James Bond
-
Aaron Taylor-Johnson: కొత్త జేమ్స్ బాండ్?
హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీ సూపర్హిట్. ‘జేమ్స్ బాండ్’ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 25 సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ ఎక్కువ సార్లు జేమ్స్ బాండ్గా సిల్వర్ స్క్రీన్పై కనిపించారు. 2021లో వచ్చిన జేమ్స్ బాండ్ 25వ చిత్రం ‘జేమ్స్ బాండ్: నో టైమ్ టు డై’లోనూ డేనియల్ క్రెగ్ బాండ్గా కనిపించారు. తాజాగా జేమ్స్ బాండ్ 26వ సినిమా గురించిన వార్తలు హాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తొలుత డేనియల్ క్రెగ్ పేరు వినిపించింది. కానీ మరోసారి బాండ్గా కనిపించేందుకు డేనియల్ ఆసక్తికరంగా లేరట. దీంతో కొత్త జేమ్స్ బాండ్గా ఎవరు కనిపిస్తారు? అనే చర్చ హాలీవుడ్లో మొదలైంది. ఈ క్రమంలో ఆరోన్ టేలర్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్లు చేయడం, వయసు రీత్యా కూడా జేమ్స్ బాండ్గా ఆరోన్ పర్ఫెక్ట్ చాయిస్ అంటున్నారు కొందరు హాలీవుడ్ సినీ ప్రేమికులు. అలాగే ‘జేమ్స్బాండ్ 26’వ చిత్రానికి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక హాలీవుడ్ చిత్రాలు ‘కిక్కాస్’, ‘చాట్ రూమ్’, ‘గాడ్జిల్లా’, ‘అవెంజర్స్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఆరోన్ టేలర్. -
సక్సెస్ స్టోరీ: జేమ్స్బ్రాండ్
జేమ్స్బాండ్ అంటే ఎవరండీ? ‘ఇది రిస్క్ సుమీ’ అని భయపడకుండా దూసుకుపోయేవాడు. పదిరూట్లు కనిపించినా... తనదైన సెపరేట్ రూట్ సృష్టించుకునేవాడు. విజయాలెప్పుడూ తన వెంటపడేలా కనిపించేవాడు. ఈ లక్షణాలు ఉన్న కరణ్ను జేమ్స్బాండ్ అని పిలుచుకోవచ్చు. అయితే తన పేరునే ‘బ్రాండ్’ చేసుకున్న అతడిని కాస్త సరదాగా జేమ్స్‘బ్రాండ్’ అని పిలుచుకుంటే మరీ బాగుంటుంది... ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్గా మారాడు. కరణ్ తొరాని దిల్లీలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ కోర్స్ చేస్తున్న సమయంలో తండ్రి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. ఫ్యాషన్ డిగ్రీ చేతికి అందగానే ‘ఇలా చేయాలి’ ‘అలా చేయాలి’ అనుకున్న తన కలలకు బ్రేక్ పడింది. చదువు పూర్తయిన తరువాత ఇద్దరు డిజైనర్ల దగ్గర పనిచేశాడు. మనసులో ఉన్న తన కల మాత్రం రోజూ పొద్దుటే హలో చెబుతూనే ఉంది. తన లక్ష్యాన్ని గుర్తు చేస్తూనే ఉంది. దీంతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్లు చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘రిస్క్–టేకర్’ అనే బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఫ్యాషన్ కోర్స్ చేయాలనుకున్నప్పుడు చాలామంది వెనక్కి లాగారు. ‘అది అందరికీ వర్కవుట్ కాదు’ అని నిరుత్సాహ పరిచారు. ‘ఎలాగైనా చేయాల్సిందే’ అని అకాడమీ మెట్లు ఎక్కినప్పుడు ‘రిస్క్–టేకర్’ అనే బిరుదు తగిలించారు. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ చేయడానికి బయటికి వచ్చినప్పుడు ‘కడుపులో చల్ల కదలకుండా డబ్బు వస్తుంటే ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు!’ అన్నారు. ‘చేయక తప్పదు’ అని మరోసారి అనుకున్నాడు కరణ్. మొదట తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో తాను డిజైన్ చేసిన గార్మెంట్స్ ఇమేజ్లను పోస్ట్ చేశాడు. అనూహ్యమైన స్పందన లభించింది. వారాల వ్యవధిలోనే అవి మల్టీ–బ్రాండ్ స్టోర్స్లలోకి వెళ్లాయి. హాట్కేకుల్లా అమ్ముడు అయ్యాయి. దీంతో తనలోని ఆత్మవిశ్వాసానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. బాలీవుడ్ అంటే తనకు వల్లమాలిన ఆసక్తి, అభిమానం. బాలీవుడ్లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్గా పేరు తెచ్చుకోవడానికి కరణ్కు ఎంతో కాలం పట్టలేదు. ఫ్యాషన్ ప్రపంచం ‘ఇతడొకడున్నాడు’ అని మన వైపు దృష్టి సారించడానికి, మనలో ‘మనదైన ప్రత్యేకత’ ఉండాలి. మరి కరణ్లోని ప్రత్యేకత గురించి చెప్పడానికి ముందు కాస్త ఫ్లాష్బ్యాక్లోకి వెళితే... దేశవిభజన సమయంలో కరణ్ పూర్వీకులు పాకిస్థాన్లోని సిం«ద్ నుంచి మనదేశానికి వలస వచ్చారు. చిన్నప్పటి నుంచి పూర్వీకుల కథలు వింటూ పెరిగాడు కరణ్. కరణ్ బాల్యం ఎక్కువగా భోపాల్లోని అమ్మమ్మ ఇంట్లో గడిచింది. అది ఇల్లు అనడం కంటే మ్యూజియం అంటే బెటర్. ఎందుకంటే ఇంటినలుమూలలలో చిన్న చిన్న దారుశిల్పాలు కనిపించేవి. అమ్మమ్మ వాటిని అంగట్లో కొని తెచ్చేది. రకరకాల చీరలు కనిపించేవి. చందేరి చీర తనను ఎంతో ఇన్స్పైర్ చేసింది. దిల్లీలోని లజ్పత్నగర్లో తండ్రికి ‘సింధి టెంట్హౌజ్’ ఉండేది. చిన్నప్పుడు తండ్రితో పాటు ఎన్నో వివాహవేడుకలకు వెళ్లేవాడు. ప్రతి పెళ్లివేడుకకు తనదైన గ్లామర్ గ్రామర్ ఉండేది. ఆ పాఠాలన్నీ తన మదిలో అలా నిలిచిపోయాయి. ఈ జ్ఙాపకాలన్నీ తన సృజనాత్మకతకు పదనుపెట్టాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్ను తన విజయసూత్రంగా చేశాయి. కరణ్ డిజైన్లలో జ్ఞాపకాలు పలకరిస్తాయి. కథలు చెబుతాయి. మరీ ఎక్కువగా మోడ్రన్గా ఉండకుండా, అలా అని తక్కువ కాకుండా గార్మెంట్స్ డిజైన్ చేస్తూ పాతజ్ఞాపకాల కొత్తలోకంలోకి తీసుకెళ్లడంలో చేయి తిరిగిన డిజైనర్ అనిపించుకున్నాడు కరణ్. ‘సైకిల్ ఆఫ్ ఫ్యాషన్’ అనే సూత్రాన్ని గట్టిగా నమ్మాడు. అలనాటి ఫ్యాషన్ ట్రెండ్స్ను కొత్త లుక్తో తీసుకువచ్చాడు. ఇద్దరు ఉద్యోగులతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాడు కరణ్. ఇప్పుడు రెండు వందల మంది ఉద్యోగులు అతడి దగ్గర పనిచేస్తున్నారు! -
తొలిసారిగా అది చూపించబోతున్నాం: మాధవన్
R Madhavan Says Nambi Narayanan Is James Bond: ‘‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమాకి ఆరేళ్లు పట్టింది. సాధారణంగా స్పేస్ సినిమాల్లో రాకెట్స్ను, స్పేస్ షిప్స్ను చూస్తుంటాం. కానీ ఏ సినిమాలోనూ రాకెట్ ఇంజిన్ను చూపించి ఉండరు. తొలిసారి మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని హీరో ఆర్. మాధవన్ అన్నారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్గా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’. ఆర్. మాధవన్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించారు. మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆర్. మాధవన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్ను నంబి నారాయణన్ పాకిస్థాన్కి అమ్మేశారనే నేరం కింద ఆయన్ని అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారు. కానీ సీబీఐ దర్యాప్తులో ఆయన నిరపరాధిగా నిరూపించబడ్డారు ? అదే ఈ చిత్రకథ. ఆయన లైఫ్ నాకు పేదవాడి జేమ్స్ బాండ్ స్టోరీలా అనిపించింది. చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్గా ఉండమని కామెంట్లు.. ఏడాదిన్నర పాటు ఈ కథను తయారు చేశాను. సైన్స్, టెక్నాలజీ రంగంలో చాలామంది మేధావులున్నారు. వారి గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమా చేశాను. ఈ సినిమాకి నేను ప్రోస్థటిక్ మేకప్స్ ఉపయోగించలేదు. నంబి నారాయణన్లా కనిపించటానికి బాగా కష్టపడ్డాను. ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాను చేయడానికి ఆ టీమ్ ఎంత కష్టపడ్డారో ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ కోసం మా టీమ్ కూడా అంతే కష్టపడింది’’ అని మాధవన్ తెలిపారు. చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్పేయి జీవిత కథ.. -
నెక్ట్స్ జేమ్స్ బాండ్ అతడేనా !.. మేకర్స్ ఏమంటున్నారంటే ?
జేమ్స్ బాండ్గా డేనియల్ క్రేగ్ నటించిన చివరి బాండ్ చిత్రం 'నో టైమ్ టు డై'. ఈ సిరీస్లో 25వ బాండ్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో ఏజెంట్ బాండ్ చనిపోవడంతోపాటు చక్కని భావోద్వేగపు వీడ్కోలు ఇచ్చారు మేకర్స్. అయితే డేనియల్ తర్వాత జేమ్స్ బాండ్గా సందడి చేయనుంది ఎవరా అనే అంశం ఆసక్తిగా మారింది. అనేక మంది హాలీవుడ్ స్టార్స్ సైతం ఆ పాత్రను చేయాలని ఉత్సుకతతో ఉన్నారు. ఈ క్రమంలో తర్వాతి జేమ్స్ బాండ్గా 'మండేలా: లాంగ్ వాక్ టు ఫ్రీడమ్' యాక్టర్ 'ఇడిస్ ఎల్బా' (Idris Elba) నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ నిర్మాతలు బార్బరా బ్రోకలీ, మైఖేల్ జీ విల్సన్లు స్పందించారు. స్క్రీన్రాంట్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాతలు ఇలా చెప్పుకొచ్చారు. 'మాకు ఇడిస్ చాలా బాగా తెలుసు. మాకు అతను మంచి స్నేహితుడు. అలాగే అద్భుతమైన నటుడు. కానీ జేమ్స్ బాండ్ గురించి ఇలా మాట్లాడటం ఎప్పుడూ కష్టమే. మీకు తెలుసా. నో టైమ్ టు డై సినిమా విడుదల వరకు డేనియల్నే బాండ్గా నిర్ణయించుకున్నాం. అలాగే అతను బాండ్గా ఎంతగా అలరించాడో చూశాం. తర్వాత బాండ్ గురించి మేము ఇంకా ఎవరి గురించి ఆలోచించలేదు. ఎవరితో మాట్లాడలేదు.' గతేడాదే తదుపరి జేమ్స్ బాండ్ తానే అనే పుకార్లకు చెక్ పెట్టాడు ఇడిస్. లండన్లో ఒక సంభాషణల మధ్య 'కాదు. నేను జేమ్స్ బాండ్ను కాను. మార్పును కోరుకున్నట్లయితే నలుపు, తెలుగు వంటి వర్ణం గురించి మాట్లాడనప్పుడే ఆ పాత్ర చేస్తాను.' అని ఇడిస్ తెలిపాడు. అయితే ఈ తర్వాతి బాండ్ కోసం నాన్-బ్రిటిష్ ఆర్టిస్ట్, బ్లాక్ ఆర్టిస్ట్ను తీసుకోనుట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఇడిస్ అలా మాట్లాడి ఉండోచ్చని తెలుస్తోంది. -
తెలుగులో వచ్చిన జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు ఇవే..
బాండ్.. జేమ్స్ బాండ్.. అనే ఈ ఒక్క డైలాగ్ చాలు బాండ్ అభిమానులను విజిల్స్ వేయించడానికి. ఆ డైలాగ్లో ఏదో మత్తు ఉందని తెగ సంబరపడిపోతారు. జేమ్స్ బాండ్ మూవీ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్గా కోట్లలో అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. అంతలా ఈ మూవీ సిరీస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకుంది. ఈ మూవీస్లో ఏజెంట్ 007 చేసే సాహసకృత్యాలు ప్రతి ఒక్కరినీ ఔరా అనిపిస్తాయి. ఇక హీరోయిన్స్తో బాండ్ చేసే రొమాన్స్ గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా డానియల్ క్రేగ్ నటించిన నో టైమ్ టు డై మూవీతో ఇప్పటివరకు 25 బాండ్ చిత్రాలు వచ్చాయి. హాలీవుడ్లో వచ్చిన ఈ సినిమాల్లో మొత్తం ఏడుగురు యాక్టర్స్ బాండ్ క్యారెక్టర్ను పోషించారు. అయితే మన తెలుగు వాళ్లకు జేమ్స్ బాండ్ అంటే మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకువస్తారు. ఏజెంట్ 116 పాత్రలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116తో పాటు తెలుగులో వచ్చిన బాండ్ చిత్రాలపై ఓ స్టోరీ చూసేద్దామా..! 1. గూఢచారి 116 తెలుగులో వచ్చిన మొదటి జేమ్స్ బాండ్ చిత్రం. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, జయలలిత హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేయగా మల్లికార్జున రావు దర్శకత్వం వహించారు. పలు నేరాలకు సాక్ష్యాలైన ఫొటో ఎవిడెన్స్ కోసం సీక్రెట్ ఏజెంట్ 303ను ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హత్య చేస్తుంది. ఈ కేసును చేధించడానికి ఏజెంట్ 116కు సీఐడీ అప్పగిస్తుంది. దానిని ఏజెంట్ 116 ఎలా చేధించారు, ఆ ఫొటోలో ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయనేది సినిమా కథ. 2. గూఢచారి నెం. 1 కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన గూఢచారి నెం.1లో మెగస్టార్ చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1983లో విడుదలై మంచి హిట్ టాక్ అందుకుంది. నెంబర్ 1 అనబడే ఒక ప్రభుత్వ ఏజెంట్ దేశద్రోహుల్ని ఎలా పట్టుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో మెగస్టార్ చిరంజీవి తొలిసారిగా గూఢచారి పాత్ర పోషించారు. 3. విశ్వరూపం ‘విశ్వరూపం’ సినిమాలో కమల్... భారత్ జేమ్స్బాండ్గా ఏ రకంగా నట విశ్వరూపం చూపించాడో తెలిసిందే. 60 ఏళ్ల వయసులో కమల్ ఈ మూవీ కోసం చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్గా విడుదలైన ‘విశ్వరూపం2’ మాత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోలేకపోయింది. గతంలో కమల్ హాసన్ కొన్ని సినిమాల్లో జేమ్స్బాండ్ తరహా పాత్రలో నటించారు. 4. గూఢచారి అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రం 2020లో విడుదలైంది. ఇది పూర్తిగా జెమ్స్ బాండ్ తరహాలో వచ్చిన ఈ చిత్రంలో తన నటనతో అడవి శేష్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితం దక్కించుకుంది ఈ చిత్రం. ఇప్పుడు దీనికి సీక్వెల్గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నారు. 5. చాణక్య గోపిచంద్ హీరోగా నటించిన చిత్రం చాణక్య. ఇందులో గోపిచంద్ రా ఏజెంట్గా మెప్పించారు. ఈ సినిమాకు అబ్బూరి రవి కథ రాయగా డైరెక్టర్ తిరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. చదవండి: జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్కి అరుదైన గౌరవం ఇవే కాకుండా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో డార్లింగ్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని జేమ్స్ బాండ్ తరహాలో రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక డార్లింగ్ను సీక్రెట్ ఏజెంట్ పాత్రలో చూస్తే ప్రభాస్ అభిమానులకు పండగే. మరోవైపు ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న రాజా విక్రమార్క చిత్రం కూడా సీక్రెట్ ఏజెంట్ కథాంశంతోనే నవంబర్ 12న రిలీజ్ కానుంది. -
జేమ్స్ బాండ్ 007 పేరుతో ప్రధాని మోదీపై విమర్శలు
కోల్కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని జేమ్స్బాండ్ 007తో పోల్చుతూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ.. జేమ్స్ బాండ్ వేషధారణలో ఉన్నట్లు ఓ మీమ్ను క్రియేట్ చేసి ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తన ఫేస్బుక్లో షేర్ చేశారు. మోదీ బాండ్ పోస్లో ఉన్న మీమ్లో.. ‘నన్ను జేమ్స్ 007 అని పిలుస్తారు. 0 అభివృద్ది, 0 ఆర్థిక వృద్ధి, 7 ఏళ్ల ఆర్థిక విధ్వంసం’ అని వివరిస్తూ తీవ్రంగా విమర్శించారు. టీఎంసీ ఇటీవల ప్రధాని మోదీ ప్రభుత్వం అధకారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఏం అభివృద్ది జరగలేదని పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ సామాన్యులకు ఇబ్బందిగా మారుతోందని దుయ్యబట్టారు. ఆయన షేర్ చేసినా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. -
జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్కి అరుదైన గౌరవం
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో నటించిన యాక్టర్స్కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సుదీర్ఘకాలం అలాంటి కేరక్టర్ చేసిన హాలీవుడ్ స్టార్ డేనియల్ క్రెగ్. ఆయనకి అరుదైన గౌరవం లభించింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్తో డేనియల్ని సత్కరించింది హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. లెజెండరీ బాండ్ నటుడు రోజర్ మూర్ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన 2,704 నటుడు ఈయనే. అయితే ఇప్పటి వరకు అయిదు బాండ్ సినిమాల్లో నటించిన డేనియల్కి తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ చివరిది. దీంతో తన టీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ 53 ఏళ్ల స్టార్ బాండ్ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. వారు లేకుండా తాను అలాంటి అరుదైన గౌరవాన్ని పొందేవాన్ని కాదని చెప్పాడు. అయితే ఇటీవలే విడుదలైన 24 వ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనూ మంచి వసూళ్లను సాధించింది. ఈ తరుణంలో 2006లో ‘క్యాసినో రాయల్’తో బ్రిటీష్ గూఢచారిగా ప్రస్థానం ప్రారంభించి.. సుదీర్ఘకాలం బాండ్ పాత్రలో జీవించిన డేనియల్కి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది హాలీవుడ్. చదవండి: ఓకే ఫైట్సీన్కి 32వేల లీటర్ల కూల్డ్రింక్స్! -
జేమ్స్ బాండ్: ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా!
జేమ్స్ బాండ్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ నుంచి సిరీస్ వస్తుందంటే చాలు చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరక జేమ్స్ బాండ్ నుంచి 24పైగా సిరీస్లు వచ్చాయంటే ఈ బాండ్కు ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. హాలీవుడ్ చిత్రమైనప్పటికీ ఇండియాలో కూడా ఈ సిరీస్ అత్యంత క్రేజ్ను సంపాదించుకుంది. చదవండి: జేమ్స్ బాండ్.. బై బై డేనియల్ ఇటీవల ఈ సిరీస్ నుంచి ‘నో టైమ్ టు డై’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. గురువారం(సెప్టెంబర్ 30) ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ విడుదలైంది. భారత్లో కూడా ఈ మూవీ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన తొలి రోజే భారత్లో ఈ సిరీస్ రూ. 2. 25 కోట్లు వసూళ్లు చేయగా.. యూకేలో రూ. 4.5 మిలియన్ల యూరోలు రాబట్టింది. అయితే దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. చదవండి: OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే కరోనా కాలంలో కూడా ఈ మూవీ ప్రపంచ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన ఒక్క రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాండ్ సిరీస్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కించిన సిరీస్ ఇది. ఈ సిరీస్లో 5 సార్లు జేమ్స్ బాండ్గా నటించిన డేనియల్ క్రెగ్కు ఇది చివరి చిత్రం. ‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని లండన్, జమైకా, ఇటలీలో చిత్రీకరించారు. -
జేమ్స్ బాండ్.. బై బై డేనియల్
No Time To Die: బ్రిటిష్ నటుడు డేనియల్ క్రెయిగ్ బాండ్ క్యారెక్టర్ హోదాలో చివరిసారిగా రెడ్కార్పెట్పై సందడి చేశారు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో రాబోతున్న 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ ఈ నెల 30న యూకేతో పాటు భారత్లోనూ(తెలుగులో కూడా) రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో మంగళవారం లండన్లో స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రదర్శనకు నో టైం టు డై నటీనటులతో పాటు ప్రముఖ బ్రిటిష్ యాక్టర్స్ తరలివచ్చారు. ఇక బాండ్ క్యారెక్టర్ హోదాలో చివరిసారిగా యాభై మూడేళ్ల డేనియల్ క్రెయిగ్ రెడ్ కార్పెట్పై కనిపించారు. క్రెయిగ్తో పాటు ఈ సినిమాలో బాండ్గర్ల్గా కనిపించనున్న అన డె ఆర్మస్, విలన్ పాత్ర పోషించిన రామీ మాలేక్ కూడా సందడి చేశారు. Rami Malek, the villainous Safin in #NoTimeToDie, has made his appearance at the @RoyalAlbertHall. pic.twitter.com/vwj4u59aMl — James Bond (@007) September 28, 2021 Ana de Armas (Paloma) is lighting up the @RoyalAlbertHall's red carpet at the #NoTimeToDie World Premiere. pic.twitter.com/oyzjLVou8d — James Bond (@007) September 28, 2021 ఇదిలా ఉంటే బాండ్ ఫ్రాంచైజీలో ఏడో జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్. ఈ బ్రిటిష్ స్పై సిరీస్లో డెనియల్ క్రెయిగ్ 2006 కాసినో రాయల్లో తొలిసారి బాండ్గా కనిపించాడు. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత తన నటనతో అలరిస్తూ వచ్చాడు. క్వాంటమ్ ఆఫ్ సోలేస్(2008), స్కైఫాల్(2012), Spectre (2015)లో బాండ్గా అలరించాడు డేనియల్ క్రెయిగ్. నిజానికి నో టైం టు డై సినిమా కంటే ముందే రిటైర్ అవ్వాలని భావించినప్పటికీ.. భారీ రెమ్యునరేషన్ కమిట్మెంట్ కారణంగా చేయాల్సి వచ్చిందని క్రెయిగ్ క్లారిటీ ఇచ్చాడు. We've been expecting you... Daniel Craig has arrived on the red carpet at the World Premiere of #NoTimeToDie at the @RoyalAlbertHall. pic.twitter.com/WhG226rKus — James Bond (@007) September 28, 2021 క్రెయిగ్ రిటైర్మెంట్ తరుణంలో తర్వాతి బాండ్ ఎవరనే చర్చ కూడా నడుస్తోంది. నాన్-బ్రిటిష్ ఆర్టిస్ట్, బ్లాక్ ఆర్టిస్ట్ను లేదంటే ఫిమేల్ బాండ్ను జేమ్స్ బాండ్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఈయోన్ ప్రొడక్షన్స్ ఉన్నట్లు సమాచారం. చదవండి: జేమ్స్ బాండ్కు శ్రీరామరక్ష ఏదో తెలుసా? -
జేమ్స్ బాండ్కు శ్రీరామరక్ష ఏదో తెలుసా?
