంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం భారీగా పెరిగింది. ఒకదశలో 1,481.75 డాలర్ల గరిష్టాన్ని తాకింది. గడచిన ఆరేళ్లలో పసిడి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటలకు పసిడి ధర గత శుక్రవారం ధరతో పోల్చితే, 20 డాలర్ల లాభంతో 1,477 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పసిడిని పెట్టుబడులకు సురక్షితమైనదిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ట్రేడవుతుంటే, చైనా కరెన్సీ యువాన్ ఏకంగా 7 శాతం పతనమైంది. దేశీయంగా రూపాయి ఎఫెక్ట్ తోడు... అంతర్జాతీయంగా పరుగుకు తోడు, డాలర్ మారకంలో రూపాయి విలువ 1.6 శాతంపైగా పతనం చెందడంతో దేశంలో బంగారం ధర ఒక్కసారిగా మెరిసింది. ఢిల్లీలో సోమవారం ధర 10 గ్రాములుకు (99.9 ప్యూరిటీ) రూ.800 పెరిగి రూ.36,970కి చేరింది. 99.5 ప్యూరిఈ ధర కూడా రూ.800 ఎగసి రూ.36,800కి చేరింది. బంగారంతోపాటు వెండి ధర కూడా ఢిల్లీలో భారీగా కేజీకి రూ.1,000 పెరిగింది. రూ.43,100కి చేరింది. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటల సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో 10 గ్రాముల పసిడి ధర క్రితం శుక్రవారం ధరతో పోల్చి రూ.988 లాభంతో రూ.37,259 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.37,347ను కూడా తాకింది. కాగా వెండి ధర రూ.991 లాభంలో రూ.42,355 వద్ద ట్రేడవుతోంది. ఇదే రీతిన ట్రేడింగ్ ముగిస్తే, మంగళవారం దేశంలో పసిడి ధరలు మరింత పరుగు పెట్టే అవకాశం ఉంది. -
అమెరికా వడ్డీరేటు పావు శాతం కోత
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును పావు శాతం మేర తగ్గించింది. దీంతో వడ్డీ రేటు శ్రేణి 2–2.25 శాతం స్థాయికి దిగి వచ్చింది. 2008 తర్వాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ద్రవ్యోల్బణం నిర్దేశించుకున్న స్థాయికంటే (2 శాతం) దిగువనే ఉండటం తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని రేట్లను తగ్గించినట్లు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్వోఎంసీ) తెలిపింది. ఆర్థిక మాంద్యం పరిస్థితులేమీ లేకుండా, ఎకానమీ పటిష్టంగా ఉన్న సమయంలో ఇలా వడ్డీ రేట్లను తగ్గించడం 1998 తర్వాత ఇదే తొలిసారి. ఎకానమీకి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను అరశాతమైనా తగ్గించాల్సి ఉంటుందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నప్పటికీ రేట్ల కోతను పావు శాతానికి పరిమితం చేయడం గమనార్హం. -
ట్రేడ్ వార్ భయాలు : పసిడి పరుగు
సాక్షి,ముంబై : బులియన్ మార్కెట్లో పసిడి పరుగుకు అడ్డే లేదు. అమెరికా-ఇరాన్ ట్రేడ్ వార్ ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షిత పెట్టుబడిగా భావించి పుత్తడి కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో మంగళవారం కూడా పుంజుకున్న బంగారం రూ. 