Marcus Stoinis
-
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు వరుస ఎదురుదెబ్బలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy 2025) ముందు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా మెగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. తొలుత మిచెల్ మార్ష్ (Mitchel Marsh).. తాజాగా ఫాస్ట్ బౌలర్లు కమిన్స్ (Pat Cummins), జోష్ హాజిల్వుడ్ (Josh Hazzlewood) ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. ఈ మధ్యలో ఆస్ట్రేలియాకు మరో ఊహించని షాక్ కూడా తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) అనూహ్యంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా మొత్తం నలుగురు ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. ఈ నలుగురికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంది. రేసులో కూపర్ కన్నోలీ, బ్యూ వెబ్స్టర్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ ముందువరసలో ఉన్నారు.కాగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం రెండు టెస్ట్లు, రెండు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో ఇదివరకే తొలి టెస్ట్ పూర్తి కాగా.. ఇవాళే (ఫిబ్రవరి 6) రెండో టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీ విరామం సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (11), దిముత్ కరుణరత్నే (36), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), ధనంజయ డిసిల్వ (0) ఔట్ కాగా.. దినేశ్ చండీమల్ (70), కుసాల్ మెండిస్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 3, మిచెల్ స్టార్క్, ట్రవిస్ హెడ్ తలో వికెట్ పడగొట్టారు.తొలి టెస్ట్లో ఆసీస్ భారీ విజయంతొలి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.ఫిబ్రవరి 12 నుంచి వన్డేలు.. ఆతర్వాత నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకే..!ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆసీస్ జట్టు (ముందుగా ప్రకటించింది)పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
ఆసీస్కు భారీ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టోయినిస్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు స్టోయినిస్ విడ్కోలు పలికాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్న మార్కస్ అనుహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. గత కొనేళ్లగా వైట్ బాల్ ఫార్మాట్లో ఆస్ట్రేలియా జట్టులో స్టోయినిస్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో కూడా అతడు సభ్యునిగా ఉన్నాడు. అయితే టీ20 క్రికెట్పై దృష్టి సారించేందుకు 35 ఏళ్ల ఆల్రౌండర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. స్టోయినిస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో ఆడుతున్నాడు. స్టోయినిస్ చివరగా ఆస్ట్రేలియా తరపున చివరి వన్డే మ్యాచ్ పాకిస్తాన్పై ఆడాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే తన జట్టుకు ఆల్ది బెస్ట్ స్టోయినిస్ చెప్పుకొచ్చాడు.అందుకే రిటైర్మెంట్.."ఆస్ట్రేలియాకు అత్యుత్తున్నత స్దాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ముఖ్యంగా వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఆడిన ప్రతీ క్షణానాన్ని నేను అస్వాదించాను. ఈ రోజు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ఇది అంత ఈజీగా తీసుకున్న నిర్ణయం కాదు. కానీ నా కెరీర్లోని తదుపరి అధ్యాయంపై దృష్టి సారించేందుకు సరైన సమయంగా భావిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మా కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతడు నాకు ఎంతో మద్దతిచ్చాడు. నాకు సపోర్ట్గా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా, నా సహచరులు, అభిమానులందరికి ధన్యవాదాలు" అని తన రిటైర్మెంట్ ప్రకటనలో స్టోయినిస్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు 71 వన్డేలు ఆడిన మార్కస్ స్టోయినిస్.. 1495 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 48 వికెట్లు తీశాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టోయినిస్ తీసుకున్న నిర్ణయం ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే ఆస్ట్రేలియా తమ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సేవలు కోల్పోయే సూచనలు కన్పిస్తున్నాయి. చీలమండ గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ ఛాంపియన్స్ ట్రొఫీకి దూరమయ్యే అవకాశముంది.ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుపాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. స్టోయినిష్ స్ధానంలో మరో కొత్త ఆటగాడు ఈ జట్టులోకి రానున్నాడు.చదవండి: CT 2025: 'బుమ్రా దూరమైతే అతడికి ఛాన్స్ ఇవ్వండి.. అద్భుతాలు సృష్టిస్తాడు' -
మ్యాక్స్వెల్ను అధిగమించిన స్టోయినిస్
బిగ్బాష్ లీగ్లో మార్కస్ స్టోయినిస్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మెల్బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. బ్రిస్బేన్ హీట్తో ఇవాళ (జనవరి 1) జరిగిన మ్యాచ్లో స్టోయినిస్ ఈ ఘనత సాధించాడు. స్టోయినిస్ ఈ భారీ రికార్డు సాధించే క్రమంలో గ్లెన్ మ్యాక్స్వెల్ రికార్డును అధిగమించాడు. స్టోయినిస్కు ముందు మ్యాక్సీ మెల్బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. స్టోయినిస్ మెల్బోర్న్ స్టార్స్ తరఫున 2850 పరుగులు చేయగా.. మ్యాక్స్వెల్ 2845 పరుగులు చేశాడు. మెల్బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టోయినిస్, మ్యాక్స్వెల్ తర్వాత లూక్ రైట్ (1479), హిల్టన్ కార్ట్రైట్ (1429), కెవిన్ పీటర్సన్ (1110) ఉన్నారు.మెల్బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాఛ్లో మెల్బోర్న్ స్టార్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మ్యాక్స్ బ్రయాంట్ (77 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బ్రిస్బేన్ ఇన్నింగ్స్లో బ్రయాంట్తో పాటు పాల్ వాల్టర్ (21), టామ్ బాంటన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మెల్బోర్న్ బౌలర్లలో స్టీకిటీ రెండు వికెట్లు పడగొట్టగా.. జోయల్ పారిస్, పీటర్ సిడిల్, ఉసామా మిర్, డాన్ లారెన్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. స్టోయినిస్ (48 బంతుల్లో 62; 10 ఫోర్లు), డేనియల్ లారెన్స్ (38 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు చేసి మెల్బోర్న్ను గెలిపించారు. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన మెల్బోర్న్ తొలుత తడబడింది. అయితే డేనియల్ లారెన్స్, స్టోయినిస్ బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. మెల్బోర్న్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ 0, థామస్ ఫ్రేజర్ 6, సామ్ హార్పర్ 8, మ్యాక్స్వెల్ డకౌటయ్యారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో జేవియర్ బార్ట్లెట్ నాలుగు వికెట్లు తీశాడు. -
ఘనంగా ప్రారంభమైన బిగ్బాష్ లీగ్.. తొలి మ్యాచ్లో స్టోయినిస్ జట్టు ఓటమి
ఈ ఏడాది బిగ్బాష్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో మార్కస్ స్టోయినిస్ నేతృత్వంలోని మెల్బోర్న్ స్టార్స్.. పెర్త్ స్కార్చర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. స్టోయినిస్ (37), టామ్ కర్రన్ (37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్లో జో క్లార్క్ 0, థామస్ రోజర్స్ 14, సామ్ హార్పర్ 1, కార్ట్రైట్ 18, వెబ్స్టర్ 19, హెచ్ మెక్కెంజీ 4, ఆడమ్ మిల్నే 2, బ్రాడీ కౌచ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. స్కార్చర్స్ బౌలర్లలో జై రిచర్డ్సన్ 3, లాన్స్ మోరిస్ 2, బెహ్రెన్డార్ఫ్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన స్కార్చర్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కూపర్ కన్నోలీ (64) మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్టార్చర్స్ విజయానికి బీజం వేశాడు. ఆస్టన్ టర్నర్ (37 నాటౌట్), నిక్ హాబ్సన్ (27 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్లతో స్కార్చర్స్ను విజయతీరాలకు చేర్చారు. స్కార్చర్స్ ఇన్నింగ్స్లో ఫిన్ అలెన్ (6), కీటన్ జెన్నింగ్స్ (4), మాథ్యూ హర్స్ట్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మెల్బోర్న్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, పీటర్ సిడిల్, టామ్ కర్రన్, బ్రాడీ కౌచ్ తలో వికెట్ పడగొట్టారు. రేపు జరుగబోయే మ్యాచ్లో సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. -