అందమైన లొకేషన్లలో మత్తెక్కించే.. కైపెక్కించే అమ్మాయిలతో సరదా షికారు. ‘‘ ఏమి హాయిలే హలా’’ అంటూ ఆహ్లాదమైన అనుభూతిని ఆస్వాదిస్తున్న టైంలో.. ఊహించని విధంగా ఊడిపడే ముప్పు. ఒక్కసారిగా మీద దూకే శత్రువులు.. వాళ్లతో ఫేస్ టు ఫేస్ ఫైట్, ‘ధడేల్’మంటూ పేలే బాంబులు.. దడ్దడ్ అంటూ బుల్లెట్ల వర్షం.. వాటి మధ్య నుంచే కారులో ‘జుయ్’ మంటూ దూసుకుపోతుంటాడు జేమ్స్ బాండ్.. జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీలో హీరోలు మాత్రమే రాయల్ లుక్లో కనిపించరు. ఆ సినిమాల్లో కనిపించే ప్రతీదానికి ఓ రిచ్నెస్, ప్రత్యేకతలు ఉంటాయి. జేమ్స్ బాండ్ నడిపే కారుకు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆ కారు బుల్లెట్లను కక్కుతుంది. కత్తులు దూస్తుంది. కొండలు ఎగబాగుతుంది. సముద్ర తీరంలో ఇసుక తిన్నెల్లో దూసుకుపోతుంది. అద్దాలు బద్దలు గొట్టుకుని ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్లోకి పోతుంది. అవసరమైతే గాల్లో అమాంతం ఎగురుతుంది. ఛేజింగ్లో బుల్లెట్లను, బాంబులను తట్టుకునే కార్లు బాండ్ బాబుకి శ్రీరామ రక్షగా నిలుస్తుంటాయి. అందుకే బాండ్ బాబు వాడే బ్రాండ్ కార్లకు అంతే క్రేజ్ ఉంటుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి మరీ ఆ కార్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటారు అభిమానులు. బాండ్.. జేమ్స్ బాండ్ పేరుకే ఈ 007 ఏజెంట్.. ఓ గూఢచారి బ్రిటిష్ క్యారెక్టర్. కానీ, ఏళ్లుగా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ వస్తున్నాడు. బాండ్ రోల్లో కనిపించేది ఎవరైనాసరే.. అభిమానులు మాత్రం ఆ క్యారెక్టర్ను అతుక్కుపోతుంటారు. జేమ్స్ బాండ్ ఇరవై ఐదవ సినిమా ‘నో టైం టు డై’.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈమూవీ.. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్లో రిలీజ్ కానుంది. అమెరికా నుంచి అక్టోబరు 8న కొంచెం ఆలస్యంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా దాదాపు యాభై ఏళ్లుగా బాండ్ వాడిన కార్ల మీద ఓ లుక్కేద్దాం. సన్బీమ్ అల్పైన్ బాండ్ ఎక్కువగా లోకల్ మేడ్ కంపెనీ కార్లను ఉపయోగిస్తుంటాడు. జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీలో 1962లో ‘నో డాక్టర్’ నుంచి జేమ్స్ బాండ్ క్యారెక్టర్ స్పెషల్ కార్లను ఉపయోగిస్తోంది. సన్బీమ్ అల్పైన్ కంపెనీ సిరీస్ 2 కారును ఉపయోగించాడు. క్లాసిక్ ఫ్యాషన్లో ఈ బ్లూ కలర్ కారులో నటుడు సీన్ కానరీ వెళ్తుంటే.. ఎంతో స్టైలిష్గా అనిపించకమానదు. అయితే సినిమాలో బాండ్ పర్సనల్ కారు కాదు. జమైకా ఏజెంట్ జాన్ వేస్ సొంత కారు. బెంట్లీ మార్క్ ఫ్రమ్ రష్యా విత్ లవ్(1963) లో అప్పటికే మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు గడిచిన బెంట్లీ మార్క్ IV కారును ఉపయోగించారు. టయోటా యూ ఓన్లీ లివ్ ట్వైస్(1967)లో జపాన్ ఫస్ట్ సూపర్ కార్ టయోటా 2000 జీటీని ఉపయోగించారు. అయితే సీన్ కానరీ పొడగరి కావడంతో ఆ కారుకు కొన్ని మార్పులు చేసి ప్రత్యేకంగా కారును డిజైన్ చేశారు. మెర్క్యూరీ కూగర్ ఆన్ హర్ మెజెస్టీస్ సీక్రెట్ సర్వీస్(1969)లో ప్రేయసి ట్రేసీ కారును ఉపయోగిస్తాడు బాండ్. అందులో ఆమెది మెర్క్యూరీ కూగర్ ఎక్స్ఆర్-7 మోడల్ కారు. ఫోర్డ్ డైమండ్స్ ఆర్ ఫర్ఎవర్(1971)లో అప్పటిదాకా సినిమాల్లోకెళ్లా బెస్ట్ ఛేజింగ్ సీన్ ఉంటుంది. ఎర్రకలర్ ఫోర్డ్ మస్టాంగ్ మాచ్ 1 మోడల్ కారును అందుకోసం ఉపయోగించారు. ఈ ఛేజ్ సీన్ బాండ్ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. డై అనదర్ డే(2002)లో ఐదు దశాబ్దాల కిందటి మోడల్ ఫోర్డ్ ఫెయిర్లేన్ను ఉపయోగించారు. ఏఎంసీ హోర్నెట్ ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్(1974) హోర్నెట్ ఎక్స్ హాట్చ్బ్యాక్ కారును ఉపయోగించారు. మేరీ గుడ్నైట్ను కాపాడే ప్రయత్నంలో బాండ్ చేసే ఛేజింగ్ కోసం ఈ కారును ఉపయోగించారు. లోటస్ ఎస్ప్రిట్ ది స్పై హు లవ్డ్ మీ(1977) కోసం ఎస్ప్రిట్ ఎస్1 కారును ఉపయోగించారు. అయితే సినిమాలో ఇదొక సూపర్ కార్గా చూపించేశారు. నీరు, గాలి, నేల మీద ఛేజ్ సీన్ల కోసం డిజైనింగ్ ఉండడం ప్రత్యేకం. రాకెట్లు సైతం పేల్చేది ఈ కారు. ఫర్ యువర్ ఐస్ ఓన్లీ(1981) కోసం లోటస్ ఎస్ప్రిట్ ఎస్సెక్స్ టర్బో మోడల్ కారును ఉపయోగించారు. సిట్రోయిన్ పాపం.. బాండ్ లోటస్ కారు నాశనం అయ్యాక కొత్త కారును వాడుతుంటాడు. ఫర్ యువర్ ఐస్ ఓన్లీ(1981)లో సిట్రోయిన్ 2 సీవీ కారును ఉపయోగించారు. బజాబ్ ఆర్ఈ ఆటో బాండ్ కేవలం కార్లు మాత్రమే వాడతాడా? అనే అనుమానాలు రావొచ్చు. అవసరమైతే బైకులు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఫస్ట్ టైం బాండ్ కోసం భారత్ ‘దేశీ’ టచ్ ఇచ్చారు. ఆక్టోపస్సీ(1983) సినిమాలో ఓ సీన్లో బాండ్ ఛేజింగ్ బజాజ్ ఆర్ మోడల్ ఆటోలో నడుస్తుంది. రెనాల్ట్ ఏ వ్యూ టు కిల్(1985)లో రెనాల్ట్ ట్యాక్సీని ఉపయోగించారు. రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్ 2 మోడల్ కారును ‘ ఏ వ్యూ టు ఏ కిల్’(1985) సినిమా కోసం ఉపయోగించారు. మార్కెట్లోకి వచ్చిన దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ మోడల్ను బాండ్ మూవీలో ఉపయోగించారు. బీఎండబ్ల్యూ గోల్డెన్ఐ(1995) కోసం బీఎండబ్ల్యూ జీ3 మోడల్ను ఉపయోగించారు. ఆ తర్వాత టుమారో నెవర్ డైస్(1997) కోసం బీఎండబ్ల్యూ 740ఐఎల్ను(750ఐఎల్ బ్యాడ్జ్లు) కారును బాండ్ వాడాడు. ఇక 1999లో వచ్చిన ‘ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్’ కోసం బీఎండబ్ల్యూ జీ8 మోడల్ కారును ఉపయోగించారు. ఆస్టోన్ మార్టిన్ బాండ్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగించిన కారు బ్రాండ్ ఇది. సుమారు పది సినిమాలకు పైగా ఈ కారునే బాండ్ క్యారెక్టర్ వాడుతుంది. ‘ది లివింగ్ డేలైట్స్’(1987) అస్టోన్ మార్టిన్ వీ8, గోల్డెన్ ఐ(1995), టుమారో నెవర్ డైస్(1997) కోసం అస్టోన్ మార్టిన్ డీబీ5, డై అనదర్ డే(2002) కోసం అస్టోన్ మార్టిన్ వీ12 వాన్క్విష్, కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలేస్(2008) కోసం డీబీఎస్ వీ12, అస్టోన్ మార్టిన్ డీబీ5 మోడల్ కారును కాసినో రాయల్(2006), స్కైఫాల్(2012) కోసం ఉపయోగించారు. రాబోయే ‘నో టైం టు డై’(2021)లోనూ జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్ కోసం ఈ కంపెనీ కారునే ఉపయోగిస్తున్నారు. - సాక్షి, వెబ్డెస్క్ ప్రత్యేకం చదవండి: గన్నులున్న బాండ్ కారు.. ధరెంతో తెలుసా? -
త్రీడీలో విడుదల కానున్న మొదటి జేమ్స్బాండ్ మూవీ ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్బాండ్ చిత్రాలకి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటి వరకు 24 సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం డేనియల్ క్రేగ్ ప్రధాన పాత్రలో 25వ మూవీగా ‘నో టైమ్ టూ డై’ రిలీజ్కు సిద్ధమవుతోంది. మొట్టమొదటి సారి ఓ బాండ్ మూవీని ఇండియాలో 3డీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కరోనా ఉన్న ఈ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్కి వస్తారో లేదోనని అందరూ సంశయంలో ఉన్నారు. ఈ తరుణంలో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘షాంగ్ ఛీ: ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ ఇండియాలో కూడా మంచి కలెక్షన్స్ని కొల్లగొట్టింది. దీంతో జేమ్స్బాండ్ ‘నో టైమ్ టూ డై’ చిత్రాన్ని భారీ స్థాయిలో 1600పైగా స్క్రీన్లలో సెప్టెంబర్ 30న చిత్రాన్ని 2డీ, త్రీడీలో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. ఇంతకుముందు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 వంటి ఇతర సినిమాలు ప్రపంచం అంతా త్రీడిలో విడుదలైన ఇక్కడ మాత్రం 2డీలోనే రిలీజ్ చేశారు. ఈ సమయంలో ఈ సినిమాని 3డీ విడుదల చేయనుండడం విశేషం. అయితే గతేడాది విడుదల అవ్వాల్సిన ఈ మూవీ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకాదరణని పొందింది. కారీ జోజి దర్శకత్వం వహిస్తున్న ‘నో టైమ్ టూ డై’ అమెరికాలో మాత్రం కొంచెం లేట్గా అక్టోబరు 8న ప్రేక్షకులను పలకరించనుంది. చదవండి: జేమ్స్బాండ్ ఫైట్సీన్కి 32వేల లీటర్ల కూల్డ్రింక్స్! -
గన్నులున్న జేమ్స్బాండ్ కారు.. అమ్మకానికి రెడీ !
సీక్రెట్ ఏజెంట్ జేమ్స్బాండ్ స్టైలే వేరు. నడిచే తీరు నుంచి నడిపే కారు వరకు ప్రతీది ప్రత్యేకమే. బాండ్ సినిమాల్లో ఎంఐ6 ఏజెంట్ ఉపయోగించే కార్లలను సైతం ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. అలాంటి స్పెషల్ కారుని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు బాండ్ వాడే కార్లంటీని ఆస్టోన్ మార్టిన్ సంస్థనే తయారు చేసింది. త్వరలో విడుదల కాబోతున్న నో టైం టూ డై సినిమా కోసం స్పెషల్ ఎడిషన్ కార్లను సిద్ధం చేసింది. డీబీ 5 జూనియర్ పేరుతో ఈ కార్లను తయారు చేస్తోంది. రెగ్యులర్ కార్లతో పోల్చితే జేమ్స్బాండ్ కార్లు జమీన్ ఆస్మాన్ ఫరక్ అన్నట్టుగా ఉంటాయి. శత్రువులపై పోరాడేందుకు వారి దాడుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా బాండ్ కార్లలో అధునాతమైన ఆయుధాలు, గ్యాడ్జెట్లు ఉంటాయి. డీబీ 5 జూనియర్లో కూడా ఇలాంటి గ్యాడ్జెట్లు వెపన్స్ పొందు పరిచారు. జేమ్స్బాండ్ స్పెషల్ ఎడిషన్ డీబీ 5 జూనియర్లో డిజిటల్ నంబర్ ప్లేట్ను అమర్చారు. ఇందులో నంబర్లు ఆటోమేటిక్గా మారిపోతుంటాయి, అంతేకాదు స్విచ్చ్ నొక్కితే చాలు హెడ్లైట్ల స్థానంలో గన్స్ స్రత్యక్షం అవుతాయి. స్మోక్ స్క్రీన్, హిడ్డెన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Introducing the DB5 Junior NO TIME TO DIE Edition.#AstonMartin #LicenceToThrill #NoTimeToDie — Aston Martin (@astonmartin) September 21, 2021 ఆస్టోన్ మార్టిన్ సంస్థ ఎలక్ట్రిక్ కారుగా డీబీ 5 జూనియర్ని రూపొందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు ధరని 90,000 డాలర్లుగా నిర్ణయించింది. ఈ కారు కావాల్సిన వారు ఆస్టోన్ మార్టిన్ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్టోన్ మార్టిన్ సంస్థ కేవలం 125 కార్లను మాత్రమే తయారు చేసింది. వీటిని ఆస్టోన్ మార్టిన్ మెంబర్షిప్ ఉన్న వారికే కేటాయించనుంది. అయితే ఈ కార్లను సొంతం చేసుకున్నా ... రోడ్లపై ప్రయాణించేందుకు అనుమతి లేదు. బాండ్ తరహాలో వెపన్స్, లేటెస్ట్ గాడ్జెట్స్ ఉన్నందున వీటికి అనుమతి నిరాకరించారు. స్పెషల్ ఈవెంట్స్, రేస్ట్రాక్లపై నడుపుకోవచ్చు. సెలబ్రిటీలు, బిజినెస్ బ్యాగ్నెట్లు తమ గ్యారేజీలో అదనపు ఆకర్షణగా ఈ కార్లను ఉంచుకునేందుకు ఇష్టపడతారు. Raw and instinctive – Vantage deserves to be driven. Watch @007 put his Aston Martin to the test in NO TIME TO DIE from 30th September.#NoTimeToDie #AstonMartin #LicenceToThrill pic.twitter.com/TIvZ7ArdX1 — Aston Martin (@astonmartin) August 31, 2021 చదవండి : సూపర్ కార్ లవర్స్కు గుడ్న్యూస్ -
ఒకే ఫైట్సీన్కి 32వేల లీటర్ల కూల్డ్రింక్స్!
హాలీవుడ్ మూవీస్లో జేమ్స్బాండ్ సిరీస్కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వాటిలో ఉండే యాక్షన్ సీన్స్ అయితే మరో రేంజ్లో ఉంటాయి. అంతేకాకుండా వాటికి అదే రేంజ్ ఖర్చు కూడా పెడుతుంటారు మేకర్స్. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ సిరీస్లో ప్రస్తుతం 25 జేమ్స్బాండ్ మూవీగా ‘నో టైమ్ టు డై’ రూపొందుతోంది. ఇటలీలో ఇటీవల ఓ ఫైట్ సీన్ని చిత్రికరించింది చిత్రబృందం. దాని కోసం ఏకంగా 32వేల లీటర్ల కూల్డ్రింక్స్ను ఉపయోగించారంట. ఆ ఒక్క సీన్ కోసమే ఏకంగా 50లక్షలకు పైగా ఖర్చుయిందట. గత నాలుగు చిత్రాల్లో జేమ్స్బాండ్గా నటించిన డేనియల్ క్రేగ్ ఈ సినిమాలోనూ గూఢచారిగా చేస్తున్నారు. దాదాపు 2000 వేల కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి క్యారీ జోజి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం 2019 నుంచి అభిమానులు నిరీక్షిస్తున్నప్పటికీ అది ఇంతవరకూ రిలీజ్ కాలేదు. కరోనా వైరస్ కారణంగా ఆ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. దాదాపు ఏడాది నుంచి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్న అది సాధ్యపడటం లేదు. ప్రధానంగా లాక్డౌన్ నిబంధనలు కారణంగా నో టైమ్ టు డై’ విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. -
జేమ్స్ బాండ్ థీమ్ మ్యూజిక్ వాయిస్తున్న ముంబై పోలీసులు
-
ఈ సినిమాలు చూస్తే రూ.71 వేలు ఇస్తారట!
జేమ్స్బాండ్ సినిమాలంటే మీకు ఇష్టమా? జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో వచ్చిన అన్ని సినిమాలను మీరు ఇప్పటికే చూసేశారా? పోనీ మరోసారి వాటన్నింటినీ చూసే ఇంట్రస్ట్ ఉందా? ఉంటే ఈ వార్త మీకోసమే.. జేమ్స్బాండ్ ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పటివరకు రిలీజైన 24 సినిమాలు అన్నీ చూస్తే వెయ్యి డాలర్లు ఇస్తామంటోంది నెర్డ్బియర్ అనే వెబ్సైట్. అయితే ఓ షరతు విధించింది. కేవలం 30 రోజుల్లోనే వాటన్నింటినీ వరుస పెట్టి చూసేయాలని మెలిక పెట్టింది. దీనికి గానూ వెయ్యి డాలర్లు అంటే 72 వేల రూపాయలు ఇస్తామని ఆఫరిచ్చింది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాలు చూసేందుకు ఏడు వేల రూపాయల గిఫ్ట్ కార్డు, త్వరలో విడుదల కానున్న జేమ్స్బాండ్ 25వ సినిమా టికెట్ కొనుక్కునేందుకు మూడున్నర వేల రూపాయల విలువ చేసే ఏఎమ్సీ గిఫ్ట్ కార్డు సైతం ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం Nerd Bear- a nerd culture వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ఏప్రిల్ 16 దరఖాస్తులకు చివరి తేదీ. అయితే ఈ అవకాశం అందరికీ కాదండోయ్. కేవలం అమెరికా వాసులకు మాత్రమే! కాగా జేమ్స్బాండ్ 25వ సినిమా 'నో టైమ్ టు డై' సెప్టెంబర్ 30న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా గతేడాది వేసవిలో థియేటర్లలోకి రావాల్సింది. కానీ కరోనా ప్రభావం వల్ల నవంబర్కు, ఆ తర్వాత ఏప్రిల్కు వాయిదా వేశారు. అయితే అప్పుడు కూడా కుదరకపోవడంతో చివరాఖరకు సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతున్నట్లు వెల్లడించారు. జేమ్స్బాండ్ 24 సినిమాల లిస్టు ఇదే.. 1. Dr. No (1962) 2. From Russia with Love (1963) 3. Goldfinger (1964) 4. Thunderball (1965) 5. You Only Live Twice (1967) 6. On Her Majesty’s Secret Service (1969) 7. Diamonds Are Forever (1971) 8. Live and Let Die (1973) 9. The Man with the Golden Gun (1974) 10. The Spy Who Loved Me (1977) 11. Moonraker (1979) 12. For Your Eyes Only (1981) 13. Octopussy (1983) 14. A View to a Kill (1985) 15. The Living Daylights (1987) 16. Licence to Kill (1989) 17. GoldenEye (1995) 18. Tomorrow Never Dies (1997) 19. The World Is Not Enough (1999) 20. Die Another Day (2002) 21. Casino Royale (2006) 22. Quantum of Solace (2008) 23. Skyfall (2012) 24. Spectre (2015) -
జేమ్స్ బాండ్ హీరో కన్నుమూత
బహమాస్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ (90) కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు యూకే మీడియా వెల్లడించింది. జేమ్స్ బాండ్ పాత్రలతో అలరించిన ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆస్కార్తో పాటు మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సీన్ కానరీ సొంతం చేసుకున్నారు. 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’తో తొలి బాండ్గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్గా చేశారాయన. ‘ఫ్రమ్ రష్య విత్ లవ్, గోల్డ్ఫింగర్, తండర్బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాల్లో బాండ్గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత ‘ఆన్ హర్ మెజెస్టిక్ సీక్రెట్ సర్వీస్’ సినిమాలో జార్జ్ లెజెన్బీ బాండ్ అయ్యారు. మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. సుమారు 58 ఏళ్లుగా ఈ పంచ్ డైలాగ్ను వింటూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ఇక బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007’ అంటూ తమ ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక, పెద్దల సంగతి సరే సరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు వారినీ ఆకట్టుకుంటాయి. అలా ఇంటిల్లిపాదికీ దగ్గరైన ఈ పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. జంపింగులూ, రన్నింగులూ, చాకచక్యంగా తుపాకీ పేల్చడం.. వాట్ నాట్.. బోల్డన్ని చేయాలి. అందుకే, ఈ పాత్ర చేసేవాళ్లను అద్భుతమైన నటులుగా కితాబులిస్తారు. -
నెక్ట్స్ బాండ్ ఎవరు?
చురుకైన చూపులు, బులెట్లకు ఎదురెల్లే నైజం, దిగాలన్నా, దూకాలన్నా మరో ఆలోచన చేయని ధైర్యం, శత్రువుల ఎత్తుల మీద ఎక్కిÐð ళ్లే సాహసం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అన్నీ జేమ్స్ బాండ్కి నిర్వచనాలే. ‘మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. 007’ అంటూ 58 ఏళ్లుగా స్క్రీన్ మీద సీక్రెట్ ఏజెంట్గా ఎన్నో ఆపరేషన్స్ విజయవంతం చేస్తున్నాడు బాండ్. ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన ఈ సీక్రెట్ ఏజెంట్ ఆన్ స్క్రీన్ సూపర్ సక్సెస్ఫుల్. 58 ఏళ్లలో 25 బాండ్ చిత్రాలు తెరకెక్కాయి. ఆరుగురు హీరోలు జేమ్స్ బాండ్గా ఈ బ్రాండ్ను ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. తాజాగా మరోసారి బాండ్ ముఖం మారనుంది. జేమ్స్ బాండ్గా కొత్త హీరో తెరమీదకు రానున్నాడు. ఇప్పటివరకు కనిపించిన బాండ్లు 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’తో తొలి బాండ్గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్గా చేశారాయన. ‘ఫ్రమ్ రష్య విత్ లవ్, గోల్డ్ఫింగర్, తండర్బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాల్లో బాండ్గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత ‘ఆన్ హర్ మెజెస్టిక్ సీక్రెట్ సర్వీస్’ సినిమాలో జార్జ్ లెజెన్బీ బాండ్ అయ్యారు. ఆ తర్వాత రోజర్ మూరే రికార్డు స్థాయిలో ఏడు సినిమాల్లో బాండ్ అవతారమెత్తారు. ‘లివ్ అండ్ లెట్ డై, ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్, ది స్పై హూ లవ్డ్ మీ, మూన్రాకర్, ఫర్ యువర్ ఐస్ ఓన్లీ, ఆక్టోపస్సీ, ఏ వ్యూ టు ఏ కిల్’ సినిమాల్లో రోజర్ మూరే నటించారు. ఓ రెండు సినిమాల్లో (ది లివింగ్ డే లైట్స్, లైసెన్స్ టు కిల్) తిమోతీ డాల్టన్, నాలుగు సినిమాల్లో (గోల్డెన్ ఐ, టుమారో నెవర్ డైస్, ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, డై అనదర్ డే) పీర్స్ బ్రోస్నన్ బాండ్గా కనిపించారు. ప్రస్తుతం బాండ్గా ఉన్న డేనియల్ క్రెగ్ తాజాగా విడుదలవనున్న ‘నో టైమ్ టు డై’తో కలిపి ఐదు సినిమాల్లో జేమ్స్ బాండ్ పాత్రలో కనిపించారు. ‘కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలస్, స్కై ఫాల్, స్పెక్ట్రే’ గతంలో ఆయన బాండ్గా చేసిన సినిమాలు. ‘నో టైమ్ టు డై’ విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్లో ప్రకటన? బాండ్ 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ విడుదల సందర్భంగా నెక్ట్స్ బాండ్ ప్రకటన ఉంటుందని టాక్. జూన్లో టామ్ హార్డీ బాండ్ పాత్ర కోసం ఆడిషన్ చేశారని టాక్. తదుపరి బాండ్ ఆయనే అని హాలీవుడ్ పత్రికలు రాసేస్తున్నాయి. ‘మ్యాడ్ మాక్స్ ఫరీ రోడ్, ది డార్క్ నైట్ రైసస్, వెనమ్, ది రెవనంట్’ వంటి సినిమాల్లో పాపులారిటీ పొందారు హార్డీ. మరి రాబోయే కొత్త బాండ్ ఈ జేమ్స్ బాండ్ ఇమేజ్ను ఎలా ముందుకు తీసుకెళతాడన్నది కాలమే చెబుతుంది. బాండ్ రేసులో ఎవరున్నారు? ‘ఇక నేను బాండ్ సినిమాల్లో నటించను’ అని డేనియల్ క్రెగ్ ప్రకటించేశారు. మరి.. తదుపరి బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. హాలీవుడ్ నటులు టామ్ హార్డీ, టామ్ హిడిల్స్టన్, ఇద్రిస్ ఎల్బా వంటి నటులు నెక్ట్స్ బాండ్గా కనిపించేందుకు రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి చాన్స్ ఉందని హాలీవుడ్ టాక్. ఈ ముగ్గురూ కాకుండా హెన్రీ కావిల్ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. నెక్ట్స్ బాండ్ ఎవరు? -
కరోనానుంచి కోలుకున్న హీరోయిన్
జేమ్స్బాండ్ హీరోయిన్ ఓల్గా కురెలెంకో కరోనా వైరస్ బారినుంచి బయటపడ్డారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె పూర్తిగా కోలుకున్నారు. సోమవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓల్గా స్పందిస్తూ తాను పూర్తిగా కోలుకున్నానని తెలిపారు. కుమారుడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. అభిమానులతో తన అనుభవాలను పంచుకున్నారు. ‘‘ నేను పూర్తిగా కోలుకున్నాను. మొదటి వారం రోజులు చాలా కష్టంగా గడిచింది. విపరీతమైన జ్వరం, తలనొప్పితో బాధపడ్డాను. రెండో వారంలో జ్వరం తగ్గిపోయింది. కొద్దిగా దగ్గు ప్రారంభమైంది! చాలా అలసిపోయినట్లు ఉండేది. రెండో వారం చివర్లో ఆరోగ్యం కుదుట పడింది. దగ్గు తగ్గినప్పటికి ఉదయాల్లో కొద్దిగా ఇబ్బంది పెట్టేది. కానీ, ఈ రోజు అది కూడా లేదు. ( హీరోయిన్కు కరోనా.. బ్రేకప్ చెప్పిన ప్రియుడు! ) ఇప్పుడు నా కుమారుడితో కలిసి సమయాన్ని గడుపుతున్నా’నని పేర్కొన్నారు. కాగా, కొద్దివారాల క్రితం ఓల్గాకు కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆమె ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్నారు. ఉక్రెయిన్కు చెందిన ఈమె 2008లో వచ్చిన జేమ్స్బాండ్ మూవీ క్వాంటం ఆఫ్ సొలేస్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. View this post on Instagram Happy Mother’s Day! #mothersday P.S. I have completely recovered 🙏 To recapitulate: For one week I felt pretty bad and was mostly in bed, sleeping, with high fever and strong headache. The second week, the fever was gone but some light cough appeared and I felt very tired. By the end of the second week I felt totally fine. Cough is almost gone although I still cough in the mornings but then it completely goes away for the day! I’m fine! And now I’m just enjoying this time to reflect on many things and spend my time with my son. 🙏 Я думаю я полностью выздоровела. Коротко о течении болезни: В первую неделю мне было очень плохо и я почти все время лежала с высокой температурой и много спала. Я спала 12 часов за ночь и потом ещё часа 3-4 днём!!! Подняться было тяжело. Усталость сумасшедшая. Головная боль дикая. Во вторую неделю температура полностью ушла и появился легкий кашель. Усталость осталась. Теперь практически никаких симптомов нет. Только немного кашель есть по утрам, но потом он полностью уходит на весь день. Теперь я наслаждаюсь отдыхом и провожу время с сыном. Держитесь!!! 💪 #coronavirus #коронавирус A post shared by Olga Kurylenko (@olgakurylenkoofficial) on Mar 22, 2020 at 2:13pm PDT -
హీరోయిన్కు కరోనా.. ప్రియుడు బ్రేకప్!
