Jagananna Vidya Deevena
-
YS Jagan: ఓ తరం.. అంతరం
‘మన పిల్లలు.. గ్లోబల్ స్టూడెంట్స్’ అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. నర్సరీ నుంచి డిగ్రీ, పీజీ వరకూ అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నాంది పలుకుతూ.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తీసుకున్న ప్రతి నిర్ణయం పేదోడికి మేలు చేకూర్చింది. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఐబీ సిలబస్, టోఫెల్ ఇలా ఒకటేమిటి అధికారంలో ఉన్నన్నాళ్లూ సంస్కరణల పథాన ముందుకు సాగారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాటి నవశకం కాస్త.. నేడు అదోరకం అన్నట్లుగా తయారైంది. ఫలితంగా పేద విద్యార్థుల జీవితాలు అంధకారమయమవుతున్నాయి.వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. దీని కోసం విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. ఎందుకంటే గడిచిన రెండేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ట్యాబ్లను పంపిణీ చేసి విద్యార్థులకు సమకాలీన ఆధునిక వసతులతో కూడిన విద్యారంగం వైపు అడుగులు వేయించింది. కానీ ప్రస్తుతం కూటమి సర్కార్ ఆ పథకానికి ఎగనామం పెట్టి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లింది. అంతేకాక విద్యారంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన విద్యావిప్లవానికి తూట్లు పొడిచేలా నిర్ణయాలు తీసుకుంటూ ఓ తరాన్ని బలి తీసుకుంటోందని పలువురు విద్యారంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అమ్మ ఒడితో ఆనందాలు.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టి ఆ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. రోజూ తమ పిల్లలను బడికి పంపించే కుటుంబానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా సాయమందించారు. కృష్ణాజిల్లాలో 1,35,434 మంది విద్యార్థులకు రూ.203 కోట్లు, ఎనీ్టఆర్ జిల్లాలో 1,80,254 మంది విద్యార్థులకు రూ.266 కోట్లు చొప్పున ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.469 కోట్లు ఏటా ఆయా కుటుంబాలకు అందించిన ఘనత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిది. విద్యా, వసతి దీవెనలతో అండదండలు.. గత ప్రభుత్వ హయాంలో ఏటా ఇంజినీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేర్లతో కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ చేసేది. ప్రధానంగా జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి రూ.43 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీజులుండగా వాటిని విడతల వారీగా అందించింది. ఎనీ్టఆర్ జిల్లాలో గత సర్కార్ సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఏటా విద్యాదీవెన పథకం ద్వారా రూ.406.56 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ.152.49 కోట్లు అందించింది. అలాగే కృష్ణా జిల్లాలోను 35 వేల మంది విద్యార్థులకు సుమారుగా రూ.350 కోట్ల మేర సాయమందించింది.‘నాడు–నేడు’ అద్భుతం..గత ప్రభుత్వ పాలనలో జిల్లాలో పాఠశాలల రూపురేఖలు సైతం మార్పు చేసేందుకు నాడు–నేడు పథకం ద్వారా విశేష కృషి జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోనే తొలి విడతగా 341 పాఠశాలలకు రూ.96.32 కోట్లు, రెండో విడతగా 596 పాఠశాలలకు రూ.240 55 కోట్లు కేటాయించారు. రెండో విడత పనుల ముగింపు దశలో ఉండగా కూటమి సర్కార్ వాటిని పూర్తిగా నిలిపివేసింది. కృష్ణాజిల్లాలోనూ రెండో విడత పనులను సైతం పూర్తిగా ఆపేసింది.ఆధునికతకు అందలం.. గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఆయా పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగా ఏటా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లను అందించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి ఏడాది 26,334 మంది విద్యార్థులకు రెండో ఏడాది సైతం అదే రీతిలో కొనసాగించింది. ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీలతో పాటుగా ప్రాథమిక పాఠశాలలో ఇంటర్నల్ ప్యానల్స్ను అందించింది.ఆరోగ్యానికి ప్రాధాన్యం.. జగనన్న గోరుముద్దతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పరిపూర్ణమైన పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాట్లు గత ప్రభుత్వం ప్రారంభించింది. రోజుకొక మెనూతో విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో మధ్యాహ్న భోజనాన్ని అందించింది. అంతేకాకుండా విద్యార్థులకు కోడిగుడ్డు, చెక్కీలు, రాగిజావ వంటి కొత్త ఆహారాలను సైతం పరిచయం చేసి విద్యార్థులకు పరిపూర్ణమైన ఆహారాన్ని జగన్ అందించారు.ఆంగ్ల బోధనతో కొత్త చరిత్ర.. సమకాలీన సమాజంలో మాతృభాషతో పాటుగా ఆంగ్ల భాషలో బోధన జరిగినప్పుడు విద్యార్థులకు మేలు జరుగుతుందని గత జగన్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రతి పాఠశాలల్లో ఆంగ్ల బోధనను ప్రారంభించింది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా తెలుగు– ఆంగ్ల భాషల్లో ముద్రించిన పుస్తకాలను అందించి వారికి పాఠ్యాంశాలు చక్కగా అర్థమయ్యేందుకు గత ప్రభుత్వం సహకరించింది. పథకాలు అమలు చేయాలి విద్యారంగంలో గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పథకాలన్నీ కూటమి సర్కార్ అమలు చేయాలి. అవి పేద విద్యార్థులకు మేలు చేశాయి. అమ్మ ఒడి వంటి పథకాలను ఇంకా విస్తృతంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి నేడు దాని ప్రస్తావన ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావటం లేదు. నాడు–నేడు సైతం నిలిపివేసింది. – సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అద్భుతమైన ప్రగతి.. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో విద్యారంగం అద్భుతమైన ప్రగతిని సాధించింది. దేశంలోనే మొదటి సారిగా బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, ఒకటి నుంచి 5వ తరగతికి బొమ్మలతో కూడిన డిక్షనరీని, ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, ట్యాబ్లు ఇలా ఒకటేమిటి ప్రతిఅంశంలో కొత్తదనాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులకు మేనమామగా ఆయన చేసిన పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. – టి. కల్పలత, ఎమ్మెల్సీవిద్యాకానుకకు జాతీయ గుర్తింపు.. గతంలో టీడీపీ సర్కార్ పాఠశాలలు ప్రారంభమైన ఆరు మాసాలైనా విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చే పరిస్థితి కనపడేది కాదు. కానీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలు తెరిచిన రోజునే అందరికీ జగనన్న విద్యాకానుక పేరుతో పాఠ్యపుస్తకాలతో పాటుగా అత్యధిక నాణ్యత కలిగిన నోటు పుస్తకాలు, బూట్లు, బ్యాగ్, డిక్షనరీలు ఇలా ఎనిమిది రకాల వస్తువులను అందించేవారు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న విద్యాకానుకకు జాతీయ స్థాయిలో ప్రశంసలు అభించాయి. కూటమి సర్కార్ తూట్లు..కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగానికి సంబంధించి అనేక పథకాలకు తూట్లు పొడిచిందని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అమ్మ ఒడి, నాడు–నేడు, ట్యాబ్ల పంపిణీతో పాటుగా పలు కార్యక్రమాలను నిలిపివేయటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జగనన్న గురుముద్ద పేరుతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనాన్ని సైతం ఇష్టారాజ్యంగా మార్చేసి, పరిశుభ్రత లేకుండా చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో పని చేసే ఆయాలకు జీతాలు ఇవ్వకపోవటంతో విద్యాసంస్థల్లో విద్యార్థులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. -
Nissie Leone: అనుకుంది... సాధించింది
కుటుంబంలో ఆడపిల్లను ఒక మైనస్గా భావించిన సమాజం నుంచి ఆడ, మగ అనే తేడా లేకుండా ఉన్నంతలో తమ పిల్లల్ని గొప్పగా చదివించాలనే సంకల్పం దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ మొదలైంది. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే నిస్సీ లియోన్. ఆడపిల్లను చదువుకోసం పొరుగూరుకు కూడా ఒంటరిగా పంపడానికి ఇప్పటికీ భయపడుతున్న రోజుల్లో విదేశాల్లో కొలువుకి ఎంపిక అయ్యేలా ప్రొత్సహించారు నిస్సీ తల్లిదండ్రులు, చదివింది డిగ్రీ అయినా యూకేలో ఉద్యోగంలో చేరుతోంది. వార్షిక వేతనం అక్షరాలా రూ.37 లక్షలు అందుకోబోతోంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన నిస్సీ లియోన్ తన విజయావకాశం గురించి ఆనందంగా తెలియజేస్తోంది.‘‘బీఎస్సీ కార్డియాలజీలో డిగ్రీ పూర్తిచేశాను. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్కు చెందిన ఎన్హెచ్ఎస్ నార్తెర్న్ కేర్ అలియన్స్ నన్ను ఉద్యోగానికి ఎంపికచేసింది. ప్రపంచవ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఈ సంస్థ ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఇండియా నుంచి ఇద్దరు ఎంపిక కాగా వారిలో నేనూ ఒకరిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.ఈ రోజుల్లో... మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న జార్జ్, అమ్మ సునీతలు స్థానిక చర్చ్లో పాస్టర్స్గా పని చేస్తున్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడు. సేవా తత్పరతతో కూడిన ఉద్యోగం చేయాలనేది నా ఆలోచన. మా అమ్మనాన్నల సేవాగుణం నాలోనూ అలాంటి ఆలోచనలు కలగడానికి కారణం అయింది. మొదట వైద్యురాలిగా స్థిరపడాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వైద్య సహాయకురాలిగా స్థిరపడాలనుకున్నాను. శ్రీకాకుళంలోని బొల్లినేని మెడీ స్కిల్స్ పారా మెడికల్ డిగ్రీ కళాశాలలో కార్డియాలజీ విభాగంలో చేరాను. పిల్లల ఉన్నతోద్యాగాల గురించి పెద్దలు తరచూ ‘వాళ్లబ్బాయి సాఫ్ట్వేర్ అంట, వీళ్లమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుందంట’ అనే మాటలను వింటూనే ఉంటాం. అయితే దేశంలో కొన్ని రంగాలలో ఉన్నవారు మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. వారి విద్యార్హత, నాలెడ్జ్, చదివిన కాలేజీ, అభ్యర్థి నడవడిక, బృందంలో పనిచేసే వైఖరి.. వంటి వాటి ఆధారంగా జీతాలను నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసే వారికి సైతం మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. విదేశీ సంస్థలు అందుకు స్వాగతం పలుకుతున్నాయి అని జెమ్స్ మెడికల్ కాలేజ్ ఛీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు, బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. నాగేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ పద్మజల ద్వారా తెలిసింది. అంతకుముందు నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన లేదు. కానీ, వారిప్రొత్సాహంతోనే ఈ ఘనత సాధించాను.దశల వారీగా...నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన ఎన్హెచ్ఎస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేస్తోంది. ఇందులో ప్రవేశం అంత సులువేమీ కాదని కొద్దిరోజుల్లోనే అర్ధమైంది. హైదరాబాద్ కు చెందిన ప్రకార స్వచ్ఛంద సంస్థ ద్వారా మా కాలేజీకి సమాచారం వచ్చింది. నైపుణ్యం కలిగిన బీఎస్సీ కార్డియాలజీ ఎకో గ్రాఫర్ కావాలని, అందుకు వెంటనే అప్లై చేసుకోవాలనీ మా కాలేజీ వాళ్లు చె΄్పారు. దీంతో అప్లై చేసి, సికింద్రాబాద్ కిమ్స్లో శిక్షణ తీసుకున్నాను. కిందటేడాది జరిగిన బ్రిటిష్ సొసైటీ అఫ్ ఎకోకార్డియోగ్రాఫీ (బిఎస్ఇ) వారు నిర్వహించిన ట్రాన్స్ థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (టీటీఇ) పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యాను. నిపుణులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ చేసింది. అంతకుముందు జరిగిన థియరీ పరీక్షలోనూ మంచి మార్కులు వచ్చాయి. రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించడంతో ఉద్యోగానికి ఎంపియ్యాను. వార్షిక వేతనం ఇండియా కరెన్సీలో రూ.37 లక్షలు అని తెలిసింది. అమ్మానాన్నలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను. ఒక డిగ్రీ విద్యార్థిని ఈ స్థాయిలో ΄్యాకేజీకి ఎంపిక కావడం చిన్న విషయం కాదని అందరూ అంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతోంది. వీసాకు అయ్యే మొత్తాన్ని, విమాన యాన ఖర్చులు కూడా ఆ సంస్థనే అందిస్తోంది’’ అంటూ ఆనందంగా తెలియజేసింది నిస్సీ. అనస్తీషియా, కార్డియాలజీ రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్టులుగా ఉండేవి. కార్డియాలజీలో పని పట్ల మరింత సంతృప్తి లభిస్తుందనిపించి ఈ సబ్జెక్ట్ను ఎంచుకున్నాను. మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యవృత్తిలో రాణించాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి, ఈ డిగ్రీ తీసుకున్నాను. నా కాలేజీ ఫీజు విద్యా దీవెనలో కవర్ అయ్యింది. ఇప్పుడు మంచి సంస్థలో ఉద్యోగం లభించింది. – నిస్సీ లియోన్మా చుట్టుపక్కల వాళ్లందరూ మా అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంది. నిస్సీ తల్లిదండ్రులుగా మాకూ గుర్తింపు వచ్చింది. ఈ రోజే మా అమ్మాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి బయల్దేరింది. – తల్లిదండ్రులు– నిర్మలారెడ్డి -
జగనన్న విద్యాకానుక రెడీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ఏటా అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫారం, బూట్లతో కూడిన కిట్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంచేసింది. ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన మొదటిరోజే వాటిని అందించేందుకు సామగ్రిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో బోధించే 3.12కోట్ల పాఠ్యపుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు ఇప్పటికే చేరవేశారు. యూనిఫారం సరఫరా శనివారం నుంచి మొదలైంది.వస్తువులను ఒక్కొక్కటిగా స్టాక్ పాయింట్లకు చేర్చిన అనంతరం అక్కడ తరగతుల వారీగా కిట్లను రెడీ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయగా మిగిలిన 2 లక్షల కిట్లకు అదనంగా ఈ విద్యా సంవత్సరానికి 36లక్షల కిట్లను అధికారులు సిద్ధంచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా వస్తువులను అందించేలా సరఫరాదారులకు ఆదేశాలు జారీచేశారు.అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతోపాటు మూడు జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. అదేవిధంగా 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతుల విద్యార్థులకు నోట్బుక్స్, అందించనున్నారు. ఇప్పటివరకు విద్యాకానుక కిట్లో అందించే తొమ్మిది వస్తువుల్లో బూట్లు మినహా మిగిలిన బ్యాగులు, బెల్టులు, సాక్సులు, పాఠ్య, నోటుపుస్తకాలు, వర్క్బుక్స్, డిక్షనరీ వంటి 8 రకాల వస్తువులు 90 శాతం మండల కేంద్రాలకు చేరాయి. ఒకట్రెండు రోజుల్లో బూట్ల సరఫరా చేపట్టనున్నారు. పాఠశాలలకు 3.12 కోట్ల పాఠ్య పుస్తకాలు..ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను స్టాక్ పాయింట్లకు పంపించారు. 3–10 తరగతుల వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. ఈనెల 8వ తేదీ నాటికే అన్ని స్కూళ్లలోను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కిట్లను సిద్ధంచేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్లుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది.రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రాన్ని సీబీఎస్ఈ తరహాలో జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ రూపంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను పూర్తి ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదేతొలిసారి కావడం విశేషం. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్గా ఇంజినీరింగ్ విద్యార్థులుఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. వీరి బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలు ముద్రించి పంపిణీకి సిద్ధంచేసింది. -
డీబీటీ పథకాల చెల్లింపులు ప్రారంభం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అండ్ కో కుట్రలు, కుతంత్రాలు, దు్రష్పచారాన్ని వమ్ము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల డీబీటీ చెల్లింపులను ప్రారంభించింది. వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా తదితర పథకాల లబ్దిదారులకు చివరి దశ చెల్లింపులను చంద్రబాబు బృందం అడ్డుకుంది. పేదల పొట్ట కొట్టేలా పోలింగ్కు ముందు పచ్చ బ్యాచ్ ఫిర్యాదులు చేయడంతో డీబీటీ చెల్లింపులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిలిపివేసింది. పోలింగ్ ముగిసిన తరువాత చెల్లింపులు చేయాలని, పోలింగ్కు ముందు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాలు గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని, కొత్తవి కాదని, లబ్ధిదారులు కూడా పాతవారే తప్ప కొత్తవారు కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ, చంద్రబాబు బృందానికి అనుకూలంగా ఈసీ వ్యవహరించింది. పోలింగ్ ముగియడంతో పేద లబ్దిదారులకు మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ పథకాల చెల్లింపులను ప్రారంభించింది. పొదుపు సంఘాల మహిళల కోసం రూపొందించిన వైఎస్సార్ ఆసరా పథకం నిధులు రూ.1,480 కోట్లను డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే పేద విద్యార్ధులకు ఫూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జగనన్న విద్యా దీవెన కింద డీబీటీ ద్వారా రూ.502 కోట్లు చెల్లించింది. మరో రెండు మూడు రోజుల్లో మిగతా పథకాల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది.ముందే అనుమతి కోరినా సాగదీసి.. నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న పథకాల లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ కోసం పోలింగ్ తేదీకి చాలా ముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది. తెరవెనుక చంద్రబాబు అండ్ కో చేసిన మంత్రాంగంతో ఎన్నికల సంఘం ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చకుండా సాగదీసింది. పోలింగ్కు రెండు రోజుల ముందు ఈ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయవద్దంటూ ఉత్తర్వులిచ్చింది. దీని వెనుక పచ్చ బ్యాచ్ ఒత్తిడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ ఉత్తర్వులను ఈనెల 10వ తేదీన ఒకరోజు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే పథకాల డీబీటీ చెల్లింపులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరణలు కోరింది. ఈసీ తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ, 10వ తేదీన సమయం మించిపోవడంతో లబి్ధదారులకు పథకాల మేలు నిలిచిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో పేదలకు నగదు చెల్లింపులను ప్రారంభించింది. దీని ద్వారా ఎన్నికల కోసం ఈ పథకాలను అమలు చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించిందనే అభిప్రాయాన్ని అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
సామాజిక రంగ వ్యయంలో దక్షణాదిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: పేదలను విద్యావంతులు, ఆరోగ్యవంతులుగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై అత్యధిక వ్యయం చేస్తున్నారు. పేదల అభ్యన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్య అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పేదింటి పిల్లవాడూ లేదా అమ్మాయి చదువు మధ్యలో ఆపేయకుండా అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్ను పిల్లలకు అందిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేదల ఇంటి వద్దకే వైద్యాన్ని చేరుస్తున్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించారు. బడి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షిత మంచి నీరు అందిస్తున్నారు. ఇలా సామాజిక రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు. తద్వారా గత ఐదేళ్లుగా సామాజిక రంగ కేటాయింపులు, వ్యయంలో మన రాష్ట్రం ముందుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లోనూ (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) సామాజిక రంగ కేటాయింపులతో పాటు వ్యయంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లు కేటాయించింది. ఇందులో పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. ఇది ఏకంగా 82.54 శాతం. సామాజిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు, ఆ నిధులను సమర్ధంగా వినియోగించడంలో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు వెనకబడ్డాయని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. మూడో స్థానంలో కర్నాటక,, నాలుగో స్థానంలో తెలంగాణ,, ఐదో స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. సామాజిక రంగ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. -
పేదపిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే పెత్తందారులకు కడుపునొప్పి
-
ఆంధ్రప్రదేశ్లో మానవ వనరులపై 73 వేల కోట్ల రూపాయల మూలధన పెట్టుబడి పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన... జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 708 కోట్ల రూపాయలు జమ...ఇంకా ఇతర అప్డేట్స్
-
తలరాతలు తిరగరాస్తూ..
14 ఏళ్లు, మూడు దఫాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పేద పిల్లలకు చేసిన మంచి ఏమిటి? వారి భవిష్యత్తు మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చూపించారా? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తురాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే విద్యారంగానికి చేసిన చెడు గురించి మాత్రం చాలా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ బడిని నీరుగార్చి నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించింది చంద్రబాబు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లిష్ మీడియం, గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం అని నిర్దేశించింది చంద్ర బాబు. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలని ప్రయత్నిస్తున్న మారీచులతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్తో కాదు! జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా, తరతరాల తలరాతలను మార్చాలని గత 57 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఒక్క చదువులతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి విద్యారంగాన్ని సమూలంగా సంస్కరించినట్లు చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, నాడు–నేడు తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా పేదల ఉన్నత చదువులకు భరోసా కల్పించామన్నారు. ప్రభుత్వ టీచర్లకు చెల్లించే జీతభత్యాలు కాకుండా పేద పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తూ వివిధ పథకాలు, సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ఏకంగా రూ.73 వేల కోట్లకుపైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. పేదింటి బిడ్డల ఉన్నత చదువులకోసం ఇంతగా పరితపిస్తుంటే పెత్తందారులైన దుష్ట చతుష్టయానికి కంటగింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 2023 అక్టోబరు–డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ రూ.708.68 కోట్లను సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఐదేళ్లుగా విద్యారంగ పురోభివృద్ధి కోసం తీసుకున్న విప్లవాత్మక చర్యలను వివరించారు. పెద్ద చదువులు చదివే 93 శాతం పిల్లలకు లబ్ది.. తరతరాల పేదరికం సంకెళ్లను తెంచేస్తూ పెద్ద చదువులు అనే పునాదులపై ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు దోహదం చేసే గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోంది. వంద శాతం ఫీజులను పిల్లల తల్లులకే అందచేసి వారి ద్వారా కాలేజీలకు చెల్లించే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా అమలు చేస్తున్నాం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా ఆ తల్లుల ఖాతాలకు ఫీజుల మొత్తాన్ని జమ చేయడం కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు అంటే ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పూర్తి ఫీజులను మీ జగనన్న ప్రభుత్వమే చెల్లిస్తోంది. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను ఆలోచించమని కోరుతున్నా. ఆదాయ పరిమితిని పెంచాం.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత మంది పిల్లలు బాగా చదివి బాగుపడాలని ఆరాట పడ్డాం. ఏ పేదవాడూ తన పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే తపనతో ఆదాయ పరిమితిని పెంచాం. గతంలో రూ.లక్షకే పరిమితమైన ఆదాయ పరిమితిని ఏకంగా రూ.2.5 లక్షలకు పెంచి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. ఫీజులు ఇంతే కడతాం! ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి! మీ చావు మీరు చావండనే గత ప్రభుత్వ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాం. తల్లిదండ్రులు ఎవరూ ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని మన భుజ స్కంధాలపై వేసుకున్నాం. త్రైమాసికం ముగిసిన వెంటనే తల్లుల ఖాతాల్లోకి ఫీజులు జమ చేస్తూ కాలేజీలకు అందచేసే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లించే విద్యా దీవెనే కాకుండా ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. తాజాగా అందిస్తున్న రూ.708 కోట్లతో కలిపి ఇప్పటిదాకా 29.66 లక్షల మందికి పిల్లలకు మంచి చేస్తూ జగనన్న విద్యాదీవెన అనే ఒక్క కార్యక్రమం ద్వారానే రూ.12,609 కోట్లు తల్లులకు అందచేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల భోజనం, వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో రూ.4,275 కోట్లు ఉంటుంది. వచ్చే ఏప్రిల్లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో రూ.1,100 కోట్లు కూడా కలిపితే విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా వెచ్చిస్తున్న సొమ్ము ఏకంగా దాదాపు రూ.18 వేల కోట్లు అవుతుంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుండాలనే సంకల్పంతో ప్రతి అడుగూ వేస్తూ వచ్చాం. మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చింది. హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్.. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం 57 నెలల వ్యవధిలో రూ.73 వేల కోట్లు వ్యయం చేశాం. గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చే జీతాల వ్యయం దీనికి అదనం. ఇదంతా పేద, మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితం కోసం మనం చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. పేద కుటుంబాల్లో ప్రతి పాపా, ప్రతి బాబు గొప్ప చదువులతో ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు, పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా ఎదిగి ఆ కుటుంబాల తలరాతలు మారాలని, భవిష్యత్ బాగుండాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. మన విద్యా విధానంలో మీ అన్న ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఎలాంటి మార్పులు చేసింది? దానివల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అనేది ఒకసారి అందరూ గమనించాలని కోరుతున్నా. మన విద్యార్థులు రేపు ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంటుంది. గత 30 ఏళ్లలో టెక్నాలజీ ఎంతో మారిపోయింది. ఆధునిక చదువులకు అనుగుణంగా మన విద్యా విధానాలను సంస్కరిస్తూ మెరుగైన పద్ధతులు, టెక్నాలజీని మన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు అందుబాటులోకి తెస్తూ అడుగులు వేశాం. చదువుల యుద్ధం.. ప్రభుత్వం స్కూళ్లలో మనం ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడటం మన తప్పు! ఇంగ్లీష్ మీడియం తేవాలని తపనపడటం మనం చేసిన తప్పు! ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. మనపై యుద్ధం చేస్తున్న వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారని నిలదీస్తే ఏ ఒక్కరూ తెలుగు మీడియంలో చదువుతున్నారని చెప్పరు. వాళ్ల పిల్లలేమో ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. పేదింటి పిల్లలనూ అలాగే చదివిస్తూ మీ జగన్ అడుగులు వేస్తుంటే మాత్రం తెలుగు భాష అంతరించి పోతోందంటూ యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. విద్యారంగంలోనూ క్లాస్ వార్.. ఇప్పుడు విద్యారంగంలో కూడా క్లాస్ వార్ జరుగుతోంది. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం ఇది. డబ్బున్న వారికి ఒక చదువులు, డబ్బులు లేని వారికి మరో చదువులు అనే ధోరణులపై జరుగుతున్న యుద్ధం ఇది. ఈ క్లాస్ వార్లో మీ కష్టాలు తెలిసిన అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం.ఈ సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కొనసాగకుంటే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు కొనసాగాలి. ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. విదేశాల్లోని గొప్ప విశ్వవిద్యాలయాల కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తేవడం విప్లవాత్మక మార్పు. ఇవన్నీ మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. మనం వచ్చే వరకు గవర్నమెంటు బడులలో ఇంగ్లిష్ మీడియం కూడా ఎవరూ చూడలేదు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టాం. బాబు ఒక్క మంచీ చేయలేదు.. పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి ఆహారం అందుతుందో చంద్రబాబు ఏనాడు కనీసం ధ్యాస పెట్టలేదు. బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడు – నేడుతో స్కూళ్లను బాగుపరచాలన్న ఆలోచనే చేయలేదు. ఇంగ్లీషు మీడియం ఊసే లేదు. అమ్మ ఒడి దిశగా అడుగులు వేసిందీ లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచనే ఏ రోజూ చేయలేదు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నానే. విదేశీ విద్యా దీవెనతో ఏకంగా రూ.1.25 కోట్ల దాకా చదివించే బాధ్యత నాదీ అన్న ప్రోత్సాహకర మాటలే నాడు లేవు. రాష్ట్రంలో ఆయన పరిపాలన వల్ల జరిగిన మంచి ఒక్కటంటే ఒక్కటీ లేదు. గ్రామాలకు, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, చదువుకుంటున్న పిల్లలకు, జాబ్స్ కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని ఆయన చెప్పగలిగే పరిస్థితే లేదు. హాజరైన మంత్రులు, నేతలు కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రçఘురాం, టి.కల్పలత, మొండితోక అరుణ్కుమార్, రుహుల్లా, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, దూలం నాగేశ్వరరావు, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి, ఉన్నత విద్యాచైర్మన్ హేమచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నేటి విత్తనం.. రేపు మహా వృక్షం ఇవాళ మన పిల్లలకు కావాల్సింది ఏదో కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే ఫర్వాలేదని భావించే చదువులు కానే కాదు. ఈరోజు మనకు కావాల్సింది క్వాలిటీ చదువులు. ఇవాళ్టి తరం రేపు పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే నాణ్యమైన చదువులు కావాలి. ఈ నిజం, అవసరాన్ని తెలుసుకున్నాం కాబట్టే మన పిల్లలందరూ భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా మన అడుగులు ముందుకు పడ్డాయి. ఈ దిశగా ప్రాథమిక విద్యలో కీలక మార్పులు తెచ్చాం. మనం వచ్చిన తర్వాతే గవర్నమెంట్ బడుల పరిస్థితులు మారాయి. ఇవాళ ఒకటో తరగతిలో మనం వేసే విత్తనం మరో 10–15 ఏళ్లలో చెట్టు అవుతుంది. మంచి భవిష్యత్ లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది. అలా కాకుండా మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. నాడు–నేడుతో గవర్నమెంట్ స్కూళ్లలో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా మన ప్రయాణం సాగుతోంది. జగన్ అనే వ్యక్తి పక్కకుపోతే...! జగన్ అనే ఒక్కడు పక్కకుపోతే రేపు పిల్లల చదువులు ఉండవు! గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు! 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ కథ దేవుడెరుగు విద్యారంగం గాలికి పోతుంది! ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులు, వ్యవసాయం గాలికి ఎగిరిపోతాయి. రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు. అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి. పేదవాడికి తోడుగా నిలబడుతూ, పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే. అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. వాళ్లు చెప్పే అబద్ధాలు, మోసాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబుతారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తామంటారు. మీ ఇంటికి ఎవరు మంచి చేశారు? ఎవరి హయాంలో మంచి జరిగింది? అనే ఆలోచన చేయండి. మీ జగన్ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా సైనికులుగా నిలబడండి. నేను చెప్పే ఈ మాటలు కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పిల్లల బాధ్యత తీసుకున్నారు తోడేళ్లన్నీ ఏకమైనా జగనన్న మనందరి కోసం పోరాడుతున్నారు. అట్టడుగు వర్గాలను పైకి తేవాలన్న సంకల్పం గొప్పది. వ్యవస్ధలో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమని భావిస్తూ సంస్కరణలు చేపట్టారు. స్కూళ్లు మొదలయ్యే జూన్, జూలై వచ్చిందంటే ప్రతి ఒక్కరూ పిల్లల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు జగనన్న ఆ బాధ్యత తీసుకున్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్న 30 ఏళ్లు సీఎంగా ఉండాలి. సామాన్యుడైన నన్ను ఎమ్మెల్యేను చేశారు. ప్రాణం ఉన్నంతవరకు ఆయన వెంటే నడుస్తా. ముఠా నాయకులు, ప్యాకేజ్ స్టార్ను ప్రజలు తరిమి కొట్టాలి. ఓ వ్యక్తి ఇటీవల తరచూ అత్తగారింటికి నిమ్మకూరు వస్తున్నాడు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి కొత్త కథలు చెబుతున్నాడు. – కైలే అనిల్కుమార్, పామర్రు ఎమ్మెల్యే విద్యార్థులకు వరంలా.. అమ్మలా గోరుముద్ద అందిస్తూ నాన్నలా ఫీజులు చెల్లిస్తున్న మీది గొప్ప మనసు అన్నా. కృష్ణా యూనివర్సిటీలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బీటెక్ చదువుకుంటున్నా. నాన్న చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీస్ల చుట్టూ తిరిగినట్లు చెప్పారు. నేను ఏ ఒక్క ఆఫీస్కూ వెళ్లకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికే వచ్చి పత్రాలు ఇచ్చారు. విజన్ ఉన్న మీరు సీఎంగా ఉండటం విద్యార్థులకు వరం. ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్లీ మళ్లీ సీఎం కావాలి. మీద్వారా మా కుటుంబం చాలా లబ్ధి పొందింది. – పి.శ్రీ షణ్ముఖ సాయి ప్రియ, విద్యార్థిని గొప్ప ప్రజా నాయకుడు మీరే.. మాది పేద కుటుంబం. నాన్న ప్రైవేట్ ఉద్యోగి. ఆయన జీతంపైనే కుటుంబం గడుస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ పూర్తి చేశా. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నా. విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా లబ్ధి పొందా. కరిక్యులమ్ కోర్సులతో పాటు ఇతర కోర్ సబ్జెక్ట్లు నేర్చుకోవడం వల్ల మంచి గ్రిప్ సంపాదించా. సాఫ్ట్వేర్ జాబ్స్కు అర్హత సాధించా. వరల్డ్ టాప్ యూనివర్సిటీలలో ఎంఎస్ చేయాలనుకుంటున్నా. మీరు యువతకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. మాల్కం గ్లాడ్వెల్ అనే ఇంగ్లిష్ రచయిత టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు. మీరు కూడా టెన్ థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు. నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్లో గ్రేట్ ప్రొఫెషనల్ పేరు సాధించాక మళ్లీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్పై నిలబడి మాట్లాడతానని మాట ఇస్తున్నా. – దిల్షాద్, విద్యార్థిని తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి.... మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్లో 330 కాలేజీల్లో సీట్లు సాధిస్తే జగనన్న విదేశీ విద్యా దీవెనతో రూ.1.25 కోట్ల వరకు ఫీజులు చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లల డిగ్రీలకు ప్రయోజనం దక్కేలా వారు ఏం చదువుతున్నారు? కరిక్యులమ్లో ఎలాంటి మార్పులు తేవాలి? అత్యున్నత భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాలి? అని మొదటిసారిగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మీ అన్న మాత్రమే. కరిక్యులమ్ను జాబ్ ఓరియెంటెండ్గా మార్చాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తెచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్ షిప్ తీసుకొచ్చింది ఇప్పుడే. మన కరిక్యులమ్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను తొలిసారిగా తీసుకొచ్చాం. చదువుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ తొలిసారిగా అనుసంధానం చేస్తూ అడుగులు వేశాం. డిగ్రీ పూర్తయ్యాక మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించక ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో విదేశాల్లో ఉన్నదేమిటి? ఇక్కడ లేనిదేమిటి? అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్టుల్లో ఉన్న వర్టికల్స్ను ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది కూడా మన ప్రభుత్వమే. ప్రఖ్యాత వర్సిటీల్లో ఉన్న దాదాపు 2 వేల కోర్సులన్నీ ఆన్లైన్ ద్వారా మన కరిక్యులమ్లో భాగాలుగా మారి సర్టిఫికెట్లు కూడా వారే ఇచ్చేలా అడుగులు వేశాం. అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ఎస్సీ, ఎల్బీఎస్ లాంటి అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్లో కోర్సులు పూర్తి చేసి పొందిన సర్టిఫికెట్లతో నైపుణ్యాలు సాధించిన మన విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే అంతర్జాతీయంగా మల్టీ నేషనల్ కంపెనీల్లో అందరికంటే ముందుంటారు. జగన్నాథ రథం.. విప్లవాత్మక సంస్కరణలతో మన జగన్నాథ రథం వడివడిగా కదులుతోంది. స్కూల్ ఎడ్యుకేషన్లో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని మీ అన్న పరిపాలనలోనే తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతోంది కూడా ఇప్పుడే. గవర్నమెంట్ స్కూళ్లలో బైలింగ్యువల్ టెక్సŠట్బుక్స్ మన పిల్లల చేతుల్లో కనిపిస్తోంది కూడా ఇప్పుడే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ను పేద పిల్లలకు సైతం అందించింది ఈ 57 నెలల కాలంలోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు నేర్చుకునే లిటరసీ నుంచి డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏకంగా ట్యాబ్లు ఇచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. నాడు – నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేసి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములో ఐఎఫ్పీ ప్యానెళ్లు తెచ్చింది మన ప్రభుత్వమే. పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు అమ్మ ఒడితో ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తోంది కూడా మనమే. పిల్లలకు రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్దను పౌష్టికాహారంతో అందిస్తోంది కూడా ఈ 57 నెలలుగానే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలు, అందులో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒకటి ఉండాలని ఏర్పాట్లు చేసింది కూడా మన ప్రభుత్వమే. విద్యా వ్యవస్థను మన ప్రభుత్వం ఎంత ఉన్నత స్థాయికి చేర్చిందో చెప్పేందుకు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థినులు ఐక్యరాజ్యసమితిలో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడిన అరుదైన ఘట్టమే నిదర్శనం. మన చదువుల ఘనతను చిట్టి చెల్లెమ్మలు ప్రపంచానికి చాటి చెప్పారు. ఎమ్మెల్యే అనిల్ను చూసినప్పుడల్లా.. ఎమ్మెల్యే అనిల్ని చూసినప్పుడల్లా అందరూ తన మాదిరిగా ఉంటే ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని అనిపిస్తుంది. నిజాయతీ, నిబద్ధత ఉన్న అనిల్ను మీరందరూ దీవించండి. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కొన్ని పనులు అడిగాడు. అధికారులను పిలిపించి అవన్నీ కచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తానని హామీ ఇస్తున్నా. పెత్తందారులకో ధర్మం.. పేదలకో ధర్మమా? ఇవాళ నేను చెబుతున్న ప్రతి మాటా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నా. తల్లిదండ్రులు, పిల్లలందరూ దీన్ని గమనించాలి. పెత్తందార్లయిన వారికో ధర్మమట! పేదలైన మీకో ధర్మమట! వారి పిల్లలకు ఒక బడి.. మన పిల్లలకు ఇంకో బడట! వారి చదువులు వేరట.. మన చదువులు వేరట! పెత్తందార్లుగా వారుండాలట... పనివారిగా మనం ఉండాలట! పరిశ్రమలు వారివట.. కార్మికులుగా మాత్రమే మనమట! సామ్రాజ్యాలన్నీ వారివట.. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట! వారి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ జగన్ పేద పిల్లలకు ట్యాబ్లిస్తే మాత్రం చెడగొడుతున్నారంటూ యాగీ చేస్తారు. ఇవన్నీ మన పిల్లలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోవాలని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనాలుగా మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. -
పామర్రులో జగనన్న .. విద్యాదీవెన నిధుల విడుదల (ఫొటోలు)
-
సీఎం జగన్తో పేర్ని కిట్టు కలిసి..!