200 ఎగిసి 10 గ్రా. రూ.34,470 పలుకుతోంది. స్థానిక ఆభరణాల కొనుగోళ్లు, అంతర్జాతీయంగా సానుకూల ధోరణి దేశీయ మార్కెట్లలో ధరలను పెంచిందని ఎనలిస్టులుచెబుతున్నారు. వెండి ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. కిలో వెండి ధర రూ.110 పుంజుకుని 39, 200 పలుకుతోంది. నాణేల తయారీదారులు, పరిశ్రమల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో వెండి ధరలు నింగికే చూస్తున్నాయి. గ్లోబల్గా కూడా ఔన్స్ గోల్డ్ ధర 1430 డాలర్లు వద్ద ఉంది. వెండి ఔన్స్ ధర 16 డాలర్లుగా ఉంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధరలు రూ .200 పెరిగి 10 గ్రాములకు వరుసగా రూ .34,470, రూ .34,300 కు చేరుకున్నాయి. సావరిన్బంగారం కూడా ఎనిమిది గ్రాములకు రూ .100 పెరిగి రూ .26,900 కు చేరుకుంది. ఆర్థిక అనిశ్చితి, ట్రేడ్ వార్ అందోళనల మధ్య డాలర్ సూచీ గణనీయంగా తగ్గడం, బాండ్ ఈల్డ్స్ తగ్గడం బంగారం కొనుగోలుకు తోడ్పడి ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారు. -
ట్రంప్ షాక్: ప్రపంచ మార్కెట్లు కుదేలు
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్లను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనా దిగుమతులపైన 25శాతం సుంకాల విధింపునకు సంతకం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. తగిలింది. వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళనలు చెలరేగడంతో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. గత ఆరువారాల్లో అతి పెద్ద పతనం నమోదైంది. డోజౌన్స్ ( 2.93 శాతం) దాదాపు 724 పాయింట్లు కుప్పకూలింది. ఎస్అండ్పీ 68 పాయింట్లు(2.5 శాతం) పతనమై 2,644 వద్ద స్థిరపడింది. ఇక నాస్డాక్ 179 పాయింట్లు(2.4 శాతం) తిరోగమించి 7,167 వద్ద ముగిసింది. వెరసి ఫిబ్రవరి 8 తరువాత అత్యధిక స్థాయిలో నష్టపోయాయి. ఇదే ట్రెండ్ షాంఘై, తైవాన్ ఇండెక్స్ తదితర ఆసియా మార్కెట్లలో కూడా కనిపిస్తోంది. ఈ నెగిటివ్ సెంటిమెంట్ కొనసాగే అవకాశాలున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఆసియా మార్కెట్లుకూడా ఇదే బాటలో ఉన్నాయి. దేశీయ స్టాక్మార్కెట్లకు కూడా ట్రంప్ సెగ తగలనుంది. ముఖ్యంగా శుక్రవారం ఉదయం ఎస్జీఎక్స్ నిఫ్టీ 150 పాయింట్ల పతనం దీనికి సంకేతంగా కనిపిస్తోంది. దీంతో నిఫ్టీ 10వేల స్థాయికి కిందికి పడిపోవచ్చనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో నెలకొంది. -
వరుసగా మూడో రోజు నష్టాలే
ముంబై : గ్లోబల్గా బలహీనమైన సంకేతాలు రావడంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలు పాలయ్యాయి. సెన్సెక్స్ 137 పాయింట్ల నష్టంలో 34,047 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల నష్టంలో 10,458 వద్ద స్థిరపడ్డాయి. నేటి మార్కెట్లో బ్యాంకు, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగాల షేర్లు ఎక్కువగా మార్కెట్లను దెబ్బతీశాయి. జీడీపీ వృద్ధి డేటా ఆశాజనకంగానే విడుదలైనప్పటికీ, గ్లోబల్గా మాత్రం సెంటిమెంట్ బలహీనంగా ఉండటం మార్కెట్లను దెబ్బకొట్టింది. గురువారం ట్రేడింగ్లో ఆసియన్ మార్కెట్లన్నీ దాదాపు నష్టాలే గడించాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచనుందనే అంచనాలు మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించిందని విశ్లేషకులు చెప్పారు. మరోవైపు మూడూ రోజుల పాటు మార్కెట్లకు సెలవు ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్లో కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్, అరబిందో ఫార్మాలు టాప్ గెయినర్లుగా ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ టాప్ లూజర్లుగా ఉన్నాయి. -