మాక్స్వెల్ రాజీనామా.. ఆ జట్టు కెప్టెన్గా మార్కస్ స్టోయినిస్
బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్కు ముందు మెల్బోర్న్ స్టార్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫుల్ టైమ్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ని నియమించింది. గ్లెన్ మాక్స్వెల్ వారుసుడిగా స్టోయినిష్ బాధ్యతలు చేపట్టనున్నాడు. జాన్ హేస్టింగ్స్ రిటైర్మెంట్ తర్వాత బీబీఎల్ సీజన్ 8 సందర్భంగా మెల్బోర్న్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన మాక్సీ.. గత సీజన్ అనంతరం సారథ్య బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. గత సీజన్లో స్టార్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది.10 మ్యాచ్లు ఆడిన మెల్బోర్న్ కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ క్రమంలోనే మాక్స్వెల్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. కాగా స్టోయినిస్కు కెప్టెన్గా అనుభవం ఉంది. గత సీజన్లో కొన్ని మ్యాచ్ల్లో మాక్సీ గైర్హాజరీలో మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్గా మార్కస్ వ్యవహరించాడు. ఇక కెప్టెన్గా ఎంపికైన అనంతరం స్టోయినిష్ స్పందించాడు."గత సీజన్లో 'మ్యాక్సీ' లేకపోవడంతో కొన్ని మ్యాచ్ల్లో మెల్బోర్న్ సారథిగా వ్యవహరించే అవకాశం దక్కింది. కెప్టెన్సీని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఫుల్ టైమ్ కెప్టెన్గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గత పదేళ్లగా మెల్బోర్న్ స్టార్స్ ఫ్యామిలీలో భాగంగా ఉన్నాను. ఈసారి నాయకుడిగా మా జట్టును విజయఫథంలో నడిపించేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తాను" అని స్టోయినిస్ పేర్కొన్నాడు. మెల్బోర్న్ స్టార్స్ తరపున 98 మ్యాచ్లు ఆడిన స్టోయినిష్.. 2656 పరుగులు చేశాడు.బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టోయినిస్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. తొలి స్ధానంలో గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు. ఇక బిగ్ బాష్ లీగ్ 14వ సీజన్ డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: SA vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్ -
చెలరేగిన డేవిడ్ వీస్, మార్కస్ స్టోయినిస్
అబుదాబీ టీ10 లీగ్లో భాగంగా టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్లో డెక్కన్ గ్లాడియేటర్స్ ఆటగాళ్లు డేవిడ్ వీస్, మార్కస్ స్టోయినిస్ చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో వీస్ 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 42 పరుగులు చేయగా.. స్టోయినిస్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్లో కొహ్లెర్ కాడ్మోర్ 11, రిలీ రొస్సో 18, నికోలస్ పూరన్ 0, జోస్ బట్లర్ 3, ఆర్యన్ లక్రా 11 (నాటౌట్) పరుగులు చేశారు. టీమ్ అబుదాబీ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ మిల్నే, మార్క్ అదైర్, రుమ్మన్ రయీస్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ అబుదాబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేయగలిగింది. తద్వారా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫిలిప్ సాల్ట్ (9 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్స్టో (20 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కడీమ్ అలెన్ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 సిక్సర్లు) టీమ్ అబుదాబీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. టీమ్ అబుదాబీ ఇన్నింగ్స్లో పాల్ స్టిర్లింగ్ 8, కైల్ మేయర్స్ 9, లారీ ఎవాన్స్ 9, మార్క్ అదైర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహీశ్ తీక్షణ 2, ఇబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
స్టోయినిస్ ఊచకోత.. పాక్ను ఊడ్చేసిన ఆస్ట్రేలియా
స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్లో భాగంగా ఇవాళ (నవంబర్ 18) జరిగిన మూడో టీ20లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 18.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (41) టాప్ స్కోరర్గా నిలువగా.. హసీబుల్లా ఖాన్ (24), షాహీన్ అఫ్రిది (16), ఇర్ఫాన్ ఖాన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించి పాక్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆరోన్ హార్డీ మూడు వికెట్లతో పాక్ నడ్డి విరచగా.. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ తలో రెండు వికెట్లు.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 11.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (3 వికెట్లు కోల్పోయి). మార్కస్ స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి పాక్ బౌలర్లను చీల్చిచెండాడు. జోష్ ఇంగ్లిస్ 24 బంతుల్లో 27 పరుగులు.. జేక్ ఫ్రేజర్ 11 బంతుల్లో 18 పరుగులు.. టిమ్ డేవిడ్ 3 బంతుల్లో 7 పరుగులు.. మాథ్యూ షార్ట్ 4 బంతుల్లో 2 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, జహన్దాద్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ సిరీస్లో ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్ల్లో కూడా గెలుపొందిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్కు ముందు జరిగిన వన్డే సిరీస్ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
మాక్సీ మెరుపులు.. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్
పాకిస్తాన్తో టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బ్రిస్బేన్ వేదికగా పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గాబా స్టేడియంలో ఆసీస్- పాక్ మధ్య గురువారం తొలి టీ20 జరిగింది.వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ టీ20 మ్యాచ్ను ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.ధనాధన్ ఇన్నింగ్స్తో మాక్సీ చెలరేగగాఅయితే, వన్డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్(19 బంతుల్లో 43) రాకతో సీన్ మారింది. ధనాధన్ ఇన్నింగ్స్తో మాక్సీ చెలరేగగా.. నాలుగో నంబర్ బ్యాటర్ టిమ్ డేవిడ్(10) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో మాక్సీకి తోడైన మార్కస్ స్టొయినిస్(7 బంతుల్లో 21 నాటౌట్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.మాక్సీ, స్టొయినిస్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది రెండు వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఆరంభం నుంచే పాక్ తడ‘బ్యాటు’అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పాక్ తడ‘బ్యాటు’కు గురైంది. ఆసీస్ పేసర్లు నిప్పులు చెరగడంతో 64 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(8)ను అవుట్ చేసి స్పెన్సర్ జాన్సన్ వికెట్ల వేట మొదలుపెట్టగా.. జేవియర్ బార్ట్లెట్ మహ్మద్ రిజ్వాన్(0)ను డకౌట్ చేశాడు. అనంతరం ఉస్మాన్ ఖాన్(4)ను కూడా అతడు పెవిలియన్కు పంపాడు.ఆ తర్వాత నాథన్ ఎల్లిస్ బాబర్ ఆజం(3)తో పాటు.. ఇర్ఫాన్ ఖాన్(0) వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో మరోసారి రంగంలోకి దిగిన బార్ట్లెట్ ఆఘా సల్మాన్(4)ను వెనక్కి పంపగా.. నాథన్ ఎల్లిస్ హసీబుల్లా ఖాన్(12) పనిపట్టాడు. అయితే, అబ్బాస్ ఆఫ్రిది(20 నాటౌట్)తో కలిసి టెయిలెండర్ షాహిన్ ఆఫ్రిది(6 బంతుల్లో 11) బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేయగా.. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా అతడిని బౌల్డ్ చేశాడు. అనంతరం.. పాక్ ఇన్నింగ్స్ ఆఖరి వికెట్గా నసీం షాను బౌల్డ్ చేసి వెనక్కి పంపించాడు. 64 పరుగులకేఈ క్రమంలో పాకిస్తాన్ ఏడు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 64 రన్స్ చేసింది. ఫలితంగా ఆసీస్ చేతిలో 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. అద్భుత బ్యాటింగ్తో అలరించి ఆసీస్ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల మధ్య శనివారం సిడ్నీ వేదికగా రెండో టీ20 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2025: సీఎస్కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j— cricket.com.au (@cricketcomau) November 14, 2024 -
పాక్తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత.. చరిత్ర పుటల్లోకి!