-
CM Jagan Pamarru Meeting: జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
జగనన్న విద్యా దీవెన విడుదల
-
కేవలం పిల్లల కోసమే 57 నెలలో 73 వేల కోట్లు ఖర్చు చేశాం
-
పేద పిల్లల కోసమే ‘జగన్నాథ’ రథం: పామర్రులో సీఎం జగన్
సాక్షి,కృష్ణాజిల్లా: చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను బటన్ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్ ఖాతాల్లోకి సీఎం జగన్ విడుదల చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ పెద్ద చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకు ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే కార్యక్రమమే విద్యాదీవెన అని తెలిపారు. ‘రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మంది పిల్లలు 9 లక్షల 44వేల 666 మందికి జగనన్న ప్రభుత్వమే ఫీజులు కడుతోంది. ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పులపాలు కాకూడదని మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలతో పాటు మిగిలిన కులాల వారిని స్కీమ్కు అర్హులుగా చేసేందుకు ఆదాయపరిమితిని 2 లక్షల దాకా పెంచాం. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నాం. గతంలో ఇంతే ఫీజులు కడుతాం.. ఇంత కంటే ఎక్కువ కట్టం.. మీ చావులు మీరు చావండి అన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ ప్రస్తుతం త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ మూడు నెలలకు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలో వేస్తూ ఫీజులు కట్టిస్తున్నాం. కేవలం ఫీజులే కాకుండా వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకువచ్చి పిల్లలకు బోర్డింగ్ ఉచితంగా అందిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలలుగా విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నాం. 57 నెలల్లో 29 లక్షల మందికి రూ.12 వేల కోట్లు.. అక్టోబర్,నవంబర్, డిసెంబర్ క్వార్టర్కు సంబంధించిన రూ.708 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలోకి ఈ వేదిక నుంచి నేరుగా పంపిస్తున్నాం. వీటితో కలుపుకుని గత 57 నెలలలో 29 లక్షల 60 వేల మందికి రూ.12వేల609 కోట్ల రూపాయలను విద్యా దీవెన కింద జమ చేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4275 కోట్లు చెల్లించాం. ఈ ఏప్రిల్లో విడుదల చేయనున్న నిధులను కూడా కలిపితే రెండు పథకాల మీద పెట్టిన మొత్తం రూ.18 వేల కోట్ల రూపాయలు అని చెప్పేందుకు గర్వపడుతున్నా. ఒక్క విద్యారంగంలో స్కీములకే ఐదేళ్లలో రూ.73 వేల కోట్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యా రంగంలో పెద్ద మార్పులు తీసుకువచ్చాం. విద్యా రంగంలో 57 నెలల కాలంలో కేవలం పథకాల మీద రూ.73 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం. పేదరికం నుంచి బయటికి రావడానికి చదువు ఒక్కటే అస్త్రమని నమ్మి మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతున్నాం. పేదింటి పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద కంపెనీ సీఈవోలుగా చేయాలని, పేదల తలరాతలుగా మారాలని ఈ 57 నెలల కాలంలో అడుగులు వేస్తూ వచ్చాం. మేం చేసిన మార్పుల వల్ల విద్యా విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రతి ఒక్కరూ గమనించాలి. 3 ఏళ్ల పిల్లల నుంచి 23 ఏళ్లలోపు పిల్లలు శతమానంభవతి అనే విధంగా మరో 100 ఏళ్లు జీవించాల్సిన జనరేషన్. ఈ జనరేషన్ పోటీపడేది ప్రపంచస్థాయిలో. గత 30 ఏళ్లలో చదువులు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే సరిపోదు. ప్రస్తుతం క్వాలిటీ చదువులు కావాలి. ఇది గమనించాను కాబట్టే పెద్ద పెద్ద స్థానాల్లో పిల్లలు ఉద్యోగాలు సంపాదించే విధంగా అడుగులు వేస్తూ వచ్చాం. ఒకటవ తరగతిలో మనం వేసే విత్తనం 15 ఏళ్లలో చెట్టవుతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తుండేలా పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలని కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో భాగంగానే ప్రాథమిక విద్య నుంచి మొదలుపెడితే ఉన్నత చదువుల దాకా గొప్ప మార్పులు తీసుకువచ్చాం. నాడు నేడుతో ప్రభుత్వ బడులను ప్రక్షాళన చేశాం. ఇంగ్లీష్ మీడియంతో పాటు స్కూళ్లలో సీబీఎస్, ఐబీ సిలబస్ తీసుకువచ్చాం. ఇంగ్లీష్ మీడియం అంటే యుద్ధమే చేస్తున్నారు.. ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకు రావాలని ఆరాట పడితే చంద్రబాబు, రామోజీరావు, పవన్కళ్యాణ్తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లెవ్వరి పిల్లలు తెలుగు మీడియంలో చదవడం లేదు. ప్రభుత్వ బడుల్లో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడితే మాత్రం నానా యాగీ చేసి మన మీద యుద్ధమే చేస్తున్నారు. పెత్తందారులైన వారికో ధర్మమట.. మీకో ధర్మమట.. వారికో బడులట.. మనకో బడులట.. వారి పిల్లలకు ఒక చదువుట.. మనకు ఒక చదువులట.. పెత్తందారులు వారట.. పనివాళ్లం మనమట.. పరిశ్రమలు వారివట.. కార్మికులం మనమట. వారి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు. పిల్లలకు జగన్ ట్యాబులిస్తే మాత్రం ఏవేవో చూస్తూ వారు చెడిపోతున్నారని యాగీ చేస్తారు. మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలన్న వారి మనస్తత్వానికి ఇవన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి. విద్యారంగంలో పెత్తందారులకు పేదలకు మధ్య క్లాస్ వార్ జరుగుతోంది. డబ్బులున్నవాళ్లకు, డబ్బు లేని వాళ్లకు ఒక యుద్ధం జరగుతోంది. మీ అన్నగా మీ తరపున విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చాం. ఈ అడుగులు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగానే, పేదల పిల్లలు, పేదలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు జరగాలి. పేద పిల్లల కోసమే జగన్నాథ రథం కదులుతోంది.. చంద్రబాబు ఆయన మనుషులు, పెత్తందారుల భావజాలాల మీద తిరుగుబాటుగానే విదేశీ విద్యాలయాల్లోని కోర్సులు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది. మూడవ తరగతిలోనే మన ప్రభుత్వ బడుల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. మూడవ తరగతిలోనే టోఫెల్ ఓరియెంటేషన్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. బై లింగ్విల్ టెక్స్ట్ బుక్స్ తీసుకువచ్చాం. బైజూస్ కంటెంట్ను పేద పిల్లకు అందించాం. పిల్లలు డిజిటల్ యుగాన్ని శాసించాలని 8వ తరగతిలోనే పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాం. నాడునేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చాం. ప్రతి ఏటా అమ్మ ఒడి కింద తల్లులకు ప్రోత్సాహం కింద రూ.15వేల రూపాయలు ఇస్తున్నాం. స్కూలుకు వెళ్లే పిల్లలకు గోరుముద్ద కింత పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు, మన కాలేజీ పిల్లలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది మన కళ్లతో మనమే చూశాం. ఇదంతా ఈ 57 నెలల్లోనే కనిపిస్తోంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఈ 57 నెలల్లోనే వంద శాతం ఫీజులు, వసతి ఖర్చులు చెల్లిస్తున్నాం. విదేశీ యూనివర్సిటీల్లో ఒక్కొక్కరికి రూ.కోటి 25 లక్షల ఫీజు.. ప్రపంచస్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 330 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే పిల్లలకు రూ.కోటి 25 లక్షల దాకా ఫీజులు కడుతున్నాం. ఈ నాలుగేళ్ల పాలనలోనే కరిక్యులమ్లో మార్పులు తీసుకువచ్చి జాబ్ ఓరియెంటెడ్గా మార్చాం. సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులు తీసుకువచ్చాం. చదువుల్లోకి ఏఐ, ఎంఎల్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ తీసుకువచ్చాం. మన కాలేజీల్లో డిగ్రీలు చదవడం వల్ల మనకు ఇబ్బందులు రాకూడదని సబ్జెక్ట్లో మార్పులు తీసుకువచ్చి ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చాం. మన కరిక్యులమ్లో భాగంగా ఎంఐటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకమనిక్స్లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి కోర్సులు తీసుకువచ్చాం. విదేశీ విద్యాలయాల వల్లే చదువులు చెప్పి వాల్లే సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. పేదరికం సంకెళ్లను పేద పిల్లలు తెంచుకోవాలనే విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చాం. దీంతో వచ్చే పది పదేహేనేళ్లలో ఎంఎన్సీలలో ఉద్యోగాలు వచ్చి బతుకులు, తలరాతలు మారతాయి. చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎంగా చేసి ఆయన చేసిన మంచి ఏమిటో చేయాలని ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ బడికి చంద్రబాబు చేసిన మంచేమిటని అడిగితే ఎవరికీ ఏదీ గుర్తుకు రాదు. పేదపిల్లలు, వారి చదువుల కోసం చెబితే ఏదీ గుర్తుకు రాదు. ఆయన చేసిన చెడు మాత్రం గుర్తుకు వస్తుంది. ప్రభుత్వ బడిని నీరుగార్చింది చంద్రబాబే.. ప్రభుత్వ బడిని నీరుగార్చించి చంద్రబాబునాయుడు. తన కార్పొరేట్ సంస్థలు నారాయణ, చైతన్యలను పోషించింది చంద్రబాబునాయుడు. పిల్లలకు ప్రభుత్వ బడుల్లో ఎలాంటి ఆహారం అందుతుందో అనేదానిపై కనీసం ధ్యాస పెట్టిన పాపాన చంద్రబాబునాయుడు పోలేదు. నాడు,నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, కరిక్యులమ్లలో మార్పులు బాబు హయాంలో ఏవీ లేవు. 14 ఏళ్లు సీఎంగా చేసినపుడు రైతులకు, గ్రామాలకు, అవ్వాతాతలకు, చదువుకుంటున్న పిల్లలకు చంద్రబాబు మంచి చేసిన పాపాన పోలేదు. ఈరోజు మారీచులతో మేం యుద్ధం చేస్తున్నాం. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే జరిగే నష్టమేమిటో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పిల్లల చదువులుండవు, ఇంఘ్లీష్ మీడియం ఉండదు. పిల్లలను పట్టించుకునే పరిస్థితే ఉండదు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య శ్రీ ఉండవు. వ్యవసాయం గాలికిపోతుంది. రైతన్న చిన్నాభిన్నమవుతాడు. వాళ్లు చెప్పేఅబద్ధాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని చెప్తారు. మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారో ఆలోచన చేయండి. మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా ప్రతి ఒక్కరు సైనికుల్లా ఉండండి’ అని సీఎం జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పామర్రు ఎమ్మెల్యే అనిల్కుమార్, ఉన్నతాధికారులు, కలెక్టర్ పాల్గొన్నారు. -
విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
-
పామర్రులో జరిగిన ఏపీ సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో జనం
-
Watch Live: సీఎం జగన్ విద్యాదీవెన
కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్ విద్యాదీవెన పథకం కింద రూ.708.68కోట్లు ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఈ విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ధి జరిగింది. పెద్ద చదువులు చదువుతున్న పేదింటి పిల్లల ఫీజు డబ్బులు వారి తల్లులకు ఇస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు. 57 నెలలుగా విద్యా దీవెన కార్యక్రమం కొనసాగుతోంది పిల్లల చదువుల కోసం పేదల అప్పులపాలు కాకూడదని అనుకున్నాం 93 శాతం మందికి విద్యాదీవెన అందిస్తున్నాం పిల్లల పూర్తి ఫీజును కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది విద్యా దీవెనతో పాటు జగనన్న వసతి దీవెన అమలు చేశాం గత త్రైమాసికానికి సంబంధించి రూ.708 కోట్లు ఇస్తున్నాం విద్యాదీవెన, వసతిదీవెన కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం విద్యారంగంపై ఐదేళ్లలో 73 వేల కోట్లు ఖర్చు చేశాం ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్ నుంచి ఐబీఎస్ వరకు చదువు చెప్పిస్తున్నా్ం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెచ్చాం ఈ పనులు చేస్తుంటే విపక్షాలు విమర్శిస్తున్నాయి చంద్రబాబు,దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది విమర్శించే వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు పెత్తందార్లకు ఓ ధర్మం..పేదలకు మరో ధర్మమా విద్యారంగంలో ప్రస్తుతం క్లాస్ వార్ జరుగుతోంది డబ్బులు ఉన్నవారికి,లేనివారికి యుద్ధం జరుగుతోంది ప్రభుత్వం ట్యాబ్ లు ఇస్తే చంద్రబాబు,పవన్ విమర్శిస్తున్నారు పెత్తందార్ల కుట్రలు ప్రజలు గమనించాలని కోరుతున్నా పేద విద్యార్ధుల కోసమే ఈ డబ్బు ఖర్చు చేస్తున్నాం విద్యార్ధులు పోటీ ప్రపంచంలో ఎదగాలన్నదే మా లక్ష్యం నాడు-నేడుతో బడులను మార్చేశాం పేద పిల్లలు విదేశాలకు వెళ్లి పెద్ద చదువులు చదువుతున్నారు విద్యార్ధులకు వందశాతం ఫీజులు ప్రభుత్వం భరిస్తోంది పిల్లలకు మనం అందించే గొప్ప ఆస్తి చదువే చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలి విద్యాదీవెనతో పేదింటి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు క్రమం తప్పకుండా విద్యాదీవెన నిధులు అందిస్తున్నాం విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపు పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ఏ పేదవాడు తన పిల్లల చదువు కోసం అప్పులపాలు కాకూడదు మన ప్రభుత్వం వచ్చాక ఆయా ఆదాయపరిమితులు పెంచాం వీలైనంత మందికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు ఫీజులే కాకుండా వసతి ఖర్చుల కోసం వసతి దీవెన ఇస్తున్నాం 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం రూ.708.68 కోట్లు ఖాతాల్లో ఇప్పుడు జమ చేయబోతున్నాం జగనన్న విద్యా దీవెనతో ఇప్పటి వరకు రూ.12,610 కోట్లు అందించాం వసతి దీవెన, విద్యా దీవెన కోసం ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు వెచ్చించాం ఎప్పుడూ చూడని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం విద్యారంగంలో ఇప్పటి వరకూ రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం తర్వాతి తరాలకు మనం అందించే గొప్ప ఆస్తి చదువే మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం ఈరోజు క్వాలిటీతో ఉన్న చదువులే మన పిల్లలకు కావాలి క్వాలిటీ చదువుల అవసరం తెలుసుకున్నాం కాబట్టే విప్లవాత్మక మార్పులు అమలు చేస్తున్నాం మన పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి....మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా? తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగీ చేస్తున్నారు పెత్తందారుల కుట్రలు గమనించమని కోరుతున్నా పెత్తందారుల పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండొచ్చు మీకు ట్యాబులు ఇస్తే చెడిపోతారంటూ నానా యాగీ చేస్తున్నారు పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించండి పెత్తంతారులతో మనం క్లాస్ వార్ చేస్తున్నాం చంద్రబాబు, ఆయన మనుషుల పెత్తందారీ భావజాలాన్ని గమనించండి 57 నెలల కాలంగా జగన్నాథ రథచక్రాలు ముందుకు సాగుతున్నాయి మన పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలి మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం ప్రభుత్వం ట్యాబ్లు ఇస్తే చంద్రబాబు, పవన్ విమర్శిస్తున్నారు పిల్లలకు మంచి చేస్తున్న మనపై చంద్రబాబు అండ్ కో యుద్ధం చేస్తుంది పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారా? చంద్రబాబు పేద విద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటి? చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉంది చంద్రబాబు ఏరోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా? నేను చేసిన పనుల్లో ఒక్క శాతమైనా చంద్రబాబు చేశారా? నారాయణ, చైతన్య విద్యా సంస్థల కోసమే చంద్రబాబు ఆలోచన జగన్ అనే వ్యక్తి తప్పుకుంటే జరిగే నష్టం గురించి ఆలోచించండి జగన్ మళ్లీ రాకుంటే పిల్లల చదువులు, సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయి జగన్ మళ్లీ రాకుంటే పేదవాడు అప్పులపాలవుతాడు ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ అంటూ అబద్ధాలు చెబుతారు వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరుతున్నా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే జగన్ కు ఓటు వేయండి -
‘ అన్నా.. అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్లారు. అయితే విద్యా దీవెన నిధులు విడుదల చేయడానికి సీఎం జగన్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులై ఉన్న సమయంలో ఇద్దరు విద్యాదీవెన లబ్ధిదారులు తమ అనుభవాలను అమూల్యమైన ప్రసంగం ద్వారా పంచుకున్నారు. ‘ మీరు సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం’ అన్నా అనే పదానికి అర్ధం, అమ్మలోని అ, నాన్నలోని న్న కలిపితే నిజంగా మీరేనన్నా, అమ్మలా గోరుముద్ద పెడుతూ, నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న, అన్నా మాది మధ్య తరగతి కుటుంబం, నా ఇంటర్ తర్వాత నాన్నకు హార్ట్ ఆపరేషన్, నా చదువు ఎలా కొనసాగించాలా అనుకునే సమయంలో నాకు క్రిష్ణా యూనివర్శిటీలో బీటెక్ సీట్ వచ్చింది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను, అమ్మ ఖాతాలో నేరుగా డబ్బు పడుతుంది, నాన్న తను చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీస్ల చుట్టూ తిరిగేవారన్నారు, నేను ఒక్క ఆఫీస్కు వెళ్ళకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇచ్చారు, మీలాంటి విజన్ ఉన్న వ్యక్తి సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం, మీరు మా విద్యార్ధులకు అన్నీ ఇస్తున్నారు, మీ వల్ల మాలాంటి ఎంతోమంది చక్కగా చదువుకుంటున్నారు, ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మా కుటుంబం కూడా చాలా లబ్ధి పొందింది, మేం మధ్య తరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఎదిగామంటే మీరే కారణం అన్నా, థ్యాంక్యూ. - శ్రీ షణ్ముక సాయి ప్రియ, విద్యాదీవెన లబ్ధిదారు ‘అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’ మాదొక పేద కుటుంబం.. మా నాన్నగారు ప్రైవేటు ఉద్యోగి. మా నాన్న గారి జీతం మీద మా ఇల్లు నడుస్తోంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను..ఇప్పుడు నేను వెలగపూడి రామకృష్ణా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాను. నేను ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అదే కాలేజ్కి వెళ్లినప్పుడు చదివితే ఇటువంటి కాలేజీలో చదవాలి అనుకున్నాను. కానీ అప్పుడు మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. చదివించేంత డబ్బులు లేవు. అప్పుడు మీరొచ్చారన్నా.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ వచ్చారు అన్నా. విద్యా దీవెన పథకం ద్వారా నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నారన్నా. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా అందిస్తాను చెల్లి అంటూ మీరు మరో అడుగు వేశారన్నా. మీ దీవెనలతోనే నేను ఎక్కడైతే చదవాలని అనుకున్నానో అక్కడే చదవుతున్నాను అన్నా. మాల్కం గ్లాడ్వెల్ అనే ఇంగ్లీష్ రైటర్ టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు, మీరు కూడా టెన్థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు, నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్గా నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్ మీద నిలబడి మాట్లాడతానని నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మా యూత్కు మార్గదర్శిగా నిలుస్తున్నారు, అన్నా థ్యాంక్యూ. -దిల్షాద్, విద్యాదీవెన లబ్ధిదారు -
పామర్రులో జగనన్న విద్యాదీవెన, విద్యార్థుల్లో ఉరకలెత్తిన ఉత్సాహం (ఫొటోలు)
-
పెత్తందారుల కుట్రలు గమనించమని కోరుతున్నా: సీఎం జగన్
Updates 03:04PM, Mar 1st, 2024 ముగిసిన సీఎం జగన్ పామర్రు పర్యటన కృష్ణాజిల్లా పామర్రులో ముగిసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన పామర్రు నుంచి తాడేపల్లికి బయల్దేరిన సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల అంతకు ముందు.. బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్ 12:03PM, Mar 1st, 2024 ప్రసంగం అనంతరం సీఎం వైస్ జగన్... ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించి నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. విద్యాదీవెన నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మీ చిక్కటి చిరునవ్వుల మధ్య, ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య, దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం పామర్రు నుంచి చేస్తున్నాం. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం, తరతరాల పేదరికం సంకెళ్లను తెంపేసి, చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోంది. పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి, తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ జగనన్న విద్యా దీవెన కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు 9.45 లక్షల మంది పిల్లలకు.. మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజును మీ జగనన్న ప్రభుత్వమే కడుతోంది. ఆలోచన చేయమని అడుగుతున్నా. గతానికి ఇప్పటికి మధ్య చిన్న తేడా చెబుతా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలను చదివించాలి, వారు బాగుపడాలి, ఏ పేదవాడూ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని, అర్హత ప్రమాణాలను పెంచాం. ఇన్ కమ్ లిమిట్స్ పెంచాం. గతంలో లక్ష రూపాయలకు పరిమితమైన ఇన్ కమ్ లిమిట్ ను, ఎస్సీలకు 2 లక్షల దాకా పరిమితమై ఉండేది. మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షలకు పెంచి ఈరోజు 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. గతంలో మాదిరిగా ఇంతే కడతాం, ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి, మీ చావు మీరు చావడం అనే విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పాం. పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడే పరిస్థితి రాకూండా పూర్తి ఫీజును కట్టే కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకున్నాం. ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే తల్లులకు ఫీజులు వేస్తూ కాలేజీల్లో ఫీజులు కట్టించే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. విద్యాదీవెనే కాకుండా పిల్లలు ఇబ్బంది పడకూడదని, జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి పాపకూ, బాబుకూ తల్లిదండ్రులకు మంచి చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా జరిపిస్తున్నాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీయింబ్స్ మెంట్ ను 9.45 లక్షల మందికి మేలు చేస్తూ నేరుగా బటన్ నొక్కి పిల్లల, తల్లుల జాయింట్ అకౌంటుకు ఏకంగా 708 కోట్లు నేరుగా పంపించడం జరుగుతుంది. 708 కోట్లతో కలుపుకొని 57 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం చెల్లించిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తీసుకుంటే.. ఏకంగా 29.66 లక్షల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ జగనన్న విద్యాదీవెన ద్వారా మాత్రమే రూ.12,609 కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు జమ చేయడం జరిగింది. జూలై నుంచి జూన్ దాకా ఉండే విద్యాసంవత్సరం మొదట్లో, చివర్లోనూ ప్రతి ఏప్రిల్ లో ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా చెల్లించిన మొత్తం మరో రూ.4275 కోట్లు. ఈ ఏప్రిల్ లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1100 కోట్లు కలుపుకొంటే.. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు పెట్టిన డబ్బు ఏకంగా రూ.18 వేల కోట్లు. ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలి, పిల్లలకు మంచి జరగాలని ప్రతి అడుగూ వేస్తూ వచ్చాం. మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు వివిధ పథకాల మీద 57 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే 73 వేల కోట్లు చేశాం. గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలని, కేవలం పథకాల మీద ఖర్చు చేసిన సొమ్ము ఈ 73 వేల కోట్లు. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితం కోసం మనం చేసిన హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్. పేద కుటుంబాల్లో ప్రతి పాపా, ప్రతి బాబూ గొప్ప చదువులతో గొప్ప డిగ్రీలతో ఇంజనీర్లుగానూ, కలెక్టర్లుగానూ, డాక్టర్లుగానూ, పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగానూ వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆ కుటుంబాల తలరాతలన్నీ మారాలని, భవిష్యత్ బాగుండాలని అడుగులు వేస్తూ వచ్చాం. ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులనూ, పిల్లలనూ ఈ కార్యక్రమం టీవీ ద్వారా చూస్తున్న ప్రతి తల్లిదండ్రినీ గమనించమని కోరుతున్నా. ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేసింది, దాని వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అన్నది ఒకసారి అందరూ గమనించమని కోరుతున్నా. మీ పిల్లల వయసు ఈరోజు మూడు సంవత్సరాలు కావొచ్చు, 23 సంవత్సరాలలోపు ఎంతైనా కావచ్చు. వీరంతా కూడా శతమానం భవతి అన్న విధంగా కనీసం మరో 100 సంవత్సరాలు జీవించాల్సిన జనరేషన్ లో ఉన్న వారు. ఏ విషయంలో అయినా కూడా వీళ్లందరూ పోటీ పడేది ఎవరితో అన్నది ప్రతి ఒక్కరం ఆలోచన చేయాలి. పోటీ పడేది రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఆ గ్రామం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, దేశంతో కాదు, రేప్పొద్దున వీళ్లు ప్రపంచంతో పోటీ పడతారు. గత 30 సంవత్సరాలు తీసుకుంటే, అప్పటికి, ఇప్పటికి తీసుకుంటే వస్తువులు, సేవలు, టెక్నాలజీ అయినా ఎంతగా మారిపోయాయో, మారుతూ వస్తున్నాయో ఇవన్నీ కూడా మనమంతా చూస్తున్నాం. కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే అనుకొనే చదువులు కాదు.. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదని అనుకొనే చదువులు కాదు.. ఈరోజు కావాల్సిన చదువులు క్వాలిటీ చదువులు. ఇవాళ తరం రేపు భవిష్యత్ లో పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే క్వాలిటీ చదువులు మన పిల్లలకు అవసరం. ఈ నిజం, అవసరం తెలుసుకున్నా కాబట్టే మన పిల్లలందరూ భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించుకొనేలా అడుగులు వేస్తూ వచ్చాం. ప్రాథమిక విద్యలో ప్రతి అడుగులోనూ మార్పులు తెచ్చాం. మనం వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ బడులు మారాయి. మనం వేసే విత్తనం మరో 10-15 ఏళ్లలో చెట్టు అవుతుంది. మంచిభవిష్యత్ లేకపోతే చెట్టు ఒరిగిపోతుంది. అలాంటిది కాకుండా పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, పెరగాలి, భవిష్యత్లో అందరికన్నా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని అడుగులు వేస్తూ వచ్చాం. గవర్నమెంట్ బడులను మార్చాం. ఇంగ్లీషు మీడియంతో పాటు గవర్నమెంట్ బడుల్లో సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం కనిపిస్తోంది. ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి.. ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తోంది, ఈనాడు రామోజీ రావుతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తోంది. టీవీ5తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లందరితో పాటు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడటం తప్పు. ఇంగ్లీషు మీడియం తేవాలని తపన పడటం తప్పు. ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. మనపై యుద్ధం చేస్తున్న వీళ్లు, వీళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు కూడా ఏ మీడియంలో చదువుతున్నారని మీలో ఎవరైనా నిలదీస్తే మాత్రం ఏఒక్కరూ తెలుగుమీడియంలో చదువుతున్నారని చెప్పరు. వాళ్ల పిల్లలేమో ఇంగ్లీషుమీడియం చదవాలి, కానీ మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాడానికి మీ జగన్ అడుగులు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించి పోతుందని ఏకంగా యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. నేను చెబుతున్న ప్రతి మాటా ఆలోచన చేయమని కోరుతున్నా. తల్లిదండ్రులు, పిల్లలందరూ గమనించాలి. పెత్తందార్లయిన వారికో ధర్మమట. పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడి అంట. మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. పెత్తందార్లుగా వారుండాలట. పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట. కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. వారి పిల్లల చేతుల్లో ట్యాబులుండొచ్చు. స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు. కానీ మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులిస్తే మాత్రం పిల్లలు ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారని యాగీ చేస్తారు. ఇవన్నీ ఎప్పటికీ మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి ఇవన్నీ నిదర్శనాలుగా మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి, మనకు మధ్య జరుగుతున్నది ఒక యుద్ధం. క్లాస్ వార్ జరుగుతోంది. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం, డబ్బులున్న వారికి ఒక చదువులు, డబ్బుల్లేని వారికి మరో చదువులుగా జరుగుతున్న యుద్ధం. మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం. సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే, ఈ విప్లవానికి అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు జరగాలి. ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. విదేశాల్లో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులు సైతం ఆన్ లైన్ లో పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం వరకు ప్రతి ఒక్కటీ విప్లవాత్మక మార్పు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టాం. అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది. అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్ లో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని తీసుకొచ్చింది మీ అన్న పరిపాలనలోనే. ఏకంగా 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్ తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ఈ 57 నెలల కాలంలోనే. మొట్ట మొదటి సారిగా గవర్నమెంట్ బడుల పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మన పిల్లల చేతుల్లో కనిపిస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ ను పేద పిల్లలు చదువుతున్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిట్రసీ నుంచి డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఈ 57 నెలల కాలంలోనే. మొట్ట మొదటిసారిగా నాడునేడుతో స్కూళ్లన్నీ రూపురేఖలు మారుస్తూ, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములో ఐఎఫ్ పీ ప్యానెల్స్ తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. నాడునేడులో భాగంగా 45 వేల స్కూళ్లలో రూపురేఖలు మారుస్తూ 12 రకాల అంశాలను తీసుకొని ప్రతి స్కూళ్లో తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లలకు రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలుండాలని, అందులో ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఒకటిఉండాలని ఏర్పాట్లు చేస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ఐక్య రాజ్యసమితిలో మన పేద ఆడ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన ఘట్టం పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతోందో ప్రపంచానికి చాటి చెప్పిందో చూశాం. పెద్ద చదువులే చదువుతున్న పిల్లలకు మొట్ట మొదటి సారిగా 100 శాతం పూర్తిగా ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. భోజన, వసతి ఖర్చులు కూడా భరిస్తున్న ప్రభుత్వం కూడా ఈ 57 నెలల కాలంలోనే. ప్రపంచ స్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్ లో 330 కాలేజీల్లో సీటు మీరు తెచ్చుకోండి రూ.1.25 కోట్ల వరకు సపోర్ట్ చేసి శ్రీకారం చుట్టింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొదటిసారి ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు, కరిక్యులమ్ లో మార్పులు తీసుకురావాలి, భావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేం మార్పులు తీసుకురావాలన్న ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే. మొట్ట మొదటి సారిగా కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఈ 57 నెలల కాలంలోనే. కరిక్యులమ్ ను జాబ్ ఓరియెంటెండ్ గా మార్చాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తెచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్ షిప్ అన్నది తీసుకొచ్చింది ఇప్పుడే. మొదటిసారి మన కరిక్యులమ్ లో సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్ ను తీసుకొచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ అడుగులు వేయించింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. మన కాలేజీల్లో డిగ్రీ చదవడం వల్ల దేశీయంగా, విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని, అక్కడ ఉన్నదేమిటి, ఇక్కడ లేనిదేమిటి అని ఆలోచన చేసి, అక్కడ సబ్జెక్టుల్లో ఉన్న వర్టికల్స్ ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్ లైన్ లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. మొట్ట మొదటిసారిగా ఈరోజు మన చదువుల్లో కరిక్యులమ్ లో భాగంగా, మన సబ్జెక్ట్ వర్టికల్స్ లో భాగంగా ఎంఐటీ నుంచి ఏఐ, పెన్సిల్వెనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్, మేరీల్యాండ్ వర్సిటీ నుంచి వర్చువల్ బిల్డింగ్ డిజైన్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్, ఈక్విటీ పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్ ఎన్ వైఐఎఫ్ నుంచి, రిస్క్ రిటర్న్ మేనేజ్ మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి, సప్లై చైన్ మేనేజ్ మెంట్ ఎంఐటీ నుంచి, ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్ ఎంఐటీ నుంచి.. ఇలా దాదాపు 2 వేల కోర్సులు. ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్న కోర్సులన్నీ ఆన్ లైన్ ద్వారా మన కరిక్యులమ్ లో భాగాలై చదువులు చెబుతూ పరీక్షలు పెట్టి పిల్లలకు సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చేట్టుగా మొట్ట మొదటి సారి అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల్లోనే. ఇది ఎప్పుడూ, ఎవరూ ఊహించని మార్పు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే మన పిల్లలందరికీ వాళ్ల చదువులు మారాలి. విద్యారంగంలో ప్రతి మార్పు వెనుక, చేస్తున్న వేల కోట్ల ఖర్చు వెనుక, మన పేద పిల్లలు ఇకనైనా పేదరికం సంకెళ్లను తెంచుకొనే స్థాయి రావాలి. ఈరోజు మనం వేసిన విత్తనం.. ఈ మార్పులన్నీ మరో 10-15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఈ విత్తనాలన్నీ అద్భుతమై ఫలితాలిచ్చే పరిస్థితి వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ ఎస్ సీ, ఎల్ బీఎస్ వంటి వర్సిటీల్లో అందుబాటులో ఉన్న కోర్సులు ఆన్ లైన్ లో సర్టిఫికెట్లను సొంతం చేసుకొని ఇంత క్వాలిఫైడ్ పర్సనల్ గా బయటకు వచ్చి మరో 10-15 సంవత్సరాల్లో ఉద్యోగాలకు అప్లికేషన్ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు అంతర్జాతీయంగా పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల్లో అందరికన్నా ముందుగా ఉంటారు. బతుకులు, తలరాతలు, భవిష్యత్తు మారుతుంది. ఈ రాష్ట్రంలోని పేద పిల్లాడికీ, ప్రతి పాపకూ తల్లిదండ్రులందరూ ఆలోచన చేయాలి చంద్రబాబు 14 సంవత్సరాలు 3 సార్లు సీఎంగా పని చేశాడు. పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి? ఆయన చేసిన మంచేమిటి? పేద పిల్లల భవిష్యత్ మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చంద్రబాబు చూపించాడా? ఆలోచన చేయాలి. గవర్నమెంట్ బడిని అదే చంద్రబాబు చేసిందేమిటి? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తుకురాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం ఆయన విద్యారంగంలో చేసిన చెడు మాత్రం చాలా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు. నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించిన వ్యక్తి చంద్రబాబు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీషు మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు. పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస పెట్టలేదు. బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబులు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడునేడుతో స్కూళ్లు బాగుపరచాలన్నది లేదు. అమ్మ ఒడి దిశగా అడుగులు వేసింది లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచన ఏరోజూ చేయలేదు. వసతి దీవెన కథ దేవుడెరుగు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నా. విదేశీ విద్యా దీవెన ఏకంగా రూ.1.25 కోట్ల దాకా చదివించే బాధ్యత నాదీ అన్న ప్రోత్సాహకర మాటలు ఏదీ లేదు. ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇదీ అన్నది ఒక్కటంటే ఒక్కటీ లేదు. గ్రామంలో, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలు, చదువుకుంటున్న పిల్లలు, జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతోంది. మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలన్న శక్తులతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్ తో కాదు. జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి. జగన్ అనే ఒక్కడు పక్కకు పోతే పిల్లల చదువులు ఉండవు, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు, 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కథ దేవుడెరుగు. విద్యారంగం గాలికిపోతుంది. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులిస్తున్నది, వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది, రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు, అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి. పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే. అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. మోసాలు నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు, మోసాలు చెబుతారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తామంటారు. మీ ఇంట్లో ఎవరు మంచి చేశారు, ఎవరి హయాంలో మంచి జరిగిందని ఆలోచన చేయాలి. మీ ఇంట్లో మీ జగన్ వల్ల మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతిఒక్కరూ అడుగులు ముందుకు వేయండి, సైనికులుగా నిలబడండి. ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి, జరగాలిని కోరుకుంటున్నా 10:49AM, Mar 1st, 2024 ► పామర్రు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ► సీఎం జగన్కు ఘనస్వాగతం పలికిన పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు, కృష్ణాజిల్లా నేతలు, జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ అద్మాన్ నయీం అస్మి ►హెలీప్యాడ్ నుంచి సభా స్థలి వరకూ రోడ్షో ►సీఎంకు గ్రాండ్ వెల్కమ్ పలికిన పామర్రు ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ►సీఎం జగన్మోహన్రెడ్డిపై పూలవర్షం కురిపించిన పామర్రు ప్రజలు 10:29AM, Mar 1st, 2024 ►పామర్రు బయల్దేరిన సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(శుక్రవారం) కృష్ణాజిల్లా పామర్రులో పర్యటించనున్నారు. ►రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేయనున్న సీఎం జగన్ ప్రభుత్వం ►సీఎం జగన్ పామర్రులో బటన్నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది. ►పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ►ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. -
జగనన్న విద్యా దీవెన సభకు భారీ ఏర్పాట్లు
-
నేడు విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
-
నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ
సాక్షి, అమరావతి/పామర్రు : రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లా పామర్రులో బటన్నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది. పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. నేడు పామర్రుకు సీఎం వైఎస్ జగన్ రాక.. జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లా పామర్రు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న సభాస్థలిని గురువారం మంత్రి జోగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్తో కలిసి పరిశీలించారు. శుక్రవారం ఉ.10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు పామర్రుకు చేరుకుంటారు. 10.50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభానంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మ.1.55కు తాడేపల్లి చేరుకుంటారు. -
విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక ముందడుగు
సాక్షి, అమరావతి: పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులను ఉచితంగా చదివేందుకు వీలు కల్పిస్తూ, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో.. రేపు(శుక్రవారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ "ఎడెక్స్"ల మధ్య ఒప్పందం జరగనుంది. టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా రూపొందించిన ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ. "ఎడెక్స్ ఒప్పందం" ముఖ్యాంశాలు హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ఎస్ఈ, కొలంబియా సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ.. తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ మరియు అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. "ఎడెక్స్ ఒప్పందం"తో ప్రయోజనాలు విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులు హార్వర్డ్, ఎంఐటీ, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులుబాటు.. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్లో భాగమవుతాయి. తద్వారా మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్ గా ఎదుగుతారు. ఉన్నత విద్యలో జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు.. పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలు కల్పిస్తూ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.. జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి సౌకర్యాలు, ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనే (జూన్ / జులై), చివరిలో ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా క్యూఎస్/టైమ్స్ ర్యాంకింగ్స్ 21 ఫ్యాకల్టీలలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 320 కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్తో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు. కరిక్యులమ్ లో భాగంగా సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్. తద్వారా విద్యార్థులు తాము చదువుతున్నకోర్సులతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఆన్లైన్లో నేర్చుకునే వెసులుబాటు. కరిక్యులమ్లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్దిదిద్దడం. ఇప్పటికే 7 లక్షల మంది విద్యార్థులు 2 నెలల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్, 5.2 లక్షల మంది 2 నెలల షార్ట్ టర్మ్ ఇంటర్న్ షిప్ మరియు 2 లక్షల మంది 6 నెలల లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయగా మరో 3 లక్షల మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయనున్నారు. థియరీతో పాటు Industry oriented Courses చేయడం వల్ల 2018-19 విద్యా సంవత్సరంలో 37,000 ఉన్నప్లేస్ మెంట్స్ ఇప్పుడు (2022-23లో) 1 లక్షకు పెరిగింది. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సెక్టార్ స్కిల్ కౌన్సిల్ లతో ఒప్పందం. 50 బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ప్రోగ్రామ్ లతోపాటు 159 సింగిల్ మేజర్ కోర్సులు. డిగ్రీ కోర్సులో 2వ సెమిస్టర్ నుంచి Al, IoT. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనాలసిస్ & ఇన్వెస్ట్ మెంట్స్, లాజిస్టిక్స్, రిస్క్ మేనేజ్ మెంట్, స్టాక్ ఎక్చేంజ్, సైబర్ ఫోరెన్సిక్స్ ఫైనాన్షియల్ మార్కెట్ అనాలసిస్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి మైనర్ కోర్సులు ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా అందుబాటులోకి. డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు.. 400కు పైగా ద్విభాషా పాడ్ క్యాస్టులు. రాష్ట్రంలోని 18 యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీకి మన జగనన్న ప్రభుత్వం సన్నాహాలు. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ ప్రారంభం. మన విద్యార్థులను గ్లోబల్ విద్యార్థులుగా తయారు చేసే క్రమంలో ప్రపంచ ప్రముఖ యూనివర్సిటీలైన స్టెయిన్ బీస్- జర్మనీ, మెల్బోర్న్ ఆస్ట్రేలియా, కెంపెన్- జర్మనీ, బ్లెకింగ్-స్వీడన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బ్యాంకాక్ లతో అవగాహన ఒప్పందాలు. ఉన్నత విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయి వినియోగానికి చర్యలు. యూనివర్సిటీల్లో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావర్స్ లెర్నింగ్ జోన్ల ఏర్పాటు. ఒక్కో జోన్ కు రూ.10 కోట్ల పెట్టుబడి.. ఇప్పటికే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభం. యువతలో సామాజిక సృహ, సమాజం పట్ల బాధ్యత పెంపొందించటానికి Board for Community Development through Education (BCDE)ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా 553 ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు.. ఇప్పటి వరకు 10వేల మందికి పైగా నమోదు. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే NAAC గుర్తింపు పొందగా, ఈరోజు రాష్ట్రంలో NAAC గుర్తింపు పొందిన విద్యా సంస్థలు 437. -
Fact check: అసత్య రాతలు.. తప్పుడు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన’ పథకాలు చింతలేని ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎందరో పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివే అవకాశం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇది ఎల్లో మీడియాకు ఏమాత్రం రుచించట్లేదు. పేదింటి బిడ్డను ప్రభుత్వం ఉన్నత చదువులకు తీసుకెళ్తుంటే ఓర్వలేక దుష్ప్రచారానికి పాల్పుడుతోంది. దీనికి తోడు అసలు ప్రభుత్వ పథకం లక్ష్యం, అది ఎలా అమలవుతోంది కనీస పరిజ్ఞానం లేని కొన్ని ప్రతిపక్షాలు ఈ తప్పుడు వార్తల ఆధారంగా అర్థరహిత విమర్శలు చేస్తున్నాయి. తిరిగి వాటినే మళ్లీ ఎల్లో మీడియా పెద్దపెద్ద హెడ్డింగ్లతో ముద్రిస్తూ పైశాచిక ఆనందం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున రూ.2,428 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044కోట్లుగా ఉంది. అప్పట్లో అప్పులు చేసి ఫీజులు కట్టే దుస్థితి గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులుచేసి మరీ తమ పిల్లలను చదివించాల్సిన దుస్థితి ఉండేది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి రూ.35 వేలలోపు ఇస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3లక్షలకు వరకు చెల్లిస్తూ పేదల విద్యను పట్టం కడుతోంది. జవాబుదారీ తనం పెంచేలా, పారదర్శకంగా తల్లి, విద్యార్థి జాయింట్ బ్యాంకు ఖాతాల్లో ప్రతి త్రైమాసికానికి విద్యాదీవెనను జమ చేస్తోంది. టీడీపీ హయాంలో సగటు చెల్లింపు స్వల్పం.. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజురీయింబర్స్మెంట్ కింద సగటున ఏడాదికి రూ.2066 కోట్లు, హాస్టల్ ఖర్చుల కింద రూ.362 కోట్లు మాత్రమే చెల్లించేది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.12,141 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వం 2017 నుంచి 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1778 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెడితే.. సీఎం జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా తీర్చింది. ఈ ప్రభుత్వంలో పెరిగిన ఖర్చు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 27లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.18,576 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి) చెల్లించింది. ఏడాదికి సగటున విద్యాదీవెన కింద రూ.2835 కోట్లు, వసతి దీవెన కింది అత్యధికంగా రూ.1068.94 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధి గతంలో వసతి దీవెనలో రూ.4వేల నుంచి రూ.10వేల మధ్య స్లాబ్ పెట్టిమరీ ఇచ్చేవారు. కానీ సీఎం జగన్ స్లాబ్ విధానాన్ని తొలగించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ వీలైనంత మందిని అర్హులుగా చేర్పించేందుకు కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2లక్షలకు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని వర్గాలు వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తోంది. -
విదేశీ విద్యా దీవెన సమాచార బుక్లెట్ ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు యునైటెడ్ నేషన్స్ లక్ష్యాలకు చేరువలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంపై షకిన్ కూమార్ రూపాందించిన సమగ్ర సమాచార బుక్లెట్ను బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సదస్సులో సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. గత సెప్టెంబర్లో పది మంది పేద విద్యార్థులను ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్లడంపై షకిన్ కుమార్ను సీఎం జగన్ అభినందించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని షకిన్ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం, అర్హతలు, దరఖాస్తు విధానం, అందించే కోర్సులు, డాక్యుమెంట్స్ చెక్లిస్ట్, అప్లికేషన్ స్టేటస్ చెకింగ్, అక్రిడేషన్, యూనివర్సిటీల జాబితా వంటి సమస్త సమాచారం ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు వివరించారు. ఈ పథకం పేద, ప్రతిభావంతమైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు రూ.కోటిన్నరకు పైగా స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. -
మామయ్యే చదివిస్తున్నాడు
-
సరికొత్త దారిలో సర్కారీ చదువులు
ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లోని 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. అయితే ఈ వర్సిటీల్లో చదివించేందుకు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే జగనన్న విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చాం. సీటు తెచ్చుకోండి.. రూ.1.25 కోట్లు మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం. జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బెస్ట్ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగితే వారి బతుకులతో పాటు రాష్ట్ర రూపురేఖలు మార్చే లీడర్ షిప్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. పెద్ద పెద్ద సంస్థలు మన పిల్లల్ని చేయిపట్టుకుని మరీ పైకి తీసుకుని పోయే అవకాశాలు ఇస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. దేశ భవిష్యత్ను, తల రాతను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. దీనిని నేను గట్టిగా నమ్మాను. విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్య దాకా 55 నెలల పరిపాలనలో విప్లవాత్మక అడుగులు వేశాం. ఏకంగా రూ.73 వేల కోట్లు విద్యా రంగానికే ఖర్చు చేశానని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యా రంగంలోనే కాకుండా వైద్య, వ్యవసాయ రంగాల్లో, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలోనూ తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ప్రతి రంగంలో మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జూలై – సెప్టెంబర్ త్రైమాసికం నిధులను కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారు. 8,09,039 మంది పిల్లలకు మంచి చేసేలా రూ.7,47,920 మంది తల్లుల ఖాతాల్లో రూ.583 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా 27.61 లక్షల మంది పిల్లల పూర్తి ఫీజులు రూ.11,900 కోట్లు చెల్లిస్తూ తల్లిదండ్రులపై భారం పడకుండా ఒక మేనమామలా ఆదుకున్నానని చెప్పారు. పిల్లలపై బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల భారం పడకూడదని వసతి దీవెన ద్వారా అండగా ఉంటూ రూ.4,275 కోట్లు ఇచ్చామన్నారు. పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలు మరింత ఉన్నత చదువులు చదవాలనే తాపత్రయంతో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మొత్తంగా రూ.16,175 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ‘ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ గొప్ప చదువులు, డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు కావాలి. అలా ఆ కుటుంబాల తలరాతలు మారాలనే తపనతో అడుగులు వేస్తున్నాం. 2017–18కి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజులు రూ.1,777 కోట్లను మనందరి ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్యలో సంస్కరణలు ♦ నాడు–నేడుతో బడుల రూపురేఖలను మార్చుతూ ఉన్నత విద్యపై ధ్యాస పెట్టి సంస్కరణలు తీసుకువచ్చి కరిక్యులంలో మార్పులు చేశాం. పిల్లలు ఏం చదువుతున్నారు.. అని ఒక ముఖ్యమంత్రి ధ్యాస పెట్టిన పరిస్థితి మీ జగన్ మామ పాలనలోనే జరిగింది. తొలిసారి డిగ్రీలో కూడా ఆన్లైన్ వర్టికల్స్ను తీసుకొచ్చాం. ఏకంగా 10 నెలల ఇంటర్న్షిప్తో జాబ్ ఓరియంటెడ్ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేశాం. ♦ మన పిల్లలు ప్రపంచంలోని మేటి యూనివర్సిటీలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో చదువులుండాలనే తపనతో అంతర్జాతీయంగా ఆన్లైన్ ప్లాట్ఫాంలు, ఎంఐటీ, హార్వర్డ్, ఎల్బీఎస్, ఎల్ఎస్సీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు వచ్చేందుకు హైడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యాం. తద్వారా ఆన్లైన్లో ఆ కోర్సులు తీసుకొస్తూ ఏఐని అనుసంధానం చేస్తూ డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ పేద విద్యార్థులు మన పిల్లలు.. ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితేనే వేగంగా ఎదగగలుగుతారు. ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలో భాగమైనప్పుడు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ముందు వరుసలో ఉంటాం. పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఒక పేజీ ఇంగ్లిష్, ఒక పేజీ తెలుగుతో బై లింగ్వల్ టెక్ట్స్ బుక్స్ ద్వారా మెరుగైన చదువు చెప్పిస్తున్నాం. శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉండే.. రూ.15 వేలు ఆన్లైన్లో చెల్లిస్తే తప్ప రాని బైజూస్ కంటెంట్ను మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. 6వ తరగతి.. ఆపై తరగతి గదుల్లో ప్రతి క్లాస్ రూంలో ఇంటరాక్టివ్ ప్లాట్ఫాంలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూంలుగా మార్చి డిజిటల్ బోధనను తీసుకువచ్చాం. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబ్లు ఇస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు సీబీఎస్ఈతో మొదలై ఐబీ వరకు వెళుతున్న ఈ ప్రయాణం పిల్లలందరినీ గొప్ప వారిగా తీర్చిదిద్దే వరకు సాగుతుంది. 3వ తరగతి నుంచి టోఫెల్ సబ్జెక్ట్ను తీసుకువచ్చి క్లాస్ టీచర్ లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేయడం వరకు.. పిల్లల బంగారు భవిష్యత్ కోసం వాళ్ల జగన్ మామ ఎంతో తాపత్రయపడుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా.. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టయ్యా నేను పేద కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను. నేను ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో చిన్నప్పటి నుంచి కలగనేదాన్ని. జగనన్న విద్యా దీవెన ద్వారా ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టకుండా చదువుకుంటున్నాను. మొత్తం ఫీజు మీరే (సీఎం) కట్టారు. వసతి దీవెన ఎంతో ఉపయోగపడింది. మీ వల్ల అందరం బాగా చదువుకోగలుగుతున్నాం. మీ వల్ల నేను మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఆ క్రెడిట్ అంతా మీదే సార్. – ప్రిన్స్ ఏంజిల్, బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని, నరసాపురం మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారన్నా నేను జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బీటెక్ చదువుతున్నా. నెల్సన్ మండేలా చెప్పినట్టు విద్య అనే ఒక ఆయుధం మాత్రమే మన భవిష్యత్ను మారుస్తుంది అన్న మాటను మీరు నిజం చేశారు. మీరు విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వరల్డ్ క్లాస్ వర్సిటీల్లో మాదిరి సిలబస్ తీసుకొచ్చారు. మహిళా సాధికారత, విద్య.. ఈ రెండు జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయి. మీరు ఈ రెండింటినీ సాధించారు. మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్యూ సార్. – నవ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, భీమవరం మార్పును గమనించండి ♦ దేశ భవిష్యత్ను మార్చగలిగేది చదువు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేని పరిస్థితి. ఈ రోజు మనందరి ప్రభుత్వం రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి. తేడాను మీరే గమనించాలి. చదువు అనేది తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను మార్చాలన్నా, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలన్నా, వెనుకబడిన కులాల తలరాతను మార్చాలన్నా, దేశ భవిష్యత్ను మార్చాలన్నా.. ఆ శక్తి కేవలం చదువుకే ఉంది. అందుకే 55 నెలల ప్రయాణంలో విద్యా రంగంలో విప్లవాత్మక అడుగులు వేశాం. ♦ నాడు–నేడుతో బడులు బాగుపడిన తీరుతెన్నులు గమనించాలి. ప్రభుత్వ స్కూళ్లల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరుముద్ద మీద ఫోకస్ పెట్టాం. పిల్లలు బాగా చదవాలని, వారిని బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ప్రభుత్వ బడులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు తీసుకువచ్చి రూపురేఖలు మార్చుతున్నాం. ♦ ఒక్క విద్యా రంగంలోనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. కేవలం 55 నెలల కాలంలోనే ఇన్ని మార్పులు జగన్ చేయగలిగినపుడు గత పాలకులు 14 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయారో మీరే ఆలోచన చేయాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు పరిపాలన గుర్తు తెచ్చుకోండి. -
జగనన్న విద్యా దీవెన : ఉన్నత చదువులకు చేయూత.. (ఫొటోలు)
-
ఏపీలో పేద పిల్లలకూ నాణ్యమైన విద్య: సీఎం జగన్
Updates: పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువు: సీఎం జగన్ ►మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం భీమవరం నుంచి చేస్తున్నాం ►ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును మనందరి ప్రభుత్వం పిల్లల తల్లుల ఖాతాల్లోకి, పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయబోతున్నాం. ►ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మూడు నెలలకోసారి పూర్తి ఫీజురీయింబర్స్మెంట్కు సంబంధించిన డబ్బును తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం ►8 లక్షల 9 వేల 39 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి 7,47,920 మంది తల్లుల ఖాతాల్లోకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన 583 కోట్లను నేరుగా జమ చేయనున్నాం ►ఫైనలియర్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగడకూడదనే ఉద్దేశంతో 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్ స్టాల్ మెంట్గా చెల్లించాల్సిన ఫీజు కూడా వారి తల్లుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. ►ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రయాణం గమనించినట్టయితే ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారా 27,61,000 మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు ఒక మంచి మేనమామగా ఇచ్చింది రూ.11,900 కోట్లు ►ఇదొక్కటే కాదు జగనన్న వసతి దీవెన.. నాలుగున్నర సంవత్సరాల్లో పిల్లలు చదువులే కాదు, వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ విషయంలో కూడా పిల్లలకు అండగా, తోడుగా ఉంటూ దీని కోసం ఇచ్చింది మరో రూ.4,275 కోట్లు ►పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివేందుకు అప్పులపాలు కాకూడదనే తపన తాపత్రయంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలతో ఖర్చు చేసింది రూ.16,176 కోట్లు ►ఈరోజు వీళ్ల బతుకులు మారాలి. కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరూ గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీరింగ్, కలెక్టర్లు, డాక్టర్లు కావాలని, ఆ కుటుంబాల తలరాతలు మారాలని తపనతో అడుగులు పడ్డాయి ►2017-18కి సంబంధించిన ఫీజుల సైతం పెండింగ్లో ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు. రూ.1,777 కోట్లు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతో మనమే చెల్లించాం ►గత ప్రభుత్వ హయాంలో 12 వేల కోట్లు కూడా సరిగా ఖర్చు చేయని పరిస్థితులు.. ఈరోజు రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితులు. తేడా గమనించాలని కోరుతున్నా ►చదువు అన్నది ఒక తలరాతలు మార్చే ఒక ఆస్తి ►మనిషి తలరాతనుగానీ, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని అనుకున్నా, వెనకబడిన కులాల తలరాతలుగానీ, ఒక దేశం భవిష్యత్ గానీ ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది ►దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టే ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాం. వేయగలిగాం ►గతానికి, ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నా ►నాడు-నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించాలి ►తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంకు, సీబీఎస్ ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతున్న ప్రయాణం ►పిల్లలందరినీ గొప్పగా చదివించాలనే తపన, తాపత్రయంతో 3వ తరగతి నుంచే టోఫెల్ ను సబ్జెక్ట్ గా తీసుకొచ్చిన పరిస్థితులు, సబ్జెక్ట్ టీచర్ ను తీసుకొచ్చిన పరిస్థితి. ►పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ల జగన్ మామ అడుగులు వేశాడన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది ►బడులను ఒకవైపు రూపురేఖలు మారుస్తూ, మరోవైపున ఉన్నత విద్యపై ధ్యాస పెట్టాం ►ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరిక్యులమ్లో మార్పులు చేశాం ►పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉందని ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతోంది ►ఆన్ లైన్ వర్టికల్స్ ను కూడా డిగ్రీలో తీసుకురావడం జరిగింది ►10 నెలలపాటు ఇంటర్న్ షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి ►జాబ్ ఓరియెంటెడ్గా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి ►మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సీటీలతో పోటీ పడి చదవాలనే తపనతో, అంతర్జాతీయంగా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలో ఎంఐటీ, హార్వర్డ్, ఎల్ బీఎస్, లాంటి సర్టిఫికెట్లు ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి వచ్చేట్టుగా హెడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యి, ఆన్ లైన్ లో కోర్సులు తీసుకొస్తూ, ఏఐని అనుసంధానం చేస్తూ, డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ►మన పేద విద్యార్థి, మన పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితే వేగంగా ఎదగగలుగుతారు. ►ప్రపంచంలో ఎక్కడైనా పిలిచి ఆ పర్టిక్యులర్ సబ్జెక్టులో ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలకు సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలతో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటాం. ►ఇదొక్కటే కాదు, ప్రపంచంలో ఎక్కడైనామన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్ యూనివర్సిటీ నుంచి రాగలిగతితే, మన రాష్ట్ర తలరాతలు కూడా మార్చగలుగుతారు. ►జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చాం. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీల్లో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి కోటి దాకా ఉన్నాయి. ►అయినా ఏ ఒక్కరూ అప్పులపాలు కావాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు ►ఈ పథకం ద్వారా సీటు తెచ్చుకోండి, కోటీ 25 లక్షల దాకా మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం ►జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో చదువుతున్నారు ►వాళ్ల బతుకులతో పాటు రాష్ట్రం రూపురేఖలు మార్చే లీడర్షిప్ స్థాయికి రాబోయే రోజుల్లో వస్తారు ►ఒక్క విద్యా రంగంలోనే ఉన్నత విద్యగానీ, స్కూళ్లు గానీ సంస్కరణ మీదే 55 నెలల కాలంలో అక్షరాలా ఖర్చు చేసింది 73 వేల కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా ►ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగం, వ్యవసాయ రంగం, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ, ప్రతి అడుగు వేస్తూ, మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతోందని చెప్పడానికి గర్వపడుతున్నా జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల ►జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ►ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. ►పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ►గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ►కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ►అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
విద్యార్థులకు ఆర్థిక సాయం
-
నేడు జగనన్న విద్యా దీవెన
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ముందెన్నడూ లేనివిధంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
రేపు భీమవరంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భీమవరంలో పర్యటిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
దీవెనపై కుళ్లు రాతలు
-
మేము వేసే ప్రతి అడుగులో జగనన్న అండగా ఉన్నారు
-
మా అమ్మగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. జగనన్న విద్యాదీవెన,వసతి దీవెన పథకాలతో చదువుకోగలుగుతున్నాను.
-
ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివేందుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వరం..!