ప్రపంచాన్ని గజగజవణికిస్తోన్న కరోనా వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, పార్క్లు, సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా షూటింగ్లకు బ్రేక్ చెప్పి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇంత జాగ్రత్తగా ఉన్న నేపథ్యంలో జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పాజిటివ్ అని తేలిన తర్వాత తనకు డాక్టర్లు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని ఆమె తెలిపింది. ఓల్గాకు కరోనా సోకడంతో ఆమె స్వయంగా తన అనుభవాన్ని చెప్తూ ప్రజలకు, అభిమానులకు పలు సూచనలు ఇస్తోంది. అలాగే తాను ఇంట్లో అందరికి దూరంగా ఉంటున్నానని.. కానీ కరోనా వైరస్ని ఎదుర్కొనడానికి మనవంతు ప్రయత్నం చేయాలని ఓల్గా చెప్పుకొచ్చింది. విటమిన్ బీ5, విటమిన్-ఈ, విటమిన్-సీ, జింక్ కరోనా నియంత్రణకు ఎంతగానో సహకరిస్తాయని.. ఇవి వాడిన తర్వాతే తనకు జ్వరం కూడా తగ్గిందని ఓల్గా చెప్పింది. కాగా ఆమె కరోనాని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని చూసి అందరూ అభినందిస్తున్నారు. ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా ఆమెకు బ్రేకప్ చెప్పేసాడని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. చదవండి: కరోనా బారిన పడ్డాను Hello everyone! I’m feeling better today. My fever is gone! I hear people can’t figure out where I currently am. I’m in London... Head over to my Instagram for full post and updates - https://t.co/j1ICouSFxb pic.twitter.com/pxe1ih4l6Z — Olga Kurylenko (@OlyaKurylenko) March 18, 2020 -
‘నో టైమ్ టు డై’కి ఇది సమయం కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని నేడు కొవిడ్ వైరస్ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ‘నో టైమ్ టు డై’ అనే 25వ జేమ్స్ బాండ్ చిత్రం విడుదలతోపాటు, దాని ప్రమోషన్ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయాల్సిందిగా జేమ్స్ బాండ్ చిత్రాల అభిమానులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు అభిమానుల వెబ్సైట్ ‘ఎంఐ6–హెచ్క్యూ’ చిత్రం పంపిణీదారులైన ‘ఎంజీఎం, యూనివర్శల్’ సంస్థలు ఓ లేఖ రాసింది. లండన్తోపాటు యూరప్లో మార్చి 31వ తేదీన, ఉత్తర అమెరికాలో ఏప్రిల్ పదవ తేదీన, చైనాలో ఏప్రిల్ 30వ తేదీన విడుదలకు ఏర్పాట్లు చేశారు. (‘కరోనాపై భయపడాల్సిన అవసరం లేదు’) కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలో ‘నో టైమ్ టు డై’ చిత్రం విడుదలను ఇప్పటికే నిలిపి వేశారు. అలాగే చైనాతోపాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను నిలిపివేశారు. అయితే లండన్లో, ఇతర దేశాల్లో చిత్రం విడుదలనుగానీ, ప్రమోషన్ కార్యక్రమాలనుగానీ నిలిపి వేయలేదు. అందుకనే జేమ్స్ బాండ్ చిత్రాల అభిమానుల వెబ్సైట్ ఓ లేఖను రాసింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సినిమా హాళ్లను మూసివేసే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా చిత్రం విడుదలను ముందుగానే వాయిదా వేసుకోవడం మంచిదని ఆ లేఖలో అభిమానులు కోరారు. లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో మార్చి 31వ తేదీన ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్ షోను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ హాల్లో ఐదువేల మంది ప్రేక్షకులు పడతారు. కొవిడ్ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఇప్పటికే ప్రజలు ఒకచోట గుమికూడడాన్ని నిషేధించిన విషయం తెల్సిందే. అమెరికా, లండన్లో ఇప్పటికీ అలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ మున్ముందు తీసుకునే అవకాశం ఉంది. (అంతర్జాతీయ టోర్నీలకు కోవిడ్–19 దెబ్బ) -
‘జేమ్స్ బాండ్స్’కు స్పైబార్
‘ఎంఐ5, ఎంఐ6’ బ్రిటన్కు చెందిన రెండు గూఢచారి సంస్థలు. ఎంఐ5, అంటే మిలటరీ ఇంటలెజెన్స్ 5. ఇది దేశ అంతర్గత ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు పరిమితం కాగా, ఎంఐ6, అంటే మిలటరీ ఇంటలిజెన్స్ 6. అంతర్జాతీయ కార్య కలాపాలకు పరిమితం అవుతుంది. వీటిల్లో గూఢచారులుగా పనిచేసే సిబ్బంది ఎవరికి తమ వృత్తి వివరాలను వెల్లడించడానికి వీల్లేదు. చివరకు భార్యకు కూడా చెప్పరాదు. ఎవరైనా ఏదో గుమాస్తా ఉద్యోగమో చేస్తున్నట్లు చెప్పుకుంటారు. ఇక అస్తమానం విదేశాలు తిరిగే ఎంఐ6 గూఢచారులకు పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుంది. అందుకేనేమో వారిలో ఎక్కువ మంది పెళ్ళిళ్లు చేసుకోరు. ఇంటా బయట తాము పడుతున్న పాట్ల గురించి ఎంత ఆప్త మిత్రులకైనా ఏమీ చెప్పుకోవడానికి వీల్లేదు. మరి వారు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలి ? ఎలా సేదతీరాలి? ఎంఐ5 గూఢాచారుల గురించి తెలియదుగానీ ఎంఐ6 గూఢాచారుల కోసం ఓ ప్రత్యేకమైన ‘స్పై బార్’ ఉందట. ఆ బారులోకి వెళ్లాక వారు ఏమైనా తాగవచ్చు. ఏమైనా మాట్లాడుకోవచ్చు. గోడలకు ఎలాంటి చెవులుండవట. ఈ విషయాన్ని మొట్టమొదటి సారిగా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎస్ఐఎస్) చీఫ్ సర్ అలెక్స్ యంగర్ తెలియజేశారు. రెండు ఇంటెలిజెన్స్ సర్వీసులు ఎస్ఐఎస్ పరిధిలోకి వస్తాయి, ఈ స్పైబార్ ఎంఐ6 ప్రధాన కార్యాలయంలో ఉందని ‘సీ’ కోడ్ నేమ్తో వ్యవహరించే సర్ అలెక్స్ చెప్పారు. ఈ ప్రధాన కార్యాలయం పశ్చిమ లండన్లోని ‘వాక్సాహాల్ వంతెన’కు సమీపంలో ఉంది. 20 అంతస్తులుగల ఆ భవనంలో ‘స్పైబార్’ ఏ అంతస్తులో ఉందో తెలపలేదు. బ్రిటన్ ఎస్ఐఎస్ తరఫున తెరపై ‘007 జేమ్స్ బాండ్’గా కనిపించే ప్రస్తుత పాత్రధారి డేనియల్ క్రేగ్ తాగే ‘మార్టిని’ మందు ఆ స్పైబార్లో దొరుకుతుందో, లేదో కూడా చెప్పలేదు. థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఈ భవనంకు సరైన భద్రత కూడా లేదని ఆ మధ్య విమర్శలు కూడా వచ్చాయి. థేమ్స్ నది గుండా ఓ నౌకలో వచ్చిన రష్యా గూఢాచారులు భవనంపైకి కాల్పులు జరిగినప్పుడు ఈ విమర్శలు వచ్చాయి. భవనానికి ఎక్కువ అద్దాలు ఉండడం కూడా భద్రతకు ముప్పు. -
‘బాండ్ 25’ టైటిల్ ఫిక్స్!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన యాక్షన్ మూవీ సీరిస్ జేమ్స్ బాండ్. ఇప్పటికే ఈ సిరీస్లో 24 సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సిరీస్లో 25వ సినిమా తెరకెక్కుతోంది. డేనియల్ క్రెగ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘నో టైం టు డై’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 3న యూకేలో, 2020 ఏప్రిల్ 8న అమెరికాలో విడుదల కానుందని తెలిపారు. ముందుగా ఈ సినిమాకు ఏ రీజన్ టు డైగా నిర్ణయించినా చివరి నిమిషంలో నో టైం టు డైగా మార్చారు. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. Daniel Craig returns as James Bond, 007 in… NO TIME TO DIE. Out in the UK on 3 April 2020 and 8 April 2020 in the US. #Bond25 #NoTimeToDie pic.twitter.com/qxYEnMhk2s — James Bond (@007) August 20, 2019 -
బాండ్ ఈజ్ బ్యాక్
జమైకా లొకేషన్లోకి జేమ్స్ బాండ్ తిరిగొచ్చారు. డేనియల్ క్రెగ్ హీరోగా క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వంలో బాండ్ సిరీస్లో 25వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జమైకాలో జరిగిన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్లో భాగంగా హీరో డేనియల్ కాలికి గాయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. దాదాపు నెల రోజుల విరామం తీసుకున్న క్రెగ్ తిరిగి సెట్లోకి అడుగుపెట్టారు. జమైకా యాక్షన్ షూట్లో జాయిన్ అయ్యారు. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ రమీ మాలిక్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కానుంది. -
ది గ్రేట్ తెలుగు బ్రాండ్
ఇంగ్లిష్ వాళ్లకు ‘జేమ్స్బాండ్’ ఉన్నాడు. హిందీ వాళ్ళకు ‘టైగర్’ ఉన్నాడు. మరి తెలుగు వాళ్లకు? నెల్లూరు నుంచి ‘ఏజెంట్ ఆత్రేయ’ దొరికాడు. ఈ క్యారెక్టర్తో సిరీస్గా ఎన్ని సినిమాలైనా తీయవచ్చు. ఈ క్యారెక్టర్ని స్క్రీన్ ఐకాన్గా మార్చవచ్చు.మనకు డిటెక్టివ్ రచయితలు ఉన్నారు కానీ డిటెక్టివ్ హీరోలు లేరు. కొవ్వలి, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు, మధుబాబు, పానుగంటి వీరంతా తెలుగులో డిటెక్టివ్ సాహిత్యం లేదా ‘సీక్రెట్ ఏజెంట్’ సాహిత్యం సృష్టించారు. వీళ్లు సృష్టించిన డిటెక్టివ్లు ‘డిటెక్టివ్ వాలి’, ‘యుగంధర్’, ‘షాడో’, ‘బుల్లెట్’ వీరంతా పాఠకులకు ఇష్టులు. హీరోలు.బెంగాలీ సాహిత్యం తెలుగు సాహిత్యం మీద ప్రభావం చూపుతున్న 1950ల కాలంలో బెంగాలీలో విపరీతంగా వస్తున్న డిటెక్టివ్ సాహిత్యానికి ప్రభావితమైన తెలుగువారు ఉన్నారు. చక్రపాణి వంటివారు అందుకే ‘మిస్సమ్మ’లో తొలి లోకల్ డిటెక్టివ్ను చూపించారు. మిస్సమ్మలో అక్కినేని స్కూల్ సూపర్వైజర్ కమ్ డిటెక్టివ్. ఎప్పుడూ హ్యాట్, చేతిలో స్టిక్, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతుంటాడు. ప్రతి డిటెక్టివ్కు ఒక అసిస్టెంట్ ఉన్నట్టే అక్కినేనికి కూడా అంజిగాడు అసిస్టెంట్గా ఉంటాడు. మిన్ను విరిగి మీద పడినా అతడు చలించకుండా ఏదో నోట్ చేసుకుంటూ ఉంటాడు. అక్కినేని చేసిన ఈ పాత్ర ఎంత హాస్యం పండించినా తుదకు సావిత్రే మిస్సమ్మ అని తేల్చడంలో కీలకంగా మారి తన వృత్తి ధర్మానికి న్యాయం చేకూర్చింది. అక్కినేని టాలెంట్ వల్ల ఆ పాత్ర హిట్ అయ్యింది కాని అలాంటి పాత్రలు రిపీట్ కాలేదు. కాని సినిమా రంగంలో ఉంటూ డిటెక్టివ్ సాహిత్యాన్ని బాగా ఔపోసన పట్టినవాడు ఆరుద్ర. ఆయన చొరవతోనే ‘గూఢచారి 116’ వంటి సినిమాలు తెలుగులో సాధ్యమయ్యాయి. తెలుగు తెర మీద తొలి జేమ్స్బాండ్గా కృష్ణ ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటున్నారు. కాని ఆ తర్వాత ఆ స్థాయిలో ఏజెంట్ సినిమాలు హిట్ కాలేదు. కృష్ణ హీరోగా ‘ఏజెంట్ గోపి’, ‘రహస్య గూఢచారి’ తదితర సినిమాలు తయారయ్యాయి. చిరంజీవి హీరోగా ‘గూఢచారి నం.1’ సినిమా వచ్చింది. ఈ సందర్భంలోనే కొమ్మూరి సాంబశివరావు వీర శిష్యుడు అయిన మల్లాది వెంకటకృష్ణమూర్తి తెలుగులో లోకల్ డిటెక్టివ్ పాత్రను సృష్టించారు. ‘చంటబ్బాయ్’ నవలలో ఆయన సృష్టించిన పాండురంగారావు పాత్ర ఆ తర్వాత వెండితెర మీద చిరంజీవి పోషించడంతో ‘జేమ్స్పాండ్’ అయ్యింది. ‘చంటబ్బాయ్’ ఒక కామెడీ డ్రామాగా నిలిచింది తప్ప పూర్తిస్థాయి ఏజెంట్ సినిమా కాలేకపోయింది. ఆ తర్వాత సస్పెన్స్ సినిమాలలో ఆరితేరిన దర్శకుడు వంశీ– మోహన్బాబు హీరోగా ‘డిటెక్టివ్ నారద’ తీశారు. ఒక ఇంట్లో జరుగుతున్న గూడుపుఠాణీని ఆ ఇంటికి డిటెక్టివ్గా వచ్చిన నారద ఛేదించడం కథ. ఇందులో మోహన్బాబు అసిస్టెంట్ అల్లావుద్దీన్గా మల్లికార్జునరావు నటించాడు. ఆ సినిమా హిట్ అయితే ఎలా ఉండేదో కాని జనం నిరాదరించారు. ఆ తర్వాత చాలా కాలం తెలుగు సినిమా ఈ లాంగ్ కోట్, నల్ల కళ్లద్దాలు, తలమీద హ్యాట్, జేబులో భూతద్దంతో తిరిగే ఏజెంట్ పాత్రను పట్టించుకోలేదు. తమిళంలో కూడా ఇదే పరిస్థితిగా ఉండగా దర్శకుడు మిష్కిన్ ‘డిటెక్టివ్’ పాత్రను మళ్లీ తెర మీదకు తెచ్చి విశాల్తో సూపర్ హిట్ కొట్టాడు. ఆధారాలు ఏమీ దొరక్కుండా భారీ మొత్తాలకు వ్యక్తుల అడ్డు తొలగించే ఒక కరడు కట్టిన ముఠాను డిటెక్టివ్ విశాల్ ఎలా పట్టుకున్నాడన్నది ఈ సినిమాలో మిష్కిన్ చాలా రోమాంచితంగా చూపించాడు. అయితే ఈ సినిమాలో డిటెక్టివ్కు అసిస్టెంట్గా వేసిన నటుణ్ణి హాస్యగాడిగా కాకుండా అతణ్ణి కూడా ఒక సమవుజ్జీగా దర్శకుడు చూపించాడు. తెలుగులో కూడా ఇది హిట్ కావడంతో డిటెక్టివ్ సినిమాల మూడ్ సెట్ అయ్యింది. ఇప్పుడు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఆ మూడ్ను స్థిరపరచడమే కాదు తెలుగు ప్రేక్షకులకు ఒక లోకల్ ఏజెంట్ను సక్సస్ఫుల్గా ఇచ్చింది. సాధారణంగా ఏజెంట్లు, డిటెక్టివ్లు సిటీ బ్యాక్డ్రాప్లో తిరుగుతుంటారు. కాని ఈ సాయి శ్రీనివాస ఆత్రేయ మాత్రం కోస్తా జిల్లా అయిన నెల్లూరు చుట్టుపక్కల తిరుగుతుంటాడు. అసలు ఈ పాత్రకు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ అని పెట్టడమే ఒక నేటివిటి. ‘ఏజెంట్ విక్రమ్’లాగా పెట్టి ఫిక్షనల్ చేయకుండా సినిమాలో చెప్పినట్టు ‘నాది ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు రియల్ క్యారెక్టర్’ అనేవిధంగా చూపి ప్రేక్షకులకు దగ్గర చేశాడు దర్శకుడు స్వరూప్. ఇక హీరో నవీన్ పోలిశెట్టి అసలు సిసలు తెలుగు డిటెక్టివ్గా కనిపించి ఇతను కేసు ఛేదించే తీరుతాడు అనే నమ్మకం కలిగిస్తాడు. సాధారణంగా డిటెక్టివ్ కథలు నలిగిన ఇతివృత్తాలతో ఉంటాయి. కాని ఇందులో కొంచెం రియల్ క్రైమ్ను బేస్ చేసుకున్నారు. రైల్వే ట్రాక్ల దగ్గర తరచూ కనిపించే అనాథ శవాలు ఎవరివి, అవి ఎందుకు ఉంటున్నాయి, ఆ మరణాలకు కారణం ఎవరు అనేది ఈ సినిమా కథ. దీనికి ‘రెలిజియస్ క్రైమ్స్ ఇన్ ఇండియా’ అనే స్టడీ నేపథ్యం కావడం కూడా ప్రేక్షకుల్లో చైతన్యం పెంచే అంశం. చాలా తక్కువ బడ్జెట్ ఉన్నా, వనరులు తక్కువ ఉన్నా ఒక తెలుగు డిటెక్టివ్ పూనుకుంటే క్రైమ్ను ఛేదించే సత్తా ఉంటే ఒక జత బట్టలతో కూడా సినిమా మొత్తం నడిపి మెప్పించగలడని ఈ సినిమా నిరూపిస్తుంది. నిజానికి ఈ ఏజెంట్ పాత్రలు కత్తి మీద సాము. హిందీలో వందలకోట్ల ఖర్చుతో సల్మాన్ ఖాన్ను హీరోగా పెట్టి తీసిన ‘ఏక్ థా టైగర్’ కలెక్షన్ల పరంగా బాగున్నా సినిమా పెద్దగా టాక్ సంపాదించుకోలేదు. అయినప్పటికీ టైగర్ సిరీస్ను కంటిన్యూ చేయడానికి ‘టైగర్ జిందా హై’ తీశారు. అది ఘనవిజయం సాధించింది. కాని అంతే భారీగా సైఫ్ అలీఖాన్ను హీరోగా పెట్టి దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తీసిన ‘ఏజెంట్ వినోద్’ ఫ్లాప్ అయ్యింది. అలాంటి నేపథ్యంలో తెలుగు నుంచి ఒక పాత పద్మిని ప్రీమియర్ కారులో తిరిగే డిటెక్టివ్ జనానికి నచ్చడం విశేషమే. సమాజంలో నేరం పెరిగింది. నేరం చేసే మనుషులు మన ఇరుగు పొరుగే ఉంటారు అన్నంతగా వార్తలు కలవర పరుస్తున్నాయి. సైబర్ నేరాలకైతే అంతే లేదు. ఇందుకు ఆడా మగా తేడా లేదు. దొంగ ఐడీ సృష్టించి వేరే ఫొటోలు డిస్ప్లే పిక్చర్లుగా పెట్టి పెళ్లి కూతురుగా ఒక మహిళ ఒకతన్ని మోసం చేస్తే, సినిమా ప్రొడ్యూసర్గా మరో మహిళ మరొకతన్ని మోసం చేసిన ఘటనలు వారం రోజుల వ్యవధిలో బయటపడ్డాయి. డ్రగ్స్ సరఫరాలు నిర్వహించే ముఠాలు, హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడే ముఠాలు... వీటిని ఛేదించే ఆత్రేయలు ఇవాళ చాలామంది అవసరం. ఆ ముఠాల గుట్టు బట్టబయలు చేసి ప్రేక్షకులను అలెర్ట్ చేయడం కూడా ముఖ్యం. బహుశా రాబోయే రోజుల్లో ‘ఆత్రేయ ఇన్ పూణె’, ‘ఆత్రేయ ఇన్ అమలాపురం’, ‘ఆత్రేయ ఇన్ ఫలక్నుమా’ అనే సినిమాలు రావచ్చు. అలాంటి సినిమాలకు చాన్స్ ఉన్న పాత్రను సృష్టించినందుకు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ యూనిట్కు రీసౌండ్ వచ్చేలా చప్పట్లు కొట్టాలి. తప్పకుండా నల్ల కళ్లద్దాలు కొని గిఫ్ట్గా బహూకరించాలి.– కె బ్రేక్ కోసంఎదురు చూశాం– విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి, శృతీ శర్మ హీరోయిన్లుగా స్వరూప్ తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా కొసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో పలువురు సినీ ప్రముఖులు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో విజయ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్గా ఉన్నప్పటి మెమొరీస్ను గుర్తు చేసుకున్నట్టుంది నాకు ప్రస్తుతం. నవీన్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. మేమిద్దరం కలసి థియేటర్ చేశాం. కలసి యాక్టింగ్ ప్రాక్టీస్ చేశాం. మాకు బ్రేక్ ఎప్పుడు వస్తుందా? అని కలసి ఎదురు చూసే వాళ్లం. థియేటర్ చేస్తున్న రోజుల్లో నవీన్ మమ్మల్ని అందర్నీ బాగా ఎంటర్టైన్ చేసేవాడు. నాకు ‘పెళ్లి చూపులు’ సినిమాతో బ్రేక్ రావడాన్ని వాడు చాలా సంతోషించాడు. ఇప్పుడు వాడికి బ్రేక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి మరో మంచి హీరో దొరికాడు. చాలా హ్యాపీగా ఉంది. నాకు కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది (నవ్వుతూ). స్వరూప్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. రాహుల్గారు కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం. ఈ సినిమాను అందరూ చూడాలి. కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు’’ అన్నారు. -
ట్రాక్లోనే ఉన్నాం
జేమ్స్బాండ్ చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. బాండ్ సినిమా ఎప్పుడు విడుదలైనా థియేటర్స్కు క్యూ కడతారు. అందుకే బాండ్ 25వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో ఉన్నారు టీమ్. క్యారీ జోజి ఫుకునాగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాండ్గా డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ జమైకాలో ప్రారంభమైంది. ఓ యాక్షన్ సీన్లో భాగంగా డేనియల్ క్రెగ్ గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమేనని టీమ్ ధృవీకరించింది. ‘‘క్రేగ్ గాయపడ్డ మాట నిజమే. ఆయన చీలమండల గాయంతో బాధపడుతున్నారు. సర్జరీ జరగాల్సి ఉంది. ఈ ట్రీట్మెంట్ తర్వాత రెండు వారాలు ఆయన విశ్రాంతి తీసుకుని తిరిగి సెట్లో జాయిన్ అవుతారు. రిలీజ్ విషయంలో ఏ మార్పు లేదు. ట్రాక్లోనే ఉన్నాం. ముందు చెప్పినట్లుగానే 2020, ఏప్రిల్లోనే రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బాండ్కి బ్రేక్
బాండ్ స్పీడ్కి బ్రేక్ పడింది. ‘జేమ్స్బాండ్’ సిరీస్ 25వ చిత్రంలో హీరోగా నటిస్తున్న డేనియల్ క్రెగ్ గాయపడ్డారు. క్యారీ జోజి ఫుకునాగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత రామీ మాలిక్ ఇందులో విలన్గా నటిస్తున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ జమైకాలో ప్రారంభం అయ్యింది. ఓ యాక్షన్ సీన్ను షూట్ చేస్తున్న సమయంలో డేనియల్ క్రెగ్ కాలికి గాయం అయ్యిందని హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. కానీ గాయం పెద్దదేం కాకపోవడంతో మరో వారంలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని టాక్. బాండ్ సీరిస్లో 21వ చిత్రం ‘క్యాసినో రాయల్’ (2006)తో బాండ్ చిత్రాల్లో హీరోగా వచ్చారు క్రెగ్. ఈ సినిమా షూటింగ్ అప్పుడు కూడా క్రెగ్ గాయపడ్డారు. గత నాలుగు బాండ్ చిత్రాల్లో క్రెగ్నే హీరోగా నటించారు. ఇక బాండ్ సిరీస్ 25వ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 8న రిలీజ్ కానుంది. -
బాండ్ ఫేమ్ రెజీన్ కన్నుమూత
జేమ్స్బాండ్ ఫేమ్ నడ్జా రెజీన్ (87) ఇకలేరు. ఆమె మృతిచెందినట్లు జేమ్స్బాండ్ అధికారిక ట్వీటర్పేజీలో పోస్ట్ చేశారు ‘జేమ్స్బాండ్’ ఫ్రాంచైజీ ప్రతినిధులు. జేమ్స్ బాండ్ సిరీస్లో వచ్చిన ‘‘ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ఫింగర్’ చిత్రాల్లో నటించిన నడ్జా రెజీన్ కన్నుమూశారని తెలియజేయడానికి బాధపడుతున్నాం. రెజిన్ ఆత్మకు శాంతి కలగాలి. ఈ బాధాకర సమయంలో ఆమె కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం’’అని జేమ్స్బాండ్ ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సెర్బియాలో 1931 డిసెంబర్ 2న జన్మించారు నడ్జా రెజీన్. బెల్గ్రేడ్లో చదువుకున్నారు. ఆ తర్వాత కొన్ని టీవీషోలు కూడా చేశారు. ద మ్యూజిక్ స్వార్డ్ (1950), ద మ్యాన్ వితవుట్ బాడీ (1957), సోలో ఆఫ్ స్పారో (1962) రెజిన్ నటించిన మరికొన్ని చిత్రాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా రెజీన్ తుది శ్వాస విడిచారు. -
ఆస్కార్ హీరో... బాండ్కి విలన్!
జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటివరకూ వచ్చిన బాండ్ చిత్రాల వసూళ్లే అందుకు నిదర్శనం. తాజాగా ఈ జేమ్స్బాండ్ ఫ్రాంచైజీలో 25వ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘షట్టర్ హ్యాండ్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. డేనియల్ క్రెగ్ హీరోగా నటిస్తారు. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటుడిగా నిలిచిన రమీ మాలిక్ ఈ చిత్రంలో విలన్గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు డానీ బోయిలే దర్శకత్వం వహించాల్సింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు కారీ జోజి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. బాండ్ సినిమాను డైరెక్టర్ చేయనున్న ఫస్ట్ అమెరికన్ ఇతనేనట. ఈ సినిమాను ఏప్రిల్ 2020లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘జేమ్స్ బాండ్ 25’ మరోసారి వాయిదా!
వెండితెర మీద బాండ్ చేసే సాహసాలను ఇష్టపడని సినీ ప్రేక్షకుడు ఉండడు. జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఈ సిరీస్లో ఇప్పటికే 24 సినిమాలు విడుదలై సంచలనాలు నమోదు చేశాయి. తాజాగా ఈ సిరీస్లో 25వ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే ప్రాజెక్ట్ మొదలైన దగ్గరనుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ముందుగా బాండ్ పాత్రలో నటించేందుకు డేనియల్ క్రేగ్ అంగీకరించలేదు. భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ అతన్ని ఒప్పించాల్సి వచ్చింది. తరువాత చిత్ర దర్శకుడు డేని బాయ్లే తప్పుకున్నాడు. దీంతో మరో దర్శకుడిని లైన్లోకి తీసుకువచ్చారు. క్యారీ జోజి దర్శకత్వంలో జేమ్స్బాండ్ 25 త్వరలో పట్టాలెక్కనుంది. ముందుగా ఈ సినిమాను 2019 నవంబర్ లేదా 2020 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ.. చిత్రీ కరణ ఆలస్యం కావటంతో 2020 ఏప్రిల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతలు వెల్లడించారు. -
బీఎండబ్ల్యూ007..
జేమ్స్ బాండ్ సినిమాలంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో.. ఈ సినిమాల్లో బాండ్ లాగే ఆయన వాడే కారు కూడా ఫేమస్. అందులో అత్యాధునిక గాడ్జెట్స్ ఉంటాయి కదా. అయితే.. అలాంటివి బాండ్కే సొంతమా.. సినిమాలకే పరిమితమా.. అస్సలు కాదు.. ఎందుకంటే.. బీఎండబ్ల్యూ కంపెనీ కొంచెం ఆ టైపు ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్)ని మార్కెట్లోకి తేనుంది. దాని పేరు విజన్ ఐనెక్ట్స్. ఇదో ఎలక్ట్రిక్ కారు.. అంతేకాదు.. దీనికి డ్రైవర్ అక్కర్లేదు. శాటిలైట్ నేవిగేషన్ మ్యాప్ ద్వారా మనకు కావాల్సిన ప్రదేశానికి వెళ్లిపోతుంది. పార్కింగ్ కూడా అదే చేసుకుంటుంది. కావాలంటే.. మనం నడపొచ్చు. కారు ఉపయోగంలో లేనప్పుడు లేదా డ్రైవర్ లైస్ మోడ్లో ఉన్నప్పుడు స్టీరింగ్ డ్యాష్బోర్డులోకి వెళ్లిపోతుంది. దాని వల్ల ముందు భాగం విశాలంగా మారి.. కూర్చున్నవాళ్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక వెనుక సీటు చూశారుగా.. ఎంత బాగుందో.. స్టార్ హోటల్లోని సోఫాలో కూర్చున్నట్లు ఉంటుంది. అంతేకాదు.. ఈ సీటు మనం చెప్పినట్లు వింటుంది కూడా. పాటల సౌండ్ను తగ్గించాలన్నా పెంచాలన్నా.. సీటుపై చేతితో అలా చేస్తే చాలు పనై పోతుంది. అలాగే నేవిగేషన్ మ్యాప్ను జూమ్ చేయాలన్నా దీన్నే వాడుకోవచ్చు. దీని ద్వారా మరిన్ని ఆదేశాలు ఇచ్చేలా మార్పులు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వాయిస్ కమాండ్స్ వంటివాటిని అందుబాటులోకి తేనుంది. పైభాగం అంతా పారదర్శకంగా ఉంటుంది. 2021లో మార్కెట్లోకి దీన్ని విడుదల చేయనున్నారు. -
కొత్త జేమ్స్ బాండ్ హీరో ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : నవంబర్ నెలలో విడుదల కానున్న డేనియల్ క్రేగ్ నటించిన జేమ్స్ బాండ్ చిత్రం ‘బాండ్ 25’ ఆయనకు ఆఖరి బాండ్ చిత్రం కానుంది. ఆ తర్వాత వచ్చే బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్గా ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ‘నావెల్ ఇంటెలిజెన్స్ డివిజన్’లో పనిచేసిన బ్రిటన్ రచయిత ఐయాన్ ఫ్లెమింగ్, జేమ్స్ బాండ్ నవలల సృష్టికర్త. ఆయన తన ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినప్పుడు తారసపడిన పలువురు గూఢచారలను దృష్టిలో పెట్టుకొని జేమ్స్ బాండ్ పాత్రకు ప్రాణం పోశారు. ఆయన పాత్ర ‘కోల్డ్ బ్లడెడ్ మర్డరర్’గా కన్నా ‘ప్లేబోయ్’గానే ఎక్కువగా కనిపిస్తుంది. ‘007’ కోడ్ నేమ్ కలిగిన జేమ్స్ బాండ్, ఎం16గా పిలిచే బ్రిటీష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్లో ఏజెంట్గా పనిచేసే పాత్ర. ఈ పాత్రను ప్రధానంగా తీసుకొని ఐయాన్ ఫ్లెమింగ్ 1953 నుంచి 1966 మధ్య 12 జేమ్స్ బాండ్ నవలలు, రెండు చిన్న కథల సంపుటాలు రాశారు. ఆయన అన్ని నవలలను సినిమాలుగా తీసిన తర్వాత ఆయన చిన్న కథల ఆధారంగా ఇతర రచయితలు బాండ్ నవలలను రాయగా వాటిని కూడా సినిమాలుగా తీశారు. వాటిలో కాసినో రాయల్ (1953), లివ్ అండ్ లెట్డై (1954), మూన్రేకర్ (1955), డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ (1956), ఫ్రమ్ రష్యా, విత్ లౌ (1957), డాక్టర్ నో (1958), గోల్డ్ ఫింగర్ (1959), ఫర్ యువర్ ఐస్ ఓన్లీ (1960), థండర్ బాల్ (1961), ది స్పై వూ లవ్డ్ మీ (1963), ఆన్ హర్ మేజెస్ట్రీస్ సీక్రెట్ సర్వీస్ (1963), యూ ఓన్లీ లీవ్ ట్వైస్, (1964), ది మేన్ విత్ గోల్డెన్ గన్ (1965), ఆక్టోపసీ, లీవింగ్ డే లైట్స్ (1966) తదితర నవలు, కథలు సినిమాలుగా వచ్చాయి. ఐయాన్ ఫ్లెమింగ్కు కొనసాగింపుగా కింగ్స్లే ఆమిస్, జాన్ పియర్సన్, క్రిస్టోఫర్ వుడ్, జాన్ గార్డనర్ తదితర రచయితలు బాండ్ నవలలు రాశారు. సినిమాలుగా రాకముందే చాలా బాండ్ పుస్తకాలు విశేషంగా అమ్ముడుపోయాయి. మొట్టమొదటి బాండ్ చిత్రాల హీరోగా శాన్ కానరీ ఎంపికయ్యారు. అయితే ఆయన వయస్సు మీరిన స్టంట్ మేన్గా కనిపించడంతో ముందుగా ఐయాన్ ప్లెమింగ్కు ఆయన నచ్చలేదట. సినిమా విడుదలయ్యాక ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. శాన్ కానరీ చురుకైనా స్కాటిష్ చూపులు, ముఖంలో ఉండే తేజస్సు, ముఖ్యంగా ప్రత్యేకమైన ఆయన స్టైల్ ఆయన్ని మంచి కరిష్మాటిక్ నటుడిగా నిలబెట్టాయి. దాంతో ఆయన తొలి ఐదు బాండ్ చిత్రాల్లో వరుసగా నటించి, ఆ తర్వాత మరో రెండు బాండ్ చిత్రాల్లో నటించారు. డాక్టర్ నో, ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, థండర్బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్ సినిమాల్లో వరుసగా నటించిన ఆయన కొన్నేళ్ల విరామం అనంతరం డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, నెవర్ సే నెవర్ అగేన్ చిత్రాల్లో నటించారు. శాన్ కానరీయే ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువ ఆధరణ పొందిన బాండ్ నటుడిగా చరిత్రలో మిగిలిపోయారు. అంతేకాకుండా ఆయన్ని సినిమా చరిత్రలోనే మూడవ అతి గొప్ప నటుడిగా అమెరికా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఎంపిక చేసింది. 1969లో శాన్ కానరీకి విరామం ఇచ్చి బ్రాండ్ చిత్రాల నిర్మాత బార్బర బ్రొకోలీ ‘ఆన్ హర్ మాజెస్టీస్ సీక్రెట్ సర్వీస్’ చిత్రంలో 29 ఏళ్ల ఆస్ట్రేలియా నటుడు, మోడల్ జార్జ్ లాజెన్బైని తీసుకున్నారు. బాండ్ చిత్రాల్లో అత్యంత పిన్న వయస్కుడైన లాజెన్బై ప్రేక్షకులను మెప్పించలేక పోయారు. ఆ తర్వాత శాన్ కానరీకి నిజమైన వారసుడిగా 1973లో లీవ్ అన్ లెట్ డై సినిమాతో రోజర్ జార్జ్ మోర్ వచ్చారు. ఏడు బాండ్ చిత్రాల్లో నటించిన ఆయన సుదీర్ఘకాలం పాటు అంటే, 12 ఏళ్లపాటు కొనసాగిన బాండ్ హీరోగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఇంగ్లీషు నటుడు టిమోతి డాల్టన్ రెండు చిత్రాల్లో, ఐరిస్ నటుడు పియర్స్ బ్రాస్నన్ నాలుగు చిత్రాల్లో, ప్రస్తుత ఇంగ్లీష్ నటుడు డేనియల్ క్రేగ్ ఐదు చిత్రాల్లో నటించారు. వీరంతా శ్వేత జాతీయులు, వారిలో ఎక్కువ మంది ఇంగ్లీషు నటులు. కొత్త జేమ్స్ బాండ్కు స్వాగతం పలికేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఏ దేశం, ఏ జాతికి చెందిన వ్యక్తయినా తనకు ఫర్వా లేదని బార్బర బ్రొకోలీ ఇటీవల ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాంతో నల్ల జేమ్స్ బాండ్ ఎందుకు ఉండకూడదనే ప్రశ్న తలెత్తింది. ఆకర్షణీయంగా కనిపించే నల్లజాతీయ ఇంగ్లీషు నటుడు ఇద్రీస్ ఎల్బా పేరును పరిశీలిస్తున్నారు. డెంజల్ వాషింగ్టన్, మోర్గాన్ ఫ్రీమన్, విల్స్మిత్ లాంటి నల్లజాతీయులు హాలీవుడ్లో రాణించినప్పుడు ఇద్రీస్ ఎల్బా ఎందుకు రాణించరని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అయితే శ్వేతజాతీయుడి స్థానంలో ఓ నీగ్రోను ప్రేక్షకులు అంగీకరిస్తారా? హాలీవుడ్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బాండ్ గర్ల్స్గా అకికో వాకబయాషి, గ్లోరియా ఎండ్రీ, గ్రేస్ జోన్స్, మిచెల్లీ యెయో లాంటి వివిధ జాతులకు చెందిన మహిళలను తీసుకున్నప్పుడు బాండ్ హీరోగా ఓ నీగ్రో ఎందుకు తీసుకోకూడదన్నదే ప్రశ్న. -
మాటలు నేర్పిన మైనా
యూనీస్ గేసన్ / 1928–2018 – ఫస్ట్ జేమ్స్బాండ్ గర్ల్ ఆమె సాహసం అతడిని ముగ్ధుణ్ణి చేసింది. ఆమె వైపు ఆరాధనగా చూశాడు. ‘ఐ అడ్మైర్ యువర్ కరేజ్, మిస్..’ అంటూ ఆగాడు. ఆమె పేరేమిటో అతడికి తెలీదు. అందమైన అమ్మాయిని నేరుగా నీ పేరేమిటని ఎలా అడగ్గలడు? అందుకే .. మిస్.. అంటూ ఆగిపోయాడు. ‘‘ట్రెంచ్.. సిల్వియా ట్రెంచ్’’.. చెప్పిందా అమ్మాయి. చెప్పి ఊరుకోలేదు. ‘ఐ అడ్మైర్ యువర్ లక్, మిస్టర్.. ’ అంటూ ఆగిపోయింది. తనూ అతడి పేరు తెలుసుకోవాలి కదా. ‘బాండ్.. జేమ్స్బాండ్..’’ చెప్పాడతడు.‘ట్రెంచ్.. సిల్వియా ట్రెంచ్’ అని ఆమె తన పేరును ఎలాగైతే చెప్పిందో, సరిగ్గా అలాగే తన పేరును ‘బాండ్.. జేమ్స్బాంyŠ ’ అని చెప్పాడతను.\జేమ్స్బాండ్ ఫస్ట్ మూవీ ‘డాక్టర్ నో’ (1962) లోని సీన్ ఇది. అందులో జేమ్స్బాండ్.. సీ(షా)న్ కానరీ. సిల్వియా ట్రెంచ్.. యూనీస్ గేసన్. యూనీస్ గేసన్ (90) శుక్రవారం చనిపోయారు. ‘మా తొలి బాండ్ గర్ల్ యూనీస్ గేసన్ కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డాం. ఆమె కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం’ అని బాండ్ చిత్రాల నిర్మాతలు మైఖేల్ జి విల్సన్, ఆయన సోదరి బార్బారా బ్రొకోలి ట్విట్టర్లో యూనీస్ గేసన్కు నివాళులు అర్పించారు. ‘బాండ్.. జేమ్స్బాండ్’ అని ఆ ఒక్క చిత్రంలోనే చెప్పి ఆగిపోలేదు జేమ్బాండ్. తర్వాత వచ్చిన ఇరవై నాలుగు చిత్రాల్లోనూ బాండ్గా నటించినవాళ్లంతా ఆ మాటను అదే టోన్లో చెప్పారు. ఇప్పుడు మేకింగ్లో ఉన్న ఇరవై ఐదవ బాడ్ మూవీలో డేనియల్ క్రెయిగ్ కూడా అలాగే చెప్తాడు.‘బాండ్.. జేమ్స్బాండ్’ అని తన పేరును చెప్పడం.. జేమ్స్బాండ్ పాత్రకు ఒక సిగ్నేచర్ స్టెయిల్ అయింది. అలా అతడు చెప్పడానికి ఓ స్టెయిలిష్ ప్రేరణగా (సిల్వియా ట్రెంచ్ పాత్రలో) యూనీస్ గేసన్ నిలిచిపోయారు. ‘డాక్టర్ నో’ తర్వాత వచ్చిన ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’ చిత్రంలోనూ బాండ్ గర్ల్గా నటించారు యూనీస్. తొలి అధికారిక బాండ్ గర్ల్ యూనీస్! ఈ రెండు బాండ్ చిత్రాల్లో మాత్రమే ఆమె నటించారు. యూనీస్ బ్రిటిష్ నటి. 1948 నుంచి 1963 వరకు ఇరవై ఒక్క చిత్రాల్లో నటించారు. వీటిల్లో రెండే జేమ్స్బాండ్ చిత్రాలు. 1995లో వచ్చిన బాండ్ మూవీ ‘గోల్డెన్ఐ’లో యూనీస్ కూతురు కేట్ గేసన్ ఒక పాత్రలో కనిపిస్తారు. -
తొలి బాండ్ గాళ్ ఇక లేరు
జేమ్స్ బాండ్ చిత్రాల్లో అలరించిన తొలి బాండ్ గాళ్ యూనిస్ గైసన్(90) కన్నుమూశారు. అనారోగ్యంతో శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు. 1962లో జేమ్స్ బాండ్ సీన్కానరీ చిత్రం డాక్టర్ నో చిత్రంలో నటించి తొలి జేమ్స్ బాండ్ గాళ్గా పేరు పొందారు. డాక్టర్ నో, ఫ్రం రష్యా విత్ లవ్ చిత్రాల్లో నటించిన బాండ్ గాళ్ కన్నుమూశారని మైఖేల్ జి విల్సన్ , బార్బరా బ్రకోలీ, బాండ్ సిరీస్ నిర్మాతలు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో ట్విటర్లో గైసన్ మృతిపై సంతాపం సందేశాలు వెల్లువెత్తాయి. గేసన్ 1928 లో సుర్రేలో జన్మించారు. తొలి బాండ్ గర్ల్గా అవతరించక ముందు ఆమె 1958లో రివెంజ్ ఆఫ్ ఫ్రాంకెన్స్టీన్ సహా అనేక హారర్ సినిమాల్లో కనిపించారు. అలాగే బాండ్ చిత్రాల అనంతరం ది సెయింట్ , ది ఎవెంజర్స్ లాంటి టీవీ సీరియల్స్లో కూడా నటించారు. We are very sad to learn that our dear Eunice passed away on June 8th. An amazing lady who left a lasting impression on everyone she met. She will be very much missed. pic.twitter.com/c5kVHs256Y — Eunice Gayson (@EuniceGayson) June 9, 2018 -
అసలు విషయం అప్పుడు చెప్పింది!!
హాలీవుడ్ స్టార్ మేఘన్ మార్కల్ ఇంకో ఐదు నెలల్లో ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకొని బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ మెంబర్ కానుంది. నవంబర్ 27న హ్యారీ ఉంగరం తొడిగి ప్రపోజ్ చేశాక మేఘన్ నటనకు దూరమైపోయింది. అప్పటికే బాగా పాపులర్ అయిన ‘సూట్స్’ టీవీ సిరీస్ నుంచి బయటకొచ్చేసింది. ఇకపై సినిమాలు చేయనని మాట కూడా ఇచ్చేసింది. అలాగే అదేమీ కష్టంగా తీసుకుంటున్న నిర్ణయం కాదని, సినిమాలకు దూరమవ్వడం ఒక కొత్త జీవితం మొదలుపెట్టడానికే అని చెప్పుకొచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, హ్యారీతో మేఘన్ ప్రేమలో ఉన్న విషయం తెలియని రోజుల్లో జేమ్స్బాండ్ 25వ సినిమాకు ఆమెను హీరోయిన్గా అనుకున్నారట. అనుకోవడమేంటీ? ఆమెనే బాండ్ భామ అని ఫిక్స్ చేసుకొని, అడిగేసారట! సరిగ్గా అప్పుడు చెప్పింది మేఘన్.. అసలు విషయం. ఇంకేముంది.. ‘బాండ్ 25’ టీమ్ వేరొకర్ని ఎంపిక చేసే పనిలో పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని మూవీ సిరీస్లో ఒకటైన జేమ్స్బాండ్ సిరీస్లో వస్తోన్న 25వ సినిమా కావడంతో ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ అవ్వని బాండ్ 25పై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. డేనియల్ క్రెయిగ్ జేమ్స్బాండ్గా నటిస్తోన్న ఈ సినిమా 2019 నవంబర్లో విడుదలవుతుంది. -
‘జేమ్స్బాండ్ 25’ నోలన్ చేస్తాడా?