పాకిస్తాన్తో తొలి టీ20లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టాడు. పాక్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ.. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. 226కు పైగా స్ట్రైక్రేటు నమోదు చేసిన మాక్సీ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.ఇక మాక్సీతో పాటు మరో ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ కూడా మెరుపు ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. కేవలం ఏడు బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.కాగా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్ను 2-1తో గెలిచి పాకిస్తాన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా టీ20 సిరీస్ మొదలైంది.గాబా స్టేడియంలో గురువారం నాటి ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో టీ20ని ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఆసీస్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే, ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9).. అదే విధంగా టిమ్ డేవిడ్(10) విఫలం కాగా.. మాక్సీ, స్టొయినిస్ దంచికొట్టారు.చరిత్ర పుటల్లోకి!ఇక పాక్తో తొలి టీ20 సందర్భంగా మాక్స్వెల్ పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా పురుషుల క్రికెట్లో ఓవరాల్గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10012) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్లో చేరారు. 'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j— cricket.com.au (@cricketcomau) November 14, 2024 -
వరల్డ్ నంబర్ వన్గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు
ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్స్టోన్ ప్రపంచ నంబర్ వన్గా అవతరించాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్లో సత్తా చాటి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి.. నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన కెరీర్లోనే అత్యుత్తమంగా 253 రేటింగ్ పాయింట్లతో లివింగ్స్టోన్ నంబర్ వన్ ఆల్రౌండర్గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ మార్కస్ స్టొయినిస్(211 రేటింగ్ పాయింట్లు)ను అగ్రస్థానం నుంచి వెనక్కి నెట్టి.. అతడికి అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో లివింగ్స్టోన్ అదరగొట్టాడు.ఆసీస్తో సిరీస్లో అదరగొట్టిసౌతాంప్టన్లో జరిగిన తొలి మ్యాచ్లో బ్యాటర్గా 37 పరుగులు చేయడంతో పాటు.. 22 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. రెండో టీ20లో విశ్వరూపం ప్రదర్శించాడు. కార్డిఫ్లో జరిగిన ఈ మ్యాచ్లో 47 బంతుల్లోనే 87 పరుగులు చేసిన లివింగ్స్టోన్.. కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నంబర్ వన్ బ్యాటర్ అతడేతద్వారా ఇంగ్లండ్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ సిరీస్లో ఆసీస్- ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలవగా.. మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. కాగా 2017లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల లివింగ్స్టోన్.. ఇప్పటి వరకు ఒక టెస్టు, 25 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 16, 558, 815 పరుగులు చేయడంతో పాటు.. వన్డేల్లో 17, టీ20లలో 29 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ టీ20 బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ తన టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకోగా.. లివింగ్స్టోన్ 17 స్థానాలు మెరుగుపరచుకుని 33వ ర్యాంకు సంపాదించాడు. బౌలర్ల టాప్-5 యథాతథంఇక బౌలర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నంబర్ వన్గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్ పేసర్ అకీల్ హొసేన్, అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ, శ్రీలంక వనిందు హసరంగ టాప్-5లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా సౌతాఫ్రికా స్పీడ్స్టర్ అన్రిచ్ నోర్జేను వెనక్కినెట్టి ఆరోస్థానానికి చేరుకున్నాడు. కాగా టీ20 ఆల్రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్-10(ఏడో స్థానం)లో ఉన్నాడు.ఐసీసీ తాజా టీ20 ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్- టాప్ 51. లియామ్ లివింగ్స్టోన్(ఇంగ్లండ్)- 252 రేటింగ్ పాయింట్లు2. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 211 రేటింగ్ పాయింట్లు3. సికందర్ రజా(జింబాబ్వే)- 208 రేటింగ్ పాయింట్లు4. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- 206 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 206 రేటింగ్ పాయింట్లు.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్! -
స్టోయినిస్ ఆల్రౌండ్ షో.. సునీల్ నరైన్ మాయాజాలం (3-0-3-3)
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో సర్రే జాగ్వర్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న స్టోయినిస్.. టోరంటో నేషనల్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాట్తో ఆతర్వాత బంతితో చెలరేగాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జాగ్వర్స్.. స్టోయినిస్ హాఫ్ సెంచరీతో (37 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. జాగ్వర్స్ ఇన్నింగ్స్లో కైల్ మేయర్స్ (27), విరన్దీప్ సింగ్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సునీల్ నరైన్ (2), బ్రాండన్ మెక్ముల్లెన్ (18), శ్రేయస్ మొవ్వ (4), మొహమ్మద్ నబీ (13) నిరాశపరిచారు. టోరంటో బౌలర్లలో రోహిద్ ఖాన్, జునైద్ సిద్దిఖీ తలో రెండు వికెట్లు, రొమారియో షెపర్డ్, జతిందర్పాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టోరంటో.. స్టోయినిస్ (4-1-19-3), సునీల్ నరైన్ (3-0-3-3), మొహమ్మద్ నబీ (2-0-6-2), బెన్ లిస్టర్ (3-0-14-1), హర్మీత్ సింగ్ (2.1-0-18-1) దెబ్బకు 17.1 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌటైంది. టోరంటో ఇన్నింగ్స్లో ఉన్ముక్త్ చంద్ (21), డస్సెన్ (15), కిర్టన్ (11), రోహిత్ పౌడెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారీ హిట్టర్లు రోస్టన్ ఛేజ్ (8), కొలిన్ మున్రో (4), రొమారియో షెపర్డ్ దారుణంగా విఫలమయ్యారు.కాగా, గ్లోబల్ టీ20 కెనడా అనే టోర్నీ కెనడా వేదికగా జరిగే క్రికెట్ లీగ్. ఈ లీగ్లోనూ మిగతా లీగ్లలో లాగే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెటర్లు పాల్గొంటారు. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు (మాంట్రియాల్ టైగర్స్, టోరంటో నేషనల్స్, సర్రే జాగ్వర్స్, బ్రాంప్టన్ వోల్వ్స్, బంగ్లా టైగర్స్, వాంకోవర్ నైట్స్) పాల్గొంటాయి. లీగ్ మ్యాచ్ల అనంతరం తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్కు చేరతాయి. ప్రస్తుత సీజన్ ఈనెల 25న మొదలైంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో మాంట్రియల్ టైగర్స్ టాప్లో ఉంది. ఈ లీగ్లో డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్, సునీల్ నరైన్, కార్లోస్ బ్రాత్వైట్, మొహమ్మద్ ఆమిర్, మొహమ్మద్ నబీ, కైల్ మేయర్స్, క్రిస్ లిన్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, టిమ్ సీఫర్ట్, నవీన్ ఉల్ హక్, షకీబ్ అల్ హసన్, రహ్మానుల్లా గుర్బాజ్, డస్సెన్, కొలిన్ మున్రో, రొమారియో షెపర్డ్ లాంటి టీ20 స్టార్లు పాల్గొంటున్నారు. -
T20 World Cup 2024: ఆస్ట్రేలియా విజయం.. సూపర్-8లో ఇంగ్లండ్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా స్కాట్లాండ్తో ఇవాళ (జూన్ 16) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. ఛేదనలో ఆస్ట్రేలియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో ఓటమితో స్కాట్లాండ్ వరల్డ్కప్ నుంచి నిష్క్రమించింది.గ్రూప్-బిలో స్కాట్లాండ్తో సమానంగా ఐదు పాయింట్లు ఉన్న ఇంగ్లండ్ నెట్ రన్రేట్ ఆధారంగా సూపర్-8కు అర్హత సాధించింది. ఆసీస్-స్కాట్లాండ్ మ్యాచ్కు ముందు నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3.611 రన్రేట్తో ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. స్కాట్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ డ్రాతో 1.255 రన్రేట్ చొప్పున ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గ్రూప్-బి నుంచి ఆడిన నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ఆస్ట్రేలియా ఎనిమిది పాయింట్లతో (2.791 రన్రేట్తో) అగ్రస్థానంలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. బ్రాండన్ మెక్ముల్లెన్ (60), బెర్రింగ్టన్ (42 నాటౌట్), మున్సే (35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్వెల్ 2, ఆస్టన్ అగర్, నాథన్ ఇల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (68), మార్కస్ స్టోయినిస్ (59), టిమ్ డేవిడ్ (24 నాటౌట్) చెలరేగడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, షరీఫ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్ వీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
T20 World Cup 2024: ఆల్రౌండ్ షోతో ఇరగదీసిన స్టోయినిస్.. బోణీ కొట్టిన ఆసీస్
టీ20 వరల్డ్కప్ 2024 జర్నీని ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-బిలో పసికూన ఒమన్తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండ్ షోతో (67 నాటౌట్, 3/19) ఇరగదీసి ఆసీస్ను గెలిపించాడు. స్టోయినిస్ దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఒమన్ విలవిలలాడిపోయింది.వివరాల్లోకి వెళితే.. బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఒమన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ (12), మిచెల్ మార్ష్ (14), మ్యాక్స్వెల్ (0) నిరాశపరిచారు. ఈ మ్యాచ్లో ఒమన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. మెహ్రాన్ ఖాన్ 2, బిలాల్ ఖాన్, కలీముల్లా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాట్తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్లో 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ టాప్ స్కోరర్గా నిలువగా..మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
IPL: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన స్టొయినిస్..
లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో అజేయ శతకంతో చెలరేగిన 34 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్.. పదేళ్లుగా వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై- లక్నో మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ సేన విజయం సాధించింది. సొంతమైదానంలోనే చెన్నైని ఆరు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. లక్నో గెలుపులో స్టొయినిస్దే కీలక పాత్ర.Have a look at those emotions 🥳The Lucknow Super Giants make it 2/2 this season against #CSK 👏👏Scorecard ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/khDHwXXJoF— IndianPremierLeague (@IPL) April 23, 2024సీఎస్కే విధించిన 211 లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కేఎల్ రాహుల్(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. తానున్నానంటూ స్టొయినిస్ బ్యాటెత్తాడు.మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతడు 26 బంతుల్లోనే అర్ధ శతకం, 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక స్టొయినిస్ ఇన్నింగ్స్లో ఏకంగా 13 ఫోర్లు, 6 సిక్స్లు ఉండటం విశేషం.Maiden #TATAIPL century ✅Highest T20 chase at Chepauk ✅Double over #CSK ✅Highest individual score in an IPL chase ✅#CSKvLSG #TATAIPL #IPLonJioCinema #MarcusStoinis pic.twitter.com/imjZQcLXa7— JioCinema (@JioCinema) April 23, 2024కాగా ఐపీఎల్ 17 ఏళ్ల చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్పై నమోదైన వ్యక్తిగత స్కోరు స్టొయినిస్దే. అంతకు ముందు 2014లో వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై మీద 122 పరుగులు సాధించాడు. నాడు పంజాబ్ కింగ్స్ తరఫున ముంబైలోని వాంఖడే వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్లో సెహ్వాగ్ ఈ మేరకు పరుగులు రాబట్టాడు.అయితే, చెపాక్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో స్టొయినిస్.. సెహ్వాగ్ పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు.. నికోలస్ పూరన్(34), దీపక్ హుడా(6 బంతుల్లో 17 నాటౌట్)తో కలిసి లక్నోను విజయతీరాలకు చేర్చి మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ రన్ ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(124*) సాధించిన ఆటగాడిగా స్టొయినిస్ చరిత్రకెక్కాడు. చదవండి: CSK vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: గైక్వాడ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
CSK Vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం!
‘‘ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. అయితే, మ్యాచ్ మాత్రం బాగా సాగింది. లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడింది. 13- 14 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది.అయితే, స్టొయినిస్ గొప్ప ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. పిచ్ మీద తేమ ఎక్కువగా ఉంది. అందుకే మా స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లేదంటే ఫలితం వేరేలా ఉండేది.అయినా.. ఆటలో ఇవన్నీ సహజమే. కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు. పవర్ ప్లేలోనే రెండో వికెట్ కోల్పోయిన వేళ జడ్డూ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది.పవర్ ప్లే తర్వాత వికెట్ పడితే శివం దూబేను రంగంలోకి దించాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. అందుకు అనుగుణంగానే మా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. మేము ఇంకొన్ని పరుగులు చేస్తే బాగుండేది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇంత తేమ కనిపించలేదు. ఏదేమైనా ఎల్ఎస్జీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. వాళ్లు మెరుగ్గా ఆడినందువల్లే పైచేయి సాధించగలిగారు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.ఓటమికి కారణం అదేఇంకాస్త మెరుగైన స్కోరు సాధిస్తే బాగుండేదని.. మార్కస్ స్టొయినిస్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగానే మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్లో తొలుత లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన సీఎస్కేకు.. సొంత మైదానం చెపాక్లోనూ చేదు అనుభవం ఎదురైంది.తమకు కంచుకోట అయిన చెపాక్లో చెన్నై భారీ స్కోరు సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్(60 బంతుల్లో 108 నాటౌట్)తో దుమ్ములేపగా.. శివం దూబే(27 బంతుల్లో 66) మరోసారి ధనాధన్ దంచికొట్టాడు.What an incredible innings by Ruturaj Gaikwad !! Had people getting out right & left but made sure to be play well & be there right till the end ! A super century as he made 108* today 👏🏻 a true captain's innings!#LSGvsCSK • #RuturajGaikwad • #CSKvLSGpic.twitter.com/YdDSvde6w5— ishaan (@ixxcric) April 23, 2024వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా.. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆదిలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కెప్టెన్ కేఎల్ రాహుల్(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.అయితే, వన్డౌన్ బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ సుడిగాలి ఇన్నింగ్స్తో చెలరేగాడు. 63 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచి సీఎస్కే ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో నికోలస్ పూరన్ 15 బంతుల్లో 34 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో 19.3 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసిన లక్నో.. చెన్నై కంచుకోటలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఐదో విజయం అందుకుని టాప్-4లోకి చేరుకుంది.Have a look at those emotions 🥳The Lucknow Super Giants make it 2/2 this season against #CSK 👏👏Scorecard ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/khDHwXXJoF— IndianPremierLeague (@IPL) April 23, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ విరోచిత శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ వంటి వారు విఫలమైన చోట స్టోయినిష్ తన బ్యాట్కు పనిచెప్పాడు. 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో సీఎస్కే బౌలర్లను స్టోయినిష్ ఓ ఆట ఆడుకున్నాడు. తన విధ్వంసకర సెంచరీతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 63 బంతులు ఎదుర్కొన్న స్టోయినిష్ 13 ఫోర్లు, 6 సిక్స్లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సీఎస్కేపై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక సెంచరీతో మెరిసిన స్టోయినిష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖిచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన రన్ ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టోయినిష్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేపై లక్ష్య చేధనలో వాల్తాటి 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్లో 124 పరుగులు చేసిన స్టోయినిష్.. వాల్తాటి ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. MARCUS STOINIS... THE HULK. 💪 - The winning celebrations from Stoinis and LSG says everything. 🔥pic.twitter.com/iGBHDNWDSU — Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2024 -
స్టొయినిస్ విధ్వంసం
చెన్నై: నాలుగు రోజుల క్రితం లక్నో వేదికగా చెన్నై సూపర్కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ల మధ్య జరిగిన మ్యాచ్కు ఇప్పుడు చెన్నైలో రీప్లేగా జరిగిన పోరులో లక్నోనే మళ్లీ ‘సూపర్’గా ఆడి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ శతకాన్ని నమోదు చేశాడు. ‘హిట్టర్’ శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్లు) అసాధారణ ఇన్నింగ్స్తో అజేయ సెంచరీ సాధించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. పూరన్తో నాలుగో వికెట్కు 70 పరుగులు, దీపక్ హుడాతో అబేధ్యమైన ఐదో వికెట్కు 55 పరుగులు జోడించిన స్టొయినిస్ లక్నోకు చిరస్మరణీయ విజయం అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్... రహానే (1), వన్డౌన్లో మిచెల్ (11), జడేజా (16) చెన్నై టాప్–4 బ్యాటర్లలో ముగ్గురి స్కోరిది! పవర్ ప్లేలో చెన్నై చేసిన స్కోరు 49/2 తక్కువే! ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ బౌండరీలతో పరుగుల వేగాన్ని అందుకున్నాడు. గైక్వాడ్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 11.3 ఓవర్లలో వందకు చేరింది. అదే ఓవర్లో జడేజా నిష్క్రమించడంతో వచ్చిన దూబే ఓ రకంగా శివతాండవమే చేశాడు. 15 ఓవర్లలో చెన్నై 135/3 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాత దూబే పవర్ప్లే మొదలైంది. భారీ సిక్సర్లతో స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది. 