హైజంప్ : లాభాల్లో స్టాక్మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 159 పాయింట్ల లాభంలో 34,315గా ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 48 పాయింట్ల లాభంలో 10,548 వద్ద కొనసాగుతోంది. టెక్నాలజీ స్టాక్స్ మద్దతుగా నిలవడంతో, అమెరికా స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. వీటి ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంతో ఆ బ్యాంకు షేర్లు నిన్నటి నుంచి భారీగా పతనమవుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్లో 10 శాతం మేర నష్టపోయిన పీఎన్బీ షేరు విలువ, నేటి ట్రేడింగ్ ప్రారంభంలోనే 8 శాతం మేర కిందకి పడిపోయింది. పీఎన్బీతో పాటు జువెల్లరీ షేర్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. ఈ కుంభకోణంలో జువెల్లరీల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తుండటంతో, గీతాంజలి జెమ్స్ 18 శాతం, పీసీ జుయలరీ 5 శాతం మేర నష్టపోతున్నాయి. యాక్సిస్ బ్యాంకు కూడా 2 శాతం నష్టాల్లో నడుస్తోంది. మరోవైపు భారతీ ఎయిర్టెల్, వేదాంతా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, యస్ బ్యాంకు, ఇన్ఫోసిస్లు లాభాలు పండిస్తున్నాయి. -
దలాల్ స్ట్రీట్లో డోజోన్స్ ప్రకంపనలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మరోసారి భారీగా పతనాన్ని నమోదు చేశాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఈక్విటీ మార్కెట్లు ఆరంభంలోనే 500పాయింట్లకు పైగా నష్టపోయాయి. అయితే ఇతర ఆసియన్ మార్కెట్లతో పోలిస్తే పతనం తక్కువగా ఉంది. షాంఘై 5.22శాతం,నిక్కీ3.22 శాతం పతనం కాగా నిఫ్టీ 1.5శాతం నష్టంతో ఉంది. సెన్సెక్స్ 514 పాయింట్ల పతనంతో 33, 898వద్ద, నిఫ్టీ10,417వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు నెగిటివ్గానే ఉన్నాయి. రియల్టీ, బ్యాంకింగ్ , ఫార్మ భారీగా నష్టపోతున్నాయి. సింగ్ బ్రదర్స్ ఫోర్టిస్కు రాజీనామా చేశారన్న వార్తలతో ఫోర్టిస్ హెల్త్ కేర్ భారీగా (8శాతం) లాభపడుతోంది. వేదాంతా, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ఇండియా, గ్లెన్మార్క్, రిలయన్స్ క్యాప్, బాటా, ఇన్ఫ్రాటెల్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఐబీ హౌసింగ్, ఐటీసీ, యాక్సిస్, అల్ట్రాటెక్, అంబుజా, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్ తదితర షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు సెయిల్, సీసీడీ, గోవా కార్బన్ స్వల్పంగా లాభపడుతోంది. -
బ్రెగ్జిట్ విలయం ఖరీదు ఎంతో తెలుసా?
బ్రెగ్జిట్ బ్లాస్ట్ ప్రపంచ మార్కెట్లలో సృష్టించిన సునామీ విలువ ఎంతో తెలిస్తే మనం నోరు వెళ్లబెట్టాల్సిందే.. కోట్లాది మంది మదుపరుల ఆశలు ఆవిరైపోయాయి. దాదాపు 1.35 కోట్ల కోట్లు (2.1 ట్రిలియన్ డాలర్లు) అలా గాలిలో కలిసిపోయాయని నివేదికలు చెబుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాల్సిందేనన్న బ్రిటన్ ప్రజల తీర్పు ప్రపంచ స్టాక్ మార్కెట్లకు అశనిపాతంలా మారింది. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడితో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు అతకలాకుతలమయ్యాయి. దీంతో పెట్టుబడిదారులు విలవిల్లాడిపోయారు. దాదాపు అన్ని రంగాలకు చెందిన కోటానుకోట్ల రూపాయల సంపద క్షణాల్లో గల్లంతైంది. అలాగే బ్రెగ్జిట్ కారణంగా భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో బ్లాక్ ఫ్రైడే నమోదైంది. మార్కెట్ పతనం నేపథ్యంలో ఒకానొక దశలో మదుపర్ల సంపద రూ. 