‘బాండ్.. జేమ్స్బాండ్..’ సినీ అభిమానులను దశాబ్దాలుగా ఉర్రూతలూగిస్తున్న క్యారెక్టర్ ఇది. ఇప్పటివరకూ 24 బాండ్ సినిమాలొస్తే అన్నీ యాక్షన్ సినిమా అభిమానులకు పండగలాగానే నిలిచాయి. ఇక 25వ సినిమా కూడా వచ్చేస్తుందనేసరికి ఈ స్పెషల్ బాండ్ ఎంత హంగామా చేస్తాడోనని అభిమానులు ఇప్పట్నుంచే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి చాలామంది బాండ్ క్యారెక్టర్లో కనిపించిన నటులు మారిపోయారు. చాలామంది డైరెక్టర్లూ మారిపోయారు. అయినా బాండ్ క్రేజ్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. గత నాలుగు బాండ్ సినిమాలకు హీరో అయిన డానియల్ క్రెయిగ్ ఐదోసారి చివరిసారి ఈ 25వ సినిమాలోనే కనిపిస్తాడట. 2019 నవంబర్లో బాండ్ 25వ సినిమా వస్తుందని అనౌన్స్ అయితే చేశారు కానీ, క్రెగ్ కాకుండా ఇంకా ఎవరెవరు ఈ సినిమాకు పని చేస్తున్నారన్నది సస్పెన్సే! తాజాగా కొద్ది రోజులుగా ఓ పుకారు షికారు చేస్తోంది. అదే.. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాకు దర్శకుడన్నది. నిజంగానే నోలన్ ఈ సినిమాకు పని చేసున్నాడా? అంటే సమాధానం లేదు. ‘డన్కిర్క్’ తర్వాత నోలన్ తన కొత్త సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు. చేస్తే బాండ్ సినిమా చేస్తూ ఉండొచ్చు కూడా. మరి యాక్షన్కి పెట్టింది పేరైన బాండ్ సినిమాకు నోలన్ స్టైల్ ఎలా కుదురుతుందో? ఎందుకంటే నోలన్ అంటే ఎక్కువ ఫిలాసఫీకి, లాజిక్కీ ఇంపార్టెన్స్ ఇస్తాడు. బాండ్ అంటే లాజిక్కి అందకుండా ఫుల్ యాక్షన్ ఉంటుంది. మరి.. నోలన్ బాండ్ ఎలా ఉంటాడో? అని ప్రస్తుతానికి లెక్కలు వేసుకోవాల్సిందే, అనౌన్స్మెంట్ వచ్చేవరకూ. 2018 మార్చిలో బాండ్ 25 షూట్ మొదలవుతుంది. -
సీనియర్ నటి కన్నుమూత
లండన్: చిత్రసీమను విషాదం వెంటాడుతూనే ఉంది. మొన్నటికి మొన్న జేమ్స్బాండ్ నటుడు రోజర్ మూర్ తుదిశ్వాస విడువగా.. తాజాగా జేమ్స్బాండ్ నటి మోలీ పీటర్స్ కూడా కన్నుమూసింది. 1965లో వచ్చిన జేమ్స్బాండ్ సినిమా ’థండర్బాల్’లో సీన్ కానరీ సరసన హీరోయిన్గా మోలీ నటించింది. ఆమె మృతిని జేమ్స్బాండ్ అధికారిక ట్విట్టర్ పేజీ ధ్రువీకరించింది. 75 ఏళ్ల వయస్సులో మోలీ చనిపోయిందని పేర్కొంటూ ఆమె కుటుంబానికి సంతాపం తెలిపింది. ఆమె ఎలా చనిపోయిందనే విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 1942లో ఇంగ్లండ్లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన మోలీ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించింది. ప్లేబాయ్, పరేడ్ వంటి మ్యాగజీన్లలో కనిపించిన ఆమెను 23 ఏళ్ల వయస్సులో జేమ్స్ బాండ్ డైరెక్టర్ టెరెన్స్ యంగ్ గుర్తించి.. ‘థండర్బాల్’ సినిమాలో హీరోయిన్గా అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆమె ‘డోన్ట్ రైజ్ ఆ బ్రిడ్జ్, లోయర్ ద రివర్’ వంటి కామెడీ సినిమాలు, పలు టీవీ షోలలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఏడు జేమ్స్బాండ్ సినిమాల్లో సీక్రెట్ ఏజెంట్గా నటించి పర్ఫెక్ట్ బాండ్గా పేరు తెచ్చుకున్న రోజర్ మూర్ 89 ఏళ్ల వయస్సులో ఇటీవల మృతిచెందిన సంగతి తెలిసిందే. -
‘జేమ్స్ బాండ్’ హీరో ఇకలేరు
బెర్న్: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించిన ‘జేమ్స్ బాండ్’ చిత్రాల కథానాయకుడు, ప్రముఖ బ్రిటిష్ నటుడు రోజర్ మూర్(89) ఇకలేరు. కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం స్విట్జర్లాండ్లో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఆయన ట్వీటర్ ఖాతాలో వెల్లడించారు. భారమైన హృదయంతో ఆయన మరణవార్తను తెలుపుతున్నామని పేర్కొన్నారు. మూర్ అంత్యక్రియలను ఆయన నివసించిన మొనాకోలో నిర్వహిస్తామని వె ల్లడించారు. మూర్ మృతిపై అభిమానులు, పలువురు హాలీవుడ్ ప్రముఖులు, సహచర నటులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలీవుడ్ ప్రముఖులు రిషికపూర్, బొమన్ ఇరానీ తదితరులు కూడా సంతాపం తెలిపారు. సైన్యం నుంచి సినిమాల దాకా.. అత్యధిక జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించిన రికార్డు కొట్టేసిన మూర్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన మొత్తం ఏడు బాండ్ సినిమాల్లో నటించారు. మృదువుగా మాట్లాడుతూ, అనుమానంతో కనురెప్పలు పైకిలేపుతూ బాండ్ పాత్రలో ఒదిగిపోయారు. నిజ జీవితంలో తుపాకులంటే భయపడిపోయే మూర్ సినిమాల్లో కాల్పుల వీరుడిగా కనిపించక తప్పలేదు. వెండితెరపై బ్రిటిష్ గూఢచారి పాత్రలో పోరాటాల ను, రొమాన్స్ను పండించిన ఆయన నిజజీవితంలో సేవాకార్యక్రమాలతోనూ ఆకట్టుకున్నారు. 1991లో యూనిసెఫ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. 1927లో లండన్లో జన్మించిన మూర్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1946లో బ్రిటిష్ సైన్యంలో చేశారు. కొన్నాళ్లు జర్మనీలో పనిచేసి కెప్టెన్ హోదా పొందారు. తర్వాత రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్లో శిక్షణ పొంది సినీరంగంలో ప్రవేశించారు. తొలుత సినిమాల్లో, టీవీ సీరియళ్లలో చిన్నచిన్న వేషాలు వేశారు. ‘ద సెయింట్’ స్పై థ్రిల్లర్ టీవీ ఎపిసోడ్లతో పేరు తెచ్చుకున్నారు. 1973–1985 మధ్య విడుదలైన జేమ్స్ బాండ్ సిరిస్లోని ‘లివ్ అండ్ లెట్ డై’, ‘ద మేన్ విత్ ద గోల్డెన్ గన్’, ‘ద స్పై హూ లవ్డ్ మి’, ‘మూన్రేకర్’, ‘ఫర్ యువర్ ఐస్ ఓన్లీ’, ‘ఆక్టోపస్సీ’, ‘ఎ వ్యూ టు కిల్’ సినిమాల్లో మూర్ నటించారు. ఆయనకు ముందు సీన్ కానరీ, జార్జ్ లాజన్బీలు జేమ్స్ బాండ్ పాత్రలు పోషించారు. బాండ్ సినిమాలపై రెండు పుస్తకాలు రాసిన మూర్ తన ఆత్మకథ ‘మై వర్డ్ ఈజ్ మై బాండ్’ను 2008లో వెలువరించారు. భారత్తో అనుబంధం.. మూర్కు భారత్తో అనుబంధం ఉంది. ఆయన తల్లి లిలియన్ కోల్కతాలో జన్మించారు. మూర్ 1982లో ఆక్టోపస్సీ సినిమా షూటింగ్ కోసం భారత్కు వచ్చారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఉదయ్పూర్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో భారతీయ నటులు కబీర్ బేడీ, విజయ్ అమృత్రాజ్లు కూడా నటించారు. 2005లో అయోడైజ్డ్ ఉప్పు ప్రచారం కోసం మూర్ యూనిసెఫ్ రాయబారిగా మరోసారి భారత్కు వచ్చారు. వయసు పైబడినా ఇంకా యువకుడిలాగే కనిపిస్తుండటానికి కారణం ‘అయోడైజ్డ్ ఉప్పు’ అని సరదాగా చెప్పారు. -
జేమ్స్ బాండ్ మూర్ ఇకలేరు
-
బాండ్ గర్ల్గా బాలీవుడ్ బ్యూటీ
హాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ సీరిస్ జేమ్స్ బాండ్. బాండ్ సినిమా రిలీజ్ అవుతుందట.. అన్ని దేశాల్లో ఆ సందడి కనిపిస్తుంది. అందుకే బాండ్ సినిమాలో చిన్న పాత్రలో అయిన కనిపించేందుకు హాలీవుడ్ స్టార్లు సైతం ఆసక్తి కనబరుస్తారు. అలాంటి అరుదైన అవకాశం బాలీవుడ్ బ్యూటీని వరించింది. బాలీవుడ్తో పాటు హాలీవుడ్ ఆఫర్లతోనూ ఫుల్ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా రాబోయే బాండ్ సినిమాలో బాండ్ గర్ల్గా అలరించనుందట. క్వాంటికో టీవీ సీరిస్తో పాటు, రిలీజ్కు రెడీగా ఉన్న బేవాచ్ సినిమాలతో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. త్వరలో బాండ్ గర్ల్గా నటించిన తొలి ఇండియన్గా రికార్డ్ సృష్టించనుంది. బాండ్ గర్ల్స్ అంటే బ్రెయిన్ విత్ బ్యూటీ.. ఈ క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్న ప్రియాంక బాండ్ గర్ల్ పాత్రకు న్యాయం చేస్తుందని భావిస్తున్నారు హాలీవుడ్ నిర్మాతలు. డానియల్ క్రెగ్ బాండ్ పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రియల్ లైఫ్లో వీళ్ల వెనుక ఉన్న జీనియస్ ఓ అమ్మాయి!
జేమ్స్ బాండ్ సినిమాల్లో ‘క్యు’ అనే క్యారెక్టర్ ఉంటాడు. అతడి పని జేమ్స్ బాండ్కి కొత్త కొత్త గ్యాడ్జెట్స్ని డిజైన్ చేసి ఇవ్వడం. ఆ గ్యాడ్జెట్స్తో మన హీరో అవలీలగా స్పయింగ్ చేస్తుంటాడు. అయితే ప్రస్తుతం నిజ జీవితంలో మాత్రం ‘క్యు’అనే ఆ టెక్ జీనియస్ అబ్బాయి కాదు.. ఓ అమ్మాయి! ఈ సంగతి చాలామందికి తెలీదు. ఇప్పుడైనా ఎలా తెలిసిదంటే.. ‘ఎం16’ చీఫ్ అలెక్స్ ఎంగర్ బయటపెట్టాడు. ఎం16 అనేది బ్రిటిష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్. దాని హెడ్ ఈయన. అమ్మాయిల్ని స్పయింగ్లోకి ప్రోత్సహించడానికి ఈయన ఆ నిజం చెప్పాల్సి వచ్చింది. దీనివల్ల ప్రమాదమైతే ఏమీ లేదు కానీ, ఎం16లోకి కొత్తగా వచ్చే అమ్మాయిలలో ఎవరైనా ఇప్పుడున్న లేడీ ‘క్యు’కి పోటీ కావచ్చు. మరీ మంచిది. -
బాండ్ క్యారెక్టర్లో రామ్ చరణ్..?
హీరోగానే కాక నిర్మాతగానూ సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నెక్ట్స్ సినిమాల విషయంలో కూడా సెలెక్టివ్గా ఉంటున్నాడు. గతంలో మూస మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన చెర్రీ, ధృవ సినిమాతో ప్రయోగాల బాట పట్టాడు. ఇమేజ్ను పక్కన పెట్టి కొత్త తరహా కథలకు సై అంటున్నాడు. ధృవ, ఖైదీ నంబర్ 150 సినిమాల పనులు ముగియటంతో ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా మీద దృష్టిపెట్టాడు చరణ్, ఈ నెల 30న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నాడు. సుకుమార్ సినిమా తరువాత మరో ఇంట్రస్టింగ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు చరణ్. ఇటీవల గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. అది కూడా జేమ్స్ బాండ్ తరహా స్పై థ్రిల్లర్ అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో క్రిష్, వరుణ్ హీరోగా 'రాయభారి' అనే సినిమాను చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. ఇప్పుడు అదే కథకు మార్పులు చేసి చరణ్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. సూపర్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తరువాత తెలుగులో బాండ్ క్యారెక్టర్లలో నటించిన నటులు లేరు. ఇన్నేళ్ల తరువాత చరణ్ బాండ్ పాత్రలో కనిపిస్తాడన్న వార్తతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. -
బాండ్ యాడ్పై పాన్ బహార్ క్లారిటీ
మాజీ జేమ్స్ బాంబ్ పీర్స్ బ్రోస్నన్ చేసిన పాన్ బహార్ యాడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓ పాన్ కంపెనీ ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరోతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవటంతో ఆ యాడ్కు విపరీతమైన ప్రచారం లభించింది. అదే సమయంలో పొగాకు ఉత్పత్తులను జేమ్స్ బాండ్ ప్రమోట్ చేయటంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగివచ్చిన బాండ్ నటుడు బ్రోస్నన్ వివరణ ఇచ్చుకున్నాడు. అది హానికరమైనదని తనకు తెలియదని, తాను అది కేవలం టూత్ వైట్నర్ అన్న ఉద్దేశంతోనే ప్రమోట్ చేసేందుకు అంగీకరించానని తెలిపాడు. కంపెనీ అనుమతి తీసుకోకుండా తన ఫొటోను పొగాకు ఉత్పత్తులకు అనధికారింగా వినియోగించిందని తెలిపాడు. ఈ ప్రకటనతో నొచ్చుకున్న అభిమానులను క్షమాపణలు కూడా కోరాడు. అయితే ఈ వివాదం పై తాజాగా పాన్ బహార్ కంపెనీ స్పందించింది. బాండ్తో చిత్రీకరించిన యాడ్ కాంట్రాక్ట్ ప్రకారమే చేశామని, అన్ని విషయాలు బ్రోస్నన్కు వివరించిన తరువాతే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఈ మేరకు పాన్ బహార్ కంపెనీ యజమాని దినేష్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ప్రాడక్ట్ తయారీలో పొగాకు వినియోగించలేదని, ఇది కేవలం మౌత్ ఫ్రెషనర్ మాత్రమే అని తెలిపాడు. అంతేకాదు తమతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్న బ్రోస్నన్ పై చట్టం పరంగా చర్యలు తీసుకునే విషయంపై కూడా చర్చిస్తున్నామని తెలిపారు. -
ఆ యాడ్ చేసినందుకు.. జేమ్స్బాండ్ సారీ చెప్పాడు
బాండ్ క్యారెక్టర్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హాలీవుడ్ స్టార్ హీరో పీర్స్ బ్రోస్నన్. అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో.., పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అదే బాటలో ఇటీవల ఇండియాలో తయారయ్యే ఓ పాన్ మసాలా కంపెనీకి అంబాసిడర్గా వ్యవహరించేందుకు అంగీకరించాడు. ఈ మాజీ బాండ్తో యాడ్ను షూట్ చేసిన పాన్ బహర్ కంపెనీ భారీగా ప్రచారం చేస్తోంది. అయితే మాజీ జేమ్స్ బాండ్గా క్లీన్ ఇమేజ్ ఉన్న బ్రోస్నన్ ఇలాంటి ప్రాడక్ట్కు ప్రచారం చేయటం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం బ్రోస్నన్ వరకు చేరటంతో ఆయన స్పందించారు. తనకు అది పాన్ మసాలా యాడ్ అని తెలియదని, తాను టూత్ వైట్నర్ అన్న ఉద్దేశంతో ఈ యాడ్లో నటించానని తెలిపాడు. అంతేకాదు పాన్ బహర్ కంపెనీ వారిని కూడా ఇక తన ఫోటోలను ప్రచారానికి వాడవద్దని కోరాడు. తనకు తెలియకుండా చేసినా..? ఓ హానికరమైన ప్రాడక్ట్కు ప్రచారం చేసినందుకు ఇండియన్ ఫ్యాన్స్ క్షమాపణలు చెప్పాడు. -
జేమ్స్ బాండ్ ఈజ్ బ్యాక్
-
పాన్ మసాలా ప్రమోషన్కు జేమ్స్బాండ్
సాధారణంగా ఏ బ్రాండ్ అయినా ప్రమోట్ చేయడానికి అక్కడి లోకల్ స్టార్స్ను తీసుకుంటారు. కాస్త పెద్ద బ్రాండ్ అయితే బాలీవుడ్ స్టార్స్ని ట్రై చేస్తారు. కానీ ఇండియాకు చెందిన ఓ పాన్ మసాలా కంపెనీ వారు మాత్రం ఏకంగా తమ బ్రాండ్ ప్రమోషన్కు హాలీవుడ్ స్టార్ హీరోనే దించేశారు. అది కూడా జేమ్స్బాండ్ సీరిస్తో అంతర్జాతీయంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పీర్స్ బ్రోస్నన్తో ఇండియన్ పాన్ మసాలాను ప్రమోట్ చేయిస్తున్నారు. శుక్రవారం ఉదయం అన్ని జాతీయ పత్రికల్లో వార్తలతో పాటు ఓ యాడ్ కూడా ప్రముఖంగా ఆకర్షించింది. వరుస బాండ్ చిత్రాలతో అలరించిన మాజీ జేమ్స్బాండ్ పీర్స్ బ్రోస్నన్ చేతిలో ఇండియాలో తయారైన పాన్ మసాలా డబ్బా ఉన్న ఈ యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో సైఫ్ అలీఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ప్రమోట్ చేసిన ఈ బ్రాండ్కు ప్రస్తుతం ఈ హాలీవుడ్ స్టార్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు అంగీకరించారు. బాండ్ ప్రచారం పాన్ మసాలాకు ఇంటర్నేషనల్ ఫేం తీసుకు వస్తుందేమో చూడాలి. -
ఆ హీరోకు వెయ్యికోట్ల బంపర్ ఆఫర్
తదుపరి జేమ్స్ బాండ్ ఎవరు అన్నదానిపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. దీనికోసం తెరవెనుక పెద్ద ఎత్తున చర్చలు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు తాజా జేమ్స్ బాండ్ సినిమా గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే, తదుపరి జేమ్స్ బాండ్గా డానియెల్ క్రేగ్నే కొనసాగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఏజెంట్ 007గా మరో రెండు సినిమాలు నటిస్తే ఏకంగా ఆయనకు 150 మిలియన్ డాలర్లు (రూ. 996 కోట్లు) ఇస్తామని చిత్ర నిర్మాతలు ఆఫర్ చేసినట్టు 'రాడర్ ఆన్లైన్' తెలిపింది. బాండ్గా క్రెయిగ్ను ఒప్పించేందుకు నిర్మాత అయిన సోనీ సంస్థ తెరవెనుక చాలా ప్రయత్నాలే చేస్తున్నదని, అందులో భాగంగా కనీవినీ ఎరుగనిరీతిలో పారితోషికాన్ని ఆయనకు ఆఫర్ చేసిందని ఆ వెబ్సైట్ తెలిపింది. ఇప్పటికిప్పుడు బాండ్ పాత్రలో కొత్త వ్యక్తిని తీసుకోవడం సోనీకి ఇష్టం లేదని, తదుపరి రెండు సినిమాలకూ బాండ్గా క్రెయిగ్ ఉంటేనే బాగుంటుందని సోనీ టాప్ బాసులు భావిస్తున్నట్టు పేర్కొంది. తాజాగా 'స్పెక్టర్' సినిమాతో 007గా క్రెయిగ్ అలరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాండ్ సిరీస్ సినిమాల్లో నటించబోనని ఆయన తేల్చిచెప్పారు. 'కావాలంటే నా మణికట్టు కోసుకోమన్న కోసుకుంటాను కానీ, బాండ్ పాత్రను మాత్రం చేయను. ఈ పాత్ర చేయడం వల్ల స్టంట్లతో నా ఒళ్లంతా హూనం అయిపోయింది' అని క్రెయిగ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఆయనను మరోసారి 007గా చూపించేందుకు సోనీ, బాండ్ రూపకర్తలు కృతనిశ్చయంతో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి బాండ్గా మరోసారి క్రెయిగ్ తెరపై కనిపిస్తాడా? లేదా? అన్నది చూడాలి. -
వివేక్ కోసం జేమ్స్బాండ్ టైనర్
బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ త్వరలో రెండు విభిన్న చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాలో ఫ్యాక్షన్ లీడర్గా నటించిన వివేక్, మరోసారి అదే దర్శకుడితో కలిసి ఓ అండర్ వరల్డ్ డాన్ జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు. ముత్తప్ప రాయ్ అనే మాఫీయా డాన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న రాయ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఖేల్ అనే మరో సినిమాలోనూ ఒకేసారి నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ రెండు సినిమాల్లో రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించేందుకు వివేక్ కష్టపడుతున్నాడు. కాసినో రాయల్, స్కైఫాల్ లాంటి సినిమాల కోసం డానియల్ క్రెగ్ను ట్రయిన్ చేసిన ఆంతోని పెకోరా పర్యవేక్షణలో బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. రాయ్ సినిమాలో భారీ దేహంతో డాన్లా కనిపించనున్నాడు, అదే సమయంలో ఖేల్ సినిమా కోసం సన్నగా కనిపించాల్సి ఉంది. అంత త్వరగా బాడీ బిల్డ్ చేయటం వెంటనే సన్నబడటం లాంటివి చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అంతర్జాతీయ స్థాయి ట్రైనర్ను ఎంపిక చేసుకున్నాడు వివేక్. -
'బ్రెగ్జిట్'కు కారణం నేనే: విష్ణు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం బ్రిటన్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలే. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని భారీగా దెబ్బతీస్తున్న ఈ పరిణామంపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఓ జోక్ వేశాడు. అసలు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవటానికి కారణం తానే అంటూ కామెంట్ చేశాడు విష్ణు. '22వ తేదీన లండన్ వచ్చాను. ఇప్పుడు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయింది. పౌండ్ విలువ భారీగా పతనం అయ్యింది. నా మిషన్ పూర్తయ్యింది. ఇప్పుడు 007 (జేమ్స్ బాండ్) ఏం చేస్తాడో చూద్దాం' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న విష్ణు, ఇండియాకు తిరిగి రాగానే తన తదుపరి ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వనున్నాడు. Came to London on 22nd. Leaving now, after bringing Britain out of EU & crashing the Pound. Mission accomplished. Now whatcha gonna do 007? — Vishnu Manchu (@iVishnuManchu) 24 June 2016 -
ఓ రిస్ట్బ్యాండ్ మీ జీవితాన్ని కాపాడుతుంది!
లండన్: జేమ్స్బాండ్ సినిమాలోని హీరో క్యారెక్టర్ సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన పరికరాలతో ప్రత్యర్థులను బురిడీ కొట్టిస్తాడు కదా!. సరిగ్గా అలాంటి పరికరమే ఒకటి రూపొందించబడింది. కాకపోతే అది ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కాదు.. ఎవరికి వారు క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను కాపాడుకోవటానికి. సరికొత్త రిస్ట్బ్యాండ్ ఆవిష్కరణ ఇప్పుడు జేమ్స్బాండ్ చిత్రంలోని టెక్నాలజీని గుర్తుచేస్తోంది. కింగ్లీ అనే రిస్ట్బ్యాండ్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. అన్ని రిస్ట్బ్యాండ్లలా ఇది కేవలం అలంకరణకే కాకుండా ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోతే ఇది కాపాడుతోంది. నీటిలో మునిగినప్పుడు దీనికి గల మీట నొక్కితే చాలు దీనిలో అదృశ్యంగా ఉన్న బెలూన్ ఓపెన్ అయిపోతుంది. అలా నీటిలో మునిగిన వారు పైకి తేలడానికి ఇది తోడ్పడటమే కాకుండా.. వారికి సంబంధించిన వ్యక్తులను సైతం ఇది అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతం దీని మార్కెట్ ధర సుమారు రూ. 7 వేల వరకూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఏటా నీటిలో మునిగిపోవటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ రిస్ట్బ్యాండ్ ఉపయుక్తంగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. -
నెట్ బాండ్ బడ!