16వ ఓవర్లో దూబే హ్యాట్రిక్ సిక్స్లతో 19 పరుగులు, 18వ ఓవర్లో గైక్వాడ్ 6, 4, 4లతో 16 పరుగులు, 19వ ఓవర్లో మళ్లీ దూబే దంచేయడంతో 17 పరుగులు, ఆఖరి ఓవర్లో 15 పరుగులతో స్కోరు 200 పైచిలుకు చేరింది. చివరి 5 ఓవర్లలో దూబే వికెట్ మాత్రమే కోల్పోయిన చెన్నై 75 పరుగులు సాధించింది. గైక్వాడ్ 56 బంతుల్లో శతకాన్ని, దూబే 22 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు. బ్యాటింగ్ గేర్ మార్చి... కొండంత లక్ష్యం ముందున్న లక్నోకు ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్లు డికాక్ (0), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (19 బంతుల్లో 13) నిరాశపరిచారు. టాపార్డర్లో బ్యాటింగ్కు దిగిన స్టొయినిస్ ఒక్కడే గెలిపించేదాకా మెరిపించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తర్వాత నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్లు) జోరు పెంచగానే... పతిరణ మరుసటి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. స్టొయినిస్ 56 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీపక్ హుడా కూడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్కు పని చెప్పడంతో అనూహ్యంగా లక్నో లక్ష్యం వైపు పరుగు పెట్టింది. 18 బంతుల్లో 47 పరుగుల కష్టమైన సమీకరణం ఇద్దరి దూకుడుతో సులువైంది. 18, 19వ ఓవర్లలో 15 పరుగుల చొప్పున వచ్చాయి. 6 బంతుల్లో 17 పరుగుల్ని స్టొయినిస్ 6, 4, నోబాల్4, 4లతో ఇంకో మూడు బంతులు మిగిల్చి ముగించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రాహుల్ (బి) హెన్రి 1; రుతురాజ్ (నాటౌట్) 108; మిచెల్ (సి) హుడా (బి) యశ్ 11; జడేజా (సి) రాహుల్ (బి) మోసిన్ 16; దూబే (రనౌట్) 66; ధోని (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–4, 2–49, 3–101, 4–205. బౌలింగ్: హెన్రీ 4–0–28–1, మోసిన్ ఖాన్ 4–0–50–1, రవి బిష్ణోయ్ 2–0–19–0, యశ్ ఠాకూర్ 4–0–47–1, స్టొయినిస్ 4–0–49–0, కృనాల్ పాండ్యా 2–0–15–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) దీపక్ 0; రాహుల్ (సి) రుతురాజ్ (బి) ముస్తఫిజుర్ 16; స్టొయినిస్ (నాటౌట్) 124; పడిక్కల్ (బి) పతిరణ 13; పూరన్ (సి) శార్దుల్ (బి) పతిరణ 34; హుడా (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–88, 4–158. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–1, తుషార్ 3–0–34–0, ముస్తఫిజుర్ 3.3–0–51–1, శార్దుల్ 3–0–42–0, మొయిన్ అలీ 2–0–21–0, జడేజా 2–0–16–0, పతిరణ 4–0–35–2. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X గుజరాత్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
స్టోయినిస్కు మొండిచెయ్యి.. కొత్తగా నలుగురికి అవకాశం
2024-25 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన 23 మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (మార్చి 28) ప్రకటించింది. ఈ జాబితాలో లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మార్కస్ స్టోయినిస్, ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్కు చోటు దక్కలేదు. వీరితో పాటు ఆస్టన్ అగర్, మార్కస్ హ్యారిస్, మైకేల్ నెసర్, మ్యాట్ రెన్షాలకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ లభించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా నలుగురు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ కల్పించింది. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మ్యాట్ షార్ట్, ఆరోన్ హార్డీ కొత్తగా కాంట్రాక్ట్ పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బార్ట్లెట్ తొలిసారి కాంట్రాక్ట్ పొందగా.. మిగతా ముగ్గురు గతంలో వార్షిక కాంట్రాక్ట్ పొందారు. ఈ వార్షిక కాంట్రాక్ట్ టీ20 వరల్డ్కప్ అనంతరం అమల్లోకి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా 2024-25: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, జే రిచర్డ్సన్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
స్టోయినిస్ ఊచకోత.. న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన మెల్బోర్న్
బిగ్బాష్ లీగ్ 2023లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో మెల్బోర్న్ స్టార్స్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ మెల్బోర్న్ స్టార్స్ సూపర్ విక్టరీ సాధించారు. స్టోయినిస్ ఊచకోతతో (19 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెల్బోర్న్ న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. స్టోయినిస్ విధ్వంసం ధాటికి అడిలైడ్ నిర్ధేశించిన 206 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. క్రిస్ లిన్ విధ్వంసం.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్.. క్రిస్ లిన్ (42 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (32 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృస్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మెల్బోర్న్ కెప్టెన్ మ్యాక్స్వెల్ 2 వికెట్లతో రాణించాడు. Brilliant fireworks in Adelaide during BBL match on New Year's Eve.pic.twitter.com/2khkPbaSoO — Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023 పోటాపోటీగా విరుచుకుపడిన లారెన్స్, వెబ్స్టర్, స్టోయినిస్.. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్.. డేనియల్ లారెన్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వెబ్స్టర్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ (17 బంతుల్లో 28; 5 ఫోర్లు) పోటాపోటీగా రాణించడంతో 19 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అడిలైడ్ బౌలర్లలో కెమారూన్ బాయ్స్ (4-0-15-1) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. -
CWC 2023: టీమిండియాతో మ్యాచ్కు ముందు గాయపడ్డ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్
చెన్నై వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 8) జరుగనున్న వరల్డ్కప్ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్విమ్మంగ్ పూల్లో గాయపడ్డాడు. కళ్లు మూసుకుని స్విమ్మింగ్ చేసిన జంపా పూల్లో ఉన్న మెట్లను గుద్దుకుని గాయాలపాలయ్యాడు. జంపా ముఖంపై, ఇతర చోట్ల గాయాలైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే ఈ స్వల్ప గాయాల కారణంగా జంపా టీమిండియాతో మ్యాచ్కు దూరమయ్యే ప్రమాదమేమీ లేదని సీఏ క్లారిటీ ఇచ్చింది. జంపా 100 శాతం ఫిట్గా ఉన్నాడని తెలిపింది. కాగా, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఉపఖండపు స్విమ్మింగ్ పూల్లలో గాయపడటం ఇది కొత్తేమీ కాదు. గతేడాది ఆ జట్టు వికెట్కీపర్ అలెక్స్ క్యారీ కరాచీలోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్లో కిందపడిపోయాడు. ఆ సమయంలో క్యారీ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఘటన తర్వాత క్యారీ బ్యాటింగ్లో రెచ్చిపోయాడు. కెరీర్లో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆ తర్వాత ఆడిన 9 టెస్ట్ల్లో 71.83 సగటున పరుగులు చేశాడు. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. పూల్లో పడిపోవడం క్యారీకి, ఆసీస్కు కలిసొచ్చినట్లుందని అంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్తో మ్యాచ్లో జంపా ఆడటంపై ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ.. స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ హ్యామ్స్ట్రింగ్ గాయం మాత్రం ఆసీస్ను ప్రధానంగా వేధిస్తుంది. గాయాం నుంచి పూర్తిగా కోలుకోని స్టోయినిస్ భారత్తో మ్యాచ్కు అందుబాటులో ఉండటం అనుమానమేనని తెలుస్తుంది. మరోవైపు గాయాల బెడద టీమిండియాకు కూడా ప్రధాన సమస్యగా మారింది. అసలే శుభ్మన్ గిల్ అందుబాటులో లేక సతమతమవుతున్న భారత్కు హార్దిక్ పాండ్యా చేతి గాయం పెద్ద తలనొప్పిగా మారింది. గత వారం రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న గిల్ ఆసీస్తో ఇవాల్టి మ్యాచ్కు అందుబాటులో ఉండటం దాదాపుగా ఖరారు కాగా.. హార్దిక్ సైతం గిల్ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హార్దిక్ గాయంపై కంగారు పడాల్సిన అవసరం లేదని టీమిండియా మేనేజ్మెంట్ చెప్పుకొస్తుంది. ఏదిఏమైనప్నపటికీ.. గిల్, పాండ్యా ఇద్దరూ ఆసీస్తో మ్యాచ్కు దూరమైతే అది టీమిండియా విజయావకాశాలను భారీ దెబ్బతీస్తుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది. -
మాథ్యూ వేడ్ వీరవిహారం.. రసెల్, నరైన్ మెరుపులు వృధా
మేజర్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్లో శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్ ఫించ్ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్ రాయ్ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ కుమార్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్రైడర్స్ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, బిష్ణోయ్, ఆండర్సన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్రైడర్స్ లీగ్లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. -
ఎక్కువగా వాళ్ల మీదే ఆధారపడ్డారు.. ఫలితం అనుభవించారు.. వచ్చే సీజన్లోనైనా..