4 లక్షల కోట్లకు పైగా ఆవిరవ్వగా.. ముగింపులో ఈ మొత్తం 1.78 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. ఎస్ అండ్ పీ డౌజోన్స్ అంచనా ప్రకారం దాదాపు 2.1 ట్రిలియన్ డాలర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది. దీన్ని రూపాయల్లోకి మారిస్తే సుమారు 1.35 కోట్ల కోట్లు అవుతుంది. ప్రపంచ ఆర్థికమాంద్యం నాటి చీకిటిరోజుల్లో కూడా ఇంత భారీ నష్టాలు చూడలేదని నోమురా సెక్యూరిటీస్ కు చెందిన జార్జ్ విశ్లేషించారు. టోక్యో, పారిస్ మార్కెట్లు 8 శాతం, ఫ్రాంక్ ఫర్ట్ సుమారు ఏడు శాతం, లండన్, న్యూయార్క్ మార్కెట్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. ఈ బ్రెగ్జిట్ సెగ ట్రావెల్ ఇండస్ట్రీని బాగానే తాకింది. హోటల్, ట్రావెల్స్ ఏజెన్సీ, విమానయాన షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇప్పటికే పౌండ్ 10 శాతం నష్టంతో 31 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది. అటు భారీ పతనంతో జపాన్ మార్కెట్ లో ఒక దశలో 10 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. డాలర్ నష్టాల్లో కూడా మినహాయింపు లేదు. ఒక సమయంలో డాలర్ విలువ నవంబర్ 2013 తర్వాత మొట్టమొదటి సారి 100 యెన్ల కిందికి కిందికి పడిపోయింది. బ్రెగ్జిట్ పరిణామాల తర్వాత బాగా లాభపడినవాటిలో వెండి బంగారాలతో పాటు జపనీస్ కరెన్సీ యెన్ కూడా ఉంది. ఐరోపా మార్కెట్లదీ ఇదే ధోరణి. ఎఫ్ఎటీఎస్ఈ (లండన్) 4శాతం, డాక్స్ (జర్మనీ) 6శాతం, సీఏసీ 40 (ఫ్రాన్స్) 8శాతం మేర నష్టాన్ని చవిచూశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మరింత నెమ్మదిస్తుందని అర్థం చేసుకోవాలని అమెరికన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రధాన ఆర్థికవేత్త జేమ్స్ చెస్సన్ చెప్పారు. లండన్ బెంచ్ మార్క్ ఎఫ్టీఎస్సీ100 ఇండెక్స్ ప్రారంభంలో 7.5 శాతం మేర క్షీణించింది. అయితే బ్రిటిష్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ ప్రకటనతో తరువాత పాక్షికంగా కోలుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా ద్రవ్యమద్దతు ఇస్తామని హామీ ఇవ్వడం కూడా దీనికి తోడ్పడింది. పారిశ్రామిక సగటు 610 పాయింట్లు కోల్పోయిందని, 2011 తర్వాత ఇదే అతిపెద్ద నష్టమని విశ్లేషకుడు కానర్ కాంప్ బెల్ చెప్పారు. బ్రిటన్ నిష్క్రమణతో భారత ఐటీ, ఆటో, గార్మెంట్, ఫార్మా ఇండస్ట్రీలు తీవ్రంగా నష్టపోయే అవకాశముందనీ, ఈయూ రెండో అతిపెద్ద మార్కెట్ కావడంతో బ్రెగ్జిట్ తదనంతర పరిణామాలు ఇండియన్ కంపెనీలపైనా పడే ఛాన్సుందని నిపుణులు అంటున్నారు. ఒక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయినా ఆ తర్వాత కాస్త కోలుకుని నష్టాన్ని 600 పాయింట్లకు పరిమితం చేసుకుంది. బ్రిటన్ నిష్క్రమణ ముఖ్యంగా ఐటీ రంగంపై ఎక్కువ ప్రభావం చూపింది. పౌండ్ విలువ భారీగా పతనం కావడంతో ఐటీ ఇండెక్స్ 4శాతానికి పైగా నష్టపోయింది. డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినా ఆ తర్వాత కోలుకుంది. పౌండు విలువ పడిపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. అయితే బ్రెగ్జిట్ ఎఫెక్ట్ తో బులియన్ మార్కెట్ వైపు మదుపరులు మళ్లిపోయారు. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక దశలో రెండువేలకు పైగా పెరిగింది. దీంతో బంగారం పది గ్రాముల ధర రూ. 31,500 దాటగా, వెండి కిలో రూ. 42,500కు చేరింది. -
రెండో రోజూ నష్టాలే..