-
దమ్ము లేకనే.. దత్తపుత్రుడు
సాక్షి, తిరుపతి: సొంత బలంపై, సొంత కుమారుడిపై నమ్మకం లేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్యాకేజీ చెల్లించి దత్త పుత్రుడిని అద్దెకు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలేనని ధ్వజమెత్తారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యాదీవెన నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ‘ఏ ఇంటికీ, ఏ సామాజిక వర్గానికీ, ఏ ప్రాంతానికీ ఎలాంటి మంచి చేయని గత పాలకులు ఎన్ని దుర్మార్గాలకు దిగుతున్నారో నాలుగు మాటలు మీ ముందుంచుతా. దుర్మార్గమైన ఆలోచనలు చేసే ఆ పెద్ద మనిషి మూడుసార్లు సీఎంగా ఉన్నాడు. 28 ఏళ్ల క్రితమే ఆయన సీఎం అయ్యాడు. మూడుసార్లు సీఎం అయిన ఆ వ్యక్తి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమైనా మీ మెదడులో తడుతుందా? గత పాలనకు, ఈ నాలుగేళ్ల పాలనకు తేడా ఉందా? లేదా? అనేది ఆలోచన చేయండి’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సభలో సీఎం ఏమన్నారంటే.. దత్తపుత్రుడిని అద్దెకు తెచ్చుకున్నాడు ఆ మనిషి ఎలాంటివాడో అందరికంటే మీకే బాగా తెలుసు. ఆ మనిషి ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకున్నాడా? అనేది ఆలోచన చేయండి. అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనుకాడడు. చివరికి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడానికి కూడా ఏ మాత్రం వెనుకాడని మనిషి.. ఆ పెద్ద మనిషి!! ఆ పెద్ద మనిషికి సొంత బలం మీద గానీ, సొంత కుమారుడి మీద గానీ నమ్మకం లేదు. కాబట్టే దత్త పుత్రుడిని ప్యాకేజీ ఇచ్చి అద్దెకు తెచ్చుకున్నాడు. ప్రతి అడుగులో కుళ్లు, కుతంత్రాలే! ఈమధ్య కాలంలో ఆయన గానీ, ఆయన కుమారుడు గానీ, దత్తపుత్రుడు గానీ మీటింగుల్లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు, వారి భాషను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి మాటలోనూ రెచ్చగొట్టాలి, కుతంత్రాలు చేయాలి, గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేయాలనే కుతంత్రాలు ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి. వీళ్లతో ఎల్లో మీడియా ప్రయాణం.. టీవీలో ఏదైనా వార్త వస్తే నిజమేనేమో అనుకునే పరిస్థితులు ఇవాళ లేవు. ఆ పాత రోజులు పోయాయి. ఈరోజు ఎల్లో మీడియా చంద్రబాబునాయుడును ఏ రకంగా మోస్తోందో మీ అందరికీ తెలుసు. ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పుకునేందుకు గత చరిత్ర ఏదీ లేదు కాబట్టే వీళ్లంతా అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్ల మీద ఆధారపడి వాటినే జీవితంగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారు. దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అనేదే వారి లక్ష్యం. కుర్చీ లాక్కుని ఫోటోలకు దండేస్తారు ఇదే వ్యక్తి.. ఎన్టీఆర్ నుంచి సీఎం కుర్చీని లాగేసుకున్నారు. ఆయనకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ పార్టీని కూడా లాగేసుకున్నారు. ఎన్టీఆర్ చావుకు కూడా చివరకు వీళ్లే కారణం అయ్యారు. ఇదే దుర్మార్గులు మళ్లీ ఎన్టీఆర్ చనిపోగానే ఆయన శవాన్ని లాక్కుకుంటారు. ఫొటోలకు దండలేస్తారు. ఫొటో ముందు ప్రతి రోజూ దండం పెడుతూ తిరుగుతారు. ఆయన పేరుతో ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు. ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే... ఒకసారి ఆ మనిషి మనస్తత్వం ఏమిటో తెలుసుకోవాలని అడుగుతున్నా. రైతులు, అక్కచెల్లెమ్మలకు దగా ఆ పెద్దమనిషి (చంద్రబాబు) రైతులను మాయ మాటలతో మోసం చేశాడు. ఎన్నికల వేళ రూ.87,612 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తానన్నాడు. రుణాలు కట్టకండి.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబుకు ఓటే యాలని చెప్పి రైతులను నిట్ట నిలువునా మోసం చేశాడు. డ్వాక్రా మహిళలు రుణాలు కట్టొద్దు.. బాబు సీఎం అవుతాడు.. వెంటనే తీరుస్తాడని చెప్పి ఆ అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు. వాళ్లను వంచించడమే కాకుండా వారి తరపున కడుతున్న సున్నా వడ్డీని సైతం ఎగ్గొట్టాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వాగ్దానాలు చేసి నిలువుగా దగా చేశాడు. ఆ పెద్ద మనిషి చివరకు పిల్లలను కూడా వదల్లేదు, నిరుద్యోగులనూ వదల్లేదు. 2014 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ రూ.రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడని అడుగుతున్నా. ఆ పెద్ద మనిషి మనస్తత్వం చూస్తే... ఎన్నికలకు ముందు అందంగా ఉండే మేనిఫెస్టో తెస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేస్తాడు. వెబ్ సైట్లలో కూడా మేనిఫెస్టో కనపడకుండా మాయం చేస్తాడు. ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు. ఎన్నికలు అయిపోయాక ప్రజలకు నరకాన్ని చూపిస్తాడు. ఇలాంటి వ్యక్తికి.. చెప్పిన ప్రతి మాటనూ అమలు చేస్తున్న మనందరి ప్రభుత్వం మధ్య తేడా ఎంత ఉందో? ఆలోచన చేయాలని అడుగుతున్నా. బాబు చేసిన అప్పులున్నా .. మన పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలున్నాయి. చంద్రబాబు చేసిన అప్పులు విపరీతంగా ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్ సమస్యలు వచ్చాయి. ఖర్చులు పెరిగాయి, రాబడులు తగ్గాయి. అయినా మీ బిడ్డ కారణాలు, సాకులు చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో దాన్ని ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించాం. వెనకడుగు వేయలేదు. సాకులు వెతకలేదు. కారణాలు చెప్పి తప్పించుకోవాలని ఆలోచన చేయలేదు. నా అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలు బాగుండాలనే తపన, తాపత్రయంతో మీ బిడ్డ బటన్¯ నొక్కుతున్నాడు. నాలుగేళ్లలో రూ.2.33 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లాయి. ఇవాళ ఎక్కడా లంచాలు, వివక్ష చూపించే వ్యవస్థ లేదు. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుడు చేసిన అప్పుల గ్రోత్ రేటు కన్నా ఇప్పటి అప్పుల గ్రోత్ రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటంటే.. అప్పట్లో దోచుకో, పంచుకో, తినుకో అనే పాలన సాగింది. ఈనాడుకి ఇంత, ఆంధ్రజ్యోతికి ఇంత, దత్తపుత్రుడికి కాస్తంత, మిగిలింది చంద్రబాబునాయుడికి అని డీపీటీ సాగింది. జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి అడుగులోనూ దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే! మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే వ్యవస్థలు వాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి అండ లేదు. వీళ్లను మీ బిడ్డ నమ్ముకోలేదు. మీ బిడ్డలో కల్మషం లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది చేసిన మంచినే. మీకు ఒక్కటే చెబుతున్నా. వీళ్లు చెబుతున్న అబద్ధాలు, మోసాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకుమంచి జరిగిందా? లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి. బాబువి శవ రాజకీయాలు.. పుంగనూరు, అంగళ్లులో జరిగిన ఘటన మీ అందరికీ తెలిసిందే. అప్పడు పోలీసులు చేసిన తప్పల్లా.. ‘‘బాబు గారూ మీకు పర్మిషన్ ఉన్న రూ ట్లోనే ప్రయాణం చేయండి. మీకు అనుమతున్న రూట్లో కాకుండా వేరే రూట్లో ఎందుకు ప్రయా ణం చేస్తారు? వేరే పార్టీ వాళ్లు అక్కడ ధర్నా చే స్తుంటే అక్కడికి వెళ్తామని ఎందుకు అంటున్నా రు? మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు వస్తాయి. ఆ రూట్ వద్దు’’ అని చెప్పటమే!! అలా చెప్పినందుకు పోలీసులపై కర్రలు, బాటిళ్లతో దాడి చేశారు. చివరకి ఓ పోలీసు సోద రుడి కన్ను కూడా పోగొట్టారు. 47 మంది పోలీసులపై దాడి చేశారు. దాడి చేసి రెచ్చగొట్టి పోలీసులు కాల్పులు జరిపితే శవ రాజకీయాలు చే యాలనే దిక్కుమాలిన ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే. ఈ పెద్ద మనిషి ఢిల్లీ వెళ్లా డు. ఎన్నికల కమిషన్ను కలిసి రాష్ట్రంలో పోలీ సులు తనమీద హత్యాయత్నం చేశారని ఫిర్యా దు చేయడానికి వెళ్లాడు. దొంగ ఓట్లను వారే చేర్చి మనపై ఫిర్యాదు చేయటానికి బయల్దేరాడు. ఇలా అబద్ధాలు ఆడి, మోసం చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఆలోచన చేయండి. ఇది అభివృద్ధి కాదా..? అభివృద్ధి జరగడం లేదని విమర్శిస్తున్న వారందరికీ గట్టిగా సమాధానం చెప్పండి. మన పాలనలో ఎప్పుడూ చూడని అభివృద్ధి ఇవాళ జరుగుతుంది. స్కూళ్ల పరిస్థితిని చూపించండి. నా డు–నేడుతో రూపురేఖలు మారిపోయి ఇంగ్లీష్ మీడియం, ఐఎఫ్పీ ప్యానెళ్లు వచ్చాయి. పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. కరిక్యులమ్లో మార్పులతోపాటు విద్యా దీవెన, వసతి దీవెన వస్తోంది. మన పిల్లలు చదువుల్లో వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇది కాదా అభివృద్ధి? అని ప్రశ్నించండి. నాడు – నేడుతో ఆసుపత్రుల రూపు రేఖలు మారుతున్నాయి. విలేజ్ క్లినిక్స్, ఫ్యామి లీ డాక్టర్ విధానం మన కళ్లెదుటే కనిపిస్తోంది. 53 వేల మంది వైద్య సిబ్బందిని నియమించాం. కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకా రం చుట్టాం. ఎవరైనా అభివృద్ధి గురించి మా ట్లాడితే ఇది అభివృద్ధి కాదా? అని అడగండి. రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 6 పోర్టులు మాత్రమే ఉంటే ఈ నాలుగేళ్లలో మరో 4 సీ పోర్టులను కడుతున్నాం. మన రాష్ట్రం వరుసగా మూడేళ్ల పాటు ఈవోడీబీలో దేశంలోనే నంబర్ వన్గా కొనసాగుతోందని చెప్పండి. -
విద్యాదీవెన పిల్లల భవిష్యత్తు మారుస్తుంది: సీఎం జగన్
సాక్షి, నగరి, చిత్తూరు: విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలవకూడదని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ, 15,600 కోట్లు అందించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాదీవెన కింద 26,98,728 మంది పిల్లలకు మంచి చేస్తూ రూ. 11, 317 కోట్లు అందించామని పేర్కొన్నారు. నేడు 8, 44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామని సీఎం పేర్కొన్నారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ, 15 వేల అందించామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని. బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు బోధన అందిస్తున్నామన్నారు. పేదరికం విద్యార్థుల చదవులకు అడ్డు రాకూడదన్నారు. విద్యాసంస్థల్లో అక్రమాలుంటే 1902కు కాల్ చేయాలని తెలిపారు. సీఎం జగన్ ప్రసంగం.. ఆయన మాటల్లోనే! ►ప్రతి పేద కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్లో ఇంకా బాగుండాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ►ప్రతి అడుగూ కూడా ప్రతి పిల్లాడినీ చేయి పట్టుకొని పెద్ద చదువులు చదివించి తద్వారా పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలని అడుగులు వేస్తున్నాం. ► 17-20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో బతకాలంటే వాళ్ల ప్రయాణాన్ని జీవిత ప్రమాణాన్ని ఈ రెంటింటినీ మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని నమ్మాం. ►పిల్లల చదువుల కోసం వేగంగా అడుగులు వేస్తున్నాం. ►ప్రతి పేద కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఫీజులు పూర్తిగా తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం జగనన్న విద్యా దీవెన. ► భోజనం, వసతి ఖర్చులకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం. 3 నెలలకొసారి తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాలి. ►ఐటీఐ విద్యార్థులకు 10 వేలు, పాలిటెక్నిక్ పిల్లాడికి 15 వేలు, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ పిల్లలకు సంవత్సరానికి 20 వేల చొప్పున పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ►జగనన్న వసతి దీవెన అనే ఒక్క పథకం ద్వారా మాత్రమే రూ.4,275 కోట్లు పెద్ద చదువుల కోసం తల్లుల ఖాతాల్లోకి జమ చేశాం. ►కేవలం ఈ రెండు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 4 సంవత్సరాల కాలంలోనే రూ.15,600 కోట్లు ఇచ్చాం. ►ఫీజులు మొత్తం నేరుగా కాలేజీలకే ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది. ►ప్రతి 3 నెలలకు ఒకసారి తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాలి. పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలి. ► ఆ కాలేజీలో విద్యా బోధన బాగాలేకున్నా, వసతులు సరిగ్గా లేకున్నా వాటిపై ఆ కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇస్తున్నాం. ఫిర్యాదుల కోసం 1902కు కాల్ చేయండి ►ఏవైనా వసతులు బాగోలేకున్నా, బోధన బాగోలేకున్నా, పిల్లలకు ఇవాళ ఇస్తున్న డబ్బు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కాక కాలేజీ యాజమాన్యాలు వేరే రకంగా ఇంకో ఫీజు ఇంకొకటని ఫీజులు అడిగితే మాత్రం 1902కు ఫోన్ చేయండి. ► జగనన్నకు చెబుదాంకు ఫోన్ చేయండి. ► ముఖ్యమంత్రి కార్యాలయం, కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతుంది. ► ఇటువంటి తప్పిదాలు జరగకుండా కట్టడి చేస్తుంది. యాక్షన్ తీసుకుంటుంది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ►4 సంవత్సరాల కాలంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం. ►తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా పిల్లలను చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15 వేల చొప్పున అమ్మ ఒడి ఇస్తున్నాం. ►ప్రతి సంవత్సరం పిల్లలకు బ్యాగు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ అన్నీ కలిపి విద్యా కానుకగా స్కూల్ తెరిచే రోజు ఇస్తున్నాం. ► స్కూళ్లను సమూలంగా రూపు రేఖలు మారుస్తూ, శిథిలావస్థలో ఉన్న స్కూళ్లకు గొప్ప వైభవం తీసుకొచ్చేందుకు నాడు-నేడు తీసుకొచ్చాం. ► గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, బైలింగువల్ టెక్ట్స్ బుక్ లు తీసుకొచ్చాం. ►బైజూస్ కంటెంట్తో కూడా పిల్లల కరికులమ్ను అనుసంధానం చేశాం. ► 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ►మూడో తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్ బోధన వచ్చే ఏడాది నుంచి ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాం. ► సీబీఎస్ఈ సిలబస్తో ప్రారంభించి ఐబీ, ఐజీసీఎస్ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ దిశగా మన గవర్నమెంట్ బడులు వేగంగా అడుగులు వేస్తున్నాం. ► ఇంతకు ముందు రాష్ట్రంలో చూడని విధంగా, నాడు-నేడు కింద పూర్తి అయిన బడుల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములు డిజిటలైజ్ చేస్తున్నాం. ►ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తున్నాం. ►63 వేల క్లాస్ రూములకు సంబంధించి 31 వేల క్లాస్ రూముల్లో ఏర్పాటయ్యాయి. ►డిసెంబర్ నాటికల్లా మిగిలిన క్లాస్ రూముల్లో ఏర్పాటవుతాయి. ► 8వ తరగతి పిల్లలకు చదువులను ప్రోత్సహిస్తూ, వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా అనే తాపత్రయపడుతూ ట్యాబ్స్ ఇచ్చేందుకు మొదలుపెట్టాం. స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద ►గవర్నమెంట్ స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద కింద విపరీతమైన మార్పులు తెచ్చాం. ►పిల్లలు తింటున్న తిండి గురించి ఆలోచించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందంటే అది మీ అన్న పరిపాలనలోనే. ► సంపూర్ణ పోషణ, స్కూళ్లలో ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ తీసుకొచ్చాం. ► చదువులను ప్రోత్సహిస్తూ వివాహానికి ముందే 10 పాసై ఉండాలనే నిబంధన తీసుకొస్తూ వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా అమలు చేస్తున్నాం. ►ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదవాలని పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో విద్యా దీవెన తీసుకొచ్చాం. ► వసతి దీవెన తీసుకొచ్చాం. ► ప్రపంచంతో పోటీ పడుతూ విదేశాల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే చాలు ఉన్నత విద్యకయ్యే ఖర్చు మొత్తం కోటీ 25 లక్షల దాకా ఫీజులను చెల్లిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదీ లేదు. మన రాష్ట్రంలో తప్ప. ►కరిక్యులమ్లో ఆన్ లైన్ వర్టికల్స్ తెచ్చాం. తప్పనిసరి ఇంటర్నషిప్ తెచ్చాం. ►కేవలం ఈ పథకాల మీద మీ అన్న ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.69,296 కోట్లు. మీ అన్న చదవిస్తాడని చెబుతున్నా ► ప్రతి కుటుంబం నుంచి ఇంజనీర్, డాక్టర్ రావాలి. ► మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నా ఇబ్బంది పడకుండా పిల్లలను బడులకు, కాలేజీలకు పంపండి. ►విద్యా దీవెన, వసతి దీవెనలో ఎటువంటి కత్తిరింపులు లేవు. ►ప్రతి పిల్లాడికీ మీ అన్న, మీ తమ్ముడు చదివిస్తాడని చెబుతున్నా. ► పిల్లలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులకు ప్రతి సామాజిక వర్గానికి మంచి చేయాలని అడుగులు వేస్తున్నాం’ అని సీఎం జగన్ ప్రసంగించారు చదవండి: విద్యాదీవెనతో బాబు, పవన్కు మంచి చదువు చెప్పించాలి: రోజా సెటైర్లు -
విద్యాదీవెనతో బాబు, పవన్కు మంచి చదువు చెప్పించాలి: రోజా సెటైర్లు
సాక్షి, నగరి: ఇంటర్లో తాను ఏ గ్రూప్ చదివాడో కూడా పవన్ కల్యాణ్కు తెలియదని మంత్రి రోజా విమర్శించారు. బైపీసీ చదివితే ఇంజనీర్ అవ్వొచ్చని చంద్రబాబు అంటారని.. పవన్, చంద్రబాబులకు కూడా విద్యాకానుక ఇవ్వాలని చురకలంటించారు.. విద్యాదీవెనతో బాబు, పవన్కు మంచి చదువు చెప్పించాలని సెటైర్లు వేశారు.. టీడీపీని నమ్ముకుంటే యువత జైలుకు వెళ్తారు. పవన్ను నమ్ముకుంటే యువత రిలీజ్ సినిమాలకు వెళ్తారన్న ఆమె... అదే సీఎం జగన్ను నమ్ముకుంటే మంచి కాలేజీలు, వర్సిటీలకు వెళ్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. ఈ సందర్బంగా వేదికపై మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిలో తొలిసారి నగరికి వచ్చేసిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సీఎం జగన్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాణ్యమైన విద్యను పేదవాడి ఆస్తిగా మార్చిన ఘనత సీఎం జగన్దేనని కొనియాడారు. చదువుకు కుల, మత, ప్రాంత బేధాలు చూడకుండా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు. సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారు విద్యారంగంలో దేశానికే ఏపీ అదర్శంగా నిలుస్తోందని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్ వల్లే అన్ని వర్గాలకు విద్య చేరువైందని.. కొర్పోరేట్ స్కూళ్లకు ప్రభుత్వ స్కూళ్లు పోటీనిస్తున్నాయని తెలిపారు. విద్యా దీవెన, వసతి పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకు రాలేదని తెలిపారు. ఇంత గొప్ప ఆలోచన ఎవరికీ కూడా రాలేదన్నారు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్దేనని.. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారని ప్రస్తావించారు. చదవండి: నగరి: జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ 2024 వైఎస్ జగన్ వన్స్మోర్ వైఎస్ జగన్ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని రోజా అన్నారు. జగన్ను ఓడించాలంటే.. అవతలివైపు జగనే ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు వైఎస్ జగన్ను ఎలా ఓడిస్తాడని ప్రశ్నించారు. ప్రజలంతా 2024 జగనన్న వన్స్మోర్ అంటున్నారని, రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చిన ఘనత జగన్ది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని పేర్కొన్నారు. చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ కుప్పంలో సంక్షేమ పథకాలు ఎవరి హయాంలో అందాయని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కుప్పం నియోజగకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. కుప్పంలోప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్దేనని పేర్కొన్నారు. కుప్పంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ చతికిలబడిందన్న రోజా... వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదని తెలిపారు.. వారంటీ లేని చంద్రబాబు షూరిటీ ఇస్తే గ్యారెంటీ ఉంటుందా? అని మండిపడ్డారు.. మనకు రియల్ హీరో కావాలా? రీల్ హీరో కావాలా అని ప్రశ్నించారు ప్రతిపక్షాలకు మళ్లీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.. ‘ఆటో డ్రైవర్ కూతురు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేస్తోంది. రైతు బిడ్డ వ్యవసాయ శాస్త్రవేత్త చదువుతున్నాడు.ఒక మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. కంపౌండర్ కూతురు డాక్టర్ చదువుతున్నాడంటే అది ముమ్మాటికీ సీఎం జగన్ వల్లే. అన్న పార్టీలో ఒక సైనికురాలిగా ఉన్న గర్వపడుతున్నాం. అన్నదానం ఆకలి తీర్చితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుందంటారు. ఆకలి తీర్చాలన్నా, అజ్ఞానాన్ని తొలగించాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్న అది విద్యతోనే సాధ్యమని మనస్పూర్తిగా నమ్మారు కాబట్టే ప్రతి పేద వాడి బిడ్డను గొప్ప చదువులు చదివేందుకు సీఎం జగన్ అండగా నిలిచారు’ అని రోజా పేర్కొన్నారు. -
నగరి: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
విద్యాదీవెన.. సీఎం జగన్ నగరి పర్యటన అప్డేట్స్ ► నగరి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగనన్న విద్యాదీవెన నిధుల్ని బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. నగరిలో సీఎం జగన్ కామెంట్లు అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారు. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా?. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలు. కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి గొడవలు పెట్టి.. శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశం. కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించారు. పోలీసులపై కర్ర, బీరు సీసాలతో దాడి చేయించాడు. ఓ పోలీస్కన్ను కూడా పోగొట్టారు. చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తాడట. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి.. మన మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాడు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకడాడని వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి.. ఆయన ఫొటోనే దండం పెడతాడు. ఎన్టీఆర్ నాణేం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లాడు. సీఎం జగన్ ప్రసంగం ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన తీసుకొచ్చాం. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశాం. 8 లక్షల 44 వేల 336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన కూడా పేద విద్యార్థలు కోసం అమలు చేస్తున్నాం. మంత్రిరోజా కామెంట్లు ► పేద విద్యార్థులకు సీఎం జగన్ ఉన్నత విద్య అందిస్తున్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు దేశంలో ఎక్కడా లేవు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్ది. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తూ ప్రధానే ప్రశంసించారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్. కాంపౌండర్ కూతురు వైద్య విద్య అభ్యసిస్తుందంటే.. ఆ ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. గతంలో చంద్రబాబు పేదింటి పిల్లలను విద్యకు దూరం చేశారు. ► చిత్తూరు కలెక్టర్ సగిలి షన్మోహన్ ప్రారంభోపన్యాసంతో విద్యాదీవెన నిధుల జమ కార్యక్రమం ప్రారంభం ► ప్రారంభమైన విద్యాదీవెన కార్యక్రమం ► నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడి నేతలతో, లబ్ధిదారులతో ముచ్చటించారు. అక్కచెల్లెళ్లమ్మలతో ఫొటో దిగారు. ఆపై వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్కు పుష్ఫనివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ► నగరి లో కీలపట్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కు చేరుకున్న సీఎం జగన్. స్వాగతం పలికిన మంత్రులు ఆర్.కే రోజా, ఉషశ్రీ చరణ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు ఆదిములం, ఏమ్.ఏస్.బాబు, వెంకట్ గౌడ, ఎమ్మెల్సీ భరత్ తదితరులు. ► తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో నగరి బయలుదేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ► కాసేపట్లో సీఎం జగన్ నగరి చేరుకోనున్నారు. ► రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం జగన్. మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి ఎమ్మేల్యే బియ్యపు మధు సూధన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ► విద్యాదీవెన కార్యక్రమం కోసం చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయల్దేరారు. 📖 ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది(ఇవాళ్టి రూ.680 కోట్లతో కలిపి). మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చుపెట్టింది. 📖 జగనన్న విద్యాదీవెన కింద.. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. 📖 జగనన్న విద్యాదీవెన పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని జగన్ సర్కారే భరిస్తోంది. 📖 ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను సోమవారం సీఎం జగన్ నగరి వేదికగా విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ చిత్తూరు నగరి వెళ్లనున్నారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. ఆయన నిధుల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పర్యటనలోనే నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. -
నేడు ఆంధ్రప్రదేశ్లోని నగరిలో జగనన్న విద్యా దీవెన సాయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
28న చిత్తూరు జిల్లా నగరిలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 28న సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఆయన నగరి చేరుకుంటారు. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి నిధులను జమ చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. -
చరిత్ర తిరగరాసిన సీఎం జగన్.. విద్యలో ఏపీ టాప్
సాక్షి, హైదరాబాద్: విద్యాబోధన, సంస్కరణల్లో ఏపీ విధానాలు అత్యుత్తమంగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర విద్యాశాఖ పర్మామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) విడుదల చేసిన అతి ఉత్తమ్ కేటరిగిలో.. దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ మేరకు ఏపీకి అభినందనలు సైతం తెలిపింది. విద్యకు పెట్టిన పెట్టుబడికి సమీప భవిష్యత్తులో అద్భుత ఫలితాలు రానున్నట్టు చెప్పుకొచ్చింది. అక్షరాస్యతలో అద్భుతంగా ఉంటే అభివృద్ధి సునాయసమని తెలిపింది. ఈ సందర్బంగా ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్ల కాలంలో ఏపీలో విద్య విషయంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్టు తెలిపారు. విద్యకు సంబంధించి 10 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా ఉందన్నారు. విద్యా కానుక, అమ్మఒడి, నాడు-నేడు వంటి పథకాలతో విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. విద్య కోసం 67వేల కోట్లు.. ఇక, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.66,722 కోట్లు ఖర్చు చేస్తోంది. కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15వేలు అందిస్తోంది. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. నాడు-నేడు.. మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. దీని కోసం రూ.11,669 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్లు, బూట్లు, సాక్స్లు, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు, స్కూల్ బెల్ట్, మాస్క్ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.. పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు. డిజిటల్ విద్య.. ఇక, 2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం ప్రభుత్వం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యాబ్లు అందించింది. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్తో ట్యాబ్లను అందించింది. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తోంది. ఇది కూడా చదవండి: విద్యా రంగానికి పెద్దపీట.. భారీగా కేటాయింపులు -
ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహిస్తూ జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్..!
-
విద్య వ్యవస్థలో సరి కొత్త శకం
-
మీ భవిష్యత్తుకు బంగారు బాట
-
మా కుటుంబానికే వెలుగులు తెచ్చావు జగనన్న
-
‘జగనన్న విద్యాదీవెన’ ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం వల్లే నేను ఫీజు కట్టి చదవగలుగుతున్నాను..!
-
మా చదువులకు భరోసా.. ‘జగనన్న విద్యాదీవెన’
-
జగనన్న విద్యా దీవెనతో నా డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకుంటున్నాను
-
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
-
బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు: సీఎం జగన్
Updates ►మోసాల చక్రమే చంద్రబాబు సైకిల్ చక్రం ►బాబు పెత్తందారీ భావజాలానికి.. పేదలకు మధ్య యుద్ధం. ►సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. ►ఎల్లో మీడియా విష ప్రచారానికి, మనం చేస్తున్న మంచికి యుద్ధం. ►టీడీపీ హయాంలో దోచుకో, పంచుకో, తినుకో విధానం. ►డీపీటీ కావాలా? నేరుగా బటన్ నొక్కే డీబీటీ కావాలా? ►ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అండగా ఉండకపోవచ్చు.. ►జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు. ►మీ జగనన్న ప్రజలనే నమ్ముకున్నారు. ►ఇది కురుక్షేత్ర యుద్దం ►ఈ యుద్ధంలో నా ధైర్యం, బలం మీరే. ►మీకు మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా నిలవండి. ►దుకాణం మూసేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. ►చంద్రబాబు పులిహోర మ్యానిఫెస్టో తెచ్చారు. ►మరోసారి మోసానికి తెరతీశారు. ►బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంటూ డ్రామాలు మొదలు పెట్టారు. ►14 ఏళ్లు సీఎంగా బాబు ఏం చేశారు? గాడిదలు కాశారా? ►బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు ► విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేశాం: సీఎం జగన్ ► ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్థులు ఉండాలి. ► టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం చేపట్టాం. ► అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ► ఇంగ్లీష్ మాట్లాడటంలో మన విద్యార్థులకు ప్రతిభ పెరుగుతుంది. ► రాష్ట్రంలోని 52 మంది ఇంగ్లీష్ టీచర్లకు అమెరికాలో శిక్షణ. ► విద్యాకానుక కిట్లలో మెరుగైన మార్పులు చేశాం. ► యూనిఫామ్ డిజైన్లో మార్పులు చేశాం. ► గతేడాది కంటే ఈ ఏడాది యూనిఫామ్ క్లాత్ శాతం పెరిగింది. ► రూ.1,042.53 కోట్ల వ్యయంతో విద్యాకానుక కిట్ల పంపిణీ. ► 43 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక ► ప్రతి విద్యార్థి రూ. 2,400 విలువైన కిట్ పంపిణీ. ► ఇప్పటి వరకు విద్యాకానుక పథకానికి రూ. 3,366 కోట్లు ఖర్చుచేశాం. ►ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి బొత్స సత్యనారాయణ ►విద్యారంగంలో కీలక సంస్కరణలు చేశాం. ►ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో నిలబడాలనేదే లక్ష్యం. ►ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లో విద్యా బోధన. ►సీఎం జగన్ అంటే ప్రభంజనం: ఎమ్మెల్యే నంబూరి శంకరరావు ►పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ►నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను సీఎం జగన్ అందించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరులో ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించిన సీఎం జగన్ డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్రూమ్లో విద్యార్థులతో కూర్చొని ముచ్చటించారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్పై ఆల్ ది బెస్ట్ అని రాశారు. జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు. ► పల్పాడు జిల్లా క్రోసూరుకు సీఎం వైఎస్జగన్ చేరుకున్నారు. కాసేపట్లో నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక అందించనున్నారు. ► పల్పాడు జిల్లా క్రోసూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయల్దేరారు. ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండగా.. తొలిరోజే విద్యాకానుక అందిస్తోంది ప్రభుత్వం. వరుసగా నాలుగో ఏడాది సీఎం జగన్ ‘జగనన్న విద్యాకానుక’ కిట్ను అందజేయనున్నారు. ►ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ►జగనన్న విద్యాకానుక కిట్కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యతా పరీక్షలు చేపట్టారు. ►43.10 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు సీఎం జగన్ విద్యా కానుక అందించనున్నారు. ►రూ. 1,042.53 కోట్ల వ్యయంతో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ►నాలుగేళ్లలో విద్య కోసం రూ.60 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ► తొలి దశలో నాడునేడు పూర్తయిన 15,715 స్కూళ్లలో డిజిటల్ విద్య, హైస్కూళ్లలో 30 వేల తరగతి గదులకు బైజూస్ కంటెంట్తో డిజిటల్ విద్య అందిస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ చదువుల భారమంతా తన భుజాలకెత్తుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందిస్తోంది. పాఠ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చదవండి: పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు! -
పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు
-
నా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు.. జగనన్న ఇచ్చే విద్యాదీవెనతోనే మా పాపను చదివిస్తున్నాను
-
జగనన్న విద్యాదీవెనతో మా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గింది
-
విద్యా దీవెనతో మారిన బతుకుచక్రం
-
ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. పదో తరగతి ఫలితాల్లో 578 మార్కులు వచ్చాయి
-
చలించిపోయిన సీఎం జగన్.. విద్యార్థిని దివ్య కుటుంబానికి ఇంటి స్థలం
తాళ్లపూడి: ఇటీవల కొవ్వూరులో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తనకు విద్యా దీవెన పథకం ఎలా మేలు చేసిందో చెబుతూ అందరినీ ఆకట్టుకున్న పెద్దేవం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తిరిగిపల్లి దివ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. దివ్య కుటుంబం కష్టాలు విని సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత నుంచి విద్యార్థిని దివ్యకు శుక్రవారం పిలుపు వచ్చింది. ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ, గ్రామ సర్పంచ్ తిరిగిపల్లి వెంకటరావు విద్యార్థిని దివ్యను వెంట పెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. విద్యార్థి దివ్య కుటుంబానికి ఇంటి స్థలం తక్షణమే కేటాయించినట్టు కలెక్టర్ తెలిపారు. అతి త్వరలో మంత్రి చేతుల మీదుగా అందజేస్తామన్నారు. అలాగే ఉన్నత చదువుకు, ఆ తర్వాత మంచి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దివ్య హోంమంత్రి తానేటి వనితను కూడా కలిసింది. -
జగన్ ను ఎదుర్కోవడానికి తోడేళ్లందరూ ఏకమవుతున్నారు: సీఎం జగన్
-
రానున్నది కురుక్షేత్రం.. మీ బిడ్డకు అండగా ఉండండి
నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నిరుపేద వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా గట్టిగా నిలబడాలంటే వారి పట్ల ఉన్న వివక్ష సంకెళ్లు తెంచుకోవాలి. అందుకు చదువు ఒక్కటే మార్గమని అంబేడ్కర్, సావిత్రీబాయి పూలే, అబుల్ కలాం ఆజాద్ వంటి గొప్పవాళ్లు చెప్పారు. అందుకే మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా నాలుగేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను. – సీఎం వైఎస్ జగన్ కొవ్వూరు నుంచి సాక్షి ప్రతినిధి: ‘పేదల తల రాత మార్చేందుకు ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా పేదల బాగు కోసం మనందరి ప్రభుత్వం ఎంతగానో పరితపిస్తూ అడుగులు ముందుకు వేస్తోంటే గత పాలకులు రాష్ట్రం దివాలా తీస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు. వారంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి తోడేళ్ల గుంపు మాదిరిగా మీ బిడ్డపైకి వస్తున్నారు. పేదల ప్రతినిధిగా ఉన్న నాపైకి ఈ పెత్తందారులంతా రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతూ.. మరింతగా దుష్ప్రచారం చేస్తూ వస్తారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో వారితో జరిగే కురుక్షేత్ర మహా సంగ్రామంలో మీరంతా మీ బిడ్డకు అండగా నిలవాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సత్యవతినగర్లో బుధవారం ‘జగనన్న విద్యా దీవెన’ జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించిన నిధులను లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదవాడికి ఏం చెయ్యాలి.. పేదరికం పోవాలంటే ఆ పేదవాడిని ఎలా ఆదుకోవాలి.. ఎలా తోడుగా నిలబడాలని గత ప్రభుత్వ పెద్దలు ఏ రోజూ ఆలోచించలేదని చెప్పారు. గతంలో ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5 వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.. అంతా ఒక గజ దొంగల ముఠాగా ఏర్పడ్డారన్నారు. వాళ్ల రాజకీయం, వాళ్ల ఆలోచన అంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం అన్నట్టుగా సాగిందని తెలిపారు. ‘అందుకే దీని గురించి ఏ పేపర్లో రాయరు.. ఏ టీవీలో డిబేట్లు పెట్టరు.. ప్రశ్నిస్తాను అన్న ఏ ఒక్కరూ ప్రశ్నించరు.. కాలేజ్లో చదువుతున్న పిల్లలపై చేస్తోన్న ఖర్చుతో రాష్ట్రం దివాలా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడే ప్రతిపక్ష నాయకుడిని, చెడిపోయిన మీడియా వ్యవస్థను చూస్తున్నాం’ అని అన్నారు. పేద పిల్లలు పెద్ద చదువులు చదవాలని, ఫీజు ఎంతైనా ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఇంగిత జ్ఞానం లేని కొందరికి చదువు విలువ తెలియదు ► భావితరాల తలరాతలు మార్చేలా విద్యార్థులపై హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా ఖర్చు చేస్తున్నాం. ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ రాష్ట్రం, దేశం.. దశ, దిశ మారుస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి విద్యార్థి మంచి ఇంజినీర్గా, డాక్టర్గా బయటకు వస్తే భావితరాలకు స్కిల్డ్ మేన్ పవర్కు కేరాఫ్ అడ్రస్గా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుంది. ► దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విప్లవాత్మక మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకువచ్చాం. ప్రభుత్వ బడి మారింది. చదువులు మారుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం వచ్చింది. సీబీఎస్ఈ సిలబస్ కూడా వచ్చింది. బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్ కూడా తీసుకువచ్చాం. దీని ద్వారా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో విద్యను అభ్యసించే అవకాశం లభించింది. పౌష్టికాహారం ఇచ్చే విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. ► గత ప్రభుత్వం సంవత్సరానికి కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే మన ప్రభుత్వంలో ఈ ఒక్క ప«థకానికి దాదాపు రూ.2 వేలు కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలకు యూనిఫాం నుంచి బుక్స్ వరకు ఎప్పుడు పాఠశాలలు తెరిచినా వారికి అందేట్టుగా విద్యాకానుక అందిస్తున్న ప్రభుత్వం మనదే. చదువుల విప్లవమే తీసుకువచ్చాం. ► పేదరికం సంకెళ్లు నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే పాశుపతాస్త్రం. మీ ఇంటిలో అందరినీ చదివించండి. మీ వెంట నేనుంటా. వివక్ష పోవాలంటే ఉన్నత చదువులతోనే సాధ్యమవుతుంది. విద్యపై పెట్టేది హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే విషయం ఇంగిత జ్ఞానం లేని కొందరు ప్రతిపక్ష నేతలకు తెలియడం లేదు. ఇది క్లాస్ వార్ ► గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నా. ఈ నాలుగేళ్లలో జరిగిన మంచిని జీర్ణించుకోలేని వారందరూ కలిసి కట్టుగా ఒక్క జగన్ను ఎదుర్కోవడానికి వస్తామంటున్నారు. మీ జగన్కు వాళ్ల మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి మద్దతు ఉండకపోవచ్చు. ► ఈ రోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్ జరుగుతోంది. పేద వాళ్లంతా ఒక వైపు ఉంటే మరోవైపు పెత్తందార్లు ఉన్నారు. మనందరి ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు అండగా సైనికులుగా నిలబడండి. నా బలం, నా నమ్మకం మీరే. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలనే నమ్ముకున్నా. ప్రతి కుటుంబం నుంచి సత్య నాదెళ్ల రావాలి ► మన రాష్ట్రంలో ప్రతి కుంటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మనది అని చెప్పడానికి గర్వపడుతున్నా. స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్లో సీటు వచ్చినా ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులు.. ప్రతిభ మీరు చూపించండి, మీ ప్రతిభకు తోడుగా మీ జగనన్న ఉంటాడని మళ్లీ చెబుతున్నా. ► షాదీ తోఫా, కళ్యాణమస్తు వంటి çపథకాలకు చదువుతో ముడిపెట్టి ప్రతి ఇంట్లో కూడా పెద్ద చదువులు చదివేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నా. మన పిల్లలు బాగా చదవాలని, పేద పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు ఒక్కటే మార్గమని మనసా వాచా కర్మణా నమ్మి వాళ్ల తరఫున మనందరి ప్రభుత్వం చదువుల కోసం ఇంతగా తాపత్రయపడుతోంది. విమర్శకులారా ఆలోచించండి ► ఇంతకు ముందెప్పుడైనా ఇలా బటన్లు నొక్కి ఎవరికీ లంచాలు ఇవ్వకుండా, వివక్ష చూపకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి పథకాల లబ్ధి నేరుగా చేర్చే పరిస్థితి ఉందా? మనందరి ప్రభుత్వాన్ని విమర్శించే వారు, విద్యాదీవెన అందుకుంటున్న ప్రతి తల్లి, ప్రతి విద్యార్థి ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నా. ► జగనన్న అమ్మ ఒడి దగ్గర మొదలు పెడితే విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత ఇలా ఏ పథకం చూసినా ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి ఏ విధంగా వస్తోందో ఆలోచించండి. ► ఇంతకు ముందు కూడా ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. అప్పుల గ్రోత్ రేటు గతం కన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ. అదే రాష్ట్రం అయినప్పుడు, అదే బడ్జెట్ ఉన్నప్పుడు కేవలం మార్పు ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే. ఒక్క ముఖ్యమంత్రి మారడంతో ఈ రోజు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2.10 లక్షలు కోట్లు నేరుగా (డీబీటీ) వెళ్లింది. దీనికి ఇంటి స్థలాలు.. ఒక్కో స్థలం విలువ రూ.2.50 లక్షలు వేసుకున్నా రూ.75 వేల కోట్లు నాన్ డీబీటీ కింద కలుపుకుని మొత్తంగా రూ.3 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మలకు అందజేశాం. ఇదంతా ఈ నాలుగేళ్లలోనే జరిగింది. ఇది గతంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఎందుకు జరుగుతుందో ఆలోచించండి. పేదల కోసం పుట్టిన రారాజువన్నా.. ఇప్పటి వరకు ఎంత ఏడ్చినా మా కన్నీళ్లు ఆగవనుకున్నా. మీ చిరునవ్వుతో ఆ కన్నీళ్లు కాస్తా మాకు ఆనంద భాష్పాలుగా మారాయి. మాలాంటి పేద ప్రజల కోసం పుట్టిన రాజు, రారాజు మీరు. సంక్షేమ బాటసారివి. అధికార పీఠానికి కొత్త భాష్యం పలికి ఆదర్శమూర్తిగా నిలిచారన్నా. నా తల్లిదండ్రులు వికలాంగులు. వారికి మేము ఇద్దరం ఆడ పిల్లలం. నాన్న ఆకుకూరలు అమ్ముతుండగా అనుకోకుండా ఆయనకు పక్షవాతం వచ్చి బాగా నీరసించిపోయాడు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇప్పిస్తూ.. మా కుటుంబాన్ని ఆదుకుంటున్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నా. మీ వల్లే నేను కార్పొరేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. మేము చదువుకున్నప్పటి స్కూళ్లు, ఇప్పటి స్కూళ్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నా. మళ్లీ స్కూలుకు వెళ్లి చదువుకోవాలనిపిస్తోందన్నా. మాకు అన్న లేని లోటు మీ వల్ల తీరుతోందన్నా. తరానికి ఒక్కడు, యుగానికి ఒక్కడు అంటుంటారే.. అది మీరేనన్నా. – దివ్య, బీకాం థర్డ్ ఇయర్, కొండవీటి డిగ్రీ కళాశాల, గోపాలపురం ఉద్యోగావకాశాలు మీ చలవే నేను పేద మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడిని. నా తల్లి గృహిణి, తండ్రి రైతు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం రూ.35 వేలు మాత్రమే వచ్చేది. ఈ రోజు నేను చాలా అదృష్టవంతుడిని. నాకు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఒక సాధారణ నాయకుడిలా మీరు మోసపూరిత హామీలు ఇవ్వలేదు. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. మీరు ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు చాలా ఉపయోగకరం. దేశంలో నూతన విద్యా విధానం తీసుకువచ్చిన తొలి రాష్ట్రం మనదే. మన విద్యా విధానంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండటంతో ఎన్నో ఉద్యోగావకాశాలు పొందుతున్నాము. గతంలో మా కళాశాలలో కేవలం 30 – 40 శాతం మందికి ఉద్యోగావకాశాలు ఉండేవి. మీరు వచ్చాక అది 90 శాతానికి పెరిగింది. మా కాలేజ్ నుంచి ఓ విద్యార్థికి రూ.44 లక్షల ప్యాకేజీతో అమేజాన్లో ఉద్యోగం లభించిందంటే అది మీరు తీసుకువచ్చిన మార్పే. మీరే శాశ్వత సీఎంగా ఉండాలి. – రాపర్ల ప్రసన్నకుమార్, బీటెక్ థర్డ్ ఇయర్, తాడేపల్లిగూడెం ఉప్పొంగిన జన గోదావరి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన విద్యా దీవెన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపించారు. సీఎం ప్రత్యేక బస్సులో ఆర్టీసీ బస్టాండ్, అక్కయ్యమ్మ కాలనీ, ఎన్టీఆర్క్రీడా మైదానం మీదుగా సత్యవతినగర్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రెండు కిలోమీటర్లకు పైగా రోడ్షో సాగింది. ఇరువైపులా జనం జైజగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించిన సీఎం.. విద్యార్థులు, వారి తల్లులతో కొద్దిసేపు మాట్లాడారు. వారితో కలిసి గ్రూపు ఫొటో తీయించుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు, వారి తల్లులు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది బయటే ఉండిపోయారు. ‘ప్రతిభ మీది.. ఉన్నత విద్య బాధ్యత నాది.. నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని సీఎం అన్నప్పుడు విద్యార్థుల ఈలలు, కేకలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం వరాల జల్లు కురిపించారు. హోం మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30 కోట్లతో పాటు 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, కొవ్వాడ కెనాల్ వద్ద కల్వర్ట్, మూడు మండలాల్లో మూడు అంబేడ్కర్ భవనాలు, ముస్లింలకు షాదీఖానా, ఎస్సీలకు కమ్యూనిటీ హాలు, కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చారు. -
సీఎం వైఎస్ జగన్ కొవ్వూరు పర్యటన ఫొటోలు
-
రాబోయే రోజుల్లో ఏపీ దేశానికే దశ దిశ చూపిస్తుంది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొవ్వూరు పర్యటనలో ఉన్నారు. కాగా, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. దీంతో, జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదగాలి. వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యం. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుంది. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశాం. జాబ్ ఓరియోంటెడ్గా కరిక్యులమ్ మార్చాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టాం. పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్యా నాదెళ్ల రావాలి. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేది. ఒక్క జగన్ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్వార్ జరుగుతోంది’ అని అన్నారు. -
‘నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం జగనన్న’
కొవ్వూరు: జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమంపై ప్రశంసలు కురిపించింది. ‘నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం జగనన్న. మా నాన్న, అమ్మ ఇద్దరూ దివ్యాంగులు. మా నాన్నకు పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉంటే మా అమ్మ చెవిటి-మూగ. అయితే నేను ఉన్నాను. నేను విన్నాను అంటూ జగనన్న మాకు అండగా నిలిచారు. మాకు విద్యా దీవెనతో పాటు, వసతి దీవెన కూడా జగనన్న అందించారు. మా కుటుంబానికి అండగా నిలబడిన జగనన్నకు కృతజ్ఞతలు. నా చిట్టి చెల్లెమ్మకు నేను ఉన్నాను అంటూ వసతి దీవెన అందించి నన్ను నిలబెట్టాడు మా అన్న. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకూ తెలుగు మీడియంలోనే చదువుకున్నా.. నాకున్న ఆర్థిక పరిస్థితి సరిపోక తెలుగు మీడియంలోనే చదువుకున్నా. ఇప్పుడు కార్పోరేట్ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నానంటే అది మీ దయే అన్నా. నేను స్కూల్ స్టడీస్లో ఉండగా అంతా ఇబ్బందిగా ఉండేది. వసతులు ఏవీ బాగుండేవి కావు. మీరు వచ్చిన తర్వాత స్కూళ్ల రూపురేఖలే మార్చేశారన్నా. ఇప్పటి గవర్నమెంట్ స్కూళ్లను చూస్తుంటే మళ్లీ స్కూల్కి వెళ్లాలనిపిస్తుందన్నా’ అని విద్యా దీవెన అందుకుంటున్న తాళ్లపూడి మండలకు చెందిన దివ్య అనే డిగ్రీ బాలిక తన ప్రసంగం ద్వారా ఆకట్టుకుంది. ప్రసంగం తర్వాత ఆ విద్యార్థిని వేదికపై ఉన్న సీఎం జగన్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంది. ‘సార్, నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్న రైతు, అమ్మ గృహిణి, నేను జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుడిని, గతంలో కేవలం రూ. 35 వేలు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు పూర్తిగా ఫీజు మొత్తం కూడా ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా పొందుతున్నాం. మీరు మోసపూరిత హమీలు ఇవ్వకుండా ఇచ్చిన ప్రతి హమీ నెరవేర్చిన ఏకైక నాయకుడు మీరు. మీరు ఉన్నత విద్యలో ప్రభావవంతమైన సంస్కరణలు తీసుకొచ్చారు, నూతన విద్యా విధానానికి సంబంధించిన పాలసీని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనది. మన విద్యా విధానం అంతర్జాతీయ స్ధాయికి ఎదిగింది, మీ హయాంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్లలో 90 శాతంపైగా సాధిస్తున్నారు, నా కాలేజ్ విద్యార్ధి అమేజాన్ లో రూ. 44 లక్షల ప్యాకేజ్ కి సెలక్ట్ అయ్యాడంటే మీరే కారణం. మీ నవరత్నాల పథకాల లబ్ధి పొందుతున్నాం, మీరు మాపై ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసి ఏపీని ముందుకు తీసుకెళతాం, మీ పేరు ఎక్కడ రాయాలన్న చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా కాకుండా ద పర్మినెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా రాయాలనుకుంటున్నాం, అటువంటి అవకాశం మీరు కల్పించాలి, ధ్యాంక్యూ.’ -ప్రసన్నకుమార్, బీటెక్ విద్యార్ధి, తాడేపల్లిగూడెం -
Live: కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన
-
కొవ్వూరులో విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
-
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి: సీఎం జగన్