IPL 2023- LSG: విదేశీ ఆటగాళ్ల మీద అతిగా ఆధారపడటం లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచిందని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ అభిప్రాయడపడ్డాడు. అదే సమయంలో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా వంటి దేశీ ప్లేయర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోవడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్లో మరోసారి ఈ విషయం నిరూపితమైందన్నాడు. ఆ ముగ్గురే అద్భుతంగా ఐపీఎల్-2023లో లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్లలో 8 గెలిచిన లక్నో టాప్-3లో నిలిచి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా కృనాల్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు. అయితే, లక్నో గెలిచిన చాలా మ్యాచ్లలో విదేశీ ఆటగాళ్లు కైలీ మేయర్స్, నికోలసన్ పూరన్, మార్కస్ స్టొయినిస్లే కీలక పాత్ర పోషించారు. హుడా దారుణంగా మార్కస్ స్టొయినిస్ మొత్తంగా సీజన్లో 15 మ్యాచ్లలో 408 పరుగులతో లక్నో టాప్ స్కోరర్గా నిలిచాడు. 13 మ్యాచ్లు ఆడి 379 పరుగులు సాధించిన కైలీ మేయర్స్ అతడి తర్వాతి స్థానంలో ఉండగా.. పూరన్ 15 మ్యాచ్లలో 358 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. ఇలా లక్నో టాప్ స్కోరర్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. మరోవైపు.. తాత్కాలిక కెప్టెన్, ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా 188 పరుగులు చేయగా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన దీపక్ హుడా పూర్తిగా నిరాశపరిచాడు. 12 మ్యాచ్లలో అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 84. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో మేయర్స్ 18 పరుగులకే పెవిలియన్ చేరగా.. కృనాల్ 8 రన్స్ మాత్రమే చేశాడు. పాపం స్టొయినిస్ ఒంటరి పోరాటం చేస్తున్న స్టొయినిస్(27 బంతుల్లో 40 పరుగులు)ను అనవసరంగా రనౌట్కు బలైపోయేలా చేసిన దీపక్ హుడా(15) తాను కూడా రనౌట్ అయి కొంపముంచాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా లక్ష్య ఛేదనలో తడబడ్డ లక్నో 101 పరుగులకే చేతులెత్తేసింది. 81 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడి మరోసారి భంగపడింది. కనీసం వచ్చే సీజన్లో అయినా ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం క్రిక్బజ్ షోలో భారత మాజీ బౌలర్ మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘లక్నో ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల మీదే ఆధారపడింది. ఆ జట్టులో ఉన్న భారత ఆటగాళ్లలో ఒక్కరు కూడా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఎలిమినేటర్ మ్యాచ్లో స్టొయినిస్ ఒక్కడే కాసేపు పోరాడాడు. వచ్చే సీజన్లోనైనా లక్నో ఈ లోపాలు సరిదిద్దుకోవాలి. ఈ మ్యాచ్లో పూరన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. స్టొయినిస్ ఆడతాడు అనుకుంటే చెత్తగా రనౌట్ కావాల్సి వచ్చింది’’ అని లక్నో బ్యాటర్ల తీరును విమర్శించాడు. చదవండి: ఆర్సీబీలో నెట్బౌలర్గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. తిలక్ వర్మను టీజ్ చేసిన సూర్యకుమార్.. వీడియో వైరల్ 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Plenty of smiles and celebrations after a resounding victory in a crunch game 😃 The Mumbai Indians stay alive and how in #TATAIPL 2023 😎#Eliminator | #LSGvMI | #Qualifier2 | @mipaltan pic.twitter.com/qYPQ1XU1BI — IndianPremierLeague (@IPL) May 25, 2023 -
#DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ కథ ఎలిమినేటర్లో ముగిసింది. వరుసగా రెండోసారి ఎలిమినేటర్ గండం దాటడంలో లక్నో విఫలమైంది. ముంబై ఇండియన్స్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన లక్నో 101 పరుగులకే ఆలౌటై చేతులెత్తేసింది. ఫలితంగా భారీ ఓటమిని మూటగట్టుకొని ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అయితే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం. ఒక ఇన్నింగ్స్లో మూడు రనౌట్లు అయ్యాయంటే వారి బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యాదృశ్చికంగా ఈ మూడు రనౌట్లకు ప్రధాన కారణం దీపక్ హుడా. మొదటి రెండు రనౌట్లకు తాను కారణమయ్యాడు.. చివరికి కర్మ ఫలితం అన్నట్లుగా తానే రనౌట్కు బలవ్వాల్సి వచ్చింది. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ రనౌట్ కావడానికి ప్రధాన కారణం హుడానే. బంతిపై దృష్టి పెట్టి ఎదుట బ్యాటర్ ఎలా వస్తున్నాడో గమనించకపోగా అతన్నే గుద్దుకోవడంతో స్టోయినిస్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్ను తన తప్పిదంతో పాటు హుడా ముందుకు పరిగెత్తుకొచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడంతో రనౌట్ అయ్యాడు. ఇక ముచ్చటగా మూడోసారి దీపక్ హుడా రనౌట్ అయ్యాడు. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్లుగా లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయి భారీ నష్టం మిగిల్చాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా రనౌట్ చేసి హుడా పెద్ద తప్పు చేశాడు. ఈ చర్య దీపక్ హుడాను లక్నో జట్టుకు దూరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. Run out ka Mahual!! Deepak Hooda involved in three run outs!!#LSGvMI #LSGvsMI #IPLFinals #Eliminator #CricketTwitter pic.twitter.com/SNp6Hxiv2A — cricketinsideout (@Cricketinout) May 24, 2023 చదవండి: #Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా -
పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి దిశగా సాగుతుంది. అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్లు చేజార్చుకుంటున్న లక్నో వరుసగా రెండో సీజన్లోనూ ఎలిమినేటర్లోనే ఇంటిబాట పట్టేలా ఉంది. ఇక స్టోయినిస్ రనౌట్ అయిన తీరు అయితే లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో గ్రీన్ వేసిన ఐదో బంతిని స్టోయినిస్ డీప్ మిడ్వికెట్ మీదుగా ఆడాడు. రిస్క్ అయినా రెండు పరుగులు తీసే అవకాశం ఉండడంతో ఇద్దరు వేగంగానే పరిగెత్తారు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగుకు వస్తున్న యత్నంలో అటు దీపక్ హుడా.. ఇటు స్టోయినిస్ ఇద్దరు బంతిపై దృష్టి పెట్టి తమకు తెలియకుండానే ఒక లైన్లో పరిగెత్తి ఎదురుపడ్డారు. దీంతో మిడిల్పిచ్లోకి రాగానే ఇద్దరు ఒకరినొకరు గుద్దుకున్నారు. అప్పటికే బంతిని అందుకున్న టిమ్ డేవిడ్ నేరుగా ఇషాన్ కిషన్కు త్రో వేయడం.. వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ స్టోయినిస్ బంతిపై దృష్టి పెట్టకుండా పరుగు తీసి ఉంటే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడేమో. The collision sums up the game for LSG😵#MarcusStoinis #LSGvsMI #IPL2023 #Cricket pic.twitter.com/kMejyL51Jy — Wisden India (@WisdenIndia) May 24, 2023 When Cricketers turn into Actors 😂#LSGvMI #owned #fixing #runout #stoinis #MumbaiIndians #LucknowSuperGiants pic.twitter.com/wOmYcjNO9J — Sai Teja Kolagani (@SaitejaKolagani) May 24, 2023 చదవండి: ప్లేఆఫ్స్.. ముంబై ఇండియన్స్ పేరిట అరుదైన రికార్డు -