♦ ముడి చమురు, ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావం ♦ 321 పాయింట్ల నష్టంతో 23,089కు సెన్సెక్స్ ♦ 91 పాయింట్ల నష్టంతో 7,019కు నిఫ్టీ ముడి చమురు ధరలు వీటితో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతుండటంతో బుధవారం కూడా మన స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. నేడు రైల్వే బడ్జెట్, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 321 పాయింట్లు నష్టపోయి 23,089 పాయింట్ల వద్ద ఎన్ఎస్ఈ నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 7,019 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్ మినహా ఇతర అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. లోహ షేర్లు బాగా నష్టపోయాయి. సమీప భవిష్యత్తులో ఉత్పత్తిని తగ్గించేదే లేదని సౌదీ అరేబియా తెగేసి చెప్పడంతో ముడి చమురు ధరలు క్షీణించాయి. దీంతో చైనా మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ఆరేళ్ల కనిష్టానికి పీఎన్బీ 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు నష్టాల్లో ముగిశాయి. చమురు ధరల పతనం కారణంగా ఓఎన్జీసీ, కెయిర్న్ ఇండియా షేర్లు 2 శాతం వరకూ నష్టపోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ షేర్లు 4 శాతం వరకూ లాభపడ్డాయి. పీఎన్బీ ఇంట్రాడేలో 5 శాతం నష్టపోయి ఆరేళ్ల కనిష్ట స్థాయి రూ.69ను తాకింది. చివరకు 0.6 శాతం నష్టంతో రూ.72 వద్ద ముగిసింది. రెండు వారాల్లో ఈ షేర్ 27 శాతం క్షీణించింది. ఈ నెల 8న ఈ షేర్ ధర రూ.94గా ఉంది. ఇంట్రాడేలో ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, భెల్లు కొత్త ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా సెన్సెక్స్ 10 శాతం నష్టపోగా ఈ ఐదు షేర్లు 12-42% చొప్పున పడిపోయాయి. బ్యాంక్ షేర్లు తగ్గించుకుంటున్న మ్యూచువల్ ఫండ్స్ మొండి బకాయిలు భారీగా పెరిగిపోతుండటడంతో బ్యాంక్ షేర్లను మ్యూచువల్ ఫండ్స్ తగ్గించుకుంటున్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీల బ్యాంక్ షేర్ల నుంచి గత నెలలో రూ.6,662 కోట్లు ఉపసంహరించుకోవడంతో ఆ షేర్లలో పెట్టుబడులు రూ.78,600 కోట్లకు పడిపోయాయని వెల్త్ఫోర్స్డాట్కామ్ తెలిపింది. -
నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ!
ముంబయి : భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 55 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి నష్టాలలో కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉండటంతో మన సూచీలు పడుతున్నాయి. -
జోరు మీదున్న గ్లోబల్ మార్కెట్లు
-
పెరిగిన బంగారం ధర!