సమస్త సమస్యలకీ, సమాచారానికీ ఇప్పుడు ఇన్స్టంట్ గైడ్ - గూగుల్, వికీపీడియాలే. నెట్ ఇలా మన నట్టింటిలోకి వచ్చాక, వాట్సప్లు, ఫేస్బుక్ల లాంటి సోషల్ మీడియా కూడా పెరిగిపోయాక, నెట్లో రకరకాల వింత చర్చలు, విచిత్రమైన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ‘500 కోట్లు కాదు... వెయ్యి కోట్లిచ్చినా సరే, నేనిక బాండ్ పాత్రలు చేసేది లేదు’ అంటూ హాలీవుడ్ స్టార్, ఇటీవలి పాపులర్ సినీ జేమ్స్బాండ్ డేనియల్ క్రేగ్ తేల్చేసిన విషయం బయటకొచ్చాక నెట్ వరల్డ్లో దీనిపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. జేమ్స్బాండ్ వారసుడెవరా అని ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ వెతుకుతున్నాయి ఇంటర్నెట్ సెర్చింజన్లు. కొందైరె తే ‘జేమ్స్బాండ్ పాత్రకు అంతంత డబ్బెందుకు... బ్యాండు కాకపోతే ! అందులో సగం కాదు... పావు వంతు ఇచ్చినా అంతకన్నా మంచివాళ్లే దొరుకుతారు’ అంటున్నారు. అందుకు ఉదాహరణగా మైఖేల్ ‘ఫాస్బాండర్’ను చూపుతున్నారు. మరోపక్క, తాజాగా తీసే 25వ జేమ్స్బాండ్ చిత్రంలో బాండ్ పాత్రకు టామ్ హిడెల్స్టన్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చేశాయి. అయినా సరే, నెట్లో మాత్రం కొత్త బాండ్ పాత్ర, క్రెగ్ నిరాకరణ సహా అనేక విషయాల గురించి రకరకాల బొమ్మలు, వార్తలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఆ మాటకొస్తే జేమ్స్బాండ్ పాత్ర చేయడానికి బ్రిటీష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్కి ఏమి తక్కువ అంటూ కొందరు బయల్దేరారు. ఏకంగా డేవిడ్ కామెరాన్ ముఖాన్ని ఫొటోషాపులో జేమ్స్బాండ్ బొమ్మకు అతికించి మరీ, బాండ్గా చిత్రీకరిస్తున్నారు ఇంకొందరు వీరాభిమానులు. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. ‘జేమ్స్ బాండ్ అంటే ఎప్పుడూ మగవాళ్లేనా? లేడీ బాండ్లు ఎందుకు ఉండకూడదు? వాళ్లయితే బాగా ఒళ్ళు వంచగలరు. పైగా వెరైటీగా కూడా ఉంటుంది’ అని కొందరు అంటున్నారు. అలా ఇప్పుడు కొత్త జేమ్స్బాండ్ పాత్రధారి ఎవరనే విషయంలో లింగ విచక్షణ అనే కొత్త కోణం వచ్చి చేరింది. ‘ఉబుసుపోక కబుర్లు... ఉచిత సలహాలకేం గానీ, ఎమిలీ బ్లంట్ ఐతే ఎలా ఉంటుందీ’ అని ఒకరు, ‘యాబ్సల్యూట్లీ ఫ్యాబ్యులస్’ అనే ప్రఖ్యాత టీవీ షో చేసిన ‘ప్యాట్సీ స్టోన్ అయితే అద్దిరిపోతుంది’ అని మరొకరు- ఇలా రకరకాల మాటలు, బొమ్మలు అంతర్జాలంలో ఇప్పుడు షికారు చేస్తున్నాయి. అయితే వీటన్నిటి కన్నా అధికంగా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న గమ్మత్తై నెట్ క్రియేషన్ ఒకటి ఉంది. అది ఏమిటంటే... నటి గిలియన్ ఆండర్సన్ను ప్రసిద్ధ జేమ్స్బాండ్ సినిమా ‘స్కైఫాల్’ పోస్టర్లో బాండ్ పాత్రలో సూపర్ ఇంపోజ్ చేస్తూ పెట్టిన ఫొటో. తమాషాగా చేసిన ఈ అభూత నెట్ కల్పన వీక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. ‘అవును! ఈమె బాండ్... ‘జేన్’ బాండ్!’ అంటూ దాని కింద రాసిన ఫొటో క్యాప్షన్ అయితే మరీనూ! ‘జేన్’ అంటే ఏమిటని ఖంగారు పడకండి! పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న పెద్దోళ్ళు ‘స్త్రీ మూర్తి’ని ‘జేన్’ అంటారు లెండి! ఇక్కడ ‘జేన్’ బాండ్ అంటే... ‘లేడీ బాండ్’ అని ప్రతిపదార్థమూ, తాత్పర్యమున్నూ అని ఇంగ్లిపీసు బాగా తెలిసినవాళ్ళ ఉవాచ. ఈ భాషాతత్త్వ విచార చర్చ మాటెలా ఉన్నా, ఈ కొత్త నెట్ కల్పన, ఆ ఫొటో, క్యాప్షన్ - హంగామా అంతా సదరు గిలియాన్ ఆండర్సన్ దృష్టికి వెళ్లింది. అంతే! ‘‘లేడీ బాండ్గా నేనైతే బాగుంటానని అనడం సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ ఎవరు రూపొందించారో తెలియదు కానీ, దీని రూపకర్తలకు నా కృతజ్ఞతాభివందనాలు’’ అంటూ గిలియన్ ఆండర్సన్ సంతోషంతో ట్వీట్ చేసింది. ఇది ఇలా ఉంటే, ‘జీవితంలో మీ గురించి చలామణీ అయిన పుకార్లలో మిమ్మల్ని అమితంగా ఆకట్టుకున్నది ఏమిటి?’ అని ఎవరో ఆమెను కొంటెగా క్వశ్చన్ చేశారు. ‘‘నన్ను జేమ్స్బాండ్ను చేస్తూ జరుగుతున్న ఈ ప్రచారం కన్నా సంచలనమైనది ఇంకేమైనా ఉంటుందా?’’ అంటూ అంతకన్నా కొంటెగా జవాబిచ్చారు గిలియన్. మొత్తానికి, ఈ కొత్త చర్చకు చాలా మందే మద్దతు పలికారు. గతంలో నాలుగేసి సార్లు బాండ్ పాత్ర చేసిన పియర్స్ బ్రోస్నన్, డేనియల్ క్రెగ్లు ఇద్దరూ నల్ల బాండ్ అయినా, లేడీ బాండ్ అయినా తప్పేముంది అన్నారు. చివరకు ఏమవుతుందో వేచి చూడాలి. తిమ్మిని బమ్మి... బమ్మిని తిమ్మి చేసేది ఏమైనా ఉంటే - అది నెట్టే! అదేనండీ... ఇంటర్నెట్! ‘ఎన్ని కోట్లిచ్చినా, నేను బాండ్ పాత్ర వేయను’ అని డేనియల్ క్రెగ్ అనడంతో ఇప్పుడు నెట్లో రకరకాల బాండ్లు తయారయ్యారు. దాంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్... లేడీ బాండ్! గిలియన్ ఆండర్సన్! కొత్త బాండ్ ఎవరు? త్వరలో తెరకెక్కనున్న 25వ జేమ్స్బాండ్ చిత్రానికి బాండ్ ఎవరనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్బాండ్గా టామ్ హిడెల్స్టన్ చేస్తా రని ఒక వార్త. మరోపక్క బాండ్ పాత్రకోసం తొలిసారిగా ఆడవారి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. ‘ఎక్స్-ఫైల్స్’ ఫేమ్ గిలియన్ ఆండర్సన్ పేరు అందరి కన్నా టాప్లో నెట్లో సందడి చేస్తోంది. ‘ఘోస్ట్ బస్టర్స్’, ‘ఓషన్స్2’ లాంటి కొత్త చిత్రాల్లో ఆడవాళ్ళదే ప్రధానపాత్ర. జేమ్స్బాండ్ సిరీస్లోనూ ఈ మార్పు ఎందుకు రాకూడదన్నది కొత్త వాదన. ఇక, వర్ణ వివక్ష వ్యవహారం తెర మీదకు తెచ్చి, నల్లజాతీయుడైన 45 ఏళ్ళ ఇడ్రిస్ ఎల్బా ఎలా ఉంటారనే చర్చ వచ్చింది. ఆ మాటకొస్తే క్రెగ్ను తొలిసారిగా బాండ్ పాత్రకు తీసుకున్నప్పుడూ ఇలానే చర్చలు జరిగాయి. కొత్త బాండ్ ఎవరన్నది కొద్దిరోజుల్లో కానీ అధికారికంగా తేలదు. క్రెగ్ మాటెలా ఉన్నా, వీళ్ళకెంత పారితోషికమి స్తారో తెలీదు. అయినా, పాపులర్ బాండ్ పాత్రకు మించి పారితోషికం ఏముంటుంది! బాండ్... లేడీ బాండ్... జేమ్స్బాండ్ సినిమాలో లేడీ బాండ్నే హీరోగా పెట్టడమనేది ఇప్పుడిప్పుడే ఎంతవరకు జరుగుతుందో అనుమానమే కానీ, లేడీ బాండ్గా అందరి కన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాత్రం గిలియన్ ఆండర్సన్. అమెరికన్ - బ్రిటీష్ సినీ, టీవీ, రంగస్థల నటి అయిన అమెరికన్ సైన్స్ - ఫిక్షన్ సిరీస్ ‘ఎక్స్-ఫైల్స్’లో అమెరికన్ నేర దర్యాప్తు సంస్థలో స్పెషల్ ఏజంట్ పాత్రధారిణిగా జనంలో ఫేమస్. కుటుంబాన్ని పోషించడం కోసం 22 ఏళ్ళ వయసులో హోటల్లో పనిచేస్తూ, రంగస్థలంపై నటిగా కాలుమోపారు. ఆ పైన టీవీ సిరీస్లలో నటిగా పేరు తెచ్చుకున్నారు. నవలా రచయిత్రి, ఉద్యమకారిణి అయిన ఆమె తెరపై బలమైన స్త్రీ పాత్రల్ని పోషిస్తుంటారు. పలు మహిళా సంస్థలకు, ఉద్యమాలకు మద్దతుదారైన గిలియన్ తనను తాను ‘ఫెమినిస్టు’గా అభివర్ణించుకుంటారు. ‘‘మహిళల గురించి ఎవరైనా కాస్త తేడాగా మాట్లాడినా, ప్రవర్తించినా నేను ఊరుకోలేను’’ అని బాహాటంగా అంటారు. అన్నట్లు భారతీయ సంతతి మహిళా డెరైక్టర్ గురిందర్ చద్ధా దేశ విభజన నేపథ్యంలో తీస్తున్న ‘వైస్రాయ్స్ హౌస్’లో మౌంట్బాటెన్ భార్య ఎడ్వినా మౌంట్బాటెన్గా గిలియన్ నటిస్తున్నారు. లేడీ బాండ్గా నటించినా, నటించకపోయినా - నెట్ ఫ్యాన్స్ పుణ్యమా అని ఇంత ప్రచారం వచ్చినందుకు గిలియన్ సహజంగానే సంతోషిస్తున్నారు. కోట్లిస్తానన్నా... బాండ్ అంటే భయమెందుకు? ‘జేమ్స్బాండ్గా నటించడం కన్నా మణికట్టు కోసుకుని చావడం బెటర్’ అని హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 24 బాండ్ చిత్రాలు వస్తే, ఆ మధ్య విడుదలైన ‘స్పెక్టర్’ సహా 4 చిత్రాల్లో టైటిల్ రోల్ చేశారు క్రెగ్. ఇక బాండ్గా నటించనని ప్రకటించారు. ఎక్కువ డబ్బిస్తే క్రెగ్ నిర్ణయం మార్చుకుంటారని భావించి, దర్శక - నిర్మాతలు అనుకున్నారు. ఏకంగా 100 మిలియన్ డాలరు ్ల(రూ. 674 కోట్లపైగా) ఆఫర్ చేశారట. అంత డబ్బు అన్నా క్రెగ్ మనసు చలించలేదు. బాండ్ సినిమాల్లోని రిస్కీ యాక్షన్ సీన్స్ కారణంగా క్రెగ్కు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. పైగా, బాండ్ సినిమాల షూటింగ్ కోసం విమానం మీద నుంచి వేలాడడం, అతి వేగంగా వెళుతున్న కారులో ప్రయాణం లాంటి వాటితో ఆయనకు ఒళ్ళంతా దెబ్బలేనట! దాంతో, డబ్బు కన్నా ఆరోగ్యానికి ఓటేశారు. -
ఆరు వందల కోట్లు.. అయినా నో!
‘జేమ్స్బాండ్గా నటించడం కన్నా చేతి మణికట్టును కోసుకుని చావడం బెటర్’ అని హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 24 బాండ్ చిత్రాలు వస్తే.. ఆ మధ్య విడుదలైన ‘స్పెక్టర్’తో కలిపి నాలుగు చిత్రాల్లో టైటిల్ రోల్ చేశారు డేనియల్. మరి.. యాక్షన్ సన్నివేశాలు రిస్క్ అనుకున్నారో ఏమో.. ఇక బాండ్గా నటించనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో 25వ బాండ్ చిత్రానికి బాండ్గా టామ్ హిడెల్స్టన్ని ఎంపిక చేశారని సమాచారం. అయితే అంతకన్నా ముందు డేనియల్ని ఓసారి కన్విన్స్ చేయడానికి దర్శక-నిర్మాతలు శామ్ మెండెస్, బార్బరా బ్రోకోలి ట్రై చేశారట. ఎక్కువ మొత్తం ఆశ జూపితే కచ్చితంగా డేనియల్ నిర్ణయం మార్చుకుంటారన్నది వాళ్ల ఊహ. అందుకే ఏకంగా 100 మిలియన్ డాలరుల(మన కరెన్సీలో సుమారు 674 కోట్లు) ఆఫర్ చేశారట. అంత పారితోషికం అన్నప్పటికీ డేనియల్ మనసు చలించలేదట. బతికుంటే నాలుగు సినిమాలు చేసుకోవచ్చు.. రిస్క్ తీసుకుని, ప్రమాదంలో పడటం ఎందుకు? అని సన్నిహితులతో చెప్పుకున్నారట. అందుకే, అంత డబ్బుని కాదనుకున్నారు. బాండ్ సినిమాల్లోని రిస్కీ యాక్షన్ సీక్వెన్సెస్ కారణంగా డేనియల్కు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. అందుకే డబ్బు కన్నా ఆరోగ్యమే మిన్న అనే సూత్రాన్ని ఫాలో అయిపోయారు. మరి.. టామ్ హిడెల్స్టన్కి ఎంత పారితోషికం ఇస్తున్నారన్నది తెలియాల్సి ఉంది. కచ్చితంగా డేనియల్కి ఆఫర్ చేసినంత అయితే ఇవ్వరు. ఎందుకంటే.. టామ్కి ఇది తొలి బాండ్ సినిమా. జేమ్స్ బాండ్గా మార్కులు కొట్టేయడానికి టామ్ కసరత్తులు చేస్తున్నారట. -
కొత్త బాండ్గా టామ్ హిడెల్స్టన్
జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసిందే. ‘బాండ్.. జేమ్స్ బాండ్’ అంటూ తాము ధైర్యవంతులమని చెప్పుకోవడానికి పిల్లలు బాండ్ పేరుని వాడుకుంటారు. పెద్దలకు కూడా బాండ్ క్యారెక్టర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఇప్పటివరకూ బాండ్ సిరీస్లో వచ్చిన ఇరవై నాలుగు సినిమాలూ దాదాపు అందర్నీ ఆకట్టుకున్నాయి. 24వ చిత్రం ‘స్పెక్టర్’, అంతకుముందు వచ్చిన మూడు బాండ్ చిత్రాలు ‘కేసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సోలాస్’, ‘స్కైఫాల్’లో టైటిల్ క్యారెక్టర్ని నటుడు డేనియల్ క్రెగ్ అద్భుతంగా పోషించారు. కానీ, 25వ చిత్రంలో ఆయన నటించరు. ‘ఇక బాండ్ చిత్రాల్లో నటించడం నా వల్ల కాదు. ఆ సినిమాల్లో నటించే కన్నా టోటల్గా సినిమాలు మానేయడం బెటర్’ అని స్వయంగా ఆయనే పేర్కొన్న దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్శక-నిర్మాతలు కొన్ని నెలలుగా కొత్త బాండ్ని వెతికే పని మీద ఉన్నారు. బాండ్ సిరీస్లో వచ్చిన గత రెండు చిత్రాలు ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’లు శామ్ మెండెస్ దర్శకత్వంలోనే రూపొందాయి. 17వ చిత్రం నుంచి 24వ బాండ్ చిత్రం వరకూ బార్బరా బ్రోకోలియే నిర్మించారు. 25వ చిత్రానికి టామ్ హిడెల్స్టన్ సరిపోతారని ఆమె భావించారట. దర్శకుడికి కూడా అదే అనిపించి, చివరకు టామ్ హిడెల్స్టన్ని ఎంపిక చేశారని సమాచారం. 35 ఏళ్ల టామ్ ‘థోర్’, ‘ది ఎవెంజర్స్’, ‘మిడ్నైట్ ఇన్ ప్యారిస్’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు జేమ్స్ బాండ్గా ఎంతమంది హృదయాలు దోచేస్తారో వేచి చూడాలి. బాండ్గా సక్సెస్ అయితే, టామ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్ప వచ్చు. -
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడి కన్నుమూత
ఉత్తమ జేమ్స్ బాండ్ సినిమాలు తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు గాయ్ హమిల్టన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. 'బాండ్' హీరో సీన్ కానరీతో 'గోల్డ్ ఫింగర్', 'డైమండ్స్ ఆర్ ఫరెవర్' సినిమాలను రూపొందించిన ఆయన రోజర్ మూర్తో కలిసి 'లివ్ అండ్ లెట్ డై', 'ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్' వంటి జేమ్స్ బాండ్ సినిమాలను అందించాడు. హమిల్టన్ మృతిపై బాండ్ హీరో రోజర్ మూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వండర్ ఫుల్ డైరెక్టర్ అయిన హమిల్టన్ చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తున్నదని, అత్యద్భుతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారని ఆయన అన్నారు. బాండ్ సినిమాలతోపాటు పలు ప్రముఖ బ్రిటిష్ చిత్రాలకు హమిల్టన్ దర్శకత్వం వహించాడు. 'బ్యాటల్ ఆఫ్ బ్రిటన్', 'ఫునెరల్ ఇన్ బెర్లిన్', ఫోర్స్ 10'తోపాటు అగాథా క్రిస్టీ రచనల ఆధారంగా తీసిన 'ద మిర్రర్ క్రాక్డ్', 'ఈవిల్ అండర్ ద సన్' చిత్రాలను తెరకెక్కించాడు. -
ముచ్చటగా మూడో సినిమా
‘పోటుగాడు, జేమ్స్బాండ్’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉత్తరాది భామ సాక్షీ చౌదరి హిందీలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఆమె తమిళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ‘ప్లేయర్’ ఫేమ్ పర్వీన్రాజ్ హీరోగా లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్ సాయికృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు. ఇందులో తనది మంచి పాత్ర అని సాక్షీ చౌదరి పేర్కొన్నారు. ‘‘యూత్ఫుల్, లవ్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. సమాజానికి ఓ మంచి సందేశం ఇస్తున్నాం. ఈ నెల 18న చిత్రీకరణ ప్రారంభించనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. పోసాని, ఝాన్సీ, సప్తగిరి, తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమేరా: కంతేటి శంకరరావు, సంగీతం: కిషన్ కవాడియా. -
క్రెగ్ స్థానంలో... కొత్త జేమ్స్బాండ్!
హాలీవుడ్ చిత్రాల్లో లేటెస్ట్ జేమ్స్బాండ్ అయిన డేనియల్ క్రెగ్ ఇప్పుడు ఆ పాత్ర నుంచి పక్కకు తప్పుకుంటున్నారా? హాలీవుడ్లో ఇప్పుడు చర్చంతా దాని మీదే నడుస్తోంది. అమెరికాలోని తాజా టెలివిజన్ సిరీస్ ‘ప్యూరిటీ’లో నటించడానికి 47 ఏళ్ళ క్రెగ్ చర్చలు జరుపుతున్నారనీ, ఈ దెబ్బతో తదుపరి జేమ్స్బాండ్ సినిమాలో నటించడానికి ఆయనకు తీరిక ఉండదనీ వార్తలు వస్తున్నాయి. ఇరవయ్యేసి భాగాలు ఒక సిరీస్ చొప్పున ‘ప్యూరిటీ’ అనేక సిరీస్లుగా నడుస్తుందట! జొనాథన్ ఫ్రాన్జెన్ నవల ‘ప్యూరిటీ’ ఆధారంగా ఈ టీవీ సిరీస్ను రూపొందించ నున్నారు. ఒకవేళ అంతా కుదిరితే, బ్రిటిష్ యాక్టర్ డేనియల్ క్రెగ్ నటించే తొలి అమెరికన్ టీవీ సిరీస్ ఇదే అవుతుంది. తండ్రి కోసం వెతుకుతున్న ‘ప్యూరిటీ’ అనే ఆ అమ్మాయికి సాయపడే పాత్రలో క్రెగ్ కనిపిస్తారట! ఈ టీవీ సిరీస్ మాటెలా ఉన్నా, జేమ్స్బాండ్ పాత్రల్లో కొనసాగడం తనకిక పెద్దగా ఇష్టం లేదని క్రెగ్ కొన్నాళ్ళుగా చెబుతున్నారు. దశాబ్దకాలంగా ‘క్యాసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్’, ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’ చిత్రాల్లో జేమ్స్బాండ్ పాత్రతో క్రెగ్ అలరించారు. ఆయన తాజా బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ 60 కోట్ల పౌండ్లు (రూ. 6 వేల కోట్లు) వసూలు చేసింది. ‘స్పెక్టర్’ చిత్ర షూటింగ్ టైమ్లో ఒంటికి దెబ్బలు తగిలి, క్రెగ్ మోకాలి శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి నాలుగు జేమ్స్బాండ్ సినిమాల్లో నటించిన మీరు అయిదోసారి ఆ పాత్ర చేపడతారా అన్నప్పుడు, ‘కేవలం డబ్బుల కోసమే చేయాలి’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘నాకూ వేరే జీవితం ఉంది. దాని సంగతి చూసుకోవాలి కదా! ప్రస్తుతానికైతే మళ్ళీ జేమ్స్బాండ్గా చేయాలనుకోవడం లేదు’ అని కొన్ని నెలల క్రితం ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాటలు, ఇప్పుడీ టీవీ సిరీస్ సన్నాహాలు చూస్తుంటే, క్రెగ్ ఇక జేమ్స్బాండ్గా చేయనట్లే అని కొందరి వాదన. ఇప్పటికే దర్శకుడు శామ్ మెన్డెస్ కూడా బాండ్ సిరీస్ నుంచి బయటకు వచ్చేశారు. హీరో క్రెగ్ కూడా గుడ్బై చెబుతున్నారు. జేమ్స్బాండ్ సిరీస్లో మొన్నటి ‘స్పెక్టర్’ 24వ సినిమా గనక, రానున్న 25వ సినిమాలో ‘బాండ్... జేమ్స్బాండ్...007’గా ఎవరు కనిపిస్తారో? -
ఇండియన్ జేమ్స్ బాండ్
-
‘స్పెక్టర్’లో 35 తప్పులున్నాయ్!
సినిమాల్లో తప్పులు దొర్లడం సహ జమే. విజయం సాధిస్తే ఆ తప్పులన్నీ మూలపడిపోతాయి. అయితే అనుకున్నంత బాగాలేకపోతే మాత్రం ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకూ అందరూ అణువణువూ శోధించి అందులో తప్పులు కనిపెట్టేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న జేమ్స్ బాండ్ సినిమాలకు ఈ పరిస్థితి వేరుగా ఉంటుంది. అవి హిట్టయినా.. ఫ్లాపయినా పోస్ట్మార్టమ్ మాత్రం తప్పదు. గతంలో విడుదలైన ‘స్కెఫాల్’ చిత్రంలో 68 తప్పులున్నాయని తీర్పునిచ్చిన అభిమానులు, ఈ సారి ‘స్పెక్టర్’ను కూడా భూతద్దం పెట్టి మరీ వెతికేసి 35 తప్పులు ఉన్నాయని తేల్చేశారు. అందులో మచ్చుకు కొన్ని... హీరో, హీరోయిన్ ఉన్న కార్ను ఓ విమానం చేజ్ చేసే సీన్ ఉంటుంది. చాలా వేగంగా వచ్చి కార్ను ఢీ కొట్టగానే దాని ల్యాండింగ్ గేర్లో ఉన్న రెండు చక్రాల్లో ఒకటి ఊడిపోతుంది. కట్ చేస్తే...అది ల్యాండ్ అయ్యే టైమ్కు మాత్రం రెండు చక్రాలు సరిగ్గానే ఉన్నట్టు చూపించారు. బాండ్ పాత్రధారి డేనియల్ క్రెగ్, కథానాయిక లీ సెడూ ఓ ట్రైన్లోని డైనింగ్ కార్లో తింటుంటారు. ఆ సీన్లో వాళ్ల చుట్టూ చాలా మంది ప్రయాణికులు ఉంటారు. నెక్స్ట్ సీన్లో సడన్గా వాళ్ల మీద విలన్ పాత్రధారి డేవ్ బాటిస్టా దాడి చేస్తాడు. అప్పుడెవరూ కనబడరు. ఉన్నట్టుండి చుట్టూ ఉన్న ప్రయాణికులు, కిచెన్ స్టాఫ్ ఏమైపోయారో? ఇలా ఎన్ని తప్పులున్నా కూడా ‘బాండ్’ఇమేజ్ ఈ సినిమాను కాపాడేసింది. 2,200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం 3,300 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ నుంచి కొల్లగొట్టింది ఆ బ్రాండ్ ఇమేజ్తోనే. -
‘స్పెక్టర్’లో మిస్టేక్స్ ఎన్నో!
హాలివుడ్: దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసిన తాజా బ్లాక్బస్టర్ జేమ్స్ బాండ్ మూవీ ‘స్పెక్టర్’ పోరాట సన్ని వేశాల్లో దాదాపు 35 త ప్పులను జేమ్స్ బాండ్ అభిమానులు గుర్తించారు. వాటిని ఐఎండీబీలో పరస్పరం షేర్ చేసుకున్నారు. మంచు ప్రాంతంలో కారును విమానం ఛేజ్ చేసి డీకొట్నిప్పుడు విమానానికున్న ల్యాండింగ్ వీల్స్లో ఓ వీల్ ఊడిపోతుంది. ఆ తర్వాత సీన్లో విమానం ల్యాండ్ అయినప్పుడు అన్ని వీల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓ సీన్లో విమానం ముందటి గ్లాస్కు బుల్లెట్ తగిలి పగిలిపోయిన గుర్తు ఉంటుంది. ఆ తర్వాత సీన్లో ఆ గ్లాస్ ఎలాంటి పగుళ్లు లేకుండా శుభ్రంగా ఉంటుంది. హెలికాప్టర్ క్రాష్లో బాండ్ ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ రివర్ బ్యాంక్ వైపు దూసుకెళుతుంది. జేమ్స్ బాండ్ బ్రిడ్జ్ పైన పరుగెత్తుతుంటే బీట్ పోలీసులు చోద్యం చూస్తుంటారు. రైల్లోని డైనింగ్ హాల్లో పోరాట సన్నివేశంలో ప్రయాణికులు కనిపిస్తారు. హఠాత్తుగా ప్రయాణికులు, కిచెన్ సిబ్బంది మాయమవుతారు. రెప్పపాటులో బాండ్ గర్ల్ సెడాక్స్ దుస్తులు మారిపోతాయి. మరో సీన్లో మెడలీన్ స్వాన్ ఓ హోటల్లో నిండుగా దుస్తులు ధరించి కనిపిస్తుంది. అదే క్షణంలో గోడను బద్దలుకొట్టుకొని జేమ్స్ బాండ్ ప్రవేశించినప్పుడు మాత్రం ఆమె నైటీ ధరించి ఉంటుంది. లండన్లో నెంబర్ 15 బస్సులో జేమ్స్ బాండ్ ప్రయాణిస్తుంటే మార్గమధ్యంలో ఆయన షూ మారిపోతుంది. ఇలా ఒక్కొక్క అభిమాని ఒక్కో తప్పుచొప్పున మొత్తం సినిమాలో 35 తప్పులను డేగ కళ్లతో వెతికి పట్టుకున్నారు. అయినా గత ‘స్కైఫాల్’ చిత్రంలోకన్నా బెటర్ అని, ఆ చిత్రంలో ఏకంగా 68 మిస్టేక్స్ దొరికాయని వారంటున్నారు. ఎన్ని తప్పులుంటేమి, ఇప్పటి వరకు స్పెక్టర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3,200 కోట్ల రూపాయలను వసూలు చేసిందని నిర్మాతలు మురిసి పోతున్నారు. వందేళ్లకు ముందే హాలివుడ్ సినిమా, మేకింగ్లో పర్ఫెక్షన్ సాధించిందన్న ప్రముఖ భారతీయ దర్శకుడు సత్యజిత్ రే ఈ చిత్రాన్ని చూస్తే ఏమనేవారో! అయినా ప్రపంచంలోని 50 పాపులర్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించకున్న అమితాబ్ నటించిన ‘షోలే’ చిత్రంలో కూడా ఇలాంటి తప్పులెన్నిన వాళ్లు లేకపోలేదు. అందులోని ఓ పోరాట సన్నివేశంలో ఓ చెక్క వంతెనను విలన్లు పేల్చి వేస్తారు. ఆ తర్వాత సీన్లో చెక్కుచెదరకుండా ఉన్న ఆ చెక్క వంతెన మీది నుంచి ధర్మేంద్ర, హేమమాలిని వెళతారు. సినిమా క్లైమాక్స్లో గబ్బర్ సింగ్తో రెండు చేతులు భుజాలవరకు లేని ఠాకూర్ (సంజీవ్ కుమార్) ఫైట్ చేస్తున్నప్పుడు చొక్కా నుంచి ఓ అరచేతి కూడా కనిపిస్తుంది. అసలు కరెంటనేదే లేని ఠాకూర్ విలేజ్లో ఎత్తుగా కట్టిన వాటర్ ట్యాంక్ నుంచి నీళ్ల సరఫరాకు ఎలాంటి టెక్నాలజీని వాడోరో ఎప్పటికీ సస్పెన్సే! -
ఎప్పటిలానే... 'స్పెక్టర్' బాండ్
చిత్రం - ‘స్పెక్టర్’ తారాగణం - డేనియల్ క్రెగ్, క్రిస్టఫ్ వాల్ట్జ్, లీ సేడాక్స్, మోనికా బెలూచీ కెమేరా - హొయ్టే వాన్ హోయ్టెమా దర్శకత్వం- శామ్ మెన్డెస్ నిడివి- 147 నిమిషాలు ‘బాండ్... జేమ్స్బాండ్...’ ప్రపంచం మొత్తాన్నీ ఊపేసిన డైలాగ్ ఇది. తెరపై ఆ డైలాగ్.., ‘ట..డ..ట్టడా...య్...’ అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినని వాళ్ళూ, విని ఇష్టపడనివాళ్ళూ అరుదు. జేమ్స్బాండ్ జానర్ సినిమాలకున్న ఎడ్వాంటేజ్ అది. అశేష అభిమానులు, నిర్ణీతంగా సినిమాకొచ్చే ప్రేక్షకులూ ఎప్పుడూ రెడీ! తాజా జేమ్స్బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ మీద అమితమైన ఆసక్తికి అదే కారణం. హాలీవుడ్ జేమ్స్బాండ్ చిత్రాల సిరీస్లో ఇది 24వ సినిమా. ఒకప్పుడు సీన్ క్యానరీ, రోజర్ మూర్, పీర్స్ బ్రోస్నన్ లాంటి నటులు జేమ్స్బాండ్గా అలరిస్తే, ‘క్యాసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’, ‘స్కై ఫాల్’ లాంటి సినిమాల నుంచి డేనియల్ క్రెగ్ ఆ పాత్రను చేపట్టారు. ‘ఇదే నా ఆఖరి బాండ్ సినిమా’ అని డేనియల్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్న ఈ సినిమా కథ కూడా సగటు జేమ్స్బాండ్ సినిమాల్లో కథలానే ఉంటుంది. కాకపోతే, హీరోపై విలన్కు కాస్తంత పాత వ్యక్తిగత ద్వేషం కూడా ఉన్నట్లు కలిపారు. ‘స్పెక్టర్’ అనేది ఒక రహస్య సంస్థ పేరు. దాన్ని నడిపే ఒక విలన్. పేరు ఫ్రాంజ్ ఒబెర్హాసర్ (క్రిస్టఫ్ వాల్ట్జ్). అతను అలా సరికొత్త ఇంటెలిజెన్స్ సర్వీస్ నడుపుతూ దేశాల రహస్యాలను కనిపెట్టి, అందరినీ ఆట ఆడిస్తుంటాడు. ఆ టైమ్లో జేమ్స్బాండ్ 007 (డేనియల్ క్రెగ్) రంగప్రవేశం. ‘స్పెక్టర్’ కథా కమామిషు తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ క్రమంలో కథ లండన్, మొరాకో, ఆస్ట్రియా - ఇలా పది దేశాల మీదుగా తిరుగుతుంది. ఒకప్పుడు ‘స్పెక్టర్’లో పనిచేసిన ఒక ముసలి వ్యక్తిని హీరో కలుసుకుం టాడు. డాక్టరైన అతని కూతుర్ని (లీ సేడౌక్స్) కాపాడతానంటూ వాగ్దానం చేస్తాడు. వెంటాడుతున్న విలన్ అనుచరుల నుంచి తప్పించుకుంటూ, వాళ్ళ బారి నుంచి ఆ అమ్మాయిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో కారు ఛేజ్లు, వైమానిక విన్యాసాలు, కాల్పులు, పేలుళ్ళ లాంటి అంశాలన్నీ మామూలే. చివరకు ‘స్పెక్టర్’ను నడిపే ప్రధాన విలన్ ఆటకట్టించాడన్నది మన తెలుగు సినిమాల లెక్కన రెండున్నర గంటలు తెరపై చూడాల్సిన కథ. ‘క్యాసినో రాయల్’ మొదలు మొన్నటి ‘స్కై ఫాల్’, ఇవాళ్టి ‘స్పెక్టర్’ దాకా జేమ్స్బాండ్ అంటే... డేనియల్ క్రెగ్గే. అతని బాడీ లాంగ్వేజ్, చేసిన యాక్షన్ ఘట్టాలు బాండ్ పాత్రకు కొత్త రూపం తెచ్చాయి. ప్రపంచాన్ని ఒంటిచేత్తో కాపాడే బ్రిటీష్ గూఢచారి పాత్రలో ఎప్పటికప్పుడు జీవించడానికి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. విశేషమేమంటే, ఈ సినిమాలో విలన్ అంతే దీటుగా ఉండడం. ఆస్కార్ లాంటి అత్యున్నత పురస్కారాలెన్నో అందుకున్న క్రిస్టఫ్ వాల్ట్జ్ విలన్ పాత్రనూ, క్రూరత్వాన్నీ నేర్పుగా చూపించారు. ఈ సినిమా కోసం భారీయెత్తున పెట్టిన ఖర్చు, చాలా శ్రమతో చేసిన యాక్షన్ సీన్లు, వేసిన సెట్లు, తిరిగిన దేశదేశాలు తెరపై కనిపిస్తుంటాయి. విజువల్స్ వండర్ఫుల్ అనిపిస్తాయి. ముఖ్యంగా, రీ-రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రత్యేకించి చెప్పుకోవాలి. కానీ, కథ మాత్రం పాత సినిమాల్లోని ఘట్టాలకు కొత్త తిరగమోత. అలాగే, పాత్రల మధ్య ఎమోషన్లూ సహజమనిపించవు. యాక్షన్ సీన్లను మినహాయిస్తే, మిగిలిన సందర్భాల్లో కథ సుదీర్ఘంగా సాగు తుంది. అందుకే, ‘స్కైఫాల్’ దర్శకుడు, రచయితల బృందమే ఈ సినిమాకూ పనిచేస్తోందంటే కలిగిన ఉత్సాహం ఈ సినిమా చూస్తుండగా నిలవదు. అయితే, జేమ్స్బాండ్ తరహా సినిమాలను ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా మంచి కాలక్షేపమే. వరుసగా జేమ్స్బాండ్ సినిమాలన్నీ చూస్తూ వస్తున్న వాళ్ళకు వీటిలో కొత్త సంగతులు ఉండకపోవచ్చు. సరికొత్త విశేషాలు కనపడకపోవచ్చు. చాలా భాగం సంఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నవే కావచ్చు. కానీ, వాటన్నిటినీ ఎప్పటికప్పుడు కొత్త తరహా దృశ్యాలుగా... ఉద్విగ్నభరితమైన సన్నివేశాలుగా... కుర్చీ అంచున కూర్చొని చూడాల్సిన విన్యాసాలుగా... తీర్చిదిద్దడంలోనే నేర్పు ఉంది. సక్సెస్ఫుల్ జేమ్స్బాండ్ సినిమాలు తీసేవాళ్ళకు అది తెలియాలి. చూసేవాళ్ళు అది తెలిసీ చూడాలి. హాలీవుడ్ మేకింగ్ వ్యాల్యూస్తో ‘స్పెక్టర్’ అలానే అనిపిస్తుంది. మునుపటి చిత్రాలతో పోలిస్తే నిరాశపరిచినా, లాజిక్ వెతకని సామాన్య బాండ్ ప్రేమి కుల్ని అలరిస్తుంది. పైగా, నాలుగు భాషల్లో (ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం) వెయ్యికి పైగా హాళ్ళలో రిలీజవడం ‘స్పెక్టర్’కు కలిసొచ్చే అంశం. నిజానికి, ‘స్పెక్టర్’ చిత్రం బ్రిటన్లో ఈ అక్టోబర్ 26న, అమెరికాలో, ఇతర ప్రాంతాల్లో ఈ నెల 6న రిలీజైపోయింది. మన దేశంలో మాత్రం ఆలస్యంగా వచ్చింది. ‘ప్రేమ్త్రన్ ధన్ పాయో’ లాంటి భారీ చిత్రాలు ఉండడంతో పంపిణీదారులైన సోనీ పిక్చర్స్ ఇండియా వారు ఈ చిత్రాన్ని ఇక్కడ ఆలస్యంగా రిలీజ్ చేశారని ఒక కథనం. -
ఘాటైన ముద్దు సన్నివేశాలకు కోత!
భారత్కు వచ్చేసరికి జేమ్స్బాండ్ కాస్త బుద్ధిమంతుడిగా కనిపించనున్నాడు. తన బ్రాండ్ అయిన ముద్దు సన్నివేశాల ఘాటును తగ్గించుకొని భారత్లో విడుదల అవుతున్నాడు. జేమ్స్బాండ్ తాజా చిత్రం 'స్పెక్టర్' శుక్రవారం భారత ప్రేక్షకులను పలుకరించనుంది. దేశంలో విడుదలకు అనుగుణంగా 'స్పెక్టర్'కు కేంద్ర సెన్సార్ బోర్డు కొన్ని కత్తెరలు వేసింది. ముఖ్యంగా రెండు ముద్దు సన్నివేశాల నిడివిని గణనీయంగా తగ్గించింది. అదేవిధంగా రెండుచోట్ల డైలాగ్లను మ్యూట్ చేసి.. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. సహజంగానే బాండ్ సినిమాలు అంటే ఘాటైన ముద్దు సన్నివేశాలు, బాండ్ గర్ల్స్తో సాగించే ప్రణయ సల్లాపాలు ఉంటాయి. అయితే, తాజా సినిమాలో హీరోయిన్లతో బాండ్ స్టార్ డానియెల్ క్రెయిగ్ సాగించే ముద్దు సన్నివేశాల నిడివిని దాదాపు 50శాతం వరకు తగ్గించి భారత్లో విడుదల చేస్తున్నట్టు తెలుస్తున్నది. తెరపై బాండ్ ముద్దులు పెట్టుకోవడంలో సెన్సార్ బోర్డుకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే, ఆ సన్నివేశాలు మరీ పొడవుగా ఉన్నాయని మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసిందని సెన్సార్ వర్గాలు తెలిపాయి. బాండ్ సినిమాకు కత్తెరల విషయంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహాలనీ తెలిపారు. మొత్తానికి బాండ్ సినిమాకు కత్తెరలు వేసి భారత్లో విడుదల చేయడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు కత్తెరలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాండ్ తాజా సినిమా 'స్పెక్టర్' భారీ కలెక్షన్లతో అదరగొట్టింది. -
మన జేమ్స్బాండ్ ఇలా ఉంటాడు!
జేమ్స్ బాండ్ తాజా చిత్రం 'స్పెక్టర్'కు కేంద్ర సెన్సార్ బోర్డు భారీగా కోతలు పెట్టింది. ఘాటైన ముద్దు సన్నివేశాల నిడివిని సగానికి తెగ్గోసి.. భారత్లో విడుదల చేసేందుకు అనుమతించింది. ఈ పరిణామం భారత్లోని బాండ్ సినిమా అభిమానులకు ఒకింత నిరాశ కలిగించేదే.. అందుకే భారత్కు తగ్గట్టు బాండ్ను సంస్కరిస్తే ఎలా ఉంటుందనే అంశంపై నెటిజన్లు ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాండ్కు మూడు నామాలు పెట్టి.. ఫొటోలు షేర్ చేశారు. బాండ్ గర్ల్ భారతీయ నటి అయితే ఎలాంటి దుస్తులు వేసుకుంటోందో.. చిత్రవిచిత్రమైన ఫొటోలతో సరదా వ్యాఖ్యాలు జోడించారు. సంస్కారి జేమ్స్బాండ్ (#SanskariJamesBond ) పేరిట ఈ యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. బాండ్ దేశీ ఆయుధం ఇదవుతుంది! Weapon of #SanskariJamesBond pic.twitter.com/xzNzdJkimv — Patakha Chikna (@Madan_Chikna) November 18, 2015 మేరే పాస్ మా హై డైలాగ్ ఉంటుంది Pic 1 : M as Head of MI6 in James Bond Series. Pic 2: M as Head of MotherIndia6(MI6) in #SanskariJamesBond pic.twitter.com/8EXyYAbriY — N33R4J (@_N33R4J_) November 18, 2015 బాండ్ గర్ల్ కొత్త అవతారం ఇలా ఉంటుంది Left: James Bond Girl Right: #SanskariJamesBond Girl pic.twitter.com/JhOZJ8jXaT — Anand Ranganathan (@ARangarajan1972) November 18, 2015 -
లండన్లో 'స్పెక్టర్' వరల్డ్ ప్రీమియర్
-
లండన్లో 'స్పెక్టర్' వరల్డ్ ప్రీమియర్
అంతర్జాతీయ సినీ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న బాండ్ మూవీ స్పెక్టర్ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. ఎన్నో నెలలుగా బిజీ షెడ్యూల్ షూట్స్ తో, గాయాలతో, ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపిన చిత్రయూనిట్ ఫైనల్ గా తన కష్టాన్ని వెండితెర మీద చూపించే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన వరల్డ్ ప్రీమియర్ కు హాలీవుడ్ తారలు తరలి వచ్చారు. లండన్ లోని రాయల్ అల్బర్ట్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ ప్రీమియర్ లో బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్ క్రెగ్ తో పాటు హీరోయిన్లుగా నటిస్తున్న లీ సెడాక్స్, మోనికా బెలుస్సీలు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రిన్స్ హారీ ఈ ప్రీమియర్ షోకు ప్రధాన ఆకర్షణ గా నిలిచారు. ప్రీమియర్ షోకు హాజరైన సెలబ్రిటీ అభిమానులతో పాటు సహనటులతో సెల్ఫీలు దిగుతూ సందడిగా కనిపించారు. డానియల్ క్రెగ్ నాలుగో సారి బాండ్ గా నటిస్తున్న స్పెక్టర్ నవంబర్ 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. బాండ్ సీరీస్ లో 24వ సినిమాగా రిలీజ్ అవుతున్న స్పెక్టర్ ఈ సీరీస్ లో ఆఖరి చిత్రం అన్న ప్రచారం కూడా జరగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా స్పెటర్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సీరీస్ లో రిలీజ్ అయిన గత రెండు చిత్రాలు ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోవటంతో యూనిట్ సభ్యులకు స్పెక్టర్ సక్సెస్ కీలకం కానుంది. -
240 కోట్ల ఫైట్
జేమ్స్ బాండ్ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. మామూలుగా ఛేజింగుల కోసం కార్లను ధ్వంసం చేయాల్సి వస్తే గ్రాఫిక్స్ లేదా డూప్ కార్లు వాడతారు. కానీ, డేనియల్ క్రెగ్ నటిస్తున్న లేటెస్ట్ జేమ్స్ బాండ్ ఫిల్మ్ ‘స్పెక్టర్’ కోసం ఏకంగా ఏడు కార్లను ధ్వంసం చేశారు. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా! యాక్షన్ సన్నివేశాల కోసం చిత్ర బృందం ఏకంగా ఏడు ఆస్టన్ మార్టిన్ కార్లు వాడింది. ఆస్టన్ మార్టిన్ అంటే కేవలం సంపన్నులకే పరిమితై మెన ఖరీదైన కారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘డిబి 10’ స్పోర్ట్స్ కార్లుగా వీటిని తయారు చేశారు. ఈ కారు ధర మన కరెన్సీలో 4 కోట్ల పైచిలుకే. సినిమా బడ్జెట్ రూ. 2 వేల కోట్లయితే, ఈ కార్ల ఫైట్కైన ఖర్చు అక్షరాలా 240 కోట్లు. మొత్తానికి, గడచిన 53 ఏళ్ల బాండ్ ఫిల్మ్స్ చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా ‘స్పెక్టర్ ’ నిలిచిపోనుంది. -
ఈ జేమ్స్బాండ్ పెద్ద తాగుబోతట..!
ఇటీవలే బాండ్గా అవతారం ఎత్తిన డానియల్ క్రెగ్ మరో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు బాండ్ క్యారెక్టర్లలో నటించిన అందరి కంటే డానియల్ క్రెగ్ తాగుబోతు బాండ్గా రికార్డ్ సృష్టించాడు. తన ప్రతి సినిమాలో 20 యూనిట్ల ఆల్కాహాల్ తీసుకుంటున్న క్రెగ్ ఈ రికార్డ్ సాధించాడు. ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన పాత్రకు తగ్గట్టుగా బాండ్ క్యారెక్టర్లో కనిపించిన నటులు ఆల్కహాల్ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. గతంలో బాండ్ క్యారెక్టర్లలో కనిపించిన పియర్స్ బ్రోసన్ 12 యూనిట్లు, సీన్ కానరీ, రొగర్ మూర్లు 11 యూనిట్ల ఆల్కాహాల్ను సిప్ చేయగా ఒకే ఒక్క సినిమాలో బాండ్ గా కనిపించిన జార్జ్ తొమ్మిది యూనిట్ల ఆల్కాహాల్ మాత్రమే తీసుకున్నాడు. 2006లో కాసినోరాయల్ సినిమాతో తొలిసారిగా బాండ్ క్యారెక్టర్లో కనిపించిన డానియల్ క్రెగ్ తరువాత క్వాంటమ్ ఆఫ్ సోలేస్, స్కైఫాల్ సినిమాలలో కూడా 20యూనిట్లకు పైగా ఆల్కహాల్ తీసుకున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న స్పెక్టర్ సినిమాలో కూడా ఇదే తరహాలో దర్శనమిస్తున్నాడు డానియల్ క్రెగ్. -
నా చివరి కోరిక ఇదే!
హాలీవుడ్ సినిమాలను అమితంగా ఇష్టపడే షారుక్ఖాన్కు ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘జేమ్స్ బాండ్’ సిరీస్లంటే చాలా ఇష్టం. ఈ సిరీస్ సినిమాలను ఆయన లెక్కలేనన్ని సార్లు వీక్షించారట! ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ హీరో ఈథెన్ హంట్, జేమ్స్ బాండ్లు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే చూడాలనేది షారుక్ చిరకాల వాంఛ. ఈ విషయమై షారుక్ మాట్లాడుతూ ‘‘నా సీక్రెట్ ఫాంటసీ ఏంటంటే... ఈ రెండు పాత్రలను ఒకే సినిమాలో చూడాలని ఉంది. అలాంటి సినిమా వస్తే నా ఆనందానికి హద్దే ఉండదు. నా చివరి కోరిక కూడా ఇదే. ఎప్పటికైనా నెరవేరుతుందని అనుకుంటున్నాను’’ అని చెప్పారు. మరి ఆయన కోరిక తీరుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. -
రాజమండ్రిలో ’జేమ్స్బాండ్’ సందడి
కడుపుబ్బ నవ్విస్తుంది : హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షిచౌదరి కంబాలచెరువు (రాజమండ్రి) :‘జేమ్స్బాండ్’ నేను కాదు నా పెళ్లాం.. చిత్రం అందరినీ కడుపుబ్బ నవ్వించి, ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుటుందని చిత్ర హీరో అల్లరి నరేష్ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో ఈ చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా స్థానిక షెల్టాన్ హోటల్లో జరిగినవిలేకరుల సమావేశంలో హీరో నరేష్ మాట్లాడుతూ ‘సుడిగాడు’ చిత్రం తర్వాత అంతపెద్ద హిట్ ఇచ్చిన సినిమా జేమ్స్బాండ్ అన్నారు. దీని తర్వాత తాను మోహన్బాబుతో కలిసి మామా మంచిఅల్లుడుతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్లో తాను అహానా పెళ్లంట, యాక్షన్ త్రీడీ చిత్రాలు చేశానన్నారు. అనంతరం హీరోయిన్ సాక్షిచౌదరి మాట్లాడుతూ తాను నటించిన తొలిసినిమా పోటుగాడు అయినా, జేమ్స్బాండ్తో మంచి పేరు వచ్చిందన్నారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. పాటలు బాగా వచ్చాయని, పేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తున్నారన్నారు. 415 థియేటర్లలో విడుదల దర్శకుడు సాయికిశోర్ మచ్చా మాట్లాడుతూ సినిమా జైత్రయాత్రను శ్రీకాకుళంలో ప్రారంభించామని, మరిన్ని రోజులు రాష్ర్టంలో కొనసాగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 415 థియేటర్లలో చిత్రం విడుదల చేశామని చెప్పారు. సినిమా నిర్మాణానికి 68 రోజులు పనిచేశామన్నారు. టీవీ రైట్స్ రూ.3.50 కోట్లకు అమ్ముడైందన్నారు. సంగీత దర్శకుడు సాయికార్తీక్ మాట్లాడుతూ ఇందులో పాటలన్నీ హిట్ అయ్యాయని, వీటిలో వజ్రాయుధం సినిమాలోని సన్నజాజి.. రీమిక్స్ పాట పేక్షకులను అలరిస్తుందన్నారు. లౌక్యం తర్వాత ఇదే.. నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ లౌక్యం సినిమా తర్వాత జేమ్స్బాండ్ చిత్రం తనకు మరింత పేరు తెచ్చిందన్నారు. తొలుత మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం చిత్రపటానికి యూనిట్ పూలమాలలు వేసి, నివాళులర్పించింది. అనంతరం జేమ్స్బాండ్ చిత్రం ప్రదర్శిస్తున్న కుమారి థియేటర్కు యూనిట్ వెళ్లి సందడి చేసింది. సినిమాలో కొన్ని డైలాగులు చెప్పి అల్లరి నరేష్ ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో యూనిట్లో సినీనటి హేమ ఉన్నారు. -
చిక్కోల్లో జేమ్స్బాండ్ సందడి
పీఎన్ కాలనీ / శ్రీకాకుళం సిటీ: చిక్కోల్లో జేమ్స్బాండ్ చిత్ర యూనిట్ సోమవారం సందడి చేసింది. పట్టణంలోని మారుతీ థియేటర్ను ఉదయం సంద ర్శించి సినీ డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. హీరో,హీరోయిన్తో కరచాలనం కోసం యువతీయువకులు ఎగబడ్డారు. సెల్ఫోన్లతో ఫొటోలు తీసేం దుకు పోటీపడ్డారు. ప్రత్యక్షదైవం శ్రీ సూర్యనారాయణ స్వామి తమ ఇష్టదైవమని, అందుకే సినిమా విజయోత్సవ యాత్రకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టినట్టు హీరో అల్లరి నరేష్ పేర్కొన్నారు. గతంలో సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంలో నటించినట్టు గుర్తు చేశారు. సినిమా విజయవంతం చే సిన ప్రేక్షక దేవుళ్లకు హీరోయిన్ సాక్షి చౌదరి, డెరైక్టర్ సాయికిషోర్ మచ్చ, నిర్మాత అనీల్ సుంకర్, మ్యూజిక్ ైడె రెక్టర్ సాయికార్తీక్, క మెడియన్ ప్రవీణలు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిత్యుడిని దర్శించుకున్న చిత్రయూనిట్ అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని జేమ్స్బాండ్ చిత్రయూనిట్ బృందం సభ్యులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను వివరించారు. అనివె ట్టి మండపంలో ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని నటీనటులకు అందించారు. అరసవల్లి దేవాలయం వద్ద జేమ్స్బాండ్ చిత్రయూనిట్ను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. జంధ్యాలలోటు ఎవరూ పూడ్చలేనిది దివంగత సినీ రచయిత, దర్శకుడు జంథ్యాల లేని లేటు పరిశ్రమలో ఎవరూ పూడ్చలేనిదని నటుడు అల్లరి నరేష్ పేర్కొన్నారు. అరసవల్లిలో విలే కరులతో ఆయన కాసేపు మాట్లాడారు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ అంటే ఒక బ్రాండ్ ఉందన్నారు. అది ఎప్పుడూ ఒకేలా ఉంటుందన్నారు. ఆంధ్రాలోనూ, తెలంగాణాలోనూ జేమ్స్బాండ్ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్నట్లు చెప్పారు. సినిమా టైటిల్ నుంచి ముగింపు వరకు తన చిత్రంలో కామెడీకే తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఈ ఏడాది తాను మూడు చిత్రాల్లో నటిస్తున్నానని, వాటిలో హీరోలు మోహన్బాబు, విక్టరీ వెంకటేష్తో సరసన చేయడం ఆనందాన్నిస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా మంచి కథ దొరికితే సినిమా చేస్తామన్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డైరక్టర్ దగ్గర నుంచి టెక్నీషియన్ వరకు అనుకున్న రంగంలో రాణించాలన్నా, విజయం సాధించాలన్నా ఓపిక కలిగి ఉండాలని సూచించారు. -
జేమ్స్ బాండ్ సందడి
హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షి చౌదరి రాక విజయనగరం టౌన్: జేమ్స్బాండ్ చిత్ర యూనిట్ విజయనగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జేమ్స్బాండ్ చిత్రం విజయోత్సవాల్లో భాగంగా సోమవారం చిత్ర యూనిట్ లీలామహల్ థియేటర్ని సందర్శించి ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించింది. అంతకు ముందు ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ తీసిన చిత్రాల్లో తప్పులు గుర్తించి కొత్త చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. జేమ్స్ బాండ్ చిత్రం ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మరో మూడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయన్నారు. హీరోయిన్ సాక్షి చౌదరి మాట్లాడుతూ తెలుగులో తనకు ఇది రెండో చిత్రమని తెలిపారు. తమిళం, హిందీలోనూ సినిమాలు చేస్తున్నానని తెలిపారు. దర్శకుడు సాయికిశోర్, హాస్యనటుడు ప్రవీణ్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, రైటర్ శ్రీధర్, థియేటర్ మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
స్పెషల్ ఎడిషన్ : జేమ్స్బాండ్
-
‘జేమ్స్ బాండ్' ఆడియో విడుదల
-
కామెడీ జేమ్స్బాండ్
ఆ ఇద్దరూ భిన్న ధ్రువాల్లాంటివాళ్లు. అతగాడేమో మన్మథుడు తరహా. ఆవిడగారు మాఫియా డాన్ టైప్. ఇలా వ్యతిరేక మనస్తత్వాలున్న ఓ జంట కాపురం ఎలా సాగింది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘జేమ్స్ బాండ్’. ‘అల్లరి’ నరేశ్, సాక్షీ చౌదరి జంటగా సాయికిశోర్ మచ్చ దర్శకత్వంలో రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ నెల 12న పాటలనూ, మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామనీ అనిల్ సుంకర తెలిపారు. మన్మథుడిలాంటి భర్త, పవర్ఫుల్ మాఫియా డాన్ వంటి భార్య ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తారనీ, యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ ఇదనీ దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిశోర్ గరికపాటి. -
బాండ్ కొత్త చిత్రంలో జేఎల్ఆర్ కార్ల హల్చల్
-
బాండ్ కొత్త చిత్రంలో జేఎల్ఆర్ కార్ల హల్చల్
లండన్: ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ ప్రియులను అలరించనున్న కొత్త చిత్రం ‘స్పెక్టర్’లో జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) కార్లు హల్చల్ చేయనున్నాయి. ఈ సినిమాలో మూడు జేఎల్ఆర్ మోడల్స్ కనువిందు చేస్తాయని భారతీయ వాహన దిగ్గజం, జేఎల్ఆర్ యాజమాన్య సంస్థ అయిన టాటా మోటార్స్ మంగళవారం ప్రకటించింది. బాండ్ 007(డేనియల్ క్రెయిగ్)తో చేజింగ్ సీన్లో చిత్రంలోని విలన్ జాగ్వార్ సీ-ఎక్స్75 ప్రోటోటైప్ను నడుపుతాడని టాటా మోటార్స్ వెల్లడించింది. బాండ్ సిరీస్లో వస్తున్న ఈ 24వ చిత్రంలోని తమ కార్లలో జేఎల్ఆర్ ప్రత్యేక ఫీచర్లయిన బెస్పోక్ సస్పెన్షన్, మరింత అధునాతన బాడీ ప్రొటెక్షన్ వంటివి ఉంటాయని పేర్కొంది.కాగా, భారీ మార్పుచేర్పులతో రూపొందించిన లాండ్రోవర్ డిఫెండర్స్, రేంజ్రోవర్ స్పోర్ట్స్ ఎస్వీఆర్లతో ఆస్ట్రియాలో ఇప్పటికే కొన్ని సీన్లను చిత్రీకరించినట్లు జేఎల్ఆర్ స్పెషల్ ఆపరేషన్స్ ఎండీ జాన్ ఎడ్వర్డ్స్ చెప్పారు. 2012లో వచ్చిన బాండ్ చిత్రం ‘స్కైఫాల్’లో కూడా జేఎల్ఆర్ ‘డిఫెండర్ 110’ డబుల్ క్యాబ్ పికప్ ప్రేక్షకులను అలరించింది. కాగా, శామ్ మెండెస్ దర్శకత్వంలో వస్తున్న ‘స్పెక్టర్’.. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. -
బాండ్ సినిమా స్క్రిప్టునే.. దోచేశారు!!
-
జేమ్స్ బాండ్ కథ చోరీ!
జేమ్స్ బాండ్... నేర పరిశోధనలో వీర పనితనం చూపించే ఈ కారెక్టర్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడతారు. బాండ్ బరిలోకి దిగాడంటే విలన్లు బాప్రే అని పారిపోవాల్సిందే. బాండ్ చేసే వీరోచిత విన్యాసాలు ప్రేక్షకులను థ్రిల్కు గురి చేస్తాయి. అందుకే ఇప్పటివరకు 23 జేమ్స్ బాండ్ చిత్రాలొచ్చినా విసుగు లేకుండా చూశారు. ఇప్పుడు 24వ బాండ్ రానున్నాడు. ఈ చిత్రం ఇటీవలే లండన్లో ఆరంభమైంది. ‘స్పెక్ట్రె’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. అయితే... కథ తస్కరణకు గురి కావడం చిత్రబృందాన్ని షాక్కు గురి చేసింది. ఈ చిత్రానికి ఓ నిర్మాణ సంస్థ అయిన సోనీ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఉన్న ‘స్పెక్ట్రె’ కథను హాకర్స్ దొంగిలించారు. కానీ, చిత్రబృందానికి ఊరటనిచ్చే విషయం ఏంటంటే... ఈ కథకు కాపీ రైట్ రక్షణ ఉందట. ఒకవేళ ఎవరైనా ఈ కథను కాపీ కొట్టడానికి ప్రయత్నించినా, ఇందులోని సన్నివేశాలను పోలిన సన్నివేశాలు తీసినా చట్టరీత్యా నేరమవుతుందని సోనీ సంస్థ ప్రతినిథి పేర్కొన్నారు. కథను తస్కరించినంత మాత్రాన షూటింగ్ ఆగిపోతుందని దొంగలు ఆనందపడతారేమోననీ, షూటింగ్ ఆపే ప్రసక్తే లేదని కూడా తెలిపారు. జేమ్స్ బాండ్గా డానియల్ క్రెగ్ నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ మెండెస్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది నవంబర్లో ఈ కొత్త బాండ్ తెరపైకి రానున్నాడు. -
మళ్లీ బాండ్గా..!
జేమ్స్ బాండ్... ఈ కారెక్టర్ అంటే పిల్లలకూ, పెద్దలకూ చాలా ఇష్టం. ఇప్పటి వరకు హాలీవుడ్లో 23 బాండ్ చిత్రాలొచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం ఆకట్టుకున్నవే. ఇప్పుడు 24వ బాండ్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో జేమ్స్ బాండ్గా డేనియెల్ క్రెగ్ నటించనున్నారు. జేమ్స్ బాండ్ ప్రధాన పాత్రగా రూపొందిన ‘క్యాసినో రాయల్’లో మొదటిసారి బాండ్గా తెరపై కనిపించారు డేనియెల్. ఆ తర్వాత ‘క్వాంటమ్ ఆఫ్ సోలాస్’, ‘స్కైఫాల్’ చిత్రాల్లోనూ ఆ పాత్రను సమర్థంగా పోషించారు. ఇప్పుడు మరోసారి బాండ్గా నటించే అవకాశం ఆయనకే దక్కింది. సామ్ మెండ్స్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన భారీ పోరాట దృశ్యాలను రోమ్లో తీయాలనుకుంటున్నారట. కారు ఛేజ్లు, ఫ్లయిట్ క్రాష్లూ, పారాచ్యూట్తో ఎగరడాలు... ఇలా ప్రతి పోరాట దృశ్యంలోనూ బాండ్ చేసే విన్యాసాలు అలరించేట్లుగా, గత బాండ్ చిత్రాలను తలపించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. -
బాండ్ భామగా.. సానియా మీర్జా..!
-
వేలానికి జేమ్స్బాండ్ డిబి5 కారు
జేమ్స్ బాండ్007. ఈ సినిమాలు తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన పేరు. ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతటి పేరు సినిమాలోని మరో ఏ హీరో పాత్రకు రాలేదు. ఇప్పటి వరకు జేమ్స్బాండ్ వాడిన కార్లు 23 మోడల్స్ ఉన్నాయి. ఈ చిత్రాలలో హీరో జేమ్స్ బాండ్ వాడే కార్లకు ప్రత్యేకత ఉంటుంది. 1964లో గోల్డ్ ఫింగర్ సినిమాలో సీన్ కానరీ వాడిన ఆస్టిన్ మార్టిన్కు చెందిన డిబి5 కారుకు హీరోతో పాటు మంచి పేరు వచ్చింది. జేమ్స్ బాండ్ సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చిన కారు ఇదే. ఈ చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆ ప్రొడక్షన్ సంస్ధ ఈ కారును వేలం వేస్తోంది 24 క్యారెట్ల గోల్డ్ కోటింగ్ ఉన్న ఈ కారు అప్పట్లోనే టెక్నాలజీలో బుల్లేట్ ఫ్రూప్ షీల్డ్, హెవీ మిషన్ గన్స్ , ర్యామ్స్ లైట్స్తోపాటు వెనుక బంపర్... అన్ని మోడిఫై చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. స్టీరింగ్, గేర్బాక్స్ దగ్గర నుంచి మిర్రర్స్ వరకు అన్ని ప్రత్యేకతలు ఈ కారులో ఉన్నాయి. దీని ద్వారా వచ్చే ఫండ్ను పసిపిల్లలపై జరిగే అఘాయిత్యాలను నిరోధించేందుకు వినియోగించనున్నట్లు ఈ కారును రూపొందించిన ఇఒఎన్ ప్రొడక్షన్ తెలిపింది. ఆన్లైన్ ద్వారా జరిగే ఈ ఆక్షన్ ద్వారా 5 కోట్ల రూపాయల వరకు సేకరించాలని ప్రొడక్షన్ హౌస్ అంచనా వేస్తోంది. ఇదే సినిమాలో వాడిన ఆక్వాటెర్రా - రిస్ట్ వాచీని కూడా ఈ వేలంలో ఉంచుతున్నట్లు నిర్వాహక సంస్ధ తెలిపింది. దాదాపుగా 11 జేమ్స్ బాండ్ సినిమాల్లో ఇదే మోడల్ ఆస్టిన్ మార్టిన్ కారును ఉపయోగించారు. చివరగా జేమ్స్ బాండ్ నటించిన చివరి సినిమా స్కైఫాల్లో సైతం ఆస్టిన్ మార్టిన్ కారునే వాడారు. ** -
ఇన్వెస్ట్మెంట్ @ బాండ్ స్టయిల్
జేమ్స్బాండ్ సినిమాలంటే.. స్టయిల్, గ్యాడ్జెట్స్.. ఫన్. బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంటు బాండ్తో పాటు విలన్లకు కూడా ప్రత్యేకత ఉంటుంది. సమస్యలు సృష్టించడంలో ఇటు విలన్లు.. వాటిని ఎదుర్కొనడంలో అటు బాండ్ పాటించే వ్యూహాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటాయి. యాభై ఏళ్ల నుంచి అలరిస్తున్న జేమ్స్బాండ్ సినిమాల్లో పాత్రలు, ప్లాన్ల నుంచి నేర్చుకోదగిన ఆర్థిక పాఠాలు కూడా కొన్ని ఉన్నాయి. రిస్కును అర్థం చేసుకోవడం.. సినిమాల్లో జేమ్స్బాండ్ చేసే స్టంట్లు ప్రాక్టీస్ లేకుండా మనమూ ప్రయత్నిస్తే అంతే సంగతులు. సులువుగా కనిపించినా.. బాండ్ ప్లాన్ల వెనుక అధ్యయనం ఉంటుంది. ఉదాహరణకు.. కెసినో రాయల్ లాంటి సినిమాల్లో విలన్తో కార్డ్గేమ్ ఆడేటప్పుడు బాండ్ ఆషామాషీగా ఆడేయడు. విలన్ బాడీ లాంగ్వేజ్ను అధ్యయనం చేస్తూ దానికి తగ్గట్లుగా ప్లాన్ చేస్తుంటాడు. అలాగే, మనం ఇన్వెస్ట్మెంట్కి ఏది ఎంచుకున్నా.. అందులో లోటుపాట్లను, రిస్కులను పూర్తిగా తెలుసుకునే ముందడుగు వేయాలి. ప్రక్రియంటూ ఉండాలి.. బాండ్ సినిమాల్లో విలన్లు ముందుగా ఏదో ఒకటి చేస్తారు. దానికి ప్రతిచర్యగా బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ రియాక్ట్ అవుతుంది. అయితే, ఇన్వెస్ట్మెంట్ విషయంలో తర్వాతెప్పుడో రియాక్ట్ కావడం కాదు.. ముందుగా యాక్షన్ అవసరం. పెట్టుబడిలో అంతరార్థం ఏదైనా లక్ష్యం సాధించడమే. కనుక లక్ష్యాలు నిర్దేశించుకుంటూ.. ప్లానింగ్ చేసుకుంటూ వెళ్లాలి. స్పెషలిస్టుల సాయం తీసుకోవాలి విలన్లను ఎదుర్కొనేందుకు బాండ్ సొంత తెలివితేటలతో పాటు గ్యాడ్జెట్స్ సాయం కూడా కీలకంగా ఉంటుంది. వీటిని స్పెషలిస్ట్ క్యూ తయారు చేసి ఇస్తుంటాడు. అలాగే, ఆర్థిక విషయాల్లో అప్పుడప్పుడు మన సొంత ఆలోచనలతో పాటు ఫైనాన్స్ నిపుణుల అవసరం కూడా ఉంటుంది. సందర్భాన్ని బట్టి స్పెషలిస్టుల సాయం తీసుకోవాల్సిందే. అవకాశాలు అందిపుచ్చుకోవాలి.. ప్రతి బాండ్ సినిమాలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంతా ప్రతికూలంగా ఉన్నా కూడా ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుని బాండ్ బైటపడుతుంటాడు. ఆర్థిక విషయాల్లోనూ ఇదే పాఠం పనిచేస్తుంది. మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పుడు కంగారుపడిపోకుండా కామ్గా వ్యవహరించాలి. అంతా అందిన కాడికి అమ్మేసుకుంటున్నప్పుడు.. తెలివైన వారు అవకాశాలను ఒడిసిపట్టుకుంటుంటారు. చౌకగా కొనుక్కుని ఓపికగా అట్టే పెట్టుకుంటూ ఉంటారు. పడినవి ఎల్లకాలం పడిపోయే ఉండవు కాబట్టి అవి మళ్లీ పెరిగినప్పుడు అధిక ధరకు అమ్మి భారీ లాభాలు గడిస్తుంటారు. సమీక్షించుకోవాలి.. బాండ్ సినిమాల్లో ఛోటా మోటా విలన్లు... తమకి అప్పగించిన ప్రాజెక్టుల పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు బడా విలన్కు వివరిస్తుంటారు. విలన్లే అయినా.. వాళ్లు కూడా ఖాళీగా కూర్చోకుండా.. తమ ప్రాజెక్టుల బాగోగులు చూసుకుంటుంటారు. అలాగే.. మనం కూడా పెట్టిన పెట్టుబడులు.. లక్ష్యాలకు తగ్గట్లుగా పనిచేస్తున్నాయా లేదా అన్నది సమీక్షించుకుంటూ ఉండటం తప్పనిసరి. నష్టాలు తగ్గించుకోవాలి.. విషయంలో బాండ్ సినిమాల్లో విలన్లు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు. ఉదాహరణకు యూ ఓన్లీ లివ్ టై్వస్లో తన రహస్య స్థావరం ఇక ఎందుకూ కొరగాదనుకున్నప్పుడు.. పేల్చేయడానికి విలన్ బ్లొఫెల్డ్ స్విచ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే, ఇన్వెస్ట్మెంట్ సాధనం నుంచి ఎప్పుడు వైదొలగాలి, ఎలా నష్టాలను తగ్గించుకోవాలి అన్న దానిపై కూడా ఇన్వెస్టరుగా అవగాహన ఉండాలి. -
కాంటాక్ట్ లెన్సులు ఇక చీకట్లోనూ చూపునిస్తాయ్!
వాషింగ్టన్: జేమ్స్బాండ్ సినిమా తరహాలో చిమ్మచీకటిలో సైతం పరిసరాల్లో మనుషులు, జంతువుల సంచారాన్ని చూపగలిగే వినూత్న కాంటాక్ట్ లెన్సులను యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే పనిచేసేలా వారు రూపొందించిన గ్రాఫీన్ లైట్ డిటెక్టర్లు పరిసరాల్లో పూర్తిస్థాయి ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్(పరారుణ వర్ణపటం)ను పసిగడతాయట. దీంతో మామూలు కాంటాక్ట్ లెన్సులతో కూడా చీకట్లో ఇన్ఫ్రారెడ్ చూపు త్వరలోనే సాధ్యం కానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలాంటి ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్లు ఇదివరకే వచ్చినా.. వాటిని ఎల్లప్పుడూ చల్లబర్చాల్సి ఉండటం ప్రతిబంధకంగా ఉంది. అయితే గ్రాఫీన్ డిటెక్టర్లు గది ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచే యడమే కాకుండా వాటిని కాంటాక్ట్ లెన్సులు, మొబైల్ఫోన్లకు కూడా అనుసంధానం చే యొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాగా చీకట్లో మనుషులను పసిగట్టేందుకే కాకుండా.. రోగుల శరీరంలో రక్తప్రసరణను వైద్యులు పర్యవేక్షించేందుకు, పర్యావరణంలో రసాయనాలను గుర్తించేందుకు కూడా ఇన్ఫ్రారెడ్ విజన్ పరికరాలు ఉపయోగపడతాయట. -
పోజు తెచ్చిన పాట్లు..
జేమ్స్బాండ్లా తుపాకీతో పోజులిస్తున్న ఈయన పేరు ఉదయన్ భోంస్లే, మహారాష్ట్ర ఎంపీ. ఎన్సీపీకి చెందిన ఈ ఎంపీగారీ పోజులే.. చివరికి ఓ పోలీసు ఇన్స్పెక్టర్కు పాట్లు తెచ్చిపెట్టాయి. ఇంతకీ జరిగిందేమిటంటే.. శివాజీ మహరాజు వంశానికి చెందిన ఈ ఎంపీగారు ఇటీవల సతారాలోని ఓ చర్చిని సందర్శించడానికి వెళ్లారు. అంతలో ఏమైందో ఏమో.. తనకు సెక్యూరిటీగా వచ్చిన ఇన్స్పెక్టర్ వినోద్ మానేను.. తుపాకీ ఇవ్వవయ్యా అని అడిగారు. సాక్షాత్తు ఎంపీగారే అడగడంతో చేసేది లేక ఇచ్చాడు. తర్వాత ఉదయన్ ఇలా తుపాకీతో జేమ్స్బాండ్లా పోజులిచ్చారు. అక్కడ మీడియావారు లేకపోయినప్పటికీ ఎవరో తీసిన ఈ ఫొటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెట్టారు. దీన్ని సతారా ఎస్పీ ప్రసన్న చూసి.. విచారణకు ఆదేశించారు. ఆ గన్.. ఇన్స్పెక్టర్దని తెలియడంతో వెంటనే అతడిని సస్పెండ్ చేయడంతో పాటు రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉదయన్ కూడా వివాదాస్పదుడే. పలు హత్య కేసుల ఆరోపణలు ఉండటంతోపాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ వార్తల్లో ఉంటారు.