Updates సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►మన సమాజంలో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ►ఆ కుటుంబాల తలరాతలు మారాలి ►వారు పేదరికం నుంచి బయటకు రావాలి ►ఆ కుటుంబాలనుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు లాంటి వారు రావాలి ►పేదరికం అనే సంకెళ్లను వారు తెంచుకోవాలి ►దానికి చదవులు ఒక్కటే మార్గం ►అందుకే నాలుగేళ్ల ప్రభుత్వ పాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా అడుగులేశాం ►నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగాను, ఆర్థికంగానూ గట్టిగా నిలబడాలంటే, వారు వివక్ష సంకెళ్లను తెంచుకోవాలంటే.. దానికి చదువులు ఒక్కటే మార్గం ►ఒక అంబేద్కర్, ఒక సావిత్రీ పూలే కాని, మౌలానా అబ్దుల్ ఆజాద్ కాని… వారి నోట్లోనుంచి వచ్చిన మాట ఏంటంటే.. చదువు అనేది ఒక్క అస్త్రం అని అలాంటి చదువుల విప్లవం మన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా చేపట్టాం ►చదువులు అన్నవి పేదలకు ఒక హక్కుగా అందాలి ►జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేస్తోంది ►పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికంలోనూ జమచేస్తున్నాం ►జనవరి-ఫిబ్రవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇప్పుడు డబ్బు జమచేస్తున్నాం ►లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం ►చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు ఇచ్చారు ► రూ. 1777 కోట్ల రూపాయలు బకాయిపెట్టాడు చంద్రబాబు ఆ డబ్బును కూడా మన ప్రభుత్వమే తీర్చింది ►బోర్డింగ్ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది ►ప్రతి ఏటా వసతి దీవెన కింద రెండుమార్లు తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం ►అక్షరాల 25 లక్షల మందికిపైగా వర్తింపుచేస్తున్నాం ► కేవలం ఒక్క ఈ పథకానికే రూ.4,275.76 ఖర్చుచేశాం ►చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి ► ఫీజులు అరకొరగా ఇచ్చేవారు ►ఎప్పుడు ఇచ్చేవారో తెలిసేది కాదు ►ముష్టి వేసినట్టు ఇచ్చేవారు ►కేవలం రూ.35వేలు ఇచ్చేవారు ►మన ప్రభుత్వం ఫీజులు ఎంతైతే అంత ఇస్తోంది ►పిల్లలకు మంచి జరగాలని ఎంత ఫీజులైతే అంత చెల్లిస్తున్నాం ►ఎంత ఫీజులైనా ఫర్వాలేదు.. మీరు చదవండి… మీ జగనన్న చెల్లిస్తాడు ►పిల్లలకు మంచి మేనమామగా ఎప్పుడూ ఉంటాను ►ఇలాంటి పథకాలు ఇస్తుంటే… రాష్ట్రం దివాళా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ►మీడియా వ్యవస్థలు కొన్ని ఇలానే మాట్లాడుతున్నాయి ►భావి తరాల పిల్లల తలరాతలు మార్చేందుకు మేం పెట్టే ఖర్చు.. మానవ వనరులమీద పెట్టుబడులు అని చెప్తున్నాను ►రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దశ, దిశ ఆంధ్రప్రదేశ్ చూపిస్తోంది ►ఏ రాష్ట్రంలో లేని విధంగా నర్సరీ నుంచి, ఉన్నత విద్యవరకూ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ►ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి ►అందులో చదువులు కూడా మారుతున్నాయి ►సీబీఎస్ఈ ఇంగ్లిషు మీడియం చదువులు వచ్చాయి ►బై లింగువల్ టెక్ట్స్బుక్స్ వచ్చాయి ►గొప్ప మార్పులకు నిరద్శనం ఇది ►అంగన్వాడీల స్వరూపం కూడా మారుతోంది ►పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం ►ఈ విషయంలో అక్షరాల ఒక్కో పథకానికి రూ.౨వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ►విద్యాకానుక ద్వారా స్కూళ్లు తెరిచే సమయానికి కిట్లను అందిస్తున్నాం ►ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ప్రతి పిల్లాడికి మంచి బోధన అందించడంపై దృష్టిపెట్టాం ►సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు తీసుకు వచ్చాం ►పిల్లలకు ఇంటికి వెళ్లిన తర్వాత ట్యూటర్ ఉండాలన్న తాపత్రయంతో బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ ఇచ్చాం ►ఆఫ్లైన్లో పనిచేసే ట్యాబులు ఇచ్చాం ►నాడు – నేడు పూర్తిచేసుకున్న మొదటి దఫా స్కూళ్లలో 6 నుంచి పై తరగుతులకు డిజిటల్ క్లాస్రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం ►ఐఎఫ్పీ ప్యానెల్స్ద్వారా డిజిటల్ బోధన తీసుకున్న ప్రభుత్వం మనదే ►ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేటు స్కూల్స్ పోటీపడే పరిస్థితి వస్తుంది ►గత ప్రభుత్వం చివరి ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు 37లక్షలు ఉంటే.. ఆ సంఖ్య 40 లక్షలు దాటింది ►ప్రభుత్వ స్కూళ్లమీద నమ్మకం కలిగింది ►డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయి ►డిగ్రీల్లో చేరకుండా 2018-19లో 81,813 ఉంటే అది 2022-23 నాటికి 22,387కు తగ్గింది ►2018-19లో ఇంజినీరింగ్ చదివేవాళ్లు 80వేలు మంది అయితే ఈ ప్రభుత్వంలో 1.2 లక్షలమంది చదువుతున్నారు. దాదాపు 50శాతం వృద్ధి ఉంది: ►ఉన్నత విద్యతో పాఠ్యప్రణాళికను మార్చాం ►జాబో ఓరియంటెడ్గా తీర్చిదిద్దాం ►25 మార్కెట్ ఓరియెంటెడ్, 67 బిజినెస్ ఒకేషన్ కోర్సులు ప్రవేశపెట్టాం ►దేశంలో తొలిసారిగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టాం ►పిల్లల నైపుణ్యం పెంచడానికి ఆన్లైన్ కోర్సులు ఇప్పిస్తున్నాం ►మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ►వారిచేత కోర్సులు చెప్పించి.. సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాం ►అమెజాన్ లాంటి సంస్థలు కూడా రాష్ట్రప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యాయి ►జగనన్న విదేశీ దీవెన కింద 21 ఫ్యాకల్టీలో 350 ప్రపంచస్థాయి కాలేజీల్లో రూ. 1.25 కోట్ల వరకూ కూడా ఫీజులు కడుతున్నాం ►సత్యానాదెళ్లలా.. మన రాష్ట్రం నుంచి ప్రతి కుటుంబం నుంచి రావాలి ►ప్రతి కుటుంబం నుంచి కూడా సత్యనాదెళ్లలు రావాలి ►ప్రతిభ మీరు చూపించండి… మీ ప్రతిభకు తోడుగా నేనున్నాను ►షాదీతోఫా, కళ్యాణమస్తు లాంటి పథకాలు కూడా టెన్త్ చదివితేనే అమలు ►విమర్శించే ప్రతిపక్షాలతా ఆలోచన చేయండి ►ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగేదా? ►లంచాలు ఇవ్వకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వచ్చేవా? ►అమ్మ ఒడి నుంచి చూస్తే.. విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత లాంటి పథకాలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలా వస్తున్నాయి? ►అప్పుడు బడ్జెట్.. ఇప్పుడు కూడా అదే బడ్జెట్ ►అప్పులు వృద్ధి చూస్తే.. అప్పటితో చూస్తే.. ఇప్పుడే తక్కువ ►కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు ►గతంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు జరగుతున్నాయి? ►గతంలో పేదవాడి గురించి ఆలోచన చేయలేదు ►పేదరికం పోవాలంటే.. ఏంచేయాలన్న ఆలోచన చేయలేదు ►గతంలో పాలకులంతా గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు ►చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ►ప్రజల గురించి వారెప్పుడూ ఆలోచన చేయలేదు ►దోచుకోవడం ఎలా.. ఎలా పంచుకోవడం.. అన్నదే వారి ఆలోచన ►అందుకే ఏ పేపర్లోనూ రాయరు… ఏ టీవీల్లోనూ డిబేట్లు పెట్టరు ►ప్రశ్నిస్తామన్న వాళ్లు… ప్రశ్నించరు ►ఇప్పుడు తోడేళ్లంతా కలిసికట్టుగా ఏకం అవుతామంటన్నారు ►జగన్కు వారి మాదిరిగా మీడియా ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి సపోర్టూ ఉండకపోవచ్చు ►ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్వారు ►పేదవాడు ఒకవైపున ఉన్నాడు.. పెత్తందార్లు మరోవైపున ఉన్నాడు ►రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెప్తారు, మోసపూరిత మాటలు చెప్తారు ►మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి ►మంచి జరిగితే.. జగనన్నకు తోడుగా నిలవండి ►నా బలం మీరే.. నా నమ్మకం మీరే ►నేను నమ్ముకున్నది దేవుడి దయను, మీ అందరి చల్లని దీవెనలను ►రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ దీవెనలు ఉండాలని కోరుతున్నాను ► హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. తండ్రి ఆశయ సాధన కోసం పాటు పడుతున్న తనయుడు సీఎం జగన్. ముఖ్యమంత్రి జగనన్న పాలనలో అన్ని కులాలకు సమన్యాయం అందుతోంది. జగనన్న పాలనలో విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సీఎం జగన్ తీర్చిదిద్దారు. సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు వచ్చాయి. జగనన్న.. విద్యను పేదవాడి హక్కుగా మార్చారు. పేద విద్యార్థులు చదువుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. చంద్రబాబు పాలనలో ఫీజు రియింబర్స్మెంట్ అరకొరగా ఇచ్చారు. జగన్ పేదల వైపు నిలబడితే.. చంద్రబాబు, పవన్ పెత్తందారుల వైపు నిలబడ్డారు. చంద్రబాబు పది మందితో కలిసి వచ్చినా సీఎం జగన్ ఒక్కరే ఎదుర్కొంటారు. సీఎం జగన్ నాయకత్వంలో నేను పనిచేస్తా. ► కొవ్వూరు చేరుకున్న సీఎం జగన్. ► సీఎం జగన్కు స్వాగతం పలికిన మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన, విశ్వరూప్. ►కొవ్వూరు బయలుదేరిన సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ లబ్ధిదారులకు జమచేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. ► జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ► అనంతరం, తూర్పో గోదావరి జిల్లా కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ‘జగనన్న విద్యా దీవెన’.. ► పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. ‘జగనన్న వసతి దీవెన’.. ► అలాగే, ఉన్నత చదువులు చదివే ఈ పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు అయితే రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. -
నేడు సీఎం జగన్ కొవ్వూరు పర్యటన
సాక్షి, అమరావతి/కొవ్వూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం (నేడు) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. అక్కడ జరిగే కార్యక్రమంలో ఆయన జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కొవ్వూరు చేరుకుంటారు. అక్కడ సత్యవతినగర్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమచేస్తారు. అనంతరం కొవ్వూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
పేదలకు పెద్ద చదువులే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులను కూడా పెద్ద చదువులు చదివించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా జన వరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను బుధవారం సీఎం లబ్ధిదారులకు జమచేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. పేద విద్యార్థులకు వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న మేలును ఒకసారి పరిశీలిస్తే.. ‘జగనన్న విద్యా దీవెన’.. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. ‘జగనన్న వసతి దీవెన’.. అలాగే, ఉన్నత చదువులు చదివే ఈ పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు అయితే రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. అలాగే.. ► ఇప్పటివరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన కింద రూ.10,636.67 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ► గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చే ఫీజుల్లో సైతం బకాయిలు పెట్టింది. ఇలా 2017 నుంచి పెట్టిన బాకీలు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,912.43 కోట్లు. ► ఇలా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 47 నెలల కాలంలో విద్యారంగం మీద చేసిన ఖర్చు మొత్తం అక్షరాల రూ.59,331.22 కోట్లు. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇలా.. ► నిజానికి.. పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన)తో పాటు భోజన, వసతి సౌకర్యాల (వసతి దీవెన) కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ► ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్లో మార్పులు చేసి జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్తో నాలుగేళ్ల హానర్స్ కోర్సులు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టారు. ► ఇందులో భాగంగా విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులతో పాటు తమకు అవసరమైన ఇతర నైపుణ్యాలను ఆన్లైన్లో నేర్చుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ► కరిక్యులమ్లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ► 40 రకాల నైపుణ్యాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 1.20 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, అదే విధంగా సేల్స్ఫోర్స్లో 33,000, ఏడబ్ల్యూఎస్లో 23,000, నాస్కామ్లో 20,000, పాలో ఆల్టోలో 10,000, ఆల్టెరిక్స్ డేటా అనలిటిక్స్లో 7,000 మందికి శిక్షణ పూర్తిచేసి సర్టిఫికెట్లు అందించారు. ఇలా దేశంలో ఒకే ఏడాది రెండు లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రం మనదే. సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు.. ► ఇంటర్ పాసై పై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018–19లో 81,813 కాగా.. జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య 2022–23 నాటికి 22,387కు తగ్గింది. అంతేకాక.. 2022–23 నాటికి ఇంటర్ పాసై పై చదువులకు పోలేని విద్యార్థుల జాతీయ సగటు 27శాతం అయితే, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62 శాతం మాత్రమే. ► 2018–19లో 32.4గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి 2020–21 నాటికి 94కు పెరిగింది. ► అలాగే, 2018–19లో 37,000గా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ 2021–22 నాటికి 85,000కు పెరిగాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే 80వేల మందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఆగస్టు ముగిసేనాటికి ఇది మరింతగా పెరిగే అవకాశముంది. డిజిటల్ విద్య దిశగా అడుగులు.. ► మరోవైపు.. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు.. నాడు–నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్రూమ్లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038.. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ప్రవేశపెట్టింది. అసలు, ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడటం కాదు.. కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం విద్యావ్యవస్థలో ఈ తరహా విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టింది. -
ఫ్యాక్ట్ చెక్ : తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి: విద్యపై చేసే ఖర్చు భవిష్యత్తు తరానికి పెట్టుబడి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద సంక్షేమ కేలండర్ ప్రకారం విద్యా సంవత్సరంలో త్రైమాసికానికి ఒకసారి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే పేదింటి పిల్లలు కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని అంగన్వాడీ నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్తోపాటు విదేశాల్లో చదువుకునేందుకూ ఈ ప్రభుత్వమే అండగా నిలుస్తోంది. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థినీ ప్రోత్సహిస్తోంది. ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 45 నెలల్లో కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.57,642.36 కోట్లు ఖర్చుచేసింది. ఉన్నత సంకల్పంతో అమలుచేస్తున్న పథకాలతో వచ్చిన మార్పులు, వాటి ఫలితాలు కళ్ల ముందే కనిపిస్తున్నా పచ్చ గంతలు కట్టుకున్న ‘ఈనాడు’ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. సంక్షేమ కేలండర్ ప్రకారమే నిధులు విడుదల విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి విద్యార్థులకు ఫీజుల ఒత్తిడి లేకుండా ‘జగనన్న విద్యా దీవెన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజును ఆ త్రైమాసికం పూర్తయిన తర్వాత ప్రభుత్వం చెల్లిస్తోంది. అక్టోబరు–నవంబర్–డిసెంబరు–2022 త్రైమాసికానికి 9,86,092 మంది విద్యార్థులకు రూ.684.52 కోట్లను మార్చి 19న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి మే 24న రూ.702.99 కోట్లు అందించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ముందుగా నిర్దేశించిన సంక్షేమ కేలండర్ ప్రకారమే, క్రమం తప్పకుండా ఇలా నిధులు విడుదల చేస్తున్నా.. వాస్తవాలను కప్పిపుచ్చి పచ్చ పత్రిక రోత రాతలు రాస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న 9,55,662 మంది పిల్లలకు ‘వసతి దీవెన’ కింద రూ.912.71 కోట్లను ఏప్రిల్ 26న జమచేసింది. అయినప్పటికీ ఈనాడు పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ‘జగనన్నా ఇదేనా విద్యా దీవెన’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనం వండి వార్చింది. అప్పట్లో అరకొర చెల్లింపులు.. అనేక కొర్రీలు గత ప్రభుత్వంలో కాలేజీల ఫీజులు కాలేజీ స్థాయిని బట్టి రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండేవి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం రూ.35 వేలకే పరిమితం చేసి, అది కూడా ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. పైగా ఏళ్ల తరబడి బకాయిలు. అప్పట్లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల ఆవేదను కనీసం పట్టించుకోని ఈనాడు.. ఇప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతున్నా బురద జల్లుతోంది. చంద్రబాబు హయాంలో చివరి రెండేళ్లు (2017–18, 2018–19) రూ.1,778 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టింది. అలాగే, విద్యార్థుల వసతి కోసం అనేక కొర్రీలూ పెట్టింది. కుల ప్రాతిపదికన, కోర్సుల ప్రాతిపదికన రూ.4 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే తక్కువ మందికి ఇచ్చింది. డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టళ్లల్లో ఈబీసీ, కాపు విద్యార్థులకు చోటులేకుండా చేసింది. అంతేకాక.. బాబు జమానాలో విద్యార్థులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష.. ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షల లోపు ఉండాలని నిబంధన పెట్టి ఎంతోమంది విద్యార్థులను ప్రభుత్వ పథకాలకు దూరం చేసింది. ఇవేవీ ఆ పచ్చ పత్రికకు పట్టవు. ఈ నాలుగేళ్లలో విద్య, వసతి దీవెనకు రూ.14,210 కోట్లు.. కానీ, ప్రసుత్త ప్రభుత్వం విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2.50 లక్షలకు పెంచి లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ పథకాలకు చేరువ చేసింది. ఏ విద్యార్థి చదువూ ఆగిపోరాదని ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా సగటున రూ.3,311 కోట్లు చొప్పున రూ.9,934 కోట్లు ఇప్పటికే చెల్లించింది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ‘జగనన్న వసతి దీవెన’ కింద ఐటీఐ విద్యార్థులకైతే రూ.10 వేలు, పాలిటెక్నిక్ వారికి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న వారికి రూ.20 వేలు చొప్పున ఏడాదిలో రెండుసార్లు తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటిదాకా విద్యార్థులకు రూ.4,275.76 కోట్లు చెల్లించింది కూడా. అంటే ఈ రెండు పథకాల కోసమే ప్రభుత్వం 2019–20 నుంచి 2022–23 వరకు (మే 24న విద్యా దీవెన కింద చెల్లించే రూ.702.99తో కలిపి) సుమారు రూ.14,210 కోట్లను క్రమం తప్పకుండా విడుదల చేసింది. ఇదేదీ ‘ఈనాడు’కు కనిపించదు. విద్యార్థులకు అండగా ‘1902’ టోల్ఫ్రీ నంబర్.. ఫీజుల విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎవరైనా యాజమాన్యలు వినకపోతే ఆ ఫిర్యాదులు తీసుకునేందుకు 1902 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా ఈ నంబర్కు ఫిర్యాదు చేస్తే.. ముఖ్యమంత్రి కార్యాలయమే (సీఎంఓ) నేరుగా కాలేజీలతో మాట్లాడుతోంది. పిల్లలకు ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా, వారు వసతి కోసం, భోజనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని, ఆ ఖర్చులు కూడా భారం కాకూడదని.. తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన ద్వారా క్రమం తప్పకుండా ఆ మొత్తాన్ని చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద కూడా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తోంది. కానీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిధులు చెల్లించిందంటూ ఈనాడు నిరాధార ఆరోపణులు చేయడం సిగ్గుచేటు. -
శింగనమల నియోజకవర్గానికి వరాల జల్లు
అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రం వేదికగా బుధవారం ‘జగనన్న వసతి దీవెన’ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం విజయవంతమైంది. సీఎం హోదాలో మొదటిసారి విచ్చేసిన వైఎస్ జగన్ మోహన్రెడ్డికి విశేష ప్రజాదరణ లభించింది. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మహిళా సంఘాల సభ్యులు, శింగనమల, నార్పల, యల్లనూరు, పుట్లూరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె మండలాల నుంచే కాకుండా అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అన్ని దారులూ నార్పలవైపే సాగాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే జనం సభా వేదిక వద్దకు చేరుకోవడం మొదలైంది. 10 గంటలకల్లా గ్యాలరీలు నిండిపోయాయి. సభా ప్రాంగణం బయట మూడింతల జనం నిల్చుండిపోయారు. అధికారులు సీఎం ప్రసంగం కోసం ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. హోరెత్తిన నినాదాలు నార్పల పరిసరాలు ‘జై జగన్’ నినాదాలతో మిన్నంటాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టపర్తి ఎయిర్పోర్టు నుంచి నార్పలకు హెలికాప్టర్లో వచ్చారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, కలెక్టర్ ఎం.గౌతమి, డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, సహాయ కలెక్టర్ ఎస్.ప్రశాంత్కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట హెలికాప్టర్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. సభావేదిక మీద ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి సీఎం నివాళులర్పించి సభను ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ను ఎమ్మెల్యే పద్మావతి, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, శింగనమల నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. సీఎం పర్యటన విజయవంతంగా ముగియడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. కరుణించిన వరుణుడు బహిరంగ సభ ప్రారంభానికి రెండు గంటల ముందు వరుణ దేవుడు కరుణించాడు. ఓ మోస్తరు వర్షం పడడంతో పరిసర ప్రాంతాలు చల్లగా మారాయి. సీఎం జగన్ ఎక్కడ సమావేశం పెట్టినా... వరుణ దేవుడు వచ్చి పలుకరించి వెళ్తాడనడానికి నార్పల బహిరంగ సభే నిదర్శనం. జనం సీఎం ప్రసంగం ఆసాంతం కదలకుండా విన్నారు. ప్రసంగం ఆద్యంతం ఈలలు, చప్పట్లతో హోరెత్తింది. పంచతంత్రం కథ ఆకట్టుకునేలా చెప్పడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. సీఎం ..సీఎం అంటూ నినాదాలు చేశారు. థ్యాంక్యూ మామయ్య అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ వాటర్ బాటిల్, స్నాక్స్, జ్యూస్ అందించారు. అలాగే అనంతపురం, బత్తలపల్లి, తాడిపత్రి, నార్పల వైపు వెళ్లే రోడ్లలో ప్రతి 50 అడుగుల దూరంలో వాటర్ ప్యాకెట్లు అందించారు. ఆత్మీయ వీడ్కోలు జగనన్న వసతి దీవెన కార్యక్రమం ముగించుకున్న తర్వాత బుధవారం మధ్యాహ్నం నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఆత్మీయ వీడ్కోలు లభించింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీనాయకులు ప్రతి ఒక్కరి నుంచి పూల బొకేలు స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులను ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారందరితోనూ దాదాపు గంటన్నరపాటు సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా 23 మంది తమ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేశారు. వీరిలో 19 మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. కలెక్టర్ గౌతమిని పిలిపించి ముగ్గురి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వారందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ● వేదిక మీద జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, కేవీ ఉషశ్రీ చరణ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, పోతుల సునీత, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, కలెక్టర్ ఎం.గౌతమి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్/ఎమ్మెల్సీ తలశిల రఘురాం, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహమ్మద్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ రాగే హరిత, ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ ఎం.మంజుల, ఏడీసీసీ బ్యాంకు చైర్పర్సన్ లిఖిత, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, నార్పల సర్పంచ్ సుప్రియ, జెడ్పీవైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరరావు, అనంతపురం మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్రెడ్డి, వాసంతి సాహిత్య, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఎల్ఎం ఉమామోహన్రెడ్డి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, జేఎన్టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, రెక్టార్ ప్రొఫెసర్ ఎం.విజయకుమార్, అనంతపురం ఆర్డీఓ మధుసూదన్, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిశాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, మాజీ ఎమ్మెల్సీ శమంతమణి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రఘునాథరెడ్డి, అనంతపురం మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు బాలనాగి భాగ్యలక్ష్మి, తదితరులు ఆశీనులయ్యారు. ఉన్నత విద్యావంతులను చేయడమే లక్ష్యం ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఎంతోమంది పేద విద్యార్థులకు భోజన, వసతి భారం తల్లిదండ్రుల మీద పడకుండా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ‘జగనన్న వసతి దీవెన’ ద్వారా అందజేస్తున్నారని కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. నార్పలలో నిర్వహించిన వసతి దీవెన కార్యక్రమం బహిరంగ సభను కలెక్టర్ స్వాగతోపన్యాసం చేశారు. ఐటీఐ నుంచి పీహెచ్డీ వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు వసతి దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది పేద విద్యార్థులకు రూ.912.71 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ కానుందన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన 40 వేల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.39.92 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఇలాంటి పథకాలు లేక నిన్న, మొన్నటి తరానికి చెందిన పేదలు ఉన్నత చదువులకు దూరం అయ్యారని పేర్కొన్నారు. అనంతపురం/శింగనమల/ నార్పల: శింగనమల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి విన్నవించగా సీఎం వెంటనే ఆమోదం తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. చాగల్లు రిజర్వాయర్ ముంపు గ్రామాలైన ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.168 కోట్లు మంజూరు. ఈస్ట్ నరసాపురంలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ.35 కోట్ల కేటాయింపునకు ఆమోదం. శింగనమల మండల కేంద్రంలో రూ.2 కోట్ల నిధులతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి ఆమోదం. మిడ్పెన్నార్ డ్యాం నిర్వహణ నిమిత్తం రూ.3 కోట్ల నిధులు విడుదల. నార్పల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 800 మంది విద్యార్థినులు ఉన్నారు. పాఠశాల నిర్వహణకు రెండు ఎకరాలు కావాలని కోరగా, ఇందుకు కోటి రూపాయల నిధులు కేటాయిస్తూ సీఎం ఆమోదం. చిత్రావతి నది మీద యల్లనూరు మండలంలో కేడీ రోడ్డు నుంచి చింతకాయమందకు రాకపోకల నిమిత్తం రూ.11.75 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం. చిత్రావతి నది మీద కోడుమూర్తి నుంచి చిలమకూరు వరకు రూ.15 కోట్ల వ్యయంతో కాజ్వే నిర్మాణానికి అంగీకారం. పుట్లూరు, యల్లనూరు మండలాల ప్రజలు పులివెందుల నియోజకవర్గానికి ఆనుకుని ఉండండం వల్ల పులివెందులను కూడా తమ సొంత నియోజకవర్గంలా భావిస్తుంటారు. పుట్లూరు మండలంలో సాగు, తాగునీరు సమస్యను పరిష్కరించడానికి గండికోట రిజర్వాయర్ నుంచి సుబ్బరాయసాగర్ ట్యాంక్కు లిఫ్ట్ ద్వారా నీరందించే పథకానికి రూ.250 కోట్లు మంజూరు. -
తేడా మీరే చూడండి
దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా, ప్యాకేజీ పార్టీలు ఎంతగా చేతులు కలిపినా, నీచ రాజకీయం నిత్యం ఎంత జరుగుతున్నా మీ బిడ్డకు ధైర్యం మీరే. నా నమ్మకం మీరే. నన్ను నడిపించేది మీరే. నా ప్రయాణంలో నేను నిరంతరం ఆధారపడే పరిస్థితి ఉందంటే అది ఆ దేవుడి మీద, మీ మీద మాత్రమే. అందువల్లే వీళ్ల మాదిరిగా నేను పొత్తులు పెట్టుకోవడానికి వెంపర్లాడను. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘గత ప్రభుత్వంలో అరకొర ఫీజులతో పేద పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించలేని దుస్థితి.. నేడు ఫీజు ఎంతైనా సరే.. మేమే చెల్లిస్తామంటూ పూర్తి భారం భుజాన వేసుకున్న ప్రభుత్వం ఇది.. గతంలో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. అప్పుల పెరుగుదల శాతం చూస్తే అప్పటికన్నా ఇప్పుడే తక్కువ.. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు.. గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారో ఆలోచించండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను కోరారు. దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) విధానాన్ని నడిపిన గత ప్రభుత్వానికి.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానాన్ని ఆచరిస్తున్న మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరే గమనించాలని అన్నారు. విప్లవాత్మక కార్యక్రమాలు, సంస్కరణలతో విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న మనందరి ప్రభుత్వంలో ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కానేకాదని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం ఆయన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా 2022 అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేశారు. 9.86 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ కంప్యూటర్లో బటన్ నొక్కి రూ.698.68 కోట్లను నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. చదువుతోనే వెలుగు ► ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లోంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మన పిల్లలకు మనం చెరగని ఆస్తి ఏదైనా ఇస్తున్నామంటే అది చదువు మాత్రమే. ► ఈ రోజు 17–20 ఏళ్ల మధ్య ఉన్న నేటి తరం మరో 80 ఏళ్ల పాటు వాళ్ల జీవితాలు సాఫీగా సాగాలంటే మెరుగైన జీతాలతో, మెరుగైన ఆదాయాలతో వాళ్ల బతుకులు సాగాలంటే వాళ్ల ప్రయాణాన్ని, జీవిత ప్రమాణాన్ని రెండింటినీ నిర్దేశించేది ఒక్క చదువు మాత్రమే. ► అందుకే మన రాష్ట్రంలో ఇవాళ ఎల్కేజీ లేదా పీపీ1 నుంచి చదువులు ప్రారంభిస్తున్న బిడ్డ దగ్గర నుంచి, ఆ బిడ్డ ఎదిగి మంచి డాక్టరో, ఇంజినీరో కావాలి. ఢిల్లీరావు శ్రీకాకుళం జిల్లాలో అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి వచ్చారు. ఇవాళ కలెక్టర్గా మీ కళ్లముందు కనిపిస్తున్నారు. ఇలా అందరి బతుకులు మారాలి. ఫీజులు ఎంతైనా సరే.. ► చదువులకు పేదరికం అడ్డు రాకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను గొప్పగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో కాలేజీల ఫీజులు రూ.70 వేలు, రూ.80 వేలు, రూ.1 లక్ష నుంచి కొన్ని కాలేజీల్లో రూ.1.20 లక్షలు ఉంటే.. ఇచ్చేదేమో రూ.35 వేలు మాత్రమే. అది కూడా ఎప్పుడిస్తారో తెలియదు. ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా చూశాం. ► మనందరి ప్రభుత్వం రాగానే ఆ పరిస్థితి పూర్తిగా మారుస్తూ 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకొకసారి ఫీజులు పిల్లల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మాత్రమే 27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ రూ.9,947 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో చివరి రెండేళ్లు ఎగ్గొట్టిన రూ.1,777 కోట్లు కూడా చిరునవ్వుతో చెల్లించాం. ► ఫీజులు పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల వారికి కాలేజీలను ప్రశ్నించే హక్కు ఇస్తున్నాం. పిల్లల బాగోగులూ స్వయంగా తెలుసుకోవచ్చు. యాజమాన్యాల నుంచి ఇబ్బంది ఉంటే నేరుగా 1902కు ఫోన్ చేస్తే, సీఎంఓ నేరుగా కాలేజీలతో మాట్లాడుతుంది. ► వసతి దీవెన కింద ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఏటా రూ.20 వేలు చొప్పున రెండు దఫాలుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 11న ఇవ్వాలని నిర్ణయించాం. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి ► మన పిల్లలు బాగా చదవాలని, ప్రపంచంతో పోటీ పడాలని ఇవన్నీ చేస్తున్నాం. మన పిల్లలు ప్రతి ఒక్కరూ సత్య నాదేళ్ల మాదిరిగా కావాలని మీ అన్న తపన పడుతున్నాడు. అందుకే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు 45 నెలల్లో రూ.13,311 కోట్లు ఖర్చు చేశాం. అందువల్లే కాలేజీల్లో చేరికలు బాగా పెరిగాయి. 2018–19లో 87,439 మంది పిల్లలు ఇంజినీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరితే, 2022–23లో ఆ సంఖ్య 1.20 లక్షలకు చేరింది. ► ఇంటర్ పాసై చదువుకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018–19లో 81,813 ఉంటే, 2022–23లో ఆ సంఖ్య 22,387కు తగ్గిపోయింది. ఈ సంఖ్య సున్నా కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పని చేస్తోంది. 2018–19లో 37 వేలు ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్లు 2021–22లో ఏకంగా 85 వేలకు చేరింది. ► ఇంటర్ తర్వాత చదువు ఆపేసిన విద్యార్థుల సంఖ్య దేశంలో సగటున 27 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది 6.62 శాతం మాత్రమే. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్ – అంటే 17–23 ఏళ్ల పిల్లలు కాలేజీల్లో చదవడం) 2018–19లో దేశం సగటు 32.4 శాతం ఉంటే మన రాష్ట్రంలో 70 శాతం లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ► అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, నాడు–నేడు, బైలింగువల్ టెక్టŠస్ బుక్స్, ఇంగ్లిష్ మీడియం తదితర కార్యక్రమాలతో పాటు ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్తో డిజిటల్ క్లాసు రూములు కాబోతున్నాయి. నాడు–నేడు పూర్తి చేసుకున్న 15,270 స్కూళ్లల్లో 6వ తరగతి, ఆపై ఉన్న స్కూళ్లు దాదాపు 5,800 ఉన్నాయి. వీటిలో 30,230 క్లాస్ రూమ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ పెట్టి తరగతి గదులను డిజిటలైజ్ చేయబోతున్నాం. 8వ తరగతిలో అడుగు పెట్టిన ప్రతి పిల్లాడికి ట్యాబ్స్ ఇస్తున్నాం. పదో తరగతి బోర్డు పరీక్షలు సీబీఎస్ఈ సిలబస్లో రాసేలా తర్ఫీదు ఇస్తున్నాం. ఉన్నత విద్యలోనూ మార్పులు ► హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మార్పులు తీసుకొచ్చాం. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీగా మార్చాం. ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్నాం. కరిక్యులమ్తో అనుసంధానం చేస్తూ ఆన్లైన్ వర్టికల్స్ను తీసుకొచ్చాం. జాబ్ ఓరియెంటెడ్గా మార్చుకుంటూ పోతున్నాం. ఆన్లైన్ సర్టిఫికేషన్ తీసుకొచ్చాం. మైక్రోసాప్ట్, ఏడబ్ల్యూఎస్, నాస్కామ్, సేల్స్ఫోర్స్, ఆల్టో వంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేట్టుగా ఉచితంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. ► ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీ పడలేవు అన్న మాటను రెండేళ్లలో తుడిచేస్తాం. రెండేళ్ల తర్వాత కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడలేకపోతున్నాయనేలా చేస్తాం. ► మనబడి నాడు–నేడుతో 46,447 స్కూళ్లు, కాలేజీలలో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మార్పు చేస్తున్నాం. కొత్తగా 14 డిగ్రీ కళాశాలను తీసుకొచ్చాం. జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీని విజయనగరంలో, ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఒంగోలులో, వైఎస్సార్ అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని కడపలో ఏర్పాటు చేశాం. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని పెట్టాం. ఈ ఏడాది పులివెందులలో అగ్రికల్చర్ కాలేజీ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ► వైద్య, విద్యా రంగం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను నాడు–నేడుతో రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో పిల్లల జీవితాలను మార్చే కార్యక్రమాలు. ఇంటింటా ఆనందం.. అదే సర్కారు లక్ష్యం ► ఒకే ఇంట్లో ఉన్న అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, పిల్లలు, రైతుల పట్ల కానీ, సమాజంలో అణిచివేతను ఎదుర్కొన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల కానీ, నిరుపేదల పట్ల కానీ నిండు మనస్సుతో స్పందించే హృదయం నాది. అందువల్లే ఈ రోజు సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం.. తదితర వాటిని కర్తవ్యంగా, దైవకార్యాలుగా భావించి ముందుకు తీసుకువెళ్తున్నాం. ► గడప గడపలో సంతోషం చూడాలని, ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనస్సు మన ప్రభుత్వానిది. ఈ రోజు మన రాష్ట్రంలో ఏ పేద ఇంటికి వెళ్లినా, గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా మీ అన్న ప్రభుత్వం గత 45 నెలలుగా పాలన అందిస్తోంది. ఎలాంటి వివక్ష, లంచాలకు చోటు లేకుండా నేరుగా రూ.1.98 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. తోడేళ్లు ఏకమవుతున్నాయి.. ► మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదంటున్న దుష్ట చతుష్టయం ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతోంది? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి? ఏ విషయంలోనూ మనతో పోల్చుకునేందుకు అర్హత లేని వారంతా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? మనందరి ప్రభుత్వంపై ఎందుకు రాళ్లు వేస్తున్నారు? వారు చెబుతున్నదే నిజమైతే ఒంటరిగా 175 నియోజక వర్గాల్లో పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా. ఈ సవాల్ స్వీకరించే దమ్ము, ధైర్యం మీకుందా? ► దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్ ఎవరో తెలుసా? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు. వీళ్లందరికీ తోడు వీరి దత్తపుత్రుడు. కుటుంబ, మానవత, రాజకీయ విలువలు లేని ఈ దుష్ట చతుష్టయంతో ఇవాళ మనం యుద్ధం చేస్తున్నాం. వారు ఎన్ని కుతంత్రాలు పన్నినా చివరకు మంచే గెలుస్తుంది. ► రామాయణం చూసినా, భారతం చూసినా, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా.. ఏ సినిమాకు వెళ్లినా అదే కనిపిస్తుంది. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా నిరుపేద అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు నిండు మనసుతో ఆశీర్వదిస్తుండగా, ఆ దేవుడు దీవిస్తుండగా అడుగులు ముందుకు వేస్తున్నాను. తిరువూరుకు వరాలు ► తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అడిగారు. కట్టలూరు వాగు మీదుగా హైలెవల్ బ్రిడ్జి కోసం రూ.26 కోట్లు మంజూరు చేస్తున్నాం. ► ఎ.కొండూరులో కిడ్నీ బాధితులను దృష్టిలో ఉంచుకుని కృష్ణా జలాల సరఫరా కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నాం. ► దాదాపుగా 8వేల పై చిలుకు ఇంటి స్థలాలు ఇచ్చాం. 4 వేల ఇళ్లు మంజూరై వేగంగా కడుతున్నారు. మరో 6 వేల ఇళ్లు కావాలన్నారు. అవి కూడా మంజూరు చేస్తున్నాం. పది వేల ఇళ్లు అంచనాగా తీసుకుంటే వీటి ఖరీదు దాదాపు రూ.250 కోట్లు. ► రోడ్ల మరమ్మతు కోసం రూ.10 కోట్లు, డ్రైనేజీ కోసం రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ స్కిల్ సెంటర్ (ఐటీఐ, పాలిటెక్నిక్ తరహాలో) వస్తుంది. -
నా ధైర్యం మీరే.. నా నమ్మకం మీరే.. నన్ను నడిపించేది మీరే
తాడేపల్లి : దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా తన ధైర్యం, తన నమ్మకం ప్రజలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తిరువూరు సభలో మాట్లాడిన కొన్ని అంశాలను మరొకసారి ట్వీట్ చేశారు సీఎం జగన్. ‘దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా… ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా… నా ధైర్యం మీరే… నా నమ్మకం మీరే… నన్ను నడిపించేది మీరే… నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడే పరిస్ధితి ఉంటే అది ఆ దేవుడి మీదా.. మీ మీద మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా’ అని పేర్కొన్నారు. కాగా, ఈరోజు(ఆదివారం) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. దుష్టచతుష్టయం చేస్తున్న కుతంత్రాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నిత్యం మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న ఈ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తోందో తెలుసా ? కుటుంబ విలువలు, మానవతా విలువలు, రాజకీయ విలువలు లేని ఒక దుష్ట చతుష్టయం అన్న వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. ఆలోచన చేయండి. ఇలాంటి దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. ఇవాళ ఆ దుష్టచతుష్టయాన్ని ఒక్కటే అడుగుతున్నాను. నేను వారికి సవాల్ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే.. వారు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు ? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ? గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాల మీద కానీ, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, అవ్వాతాతలకు అందించిన సంక్షేమ ఫలాలు మీద కానీ మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వీరంతా కూడా మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా… ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా… నా ధైర్యం మీరే…. నా నమ్మకం మీరే… నన్ను నడిపించేది మీరే…. నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడే పరిస్ధితి ఉంటే అది ఆ దేవుడి మీదా, మీ మీద మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా. pic.twitter.com/DCkwTvaSPG — YS Jagan Mohan Reddy (@ysjagan) March 19, 2023 ఇక్కడ చదవండి: ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి?: సీఎం జగన్ -
జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో సీఎం జగన్ (ఫోటోలు)
-
ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి?: సీఎం జగన్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అర్హతలేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నారు.. పొత్తుల కోసం వీళ్లంతా వెంపర్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. జగనన్న విద్యా దీవెన కింద సీఎం జగన్.. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ, మనది డీబీటీ అయితే వాళ్లది డీపీటీ అని విమర్శించారు. మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్.. గత ప్రభుత్వంలో డీబీటీ.. దోచుకో, పంచుకో, తినుకో’’ అంటూ సీఎం దుయ్యబట్టారు. ‘‘సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్లు కాదని.. చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. గతంతో పోలిస్తే ఈ బిడ్డ ప్రభుత్వంలో అప్పులు తక్కువ’’ అని సీఎం చెప్పారు. 9.86 లక్షల మందికి మంచి చేసే కార్యక్రమం దేవుడి దయతో ఈ రోజు మరోమంచి కార్యక్రమాన్ని తిరువూరు నుంచి ప్రారంభిస్తున్నాం. దాదాపుగా 9.86 లక్షల మంది పిలల్లకు మంచి చేస్తూ... నేరుగా బటన్ నొక్కి 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా దాదాపు రూ.700 కోట్లు జమ చేస్తున్నాం. విద్యాదీవెన కార్యక్రమం గురించి నాలుగు మాటలు చెబుతాను.. భవిష్యత్తు బాగుండాలనే.... ఈ కార్యక్రమం వలన ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లోంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజు నేను గట్టిగా నమ్మే అంశం.. మన పిల్లలకు మనం చెరగని ఆస్తి ఏదైనా ఇస్తున్నామంటే అది చదువు మాత్రమే. చీకటి నుంచి వెలుగులోకి చదువుతోనే సాధ్యం... అజ్ఞానాన్ని చీకటితోనూ, విజ్ఞానాన్ని వెలుగుతోనూ పోల్చుతుంటాం. అలాంటి చీకటి నుంచి వెలుగులోనికి, ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే.. అది సాధ్యమయ్యేది ఒక్క చదువుతోనే.మనిషి తలరాతను కానీ, కుటుంబం తలరాతను కానీ, వెనుకబడిన కులాల తలరాతలు కానీ, దేశాల తలరాతలనైనా మార్చగలిగిన శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. ఈ రోజు 17 నుంచి 20 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న నేటి తరం మరో 80 సంవత్సరాలు పాటు వాళ్ల జీవితాలు సాఫీగా జరగాలంటే మెరుగైన జీతాలతో, మెరుగైన ఆదాయాలతో వాళ్ల బ్రతుకులు సాగాలంటే వాళ్ల ప్రయాణాన్ని, జీవిత ప్రమాణాన్ని రెండింటినీ నిర్ధిశించేది ఒక్క చదువు మాత్రమే. కాబట్టి మన రాష్ట్రంలో ఇవాళ ఎల్కేజీ లేదా పీపీ1 నుంచి చదువులు ప్రారంభిస్తున్న బిడ్డ దగ్గర నుంచి, అక్కడ మొదలైన ఆ బిడ్డ జీవితం ఎదిగి మంచి డాక్టరో, ఇంజనీరో కావాలి. మన కళ్లెదుటే కనిపిస్తున్న కలెక్టర్ ఢిల్లీరావు అత్యంత సాధారణమైన కుటుంబం, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇవాళ కలెక్టర్గా మీ కళ్లముందు కనిపిస్తున్నారు. ఇలా బ్రతుకులు మారాలి. చదువుకు పేదరికం అడ్డం రాకూడదని... మన జీవితాలు మారాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. అలాంటి చదువులకు పేదరికం అడ్డు రాకూడదు. పిల్లలు పెరగాలి, ఎదగాలి. పేదరికం వల్ల చదువులు మానేస్తున్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి తమ్ముడుకూ అన్నగా... ఆ చదువులుకు భరోసా ఇస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో జగనన్న విద్యాదీవెన పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నాం. ఈ రోజు ఇలాంటి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం ద్వారా చదువులు అందిస్తూ... పిల్లలను చేయిపట్టుకుని నడిపిస్తూ.. వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రెండింటి ద్వారా మంచి చేస్తున్న ప్రభుత్వం దేశంలో మీ జగనన్న ప్రభుత్వం మాత్రమే. కాలేజీలు ఫీజులు ఎంతున్నా సరే, పిల్లలు ఎంతమంది చదివినా ఆ పూర్తి ఫీజులు బాధ్యత మీ జగన్ తీసుకుంటాడు. అందులో భాగంగానే ఈరోజు జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని పెద్ద చదువులు చదివిస్తున్న తల్లుల ఖాతాల్లోకి వారి పిల్లల పూర్తి ఫీజు రీయింబర్స్ చేసే కార్యక్రమాన్ని తిరువూరు నుంచి ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వం –అరా కొరా ఫీజులు... గత ప్రభుత్వంలో మనందరికి గుర్తు ఉంటుంది. కాలేజీల ఫీజులు విషయంలో ఎలా ఉండేదో చూశాం. ఫీజులు చూస్తే రూ.70, రూ.80వేలు, రూ.1 లక్ష నుంచి కొన్ని కాలేజీల్లో రూ.1.20 లక్షలు కూడా ఉంటే... ఇచ్చేదేమో అరకొరా ఇచ్చేవారు. ఆ రూ.35 వేలు కూడా ఎప్పుడిస్తారో తెలియదు. సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టిన పరిస్థితులు చూశాం. ఆ కాలేజీల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రుల పడుతున్న అవస్ధలు చూశాం. ఆ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా చూశాం. తల్లిదండ్రుల అవస్ధ మార్చాలనే... ఈ రెండింటిని మార్చాలని అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేగంగా ముందుకు వేశాం. ఫీజులు ఎంత ఉన్నా రూ.60వేలు, రూ.70, నుంచి రూ.1.20 లక్షల వరకు ఎంతైనా కానీ, ఎంతమంది పిల్లలు కుటుంబం నుంచి చదివినా, ఆ ఫీజులు కొరకు ఏ తల్లితండ్రీ అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ఫీజులు కట్టలేక పిల్లలు చదువు మానేసే పరిస్థితి రాకూడదని, అలా జరగకూడదని మీకు తోడుగా నిలబడేందుకు మీ జగన్ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ కోసం ఉన్నాడు. ప్రతి విద్యాసంవత్సరంలో కూడా ఫీజులు చెల్లించడమే కాదు, సమయానికి చెల్లించాలి. అలా చెల్లిస్తేనే పిల్లలు ఇబ్బంది పడకుండా చదువులు ముందుకు సాగిస్తారు. ఈ ఉద్దేశ్యంతోనే ప్రతి మూడు నెలలకొకసారి అంటే ఏ క్వార్టర్కు ఆ క్వార్టర్ అయినవెంటనే దానికి సంబంధించిన ఫీజులు పూర్తిగా వాళ్ల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాల 9.86 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.698 కోట్లు జమ చేస్తున్నాం. 27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ... రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఎలాంటి బకాయిలు లేకుండా నూటికి నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ... జగనన్న విద్యాదీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా 27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ రూ. 9,947 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో చివరి రెండు సంవత్సరాలు 2017–18, 2018–19కు సంబంధించి తాను ఎగ్గొట్టి పోయిన రూ.1777 కోట్లు కూడా చిరునవ్వుతో మీ అన్న ప్రభుత్వమే చెల్లించింది. ఆ పెద్దమనిషి బకాయిలు పెట్టి పోతే మీ అన్న ప్రభుత్వమే చెల్లించింది. ప్రశ్నించే హక్కు కోసం తల్లుల ఖాతాల్లో జమ... మరో విషయం కూడా చెప్పాలి. ఈ ఫీజులు మొత్తం కూడా నేరుగా కాలేజీలకు ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఇదొక గొప్ప మార్పు. కారణం ఆ తల్లులకు కాలేజీలను ప్రశ్నించే హక్కు వారికి ఇవ్వడం కోసం ఇలా చేస్తున్నాం. ఆ తల్లులు ప్రతి మూడు నెలలకొకసారి కాలేజీలకు వెళ్లి, తమ పిల్లల బాగోగులు తెలుసుకుని స్వయంగా వాళ్లే ఫీజులు కట్టే కార్యక్రమం జరగాలని, కాలేజీలో వసతులు లేకపోతే వాటిని కల్పించమని కాలేజీలను ప్రశ్నించే హక్కు ఆ తల్లులకు రావాలని ఈ మంచి కార్యక్రమానికి మార్పులు చేశాం. కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా వినకపోతే ఆ తల్లులు 1902కు ఫోన్ చేస్తే... నేరుగా మీ బిడ్డ ప్రభుత్వంలోని సీఎంఓ నేరుగా కాలేజీలతో మాట్లాడుతుంది. పిల్లలకు ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా, వారికి వసతి కోసం, భోజనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని, ఆ ఖర్చులు కూడా భారం కాకూడదని, తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఐటీఐ చదువుతున్న విద్యార్ధులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్ధులకు రూ.15వేలు, మెడిసిన్, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న పిల్లలకు సంవత్సరానికి రూ.20వేలు రెండు దఫాలుగా జగనన్న వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించి వసతి దీవెన రెండో దఫా కింద ఇచ్చే సొమ్ము కూడా ఏఫ్రిల్ 11న ఇవ్వాలని నిర్ణయించాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని.... నా పిల్లలు బాగా చదవాలని, నా పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ఇవన్నీ చేస్తున్నాం.మన పిల్లలు ప్రతి ఒక్కరూ సత్య నాదేళ్ల మాదిరిగా కావాలని మీ అన్న తపన పడుతున్నాడు. ఈ విద్యాదీవెన, వసతి దీవెన కేవలం ఈ రెండు పథకాలకు 45 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.13,311 కోట్లు ఖర్చు చేసింది. చిన్న ఉదాహరణ కూడా చెబుతాను. జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన ఈ రోజు ఈ రెండు పథకాల వల్ల ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులలో చేరుతున్న విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018–19లో 87,439 మంది పిల్లలు ఇంజనీరింగ్ వంటి వృత్తివిద్యాకోర్సులను చదవడానికి ఎంచుకుంటే... 2022–23 సంవత్సరానికి ఆ సంఖ్య 1.20 లక్షల మందికి చేరింది. కారణం నా చదువులకు మా జగనన్న తోడుగా ఉన్నాడన్న భరోసా ఆ తల్లులకు, పిల్లలకు ఉంది కాబట్టే. ఇంటర్ పాసై చదువుకు దూరమైన విద్యార్ధుల సంఖ్య 2018–19లో 81,813 మంది అయితే మన ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల ద్వారా 2022–23కు వచ్చే సరికి ఈ సంఖ్య 22,387 కు తగ్గిపోయింది. ఈ సంఖ్య కూడా ఉండకూడదు. ఇది కూడా సున్నా కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. 2018–19లో 37వేలుగా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్లు 2021–22 నాటికి క్యాంపస్ ప్లేస్మెంట్లు ఏకంగా 85వేలకు చేరింది. ఇంటర్ తర్వాత చదువు ఆపేసిన విద్యార్ధుల సంఖ్య దేశంలో సగుటున 27శాతం అయితే మన రాష్ట్రంలో అది 6.62 శాతం మాత్రమే. ఈ రోజు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియా( జీఈఆర్) అంటే 17 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు బడిబాట పట్టి కాలేజీలలో చదవాలని మాట్లాడుతారు. జీఈఆర్ రేషియో 2018–19లో దేశం సగటు 32.4శాతం ఉంటే మన రాష్ట్రంలో 70 శాతానికి తీసుకుని పోవాలని తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. మీ పిల్లల చదువుల బాధ్యత నాది.... ప్రతి అక్కకూ మంచి తమ్ముడుగా, ప్రతి చెల్లికి మంచి అన్నగా ఒక మాట చెబుతున్నాను. మీ పిల్లల చదువులకు బాధ్యత నాది అని మాట ఇస్తున్నాను. అమ్మఒడితో మొదలుపెడితే గోరుముద్ద, విద్యాకానుక, నాడు నేడు వంటి మంచి కార్యక్రమాలతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లిషుతో బైలింగువల్ టెక్ట్స్బుక్స్, మారుతున్న స్కూళ్లు రూపురేఖలు, ఆరోతరగతి నుంచి ప్రతి తరగతి గది కూడా ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్తో డిజిటల్ క్లాసురూములు కాబోతున్నాయి. అందులో భాగంగా నాడు నేడు పూర్తి చేసుకున్న 15,270 స్కూళ్లల్లో 6వతరగతి పై ఉన్న స్కూళ్లు దాదాపు 5,800 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 30,230 క్లాస్ రూమ్లలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ పెట్టి తరగతి గదులను డిజిటలైజ్ చేయబోతున్నాం. 8వతరగతిలో అడుగుపెట్టిన ప్రతి పిల్లాడికి కూడా నా పుట్టిన రోజునాడు ఆ పిల్లలను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలన్న తపనతో వారికి ట్యాబ్స్ ఇచ్చి పదోతరగతివరకు తీసుకునిపోయే కార్యక్రమం చేస్తున్నాం. రెండేళ్ల టైం ఇవ్వండి.... రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి, ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడలేవు అన్న మాటను తుడిచేస్తాను. రెండు సంవత్సరాలు టైం ఇస్తే.. కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా చేస్తాను. ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్రూం డిజిటలైజ్ అవ్వబోతుంది. ఒక్కసారి ప్రభుత్వ బడులు డిజిటలైజ్ అయిపోతే ప్రైవేటు వాళ్లు కూడా పోటీపడక తప్పదు. 8వతరగతి పిల్లలకు ప్రభుత్వ బడులలో ట్యాబులు ఇస్తున్నాం. రెండో సంవత్సరం కూడా ట్యాబులు ఇస్తే... ప్రయివేటు బడులు కూడా 8వతరగతి పిల్లాలకు ట్యాబులు ఇవ్వకతప్పని పరిస్థితుల్లోకి పోతారు. ఉన్నత విద్యలోనూ మార్పులు.... హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఇవాల అక్కడ కూడా చదువులు మారుస్తున్నాం. మూడేళ్ల కోర్సులను నాలుగు సంవత్సరాలు చేసాం. ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్నాం. డిగ్రీ చదువులు ఇంగ్లిషు మీడియంలోకి మార్చాం. కరిక్యులమ్తో అనుసంధానం చేస్తూ ఆన్లైన్ వర్టికల్స్ను తీసుకొచ్చాం. జాబ్ ఓరియెంటెడ్గా కరిక్యులమ్ను మార్చుకుంటూ పోతున్నాం. ఆన్లైన్ సర్టిఫికేషన్ తీసుకొచ్చాం. మైక్రోసాప్ట్, ఏడబ్ల్యూఎస్, నాస్కామ్, సేల్స్ఫోర్స్, ఆల్టో వంటి పెద్ద పెద్ద సంస్ధలన్నీ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేటట్టుగా ఉచితంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. మారనున్న విద్యార్ధుల భవిష్యత్తు.. ఈ పథకాలతో మన విద్యార్ధుల భవిష్యత్తు, మన విద్యాసంస్థల రూపురేఖలు మారనున్నాయి. మనబడి నాడు నేడుతో 46,447 స్కూళ్లు, కాలేజీలలో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మార్పు చేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో పిల్లల జీవితాలను మార్చే కార్యక్రమాలు. మన ప్రభుత్వం వచ్చాక కొత్తగా 14 డిగ్రీ కళాశాలను తీసుకొచ్చాం. ఉన్నతవిద్యకు మరింత ఊతమిచ్చే అనేక చర్యలు తీసుకున్నాం. జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీని విజయనగరంలోనూ, ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఒంగోలులోనూ, వైయస్సార్అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని కడపలో ఏర్పాటు చేశాం. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని పెట్టాం. ఈ యేడాది పులివెందులలో అగ్రికల్చర్ కాలేజీను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వైద్య రంగంలో సమూల మార్పుల దిశగా... అంతే కాకుండా వైద్య, విద్యా రంగం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూడా పూర్తిగా నాడు నేడుతో రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ పిల్లల జీవితాలను బాగుపరిచే కార్యక్రమం కోసం అడుగులు వేస్తున్నాం. నిండు మనసుతో ఈరోజు నిండు మనస్సుతో ఈ బాధ్యతను నెరవేరుస్తున్నాం. ఒకే ఇంట్లో ఉన్న అవ్వతాతల పట్ల కానీ, అక్కచెల్లెమ్మల పట్లకానీ, పిల్లలు, రైతుల పట్ల కానీ, సమాజంలో అణిచివేతను ఎదుర్కొన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల కానీ నిరుపేదల పట్ల కానీ నిండు మనస్సుతో స్పందించే హృదయం నాది. ఈ రోజు సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం వీటన్నింటినీ ఒక కర్తవ్యంగా, దైవకార్యాలుగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నాం. గడప గడపలో సంతోషం చూడాలని, ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనస్సు మన ప్రభుత్వానిది. ఈ రోజు మన రాష్ట్రంలో ఏ పేద ఇంటికి వెళ్లినా, గతంలో ఏ ప్రభుత్వం చేయనంత విధంగా మీ అన్న ప్రభుత్వం గత 45 నెలలుగా పాలన అందిస్తోంది. ఈ 45 నెలల పరిపాలనపై మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయండి. గతాన్ని గుర్తుచేసుకొండి. గతంలో మాదిరిగా కాకుండా ఈ 45 నెలల్లో మీ అన్న, మీ తమ్ముడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆలోచన చేయండి. ఈ 45 నెలల్లో ఎలాంటి వివక్షకు చోటు లేకుండా, లంచాలకు చోటు లేకుండా కేవలం బటన్ నొక్కి నేరుగా రూ.1.98 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు జమ చేశాను. ఎక్కడా ఏ అక్కచెల్లెమ్మను అడిగినా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు అన్న మాట వినిపిస్తుంది. ఏ ఒక్క సిఫార్సుకు తావులేకుండా మా అన్న ఇచ్చాడు అన్న మాట వాళ్లో నోటిలో నుంచి వస్తోంది. ఈ 45 నెలలుగా ఇదీ మీ బిడ్డ పరిపాలన అని చెప్పడానికి గర్వపడుతున్నాను. దుష్టచతుష్టయంతో యుద్ధం... ఇలాంటి మనందరి ప్రభుత్వం నిత్యం మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న ఈ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తోందో తెలుసా ? మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న మీ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తుందో తెలుసా ? కుటుంబ విలువలు, మానవతా విలువలు, రాజకీయ విలువలు లేని ఒక దుష్ట చతుష్టయం అన్న వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. ఆలోచన చేయండి. గతానికి ఇప్పటికీ తేడా చూడండి. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పులు పెరుగుదల శాతం చూస్తే అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారో ఆలోచన చేయండి. దోచుకో, పంచుకో, తినుకో( డీపీటీ)ని నడిపిన ప్రతిపక్షంతో.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్( డిబీటీ) నడుపుతున్న మీ బిడ్డ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్ ఎవరో తెలుసా ? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక చంద్రబాబు. వీళ్లందరికీ తోడు వీరి దత్తపుత్రుడు. తోడేళ్లు ఏకమవుతున్నాయి... ఇలాంటి దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. ఇవాళ ఆ దుష్టచతుష్టయాన్ని ఒక్కటే అడుగుతున్నాను. నేను వారికి సవాల్ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే.. వారు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు ? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ? గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాల మీద కానీ, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, అవ్వాతాతలకు అందించిన సంక్షేమ ఫలాలు మీద కానీ మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వీరంతా కూడా మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు. వీరిని మరోసారి అడుగుతున్నాను. ఎన్నికల బరిలో మంచి చేసిన మనందరి ప్రభుత్వాన్ని 175 కు 175 సీట్లలో ముఖాముఖి, ఒంటరిగా ఎదుర్కునే సత్తా వీరికుందా అని అడుగుతున్నాను. దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతన్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా, ప్యాకేజీ పార్టీలు ఎంతగా చేతులు కలిపినా, నీచ రాజకీయం నిత్యం ఎంత జరుగుతున్నా కూడా మీ బిడ్డకు ధైర్యం మీరే. నా నమ్మకం మీరే. నన్ను నడిపించేది మీరే. నా ప్రయాణంలో నేను నిరంతరం ఆధారపడే పరిస్థితి ఉంటే అది ఆ దేవుడు మీద, మీ మీద మాత్రమే. వీళ్ల మాదిరిగా నేను పొత్తులు పెట్టుకోవడానికి వెంపర్లాడను. వీళ్ల మాదిరిగా నేను ఆరాటపడను. కారణం నేను నమ్ముకున్నది ఈ పొత్తులు మీద కాదు. నేను నమ్ముకున్నది ఆ దేవుడుని, మిమ్నల్నే. వీళ్లందరికీ ఛాలెంజ్ విసురుతున్నాను. ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా చివరకు మంచే గెలుస్తుంది. రామాయణం చూసినా అదే కనిపిస్తుంది. భారతం చూసుకున్నా అదే కనిపిస్తుంది. బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా అదే ఏ సినిమాకు వెళ్లినా కూడా ఆ సినిమాలో హీరోనే నచ్చుతాడు కానీ, విలన్లు నచ్చరు. దేవుడు ఆశీర్వదించాలని మీ అందరి చల్లని దీవెనలు బిడ్డపై ఎల్లప్పుడూ ఉండాలని, కొండంత అండగా నిలబడిన నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా నిరుపేద అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు వీరందరూ నిండు మనసుతో నాకు తోడుగా నిలబడాలని, మంచి జరిగిన ప్రతి ఇళ్లూ కూడా మీ బిడ్డకు అండగా నిలవాలని నిండు మనస్సుతో కోరుకుంటూ చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్ధిస్తున్నాను. చివరిగా... తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధిగారు కొన్ని అభివృద్ది కార్యక్రమాలు అడిగారు. కట్టలూరు వాగు మీదుగా హైలెవల్ బ్రిడ్జి గురించి అఢిగారు. దానికోసం రూ.26 కోట్లు అవసరం కాగా.. దాన్ని మంజూరు చేస్తున్నాను. ఏ.కొండూరులో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీరికి మంచి చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. అయినా శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం కోసం కృష్ణా జలాలు మంచినీటి సరఫరా కోసం రూ.50 కోట్లు ఖర్చవుతుందన్నారు. అవి కూడా కేటాయిస్తున్నాను. దాదాపుగా 8వేలపై చిలుకు ఇంటి స్ధలాలు ఇచ్చాం. 4 వేల ఇళ్లు మంజూరై ఇళ్లు వేగంగా కడుతున్నారు. మరో 6వేల ఇళ్లుకావాలన్నారు. అవి కూడా మంజూరు చేస్తున్నాను. పదివేల ఇళ్లు అంచనాగా తీసుకుంటే ఈ ఇళ్ల ఖరీదే దాదాపు రూ.250 కోట్లు. అదే విధంగా రోడ్ల రిపేరు కోసం రూ.10 కోట్లు అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. రూ.4 కోట్లతో డ్రైనేజీ కోసం మంజూరు చేస్తున్నాం. పాలిటెక్నిక్ కాలేజీ అడిగారు. ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీ, డ్రాపౌట్స్ కోసం ప్లంబర్లు, ఏసీ మెకానిక్స్ వంటి స్కిల్ ఎన్హేన్స్మెంట్ కోర్సులు) ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంది. రాబోయే రోజుల్లో స్కిల్ సెంటర్ ఇక్కడ వస్తుంది. వీటన్నింటి ద్వారా మంచి జరగాలని ఆశిస్తున్నాను అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. చదవండి: రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది: కన్నబాబు -
సీఎం జగన్ కు విద్యార్థులు, వారి తల్లుల ఘన స్వాగతం
-
జగనన్న విద్యాదీవెన: తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
Updates: ►జగనన్న విద్యా దీవెన కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. సీఎం జగన్ ప్రసంగం: ♦సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్లు నచ్చరు.. ♦ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ♦చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు ♦ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ♦పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు ♦అర్హతలేని వారు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు ♦విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం ♦కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం ♦మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ♦గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో, తినుకో.. ♦కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం ♦17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి ♦45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించాం ♦ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నాం ♦ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నాం ♦ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు ♦ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది ♦జీఈఆర్ రేషియో 32 నుంచి 72 శాతానికి తీసుకెళ్లే దిశగా అడుగులు ♦ప్రభుత్వ బడులు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నాం ♦మీ పిల్లల చదువులకు నాది బాధ్యత ♦ఉన్నత విద్యకు మరింత ఊతమిచ్చే చర్యలు తీసుకున్నాం ♦8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తున్నాం ♦రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం ♦ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి తెస్తాం ♦పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టాం: సీఎం జగన్ ♦పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే ♦ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యం ♦ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. ♦ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే ♦కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నంచి వచ్చిన వ్యక్తి ♦చదువుకు పేదరికం అడ్డుకాకూడదు ♦దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు ♦కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే ♦గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు ♦ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు ♦లంచాలు, వివక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధులు జమ చేస్తున్నాం ♦గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగా ఇచ్చేవాళ్లు ♦ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారు ♦తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి ♦అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం ♦జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చాం ♦27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం ♦చంద్రబాబు హయాంలోని బకాయిలను సైతం చెల్లించాం ♦విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నాం ♦తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుంది ♦కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతాం ►సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు.. కాసేపట్లో నాలుగో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. సీఎం జగన్కు ఘన స్వాగతం ►కొద్దిసేపట్లో మార్కెట్ యార్డ్లోని సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. ►తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, మంత్రి బొత్స సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్,ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మేకా ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. ►జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా తిరువూరు వాహినీ కాలేజ్ గ్రౌండ్స్లోని హెలీప్యాడ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ► జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ►గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ► జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ► కరిక్యులమ్లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ► ఇంటర్ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది. ► 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది. ► 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశేషం. విద్యా రంగంపై జగన్ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. ► 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తోంది. -
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ పర్యటన
-
నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది.ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ► జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ► కరిక్యులమ్లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ► ఇంటర్ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది. ► 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది. ► 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశేషం. విద్యా రంగంపై జగన్ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. ► 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తోంది. నేడు సీఎం వైఎస్ జగన్ తిరువూరు పర్యటన తిరువూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 19న (ఆదివారం) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. 11 గంటల నుంచి 12.30 గంటల వరకు మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. అనంతరం విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
AP Budget 2023-24: విద్యా రంగానికి పెద్దపీట.. ఎన్ని కోట్లు కేటాయించారంటే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు, విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్లను పంపిణీ చేసింది. జగనన్న అమ్మ ఒడి. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ. 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతోంది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కిందరూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యాకానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్లు, బూట్లు, సాక్స్లు, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు, స్కూల్ బెల్ట్, మాస్క్ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ►2023-24 బడ్జెట్లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు ►2013-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ►జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు జరిగింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ►ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. -
అటు మూత.. ఇటు కోత
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏటా కనీసం 50కిపైగా ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. మరికొన్ని వేల సంఖ్యలో కోర్సులను రద్దు చేసుకుంటున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు ఏర్పాటు కావడం, కొన్ని కోర్సులకే ఆదరణ ఉండటం, చేరికలు తగ్గి కాలేజీల నిర్వహణ భారంగా మారడం, నైపుణ్యాలు కొరవడి ప్లేస్మెంట్లు తగ్గిపోవడం ఈ దుస్థితికి కారణమని నిపుణుల కమిటీలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల కమిటీల సూచనల మేరకు ఏఐసీటీఈ 2019లో కొత్త కాలేజీలకు అనుమతులపై మారటోరియం విధించింది. 2014–15 నుంచి జాతీయస్థాయిలో 767 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడినట్లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి 2021–22 నివేదికలో వెల్లడించింది. మరికొన్ని కాలేజీలు ఆదరణ లేకపోవడంతో 10,539 కోర్సులను రద్దు చేసుకున్నాయి. 2021–22 నాటికి దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక కోర్సుల్లో 24 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014–15లో మొత్తం సీట్ల సంఖ్య 31.8 లక్షలు కాగా తరువాత నుంచి ఏటా తగ్గుతూ వస్తోంది. ఏడెనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో సగం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇదీ జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సుల పరిస్థితి నేడు రాష్ట్రంలో వెన్నుతట్టి ప్రోత్సాహం విద్యారంగ సంస్కరణలు చేపట్టి ఉన్నత చదువులు ఏమాత్రం భారం కాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు అయ్యే మొత్తం ఫీజును జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతి త్రైమాసికంలో నిర్దిష్టంగా చెల్లిస్తూ చదువులకు భరోసా కల్పిస్తోంది. అంతేకాకుండా వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున విద్యార్థులకు అందజేస్తోంది. మరోవైపు గత సర్కారు బకాయిపెట్టిన ఫీజులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 తరువాత రాష్ట్రం నుంచి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా మూసివేత కోసం దరఖాస్తు చేయలేదని ఏఐసీటీఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. ► అన్ని కాలేజీల్లో నిబంధనల ప్రకారం సదుపాయాలు, బోధనా సిబ్బంది, న్యాక్ అక్రిడిటేషన్ తప్పనిసరి. ► సిలబస్లో సంస్కరణలు. కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి. ► ఇంటర్న్షిప్ తప్పనిసరి. స్కిల్ ఆధారంగా 30 శాతం కోర్సులకు రూపకల్పన. ► మైక్రోసాఫ్ట్ ద్వారా 1.62 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధిపై ఉచిత శిక్షణ. ► నాస్కామ్, ఏపీఎస్ఎస్డీసీ సంస్థల ద్వారా యువతకు శిక్షణ కార్యక్రమాలు. ► 2018–19లో రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య 37 వేలు కాగా 2019–20లో 52 వేలకు, 2020–21లో 69 వేలకు, 2021–22లో 85 వేలకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనేందుకు నిదర్శనం. నాడు 65 కాలేజీల మూసివేత టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో 65 కాలేజీల యాజమాన్యాలు తమ విద్యా సంస్థలను మూసివేసినట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత సర్కారు విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కొరవడి అధ్వానంగా మారింది. కాలేజీల ఫీజు ఎంత ఉన్నా రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్గా ఇస్తామనడం, అరకొర ఫీజులు కూడా ఏటా సక్రమంగా ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ విద్య అస్తవ్యస్థమైంది. 2019లో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి కాలేజీలకు రూ.1,800 కోట్ల మేర ఫీజులు బకాయి పెట్టడం గమనార్హం. దీంతో మూసివేత దిశగా విద్యాసంస్థలు సాగాయి. ► పుట్టగొడుగుల్లా వెలిసిన కాలేజీల్లో ఏఐసీటీఈ / ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రకారం మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది ఉండడం లేదు. ధనార్జనే ధ్యేయంగా మొక్కుబడిగా నిర్వహించడంతో ప్రమాణాలు పడిపోయి విద్యార్థులకు నైపుణ్యాలు కొరవడ్డాయి. ఫలితంగా ప్లేస్మెంట్లు సన్నగిల్లాయి. చదువులు ముగియగానే ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారింది. అదనపు నైపుణ్యాలు, సర్టిఫికేషన్ కోర్సులను కూడా పూర్తి చేస్తే కానీ ఉద్యోగాలు దక్కడం లేదు. ► ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ నిరంతరం కొత్త అంశాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో నైపుణ్యాలను సాధించిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. పలు కాలేజీల్లో కోర్సులు, బోధనా వనరులు, సదుపాయాలు లేవు. వరుసగా మూడేళ్లు 25 శాతం కన్నా చేరికలు తక్కువగా ఉండే కాలేజీలు, కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు రద్దు చేస్తోంది. ► ఇండియా స్కిల్ నివేదిక ప్రకారం ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారిలో 48శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. -
ఉన్నత చదువులు చదువుకుంటున్న సామాన్యులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సామాన్యుడికి ఉన్నత చదువు చేరువవుతోంది. బుర్ర నిండా తెలివితేటలు ఉన్నా జేబు నిండా డబ్బు లేకపోవడంతో నిన్నటి తరంలో చాలా మంది ఉన్నత చదువులకు దూరమయ్యారు. కుటుంబ ఆర్థిక స్థితిగతుల మూలాన ఇష్టం లేని కొలువులు, వ్యాపారాలు, చిరుద్యోగాల్లో చేరి సర్దుకుపోయారు. కానీ నేటి తరానికి ఓ ఊతం దొరికింది. ‘నువ్వు చదువుకో.. నేను ఫీజు కడతా’ అంటూ భరోసా ఇచ్చే నాయకుడు దొరికాడు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని పిల్లలకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో వైఎస్ జగన్ సర్కారు కొండంత అండగా నిలుస్తోంది. ఈ సాయంతో చాలా మంది పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. పేదల బతుకుల్లో వెలుగులు జగన్న విద్యా వసతి, విద్యాదీవెన పథకంతో జిల్లాలో పేదల విద్య సాగుతోంది. ఈ పథకం బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, తదితర కులాలకు చెందిన పేద పిల్లలకు అమలవుతోంది. 2020–21లో రెండు విడతల్లో 64,623 మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకం కింద రూ. 62.33 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన పథకం కింద 67,940 మంది విద్యార్థులకు గాను రూ.67.27 కోట్లు విడుదల చేశారు. 2021–22 సంవత్సరానికి గాను మూడు విడతల్లో 54,764 మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద రూ.81.61 కోట్లు అందించారు. జగనన్న విద్యాదీవెన కింద 68,913 మంది విద్యార్థులకు రూ.63.52 కోట్లను అందజేశారు. ఈ ఏడాది ఇంకా కొన్ని విభాగాల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. అర్హులందరికీ జ్ఞాన భూమి పోర్టల్లో నమోదు చేస్తున్నారు. జగనన్న వసతి, విద్యా దీవెన పథకాలు డబ్బులు నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. విద్యా దీవెన పథకంలో నిర్ణయించిన ఫీజులు చెల్లించగా, వసతి దీవెన పథకం కింద ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నికల్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై తరగతులు చదువుతున్న వారికి రూ.20 వేలు చెల్లిస్తున్నారు. రుణపడి ఉంటాం.. నా పేరు పొదిలాపు పార్వతి. నాది శ్రీకాకుళం మండలం లంకాం గ్రామం. నా భర్త పదేళ్ల కిందటే కాలం చేశారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న పిల్ల దీపిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. పెద్ద పిల్ల గీతిక విశాఖపట్నంలో ఇంజినీరింగ్ చేస్తోంది. మా ఇద్దరు పిల్లలను జగనన్నే చదివిస్తున్నారు. చిన్నపిల్లకు అమ్మ ఒడి వస్తుంది. పెద్ద పిల్లకు విద్యాదీవెన, వసతి దీవెన వస్తుంది. కాలేజీ ఫీజులకు, చదువు పుస్తకాలకు ఖర్చులకు ప్రభుత్వం సాయం మాకు ఎంతో మేలు చేస్తోంది. నేను నా పిల్లలు జగనన్నకు రుణపడి ఉంటాం. నా లాంటి వారికి మేలు నా పేరు పైడి మాధవరావు. మాది శ్రీకాకుళం మండలం వాకలవలస గ్రామం. మాకు స్థిర చరాస్తులు లేవు. కష్టపడి జీవ నం సాగిస్తున్నాం. నేను ఒక ప్రైవేటు వ్యాపారి వద్ద రోజు కూలీగా పనిచేస్తున్నా. నాకు ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. నిజానికి వీరిని పెద్ద చదువులు చదివించే స్థోమత మాకు లేదు. ఇంటర్ చదివేటప్పుడు మా పిల్లలకు అమ్మ ఒడి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరినీ విజయనగరంలోని లెండి ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించా. కేవలం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వస్తుందన్న ధైర్యంతోనే వారి చదువులు సాగుతున్నాయి. కళాశాల ఫీజులు, పిల్లల చదువు ఖర్చులు జగనన్న ఇస్తున్నారు. నాలాంటి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతోంది. (క్లిక్ చేయండి: ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ పాఠాలు) -
‘సామాజిక’ సంచలనం
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం.. అమ్మ ఒడి, విద్యాదీవెన లాంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల దాకా సింహభాగం పదవులిచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయా వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులకు సాధ్యం కాని రీతిలో సీఎం జగన్ సాధికారత దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. చేతల్లో సామాజిక న్యాయం.. ► ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్ 8న తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో కూడిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే అందులో నలుగురు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ► శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్, శాసనమండలి ఛైర్మన్గా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం కల్పించారు. ► 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయంపై సీఎం జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ► టీడీపీ అధికారం ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరికి కూడా రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను (50%) రాజ్యసభకు పంపి సీఎం జగన్ చిత్తశుద్ధి చాటుకున్నారు. ► శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది ఎమ్మెల్సీలు ఉండగా ఇందులో 18 మంది (57 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. స్థానిక సంస్థలలోనూ.. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే అందుకు వ్యతిరేకంగా చంద్రబాబు హైకోర్టులో టీడీపీ నేతలతో కేసులు దాఖలు చేయించారు. దీంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లకు అడ్డుపడ్డా పార్టీపరంగా బీసీలకు 34 శాతం కంటే ఎక్కువగా ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులిచ్చారు. ► రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 మండలాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. ► 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో బీసీలకు 6 (46%) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గా లకు 9 జడ్పీ ఛైర్మన్ పదవులు (69%) ఇచ్చారు. ► రాష్ట్రంలోని 14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) సీఎం జగన్ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలిపితే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే కేటాయించారు. ► 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే 84 చోట్ల వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు (53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు కలిపి 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు. చట్టం చేసి నామినేటెడ్ పదవులు ► నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తూ సీఎం జగన్ చట్టం చేసి మరీ ఆయా వర్గాలకు అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఆయా వర్గాలకు రిజర్వు చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 76 పదవులు(39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. ► ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు(39శాతం) బీసీలకే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆయా వర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 484 పదవుల్లో 280 (58 శాతం) ఆయా వర్గాలకే ఇచ్చారు. ► బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు చెందిన వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులు ఉండగా అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. సంక్షేమంలో సింహభాగం.. ► మూడున్నరేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా రూ.1.77 లక్షల కోట్లను ప్రభుత్వం అందించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.1.31 లక్షల కోట్ల మేర (74 శాతం) లబ్ధి చేకూరింది. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి అన్ని వర్గాలకు మొత్తం రూ.3.19 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే రూ.2.50 లక్షల కోట్ల (79 శాతం) మేర మేలు జరిగింది. -
నాడు మోసగించి, నేడు లెక్చర్లా?
ఫలానా ప్రాంతంలో.. ఫలానా పొలాలను.. ఫలానా రేటుకు అమ్ముకునేందుకు మాత్రమే ఒక రాజధాని కట్టాలన్నది వారి ఆలోచన. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వారు వాదిస్తున్నారు. ఇలాంటి వారి మెదళ్లను మార్చగల చదువులు ఎంతైనా అవసరం. వారికి మంచి జ్ఞానం, మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లల చదువుల కొరకు ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చైనా సరే.. దానిని నేను ఖర్చుగా భావించను. అది నేను నా పిల్లలకిచ్చే ఆస్తిగా భావిస్తాను. ‘మీరు గొప్పగా చదవండి.. మీ చదువులకి పూచీ నాది..’ అని ప్రతి చిట్టి చెల్లెమ్మకు, తమ్ముడికీ చెబుతున్నా. ‘మీ ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా పరవాలేదు.. అంతమందినీ చదివించండి.. మీ అన్న, తమ్ముడు చదివిస్తాడు’ అని ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెబుతున్నా. నేరుగా మీ ఖాతాల్లో పడుతున్న డబ్బును వారం పది రోజుల్లో కాలేజీలకు వెళ్లి చెల్లించండి. పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా విచారించండని విజ్ఞప్తి చేస్తున్నా. మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ.. మనందరి ప్రభుత్వం.. అధికారం చేపట్టి ఈ రోజుకు సరిగ్గా మూడున్నరేళ్లు. ఈ సందర్భంగా మీలో ఒకడిగా, మీ వాడిగా నాతో సమయం పంచుకునేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కాచెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, సోదరుడికి, స్నేహితుడికీ, ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మదనపల్లె నుంచి సాక్షి ప్రతినిధి: ‘రైతులను మోసం చేసిన చంద్రబాబునాయుడు వ్యవసాయం గురించి మాట్లాడుతుండటం విడ్డూరం. పిల్లలకు అన్యాయం చేసి, ఎడ్యుకేషన్ గురించి.. అక్కచెల్లెమ్మలకు ద్రోహం చేసి, మహిళా సాధికారత గురించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలను అవమానించి, అన్యాయం చేసి.. సామాజిక న్యాయం గురించి ఈరోజు లెక్చర్లు దంచుతుంటే.. రాష్ట్ర ప్రజలంతా ఇదేమి ఖర్మరా బాబూ!’ అని అనుకుంటున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇలాంటి కుళ్లిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఉన్న చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ఆయన జగనన్న విద్యా దీవెన పథకం (పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్) కింద 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ నాలుగో ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులు రూ.694 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్థం కాదని.. ప్రతి ఒక్కరూ తమకు తాముగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని ఇవ్వగలగడమే విద్యకు పరమార్థం అని ప్రపంచ ప్రఖ్యాత ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చక్కగా చెప్పారన్నారు. ఈ రోజు అటువంటి ఆలోచనా శక్తి కొరవడిన ప్రతిపక్షాలకు ఎప్పటికైనా అది రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవడానికి వీల్లేదని వాదించే వారి సంస్కారాలు మారాలని, నా వారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి.. మనుషులంతా ఒక్కటే అన్న మానవతావాదంతో కూడిన జ్ఞానం వారందరికీ రావాలని కూడా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పిల్లలకు మనమివ్వగలిగే ఆస్తి చదువులే ► పిల్లలకు మనమివ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువులే. ఏ ఒక్క పాప, బాబు.. చదువులకు పేదరికం అవరోధం కాకూడదని మంచి మనస్సుతో అప్పట్లో ఆ ప్రియతమ నేత, దివంగత నాయకుడు రాజశేఖరరెడ్డి దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ గొప్ప పథకాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ నీరుగార్చుతూ వచ్చాయి. ► చదువుల కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నారో నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. వారి కష్టాలు విన్నాను. నేను ఉన్నాను అని చెప్పాను. అందుకే అధికారంలోకి రాగానే ఆ పరిస్థితులను మారుస్తూ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ► జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను మీ ప్రభుత్వం భుజ స్కంధాలపై మోస్తోంది. హాస్టల్ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేల వరకు సాయం చేసేలా జగనన్న వసతి దీవెన పథకాన్ని అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలోని 2017–18, 2018–19కు సంబంధించి రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెడితే మనందరి ప్రభుత్వం చిరునవ్వుతో వాటిని చెల్లించింది. ► ఈ మూడున్నరేళ్లలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.3,349 కోట్లు.. మొత్తంగా ఈ రెండు పథకాల ద్వారా రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టాం. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు ► ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం. మీ పిల్లలను బడులకు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ‘జగనన్న అమ్మఒడి’ ద్వారా మీకు తోడుగా ఉన్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, మన బడి నాడు–నేడు, బైలింగ్వల్ టెక్ట్స్బుక్స్, బైజూస్తో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూములు.. ఇలా ఎన్నో పథకాలు, కార్యక్రమాల ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ► ఉన్నత విద్యలో కరిక్యులమ్ అంతా కూడా జాబ్ ఓరియంటెడ్గా మార్పులు చేస్తూ వచ్చాం. డిగ్రీలు చదివేటప్పుడే ఇంటర్న్షిప్ తప్పనిసరి చేశాం. ఆన్లైన్ వర్టికల్స్ విత్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చాం. ఆ¯ŒŒ లైన్లో కూడా మంచి కోర్సులు ఎక్కడున్నాయా అని వెదికి పట్టుకుంటున్నాం. వాటిని కూడా మన పిల్లలకు నేర్పిస్తూ.. వాటికి కూడా క్రెడిట్ ట్రాన్స్ఫర్ కింద అనుమతులు ఇస్తున్నాం. ► ప్రఖ్యాత సంస్థలన్నింటితో మాట్లాడి సర్టిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను మన పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యా రంగాన్ని ఉపాధికి చేరువగా తీసుకుపోతున్నాం. మూడున్నరేళ్లలో రూ.55 వేల కోట్లు ► జగనన్న అమ్మఒడి ద్వారా రూ.19,617 కోట్లు, జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.9,051 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా మూడున్నరేళ్లలో రూ.3,349 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా మరో రూ.2,368 కోట్లు ఖర్చు చేశాం. ఎనిమిదో తరగతి పిల్లలు, ఉపాధ్యాయులకు ట్యాబ్లు ఇచ్చేందుకు మరో రూ.685 కోట్లు ఈ డిసెంబర్లో ఖర్చు చేయబోతున్నాం. ► జగనన్న గోరుముద్ద ద్వారా రూ.3,239 కోట్లు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మొదటి ఫేజ్లో రూ.3,669 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశాం. ఈ ఏడాది నాడు–నేడు ఫేజ్ 2 కింద మరో రూ.8 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. వైఎస్సార్ సంపూర్ణపోషణ కోసం రూ.4,895 కోట్లు, శానిటరీ నేప్కిన్స్ అందించే ‘స్వేచ్ఛ’ అనే కార్యక్రమం కోసం రూ.32 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా ఈ మూడున్నరేళ్లలోనే విద్య కోసం మీ జగనన్న ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.55 వేల కోట్లు. ► మనందరి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఏటా మూడు లక్షల మంది పిల్లలు డిగ్రీ పట్టాలు అందుకుంటే.. వారిలో 37 వేల మందికే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలొచ్చేవి. 2021–22లో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 85 వేల మంది పిల్లలకు ఉద్యోగాలొచ్చాయి. మదనపల్లెకు వరాల జల్లు నా సోదరుడు, ఎమ్మెల్యే నవాజ్ మదనపల్లి అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాలు అడిగారు. మెడికల్ కాలేజీ ఇప్పటికే మంజూరు చేశాం. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ నెలలోనే పనులు మొదలవ్వనున్నాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 2 వేల అడుగుల లోతుకు బోరు వేస్తే తప్ప తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలన్న తపనతో వాటర్ గ్రిడ్ కోసం రూ.1,800 కోట్లు మంజూరు చేశాం. ఇందులో మదనపల్లెకే రూ.400 కోట్లు వస్తుంది. మున్సిపాల్టీ అభివృద్ధి కోసం రూ.38 కోట్లు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మొలకలచెరువు నుంచి మదనపల్లె ఎన్హెచ్ రోడ్డుకు రూ.400 కోట్లతో, మదనపల్లె– తిరుపతి ఎన్హెచ్ రోడ్డుకు మరో రూ.1,600 కోట్లతో మంజూరు ఇప్పించాం. మీ అందరి కోరిక మేరకు మదనపల్లె బీటీ కాలేజీని ప్రభుత్వంలో విలీనం చేశాం. మదనపల్లె టిప్పుసుల్తాన్ మసీదు కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నాం. మదనపల్లె నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం రూ.30 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చారు. వాటిని కూడా ఆమోదిస్తున్నాను. మదనపల్లె టౌన్ పరిధిలో 3 బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడం కోసం మరో రూ.14 కోట్లు అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. బహుదా నదిపై బ్రిడ్జి కోసం అవసరమైన మరో రూ.7 కోట్లు కూడా ఇస్తున్నాం. వీటిన్నింటి ద్వారా మదనపల్లెకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. పెత్తందార్ల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు ► నవరత్నాల పాలనతో పేదలకు మనందరి ప్రభుత్వం మంచి చేస్తుంటే.. దానిని జీర్ణించుకోలేక, పేదలు బాగుపడటం తట్టుకోలేక, తమకు పుట్టగతులుండవనే భయంతో ఈ పెత్తందార్లు అంతా కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ బటన్ నొక్కడం వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట! ఇదే రాష్ట్రం వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా అట! ► ఈ గజదొంగల ముఠాకు దుష్టచతుష్టయం అని పేరు. అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు. వీరికి తోడు దత్తపుత్రుడు. ఈ గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అనే పద్ధతిలో పాలించింది. అందుకే ఆ రోజు బటన్లు లేవు. నొక్కే వారూ లేరు. ప్రజలకు నేరుగా మంచి జరగాలనే ఆలోచనలే లేవు. ► ఈ ముఠా చేస్తున్న దౌర్భాగ్యపు రాజకీయాలను ఎవరూ రాయరు. ఎవరూ చూపరు. ప్రశ్నించే వారు కూడా లేరు. అటువంటి వారితో ఈరోజు మనం యుద్ధం చేస్తున్నాం. ఇవాళ మీ బిడ్డ ఇటువంటి పత్రికలను, టీవీ చానళ్లను నమ్ముకోలేదు. దత్తపుత్రుడినీ అంతకన్నా నమ్ముకోలేదు. ► మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండండి. ఇవాళ మనం రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఈ రోజు చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా రాష్ట్రానికి ఇదే బడ్జెట్ ఉండేది. మరి అప్పుడు పాలకులు ఎందుకు జగన్ మాదిరిగా నేరుగా బటన్ నొక్కి.. మా బ్యాంకు ఖాతాల్లోకి ఎందుకు డబ్బులు వచ్చేటట్లు చేయలేకపోయారని ఆలోచించండి. గత ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించండి. ► మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. మీతోనే నా పొత్తు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి 98 శాతం హామీలను అమలు చేశాం. మీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మీ ఇంటి గడపవద్దకు వచ్చి మీకు జరిగిన మేలు గురించి అడుగుతున్నారు. మీ బిడ్డ ప్రభుత్వాన్ని దీవించమని మీ ఆశీస్సులు తీసుకుంటున్నారు. -
జన సునామీ.. మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం
మదనపల్లె నుంచి సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకతో మదనపల్లె కిక్కిరిసింది. సభా ప్రాంగణం, రోడ్లన్నీ కిటకిటలాడాయి. ఇంత వరకు ఏ రాజకీయ నేతకు, ముఖ్యమంత్రికి దక్కని ఘన స్వాగతం, జన నీరాజనం ఆయనకు లభించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో పోటెత్తారు. ఇసుక వేస్తే రాలనంతంగా కనుచూపు మేర తరలివచ్చారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల ఊహకందని రీతిలో సభకు జనం హాజరు కావటం మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంచనాలకు మించి జనసంద్రంలా.. మదనపల్లెలో రాజకీయ నాయకుల సభలు మామూలుగా మిషన్ కాంపౌండ్లో జరుగుతుంటాయి. అయితే సీఎం సభకు భారీగా జనం తరలివస్తారని భావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్రెడ్డి, కలెక్టర్ గిరీషాలు కదిరి రోడ్డులోని టిప్పు సుల్తాన్ మైదానంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలో 35 వేల మంది కూర్చునేలా.. ఇంకా జనం ఎక్కువైతే దాని చుట్టూ కూడా కూర్చొనేలా మరో పది వేల మందికి ఏర్పాట్లు చేశారు. అయితే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఊహించని విధంగా ఉదయం 7 గంటల నుంచే ప్రజలు సభా వేదిక వద్దకు తరలిరావటం మొదలైంది. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లి, రాయచోటి, పుంగనూరు నియోజక వర్గాల నుంచి ప్రజలు ప్రత్యేక వాహనాల్లో మదనపల్లెకు చేరుకున్నారు. విద్యార్థులు, మహిళల కోసం రిజర్వు చేసిన గ్యాలరీలు నిండిపోయాయి. ఉదయం 10 గంటలకల్లా సభ ప్రాంగణం నిండిపోయింది. ప్రాంగణం చుట్టూ.. పెద్ద సంఖ్యలో జనం ఉండిపోయారు. అప్పటికే పోలీసులు ట్రాఫిక్ను మళ్లించి ఉండటంతో కదిరి రోడ్డు మొత్తం జనంతో కిటకిటలాడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలిప్యాడ్ చేరుకోగానే కదిరి రోడ్డు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. అంటే సభలో కూర్చున్న వారికంటే.. రెండు మూడింతల జనం కదిరి రోడ్డు, సభ ప్రాంగణం చుట్టూ నిలుచుండిపోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగాన్ని అలానే తిలకించారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేయటం ప్రజలకు ఊరటనిచ్చింది. సభా ప్రాంగణం నిండిపోవడంతో బయట నుంచే సీఎం జగన్ ప్రసంగాన్ని ఆలకిస్తున్న అశేష జనవాహినిలో ఓ భాగం హోరెత్తిన నినాదాలు మదనపల్లె పట్టణం ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తింది. సీఎం వైఎస్ జగన్ రేణిగుంట నుంచి ఉదయం 10.45 గంటల ప్రాంతంలో మదనపల్లె హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి 11.33 గంటలకు సభ వేదిక వద్దకు వచ్చారు. బీటీ కళాశాల మైదానం నుంచి బెంగుళూరు రోడ్డు మీదుగా బీసెంట్ కూడలి, పటేల్ రోడ్డు, ఎన్టీఆర్ కూడలి, కదిరి రోడ్డు మీదుగా టిప్పు సుల్తాన్ మైదానం చేరుకున్నారు. రహదారికి ఇరువైపులా ప్రజలు వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతూ.. జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభా వేదిక వరకు జనం రోడ్లపై కిక్కిరిసిపోయారు. మధ్యాహ్నం 1.11 గంటలకు సభ ముగించి వైఎస్ జగన్ తిరుగు పయనమయ్యారు. ఈ రెండు సమయాల్లోనూ సీఎం వైఎస్ జగన్కు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. నినాదాలతో నీరాజనం పలికారు. సభా ప్రాంగణానికి మరోవైపు నిలిచిపోయిన జన సందోహంలో ఓ భాగం సభ జరిగినంత సేపు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు వైఎస్ జగన్కు మద్దతుగా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేయడంతో మైదానం దద్దరిల్లింది. జగనన్న విద్యాదీవెన ద్వారా లబ్ధి పొందిన మదనపల్లెకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని షేక్ మహీర్, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ములకలచెరువు మండలానికి చెందిన సౌజన్య సభలో ప్రసంగించారు. -
మదనపల్లె పర్యటనలో సీఎం జగన్ ఉదారత
-
మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండండి: సీఎం జగన్
-
మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. చెప్పిందే చేసి చూపిస్తాడు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళలను దగా చేసిన చంద్రబాబు మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను దగా చేసి నేడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు చంద్రబాబు మాటలు చూస్తుంటే ప్రజలు 'ఇదేం ఖర్మరా బాబూ' అనుకుంటున్నారని సీఎం జగన్ చెప్పారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారు. ఆతర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ను నీరుగార్చాయి. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం అని సీఎం జగన్ చెప్పారు. 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించాం. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించాం. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు జమ చేస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నాం. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించం.. ఆస్తిగా భావిస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నా. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని సీఎం జగన్ అన్నారు. ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు పిల్లల చదువుతోనే ఇంటింటా వెలుగులు నింపాలని నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. విద్యారంగాన్ని ఉపాధికి చేరువుగా తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. పిల్లలను పాఠశాలలకు పంపితే అమ్మ ఒడి కింద సాయం చేస్తున్నాం. అమ్మ ఒడి పథకం ఏపీలో తప్ప ఏ రాష్ట్రంలోనూ లేదు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, డిజిటల్ క్లాస్రూమ్లు విద్యార్థులకు, టీచర్లకు ట్యాబ్లతో సమూల మార్పులు చేశాం. ఉన్నత విద్యలో కూడా మార్పులు తెచ్చాం. ప్రఖ్యాత కంపెనీల సర్టిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందిస్తున్నాం. అమ్మ ఒడి కింద రూ.19,617 కోట్లు, జగనన్న విద్యాకానుకకు రూ.2,368 కోట్లు విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్లకు రూ.685 కోట్లు ఖర్చు చేశాం. నాడు-నేడు తొలి దశకు రూ.3,669 కోట్లు, రెండో దశకు రూ.8వేల కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణకు రూ.4,895 కోట్లు.. ఇలా మూడున్నరేళ్లలో విద్యారంగానికి రూ.55వేల కోట్లు ఖర్చు చేశాం. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా 85వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాం. తేడా గమనించండి 'ప్రతిపక్షాలకు వివేకం రావాలని కోరుకుంటున్నా. నా భూముల్లోనే రాజధాని కట్టాలనే ఆలోచన నుంచి బయటపడే.. దేవుడు బుద్ది, జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నా. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదించే వారికి జ్ఞానం రావాలి. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఇంగిత జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనం రాక్షసులు, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. దుష్టచతుష్టయం మాటలు నమ్మొద్దు. మీ బిడ్డ పత్రికలు, చానళ్లు, దత్తపుత్రుడ్ని నమ్ముకోలేదు. మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. చెప్పిందే చేసి చూపిస్తాడు. ప్రజల్ని, ఆ దేవుడ్ని మీ బిడ్డ నమ్ముకున్నాడు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి. మంచి జరిగితే మీ జగనన్నకు తోడుగా ఉండండి' అని సీఎం జగన్ ప్రజల్ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి: బొత్స
-
మదనపల్లెలో సాగు, తాగునీటి కష్టాలు తీరాయి: ఎంపీ మిథున్రెడ్డి
-
విద్యార్థులతో సీఎం జగన్
-
సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
మదనపల్లెలో నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్
-
మీరు చదవండి.. మీ చదువులకు నేనే పూచీ: సీఎం జగన్
►కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువే. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారు. ఆతర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ను నీరుగార్చాయి. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం అని సీఎం జగన్ చెప్పారు. విద్యాదీవెనకు తోడు జగనన్న వసతి దీవెన ఇస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చాం. పేదలకు చదువును హక్కుగా మార్చాం. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించాం. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించాం. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.684 కోట్లు జమ చేస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నాం. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించం.. ఆస్తిగా భావిస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నా. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని సీఎం జగన్ అన్నారు. సుదీర్ఘ ప్రసంగం అనంతరం సీఎం జగన్ బటన్ నొక్కి నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును అమలు చేస్తోంది. ►విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం అని చెప్పారు. 11:35AM అన్నమయ్య జిల్లా ►సీఎం కాన్వాయ్ కి ఎదురొచ్చిన అంబులెన్స్ ►బస్సుని పక్కన ఆపించి అంబులెన్సుకు దారిచ్చిన సీఎం వైఎస్ జగన్ ►సీఎం మానవత్వానికి చేతులెత్తి నమస్కరించిన పేషంట్ బంధువు 11:30AM ►మదనపల్లె సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ►సీఎంతో పాటు హెలికాఫ్టర్లో వచ్చిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున 11:15AM ►హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ సభా వేదిక వద్దకు బయలు దేరిన సీఎం ►బెంగళూరు రోడ్డు, గాంధీపురం జంక్షన్, సొసైటీకాలనీ గేటు, అనిబిసెంట్ సర్కిల్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, యన్టీఆర్ సర్కిల్, భాగ్యలక్ష్మీ మిల్, ప్రశాంత్ నగర్, రెడ్డీస్ కాలనీ, కదిరి రోడ్డు మీదుగా టిప్పు సుల్తాన్ గ్రౌండ్ వరకు సాగనున్న కాన్వాయ్ ►సీఎంను చూసేందుకు రహదారి వెంబడి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు ,అభిమానులు ►రోడ్డుకు ఇరువైపులా బారులుతీరిన ప్రజలకు చిరునవ్వుతో నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్ 11:01AM అన్నమయ్య జిల్లా ►మదనపల్లి బీటీ కాలేజ్ గ్రౌండ్లోని హెలిప్యాడ్కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్ ►ఘనస్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ,మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్లు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, ద్వారకానాద్ రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, జడ్పీ చైర్మన్లు ఆకేపాటి అమర్నాథ రెడ్డి, శ్రీనివాసులు ,కలెక్టర్ గిరీషా ,డీఐజీ సెంథిల్ కుమార్ ,ఎస్పీ హర్షవర్ధన్ రాజు ,కార్పొరేషన్ ఛైర్మెన్లు 10:35 AM అన్నమయ్య జిల్లా ►మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానం సభా ప్రాంగణంలో కిక్కిరిసిన విద్యార్థిని, విద్యార్థులు ►సీఎం జగన్ రాక కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని, విద్యార్ధులు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 10:30AM ►తిరుపతి విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మదనపల్లి బయలుదేరిన సీఎం జగన్ 10:25AM తిరుపతి జిల్లా ►తిరుపతి విమానాశ్రయంకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎంను విమానాశ్రయం వద్ద కలిసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెస్ బాబు, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు 09:00 AM ►తాడేపల్లి: మదనపల్లె బయలుదేరిన సీఎం జగన్ ►మరికొద్దిసేపటిలో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును అమలు చేస్తోంది. తల్లిదండ్రులపై భారం పడకుండా కాలేజీలకు ఎంత మొత్తం ఫీజు ఉన్నా ఆ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్ ప్రకారం విడుదల చేయడంతో కాలేజీల యాజమాన్యాలకూ ప్రయోజనం చేకూరుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పులపాలైన తల్లిదండ్రులు.. గత ప్రభుత్వం హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేయలేదు. కాలేజీల్లో ఫీజు రూ.లక్షల్లో ఉన్నా కేవలం రూ.35,000 మాత్రమే ఇచ్చి అప్పటి టీడీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. పైగా ఆ అరకొర మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించేది కాదు. దీంతో తల్లిదండ్రులు అప్పుల పాలయ్యారు. అనేకమంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా గత ప్రభుత్వం 2017 నుంచి పెట్టిన బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఈ నిధులతో కలిపి ఇప్పటివరకు ఈ రెండు పథకాల కింద రూ.12,401 కోట్లు సాయమందించింది. ఇంత పెద్దమొత్తంలో పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చించిన మరో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. పేద విద్యార్థులు ఉన్నత చదువులు నిరాటంకంగా అభ్యసించేందుకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఈ పథకాలను అందిస్తుండటం విశేషం. ఎప్పటి నిధులు అప్పుడే జమ.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. -
మదనపల్లె: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును అమలు చేస్తోంది. తల్లిదండ్రులపై భారం పడకుండా కాలేజీలకు ఎంత మొత్తం ఫీజు ఉన్నా ఆ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్ ప్రకారం విడుదల చేయడంతో కాలేజీల యాజమాన్యాలకూ ప్రయోజనం చేకూరుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పులపాలైన తల్లిదండ్రులు.. గత ప్రభుత్వం హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేయలేదు. కాలేజీల్లో ఫీజు రూ.లక్షల్లో ఉన్నా కేవలం రూ.35,000 మాత్రమే ఇచ్చి అప్పటి టీడీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. పైగా ఆ అరకొర మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించేది కాదు. దీంతో తల్లిదండ్రులు అప్పుల పాలయ్యారు. అనేకమంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా గత ప్రభుత్వం 2017 నుంచి పెట్టిన బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఈ నిధులతో కలిపి ఇప్పటివరకు ఈ రెండు పథకాల కింద రూ.12,401 కోట్లు సాయమందించింది. ఇంత పెద్దమొత్తంలో పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చించిన మరో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. పేద విద్యార్థులు ఉన్నత చదువులు నిరాటంకంగా అభ్యసించేందుకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఈ పథకాలను అందిస్తుండటం విశేషం. ఎప్పటి నిధులు అప్పుడే జమ.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. -
మదనపల్లెకు సీఎం వైఎస్ జగన్
-
తొలిసారి అన్నమయ్య జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, మదనపల్లె: అన్నమయ్య జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా విచ్చేస్తున్న సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ గిరీషా.పీఎస్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిలుపునిచ్చారు. జగనన్న విద్యాదీవెన నాలుగో విడత పంపిణీకి సంబంధించి ఈనెల 25న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మదనపల్లెకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ తలశిలరఘురాం, ఎస్పీ హర్షవర్దన్రాజు, జేసీ తమీమ్అన్సారియా, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు సభాస్థలి, హెలిప్యాడ్, రోడ్షో ఏర్పాట్లపై పట్టణంలోని టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్, బీటీ కళాశాల గ్రౌండ్స్, చిప్పిలి విజయాడెయిరీ వెనుకవైపు మైదానాలను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో సభా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అన్నమయ్య జిల్లాలో తొలిసారిగా చేస్తున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి అధికారి ఆయా శాఖల పరిధిలో వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం పంపిణీ సభకు టిప్పుసుల్తాన్ మైదానాన్ని ఎంపిక చేశామన్నారు. చదవండి: (ఇతర పార్టీల పొత్తుకోసం పాకులాట.. మరి ఈ బిల్డప్ ఏంటి బాబు?) హెలిప్యాడ్, సభావేదిక, బారికేడ్లు, పార్కింగ్ వసతి, ఫైర్సేఫ్టీ, భద్రతాసౌకర్యం, ప్రొటోకాల్, విద్యుత్సరఫరా, ఆహారం, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, వైద్యసదుపాయాలు సమకూర్చాలన్నారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి చేరుకునేంతవరకు సీఎం పర్యటించే రహదారి పొడవునా ప్రతి 100 మీటర్లకు ఒక అధికారిని నియమించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి, సభాస్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ వసతులను కల్పించాలని మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీలను ఆదేశించారు. మదనపల్లె సీఎం పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి పర్యవేక్షణ జేసీ తమీమ్అన్సారియా, ఆర్డీఓ ఎం.ఎస్.మురళీకి కేటాయించారు. రాజంపేట ఆర్డీఓ కోదండరెడ్డికి హెలిప్యాడ్, రాయచోటి ఆర్డీఓ రంగస్వామికి వేదిక ఏర్పాట్లపై బాధ్యతలు అప్పగించారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిలరఘురాం మాట్లాడుతూ... విద్యాదీవెన కార్యక్రమానికి తక్కువ వ్యవధి ఉన్న నేపథ్యంలో సరైన ప్రణాళికతో పూర్తిస్థాయిలో కార్యక్రమం విజయవంతానికి అధికారులు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జెడ్పీచైర్మన్ శ్రీనివాసులు, ఏపీఎండీసీ చైర్పర్సన్ షమీంఅస్లాం, జెడ్పీటీసీ ఉదయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, వైస్చైర్మన్ జింకా చలపతి, వైఎస్సార్ సీపీ నాయకులు బాబ్జాన్, జబ్బలశ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ రాజ్కమల్, జిల్లా ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
AP: ప్రభుత్వ పథకాలతో ఉన్నత చదువులకు విద్యార్థుల మొగ్గు
సాక్షి, అమరావతి: ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణుల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 93.38 శాతం మంది ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడం గమనార్హం. ఇది దేశంలోనే కొత్త రికార్డు సృష్టించింది. జాతీయ సగటుకు మించి ఏపీలో గరిష్ట చేరికల నిష్పత్తి నమోదవుతోంది. ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో మూడున్నరేళ్లలో గణనీయమైన పురోగతి సాధించింది. టీడీపీ హయాంలో 2018–19లో 20.37 శాతం మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరలేక డ్రాపౌట్లుగా మిగలగా ప్రస్తుతం 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. గత సర్కారు అరకొర ఫీజులనూ ఇవ్వకుండా రూ.1,800 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోగా వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థుల చదువులకు అండగా నిలిచింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో పాటు అకడమిక్ అంశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టిన సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయనేది కాదనలేని నిజం. విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ సదుపాయాలు మెరుగు పరుస్తుండడం, వివిధ పథకాలతో అడుగడుగునా అండగా నిలుస్తుండటంతో చదువుల నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రానికే ప్రాధాన్యం బయట రాష్టాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గతంలో కన్నా తగ్గి రాష్ట్ర కాలేజీల్లో చేరికలు పెరిగాయి. 2022 – 23లో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరిన వారు 35.50 శాతం ఉండగా డిగ్రీ కోర్సుల్లో 43.79 శాతం మంది చేరారు. 11.13 శాతం మంది అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో చేరిన వారు 2.96 శాతం మంది ఉన్నారు. మరో 6.62 శాతం మంది మాత్రమే డ్రాపౌట్లుగా మిగిలారు. 2018–19లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారిలో 20.37 శాతం మంది డ్రాపౌట్లుగా మిగిలిపోగా ఈసారి అది 6.62 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. 2018 – 19లో టీడీపీ అధికారంలో ఉండగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించినందున మిగతా ఫీజుల భారాన్ని భరించలేక ఇంజనీరింగ్ కోర్సుల్లో 21.77 శాతం మంది మాత్రమే చేరారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తుండడంతో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరికల శాతం అమాంతం 35.50 శాతానికి పెరగడం గమనార్హం. నాడు.. ప్రైవేట్కే విద్య టీడీపీ హయాంలో ఉన్నత విద్య మొత్తం ప్రైవేట్పరం కావడం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. ఇంటర్ చదువులకే రూ.లక్షలు ధారపోయాల్సిన దుస్థితి నెలకొంది. తూతూ మంత్రంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలైంది. కాలేజీల్లో ఫీజు ఎంతున్నా ఇంజనీరింగ్కు రూ.35 వేలు, ఇతర డిగ్రీ కోర్సులకు రూ.7 వేల నుంచి రూ. 10 వేల లోపు మాత్రమే విదిలించి గత సర్కారు చేతులు దులుపుకొంది. అది కూడా అరకొరగానే ఇవ్వడంతో మిగతా ఫీజుల మొత్తాన్ని తలిదండ్రులే భరించాల్సి వచ్చేది. ఫలితంగా పిల్లల చదువులు పూర్తయ్యేసరికి అప్పుల్లో మునిగిపోయేవారు. ఇలాంటి పరిస్థితి కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్తోనే చదువు ముగించి చిన్నా చితకా ఉద్యోగాలు, కూలి పనుల అన్వేషణలో నిమగ్నమైన పరిస్థితి ఏర్పడింది. నేడు.. సమూల మార్పులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా రంగం పరిస్థితి సమూలంగా మారిపోయింది. పేద విద్యార్థుల చదువులకయ్యే ఫీజు మొత్తాన్ని జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తోంది. చదువులు సాఫీగా సాగేలా వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకు చెల్లిస్తున్నారు. వీటిని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత చదువులపై భరోసా ఏర్పడింది. ఫలితంగా డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. కరోనా ఉన్న రెండేళ్లలోనూ చేరికలు పెరగడం విశేషం. లక్ష ప్లేస్మెంట్స్ లక్ష్యం ► టీడీపీ హయాంలో 2015–16లో ఉన్నత విద్యా కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య 11,25,510 కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2021–22 నాటికి 14,23,952కి చేరుకుంది. చదువుల కోసం నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే మొత్తం ఫీజులను చెల్లిస్తుండటంతో ప్రవేశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ► అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం 2014–15లో రాష్ట్రంలో ప్లేస్మెంట్లు 56 వేలు కాగా 2021–22లో 78 వేలకు చేరాయి. ప్లేస్మెంట్స్ను లక్షకు పైగా తీసుకెళ్లటాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► జీఈఆర్ (ప్రతి వంద మందిలో కాలేజీల్లో చేరేవారి సంఖ్య)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రాల వారీగా ఆలిండియా ఉన్నత విద్యా సర్వే (ఐష్) పేరిట నివేదికలను వెలువరిస్తుంది. ఐష్ సర్వే ప్రకారం ఏపీలో జీఈఆర్ 2015–16లో 30.8 ఉండగా 2019–20లో 35.2కు పెరిగింది. జాతీయ స్థాయిలో 24.5 నుంచి 27.1కు పెరిగింది. జీఈఆర్ పెరుగుదల జాతీయ స్థాయిలో 3.04 శాతంగా ఉండగా ఏపీలో 8.64 శాతంగా ఉండడం విశేషం. కేరళ 4.86 శాతం, తమిళనాడు 4.89 శాతం, తెలంగాణ –1.65 శాతంగా ఉన్నాయి. -
విద్యారంగంలో దూసుకుపోతున్న ఏపీ
విద్యాభివృద్ధి మీదే సమాజాభివృద్ధి అధారపడి ఉంటుంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారం చేపట్టిన వెంటనే ముందు విద్యా రంగంపై దృష్టిపెట్టారు. ‘నాడు–నేడు’లో భాగంగా ప్రభుత్వ బడులలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారు. తొలి దశ క్రింద 15,715 స్కూళ్లలో సదుపాయాలను కల్పించగా... ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. ఈ దశలో స్కూళ్లతో పాటుగా కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, డైట్తో పాటు శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రాథమిక తరగతి నుండి ఇంటర్ వరకు ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా విద్యార్థులను పాఠశాలకు రప్పించడానికి ప్రతి విద్యార్థి తల్లికి 15 వేల రూపాయలను ఆమె ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. పాఠశాల ప్రారంభంలోనే ‘జగనన్న విద్యా కానుక’ రూపంలో విద్యార్థులకు బుక్స్, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు ప్రతి విద్యార్థికి అందిస్తోంది. అలాగే ఉన్నత విద్య చదవాలన్న ఆసక్తి కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. ‘జగనన్న విద్యాదీవెన’, ‘వసతి దీవెన’ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సహాయం అందిస్తోంది. అర్హత ఉన్న విద్యార్థులు అన్ని కోర్సులకు చెల్లించే ఫీజును తిరిగి విద్యార్థులకే చెల్లిం చాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘జగనన్న విద్యాదీవెన’ ద్వారా 24.74 లక్షల మంది విద్యార్థులకు రూ. 8,365 కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లింపులు జరిగాయి. ‘జగనన్న వసతి దీవెన’ కింద 18.77 లక్షల మందికి రూ. 3349.57 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా ఈ మూడేళ్లలో 44.5 లక్షల మంది ఖాతాల్లో రూ. 19617.60 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో 98 శాతం మందికి విద్య అందుబాటులోకి వచ్చిందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో చేస్తున్న అనేక రకాల సంస్కరణల్లో మరొకటి ఇంటర్ విద్యను, పాఠశాల విద్యను కలిపి ‘ప్లస్ 2’ చేయడం. దీనివలన మూడవ తరగతి నుండి ఇంటర్మీ డియట్ వరకు విద్య ఒకే చోట దొరుకుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని మూడు నుంచి ఆరేళ్ల వయస్సుగల పిల్లలకు అందించడంలో ఏపీ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ‘ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్’ (ఈసీఈ) అమలులో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పేద విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో జ్ఞానాన్ని అందించే క్రమంలో ‘విద్యా కానుక’లో భాగంగా ఈ ఏడాది 4.70 లక్షల మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు, దాదాపు 50 వేల మంది టీచర్లకు 665 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్లను ప్రభుత్వం అందించనున్నది. ఇలా ఏపీ విద్యాసంస్కరణలతో ముందుకు దూసుకు పోతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. - వి.వి. రమణ సామాజిక విశ్లేషకులు -
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ గడువు పెంపు
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్ధన్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన శనివారం వివరాలు వెల్లడించారు. పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి పేరొందిన యూనివర్సిటీల్లో పెద్ద చదువులు అభ్యసించాలన్న గొప్ప లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ(అగ్రవర్ణ పేదలు), దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇందుకు దరఖాస్తు చేసుకునేలా గత నెల 30 వరకు ప్రభుత్వం గడువిచ్చిందన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులొచ్చాయని, అయితే ఈ పథకంలో మరింత మందికి మేలు చేసే లక్ష్యంతో మరో నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఫీజు రూ.కోటి అయినా నూరు శాతం రీయింబర్స్మెంట్, క్యూఎస్ ర్యాంకుల్లో 101 నుంచి 200లోపు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చేసేలా పథకాన్ని రూపొందించినట్టు వివరించారు. రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులని చెప్పారు. ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుందని హర్షవర్ధన్ వివరించారు. -
జగనన్న విదేశీ విద్యాదీవెన.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..
నెల్లూరు(వేదాయపాళెం): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురువారం జిల్లా బీసీ సంక్షేమశాఖ సాధికారత అధికారి వై.వెంకటయ్య తెలిపారు. విద్యార్థులను అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదవండి: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం వరంగా మారింది. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి ఈ పథకంతో మేలు చేకూర్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు రూపొందించింది. వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది. క్యూఎస్ ర్యాంకింగ్లో ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. క్యూస్ వరల్డ్ ర్యాకింగ్ ప్రకారం టాప్ 100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. టాప్ 100 నుంచి 200 ర్యాకింగ్లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు పొందిన వారికి రూ.50 లక్షల వరకు ఫీజురీయింబర్స్మెంట్ వర్తింపజేస్తుంది. తద్వారా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతోపాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా ఫీజురీయింబర్స్మెంట్ వర్తింపజేయనున్నారు. డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్లో 60 శాతం మార్కులు, తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సులకు నీట్లో అర్హత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ఈ ఆర్థికసాయం ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజురీయింబర్స్మెంట్ జమ చేస్తారు. దరఖాస్తుకు నేడు ఆఖరు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ప్రభుత్వం గుర్తించిన 200 యూనివర్సిటీల్లో సీటు సాధించి ఉండాలి. కులం, ఆదాయ సర్టిఫికెట్లు, మార్కులిస్టు తదితర వివరాలతో ఈ నెల 30వ తేదీ లోపు http:// jnanabhumi.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఈ పథకం వర్తింపజేస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలి. – వై.వెంకటయ్య, జిల్లా బీసీ సంక్షేమశాఖ, సాధికారత అధికారి -
Jagananna Videshi Vidya: అర్హులందరికీ విదేశీవిద్యకు ఆర్థికసాయం
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీవిద్య పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. జగనన్న విదేశీవిద్య పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న విదేశీవిద్య పథకంలో ఏడాదికి ఇంతమందికే ఇవ్వాలన్న పరిమితి లేదని స్పష్టం చేశారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటుగా అల్పాదాయం కలిగిన అగ్రవర్ణాల వారికి కూడా విదేశీవిద్యను అందుబాటులోకి తెస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ పథకానికి జ్ఞానభూమి పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పథకంలో లబ్ధిపొందడానికి అర్హులేనని పేర్కొన్నారు. ఆయా కేటగిరీల దరఖాస్తులను రాష్ట్రస్థాయి అధికారిక కమిటీలు పరిశీలించి వాటిలో అర్హులైన విద్యార్థుల జాబితాను తమ శాఖకు ఇస్తాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో శిక్షణపొందే వారికి మెరుగైన శిక్షణ అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. స్టడీ సర్కిళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ఇన్చార్జి కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, డైరెక్టర్ కె.హర్షవర్ధన్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసులు, డిప్యుటీ సెక్రటరీ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. -
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కాపులకు ఓ వరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు విదేశాలలో ఉన్నత చదువులు చదువుకునేందుకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం’ ఒక వరమని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి చెప్పారు. ఆయన బుధవారం మంగళగిరి కాపు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాపు సామాజికవర్గంలో వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల కలలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. రూ. 8 లక్షల లోపు వార్షికాదాయం ఉండి, విదేశీ విద్యార్హత పరీక్షలో స్కోరు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం ద్వారా విదేశాలలో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ చదవొచ్చని తెలిపారు. ప్రపంచంలో 1 నుంచి 100 ర్యాంకుల్లోని యూనివర్సిటీలకు ఎంపికైన విద్యార్థులకు 100 శాతం ట్యూషన్ ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని, 200 వరకు ర్యాంకుల్లో ఉన్న వర్సిటీలకు ఎంపికైన వారికి రూ.50 లక్షలు, లేదా ట్యూషన్ ఫీజులో 50 శాతం చెల్లిస్తుందని వివరించారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందన్నారు. అర్హత గలవారు సెప్టెంబర్ 30వ తేదీలోపు http:// jnanabhumi. ap. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి 63054 48393, 63051 59559 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో కాపుల సంక్షేమానికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.32 వేల కోట్లు, కాపు నేస్తం కింద మహిళలకు రూ.1,500 కోట్లు అందించామని తెలిపారు. కాపు కార్పొరేషన్ ద్వారా త్వరలో రుణాలు ఇస్తామన్నారు. విజయవాడ సింగ్నగర్లో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని చెప్పారు. -
అది తప్పుడు వార్త
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలపై తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం సీతాయిలంకలోని తుమాటి లత అనే మహిళ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల నిధులు పూర్తిగా అందలేదని ఎమ్మేల్యే సింహాద్రి రమేష్బాబును గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నిలదీసినట్లు ఆ పత్రిక సోమవారం ఒక వార్త ప్రచురించింది. ఆ కార్యక్రమంలో జరిగిన దానికి భిన్నంగా తప్పుడు సమాచారాన్ని వండి వార్చింది. వాస్తవానికి తుమాటి లత బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ. 1.72 లక్షలు జమ చేసినట్లు పేర్కొంటూ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆమెకు కరపత్రాన్ని అందించారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ. 1.40 లక్షల వరకు అందినట్లు, బ్యాంకు అకౌంట్ పుస్తకంలో ఆమేరకు జమ చేసినట్లు అందులో వివరించారు. అయితే ఈ రెండు పథకాల కింద తమకు రూ.82 వేలు మాత్రమే అందినట్లు లత చెప్పడంతో ఆమెకు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే 1.72 లక్షల నిధులు లత, ఆమె కుటుంబీకులకు చెందిన ఏయే బ్యాంకు అకౌంట్లలోకి ఏ తేదీల్లో జమ అయ్యాయో వివరంగా చూపించారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన కింద 1.40 లక్షలు ఏయే తేదీల్లో జమ అయ్యాయో రికార్డులు చూపి మరీ చెప్పారు. తన అకౌంట్లో, తన కుమార్తె అకౌంట్లో మొత్తం నిధులు జమ అయ్యాయని, తానే పొరపాటున పూర్తిగా రాలేదని అనుకున్నానని లత వివరించారు. పూర్తి మొత్తం అందించినట్లు బ్యాంకు అకౌంట్లలో జమ అయిన మొత్తాలను చూపి మరీ అధికారులు తమకు వివరించారని చెప్పారు. అయితే, ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు వార్త రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. -
విద్యాదీవెన మూడో విడత రూ.694 కోట్లు విడుదల
-
మార్పును పట్టుకుందాం
ఇవాళ 17–22 ఏళ్ల పిల్లలు రాబోయే సవాళ్లను ఎదుర్కొంటూ ఈ ప్రపంచంలో కనీసం మరో 80 సంవత్సరాలు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. పదేళ్ల క్రితం మన దేశం, మన కుటుంబం, మనం ఎలాంటి ప్రపంచాన్ని చూశామో చెప్పగలం. అయితే 20 ఏళ్ల తర్వాత ఎలాగుంటుందో చెప్పలేనంత వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అంతే వేగంతో ప్రయాణం చేయకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడలేరు. అలా పోటీ పడాలంటే ప్రతి అడుగులోనూ మార్పు కనిపించాలి. అందుకు ప్రభుత్వ పరంగా తగిన వాతావరణం ఏర్పాటు చేయాలి. ఈ మూడేళ్లుగా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో విద్యార్థుల తల రాతలు మార్చడం కోసమే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఏ బిడ్డకైనా అతిగొప్ప దీవెన ఏదైనా ఉంటుందంటే అది చదువేనని, ఇది ఏ ఒక్కరూ కొల్లగొట్టలేని ఒక ఆస్తి అని చెప్పారు. పేదరికం నుంచి బయట పడటం చదువు వల్లే సాధ్యమవుతుందన్నారు. గురువారం ఆయన బాపట్లలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 2022 ఏప్రిల్ – జూన్న్త్రైమాసికానికి సంబంధించి 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగిస్తూ కంప్యూటర్లో బటన్ నొక్కి రూ.694 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు రూ.35 వేలు.. రూ.50 వేలు.. రూ.70 వేలు.. రూ.లక్ష.. అంతకన్నా ఎక్కువైనా సరే 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి తల్లుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నామన్నారు. పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు, ఇతర కులాల్లోని పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలనేది మనందరి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో వచ్చినప్పుడే పేదరికం పోతుందన్నారు. ఇందులో భాగంగానే కేవలం ప్రాథమిక విద్యను మాత్రమే కాకుండా.. పెద్ద చదువులన్నీ కూడా పేదలకు హక్కుగా మారుస్తూ వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి పథకం దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేదని, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతోందని స్పష్టం చేశారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందినీ చదివిస్తామని పునరుద్ఘాటించారు. చదువుకునే పిల్లలందరికీ అన్నగా.. అక్కచెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా.. మీ ఇంటి మనిషిగా ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. చిరునవ్వుతో బకాయిలు చెల్లించాం ► గత ప్రభుత్వం దిగిపోయే ముందు ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2017–18, 2018–19కి సంబంధించి రూ.1,778 కోట్లు మన ప్రభుత్వం పిల్లల కోసం చిరునవ్వుతో చెల్లించింది. ఇందులో భాగంగా ఈ కాలేజీకి (ప్రస్తుతం సభ జరుగుతున్న) కూడా రూ.14 కోట్లు బకాయిలు చెల్లించాం. ► పిల్లల గురించి, వారి చదువుల గురించి అంతలా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది. ఒక్క జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు సంబంధించి మాత్రమే ఈ మూడేళ్లలో రూ.11,715 కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. ► జగనన్న వసతి దీవెన కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి సంవత్సరానికి రెండు దఫాలుగా ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు రూ. 20 వేలు, పాలిటెక్నిక్ పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ పిల్లలకు రూ.10 వేలు ఇస్తున్నాం. చదువు కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలవ్వరాదని, ఇల్లు.. పొలాలు అమ్ముకునే పరిస్థితి రాకూడదన్న గొప్ప ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. విద్యా రంగంలో గొప్ప మార్పులు ► జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, బైజూస్తో ఒప్పందం.. ఇవి మాత్రమే కాకుండా ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా కరిక్యులమ్లో మార్పులు చేశాం. 30–40 శాతం స్కిల్ ఓరియెంటెడ్గా, జాబ్ ఓరియెంటెడ్గా మార్పులు తెచ్చాం. ► డిగ్రీ చదువుతున్న పిల్లలకు పది నెలలపాటు కంపల్సరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం. ఆన్లైన్లో రకరకాల వర్టికల్స్ తీసుకొచ్చాం. మైక్రోసాఫ్ట్తో ఒప్పందాలు కుదుర్చుకుని 1.60 లక్షల మందికి వాళ్లతో శిక్షణతో పాటు సర్టిఫికెట్స్ ఇప్పించాం. ► రాబోయే తరంలో కాలేజీలు అవ్వగానే ఉద్యోగాలు సులభంగా వచ్చేలా కరిక్యులమ్లో మార్పులు తీసుకొచ్చాం. ఇలా విద్యా రంగంలో ప్రతి మార్పు వెనుక, అందుకోసం చేస్తున్న వేల కోట్ల రూపాయల ఖర్చు వెనుక మీ పిల్లల భవిష్యత్ పట్ల ఒక గొప్ప బాధ్యత కనిపిస్తుంది. రూ.53 వేల కోట్లతో సమూల మార్పులు మూడేళ్లలో ఒక్క విద్యా రంగం మీద, పైన చెప్పిన పథకాల మీద మాత్రమే.. రూ.53 వేల కోట్లు ఖర్చు పెట్టాం. జగనన్న అమ్మఒడి పథకానికే రూ.19,618 కోట్లు ఇచ్చాం. విద్యా దీవెన, వసతి దీవెన కోసం రూ.11,715 కోట్లు, గోరుముద్దకు రూ.3,117 కోట్లు, జగనన్న విద్యా కానుకకు రూ.2,324 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణకు రూ.4,895 కోట్లు ఖర్చు చేశాం. మన బడి నాడు–నేడు కింద ఇవాళ రూపుమార్చుకుంటున్న పాఠశాలలు మీకు కనిపిస్తున్నాయి. ఇంత వరకు పెట్టిన ఖర్చు, ఈ సంవత్సరం అయ్యేసరికి పెట్టబోతున్న ఖర్చు రెండూ కలిపితే రూ.11,669 కోట్లు. ఇవన్నీ కలిపితే రూ.53,338 కోట్లు ఒక్క విద్యా రంగం మీద ఖర్చు చేస్తున్నాం. నాడు అవినీతి.. నేడు డీబీటీ ► మీ అన్న, మీ తమ్ముడు ఇప్పుడు నేరుగా బటన్ (డీబీటీ–డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) నొక్కుతున్నాడు.. ఆ డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ► గతంలో స్కీం అంతా స్కాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక చంద్రబాబు వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. వీరు మాత్రమే దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పథకం. ఇప్పుడు దానికి అడ్డుకట్ట పడిందని వాళ్లకు కడుపు మంట. ► నాకున్నది, వారికి లేనిది దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు. ఆ రెండూ నాకు ఉన్నంత వరకూ మీ కోసం ఎన్ని అడుగులు అయినా ముందుకు వేసాను. అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా, రక్షణ పరంగా.. అన్ని విషయాల్లోనూ మీ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. మీ చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని.. ఆత్మీయత, అనురాగానికి ప్రతీక అయిన రక్షా బంధనం దినోత్సవాన కోరుకుంటున్నాను. ► ఈ సభలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, మేరుగ నాగార్జున, బొత్స సత్యనారాయణ, ఉప సభాపతి కోన రఘుపతి, ఎంపీలు మోపిదేవి వెంకట రమణారావు, నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్ బావుండాలని ఆరాటం ► మన పిల్లల భవిష్యత్ బావుండాలని ఆరాట పడుతూ ఇంతగా ఖర్చు చేస్తున్నాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల వల్ల కాలేజీల్లో 18–23 ఏళ్ల పిల్లల సంఖ్య (జీఈఆర్) గణనీయంగా పెరుగుతోంది. తద్వారా మనం బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలతో పోటీ పడతాం. ► 18–23 ఏళ్ల పిల్లలు బ్రెజిల్లోని కాలేజీల్లో 55 శాతం, రష్యాలో 86 శాతం, చైనాలో 58 శాతం, ఇండియాలో కేవలం 29 శాతం మాత్రమే ఉంది. దీన్ని 2035 నాటికి మన రాష్ట్రంలో 70 శాతం వరకు తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తున్నాం. ► 2018–19తో పోల్చితే 2019–20లో జీఈఆర్ 8.64% పెరిగింది. ఇది జాతీయ స్థాయిలో కేవలం 3.04 శాతం మాత్రమే పెరిగింది. మన పథకాల వల్లే ఈ ప్రగతి సాధ్యమైంది. ► ఆడ పిల్లలకు సంబంధించి రాష్ట్రంలో జీఈఆర్ 11.03 శాతం వృద్ధి నమోదు కాగా, దేశ వ్యాప్తంగా కేవలం 2.28 శాతం మాత్రమే. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 2018–19తో పోల్చితే 2019–20లో రాష్ట్రంలో 7.5 శాతం జీఈఆర్ పెరగ్గా.. దేశం మొత్తం మీద పెరుగుదల కేవలం 1.7 శాతం మాత్రమే. ఎస్టీ విద్యార్థులకు సంబంధించి జీఈఆర్ పెరుగుదల రాష్ట్రంలో 9.5 శాతం కాగా.. జాతీయ స్థాయిలో అది కేవలం 4.7 శాతం మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి ► ఇవాళ చాలా మంది గిట్టని వాళ్లు అమ్మఒడి పథకాన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. జగన్ అక్కచెల్లెమ్మలకు డబ్బులు ఉదారంగా ఇచ్చేస్తున్నాడు అంటున్నారు. ఇలాగైతే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వెటకారంగా కూడా మాట్లాడుతున్నారు. ► 2018లో ప్రాథమిక విద్యకు సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కొన్ని గణాంకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం ప్రాథమిక విద్యలో జీఈఆర్ రాష్ట్రంలో 84.48% ఉంటే.. దేశం మొత్తం సరాసరి 99 శాతం. అంటే దేశం మొత్తంగా పోలిస్తే ఏపీలో తక్కువగా కనిపిస్తోంది. ► ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లలను చదివించాలి.. వారు దేశంతో పోటీపడాలి.. అనే ఉద్దేశంతో ఆ పిల్లలను బడికి పంపించేందుకు తల్లులకు తోడుగా నిలుస్తూ అమ్మఒడి పథకం అమలు చేస్తున్నాం. ఏవేవో మాట్లాడుతున్న పెద్ద మనుషులు ఈ వాస్తవాలు గమనించాలి. ► ఈ రోజుకు, గత ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలి. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. అప్పుల గ్రోత్ రేట్ చూస్తే.. గత పాలనలో 19% సీఏజీఆర్ ఉంటే, మన హయాంలో అప్పుల గ్రోత్ రేటు అంతకన్నా తక్కువ. 15% మాత్రమే. అప్పుడు, ఇప్పుడు తేడా ఏమిటంటే ఒక్క సీఎం మాత్రమే మారాడు. గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మీ అన్న, మీ తమ్ముడు ఎలా చేయగలుగుతున్నారో ఆలోచించండి. చదవండి: నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం -
జగనన్న విద్యా దీవెన(ఫోటోలు)
-
జగనన్న విద్యదీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
చదువులు కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కాకూడదు
-
అందుకే వారికి కడుపు మంట: సీఎం జగన్
సాక్షి, బాపట్ల: ఏ బిడ్డకైనా అతి గొప్ప దీవెన చదువు మాత్రమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏ బిడ్డకైనా తప్పనిసరిగా అందాల్సింది చదువు మాత్రమే. చదువు అన్నది ఏ ఒక్కరూ కొల్లగొట్టలేనిదన్నారు. బాపట్లలో గురువారం జరిగిన ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. పేదరికం నుంచి చదువుల ద్వారానే బయటపడేయగలమన్నారు. రాబోయే కాలంలో పోటీని ఎదుర్కొంటూ సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో పిల్లలంతా జీవించాలని దీనికోసం ప్రభుత్వం చేయాల్సింది చేస్తున్నామని సీఎం అన్నారు. చదవండి: సీఎం జగన్కు రాఖీలు కట్టిన మహిళా నేతలు ‘‘ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యాదీవెన చెల్లిస్తున్నాం. తల్లుల ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్ల రూపాయాలు చెల్లిస్తున్నాం. విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రక్షణ పరంగా అన్నిరకాలుగా అక్క చెల్లెమ్మలకు మంచిచేస్తున్నాం. ఏప్రిల్, మే, జూన్ ఈమూడునెలలకు సంబంధించిన వందశాతం ఫీజురియింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని’’ సీఎం అన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ♦పదేళ్ల కిందట ఎలాంటి ప్రపంచం ఉండేది ♦20 ఏళ్ల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి.. అంటే.. ఊహకందని విషయం ♦అంత వేగంగా మార్పులు వస్తున్నాయి ♦ఆ మార్పులతో మనం ప్రయాణం చేయాలి ♦లేకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడలేరు ♦అందుకనే ప్రతి అడుగులోనూ మార్పు కనిపించాలి ♦అప్పుడే గొప్ప మార్పులు సాధ్యమవుతాయి ♦అలాంటి చదువులు రాష్ట్రంలో ప్రతి బిడ్డకూ అందాలి ♦ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర కులాల్లోని పేద కుటుంబాలకు చెందిన బిడ్డలు, నా బిడ్డలు పెద్ద చదువులు చదువుకోవాలి ♦మీ అందరి అన్నగా దీన్ని కోరుకుంటూ 3 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం ♦అందులో భాగంగానే ప్రాథమిక విద్యలోనే కాకుండాపెద్ద చదువులను కూడా పేదలకు అందుబాటులోకి తీసుకువస్తూ 100 శాతం ఫీజు రియింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం ♦ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తోంది ♦మీరు వెళ్లండి.. చదవండి.. ఎంతమంది బిడ్డలు ఉంటే.. అంతమందిని చదివిస్తాను అని సగర్వంగా తెలియజేస్తున్నాను ♦రేషన్లా ఆలోచించి ఒక్కరికే కాదు.. అందరికీ అందిస్తాం ♦చదివినప్పుడే మన బతుకులు, తలరాతలు మారుతాయి ♦ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా ఈ పథకం మన రాష్ట్రంలో అమలవుతుంది ♦తల రాతలు మార్చాలన్న ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది ♦ప్రతి తల్లి, తండ్రి కూడా ఖర్చుకు వెనకాడకుండా.. మీ బిడ్డలను బాగా చదివించండి ♦ఎంత మంది బిడ్డలు ఉన్నా.. చదివించండి.. తోడుగా మీ అన్న, తమ్ముడైన నేను ఉంటాను ♦ఆ బాధ్యత నేను తీసుకున్నాను ♦ప్రతి ఇంట్లోని నుంచి ప్రతి డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుకునే నా బిడ్డలు బయటకు రావాలి ♦2017-18, 2018-19 సంవత్సరాలకు ఫీజు రియింబర్స్మెంట్బకాయిలను రూ.1778 కోట్లను నేను కట్టాను ♦మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కట్టాను ♦జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలకే ఈరెండు సంవత్సరాల కాలంలో రూ.11,715 కోట్లు నా అక్క చెల్లెమ్మలకు మూడేళ్లకాలంలో ఇచ్చాం ♦పిల్లలను చదివించుకోవడంకోసం అప్పులు పాలు కాకూడదు, పొలాలు అమ్ముకునే పరిస్థితి రాకూడదని గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ♦పిల్లల చదువులకు ఏదీ అడ్డంకాకూడదని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ♦ఒక్క విద్యారంగంలోని అమ్మ ఒడి, సంపూర్ణపోషణ, గోరుముద్ద, విద్యాకానుక, మన బడి నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం, బైజూస్తో ఒప్పందం ఇవి మాత్రమే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం ♦పాఠ్యప్రణాళికలో 30 నుంచి 40 శాతం నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించాం ♦10 నెలల ఇంటర్నెషిప్ ఏర్పాటు చేశాం ♦మైక్రోసాఫ్ట్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాం ♦విద్యారంగంమీద రూ. 53,338కోట్లు మూడేళ్లకాలంలో పెట్టాం ♦కాలేజీల్లో చేరుతున్నవారి సంఖ్యను పెంచాలన్నది ఉద్దేశం ♦2035 నాటికి 70శాతానికి జీఆర్ రేష్యోను పెంచాలన్నది ధ్యేయం ♦2018– 19 తో పోలిస్తే 2019–20లో 8.64శాతం పెరిగింది ♦జాతీయ స్థాయిలో 3.04 శాతం మాత్రమే ♦ఆడపిల్లలకు సంబంధించి రాష్ట్రంలో జీఈఆర్ రేష్యో 11.04శాతం వృద్ధి అయితే దేశవ్యాప్తంగా 2.28 శాతం వృద్ధి మాత్రమే ♦2018లో ప్రాథమిక విద్యలో కేంద్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం... జీఈఆర్ రేష్యో 84.48శాతం అయితే, దేశవ్యాప్త సగటు 99శాతం ♦ఈ లెక్కల ప్రకారం అట్టడుగున ఉన్న రాష్ట్రాలతో పోటీపడింది ♦ఈ పరిస్థితుల్లో మన పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంతో తల్లులకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చాం ♦రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు ♦గతానికి, ఇప్పటికి పాలనలో తేడాను గమనించండి ♦అప్పుల్లో గ్రోత్ రేట్ గత పాలనలో 19శాతం సీఏజీఆర్ ఉంటే, ఇప్పుడు 15శాతం మాత్రమే ఉంది ♦అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా గతంతో పోలిస్తే తక్కువ ♦తేడా ఏంటి.. కేవలం ముఖ్యమంత్రిలో మార్పు ♦గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారు? ♦మీ అన్న, మీ తమ్ముడు నేరుగా బటన్ నొక్కుతున్నాడు, నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తోంది ♦ఎక్కడా లంచాలు లేవు, వివక్షలేదు, డీబీటీ ద్వారా పోతుంది ♦గతంలో జరిగే స్కీం ఏంటి? ♦కేవలం నలుగురు మాత్రమే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, ఒక చంద్రబాబు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు ♦వీరు మాత్రమే దోచుకో.. పంచుకో.. తినుకో... ♦డీపీటీ పథకం అప్పుడు అమలు చేశారు ♦ఈనాడు పేపర్ చదివినా, ఆంధ్రజ్యోతి చూసి, టీవీ–5 చూసినా.. వారి కడుపు మంట కనిపిస్తూ ఉంటుంది ♦గతంలో బాగా దోచుకుని పంచుకునే వాళ్లు.. ♦మనం వచ్చాక దోచుకోవడం లేదు, పంచుకోవడం లేదు కాబట్టి.. జీర్ణించుకోలేకపోతున్నారు ♦అందుకనే వీరి కడుపు మంట కనిపిస్తోంది ♦వారికి లేనివి, నాకు ఉన్నవి.. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు -
జగనన్నవిద్యదీవెన పథకం
-
కాసేపట్లో జగనన్న విద్యదీవెన మూడో విడత నగదు జమ
-
Jagananna Vidya Deevena: 'పెద్ద చదువులకు పేదరికం అడ్డంకి కాకూడదు'
-
Jagananna Vidya Deevena: విద్యార్థులకు రూ.11,715 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది. కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. -
Jagananna Vidya Deevena: 11న బాపట్లకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, బాపట్ల: ఈనెల 11న విద్యాదీవెన పథకం ద్వారా సాయం జమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం టూర్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మంత్రి మేరుగ నాగార్జున, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్జిందాల్ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. బాపట్లలోని ఇంజినీరింగ్ కళాశాల, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ప్రాంగణాల్లో సభావేదిక ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. వ్యవసాయ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. విజయవంతం చేయండి : మంత్రి మేరుగ నాగార్జున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. విద్యాదీవెన పథకం చాలా గొప్పదని, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయించిన తేదీకే సంక్షేమ పథకాలను అమలు చేయటం సీఎం జగన్కే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ విజయకృష్ణన్ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: తమ్మినేని కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్) -
జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు. చదవండి: రామోజీ ‘మేనేజ్మెంట్’కు ఇదో ఉదాహరణ డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్ల్లో 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సుకు నీట్లో అర్హత సాధించి ఉండాలి. ప్రపంచంలో టాప్ 100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగినవాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు, 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుంది. అర్హులైన విద్యార్థులు సెపె్టంబర్ 30లోగా https://jnanabhumi.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్దన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
విదేశీ విద్యా వరం... ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూర్చేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలను రూపొందించింది. వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది. క్యూఎస్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన ఏపీ విద్యార్థుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్–100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేస్తుంది. టాప్ 100 – 200 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. తద్వారా రాష్ట్ర విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతోపాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఈ స్థాయిలో ప్రయోజనం చేకూర్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దేశంలోనే మరొకటి లేదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింప చేయనున్నారు. టాప్ 200 యూనివర్సిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అంతమందికీ సంతృప్త స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనున్నారు. 35 ఏళ్లలోపు ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు. ఏపీలో స్థానికులై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింప చేయనున్నారు. ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. విదేశీ విద్యా దీవెన ఎప్పుడు.. ఎలా? టీడీపీ హయాంలో... ► 2016 – 17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్ల మేర బకాయి పెట్టిన గత సర్కారు. ► చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్ధికంగా వెనకబడ్డ అగ్రకులాలకు ఈ పథకాన్ని వర్తింప చేయలేదు. ► సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే వర్తింపు. ► కొన్ని దేశాల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తించేలా ఆంక్షలు. ► చంద్రబాబు హయాంలో ఎస్సీలకు రూ.15 లక్షలు, ఎస్టీలకు రూ.15 లక్షలు, కాపులకు రూ.10 లక్షలు, బీసీలకు రూ.10 లక్షలు, మైనార్టీలకు రూ.15 లక్షల వరకూ మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు. ► 300 మంది ఎస్సీలు, 100 మంది ఎస్టీలు, 400 మంది కాపులు, 1,000 మంది బీసీలు, 500 మంది మైనార్టీ విద్యార్థులకే మాత్రమే వర్తించేలా పరిమితులు. వైఎస్సార్ సీపీ పాలనలో.. ► ప్రతిభను పరిగణలోకి తీసుకుంటూ అగ్రవర్ణ పేద విద్యార్థులకూ పథకం వర్తింపు. ► ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచి మరింత మందికి మేలు చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు. ► ప్రపంచంలో ఎక్కడైనా సరే టాప్ 200 యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు సంతృప్త స్థాయిలో పథకం వర్తింపు. ► టాప్ 100 యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు. 101 – 200 లోపు ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షల వరకూ ఫీజులు చెల్లించనున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. ► ఆంక్షలు లేకుండా టాప్ 200 యూనివర్సిటీల్లో ఎంతమంది సీట్లు సాధిస్తే అంతమందికీ వర్తింప చేయాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నిర్ణయం. నాడు అస్తవ్యస్థంగా.. ► గత సర్కారు హయాంలో విదేశీ విద్యా పథకం అమల్లో పలు లోపాలున్నట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం వెల్లడించింది. ► లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితులను పాటించలేదని నిర్ధారణ. ► ఆధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే కొందరు విద్యార్థులు తాము చదివే యూనివర్సిటీని, వెళ్లాల్సిన దేశాన్ని మార్చుకున్నట్లు వెలుగులోకి. ► పథకం ద్వారా లబ్ధి పొందిన అనంతరం కోర్సులు పూర్తి చేయకుండానే వెనుదిరిగిన కొందరు విద్యార్థులు. ► నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబంలో ఒకరికి మించి పథకం వర్తింపు. ► ప్రభుత్వానికి సమర్పించిన చిరునామాలో జాడలేని కొందరు లబ్ధిదారులు. నాలుగు వాయిదాల్లో ఖాతాల్లో జమ నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేస్తారు. ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లించనున్నారు. ఫస్ట్ సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లిస్తారు. రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లిస్తారు. నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లించనున్నారు. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్ వారీగా కోర్సు పూర్తయ్యే వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనున్నారు. -
జనమే సాక్షి - జగనన్న పథకాలు.. మా జీవితాల్లో వెలుగులు
-
చదువుల విప్లవం.. విద్యా రంగంలో ఏపీ ఆదర్శం..
ఎంత ఖర్చయినా సరే మీరు చదువుకోండి.. మీ చదువులకయ్యే ఖర్చు ప్రభుత్వానికి వదిలేయండి.. ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదని ఏనాడూ చింతించవద్దు.. మీ చదువుకు నాదీ గ్యారంటీ.. ఇవీ మొదటి నుంచీ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న ప్రకటనలు.. రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం ఆయన ఎంతగానో తపిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల కోసం చేస్తున్న వేలాది కోట్ల రూపాయల ఖర్చు రాష్ట్ర బంగారు భవిష్యత్తుకే అనేది ఆయన ప్రగాఢమైన నమ్మకం.. ఈ నేపథ్యంలో ప్రారంభించిన అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, మన బడి-నాడు నేడు, గోరు ముద్ద, వైఎస్సార్ పోషణ మొదలైన పథకాలు, కార్యక్రమాలు విద్యారంగంలో సమూల మార్పులకు కారణమవుతున్నాయి. చదవండి: అవధులు లేని సంతోషం.. సీఎం జగన్ మేలు మరిచిపోలేం.. రాజమండ్రి తాడితోట ప్రాంతం చిన్న ఇంట్లో పార్వతి కుటుంబం నివసిస్తోంది. ఈమె ఇస్త్రీ పని చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తోంది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోయాడు.. మొత్తం కుటుంబ భారం తన మీద పడడంతో ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి వుండేది. పిల్లల చదువులు ఎలా అని పార్వతి చింతిస్తున్న సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. విద్యారంగ పథకాలు ఒక్కటొక్కటిగా అందుబాటులోకి వచ్చాయి. విద్యారంగ పథకాలు ముఖ్యంగా అమ్మఒడి వీరికి అండగా నిలిచింది. పిల్లలను బడికి పంపే ప్రతి పేదతల్లికి ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన వైఎస్ జగన్.. తన మాట నిలబెట్టుకున్నాడు. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థులకేకాకుండా ఇంటర్ దాకా ఈ పథకాన్ని విస్తరించి ప్రతి ఏటా ఆర్థిక సాయం అందిస్తున్నారు. తండ్రి చనిపోయిన సమయంలో తల్లి నిస్సహాయంగా నిలిచిపోయిన కష్టకాలంలో మనం చూస్తున్న ఈ భువనేశ్వర్ అనే కుర్రాడికి అమ్మ ఒడి పథకం ఒక వెలుగు దివ్వెలాగా అవతరించింది. ఆర్థిక కష్టాలు భరించలేక, ఎంతో కొంత ఆదాయం వస్తుంది కదా అని పిల్లల్ని బడికి పంపకుండా పనులకు పంపే తల్లిదండ్రుల్లో మార్పు వచ్చిందనడానికి ఈ కుర్రాడే నిదర్శనం. పార్వతి కుమారుడు భువనేశ్వర్ చదువు మధ్యలో ఆగిపోలేదు. ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతూ రేపటి బంగారు భవిష్యత్తు కోసం అలుపెరగని శ్రమ చేస్తున్న సామాన్య సాధారణ కుటుంబాల్లో విద్యా వెలుగులు విస్తరిస్తున్నాయి. దీనికి నిదర్శనమే రాజమండ్రి నగరంలో నివసిస్తోన్న ఈ కుటుంబం. ఈమె పేరు రామలక్ష్మి. ఈమె టైలర్ పని ద్వారా, ఈమె భర్త కూలీ పని ద్వారా ఉపాధి పొందుతున్నారు. రామలక్ష్మి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరినీ చదివించడం కష్టమే అని గతంలో భావించిన రామలక్ష్మి ప్రస్తుతం ఇద్దరినీ చక్కగా చదివిస్తున్నారు. చిన్న చిన్న వృత్తులను నమ్ముకొని బతుకు పోరాటం చేస్తున్న లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అండగా నిలుస్తున్నాయి. విద్యారంగ పథకాల కారణంగా సామాన్య పేద కుటుంబాల తల్లిదండ్రులు చదువులపట్ల మొగ్గు చూపుతున్నారు. దాంతో రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మధ్యలోనే చదువులు మానేసేవారి సంఖ్య తగ్గిపోయి అదే సమయంలో చదువుల బాట పట్టిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇది మన కళ్ల ముందే కనిపిస్తున్న మార్పు.. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, మన బడి నాడు-నేడు, గోరుముద్ద, వైఎస్సార్ పోషణ, విదేశీ విద్యాదీవెన.. ఇవీ ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో అమలవుతున్న విశిష్ట పథకాలు.. ఒక్కొక్కటి ఒక్కో వైవిధ్యతతో రూపొంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నాయి. ప్రతి పథకం విషయంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రకారం అమలు చేస్తున్నారు. మనం మన పిల్లలకు ఇచ్చే అసలు సిసలైన ఆస్తి చదువే అనేది వైఎస్ జగన్ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్న మాట.. దానికి అనుగుణంగానే రాష్ట్రమంతా పలు విద్యారంగ పథకాలు అమలువుతున్నాయి. ఇక్కడ ఇంటి పనులు చేస్తూ, తల్లికి చేదోడు వాదోడుగా వున్న ఈ అమ్మాయి పేరు సబ్బెళ్ల లక్ష్మీ.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రస్తుతం బిటెక్ ఆఖరి సంవత్సరం పూర్తి చేసే పనిలో వుంది. తమ్ముడితో కలిసి విశాఖపట్టణంలోని ప్రైవేటు కాలేజీలో చదువుకుంటున్న ఈ అమ్మాయి చదువు పూర్తి కాకముందే ప్రముఖ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయని, కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న సమయంలో ఈ రెండు పథకాలు అండగా నిలిచాయని ఈ అమ్మాయి అంటోంది. విద్యాదీవెన అంటే విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించే పథకం.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అరకొర ఫీజులు చెల్లిస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత ఫీజుంటే అంత ఫీజూ ఇస్తోంది.. ఇది ఈ పథకంలో ప్రత్యేకత. ఇక అంతటితో ఆగిపోకుండా వసతి దీవెన అనే మరో పథకాన్ని కూడా వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఊరుగాని ఊరిలో తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో వుండి చదువుకునే పిల్లలకు అక్కడ వారి ఖర్చులకోసం ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలవరకు అందిస్తున్నారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులపై హాస్టల్, మెస్ భారం తొలగిపోతోంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన వీర వెంకట సత్యనారాయణ స్థానికంగా కిరాణా షాపు నడుపుకుంటున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు. ఇద్దరిలో ఒకరు బిటెక్ చదువుతుండగా మరొకరు బీసీఏ చదువుతున్నారు. పిల్లలు తెలివైనవారు..లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వారిని ప్రొఫెషనల్ కోర్సులు చదివించడం కష్టమే అని ఈయన అనుకుంటున్న సమయంలో ప్రభుత్వ విద్యారంగ పథకాలు చక్కగా అందుబాటులోకి వచ్చాయి. రాజమండ్రిలో ఓ హాస్టల్లో వుంటూ చదువుకుంటున్న సత్యనారాయణ చిన్న కుమారుడు విఘ్నేష్ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు సాక్షి పలకరించింది. తన తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఆదుకుంటోందని విద్యాదీవెన వసతి దీవెన పథకాలు తమకు అందుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికలైపోయి అధికారం చేపట్టిన తర్వాత మరొకలా వ్యవహరించే రాజకీయ పార్టీల గురించి మనకు తెలుసు.. మేనిఫెస్టోను ఘనంగా ముద్రించి అవి చేస్తాం ఇవి చేస్తామని ఊరూవాడా ప్రచారం చేసి ఆ తర్వాత మేనిఫెస్టోను బుట్టదాఖలు చేసిన పార్టీలను మనం చూశాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమది అలాంటి పార్టీ కాదని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజాభిమానం మరింత పొందుతున్నామని సగర్వంగా చెబుతున్నారు. -
చదువుతో ఎదుగుదాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేదరికాన్ని నిర్మూలించే శక్తి చదువులకు మాత్రమే ఉందని, పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి కూడా అదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలు, అవమానాలను తాను పాదయాత్రలో స్వయంగా చూసి పూర్తి ఫీజురీయింబర్స్మెంట్తో జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, విద్యాకానుక, అమ్మ ఒడి లాంటి పథకాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. జగనన్న విద్యాదీవెన 2021–22 నాలుగో త్రైమాసికం ఫీజు రీయింబర్స్మెంట్ కింద 10,85,225 మంది విద్యార్థులకు మేలు చేకూరుస్తూ రూ.709.20 కోట్లను 9.73 లక్షల మంది తల్లుల ఖాతాల్లో గురువారం తిరుపతిలో బటన్ నొక్కి సీఎం జగన్ నేరుగా జమ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. నీరుగార్చిన నిర్వాకం చంద్రబాబుదే.. పెద్ద చదువులు ఒక మనిషి చరిత్రనే కాకుండా కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశ చరిత్రను మారుస్తాయి. మన తలరాతలను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అది ఎవరూ దొంగిలించలేని ఆస్తి. గతంలో నాన్న వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చి విద్యార్థుల ఉన్నత చదువులకు బాట వేశారు. తర్వాత వచ్చిన పాలకులు పిల్లల చదువుల గురించి, తల్లిదండ్రుల కష్టాల గురించి పట్టించుకోలేదు. ఫీజుల పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నీరు గార్చారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అవస్థ పడటం, ఆ దుస్థితిని చూడలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఆ కుటుంబాల దయనీయ పరిస్థితిని నా పాదయాత్రలో స్వయంగా చూశా. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా గత మూడేళ్లుగా వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. చదువులకు నాదీ బాధ్యత ఈరోజు.. మీబిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఈ పథకాలను ఎలా అమలుæ చేస్తున్నాడు? ఎలాంటి మార్పులు తెచ్చాడు? అనేది మీరంతా గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయాలి. ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలను చదివించాలి. వారికి నేను అండగా ఉంటా. పిల్లల చదువుల బాధ్యతను నేను తీసుకుంటున్నా. ప్రతి ఇంటి నుంచి గొప్ప ఇంజనీరు, డాక్టరు, కలెక్టర్ వస్తారని నమ్ముతున్నా. ఈ మాట నాలో ఎంతో ఉత్తేజాన్ని, సంతోషాన్ని ఇస్తోంది. పేద పిల్లల చదువులకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించండి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో ప్రతి త్రైమాసికం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. గత సర్కారు అరకొర ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సక్రమంగా చెల్లించలేదు. 2017–18, 2018–19లో రూ.1,778 కోట్లు కట్టకుండా ఎగ్గొడితే మీ జగనన్న ప్రభుత్వం వచ్చాక చెల్లించింది. నాడు అడుగడుగునా నిర్లక్ష్యం.. అధికారంలో ఉండగా ప్రభుత్వ పాఠశాలల మూసివేత లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరించారు. పిల్లల డ్రాపౌట్లకు కారణం ఏమిటో చంద్రబాబు ఒక్కరోజైనా ఆలోచించారా? చదువుల పట్ల అడుగడుగునా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. మధ్యాహ్న భోజనాన్ని నిర్వీర్యం చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. గత సర్కారు దీనికి ఏటా రూ.600 కోట్లు ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా రూ.1,900 కోట్లు చెల్లిస్తున్నాం. విద్యారంగంలో సత్ఫలితాలు విద్యారంగంపై మన ప్రభుత్వం రూ.వేల కోట్లను వెచ్చిస్తుండటంతో గత మూడేళ్లలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు, సత్ఫలితాలను మనమంతా చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 2018–19లో 37.20 లక్షల మంది మాత్రమే చదువుతుండగా ఇప్పుడు ఆ సంఖ్య 44.39 లక్షలకు పెరిగిందని గర్వంగా చెబుతున్నా. తల్లులకు నమ్మకం కలిగించడం, పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడం లాంటి చర్యల ద్వారా ఈ సత్ఫలితాలు వచ్చాయి. గతంలో ఇవన్నీ ఉన్నాయా..? ► జగనన్న విద్యాదీవెన మాదిరిగా గతంలో వందశాతం ఫీజు రీయింబర్స్ ఇచ్చారా? అని సభలో సీఎం ప్రశ్నించగా.. లేదు.. లేదు.. అని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతిస్పందించారు. ► పెద్ద చదువులు చదివే వారికి వసతి, భోజనం సదుపాయాలు కల్పించే జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి లాంటి పథకాలు గత సర్కారు హయాంలో ఉన్నాయి? అని ప్రశ్నించగా.. లేదని విద్యార్థులు నినదించారు. ► ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, సదుపాయాల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? అని అడగ్గా.. లేదు.. లేదు... అంటూ సభలో నినాదాలు హోరెత్తాయి. పిల్లల చదువులకు ఎంత ఖర్చు చేశామంటే.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలివిడతలో 15,715 పాఠశాలలను రూపురేఖలను మార్చేందుకు రూ.3,698 కోట్లు వ్యయం. రెండో విడత కింద 26,451 పాఠశాలల్లో రూ.8,122 కోట్లతో మౌలిక వసతుల కల్పన లక్ష్యం. ► జగనన్న విద్యాకానుక కింద 47.32 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరుస్తూ రూ.1500 కోట్లు వ్యయం. విద్యా దీవెన అమలుకు మరో రూ.900 కోట్లు. ► జగనన్న గోరుముద్ద ద్వారా 44 లక్షల మంది పిల్లలకు రూ.1,900 కోట్లతో పౌష్టికాహారం. ► డాక్టర్ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 34.20 లక్షల మంది గర్బిణిలు, బాలింతలు, చంటిబిడ్డల కోసం రూ.1,800 కోట్లు వ్యయం. 35 నెలల్లో సంపూర్ణ పోషణ పథకం కింద రూ.4,900 కోట్లు ఖర్చు. ► అమ్మఒడి ద్వారా ఇప్పటికే తల్లుల ఖాతాల్లోకి రూ.13,023 కోట్లు జమ. జూన్లో మరో రూ.6,400 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం. ► అధికారంలోకి వచ్చిన 35 నెలల్లోనే వివిధ పథకాల ద్వారా రూ.1,38,894 కోట్లు నేరుగా పారదర్శకంగా ఖాతాల్లోకి జమ చేసి లబ్ధి చేకూర్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. చదువుకు ఎంతో సహకారం మాది సామాన్య రైతు కుటుంబం. ఇద్దరం ఆడపిల్లలం. ఆర్థిక స్తోమత లేకపోవడంతో మమ్మల్ని చదివించడం అమ్మానాన్నకు కష్టంగా మారింది. ఇంటర్ తర్వాత కష్టపడి ఇంజనీరింగ్లో చేరా. ఫస్టియర్లో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఇంకా మూడేళ్లు ఎలా చదవాలా? అని దిగులు చెందుతున్న సమయంలో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద నాకు రూ.73,900 ఫీజురీయింబర్స్మెంట్ వచ్చింది. అలాగే జగనన్న వసతి దీవెన కింద మరో 20,000 అందాయి. మా చెల్లికి అమ్మఒడి పథకం కింద రూ.15,000 లబ్ధి చేకూరింది. మా నాన్నకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.13,500 వచ్చింది. మా అవ్వకి ప్రతి నెలా రూ.2,500 పింఛను ఇస్తున్నారు. మా అమ్మ డ్వాక్రా సంఘంలో ఉండటంతో ఆ ప్రయోజనాలు కూడా మా కుటుంబానికి అందుతున్నాయి. ప్రస్తుతం నేను తిరుపతిలో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నా. ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్స్లో మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. ఇంతకన్నా నాకు ఇక ఏంకావాలి.. జగనన్న? మీరు తీసుకొచ్చిన దిశ యాప్ మేము బయటకు వెళ్లి జీవించడానికి ధైర్యాన్ని ఇస్తోంది. మేమంతా మీకు జీవితాంతం రుణపడి ఉంటాం అన్నా. – ఇందుమతి, ఇంజనీరింగ్ విద్యార్థిని -
దుష్ట చతుష్టయంతో జాగ్రత్త
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో ప్రజలకు మంచి జరుగుతోంది కాబట్టి కొందరికి కడుపుమంట పెరుగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. కాయలున్న చెట్లకే రాళ్లు పడతాయని.. ఇంతగా చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5తో పాటు చంద్రబాబు కలసి దుష్ట చతుష్టయంలా, దొంగల ముఠాలా మారి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పేదింటి పిల్లలు గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగి ఆ కుటుంబంతో పాటు సమాజం స్థితిగతులు మారేలా ఇంగ్లిష్ మీడియం చదువులు తీసుకొస్తే అడ్డుపడ్డారని విమర్శించారు. చివరకు నిరుపేద అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలిచ్చి లక్షల కుటుంబాలకు గూడు కల్పిస్తుంటే దానికీ ఆటంకాలు సృష్టించారని ధ్వజమెత్తారు. అమ్మ ఒడి లాంటి పథకాలకూ ఆటంకాలు సృష్టిస్తూ గోబెల్స్ ప్రచారంతో వంచించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య స్కూళ్ల నుంచే ప్రశ్న పత్రాల లీకేజీ జరిగిందని స్పష్టం చేశారు. గురువారం తిరుపతిలో జగనన్న విద్యా దీవెన పథకం నాలుగో త్రైమాసికం ఫీజుల కింద రూ.709.20 కోట్లను నేరుగా 9.73 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి సీఎం జమ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్తో 10,85,225 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తిరుపతిలో రూ.320 కోట్లతో నిర్మిస్తున్న చిన్నపిల్లల మల్టీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ.190 కోట్లతో టాటా ట్రస్టు నిర్మించిన క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ... దోషులపై దాగుడు మూతలు ప్రజలకు మేలు చేస్తుంటే చూడలేక ఏదో జరిగిపోతోందంటూ ఎల్లో మీడియా నానాయాగీ చేస్తోంది. మనం ఏం చేస్తున్నామో అమ్మలకు, అక్కచెల్లెమ్మల కళ్లకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చంద్రబాబుతో పాటు ఆయన్ను మూడు దశాబ్దాలుగా మోస్తూ ఎదిగిన దొంగల ముఠాకి విద్యావ్యవస్థలో జరుగుతున్న మార్పులతో ఎక్కడలేని బీపీ పెరుగుతోంది. తప్పుడు రాతలతో పరదా కట్టాలని చూస్తున్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖలో ఇటీవల చోటు చేసుకున్న హత్యాచారాల ఘటనల్లో దోషులు ఎవరనేది ఈనాడు రాయదు. ఆంధ్రజ్యోతి చెప్పదు. టీవీ–5 చూపించదు. కారణం ఏమిటంటే.. ఆ కేసుల్లో దోషులంతా టీడీపీ నాయకులే కాబట్టి. ఇటువంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వీళ్లే చేస్తారు.. మళ్లీ వీళ్లే వక్రీకరిస్తారు.. దుర్భుద్ధితో పచ్చి ఆరోపణలు చేస్తారు. నారాయణ చైతన్య నుంచే లీకేజీలు.. మనం చేస్తున్న మంచిని ప్రజలు మరిచిపోవాలనే ఎల్లోమీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఈరోజు విద్యాదీవెన ప్రారంభిస్తున్నామని తెలిసి దుష్ప్రచారం కొత్త మలుపు తిప్పారు. విద్యాదీవెన ప్రజల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టించేందుకు ప్రశ్నాపత్రాలను వాట్సాప్లో లీక్ చేయించి ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు నారాయణ, మూడు చైతన్య స్కూళ్ల నుంచే ఈ లీకేజీలు జరిగాయి. ఇందుకు కారకుడైన ఆ నారాయణ ఎవరండి ? చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. వాళ్ల విద్యాసంస్థల నుంచే లీక్ చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ ఐదేళ్ల పాపాల పాలనలో.. చంద్రబాబు ఐదేళ్ల పాపాల పాలనలో గుడులను ధ్వంసం చేస్తే మనం ఆలయాలను కట్టించాం. వాళ్లు విగ్రహాలను విరిచేస్తే మనం పునఃప్రతిష్టించాం. వారు రథాలను తగులబెడితే మనం రథాలను మళ్లీ నిర్మించాం. వాళ్లు రైతులను కుంగదీస్తే మనం రైతులను తిరిగి నిలబెడుతున్నాం. వాళ్లు మన పల్లెల్ని దెబ్బతీస్తే మనం ప్రతి పల్లెల్లో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకెళ్లాం. అవినీతికి తావు లేకుండా గడప వద్దకే సుపరిపాలన తెచ్చి దేశానికే మార్గ నిర్దేశం చేశాం. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అందిస్తున్నాం. వాళ్లు మన బడిని, ఆసుపత్రులను శిథిలావస్థకు చేరిస్తే మనం నాడు–నేడుతో వాటికి జవసత్వాలు చేకూర్చాం. వారు పేద పిల్లలు ఉన్నత చదువులు చదువు కూడదన్న దుర్బుద్ధి ప్రదర్శిస్తే మనం విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఘన స్వాగతం.. తిరుపతి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి చేరుకోగానే విద్యార్థులంతా జగన్ మామకు జై.. అంటూ ఘన స్వాగతం పలికారు. తొలుత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, మంత్రులు మేరుగు నాగార్జున, ఆర్కే రోజా ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, మేయర్ శిరీషా, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకన్నను ప్రార్థిస్తున్నా... వారే స్క్రిప్టు రాస్తారు.. వారే యాక్షన్ చేస్తారు.. మళ్లీ ఘోరం జరిగిందని గోల చేసేది కూడా వారే. ఇవన్నీ గమనించమని ప్రజలను కోరుతున్నా.. ఇలాంటిప్పుడు మనం కోరగలిగింది ఒక్కటే.. దేవుడా రక్షించు మా రాష్ట్రాన్ని.. ఈ ఎల్లో మీడియా నుంచి. ఈ ఎల్లో పార్టీ నుంచి. రెండు నాల్కలు చాచి బుసలు కొట్టే నిర్హేతుక విష సర్పాల నుంచి.. ధూర్తుల నుంచి.. దుష్ట చతుష్టయం నుంచి రక్షించు దేవా.. అని తిరుపతిలో శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నా. ఇంగ్లీషు మీడియంపై అడ్డుపుల్లలు నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు మన ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇంగ్లీషు మీడియాన్ని తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు ఏనాడైనా చేశారా? మేం తీసుకొస్తే అడుగడుగునా అడ్డుకున్నారు. లేనిపోని నిందలు, అభాండాలు వేసి పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియాన్ని దూరం చేయాలన్న కుట్రలు మీరంతా చూశారు. పిల్లలను చదువుల బాట పట్టించాలన్న లక్ష్యంతో అమ్మ ఒడికి శ్రీకారం చుట్టాం. పిల్లలను చదివించే ప్రతి తల్లికి తోడుగా నిలుస్తూ రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం. పాఠశాలల పునఃప్రారంభం రోజే పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తున్నాం. ఇళ్లను అడ్డుకుంటూ తప్పుడు రాతలు జగన్కు ఎక్కడ మంచిపేరు వస్తుందోనన్న కడుపు మంటతో వారి కుళ్లు, కుతంత్రాలు ఏ స్థాయికి చేరాయో మీరే గమనించండి. 1.3 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలిస్తే అప్పుడు పేపర్ లీకేజీ అంటూ యాగీ చేశారు. దేశ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విధంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిస్తుంటే ఏ విధంగా అడ్డుకున్నారో మీరంతా చూశారు. 18.41 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే రెచ్చగొట్టేలా తప్పుడు రాతలు రాస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో టిడ్కో ఇళ్లను నిర్మించలేక చేతులెత్తేస్తే, మనం అధికారంలోకి వచ్చాక నిర్మించి పేదలకు ఇస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేక బురద చల్లుతోంది. మనం చేస్తున్న మంచి ప్రజల్లోకి వెళ్లకుండా గుంట నక్కల కన్నా హీనంగా అడ్డుకుంటున్నారు. -
సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన (ఫోటోలు)
-
చంద్రబాబు, ఎల్లోమీడియాపై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు..
సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఇంగ్లిషు మీడియం చదువులు.. బాబు హయాంలో ఉన్నాయా? పేద పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివిస్తే.. ప్రశ్నిస్తారనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుదని దుయ్యబట్టారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన ‘విద్యాదీవెన నగదు జమ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, ఎల్లో మీడియా తీరును ఎండగట్టారు. అప్పుడు.. ఇప్పుడు తేడా చూడండి... ‘‘గత ప్రభుత్వంలో జగనన్న ‘అమ్మ ఒడి’ అనే పథకం ఎక్కడైనా ఉందా?. ఈ రాష్ట్రంలో ఏనాడైనా, ఎక్కడైనా ఇలా ఉందా?. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడులాంటి కార్యక్రమం గతంలో ఉందా?. చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమం ఏనాడైనా జరిగిందా?. ప్రభుత్వ బడులు మూసేసి, చదువుల భారాన్ని దించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించలేదా?. ఆ రోజుకూ, ఈ రోజు కూ తేడాలు చూడండి. పేదల పిల్లలు చదువులు ఎందుకు మానేస్తున్నారని ఎప్పుడైనా గతంలో ఆలోచించారా యూనిఫారం, షూలు, సాక్సులు, తెలుగు-ఇంగ్లిషుల్లో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, నోట్బుక్స్, స్కూల్బ్యాగ్.. ఇలాంటివన్నీ జగనన్న విద్యాకానుక మాదిరిగా ఎప్పుడైనా గతంలో ఇచ్చారా?. సరిగ్గా స్కూలు తెరిచే సమయానికి ఇచ్చారా? స్కూలు తెరిచిన ఆరేడు నెలలు తర్వాత టెక్ట్స్బుక్స్ ఇచ్చేవారంటూ’’ సీఎం మండిపడ్డారు. అందుకే దొంగల ముఠాకు కడుపుమంట.. ‘‘ఇంత మంచి జరిగింది కాబట్టే.... దొంగల ముఠాకు కడుపుమంట, బీపీ పెరుగుతూ ఉంది. పథకాలు మరిచిపోవాలని పేపర్, టీవీలు చూస్తే చాలు... అబద్ధాల మీద అబద్ధాలు చూపిస్తున్నారు. విద్యాదీవెన పథకం కింద ఇక్కడ ప్రారంభిస్తామని తెలిసి... ప్రశ్నపత్రాలను వారి హయాంలో మంత్రిగా పని చేసిన వారి స్కూళ్లనుంచే ప్రశ్నపత్రాలు ఫొటోలు తీసి... వాట్సాప్లో ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. వారే నాశనం చేస్తారు, వారే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు. లీక్ అంటూ డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. మనం వచ్చాక 1.3లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఆ రోజు కూడా పేపర్ లీక్ అంటూ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా నానా యాగీ చేశారని’ సీఎం నిప్పులు చెరిగారు. వీళ్లే చేస్తారు, మళ్లీ వీళ్లే ప్రచారం చేస్తారు.. ‘‘మహిళలు తమ కష్టాలు చెప్పుకునే వ్యవస్థ ఉంది కాబట్టి, కేసుల నమోదు కూడా పెరిగింది. విజయవాడలో అత్యాచారం జరిగిందని నానా యాగీ చేశారు. గుంటూరులో ఏదేదో జరిగిపోయిందని యాగీ చేశారు. విశాఖలో ఏదేదో జరిగిపోతుందని మరో యాగీ కూడా చూశారు. బాలికలు మీద, మహిళల మీద అత్యాచారం రాసిన దుర్మార్గులు ఎవరు?అన్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి చెప్పదు, టీవీ–5 చూపదు. ఈ ఘటనల్లో నిందితులు టీడీపీ వారే. వీళ్లే చేస్తారు, మళ్లీ వీళ్లే ప్రచారం చేస్తారు. ఏడుకొండల వాడిని కోరగలిగేది ఒక్కటే..దేవుడా మా రాష్ట్రాన్నిరక్షించు ఈ ఎల్లోమీడియా నుంచి, ఈ ఎల్లో పార్టీ నుంచి. రెండు నాలుకలు సాచి, బుసలు కొట్టే కృపా సర్పాలనుంచి, ధూర్తుల నుంచి, దుష్టచతుష్టయం నుంచి, రక్షించు దేవా అని వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నానని’’ సీఎం అన్నారు. -
‘సీఎం జగనన్నకు విద్యార్థులంతా రుణపడి ఉంటాం’
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తిరుపతి నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తారకరామ స్టేడియంలో జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్నారు. బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ చేశారు సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన కింద 2022 జనవరి–మార్చి త్రైమాసికానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను జమ చేశారు. ఈ కార్యక్రమంలో ‘జగనన్న విద్యాదీవెన పథకం’ ద్వారా లబ్ధిపొందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఇందుమతి మాట్లాడింది. ఇవాళ తను ఇంజనీరింగ్ చదువుతున్నానంటే జగనన్నే కారణమని తెలపింది. సీఎం జగనన్నకు విద్యార్థులంతా రుణపడి ఉంటామని పేర్కొంది. తన తండ్రి సామన్య రైతు అని, తననుఇంజనీరింగ్ చదివించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. అదే సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో సులభంగా చదువును పూర్తి చేసుకున్నానని పేర్కొంది. అలాగే హాస్టల్ వసతి కోసం ప్రతి సంవత్సరం రూ. 20 వేలు వస్తున్నాయని చెప్పింది. చదవండి: చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదు: మంత్రి ఆర్కే రోజా ‘నాతో పాటు నా కుటుంబాన్ని కూడా జగనన్న ప్రభుత్వం సాయపడుతుంది. చెల్లెకి అమ్మఒడి పథకం ద్వారా 15 వేలు, తండ్రికి రైతు భరోసా ద్వారా 13,500.. నానమ్మకు ఆసరా ఫించన్ వస్తుంది. ఇలా ఎన్నో కుటుంబాలను సీఎం జగన్ ఆదుకుంటున్నారు. ఇందుకు సీఎం జగన్కు కృతజ్ఙతలు. జగనన్న విద్యాదీవెన ద్వారా చదువుకొని కాలేజ్ ప్లేస్మెంట్స్లో మూడు ఉద్యోగాలు సాధించానని జగనన్న చెల్లిగా గర్వంగా చెబుతున్నాను. ఇలా జగనన్న ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అని ప్రసంగించింది. అనంతరం సీఎం జగన్ సదరు విద్యార్ధిని ఆశీర్వదించారు. -
చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదు: మంత్రి ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యా దీవెన సొమ్ము జమ కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరును ఏకిపారేశారామె. ‘‘ప్రతీ పేద విద్యార్థి తాను కలలు గన్న చదువు అందుకుని.. ఆ కుటుంబాన్ని పైకి తెచ్చుకునేందుకు అవకాశం ఇచ్చినా జగనన్నకు కృతజ్ఞతలు. ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన పథకం విద్యాదీవెన. పేదోడంటే చంద్రబాబుకు అస్సలు నచ్చదు. అందుకే అన్నిరకాలుగా నరకయాతన పెట్టాడు. కానీ, మనసున్న మహరాజు జగనన్న ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే ప్రతీరోజూ సంక్షేమం గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పటి విద్యార్థుల అదృష్టం.. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండడం అన్నారు మంత్రి రోజా. అన్నం పెట్టిన జగనన్న, ఆసరా ఇచ్చిన జగనన్న, చదువు అందించిన జగనన్న, ఆనందం పంచిన జగనన్న, అన్నదాతలకు అండగా ఉన్న జగనన్న.. ఈ ప్రశంసలేవీ చంద్రబాబుకు సహించడం లేదు. కరువుకు ప్యాంట్ షర్ట్ వేస్తే అది చంద్రబాబే. అందుకే ఇవాళ సిగ్గులేకుండా బాదుడే బాదుడు అంటూ కార్యక్రమం మొదలుపెట్టాడు. కానీ, సీఎం జగన్ పేదలకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు. వయసు తేడా లేకుండా.. కుల, వర్గాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేస్తున్న తెలుగు దేశం పార్టీని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బాది పంపించారు. వాళ్ల వ్యవహారం ఇలాగే కొనసాగితే.. 2024లోనూ చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదని సీఎం రోజా చెప్పారు. అవినీతికి తావు లేకుండా పాలిస్తున్న సీఎం జగన్.. .మంచి ఆరోగ్యం ఇవ్వడం కోసం ఈరోజు రాష్ట్రం కోసం పిల్లల కోసం ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలనుకున్నారని, ఇది ఆయన పెద్ద మనుసుకు నిదర్శమని అన్నారు మంత్రి రోజా. -
విద్యాదీవెన.. గొప్ప పథకం ఇది: సీఎం వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: చదువు అనేది ఒక మనిషి చరిత్రను, ఒక కుటుంబ చరిత్రను, ఒక సామాజిక చరిత్రను, ఒక రాష్ట్ర చరిత్రను.. అంతెందుకు ఒక దేశ చరిత్రను మారుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తిరుపతి పర్యటన సందర్భంగా.. తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతోందని సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్. ‘‘చదువు అనేది గొప్ప ఆస్తి.. ఎవరూ దొంగిలించలేని ఆస్తి. తలరాతలు మార్చేసే శక్తి చదువుకు ఉందని నమ్మే వ్యక్తిని నేను. 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడం సంతోషంగా ఉంద’’ని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చింది. పాదయాత్రలో ఎన్నో కష్టాలను కళ్లారా చూశా. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పిల్లలను చదువుకు దూరం చేయకూడదనుకున్నా. అందుకే.. విద్యార్థులకు లబ్ధి చేకూరే పథకాలతో గొప్ప విప్లవం తీసుకొచ్చాం అన్నారు సీఎం జగన్. విద్యాదీవెన అనేది రాష్ట్రంలోనే గొప్ప పథకం అని, అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. అరకోర ఫీజులతో, రీయంబర్స్మెంట్లతో గత ప్రభుత్వం వ్యవహరిస్తే.. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించి మరీ విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి వచ్చిన మార్పు ఏంటో మీరే గమనించడని తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం జగన్ కోరారు. అంతేకాదు గతంలోని ప్రభుత్వం.. ఇప్పుడున్న పథకాల్లాంటివి ఏమైనా ప్రవేశపెట్టిందా? అని అడిగారు సీఎం జగన్. -
సీఎం జగన్ తిరుపతి పర్యటన.. అప్డేట్స్
-
‘జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు’
జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు. ఆడపిల్లలను నా చేతిలో పెట్టి నా భర్త పదేళ్ల క్రితమే కాలం చేశాడు. ఇద్దరిని చదివించడం నా శక్తికి మించిన పని. జగనన్న చలువతో నా పెద్ద కూతురు ప్రియాంక బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. విద్యా దీవెన కింద ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.2,875 లెక్కన ఇప్పటికి ఐదు పర్యాయాలు అందించింది. వసతి దీవెన కింద రూ.10 వేలు వంతున అందిస్తోంది. నా రెండో కూతురు మనీషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అమ్మ ఒడి నగదుతో ఈ అమ్మాయిని చదివిస్తున్నాం. -కుమార్తె ప్రియాంకతో తల్లి ప్రభావతి, పుత్తూరు నేను వ్యవసాయ కూలీని. నా కుమార్తె దీప్తి చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రభుత్వ సాయంతోనే బిడ్డను చదివించుకోగలుగుతున్నాం. పాపకు విద్యాదీవెన నగదు అందుతోంది. పేద పిల్లల చదువుకు భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. జీవితాంతం ఆయన వెంట నడుస్తాం. -శివయ్య. జంగాలపల్లె, ఐరాల మండలం మాది వైఎస్సార్ జిల్లా బద్వేలు. మేము ఐదుగురు అక్కచెల్లెళ్లం. మా నాన్న వ్యవసాయ కూలీ. ఇల్లు గడవడమే కష్టం. మమ్మల్ని పదోతరగతి వరకు చదివించేందుకు నానా అవస్థలు పడ్డారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా చదువు కోసం దిగులు తప్పింది. అమ్మ ఒడి నగదుతో మా చెల్లెలు, విద్యాదీవెన పథకం ద్వారా నేను మా అక్క చక్కగా చదువుకుంటున్నాం. ప్రస్తుతం నేను తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నా. జగనన్న అందిస్తున్న పథకాలతో మా చదువును కొనసాగించగలమనే భరోసా వచ్చింది. – వి.దీప్తి, విద్యార్థిని, శ్రీపద్మావతి డిగ్రీ కళాశాల, తిరుపతి చదువుకు పేదరికం అడ్డంకిగా మారకూడదు.. ఆర్థిక స్థోమత లేక ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదు.. పిల్లల కలలు సాకారం చేసుకునేందుకు ఉన్నతంగా చదువుకోవాలి.. ఆధునిక సమాజంలో అత్యున్నతంగా ఎదగాలి.. పోటీ ప్రపంచంలో దీటుగా రాణించాలి. మేలైన అవకాశాలు అందుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’’.. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావిప్లవానికి తెరతీశారు. అందులో భాగంగా పేద పిల్లల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభించారు. ఏటా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ నగదును జమ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి దీవెన సొమ్మును లబ్ధిదారులకు అందించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్/తిరుపతి అర్బన్: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విద్యాదీవెన పథకంతో సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తూ భరోసా కల్పిస్తోంది. అందులో భాగంగా 2021–22 విద్యాసంవత్సరంలో జనవరి– మార్చికి సంబంధించి నగదు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తిరుపతి వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ విద్యాదీవెన పథకం కింద లబ్ధి చేకూర్చనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా.. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నప్పటికీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకం వర్తింపజేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సకాలంలో నిధులను తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నగదును నేరుగా అందించడం ద్వారా పిల్లల చదువులు, కళాశాలల్లో మౌళిక వసతులను తల్లిదండ్రులు పరిశీలించే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. కళాశాలల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలిగేలా అవకాశముంటుందని వెల్లడిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాల్లో జవాబుదారీతనం, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతోందని వివరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం నగదు జమ గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తి నిర్వీర్యం చేశారు. పిల్లల ఫీజు కట్టేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి కల్పించారు. విద్యార్థులను ఆయా కళాశాల యాజమాన్యాలు నానా అవస్థలు పెట్టిన తర్వాత అరకొరా ఫీజు చెల్లించి చేతులు దులుపుకునేవారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. వీటన్నింటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పెండింగ్ లేకుండా ఫీజురీయింబర్స్ విడుదల చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.452.52 కోట్లు విద్యాదీవెన కింద లబ్ధిదారులకు అందించింది. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ దీవెన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. మూడేళ్లుగా ఈ ప్రాంతానికి చెందిన సుమారు 17,900 మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసింది. మా ఇంట్లో ఇద్దరికీ లబ్ధి మా నాన్న జయకృష్ణ చిరువ్యాపారి. నా చెల్లెలు కావ్య బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. నేను ప్రస్తుతం బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నా. మా ఇంట్లో ఇద్దరికీ విద్యాదీవెన పథకం కింద ఆర్థిక సాయం అందుతోంది. ఇదివరకు మమ్మల్ని చదివించేందుకు నాన్న ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ప్రభుత్వ భరోసాతో వారిపై భారం తగ్గింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేం. – కిషోర్, విద్యార్థి, గోవిందపురం, వి.కోట మండలం జగనన్న మేలు..జన్మలో మరువలేం నేను వ్యవసాయ కూలీని. ముగ్గురు పిల్లలు. ఒకమ్మాయికి పెళ్లి చేశా. మరో ఇద్దరిని చదివించేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఫీజు కట్టేందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనేవాడిని. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయంతో ఫీజుల బాధ తప్పింది. ముఖ్యమంత్రి జగనన్న చలువ వల్ల నా కుమారుడు హరికృష్ణ కుప్పంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. రెండో అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. జగనన్న మేలును జన్మలో మరువలేను. – కుమారుడు హరికృష్ణతో వేమన్న, కణ్ణమ్మ దంపతులు అర్హులందరికీ అందిస్తాం అర్హులైన విద్యార్థులందరికీ విద్యాదీవెన పథకం వర్తింపజేశాం. సచివాలయాల ద్వారా పథకంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. గురువారం కలెక్టరేట్లో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, కాపు, బీసీ, ఈబీసీ, క్రిస్టియన్ మైనారిటీ శాఖల ద్వారా ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. – హరినారాయణన్, చిత్తూరు కలెక్టర్ -
సీఎం జగన్ తిరుపతి పర్యటన.. పలు కార్యక్రమాలకు హాజరు
సాక్షి, ప్రతినిధి, తిరుపతి/సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సీఎం వైఎస్ జగన్ గురువారం తిరుపతి నగరంలో పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమతో పాటు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ, శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆస్పత్రి, శ్రీనివాస సేతు వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా.. జగనన్న విద్యా దీవెన కింద 2022 జనవరి–మార్చి త్రైమాసికానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను గురువారం తిరుపతి ఎస్వీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేయనున్నారు. అక్కడే జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేసే పథకమే జగనన్న విద్యా దీవెన. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాíసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.10,994 కోట్లు సాయంగా అందించింది. చిన్న పిల్లలకు ‘సూపర్’ సేవలు చిన్న పిల్లలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సంబంధించిన శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేసి భూమి పూజలో పాల్గొంటారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో రూ.300 కోట్ల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆస్పత్రిలో గ్రహణం మొర్రి, చెవుడు, మూగ రోగులకు సేవలందించే వార్డులను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ పద్మావతి కార్డియాక్ ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. క్యాన్సర్ రోగులకు ఆధునిక వైద్యం.. టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆస్పత్రిని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. క్యాన్సర్ రోగులకు అత్యున్నత వైద్యం అందించేందుకు రూ.190 కోట్ల వ్యయంతో 92 బెడ్ల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. అలాగే తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తొలి దశలో రూ.175 కోట్ల వ్యయంతో శ్రీనివాసం సర్కిల్ నుంచి వాసవి భవన్ సర్కిల్ వరకు నిర్మించిన వంతెన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం తిరుపతి కార్పొరేషన్ రూ.83.6 కోట్ల వ్యయంతో తూకివాకం గ్రీన్సిటీలో ఏర్పాటు చేసిన తడిచెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి, వెట్ వేస్ట్, డ్రైవేస్ట్ ప్రాజెక్టులు, భవన నిర్మాణ వ్యర్థాల ప్రాజెక్టు, మురికినీరు శుభ్రపరిచే ప్రాజెక్టులను సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం పర్యటన షెడ్యూల్.. సీఎం జగన్ గురువారం ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.45 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్కు వెళ్తారు. స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం 11.20 గంటలకు ఎస్వీ యూనివర్సిటీ స్టేడియానికి చేరుకొని జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొంటారు. 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చేరుకొని భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి కేన్సర్ కేర్ ఆస్పత్రికి చేరుకుని.. ఆ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.25కి రేణిగుంట నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను బుధవారం ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కన్వీనర్ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, కె.సంజీవయ్య, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్రెడ్డి పరిశీలించారు. -
సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: రేపు (గురువారం) తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 11.05 గంటలకు తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని ‘జగనన్న విద్యాదీవెన’ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చదవండి: బస్సులో బాబు.. సైకిల్పై చినబాబు ఆ తర్వాత 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి టాటా కేన్సర్ కేర్ సెంటర్ (శ్రీ వెంకటేశ్వర ఇన్ట్సిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ హాస్పిటల్)కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం 2.25 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
థ్యాంక్స్ అన్నది చిన్న మాట.. జగనన్నకు రుణపడి ఉంటాం
సాక్షి, నంద్యాల: ఉన్నత విద్యకు ఆలంబన లక్ష్యంతో పేద విద్యార్థుల చదువుకు ఫీజుల ఖర్చులను పూర్తిగా భరించడం. భోజన, వసతి ఖర్చులకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు విద్యార్దుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం నంద్యాలలో ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద రెండో విడతలో 10, 68, 150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.1,024 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా సభలో.. సీఎం జగన్ ఎదుట నంద్యాలకు చెందిన విద్యార్థిని కరణం బృహతి మానస మాట్లాడుతూ.. తాను శ్రీ రామకృష్ణ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు తెలిపింది. జగనన్న అందిస్తున్న వసతి దీవెన పథకం కింద ఏడాదికి రూ. 20 ఇవ్వడం తన లాంటి మధ్య తరగతికి చెందిన కుటుంబాల అమ్మాయిలకు ఎంతో ఉపయోగపడుతోందని చెప్పింది. నవరత్నాల్లో భాగంగా విద్యా దీవెనను ప్రవేశపెట్టినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపింది. వసతి దీవెన పథకం వల్ల ఎంతో మంది విద్యార్థులు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి చదువుతున్నారని పేర్కొంది. ప్రభుత్వం అందించే రూ. 20వేల ద్వారా ట్రాన్స్పోర్ట్ చార్జీలు, హాస్టల్స్ చార్జీలు, పౌషికాహారం అందుతోందని సంతోషం వ్యక్తం చేసింది. అమ్మఒడి పథకం వల్ల తన తమ్ముడు శ్రీరామ చంద్ర బడిలో మంచిగా చదువుకుంటున్నాడని తెలిపింది. తన లాంటి ఎంతో మంది జగనన్న వల్ల ఈరోజు చదువుకుంటున్నారని చెప్పింది. కాగా, తన తండ్రి గుడిలో అర్చకులుగా ఉన్నారని.. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వారికి జీతాలు డబుల్ అయ్యాయని.. దీంతో ఆర్థికంగా తన కుటుంబం నిలదోక్కుకుందని ఆనందం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు అన్ని తన ఇంట్లోనే ఉన్నాయని చిరునవ్వులు చిందించింది. ప్రతీ నెల ఒకటవ తేదీన వలంటీర్లు వచ్చి పెన్షన్లు అందిస్తున్నట్టు తెలిపింది. చివరగా నంద్యాల సభ సాక్షిగా ధన్యవాదాలు చెబుతూ.. జగనన్న వల్ల తాను బాగా చదువుకుని లాయర్ను అవుతానని పేర్కొంది. -
AP: ఇది విద్యా విప్లవం
నా చిట్టి చెల్లెళ్లు, తమ్ముళ్లు గొప్ప గొప్ప చదువులు చదవాలి. చదువుల వల్ల అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. పిల్లలు బాగా చదివితేనే వారు పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు. పిల్లలకు మనం ఏదైనా మంచి చేయగలం అనుకుంటే అది చదివించడమే. ఎవరూ దొంగలించలేని ఆస్తి చదువు మాత్రమే. చదువు జీవన ప్రమాణాలను మార్చేస్తుంది. పేద కుటుంబాల్లోని పిల్లలు ఓ డాక్టరో.. ఓ ఇంజినీరో అయితే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయి. అందుకే విద్యా దీవెన, వసతిదీవెన పథకాలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే వాటిలో ముందుంటాయి. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవు. ఎంత మంది పిల్లలుంటే అంత మందినీ చదివించండి. అందరికీ ఇస్తాం. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు మంచి అన్నగా.. తమ్ముడిగా, పిల్లలకు మంచి మేనమామగా ఇచ్చే కానుక ఇది. దీనివల్ల పిల్లలందరికీ సంపూర్ణంగా మంచి జరగాలని మనసారా కోరుతున్నాను. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు ఫలితాలిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ స్కూళ్లకు ఆరున్నర లక్షల మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలను చదివించాలని పేద తల్లిదండ్రులకు సూచించారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి దీవెన ఇస్తామని తెలిపారు. బుధవారం ఆయన సచివాలయం నుంచి జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఇవాళ 100 శాతం అక్షరాస్యత ఉన్న సమాజంలో మాతా, శిశు మరణాలు తక్కువగా ఉంటాయని, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. ‘ఒక ఊళ్లో ఒక పిల్లవాడు డాక్టర్ అయితే ఆ కుటుంబం బాగు పడటమే కాకుండా ఆ గ్రామం కూడా బాగు పడుతుంది. పెద్ద పెద్ద డాక్టర్లు చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చి, పై స్థాయికి వెళ్లిన తర్వాత కూడా ఆ గ్రామాలను గుర్తు పెట్టుకుని మంచి చేయడానికి తాపత్రయ పడతారు. అమెరికా వంటి దేశాల్లో ఉన్న వాళ్లు.. వాళ్ల గ్రామాలకు మేలు చేయడానికి అక్కడి నుంచి డబ్బులు పంపించడం చూస్తున్నాం. వారు ఉన్నత విద్య అభ్యసించడమే దీనికంతటికీ కారణం’ అని వివరించారు. అందువల్లే మన పిల్లల చదువులకు పేదరికం అడ్డు రాకూడదని, డబ్బులు లేక చదువులు ఆపేసే పరిస్థితి రాకూడదని గట్టిగా నమ్మి అండగా నిలుస్తున్నామన్నారు. నా కళ్ల ముందు మెదిలే ఘటన ‘ఫీజు రీయింబర్స్మెంట్ అనే అంశం మీద ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా, నా కళ్ల ముందు ఒక ఘటన మెదలుతుంది. నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు జరిగిన ఘటన అది. ఓ కాలేజీలో ఫీజు దాదాపు రూ.లక్ష ఉంటే.. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా దాదాపు రూ.30 వేలు మాత్రమే వచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితులలో చదువు సాగించలేనని ఓ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పిల్లాడి తండ్రి నా దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పారు. ‘రూ.30 వేలు మాత్రమే అందిస్తే, మిగిలిన రూ.70 వేలు ఎక్కడ నుంచి తేగలగాలి.. నా తల్లిదండ్రుల మీద భారం అవుతుంది’ అనుకుని ఆ పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక సంవత్సరం కిందా మీదా పడి తండ్రి రూ.70 వేలు సమకూర్చినా, రెండో సంవత్సరం పరిస్థితి ఏమిటి? అని ఆ విద్యార్థి ఆలోచించాడు. తండ్రితో ఆ భారాన్ని మోయించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజుకూ నేను ఆ ఘటనను మర్చిపోలేను. అందుకే ఆ పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదు.. నా చిట్టిచెల్లెళ్లు, తమ్ముళ్లు గొప్పగా చదివేలా చూడాలని ఆ రోజే నిర్ణయించుకున్నా. చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రాకూడదని ఇంతకు ముందు నాకన్నా గట్టిగా నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాన్నగారు (వైఎస్సార్) అనే చెప్పాలి. ఆ రోజుల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ దిశగా అడుగులు వేశారు’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. జగనన్న విద్యాదీవెన చెక్కుతో సీఎం జగన్. చిత్రంలో మంత్రి సురేష్, అధికారులు, లబ్ధిదారులు తర్వాత పాలకులు మొక్కుబడిగా.. ► నాన్న చనిపోయిన తర్వాత వచ్చిన పాలకులు మొన్నటి వరకూ.. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు మొక్కుబడిగా.. అదీ ఎప్పుడో.. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. ఈ పథకాన్ని మొత్తం నాశనం చేసే పరిస్థితుల్లోకి తీసుకుపోయిన తర్వాత మన ప్రభుత్వ వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. ► 2017–18, 2018–19 సంవత్సరాలకు ఏకంగా రూ.1,778 కోట్లు బకాయిలు పెడితే, పిల్లలకు ఇబ్బంది కలగకూడదని మనం చిరునవ్వుతో చెల్లించాం. ► దేశంలో ఎక్కడా లేని విధంగా, అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను ఇస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒక సారి డబ్బు విడుదల చేస్తున్నాం. ► దీనికితోడు ‘వసతి దీవెన’ అనే గొప్ప ఆలోచన చేశాం. దీని కింద వసతి, భోజనం కోసం పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు చదివే పిల్లలకు రూ.20 వేలు, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదివే పిల్లలకు రూ.10 వేలు ఏడాదికి రెండు దఫాలుగా ఇస్తున్నాం. మన ప్రభుత్వం ఇలా.. ► జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు గత ప్రభుత్వం ఉంచిన బకాయిలతో కలుపుకుని మన ప్రభుత్వం రూ.9,274 కోట్లు ఖర్చు చేసింది. దీంతో పాటు తొలిసారి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి, వారిని భాగస్వామ్యులను చేస్తూ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. ► అక్టోబర్, నవంబరు, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఇవాళ ఇస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి మే నెలలో చెల్లిస్తాం. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే ఆలస్యం లేకుండా ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. తల్లులు వెళ్లి ఫీజులు కట్టడం ద్వారా కాలేజీలో జవాబుదారీతనం పెరుగుతుంది. అక్కడ వసతులపై ప్రశ్నించే హక్కు వారికుంటుంది. ► వసతి దీనెన కింద మనం ప్రతి విద్యార్థికి ఇస్తున్న రూ.20 వేలలో ఇప్పటికే రూ.10 వేలు ఇచ్చాం. రెండో విడత ఏప్రిల్ 5న ఇస్తాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా ప్రజల్లోకి వెళ్లి దీన్ని అందజేస్తాం. ఇది కూడా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వేస్తాం. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు ► మనం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ స్కూళ్లలో 2018–19లో 37.50 లక్షల మంది విద్యార్థులు ఉంటే, ఈ రోజు 43.60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. సీటు కోసం సిఫారసు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ‘నాడు–నేడు’ అనే గొప్ప కాన్సెస్ట్తో సూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ► గతంలో క్లాస్ టీచర్లకే దిక్కు లేని పరిస్థితుల నుంచి ఏకంగా ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రత్యేక టీచర్ను తీసుకొచ్చే గొప్ప ప్రక్రియను తీసుకొస్తున్నాం. మొత్తం ఇంగ్లిష్ మీడియం చదువులు తీసుకొస్తున్నాం. సీబీఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నాం. నాడు–నేడుతో క్షేత్ర స్థాయిలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ► ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నో మార్పులు.. సత్ఫలితాలు ► గతంలో పిల్లలకు పుస్తకాలు ఎప్పుడిస్తారో తెలియదు. స్కూళ్లు ప్రారంభమైన ఆరు నెలల తర్వాత కూడా పుస్తకాలు ఇవ్వని పరిస్థితి. ఇవాళ స్కూళ్లు మొదలయ్యే సమయానికే పిల్లలందరికీ జగనన్న విద్యా కానుక పేరుతో మూడు జతల బట్టలు, స్కూల్ బ్యాగు, బైలింగ్వల్ (ద్వి భాష) టెక్టŠస్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, షూ ఇస్తున్నాం. ► స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్నం పూట జగనన్న గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో బలవర్థక ఆహారం అందిస్తున్నాం. పిల్లల మెనూ గురించి ఇంతగా ఆలోచించిన ముఖ్యమంత్రి బహుశా ఎవరూ ఉండరు. గతంలో మిడ్ డే మీల్ సరుకులకు, ఆయాలకు 7, 8 నెలల వరకు డబ్బులు ఇచ్చేవారు కాదు. ► ఆ పరిస్థితిని ఇవాళ పూర్తిగా మార్చేశాం. భోజన పథకానికి గతంలో రూ.600 కోట్లు అయితే, ఈ రోజు రూ.1,800 కోట్లు అవుతోంది. అమ్మఒడి, ఇతర పథకాలన్నింటి వల్ల ఎన్రోల్మెంట్ను గణనీయంగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. ► ఉన్నత విద్యలో జాబ్ ఓరియెంటెడ్ సిలబస్, అప్రంటిస్షిప్ విధానం అమలు దిశగా అడుగులు పడ్డాయి. వీటన్నింటి వల్ల పిల్లలకు మంచి జరగాలని ఆరాటపడుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నా విద్యా దీవెనకు రూపకల్పన చేసిన మీకు(సీఎం) ధన్యవాదాలు. మేం నలుగురు అక్కచెల్లెళ్లం. మా నాన్న ట్రాక్టర్ డ్రైవర్. అమ్మ కూలీ పనికి వెళ్తోంది. ఇదివరకు మా పెద్దక్కకు ఇలా చదువుకునే అవకాశం లేక మధ్యలోనే ఆపేసింది. ప్రస్తుతం నాతో పాటు మా చెల్లి కూడా చదువుకుంటోంది. తనకు విద్యా కానుక, అమ్మ ఒడి వస్తోంది. ఇతర పథకాలూ అందుతున్నాయి. బాగా చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. – సవర ఇందు, డిగ్రీ థర్డ్ ఇయర్, శ్రీకాకుళం -
విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలు: సీఎం జగన్
-
ఎవరూ దొంగలించలేని ఆస్తి.. చదువు: సీఎం జగన్
-
నెల్లూరు విద్యార్థి కథ చెప్పిన సీఎం జగన్
-
10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్: సీఎం జగన్
-
నా తమ్ముళ్లు, చెల్లెళ్లు గొప్పగా చదవాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని.. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. సచివాలయంలో విద్యాదీవెన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. అనంతరం విద్యాదీవెన కింద విద్యార్థుల తల్లుల అక్కౌంట్లకు నగదు బదిలీ చేశారు. చదవండి: విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు జమ చేసిన సీఎం జగన్ కార్యక్రమంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ►ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ►10.82లక్షల మంది విద్యార్ధులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికి సంబంధించి రూ.709 కోట్ల రూపాయలు పిల్లల తల్లుల ఖాతాలలోకి జమ చేస్తున్నాం ►ఇంతమంది కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు ►చదువులన్నది ఒక ఆస్తి ►పిల్లలకు ఏదైనా చేయగలిగితే.. ఎవ్వరూ కూడా దొంగిలించలేని ఆస్తి చదువు మాత్రమే ►చదువు జీవన ప్రమాణాలను మార్చేస్తుంది ►కుటుంబాలకు కుటుంబాలే పేదరికం నుంచి బయటపడతాయి ►నాకు సంతోషాన్ని కలిగించే కార్యక్రమాల్లో విద్యాదీవెన, వసతి దీవెన ఒకటి ►100శాతం లిటరసీ ఉన్న సమాజాలు ఎలా ఉంటాయో గమనించాలి ►100 శాతం లిటరసీ ఉన్న సమాజాల్లో శిశుమరణాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి ►విద్య ఉన్న కుటుంబాలకు, విద్య లేని కుటుంబాలకు చాలా తేడా ఉంటుంది ►ఒక గ్రామం నుంచి ఒకరు డాక్టరు అయితే కుటుంబం మాత్రమే కాదు, ఊరు కూడా బాగుపడుతుంది ►వారు పైస్థాయికి వెళ్లిన తర్వాత..ఆ గ్రామాలకు మంచి చేయడానికి చాలా తపన పడతారు ►కేవలం చదువులు వల్లనే వాళ్లు ఆ స్థాయికి వెళ్లారు ►చదువులకోసం పేదరికం అడ్డు రాకూడదు ►చదువులు ఆపే పరిస్థితి రానే రాకూడదని నేను గట్టిగా నమ్మాను ►ఫీజు రియింబర్స్ మెంట్మీద ఎప్పుడు మాట్లాడినా నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన నా కళ్లముందు కనిపిస్తూ ఉంటుంది ►నా తమ్ముళ్లు, చెల్లెళ్లు గొప్పగా చదవాలి ►చదువులు కారణంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు ►ఈ విషయాలను గట్టిగా నమ్మిన వ్యక్తి నాన్నగారు ►విప్లవాత్మకంగా పేదవాళ్లకు తోడుగా నిలిచిన వ్యక్తి ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,అగ్రవర్ణాల్లోని పేదలకోసం గతంలో నాయకులు కేవలం మాటలు మాత్రమే చెప్పేవారు ►కాని నాన్నగారు పూర్తి రీయింబర్స్మెంట్తీసుకు వచ్చారు ►తర్వాత పాలకులు, మొన్నవరకూ చూస్తే.. మొక్కుబడి ఇచ్చారు ►అదికూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ►మొత్తం స్కీంను నాశనం చేశారు ►ఇప్పుడు స్కీంను మనం వచ్చాక బాగా మార్పు చేశాం ►దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన వారందరికీ కూడా పూర్తి ఫీజురియింబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం ►ఎలాంటి అరియర్స్ లేకుండా.. ప్రతి త్రైమాసికానికీ చెల్లిస్తున్నాం ►బోర్డింగ్ ఖర్చులు కూడా వసతి దీవెన కింద ఇస్తున్నాం ►విప్లవాత్మక మార్పులతో అమలు చేస్తున్నాం ►గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్ మెంట్ ఎలా ఉందని ఆలోచన చేయండి ►ఏ స్థాయిలో ఫీజులున్నా.. ఇచ్చేది కేవలం రూ.35వేలు ►2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి రూ.1770 కోట్ల రూపాయలను బకాయిలు పెట్టి వెళ్లింది ►అయినా పిల్లలకోసం వాటిని కూడా చెల్లించాం ►విద్యాదీవెన, వసతి దీవెనల కోసం మన ప్రభుత్వం అక్షరాల రూ.9,274 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ►ఈ డబ్బులు ఇవ్వడమే కాకుండా మొదటసారిగా తల్లులఖాతాల్లోకి వేస్తున్నాం ►తల్లులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశాం ►మరో త్రైమాసికం రాకముందే.. చెల్లిస్తున్నాం ►ఎక్కడా ఇబ్బంది పడకుండా.. డబ్బులు చెల్లిస్తున్నాం ►తల్లులు వెళ్లి ఫీజులు కట్టడం మొదలుపెడితే... కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుంది ►అందుకే తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నాం ►వసతి దీవెన డబ్బులు కూడా తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నాం ►రెండో విడత వసతి దీవెన ఏప్రిల్ 5న విడుదల చేస్తాం ►ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలను చదివించండి ►పూర్తి ఫీజు రియింబర్స్మెంట్ ఇస్తాం ►పూర్తిగా వసతి దీవెన ఇస్తాం ►పిల్లలు బాగా చదివితేనే వారు పోటీప్రపంచంలో నిలబడగలరు ►పిల్లలకు మంచి మేనమామగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం ►విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ►ప్రభుత్వ స్కూళ్లకు ఆరున్నర లక్షలమంది ప్రైవేటునుంచి వచ్చారు ►ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి ►సబ్జెక్టు టీచర్లను పెడుతున్నాం ►ఇంతకుముందు క్లాసులకు టీచర్ లేని పరిస్థితి ►ఇంగ్లిషు మీడియం తీసుకు వచ్చాం, సీబీఎస్ఈ సిలబస్ను తీసుకు వస్తున్నాం ►నాడు – నేడు మాత్రమే కాకుండా విద్యాదీవెన తీసుకు వస్తున్నాం ►జగనన్న విద్యాకానుక పేరుతో యూనిఫారమ్స్, పుస్తకాలు, నోట్పుస్తకాలు, వర్క్బుక్స్, షూస్ ఇస్తున్నాం ►పిల్లల మెనూ గురించి కూడా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి బహుశా ఎవ్వరూ ఉండరేమో ►జగనన్న గోరు ముద్ద ద్వారా మంచి ఆహారం ఇస్తున్నాం ►గతంలో ఆయాలకు, సరుకులకు డబ్బులు ఇచ్చేవారు కాదు ►ఇవాళ ఏడాదికి రూ.1800 కోట్లు చెల్లిస్తున్నాం ►గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారు ►అమ్మ ఒడి ద్వారా స్కూళ్లలో ప్రవేశాలను గణనీయంగా పెంచాం ►ఉన్నత విద్య సిలబస్లో కూడా గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నాం ►ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం ►అప్రెంటిస్షిఫ్ విధానంకూడా కచ్చితంగా తీసుకువస్తున్నాం ►ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి మార్పులకు దారితీస్తాయి -
డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం: సీఎం జగన్
-
10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్
-
విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువు అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని.. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీజురీయింబర్స్మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్య ద్వారా నాణ్యమైన జీవితం సాకారమవుతుందన్నారు. ►జగనన్న విద్యా దీవెన.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే పథకం. ►ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ►జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 9,274 కోట్లు. ►టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లు జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
జగనన్న విద్యా దీవెన.. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ
సాక్షి, తాడేపలి: అక్టోబర్-డిసెంబర్, 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు జగనన్న విద్యా దీవెన కింద రూ.709 కోట్ల బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన కింద ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం రూ. 9,274 కోట్లను అందజేసింది. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లను కూడా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వమే చెల్లించింది. -
కన్వీనర్ కోటాకు జై..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ప్రభావం ఆయా కోర్సుల సీట్ల భర్తీలో పెను మార్పులను తెస్తోంది. ఈ పథకాల ద్వారా ప్రభుత్వం ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ చేయడంతో పాటు.. విద్యార్థుల వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకూ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యే సీట్ల శాతం.. గతంలో కన్నా భారీగా పెరిగింది. ఈ సీట్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ పోటీపడుతుండటంతో సీట్ల భర్తీలో గడచిన రెండేళ్లలో ఏకంగా 10 శాతానికి పైగా పెరుగుదల కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ముందు టీడీపీ హయాంలో చూస్తే.. ఇంజనీరింగ్ కోర్సుల్లో 2018లో 61.54 శాతం, 2019లో 51 శాతం మాత్రమే కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత 2020లో, 2021లో 73 శాతం మేర భర్తీ అవుతుండటం విశేషం. ఈడబ్ల్యూఎస్ కోటాలోని వారికి అదనంగా 10 శాతం సీట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రాష్ట్రంలో సీట్ల కేటాయింపు ఇంతకు ముందు నుంచీ ఉంది. అదనపు సీట్లు రాకుండా ఉంటే.. వీరికి కేటాయించిన సీట్లను కూడా కలుపుకొంటే కన్వీనర్ కోటా సీట్ల భర్తీ 2021లో 80.79 శాతం, 2020లో 80.60 శాతం అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్పాట్ అడ్మిషన్లకు ‘సీట్ల’ తగ్గుదల గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేనందున విద్యార్థుల చేరికల్లేక కన్వీనర్ కోటా సీట్లు భారీగా మిగిలిపోయేవి. ఆ తర్వాత వాటిని స్పాట్ అడ్మిషన్ల కింద ఆయా కాలేజీలు భర్తీచేసుకునేవి. ఇప్పుడు కన్వీనర్ కోటా సీట్లు అధిక శాతం భర్తీ అవుతుండటంతో స్పాట్ అడ్మిషన్లకు మిగులు సీట్లు తగ్గాయి. టీడీపీ హయాంలో 2015లో 40,436 సీట్లు, 2016లో 47,735 సీట్లు, 2019లో 45,888 సీట్లు మిగిలిపోయాయి. అదే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలుతో వాటి సంఖ్య 2020లో 28,575, అలాగే 2021లో 30,369 మాత్రమే మిగిలాయి. వీటిలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను మినహాయిస్తే కనుక ఈ సంఖ్య మరింత తక్కువే. 2021లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో కేవలం రెండు విడతల్లోనే ముగించారు. గతంలో కౌన్సెలింగ్ను నాలుగు విడతల వరకూ కూడా నిర్వహించేవారు. ఈ సారి కూడా అలాగే ఉంటుందని భావించిన పలువురు.. రెండు విడతల్లోనే కౌన్సెలింగ్ ముగియడంతో కన్వీనర్ కోటా సీట్లను దక్కించుకోలేకపోయారు. చేరికలు లేక గతంలో తగ్గిపోతూ వచ్చిన సీట్లు గతంలో రాష్ట్రంలో ప్రమాణాలు లేకున్నా పలు కాలేజీలను కొనసాగించిన దరిమిలా రాష్ట్రం మొత్తంమీద ఇంజనీరింగ్ కాలేజీలు 467 వరకూ ఉండేవి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేక చేరికలు తగ్గి ఆయా కాలేజీలు కోర్సులను రద్దు చేసుకోవడంతో సీట్ల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. 2015 నాటికి రాష్ట్రంలో 467 కాలేజీల్లో 1,13,745 సీట్లుండగా.. 2018 నాటికి 96,857, 2019 నాటికి 95,582 ఉన్నాయి. 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు అదనంగా చేరి మొత్తం సీట్లు 1,06,203కు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రమాణాలు లేని కాలేజీలను ప్రక్షాళన చేయడంతో వాటి సంఖ్య 437కు తగ్గింది. ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకొని కన్వీనర్ కోటా సీట్లు 2020లో 1,04,090, 2021లో 1,11,304కు చేరాయి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో కన్వీనర్ కోటా సీట్లలో అత్యధిక శాతం భర్తీ అవుతున్నాయి. ప్రవేశ పరీక్షల్లో అత్యధిక మార్కులతో మెరిట్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ నిరుపేద విద్యార్థులు గతంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేక అత్యధిక ఫీజులుండే ప్రముఖ కాలేజీల్లో చేరలేకపోయేవారు. కానీ ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రావడంతో వారంతా తమ మెరిట్కు తగ్గ ప్రముఖ కాలేజీల్లో చేరగలుగుతున్నారు. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో పది శాతం మేర పెరిగిన భర్తీ అయిన సీట్లన్నీ ఇటువంటి పేద విద్యార్థుల చేరికలతోనే అన్నది స్పష్టమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వం.. కాలేజీల్లో ఫీజు ఎంత ఉన్నా సరే.. రూ.35 వేలే ఇచ్చేది. దీనివల్ల మిగతా ఫీజును విద్యార్థులు చెల్లించాల్సి రావడంతో కోర్సు పూర్తయ్యే నాటికి తల్లిదండ్రులకు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకూ అప్పులయ్యేవి. -
కాలేజీల ఖాతాల్లోనే జమ చేయాలి
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన పథకం కింద స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా ఆయా కాలేజీల ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తానిచ్చిన తీర్పును పునః సమీక్షించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలను నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పిస్తూ గత ఏడాది జూన్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 28ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి సోమవారం ఉత్తర్వులిచ్చారు. -
పేద బిడ్డలకు పట్టం
తల్లులందరికీ ఒక మనవి... మంచి ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. మీ ఖాతాల్లో జమ చేసిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు లను వారం పది రోజుల్లోగా కళాశా లకు వెళ్లి చెల్లించాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఒకవేళ మీరు కాలేజీ లకు చెల్లించకపోతే తదుపరి విడ తలో ఆ ఫీజుల డబ్బులను మీ ఖాతా లకు కాకుండా నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కేవలం అక్షరాస్యత మాత్రమే కాకుండా పేద పిల్లలను వందకు వంద శాతం గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ ఆశయంతోనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ను తీసుకొస్తే ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ పథకాన్ని దెబ్బతీస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించకుంటే కాలేజీకి రావద్దని, పరీక్షలు కూడా రాయనివ్వబోమని అడ్డుకున్న ఘటనలను కూడా గతంలో చూశామని గుర్తు చేశారు. ఈ అవమానాలను తట్టుకోలేక, ఫీజులు కట్టలేక నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాన్ని తన పాదయాత్ర సమయంలో చూశానని, అది ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా చూడాలని, చదువుకునేందుకు పేదరికం అడ్డు కాకుండా అండగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని వివరించారు. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన మూడో విడత కింద 11.03 లక్షల మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుస్తూ 9,87,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. కంప్యూటర్ బటన్ నొక్కి నగదు జమ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలరాతను మార్చే పెద్ద చదువులు పేదరికం తొలగిపోయి తలరాతలు మారాలంటే ఇంజనీర్లు, డాక్టర్లు లాంటి పెద్ద చదువులు చదివిన వారి సంఖ్య బాగా పెరగాలి. గత సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి రూ.6,259 కోట్లు ఫీజుల కింద చెల్లించాం. దీనివల్ల దాదాపు 21,48,477 మంది విద్యార్ధులకు మేలు జరిగింది. ఇంజనీరింగ్, మెడిసిన్కూ రీయింబర్స్మెంట్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్.. ఇలా కోర్సులేవైనా పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. పీజీ కోర్సులకు కూడా ప్రభుత్వ కాలేజీలలో చదివే వారికి అమలు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ప్రతి మూడు నెలలకొకసారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వారే కాలేజీలకు వెళ్లి స్వయంగా వసతులను పరిశీలించి కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతను అప్పగించాం. పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి? బాగా చదువుతున్నారా? లేదా? అనే విషయాలను అవగతం చేసుకోవడంతోపాటు ల్యాబ్స్, ఇతర సదుపాయాలను తల్లులే స్వయంగా పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు. దీనివల్ల కాలేజీలకు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. తల్లుల పర్యవేక్షణతో ఈ రెండూ జరుగుతాయి. కాలేజీల్లో సమస్యలుంటే యాజమాన్యాలను ప్రశ్నించడమే కాకుండా 1902 నంబర్కు ఫోన్ చేసి తెలియచేస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది. ప్రైవేట్లోనూ కోటా గతంలో మెరిట్ ఉన్నా ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్ రంగంలోని ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీల్లో పేద విద్యార్థులు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సమూల మార్పులు తీసుకొచ్చాం. ప్రైవేట్ యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్లో 50 శాతం సీట్లు, ఇంజనీరింగ్, డిగ్రీ లాంటి ఇతర కోర్సుల్లో 35 శాతం సీట్లను కచ్చితంగా కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో సవరణలు చేశాం. ఫలితంగా పేద విద్యార్థులకు అవకాశం లభిస్తోంది. ఈ ఏడాది దాదాపు 2,118 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. వీరికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం. ప్రతిభ ఉన్న అర్హులైన పేద విద్యార్థులకు మేలు జరుగుతోంది. విద్యా దీవెన, వసతి దీవెనతో మంచి ఫలితాలు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇటీవల సర్వే నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరుతున్న 17 – 23 ఏళ్ల వయసు విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2020కి 35.2 శాతానికి పెరిగింది. 2018–19తో పోలిస్తే 2019–20లో జాతీయ స్థాయిలో జీఈఆర్ రేషియో పెరుగుదల 3.04 శాతం కాగా మన రాష్ట్రంలో 8.6 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో జీఈఆర్కు సంబంధించి ఎస్సీల్లో 1.7 శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28 శాతం పెరుగుదల ఉండగా మన రాష్ట్రంలో మరింత మెరుగైన ఫలితాలున్నాయి. ఎస్సీల్లో 7.5 శాతం, ఎస్టీల్లో 9.5 శాతం, విద్యార్థినుల్లో 11.03 శాతం పెరుగుదల నమోదైంది. జాతీయ స్థాయి సగటు కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ మనం అనుకున్న లక్ష్యాలను చేరాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలి. అందరి ఆశీస్సులు, దేవుడి దయతో గమ్యాన్ని చేరుకుంటామన్న నమ్మకం ఉంది. రెండున్నరేళ్లలో రూ.8,526 కోట్లు పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్కటే సరిపోదని వసతి దీవెన పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. పిల్లల బోర్డింగ్, మెస్ ఖర్చులు రూ.20 వేలు చెల్లించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులున్నారు. వారు అవస్థలు పడకూడదు, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే వసతి దీవెన అమలు చేస్తున్నాం. వసతి దీవెనకు ఇప్పటివరకు రూ.2,267 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశాం. పిల్లలకు మేనమామలా.. అక్క చెల్లెమ్మలకు తమ్ముడిగా, అన్నగా మంచి చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన.. ఈ రెండు పథకాలకు కలిపి ఈ రెండున్నర ఏళ్లలో రూ.8,526 కోట్లకుపైగా ఇచ్చాం. 16 కొత్త మెడికల్ కాలేజీలు.. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శరవేగంగా శ్రీకారం చుట్టాం. రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి. ట్రైబల్ వర్సిటీకి త్వరలో శంకుస్థాపన విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఉంటుంది. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటవుతున్నాయి. త్వరలోనే పనులు మొదలవుతాయి. డిగ్రీ కాలేజీల్లో నాడు – నేడు 2019 నుంచి రాష్ట్రంలో కొత్తగా పది డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశాం. 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రూ.880 కోట్లతో నాడు – నేడు పనులకు శ్రీకారం చుడుతున్నాం. రెండేళ్లలో పనులు పూర్తవుతాయి. ఉద్యోగాలు వచ్చేలా కోర్సులు.. డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం వైపు అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బైలింగువల్ (ద్వి భాషా) టెక్టŠస్బుక్స్ ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అందుబాటులోకి తెస్తున్నాం. ఉద్యోగాలు వచ్చే కోర్సులుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతీ డిగ్రీ విద్యార్ధికి అప్రెంటిషిప్, వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం జిల్లాల్లోని పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నాం. 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. మైక్రోసాఫ్ట్తో 40 కోర్సుల్లో ఉచిత శిక్షణ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిలో భాగంగా మైక్రోసాఫ్ట్ స్కిల్స్ ప్రాజెక్టు కింద 1.62 లక్షల మంది విద్యార్థులకు ఫ్యూచర్ రెడీ స్కిల్ సొల్యూషన్స్ అంటే 40 రకాల కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందచేసి సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు చేపట్టాం. 40 స్కిల్ కోర్సుల్లో డేటా ఎనలైటిక్స్, కృతిమ మేథస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, కోడింగ్, లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్ లాంటి 8,600 అంశాలను పొందుపరిచారు. పెద్ద కంపెనీలు, నాస్కామ్ లాంటి సంస్ధలను స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలతో అనుసంధానం చేస్తున్నాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్చంద్ర, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జే. శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్దండే, మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. తల్లులందరికీ ఒక మనవి... మంచి ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. మీ ఖాతాల్లో జమ చేసిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వారం పది రోజుల్లోగా కళాశాలకు వెళ్లి ఫీజుల కింద చెల్లించాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఒకవేళ మీరు కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడతలో ఆ ఫీజుల డబ్బులను మీ ఖాతాలకు కాకుండా నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. – సీఎం జగన్ -
‘అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు’
సాక్షి, అమరావతి: కరోనా సమయంలో కూడా విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యా దీవెన’ కింద రూ.686 కోట్లువిడుదల చేశారు. చదవండి: Jagananna Vidya Deevena: 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ ‘పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఎవరికీ పేదరికం అడ్డుకాకూడదు. అరకొరగా కాకుండా అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ మంచి చేస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తున్నాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ‘మన లక్ష్యం 100 శాతం అక్షరాస్యత మాత్రమే కాదు, 100 శాతం పిల్లల్ని గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టడం కూడా. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగేలా ఈఏడాది 3వ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ రూ.686 కోట్లు విడుదల చేశాం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఎవరికీ పేదరికం అడ్డుకాకూడదు. అరకొరగా కాకుండా అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ మంచి చేస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తున్నాం.2/2 pic.twitter.com/bZZTFL69aM — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 -
Jagananna Vidya Deevena: 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు
సాక్షి, అమరావతి: కరోనా సమయంలో కూడా విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద రూ.686 కోట్లు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. 2021 ఏప్రిల్ 19న మొదటి విడత.. జూలై 29న జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేశాం. పేదరికం చదువుకు అవరోధం కారాదు. ఉన్నత చదువులు అభ్యసిస్తేనే తల రాతలు మారుతాయి. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న ఫీజులు కాలేజీలకు తప్పకుండా కట్టాలి. లేకుంటే నేరుగా కాలేజీలకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది' అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ మాటల్లోని ముఖ్యాంశాలు.. ►నాన్నగారు ఫీజు రియంబర్స్మెంట్ను తీసుకు వచ్చారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ పథకాన్ని దెబ్బతీస్తూ వచ్చారు. కాలేజీలకు ఏళ్లతరబడి బకాయి పెట్టారు. దీనివల్ల కాలేజీల్లో నాణ్యతను అడిగే పరిస్థితి ఎలా వస్తుంది?. కాలేజీకి రావొద్దని, పరీక్షలు రాయనివ్వమని అన్న ఘటనలు కూడా మనం చూశాం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. అలాంటి పరిణామాల నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాదయాత్రలో నాకు ఎదురైంది. ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికీ రాకూడదనే అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు ముందుకేశాం. ►అర్హులైన విద్యార్థులందరికీ కూడా వందకు వందశాతం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా.. వారికి పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ,పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్.. ఈకోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. తల్లిదండ్రుల ఖాతాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జమచేస్తున్నాం. కాలేజీలకు పిల్లల తల్లులే వెళ్లి కాలేజీల పరిస్థితులను, వసతులను చూసి.. కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతలను తల్లిదండ్రులకే అప్పగిస్తున్నాం. లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను వాళ్లు ప్రశ్నించగలుగుతారు. దీనివల్ల కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుంది మంచి ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన మొదలుపెట్టాం మీ ఖాతాల్లో జమ అయిన సొమ్మును వారం రోజుల్లోపు కాలేజీలకు వెళ్లి ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం మీకు ఇచ్చిన తర్వాత కూడా మీరు కాలేజీలకు ఇవ్వకపోతే.. మీ ఖాతాలకు కాకుండా.. ఆఫీజుల సొమ్మును ఇవ్వక తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. దయచేసి ప్రతి తల్లీ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ఉన్నా.. ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్శిటీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి గతంలో ఉండేది. వీటిలో మార్పులు తీసుకు వచ్చాం. అన్ని ప్రైవేటు యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్ అయితే కచ్చితంగా యాభైశాతం, ఇతర కోర్సుల్లో అయితే 35 శాతం సీట్లు గవర్నమెంటు కోటాలో భర్తీ చేయాలని మార్పులు తీసుకు వచ్చి చట్టం చేశాం. ఇంతకుముందు అవకాశంలేని పేద విద్యార్థులకు అవకాశం వస్తోంది. ఈ ఏడాది దాదాపు 2118 విద్యార్థులకు అవకాశం వచ్చింది. వీరికి పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ఇస్తున్నాం. ప్రతిభ ఉన్న అర్హులైన పేదవిద్యార్థులకు గతానికి భిన్నంగా చదువుకునే అవకాశం లభించింది. మనసున్న ప్రభుత్వంగా మనం ఇవన్నీ చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనల ద్వారా చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే రిపోర్టులో మన రాష్ట్రంలో ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థల జీఈఆర్ రేష్యో 2020 నాటికి 35.2 శాతానికి పెరిగింది. 2018 –19 తో పోలిస్తే.. 2019–20 మధ్య పెరుగుదల దేశవ్యాప్తంగా 3.04 అయితే, మన రాష్ట్రంలో 8.6శాతంగా నమోదయ్యింది. జీఈఆర్ దేశవ్యాప్తంగా ఎస్సీల్లో 1.7శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28శాతం ఉంటే.. మన రాష్ట్రంలో ఎస్సీల్లో 7.5, ఎస్టీల్లో 9.5శాతం.. విద్యార్థినుల్లో 11.03శాతంగా నమోదయ్యింది. చదువుల కోసం భారం ఉండకూడదు. గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలి. దేశం కన్నా మనం మెరుగ్గా ఉన్నాం ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయతో ఆ గమ్యాన్ని మనం చేరుకుంటాం. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5వేలు, పాలిటెక్నిక్ చదివేవాళ్లకి రూ.15వేలు, డిగ్రీ, ఇతర కోర్సులు చదివేవారికి రూ.20వేలు ఇస్తున్నాం. ఇప్పటివరకూ 2,267 కోట్ల రూపాయలు ఇచ్చాం. మంచి మేనమామలా, తల్లులందరికీ మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన ఈ రెండు పథకాలకి కలిపి ఈ రెండు ఏళ్లలో రూ.8,500 కోట్లకుపైగా ఇచ్చాం. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ►విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్టీయూ యూనివర్శిటీని తీసుకువస్తున్నాం ►ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్శిటీని తీసుకువస్తున్నాం ►కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీని తీసుకువస్తున్నాం ►కురుపాంలో ఇంజినీరింగ్కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ, పాడేరులో మెడికల్ కాలేజీ తీసుకువస్తున్నాం ►2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా మరో 10 డిగ్రీలు కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం ►నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీకాలేజీల్లో 880 కోట్లతో నాడు – నేడుకు శ్రీకారం చుడుతున్నాం ►మరో 2 సంవత్సరాల్లో ఇవన్నీకూడా పూర్తిగా పనులు అవుతాయి ►డిగ్రీ కోర్సుల్లో కూడా మార్పులకు శ్రీకారం చుట్టాం ►ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులువేస్తున్నాం ►టెక్ట్స్ బుక్లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ తెలుగు ముద్రిస్తున్నాం ►ఉద్యోగాలు ఇచ్చే కోర్సులుగా వీటిని తీర్చిదిద్దుతున్నాం ►ఏకంగా 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నాం ►ఒక స్కిల్ యూనివర్శిటీని కూడా తీసుకువస్తున్నాం కాగా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్ల బకాయిలతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.6,259 కోట్లు ఫీజు చెల్లించారు. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ విద్యా పథకాల కింద 1,97,38,694 మంది విద్యార్థులకు రూ.34,753.17 కోట్ల వ్యయం చేశారు. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు: మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 'పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచింది. కానీ మన ప్రభుత్వం కోవిడ్ పరిస్థితుల్లోనూ జగనన్న విద్యాదీవెన అమలు చేస్తున్నామని' ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. -
29న జగనన్న విద్యా దీవెన
సాక్షి, అమరావతి: ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా.. ► ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు 432 కొత్త 104 వాహనాలు కొనడానికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్కు పాలనాపరమైన అనుమతులు మంజూరు. ఇందుకోసం రూ. 107.16 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. ► ఆంధ్రప్రదేశ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ బోర్డ్లో 8 పోస్టుల మంజూరు. డిప్యుటేషన్ విధానంలో 4, ఔట్సోర్సింగ్ విధానంలో 4 పోస్టుల భర్తీ. ► ఈ నెల 16వ తేదీన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ► వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్కు నాలుగు షెడ్ల కేటాయింపు, ఇన్సెంటివ్లకు ఆమోదం. ► డిక్సన్ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్కు 10 ఎకరాలు కేటాయింపు. ► రాజమహేంద్రవరం నగరం నామవరం గ్రామంలో 5 ఎకరాల భూమి ముంబైకి చెందిన మహీంద్రా వేస్ట్ టు ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్కు 20 సంవత్సరాలపాటు లీజుకు కేటాయింపు. ► తాడేపల్లి మండలంలో హేకృష్ణ ధార్మిక సంస్థకు 6.5 ఎకరాల భూమి లీజు పద్ధతిలో కేటాయింపు ► శ్రీకాకుళం జిల్లా పొందూరు డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్ పోస్టులు, 15 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు. 15 నాన్ టీచింగ్ పోస్టులు ఒక పోస్టు పదోన్నతి మీద, మిగిలినవి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకం. ► విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల పోరంబోకు భూమి గిరిజన మ్యూజియం, బొటానికల్ గార్డెన్, టూరిజం డెవలప్మెంట్కు కేటాయింపు. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 16 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం. ► ఏపీ హైకోర్టులో మీడియేషన్ సెంటర్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ (డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ► ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టంలో సవరణలకు ఆమోదం. కేటాయించిన ఇంటి çస్థలం 20 ఏళ్లకు కాకుండా 10 ఏళ్లకే విక్రయించుకునేందుకు అనుమతి. ► శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజీని మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టేముసాయిదా బిల్లుకు ఆమోదం ► ఆంధ్రప్రదేశ్ పశు పునరుత్పత్తి (పశు వీర్య ఉత్పత్తి, విక్రయం, కృత్రిమ గర్భోత్పత్తి సేవల క్రమబద్ధీకరణ) బిల్లుకు ఆమోదం. ► మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955కు సవరణల బిల్లుకు ఆమోదం. ► రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, అర్చక సంక్షేమం కోసం కామన్ గుడ్ ఫండ్ ఏర్పాటుకు, ఈఏఎఫ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించి చట్టంలో సవరణల బిల్లుకు ఆమోదం. అసెంబ్లీ ముందుకు బిల్లు. ► ధార్మిక పరిషత్తు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు దేవాదాయ శాఖ చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం ► ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్శిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టంలో సవరణలకు ఆమోదం. ► ఉన్నత విద్యా శాఖలో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్లో సవరణ బిల్లుకు ఆమోదం. ► జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ యాక్ట్కు సంబంధించిన సవరణ బిల్లుకు ఆమోదం. విజయనగరం జేఎన్టీయూ కాలేజీ పేరు విజయనగరం జేఎన్టీయూ జీవీ (గురజాడ విజయనగరం)గా మార్పు. ► ఉన్నత విద్యా శాఖలో ఏపీ యూనివర్శిటీ చట్టం 1991లో సవరణలకు ఆమోదం. ఆచార్య నాగార్జున ఒంగోలు పీజీ క్యాంపస్ను పేర్నిమిట్టకు మారుస్తూ నిర్ణయం. ► కొత్తగా ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటు ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్)–2021 బిల్లుకు ఆమోదం. ► వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 1971లో సవరణల బిల్లుకు ఆమోదం ► ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు విమెన్ కో కంట్రిబ్యూటరీ పెన్షన్ యాక్ట్ 2009కు సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదం. ► ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్–1994లో సవరణలకు ఆమోదం. జిల్లా పరిషత్లు, మండల పరిషత్లలో 2వ వైస్ చైర్మన్ పదవుల కోసం ఉద్దేశించిన సవరణలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు, ఇతర కులాల కార్పొరేషన్ల చైర్పర్సన్లకు జిల్లా పరిషత్ సమావేశాల్లో శాశ్వత ఆహ్వానితులుగా అవకాశమిస్తూ చట్ట సవరణకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 చట్టంలో సవరణలకు ఆమోదం. -
AP: అట్టడుగు వర్గాలకు అక్షర కాంతులు
ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధం విద్య మాత్రమే అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు అక్షర సత్యం. ఈ సిద్దాంతాన్ని బలంగా విశ్వసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విద్యా రంగ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దీనిలో భాగంగా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజుల ఖరారు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో 35 శాతం సీట్లు పేదలకు కేటాయింపు చేయాలనే నిర్ణయాలు ఎంతో దార్శనికతతో తీసుకున్నవిగా స్పష్టమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పథకంలో భాగంగా, పాఠశాల విద్యార్థులకు ఉపయుక్తంగా అందిస్తున్న జగనన్న కిట్లు మధ్యతరగతి, పేద విద్యార్థులకు వరంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని మార్పుచేసే విధంగా 44,512 పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం, తొలి దశలో రూ. 3,625 వేల కోట్లతో 15,715 పాఠశాలలను అద్దంలా, సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులకు అందించిన విధానం నభూతో న భవిష్యతి అన్న చందంగా సాగింది. ప్రధానంగా గతంలో గ్రామాలలో నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలచిన పాఠశాలలకు నాడు–నేడు పథకంలో పుష్కలంగా నిధులు సమకూర్చి అభివృద్ధి చేసిన విధానం పల్లె ప్రజల మనసులను చూరగొంది. (తెలుగు నేర్చుకో, ఆంగ్లంలో చదువుకో!) పనుల్లో పారదర్శకతను పాటిస్తూ తమ పాఠశాలను తామే అభివద్ధి చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. పాఠశాల చిన్నారులను ఆకర్షించే విధంగా రంగురంగుల వర్ణ చిత్రాలు, తరగతి గదుల్లో విద్యుత్ దీపాలు, విద్యార్థులు కూర్చునే బెంచీలు వంటి సకల వసతులను కల్పించడంతో పాటు, బాలికలకు అత్యంత ఉపయుక్తంగా నిలిచే శౌచాలయాలను నిర్మించి అందించింది. బాలికల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ, హాజరు శాతం పెంపుదల చేయడానికి ఇది ఒక కారణంగా నిలుస్తుంది. గత పాలకులు పాఠశాల విద్య విషయంలో కాగితాల్లో లెక్కలకే పరిమితం అయ్యారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయివరకు విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో నూతన పంథాలో నడిపించడానికి, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన రాష్ట్ర విద్యార్థులను సమాయత్తం చేయడానికి కంకణం కట్టుకున్నారనే విషయం స్పష్టమవుతోంది. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం) ‘ప్రపంచంలో నిజమైన శాంతిని కోరుకుంటున్నట్లయితే మనం చిన్నారులను విద్యావంతులుగా తయారు చేయాల’న్న మహాత్మాగాంధీ వ్యాఖ్యలను నిజం చేస్తూ పాఠశాల విద్యను అందరికీ చేరువ చేసే ప్రయత్నం ఏపీలో జరుగుతోంది. దీనిలో భాగంగా తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు ఖరారు చేయడం దేశంలోనే ఒక నూతన ఒరవడికి నాందిగా చెప్పవచ్చు. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో పాఠశాలల ఫీజులు రూ. 10 వేల నుంచి 18 వేల వరకు, జూనియర్ కాలేజీలకు రూ. 12 వేల నుంచి 20 వేల వరకు ఉండాలని, అదే విధంగా హాస్టల్ రుసుములు సైతం రూ. 18 వేల నుంచి రూ. 24 వేల మధ్యలో ఉండాలని నిర్ణయించారు. విద్యను పూర్తిగా ప్రైవేటీకరించిన ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తూ అందరికీ విద్యను చేరువ చేసే దిశగా తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని మనందరం స్వాగతించాల్సిన తరుణమిది. పేద విద్యార్థులకు అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిభ కలిగిన విద్యార్థులు పేదరికం కారణంగా విద్యకు దూరం కారాదనే దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా ఈ నిర్ణయం నిలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు వర్సిటీలలో ప్రవేశం పొందడం వలన పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెనతో వసతి భోజన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తూ విద్యార్థికి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యను పొందే వ్యవస్థను కల్పించాలని సంకల్పించారు. ఈ విధానంలో రిజర్వేషన్ అమలు చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బాలికలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్ అమలు జరిగి అట్టడుగు వర్గాలకు సంపూర్ణ న్యాయం చేకూరుతుంది. భవిష్యత్తులో జరిగే సంస్కరణలకు కేవలం ఇవి తొలి అడుగుగా భావించాలి. ఎంతో ఆర్థిక భారాన్ని భరిస్తూ రాష్ట్రంలో పేద, అట్టడుగు వర్గాల చిన్నారులకు విద్యను చేరువ చేయాలనే సమున్నత సంకల్పం ఎంతో అభినందనీయం. ఈ పథకాలను మరో దశాబ్ద కాలం అమలు జరిపితే ప్రతీ కుటుంబం విద్యావంతులతో సుసంపన్నం అవుతుంది. తద్వారా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, మరొకరికి చేయూతనందించే స్థాయికి చేరుకుంటారు. - డా. టి. షారోన్ రాజు వ్యాసకర్త విద్యా విభాగాధిపతి ఆంధ్ర విశ్వవిద్యాలయం -
కొత్త విద్యా శకానికి నాంది
-
విద్యా కానుక కిట్స్ అందజేసిన సీఎం వైఎస్ జగన్