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లలో లోహపు ధరలు పరుగులు పెట్టడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధర ఒక నెల గరిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం నాటి ట్రేడింగ్ లో 10 గ్రాముల బంగారం ధర 605 పెరిగి 28,625కు చేరుకుంది. ఈ సంవత్సరంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అలాగే కిలో వెండి ధర 1800 పెరిగి 44,900 కు చేరుకుంది. డాలర్ బలహీనపడటం బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. ఇరాక్ లో పరిస్థితి అదుపుతప్పడంతో బంగారంలో పెట్టుబడి పెట్టడం లాభదాయకమని ఇన్వెస్టర్లు భావించడం పెరుగుదలకు మరో కారణమని తెలిపారు. -
సెన్సెక్స్ రికార్డు ముగింపు
చూస్తుండగానే మార్కెట్లు రివ్వుమన్నాయి. అంతా గమనించేలోగానే సెన్సెక్స్ కొత్త రికార్డులకు చేరిపోయింది. పలు సానుకూలాంశాల ప్రభావంతో బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ బుధవారం మరో 105 పాయింట్లు ర్యాలీ జరిపి 21,034 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఈ స్థాయిలో ముగియడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ స్థాయికి చేరటం కూడా ఐదున్నరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో మంగళవారం పెద్ద ర్యాలీ జరిపి ఊపుమీదున్న సెన్సెక్స్కు అంతర్జాతీయ అనుకూలాంశాలు తోడవ్వడంతో బుధవారం అవలీలగా రికార్డు స్థాయిలో ముగిసింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణలో జాప్యం జరుగుతుందన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు ర్యాలీ జరపడం, అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనుండటంతో స్థానిక మార్కెట్లో జరిగిన షార్ట్ కవరింగ్, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు కొనసాగడం... ఇవన్నీ సెన్సెక్స్ అప్ట్రెండ్కు ఊతమిచ్చాయి. 2008 జనవరి 10న సెన్సెక్స్ ఇంట్రాడేలో 21,207 పాయింట్ల ఆల్టైమ్ గరిష్టస్థాయిని చేరింది. కానీ చివర్లో పతనమై 20,582 పాయింట్ల వద్ద ముగిసింది. నాటి స్థాయికి అధిగమించాలంటే మరో 173 పాయింట్లు చాలు. ఆ రికార్డు కూడా మరెంతో దూరం లేదన్నది ట్రేడింగ్ వర్గాల మాట. 6,252 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ.... సెన్సెక్స్ బాటలోనే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 31 పాయింట్లు పెరిగి 6,252 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే నిఫ్టీ 2008 జనవరి 8న ఇంట్రాడేలో సాధించిన 6,357 పాయింట్ల ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరాలంటే ఇంకా 105 పాయింట్లు పెరగాల్సివుంటుంది. శాతాల్లో చూస్తే చరిత్రాత్మక గరిష్టస్థాయిని అందుకోవాలంటే సెన్సెక్స్ 0.82 శాతం, నిఫ్టీ 1.67 శాతం ర్యాలీ జరపాల్సివుంటుంది. నిఫ్టీ 2010 నవంబర్ 5న 6,338 పాయింట్ల వరకూ పెరిగి 6,312 పాయింట్ల వద్ద ముగిసింది. ఇప్పటివరకూ నిఫ్టీకి ఇదే రికార్డు ముగింపు. చిత్రమేంటంటే సూచీలు ఇలా గరిష్ట స్థాయిల్లో ముగిసినా... పలు మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం ఇంకా చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. నిజానికి మన దేశంలోనే కాదు... ఆసియా, అమెరికా మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్ నెలకొంది. టెలికాం, ఫార్మా, ఐటీ ఊతం... కొన్నాళ్లుగా కొద్దిరోజుల నుంచి స్తబ్దుగా ఉన్న టెలికాం, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు బుధవారం ర్యాలీ జరిపాయి. డాక్టర్ రెడ్డీస్ 4% ఎగిసి కొత్త రికార్డుస్థాయి రూ. 2,523 వద్ద ముగిసింది. ర్యాన్బాక్సీ ఫలితాలు మార్కెట్ను నిరుత్సాహపర్చినా, తాజా కొనుగోళ్ల మద్దతుతో ఆ షేరు 3% పెరిగింది. ఎఫ్ఎంసీజీ షేర్లు ఐటీసీ, హిందుస్థాన్ యూనీలీవర్లు 1.5% చొప్పున పెరగ్గా, ఐటీ షేర్లు టీసీఎస్, టెక్మహీంద్రాలు 2-3% మధ్య ఎగిసాయి. నికరలాభం తగ్గినా, నిర్వహణ లాభం మెరుగ్గా వుండటంతో టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్... భారీ ట్రేడింగ్ పరిమాణంతో 5 శాతం ఎగసింది. టాటా కమ్యూనికేషన్ 10% ర్యాలీ జరిపింది. బ్యాంకింగ్ షేర్లలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లు 2-3% మధ్య పెరిగాయి. కొన్ని మిడ్సైజ్ పీఎస్యూ బ్యాంకుల మొండి బకాయిలు బాగా పెరిగాయన్న వార్తలతో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఐడీబీఐ, ఎస్బీఐ షేర్లు క్షీణించాయి. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ షేర్లలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు తగ్గాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 1,017 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ సంస్థలు రూ. 550 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించాయి.