Jackie Chan
-
జాకీ చాన్ అలా చేశాడంటూ.. షారుక్ని టార్గెట్ చేసిన ఫైర్ బ్రాండ్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్కి ఇండస్ట్రీలో ఉన్న పేరు ఫైర్బ్రాండ్. ఆమె పేరుకు తగ్గట్టుగానే విడాకులు తీసుకున్న నాగచైతన్య-సమంత విషయంలో చైపై విరుచుకుపడింది. దీనికి కారణం అమీర్ఖాన్ అంటూ ఆరోపించింది. అనంతరం ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్కి మద్దతుగా నిలిచిన తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ని విమర్శించింది. తాజాగా బాలీవుడ్ బాద్షాను టార్గెట్ చేసింది ఈ బ్యూటీ. డ్రగ్స్ కేసు విషయమై బాలీవుడ్ ప్రముఖులు అందరూ ఆర్యన్కి సపోర్టుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అతని తండ్రి షారుక్ సైతం కొడుకుని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ తరుణంలో హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీ చాన్ కుమారుడి డ్రగ్స్ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీగా పెట్టింది కంగనా. జాకీచాన్ కుమారుడు జైసీ చాన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని 2014లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన జాకీ అది తన ఫెయిల్యూర్ అని అందరికి క్షమాణలు తెలిపాడు. కేసులో తన కొడుకును కాపాడేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయనని నటడు చెప్పాడు. అంతేకాకుండా జైసీ ఆరునెలల శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా మరోసారి అందరి సారీ చెప్పాడు ఈ యాక్షన్ హీరో. ఆర్యన్ విషయంలో బాలీవుడ్లో జరుగుతున్న పరిణామాల గురించి రియాక్ట్ అవుతూ ఈ పోస్టుని పెట్టింది కంగనా. దీంతో ఫైర్ బ్రాండ్ మరోసారి బాంబు పేల్చిందని అందరూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఆర్యన్ 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. చదవండి: ఆల్ మాఫియా పప్పంటూ.. హృతిక్కి కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్ -
ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఉంటేనా..
World Suicide Prevention Day 2021: మనిషికి జంతువుతో పోలిస్తే ఉన్న అడ్వాంటేజ్.. మనుగడ పోరాటంలో తెలివితేటల్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలగడం. నోరు లేని మూగజీవాలు ఎలాగోలా తమ బతుకుల్ని నెట్టుకొస్తుంటే.. అన్నీ ఉన్నా సంఘజీవి మనిషి మాత్రం పిరికితనంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలెన్నో బతుకుల్ని బుగ్గిపాలు చేస్తుంటే.. అందులో ఒకటైన ఆత్మహత్య మనిషిని మానసికంగా కుంగదీసి మరీ చంపేస్తోంది. ఒకవేళ ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. నెగెటివ్ అంశాలెన్నో పాజిటివ్గా మారిపోవడమే కాదు.. మరో మలుపు తిరిగి జీవితంలో అద్భుతాలు జరగొచ్చేమో కదా! ► సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ►ఆత్మహత్యలను నివారించేందుకు, అది ఎంత పెద్ద నేరమో అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏటా ఒక దినం నిర్వహిస్తున్నారు. ►ప్రతీ ఏటా ఆత్మహత్యా నివారణ దినోత్సవం సెప్టెంబర్ 10న జరుపుతున్నారు. ►ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా? ‘బతకాలనే ఆశను అవతలివాళ్లలో సృష్టించడం.. అదీ చేతల ద్వారా’. ►కరోనా వల్ల మనిషిలో మానసికంగా కుంగుబాటు ఎక్కువ అయిపోయింది. ►ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి అవకాశాలు పోగొట్టుకోవడం, అయినవాళ్లను దూరం చేసుకోవడం, సోషల్ గ్యాదరింగ్లు లేకపోవడం వల్ల మనిషి.. నిరాశానిస్పృహలోకి నెట్టేస్తున్నాయి. క్షణికావేశంలో అయినవాళ్లకు, అభిమానించేవాళ్లకు దూరంగా వెళ్లిపోతున్నారు. ►కిందటి ఏడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ హఠాన్మరణం తర్వాత దేశవ్యాప్తంగా డిప్రెషన్-సూసైడ్ల గురించి విస్తృత చర్చ నడిచింది. అంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న సెలబ్రిటీలతో పాటు యువత మానసిక స్థితి గతులపై సమీక్ష నిర్వహించేందుకు మేధావులకు, మానసిక నిపుణులకు అవకాశం ఇచ్చింది. ►అందుకే ఈ ఏడాది “Creating Hope Through Action” థీమ్ తెచ్చారు ►వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. ది ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్(IASP), వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్(WFMH) సంయుక్తంగా ఈ రోజును నిర్వహిస్తారు. ►2003లో తొలిసారి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు ►వందల్లో 60 మంది ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం.. ఒంటరిమనే భావన. కష్టకాలంలో సరైన ఓదార్పు లేకపోవడం. ►ఆర్థిక కారణాలు, బంధాలు, అయినవాళ్లతో గొడవలు కూడా మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. ►కాలు విరిగినా, చెయ్యి విరిగినా ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. ►సపోర్ట్గా నిలవాల్సింది సొసైటీనే. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉండే ఎవరైనా కావొచ్చు. ►సెన్సిటివ్ బిహేవియర్.. అంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్న మనిషి, చిన్న సంఘటనతోనూ కుంగుబాటుకు గురై ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి, వరుస దెబ్బలతో నిరాశనిస్పృహల్లోకి కూరుకుపోయిన వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడతారనే అభిప్రాయం సరైంది కాదు. ►ఆత్మహత్యకు పాల్పడటం, ఆత్మహత్యకు యత్నించడం, పుసిగొల్పడం-ప్రేరేపించడం.. ఇవన్నీ నేరాలే. ఐపీసీ సెక్షన్-309 ప్రకారం.. జైలుశిక్ష జరిమానా తప్పవు. రాజీ కుదుర్చుకోవడానికి వీల్లేదు. అలాగే వీళ్ల తరపున ఏ లాయర్ వాదించడు. ►ప్రపంచంలో ప్రతీ నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య నమోదు అవుతోంది. అందులో భారత్ టాప్ టెన్లో ఉండడం గమనార్హం. ►ఎందుకు బతకాలి? బతికి ఏం సాధించాలి? అనే పిరికి ప్రశ్నల కంటే.. బతికి సాధించుకోవాలి అనే ధైర్యం మనిషిని మహర్షిగా మారుస్తుంది. క్షణికావేశ నిర్ణయం ఒక జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ క్షణాన్ని గనుక అధిగమిస్తే అంతా వెలుగే నిండుతుంది - జాకీ చాన్ ఓడిన ప్రతీసారి రెట్టింపు ఉత్సామంతో పైకి లేవడమే మనిషి తన జీవితంలో సాధించే గొప్ప కీర్తి - నెల్సన్ మండేలా - సాక్షి, వెబ్డెస్క్ స్పెషల్ -
కమ్యూనిస్టు పార్టీలోకి ప్రపంచ ప్రఖ్యాత నటుడు
బీజింగ్: వందేళ్లు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లోకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అగ్ర నటుడు చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తమ దేశ మీడియాతో పంచుకున్నారు. తనకు ‘సీపీసీ’లో చేరాలని ఉందంటూ ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ చర్చలో ఆయన పేర్కొన్నారు. ఇంతకు ఆయనెవరో కాదు హాలీవుడ్ నటుడు, దర్శకుడు, మార్షల్ ఆర్ట్స్ సినిమాలతో ప్రపంచ ప్రజలను ఆకర్షించిన జాకీ చాన్ (67 ఏళ్లు). జూలై 1వ తేదీన సీపీసీ వంద వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. శత వసంతాల వేడుకలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై మంగళవారం (జూలై 6) ఆ దేశ సినీ ప్రముఖులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆ చర్చలో చైనా ఫిలిం అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీచాన్ పై వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వందేళ్లల్లో ఏం చెప్పిందో అది చేసి చూపించిందని కొనియాడారు. అది కూడా కొన్ని దశాబ్దాల్లోనే పూర్తి చేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే తాను కొన్నేళ్లుగా ఆ పార్టీకి మద్దతుదారుగా ఉన్నట్లు తెలిపారు. జాకీ చాన్ నటుడు, దర్శకుడు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు కూడా. గతంలో జాకి చాన్చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ)లో సభ్యుడిగా పని చేశారు. -
‘అసలు జాకీకి ఒంట్లో భయమే లేదా’
జాకీచాన్ అసలు పేరు చాన్ కాంగ్–సాంగ్. ‘లిటిల్ జాక్’ అనే నిక్నేమ్ ఉండేది. అది కాస్తా ‘జాకీ’గా మారింది. ఆతరువాత ‘చాన్’ వచ్చి చేరి ‘జాకీ చాన్’ అయింది. జాకీ చాన్ ఫైటర్ మాత్రమే కాదు... చక్కని గాయకుడు కూడా. ‘ఒపేరా అకాడమీ’ లో కుంగ్ఫూతోపాటు సంగీత పాఠాలు కూడా నేర్చుకున్నాడు. 11 మ్యూజిక్ ఆల్బమ్లను విడుదల చేశాడు. ‘బెస్ట్ సింగర్’ అవార్డ్ కూడా అందుకున్నాడు. ►సీఫూ(గురువు) చెప్పేదానికి ప్రకారం మార్షల్ ఆర్ట్స్లో జాకీకి అసాధారణమైన ప్రతిభ ఏమీలేదు. కానీ చిలిపితనం, నవ్వించే గుణం ఎక్కువ. గంభీరమైన మార్షల్ ఆర్ట్స్కు కడుపుబ్బా నవ్వించే కామెడీని జత చేసి వెండితెరపై తనదైన శైలిని సృష్టించుకున్నాడు. ►బ్రూస్లీ లెవెల్కు తీసుకువెళదామనే ఉద్దేశ్యంతో ఒక హాంకాంగ్ నిర్మాత జాకీకి ‘బికమ్ ది డ్రాగన్’ అనే స్క్రీన్నేమ్ తగిలించాడు. అయితే అది అట్టే కాలం నిలవలేదు. ►‘డ్రాగన్ లార్డ్’లో ఒక సీన్ కోసం ఏకంగా 2,500 టేక్లు తీసుకున్నాడట! ఇది అనధికార గిన్నిస్ రికార్డ్. ఇక నిజమైన రికార్డ్ విషయానికి వస్తే ‘చైనీస్ జోడియాక్’ అనే సినిమా కోసం దర్శకత్వం, నిర్మాణం, నటన,సంగీతం, ఆర్ట్ డైరెక్టర్, యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్, ఫైట్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్. కేటరింగ్... ఇలా పదిహేను విభాగాల్లో పనిచేసి గిన్నిస్బుక్ రికార్డ్ సృష్టించాడు. ►‘అసలు ఇతడి ఒంట్లో భయమే లేదా’ అనుకునే జాకీకి రెండు భయాలు ఉన్నాయి. ఒకటి సూదులు, రెండోది జనాల మధ్య మాట్లాడడం. ►జీవితంలో తాను పశ్చాత్తాప పడే ప్రధాన విషయం...తాను సరిగా చదువుకోకపోవడం అంటాడు. పిల్లలకు ‘రోల్ మోడల్’గా ఉండాలనేది కల. ఒకప్పుడు తన రోల్ మోడల్ చార్లీ చాప్లిన్. -
కరోనాకు మందు కనిపెడితే రూ. కోటి ఇస్తా!
బీజింగ్ : చైనాను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు వుహాన్ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బయటకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని బయపడి జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తమ దేశ పరిస్థితిని చూసి అక్కడి బహళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నాయి. అలీబాబా గ్రూప్, టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ సహా పలువురు వ్యాపారవేత్తలు తమకు తోచిన సాయం చేస్తున్నాయి. తాజాగా చైనా ప్రముఖ నటుడు జాకీ చాన్ సైతం కరోనా వైరస్పై స్పందించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో మాస్క్లు, ఇతర సామాగ్రిని విరాళం ఇచ్చిన ఆయన.. మరో కీలక ప్రకటన చేశారు. కరోనాకు మందు కనిపెట్టిన వారికి 1 మిలియన్ యువాన్(రూ. 1 కోటి) రివార్డ్గా ఇస్తానని ప్రకటించారు. (ప్రపంచంలో 60 శాతంపైగా కరోనా ముప్పు!) కరోనాపై పోరాటం కోసం చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఇక టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత 'పోని మా' సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) సాయం చేశారు. కాగా, కరోనా వైరస్ ప్రభావంతో చైనాలో దాదాపు వెయ్యి మంది చనిపోయారు. వేలాది మంది వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండడంతో చైనాతో పాటు ఇతర దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. -
ఈ ఫోటోలో ఉన్న సూపర్స్టార్ల పేర్లు తెలుసా: షారూఖ్
ముంబై : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సౌదీ అరేబియా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘జాయ్ ఫోరయ్ 2019’ కార్యక్రమంలో షారుఖ్ పాల్గొన్నారు. సౌదీలోని రియాద్లో జరుగుతున్న ఈ వేడుకల్లో ఆదివారం హాలీవుడ్ స్టార్ జాసన్ మొమోవా, హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీచాన్, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలను కలుసుకున్నారు. వారితో కలిసి దిగిన ఫోటోలను తాజాగా షారూఖ్ తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. View this post on Instagram Breaking the internet z pic of the day can you name all superstar in this picture? #ShahRukhKhan #TeamShahRukhKhan 😍 A post shared by Team Shah Rukh Khan (@teamshahrukhkhan) on Oct 13, 2019 at 7:40am PDT ‘ఆనందాలు అన్ని నావే.. నా హీరోలను కలిశాను’ , ‘ఈ ఫోటోలో ఉన్న సూపర్స్టార్ పేర్లు తెలుసా’.. అనే ట్యాగ్లతో షారూఖ్ షేర్ చేసిన ఈ ఫోటోలు తన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు అభిమానులు షేర్ చేసిన ఓ వీడియోలో షారుఖ్ తన హీరోలను కలిసే అవకాశాన్ని కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాల తెలిపారు. అలాగే తన ఆరేళ్ల కుమారుడైన అబ్రామ్.. జాసన్ అభిమానని షారుఖ్ తెలిపారు. ఏప్రిల్లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ మాట్లాడుతూ.. జీరో వైఫల్యం నన్ను కాస్తా నిరాశ పరిచింది. దీని నుంచి బయట పడటానికి నాకు కొంచెం సమయం కావాలి. ఈ మధ్యలో సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి, అలాగే నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను. అని తెలిపారు. View this post on Instagram Khan, Damme, Chan at the #JoyForum19. The joys all mine as I got to meet my heroes. @jcvd @jackiechan @joyforumksa A post shared by Shah Rukh Khan (@iamsrk) on Oct 13, 2019 at 8:17am PDT సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన ‘జీరో’ సినిమా అనంతరం బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇంతవరకు ఏ సినిమాను ఓకే చేయలేదు. అనుష్కశర్మ, కత్రినాకైఫ్ హిరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద చతికిలపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు రూ.100 కోట్ల కనెక్షన్లు కూడా రాలేదు. అయితే సినిమాల విషయం పక్కకు పెడితే షారుఖ్ బిజీ బిజీగానే గడుపుతున్నారు. -
యాక్షన్ అవార్డ్స్
బాలీవుడ్లో విద్యుత్ జమాల్కు యాక్షన్ హీరోగా మంచి పేరుంది. గత ఏడాది జమాల్ నటించిన ‘జంగిల్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారాయన. కొన్ని కళరిపయ్యట్టు స్టంట్స్ని అద్భుతంగా చేసి యాక్షన్ మూవీ లవర్స్ మనసు గెల్చుకున్నారు జమాల్. ఈ సినిమాకు రెండు ప్రతిష్టాత్మకమైన జాకీచాన్ అవార్డులు వచ్చాయి. చైనాలో జరిగిన జాకీచాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్లో భాగంగా ఇండియన్ చిత్రం ‘జంగిల్’కు రెండు అవార్డులు లభించాయి. బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫర్, బెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఫిల్మ్ విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయి. ‘‘దాదాపు 150 చిత్రాలతో పోటీ పడి మా సినిమా అవార్డ్స్ గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఇండియన్ యాక్షన్ సినిమాకు మరోసారి మంచి గుర్తింపు దక్కినట్లుగా ఉంది. మేం చైనాలో స్టార్స్ అయిపోయామనే భావన కలుగుతోంది. క్రిస్ టుక్కర్ (చైనీస్ యాక్షన్ హీరో) కూడా మా యాక్షన్ సీన్స్ను మెచ్చుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యుత్. -
జాకీచాన్తో హృతిక్
సినీ ప్రపంచంలో జాకీచాన్ తెలియని వారుండరు. యాక్షన్ చిత్రాలకు జాకీచాన్ ఫేమస్. కేవలం చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు జాకీచాన్. ప్రస్తుతం ఈ సూపర్స్టార్ను హృతిక్ రోషన్ కలిసి కాసేపు ముచ్చటించాడు. తన సినిమా ప్రమోషన్స్లో భాగంగా చైనాకు వెళ్లిన హృతిక్ జాకీచాన్ను కలిశాడు. హృతిక్ రోషన్, యామీ గౌతమ్ జంటగా వచ్చిన కాబిల్(తెలుగులో ‘బలం’) చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయనున్నారు. జూన్ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి చిత్రయూనిట్ ప్రమోషన్స్ పెంచేసింది. ఇందులో భాగంగానే జాకీచాన్ను హృతిక్రోషన్ కలిశాడు. ఇప్పటికే చైనా మార్కెట్లో ఇండియన్ సినిమాలు దుమ్ములేపుతుండగా.. హృతిక్ నటించిన కాబిల్ ఏమేరకు రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. 2017లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. -
అభద్రతాభావమే అందుకు కారణం
‘‘జీవితంలో కొన్ని పనులు చేసే క్రమంలో లేదా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాతి కాలంలో అపరాదభావం కలిగిస్తాయి. నేనూ అలాంటి అపరాద భావానికి గురయ్యాను’’ అని రాసుకొచ్చారు యాక్షన్ హీరో జాకీచాన్. ఈ చైనా సూపర్ స్టార్ రాసుకున్న స్వీయ చరిత్ర పుస్తకం ‘నెవ్వర్ గ్రో అప్’ 2015లో చైనాలో రిలీజ్ అయింది. ఆ బుక్ ఇంగ్లీష్ వెర్షన్ను తాజాగా ప్రచురించారు. ఈ పుస్తకంలో మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకోవడం, ఆ తర్వాతి కాలంలో మద్యపాన అలవాటుతో పోరాడటం గురించి రాసుకొచ్చారు. ‘‘రాత్రంతా తాగుతూనే ఉండేవాణ్ణి. పొద్దునే చూస్తే నా కార్ ఏ చెట్టుకో, దేనికో క్రాష్ అయ్యుంటుంది. అలాగే సాయంత్రం కూడా అదే వరుస. ఈ క్రమంలోనే ఓసారి నా కోపాన్నంతా మా అబ్బాయి మీద చూపించాను. ఒక్క చేత్తో వాణ్ణి లేపి గిర్రున తిప్పి విసిరి కొట్టాను. సోఫాలో పడ్డాడు. నేను విసిరేసిన వేగం వల్ల ఏ చేతికో, వీపుకో తగిలుంటే చాలా సీరియస్ అయ్యుండేది’’ అని రాసుకొచ్చారు జాకీచాన్. ఇలాంటి పనులన్నింటికీ తర్వాత చాలా బాధపడ్డానని, అపరాదభావానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. నాలోని అభద్రతా భావం వల్లనే చాలాసార్లు తప్పుగా ప్రవర్తించాను అని నిజాయ తీగా చాలా విషయాలను ఒప్పుకున్నారు జాకీచాన్. -
చాన్తో చైనాలో...
బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ జాకీచాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. ఈ సూపర్ కాంబినేషన్ని సెట్ చేశారు దర్శకుడు అనీష్ బజ్మీ. 2002లో వచ్చిన ‘ఆంఖే’ సినిమాకు సీక్వెల్గా ‘ఆంఖే 2’ రూపొందిస్తున్నారాయన. ఫస్ట్ పార్ట్లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, పరేష్ రావల్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ తాజా సీక్వెల్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్, విక్కీ కౌశల్ను తీసుకోవాలనుకుంటున్నారట దర్శకుడు అనీష్. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఎక్కువ శాతం చైనాలో జరగబోతోందట. దాంతో యాక్షన్ హీరో జాకీచాన్ అయితే సూపర్ చాయిస్ అని దర్శకుడు భావించారట. చాన్తో చైనాలో కామెడీ డ్రామాగా సాగనుంది. 2019లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, తరుణ్ అగర్వాల్ నిర్మించనున్నారు. 2020లో ఈ సినిమా విడుదల కానుంది. -
ట్రక్కుతో చిక్కు తప్పెన్
చైనా యాక్షన్ సూపర్ స్టార్ జాకీ చాన్ అంటే యాక్షన్ సినిమా ప్రియులందరికీ ఇష్టమే. ఎందుకంటే ఎంతో రిస్కీ స్టంట్స్ని కూడా అవలీలగా స్క్రీన్ మీద చేసేస్తారు. కానీ స్క్రీన్ వెనక ఆ స్టంట్స్ కోసం ఎంత సాహసానికైనా రెడీ అంటారు. ఈ ప్రక్రియలో ఎన్నోసార్లు ఒళ్లు జల్లెడ అయిపోయేలా దెబ్బలు తగిలించుకొన్నారు. కొన్నిసార్లు ప్రాణం మీదకు కూడా తెచ్చుకున్నారు. ఆయన శరీరం మీదున్న ప్రాక్చర్స్ అయితే లెక్క లేనన్ని. తాజాగా ‘ప్రాజెక్ట్ ఎక్స్’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు జాకీ. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫేమ్ జాన్ సేనా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈసారి కూడా ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారట జాకీ చాన్.జాకీ మాత్రమే కాదు మొత్తం చిత్రబృందం ‘మడ్స్లైడ్’ (మట్టి దానంతట అదే కుదించుకుపోయే ప్రకృతి వైపరీత్యం) నుంచి తప్పించుకున్నారట. ఈ విషయాన్ని జాకీ పంచుకుంటూ – ‘‘లొకేషన్లో షూటింగ్ చేస్తుండగా వాతావరణంలో మార్పు వచ్చేసి మట్టి కుదించుకుపోవడం స్టార్ట్ అయింది. మా ప్రొడక్షన్ ట్రక్కులన్నీ అందులో చిక్కుకుపోయాయి. మా టీమ్ అంతా భయపడిపోయాం. ఇంతలో పెద్ద ట్రక్ వచ్చి మమ్మల్ని కాపాడింది. వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అనుభవం వల్ల మాకో పాఠం బోధపడింది. వాతావరణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని తెలిసింది’’ అని పేర్కొన్నారు. -
యాక్షన్ మీట్స్ యాక్షన్
మార్షల్ ఆర్ట్స్ అంటే జాకీ చాన్ చేస్తేనే చూడాలి. ఆయన చేసే ఫైట్స్ అంత బాగుంటాయి. సినిమా లవర్స్కి, యాక్షన్ లవర్స్కి ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. సినిమా స్టార్స్లోనూ ఆయన ఫ్యాన్స్ ఉంటారు. ‘దంగల్’ చిత్రంలో నటించిన ఫాతిమా సనా షేక్, సాన్య మల్హోత్రా కూడా జాకీ అభిమానులు. ఆ చిత్రంలో ఈ ఇద్దరూ మల్లయోధులుగా విజృంభించిన సీన్స్ని అంత సులువుగా మరచిపోలేం. ఈ యాక్షన్ స్టార్స్ ఇద్దరూ హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ని కలిశారు. చైనాలో జరిగిన జాకీ చాన్ యాక్షన్ మూవీ వీక్లో పాల్గొనడానికి ఫాతిమా, సాన్యా వెళ్లారు. అప్పుడు జాకీ చాన్ని కలిసి, ఫొటో దిగారు. ‘‘ఓ లెజెండ్ని కలిశాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వెరీ సింపుల్ పర్సన్’’ అని ఈ ఇద్దరూ పేర్కొన్నారు. -
క్రేజీ కాంబోలో యాక్షన్ థ్రిల్లర్
లాస్ ఏంజెల్స్: క్రేజీ కాంబినేషన్లో హాలీవుడ్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కోబోతోంది. యాక్షన్ హీరో జాకీ చాన్, ప్రముఖ రెజ్లర్ జాన్ సీనా హీరోలుగా ఓ చిత్రం రాబోతుంది. అమెరికన్ డైరెక్టర్ స్కాట్ వా డైరెక్షన్లో ‘ప్రాజెక్ట్ ఎక్స్’ గా చిత్రం తెరకెక్కబోతుండగా.. చాన్-సీనాలను హీరోలుగా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఈ సినిమాకు ఎక్స్-బాగ్దాద్ పేరును పరిశీలించగా.. హాలీవుడ్ దిగ్గజం సిల్వస్టర్ స్టాలోన్ పేరును హీరోగా పరిశీలించారు. అయితే అనూహ్యాంగా సిల్వస్టర్ను తప్పించి.. ఆప్లేస్లో జాన్ సీనాను తీసుకున్నారు. టైటిల్ను కూడా ప్రాజెక్టు ఎక్స్గా మార్చినట్లు స్కాట్ ఓ ప్రెస్ మీట్లో ప్రకటించారు. ఈ చిత్రానికి జాకీ చాన్ సహనిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. కాగా, హాంగ్ కాంగ్కు చెందిన జాకీ చాన్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు. 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. ఆ మధ్య ‘ది ఫారినర్’ చిత్రంతో అలరించారు. ప్రస్తుతం షాంగై నూన్, రష్ హవర్ సీక్వెన్స్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్గా పేరొందిన జాన్ సీనా.. 2006లో ది మెరైన్ ద్వారా హీరోగా మారారు. సుమారు అరడజనుపైగా చిత్రాల్లో నటించిన సీనా.. త్వరలో ‘ది రాక్’(డ్వెన్ జాన్సన్) నిర్మాతగా తెరకెక్కించనున్న ఓ చిత్రంలో కూడా నటించబోతున్నాడు. -
జాకీ కూతురికి కష్టాలా?
‘‘నాకు ఇల్లు లేదు’’ అంటున్నారు జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్జీ. మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీ చాన్ కుమార్తెకు ఇల్లు లేకపోవటమేంటి? అనే సందేహం కలగవచ్చు. కానీ ఎట్టా ఎన్జీ జాకీ చాన్ సొంత కుమార్తె కాదు. హాంగ్కాంగ్ బ్యూటీ క్వీన్ ఎన్జీతో జాకీ ఎఫైర్ సాగించినప్పుడు కలిగిన సంతానమే ఎట్టా. ‘‘ప్రస్తుతం నేను ఉండటానికి ఇల్లు కూడా లేదు, కారణం మా పేరెంట్స్ బిహేవియరే’’ అని ఓ వీడియో అప్లోడ్ చేశారు ఎట్టా. ‘‘నేను జాకీచాన్ కూతుర్ని. నా గర్ల్ఫ్రెండ్ పేరు ఆండీ. నెల రోజులుగా మేం ఇల్లు లేకుండా ఉన్నాం. బ్రిడ్జ్ల కింద పడుకున్నాం. మా పేరెంట్స్ ‘హోమోఫోబిక్’ బిహేవియర్ కారణంగానే మేం ఇల్లు లేనివాళ్లం అయ్యాం. మేం పోలీసుల దగ్గరకు, హాస్పిటల్స్, ఫుడ్ బ్యాంక్స్, ఎల్జీబీటి (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్స్) సెంటర్స్కు వెళ్లాం సహాయం కోసం. కేవలం మేమిద్దరం లెస్బియన్స్ (స్వలింగ సంపర్కులం) అనే కారణంగానే మాకెవరూ సహాయపడటంలేదు. ఈ కారణంగానే కన్నవాళ్లు కూడా దూరం పెట్టేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టా. అయితే విషయం ఏంటంటే.. జాకీచాన్కు ఒకప్పుడు ఎన్జీతో సంబంధం ఉన్నప్పటికీ ఆమె ద్వారా కలిగిన ఎట్టాను ఆయన ఓన్ చేసుకోలేదనే టాక్ ఉంది. -
బ్రిడ్జి కింద తలదాచుకుంటున్న జాకీ చాన్ కూతురు
-
యాక్షన్ హీరో కూతురికి ఇల్లు కూడా లేదట..
తండ్రేమో ప్రపంచ ప్రసిద్ధి చెందిన యాక్షన్ హీరో...మరి అలాంటప్పుడు ఆయన వారసులకు దేనికి కొరత ఉండదు అనే అభిప్రాయం సహజం. కానీ జాకీ చాన్(62) కూతురు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. జాకీ చాన్ కుతూరు ఎట్టా ఎన్(18) ‘ప్రస్తుతం నాకు ఉండేందుకు ఇల్లు లేదు. నెల రోజుల నుంచి నేను నా గర్ల్ఫ్రెండ్ ఇద్దరమూ హంగ్కాంగ్లోని ఒక బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నాము’ అంటూ ఒక వీడియోను యూట్యూబ్లో పోస్టు చేసింది. ఎట్టా పోస్టు చేసిన వీడియోలో ‘మేము ఒక నెల నుంచి ఈ బ్రిడ్జి కిందనే తలదాచుకుంటున్నాము. తినడం, పడుకోవడం అంతా ఇక్కడే. మాకు ఆశ్రయం కల్పించమని పోలీసులు, ఆస్పత్రి, ఆహార బ్యాంకు, ఎల్జీబీటీక్యూ(లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి) కమ్యూనిటిల దగ్గరకు కూడా వెళ్లాము. కానీ వారు మాకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించారు. ఎవ్వరు మాకు సాయం చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఈ విషయాలన్నింటిని ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ’ అని తెలిపింది. ఈ వీడియోలో ఎట్టాతో పాటు ఆమె స్నేహితురాలు అండీ ఆటుమాన్ కూడా ఉన్నది. ఎట్టా మాజీ అందాల రాణి ఎలెన్ ఎన్, జాకీ చాన్ల కూతురు. ఈ యాక్షన్ హీరో ప్రస్తుత భార్య జోన్ లిన్ కంటే ముందు ఎలెన్తో జాకీ చాన్కు సంబంధం ఉంది. వీరి బంధం గురించి ఈ హీరో బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీ కూతురు ఎట్టా విషయంలో మాత్రం మౌనంగానే ఉన్నాడు. అయితే ఎలెన్ కూతురు చేసిన ఆరోపణనలను ఖండిస్తూ ఇలాంటి పనులు చేసే బదులు ఏదైనా పని వెతుక్కుంటే మంచిదని హితవు పలికారు. ‘నీకు డబ్బులు కావాలంటే కష్టపడి పనిచేసి సంపాదించు, అంతేకానీ ఇలా ఒకరి పేరు ప్రతిష్టల మీద ఆధారపడటం మంచి పద్దతి కాద’ని తెలిపారు. ఎట్టా గతంలో తన తండ్రి జాకీ చాన్ గురించి ‘అతను నా జీవితంలో లేడు...నేను అతన్ని ఒక తండ్రిగా ఎప్పటికి పరిగణించను’ అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
డియర్ సోనూ... ఇది నీకోసం
ముంబై : బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ప్రత్యేక బహుమతితో పాటు ఆత్మీయ లేఖ అందుకోవడమే సోనూ ఆనందానికి కారణం. ఇంతకీ ఆ ఆత్మీయులు ఎవరంటే.. ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్. ఇండో- చైనీస్ భాగస్వామ్యంలో ‘కుంగ్ ఫూ యోగా’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో జాకీ చాన్, సోనూ సూద్ మంచి మిత్రులయ్యారు. అప్పటి నుంచి జాకీ చాన్ సోనూ సూద్కు ఏదో ఒక బహుమతి ఇస్తూనే ఉన్నాడు. తాజాగా జేసీ స్టంట్ టీమ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన లెదర్ జాకెట్ను సోనూకి పంపించాడు. దానితో పాటు ఒక ఆత్మీయ లేఖ కూడా రాసి సర్ప్రైజ్ చేశాడు. ‘మై డియర్ సోనూ.. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న సోదరులతోపాటు అతి కొద్ది మంది ఆత్మీయులకు మాత్రమే ఈ కానుక ఇస్తున్నాను. ఇది చిన్న కానుకే అయి ఉండవచ్చు కానీ దీన్ని చూసిన ప్రతీసారీ నీకు నేను గుర్తొస్తాను. అప్పుడు నేను నీతోపాటుగా ఉన్నట్టే నువ్వు భావిస్తావు’ అంటూ భావోద్వేగంతో కూడిన లేఖ జతచేశాడు. ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ నుంచి బహుమతులతో పాటు ఆత్మీయ లేఖలు కూడా అందుకోవటం ఎవరికైనా సంతోషమే కదా.. సోనూ సూద్ కూడా ఇపుడు ఆ ఫీల్ను ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలో కూడా జాకీ చాన్ ‘అయామ్ జాకీచాన్: మై లైఫ్ ఇన్ యాక్షన్’ అనే బుక్తో పాటు, నీతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ లేఖ రాశాడు. -
భీమ్ కీ గురు?
మోహన్లాల్ భీముడిగా ‘మహాభారతం’ ఆధారంగా వెయ్యి కోట్లతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విశేషాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అన్ని భారతీయ భాషలకు చెందిన టాప్ హీరోలు ఈ సినిమాలో ఏదో ఓ పాత్రలో తళుక్కున మెరుస్తారని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడీ సినిమా తారగణంలోకి చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ హీరో జాకీచాన్ కూడా యాడ్ అయ్యారు. భీమసేనుడికి యుద్ధవిద్యలు నేర్పిన నాగరాజు పాత్రలో జాకీచాన్ కనిపించనున్నారని సమాచారం. మలయాళ రచయిత ఎమ్.టీ వాసుదేవన్ నాయర్ రాసిన నవల ఆధారంగా రూపొందనున్న ఈ ‘మహాభారతం’ సినిమాను ఆల్రెడీ మోహన్లాల్తో ‘ఒడియన్’ అనే సినిమాను తెరకెక్కించిన శ్రీకూమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. -
లవర్ ప్రెగ్నెంట్.. రహస్యంగా సూపర్స్టార్ పెళ్లి!
హాలీవుడ్ టాప్ యాక్షన్ సూపర్ స్టార్లలో జాకీ చాన్ ఒకరు. ఆయన 2015లో చైనా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాజాగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. గతంలో ఈ ఇంటర్వ్యూ పెద్దగా వెలుగులోకి రాలేదు. ఈ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చాలా నిజాయితీగా జాకీ చాన్ పలు విషయాలు వెల్లడించాడు. తన ప్రియురాలు జోవన్ లిన్ గర్భవతి కావడంతో 1982లో ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జాకీ స్పష్టం చేశాడు. ఆ తర్వాత తమకు మొదటి కొడుకు పుట్టాడని చెప్పాడు. జోవన్ లిన్, జాకీ చాన్ దంపతులు గత 35 ఏళ్లుగా వైవాహిక జీవితంలో కొనసాగుతున్నారు. ‘అది అనుకోకుండా జరిగింది. లిన్ గర్భవతి అవుతుందని, జాయ్సీ (కొడుకు) పుడుతాడని నేను అనుకోలేదు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే నాకు ఉండేది కాదు. కానీ నాకు బలవంతంగా పెళ్లి చేశారన్న భావన ఇప్పుడు కలుగుతోంది’ అని జాకీ చాన్ చెప్పాడు. తాను యుక్తవయస్సులో ఉన్నప్పుడు తనకు చాలామంది గర్ల్ఫ్రెండ్స్ ఉండేవారని జాకీ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. 1982లో లాస్ ఏంజిల్స్లోని కాఫీషాప్లో లిన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు చెప్పాడు. జాకీ చాన్ లిన్తో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూనే.. అనేక మందితో ఎఫైర్లు పెట్టుకున్నాడని రూమర్లు ఉండేవి. మాజీ బ్యూటీక్వీన్ ఎలైన్ ఎన్జీ ఆయన రహస్యంగా ఎఫైర్ కొనసాగించాడు. ఆ ఫలితంగా 1999లో జాకీ చాన్ కూతురు ఎట్టాకు ఎలైన్ జన్మనిచ్చిందని షాంఘైయిస్ట్.కామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కూరుతు ఎట్టాతో జాకీకి ఇప్పుడు అంతంతమాత్రంగానే సంబంధాలు ఉన్నాయట. ఇక, ఆయన కొడుకు 2014లో మాదక ద్రవ్యాలతో బీజింగ్లో అరెస్టైన సంగతి తెలిసిందే. -
ఇండియాలో ఫ్లాప్.. రూ.1200 కోట్ల కలెక్షన్లు!
హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ నటించిన తాజా చిత్రం ‘కుంగ్ ఫూ యోగ’ భారత్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా అంతర్జాతీయంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా చైనాలో కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1200 కోట్లు(180 మిలియన్ డాలర్లు) కలెక్షన్లు రాబట్టిందని ‘బాక్సాఫీస్ మోజో’ వెల్లడించింది. ఇందులో ఒక్క చైనాలోనే 179 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. జాకీచాన్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా ఈ సినిమా భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన రోజు కేవలం రూ. 4 కోట్లు మాత్రమే రాబట్టిందని ఫోర్బ్స్ తెలిపింది. ఇందులో బాలీవుడు నటులు సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషించారు. స్టాన్ లీ టాంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు. -
జాకీ మార్క్ యాక్షన్తో...
హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ నటించిన తాజా చిత్రం ‘కుంగ్ ఫూ యోగ’. సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషించారు. స్టాన్ లీ టాంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రపంచవ్యాప్తంగా జాకీచాన్ సినిమాలను అందరూ ఇష్టపడతారు. గతంలో తెలుగులో వచ్చిన జాకీచాన్ చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. స్టాన్లీ టాంగ్, జాకీచాన్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘రంబుల్ ఇన్ ది బ్రాంక్స్’, ‘ది మిత్’, ‘చైనీస్ జోడియాక్’ వంటి చిత్రాలు కలెక్షన్ లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాయి. మరోసారి వీరి కలయికలో వస్తోన్న ‘కుంగ్ ఫూ యోగ’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. జాకీచాన్ మార్క్ యాక్షన్ కామెడీతో పాటు ఫ్రెష్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రంలోని పలు రకాల జంతువులు పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తాం’’ అన్నారు. -
జాకీచాన్ ఇన్ ముంబై...
-
కపిల్ షోలో ఈసారి గెస్ట్ ఎవరో తెలుసా?
-
క్లిక్.. క్లిక్...
రిపబ్లిక్ డే వర్ణాలు... జనవరి 26 మన గణతంత్ర దినోత్సవం. న్యూఢిల్లీ రాజ్పథ్లో సైనిక విన్యాసాలు, రాష్ట్రాల శకటాలు, కళాకారుల ప్రదర్శనలు, విద్యార్థుల నృత్యాలు... చూడటానికి రెండు కళ్లూ చాలవు. సోమవారం అక్కడ డ్రస్ రిహార్సల్స్ జరిగాయి. పిల్లలు ఉత్సాహంగా నృత్యం చేస్తున్న ఫొటో ఇది. ఖైదీ నృత్యం ఈ ఫొటోలో ఉత్సాహంగా నృత్యం చేస్తున్నది డాన్సర్లు కాదు. జబల్పూర్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెంట్రల్ జైల్లో ఉన్న మహిళా ఖైదీలు. నిన్న నేతాజీ జయంతి సందర్భంగా జైలులో వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలను ఉల్లాసభరితం చేయడానికి మహిళా ఖైదీలు ఇలా నృత్యాలు చేశారు. చాన్ ఇన్ ముంబై... జాకీచాన్ అంటే తెలియనిది ఎవరికి? భారతీయ నటులతో చైనా– భారత్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మితమైన ‘కుంగ్ఫూ యోగా’లో జాకీచాన్ హీరో. అతడితో పాటుగా మన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా నటించాడు. ఆ సినిమా ప్రమోషన్ కోసం నిన్న జాకీచాన్ ముంబై చేరుకున్నాడు. అభిమానులంతా తమ హీరోని చూసి పులకించిపోయారు. -
కపిల్ షోలో ఈసారి గెస్ట్ ఎవరో తెలుసా?
టీవీ టాక్ షోలలో కపిల్ శర్మ పేరు దేశంలో మార్మోగిపోతుంటుంది. సినిమా సెలబ్రిటీలను పిలవడం, త్వరలో విడుదల కాబోతున్న వాళ్ల సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఆగకుండా గంట పాటు విపరీతంగా నవ్వించే కపిల్ షో అంటే చాలామందికి క్రేజ్. హీరోయిన్లను తనదైన శైలిలో ఆరాధించే కపిల్ చేష్టలు చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే. అలాంటి షోకు ఈసారి ఎవరు వస్తున్నారో తెలుసా.. సాక్షాత్తు జాకీ చాన్!! అవును.. ఇప్పటికే షారుక్, సల్మాన్ సహా పెద్ద పెద్ద స్టార్లందరినీ తన షోలోకి తీసుకొచ్చిన కపిల్ శర్మ ఇప్పుడు రాబోతున్న అతిథి గురించి తెలిసి ఒక్కసారిగా షాకయ్యాడు. తాను నటించిన సినిమా 'కుంగ్ఫూ యోగా' ప్రమోషన్ కోసం జాకీ చాన్ ఈ షోకు రావాలని నిర్ణయించుకున్నాడట. ఆ విషయాన్ని కపిల్ ట్వీట్ చేశాడు. 'ఓ మై గాడ్.. కపిల్ షోలో జాకీచాన్' అని ఒక్క లైన్ మాత్రమే పెట్టాడు. కుంగ్ఫూ యోగా సినిమాలో బాలీవుడ్ నటీ నటులు దిశాపటానీ, సోనూ సూద్, అమైరా దస్తూర్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో జాకీచాన్ది ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్ర. Oh my god .. #jackiechanontkss — KAPIL (@KapilSharmaK9) 23 January 2017