జోర్డాన్కు చుక్కలు.. ఐపీఎల్ కెరీర్లో అత్యధిక స్కోరు
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కృనాల్తో కలిసి స్టోయినిస్ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో కాస్త మెల్లిగా ఆడినప్పటికి ఒక్కసారి కుదురుకున్నాకా తన బ్యాటింగ్ పవర్ను చూపెట్టాడు. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న స్టోయినిస్ ఓవరాల్గా 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో ఆ ఫోర్లు, 8 సిక్సర్ల ఉన్నాయి. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న స్టోయినిస్ తర్వాతి 13 బంతుల్లోనే 39 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన క్రిస్ జోర్డాన్కు స్టోయినిస్ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో క్రిస్ జోర్డాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ వందకు పైగా ఓవర్లు వేసి అత్యధిక ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చిన రెండో బౌలర్గా క్రిస్ జోర్డాన్ నిలిచాడు. ఈ జాబితాలో స్టోయినిస్ 9.58 ఎకానమీ రేటుతో తొలి స్థానంలో, సామ్ కరన్ 9.48 రేటతో మూడు, ఆండ్రీ రసెల్ 9.26, శార్దూల్ ఠాకూర్ 9.13తో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక స్టోయినిస్ 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్గా నిలిచి తన ఐపీఎల్ కెరీర్లో అత్యధిక స్కోరును సాధించాడు. ఇంతకముందు స్టోయినిస్ అత్యధిక స్కోరు 72గా ఉంది. లక్నో తరపున స్టోయినిస్ది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. తొలి స్థానంలో క్వింటన్ డికాక్ 140 పరుగులు, కేఎల్ రాహుల్ 103* రెండో స్థానంలో ఉన్నాడు. Stoinis stepping up when #EveryGameMatters!💪 Can @MStoinis carry on to lead his team to a formidable total?#TATAIPL #IPLonJioCinema #IPL2023 | @LucknowIPL pic.twitter.com/d1q6aBWHSJ — JioCinema (@JioCinema) May 16, 2023 చదవండి: 'ఆడడమే వ్యర్థమనుకుంటే బ్యాటింగ్లో ప్రమోషన్' -
IPL 2023: పూరన్ ఊచకోత.. లక్నో గ్రాండ్ విక్టరీ.. సన్రైజర్స్ ఔట్
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ కథ ముగిసింది. లక్నోతో ఇవాళ జరిగిన మ్యాచ్లో ఓడటం ద్వారా సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో నాలుగు బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 16 ఓవర్ల వరకు తమ వైపు ఉన్న మ్యాచ్ను సన్రైజర్స్ బౌలర్ అభిషేక్ శర్మ పువ్వుల్లో పెట్టి ప్రత్యర్ధికి అప్పజెప్పాడు. ఆ ఓవర్లో అభిషేక్ 31 పరుగులు (స్టోయినిస్ 2 సిక్సర్లు, పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు) సమర్పించుకోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి, లక్నో వైపు మలుపు తిరిగింది. పూరన్ (13 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (45 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లలో వరుసగా 14, 10, 10, 6 పరుగులు రాబట్టి లక్నోను విజయతీరాలకు చేర్చారు. లక్నో గెలుపులో స్టోయినిస్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. సన్రైజర్స్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సీజన్లో సన్రైజర్స్ ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేని పరిస్థితి. మరోవైపు ఇవాళ జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ను మట్టికరిపించడంతో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. గుజరాత్ (16), సీఎస్కే (15), ముంబై (14) పాయింట్ల పట్టికలో టాప్ త్రీలో ఉన్నాయి. -
SRH VS LSG: పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పూరన్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు..!
లక్నో మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సన్రైజర్స్తో మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చీ రాగానే హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అప్పటిదాకా సన్రైజర్స్కు ఫేవర్గా ఉన్న మ్యాచ్ను పూరన్.. మూడు బంతుల్లో మలుపు తిప్పాడు. Pooran box-office 🍿pic.twitter.com/dBu4G2P2U7— CricTracker (@Cricketracker) May 13, 2023 వివరాల్లోకి వెళితే.. సన్రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ దశలో బరిలోకి దిగిన పూరన్.. అభిషేక్ శర్మ బౌలింగ్లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్ను లక్నోవైపు తిప్పాడు. అభిషేక్ శర్మ వేసిన ఈ ఓవర్లో మొత్తం 31 పరుగులు వచ్చాయి. పూరన్కు ముందు స్టోయినిస్ సైతం రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే స్టోయినిస్ అదే ఓవర్లో అభిషేక్ ఉచ్చులో చిక్కి ఔటయ్యాడు. 16 ఓవర్ తర్వాత సమీకరణలు 24 బంతుల్లో 38 పరుగులుగా మారాయి. చేతిలో మరో 7 వికెట్లు ఉండటంతో లక్నో గెలుపుపై ధీమాగా ఉంది. అంతకుముందు ఇదే సీజన్లో పూరన్ ఇదే తరహాలో రెచ్చిపోయి, చేదాటిపోయిన మ్యాచ్ను గెలిపించాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్లో పూరన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే, లక్నోతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. -
'నేను ఔటయ్యానా?'.. జడ్డూ దెబ్బకు షాక్లో స్టోయినిస్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, లక్నో సూపర్జెయింట్స్ మధ్య మ్యాచ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జడేజా బౌలింగ్ మాయాజాలానికి స్టోయినిస్ షాక్ అయ్యాడు. తాను ఔటయ్యానా అని సందేహం వ్యక్తం చేయడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ జడేజా వేశాడు. ఓవర్ ఐదో బంతిని జఫ్పా వేశాడు. జడ్డూ బంతిని లెగ్స్టంప్ దిశగా వేశాడు. స్టోయినిస్ ఫ్లిక్ చేద్దామని యత్నించాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్స్టంప్ను ఎగురగొట్టింది. దీంతో స్టోయినిస్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఈ విషయం తనకు తెలియక పక్కకు జరిగాడు. కానీ అప్పటికే ధోని, జడ్డూ వద్దకు పరిగెత్తుకెళ్లడం చూసి వెనక్కి తిరిగి చూడగా బెయిల్స్ కిందపడడంతో షాక్ తిన్నాడు. 'ఏంటి నేను ఔటయ్యానా?' అనే సందేహంతో అంపైర్వైపు చూడగా ఔట్ అని సిగ్నలిచ్చాడు. దీంతో స్టోయినిస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేశారు. ''ఔటయ్యానన్న విషయం కూడా తెలియలేదా.. జడ్డూ బౌలింగ్ మయాజాలానికి హ్యాట్సాఫ్'' అంటూ పేర్కొన్నారు. What a peach from Ravindra Jadeja. Marcus Stoinis' reaction says everything about it! pic.twitter.com/6xooN0BAM1 — Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2023 చదవండి: అనుభవం ముందు సిక్సర్ల తెవాటియా పనికిరాలేదు -
లక్నో సూపర్ జెయింట్స్కు బిగ్ షాక్.. స్టార్ ఆల్రౌండర్కు తీవ్ర గాయం
ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 257 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(72), కైల్ మైర్స్(54), పూరన్(45) విధ్వంసం సృష్టించారు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో యువ ఆటగాడు అథర్వ తైదే 66 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. లక్నో బౌలర్లలో యాష్ ఠాకూర్ నాలుగు వికెట్లు, నవీన్ ఉల్ హాక్ మూడు, బిష్ణోయ్ రెండు, స్టోయినిష్ ఒక వికెట్ సాధించారు. మార్కస్ స్టోయినిష్కు గాయం ఇక ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన లక్నో స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్.. దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వేసిన స్టోయినిష్.. ఆదిలోనే కెప్టెన్ శిఖర్ ధావన్ను ఓ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. అనంతరం మూడో ఓవర్ వేసిన స్టోయినిష్ బౌలింగ్లో అథర్వ తైదే స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్రమంలో ఎడమ చూపుడు వేలికి గాయమైంది. చదవండి: IPL 2023 LSG VS PBKS: ఆ నిర్ణయమే పంజాబ్ కొంపముంచిందట..! దీంతో మైదానంలో నొప్పితో అతడు విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో చికిత్స అందినించప్పటికీ ఫలితం లేకపోయింది. ఆఖరికి స్టోయినిష్ మైదానం వీడాడు. వెంటనే అతడిని స్కానింగ్ తరిలించారు. ఇదే విషయాన్ని స్టోయినిష్ కూడా తెలిపాడు. "ప్రస్తుతానికి బాగానే ఉంది. స్కానింగ్కు వెళ్లాను. ఆ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాము" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో స్టోయినిష్ పేర్కొన్నాడు. అయితే స్టోయినిష్ గాయం తీవ్రమైనదిగా తేలితే మాత్రం అతడు తర్వాతి మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: PBKS VS LSG: రెచ్చగొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు, ఆతర్వాత..! -
#KLRahul: త్వరగా ఔటయ్యి జట్టుకు మేలు చేశావు
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల రాహుల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. గుజరాత్తో జరిగిన గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసినప్పటికి నెమ్మదిగా ఆడి లక్నో ఓటమికి కారణమయిన రాహుల్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 12 పరుగులే చేసి ఔటైనప్పటికి రాహుల్ను విమర్శించడంతో పాటు కొంత మంది అభిమానులు మెచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. వాస్తవానికి తొలి బంతికే కేఎల్ రాహుల్ వెనుదిరగాల్సింది. అయితే తైదే క్యాచ్ అందుకోవడంలో విఫలం కావడంతో రాహుల్ బతికిపోయాడు. అయితే ఆ తర్వాత కాసేపటికే రబాడ బౌలింగ్లో షారుక్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo: IPL Twitter విమర్శించడం ఓకే.. మెచ్చుకోవడం ఏంటి? కేఎల్ రాహుల్ను మెచ్చుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. అతను త్వరగా వెనుదిరిగాడు కాబట్టే లక్నో.. పంజాబ్తో మ్యాచ్లో భారీ స్కోరు చేసింది. కైల్ మేయర్స్ ఇచ్చిన అద్బుత ఆరంభాన్ని స్టోయినిస్, బదోని, నికోలస్ పూరన్లు కంటిన్యూ చేశారు. ఒకరిని మించి మరొకరు బ్యాటింగ్ చేసి ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్ తొలిసారి భారీ స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఔట్ కాకపోయినా.. మరో ఆరేడు, ఓవర్లు బ్యాటింగ్ చేసేవాడు. అతని జిడ్డు బ్యాటింగ్ కారణంగా స్టోయినిస్, పూరన్ల అద్భుత ప్రదర్శన మిస్సయ్యేవాళ్లం. అందుకే రాహుల్ త్వరగా ఔటయ్యి ఒక రకంగా జట్టుకు మేలు చేశాడని అభిమానులు సోషల్మీడియాలో ట్రోల్ చేయడం విశేషం. KL Rahul dismissed for 12 runs in 9 balls. Advantage LSG now 🔥#PBKSvsLSG pic.twitter.com/yurToeXJ2t — Utsav 💔 (@utsav045) April 28, 2023 చదవండి: ఏమా విధ్వంసం.. ఇలా ఆడితే డికాక్కు కష్టమే! -
మిల్లర్ వికెట్తో వంద వికెట్ల క్లబ్లో స్టోయినిస్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మిల్లర్ వికెట్ తీయడం ద్వారా మార్కస్ స్టోయినిస్ టి20ల్లో వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 225 టి20 మ్యాచ్ల్లో స్టోయినిస్ ఈ ఘనత సాధించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్.. ఓవర్ ఆఖరి బంతికి మిల్లర్ భారీ షాట్కు యత్నించి దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వికెట్ను ఖాతాలో వేసుకున్న స్టోయినిస్ మ్యాచ్లో రెండు వికెట్లు తీశాడు. ఇక స్టోయినిస్ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. 60 వన్డేల్లో 1326 పరుగులతో పాటు 40 వికెట్లు, 51 టి20ల్లో 803 పరుగులతో పాటు 18 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ అంచనా తప్పయింది. ప్లాట్గా ఉన్న పిచ్పై పరుగులు రావడం కష్టమైంది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 66, సాహా 47 పరుగులు చేశాడు. -
ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్ను ఏలేవారేమో!
ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా టి20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్లకు పెట్టింది పేరైన స్టోయినిస్ ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో బిజీగా గడుపుతున్నాడు. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఇవాళ ఎస్ఆర్హెచ్తో లక్నో సూపర్ జెయింట్స్ అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు సన్నద్ధమవుతున్న స్టోయినిస్ ఐపీఎల్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రీడారంగానికి సంబంధించి నీకిష్టమైన ముగ్గురు రిటైర్డ్ ఆటగాళ్ల పేర్లు చెప్పమని అడిగారు. దీనికి స్టోయినిస్.. మాజీ బాస్కెట్బాల్ దిగ్గజం మైకెల జోర్డాన్, గోల్ఫ్ దిగ్గజం టైగర్వుడ్స్, బాక్సింగ్ దిగ్గజం మహమూద్ అలీ పేర్లను ఏంచుకున్నాడు. ఒకవేళ ఈ ముగ్గురు ఆయా రంగాల్లో కాకుండా క్రికెట్లో ఆడుంటే ఈ ఆటను కూడా ఏలేవారేమో అని పేర్కొన్నాడు. ఇక తాను, ఆస్టన్ అగర్ యూఎఫ్సీకి పెద్ద అభిమానులమని.. ఎప్పుడు మ్యాచ్లు జరిగినా తప్పుకుండా చూస్తామన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన 2021 టి20 ప్రపంచకప్ సందర్భంగా గోల్ప్ ఆడడానికి పొవెళ్లాం. అక్కడ యూఎఫ్సీ ఛాంపియన్స్గా ఫోజు ఇవ్వడం ఇప్పటికి మరిచిపోలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్టోయినిస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక దాంట్లో గెలిచి మరొక దాంట్లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 50 పరుగుల తేడాతో గెలిచిన లక్నో.. సీఎస్కే చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. The Christian Bale connection to his social-media post 🤔 3⃣ sportspersons he wished would have played cricket 👌 Who is on his speed dial 📱@MStoinis 𝙐𝙉𝙋𝙇𝙐𝙂𝙂𝙀𝘿 ahead of @LucknowIPL's home game against #SRH tonight 😎 - By @ameyatilak #TATAIPL | #LSGvSRH pic.twitter.com/6lLOpFbkb8 — IndianPremierLeague (@IPL) April 7, 2023 చదవండి: IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది' -
అభిమానులను పిచ్చోళ్లను చేశారు
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లికి కోపమెక్కువన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అగ్రెసివ్నెస్తో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాడు. అయితే అందులో చాలా భాగం ఫన్నీవేలోనే కోహ్లిని చూశాం. మ్యాచ్ జరిగేటప్పుడు తాను సీరియస్గా ఉండలేనని అందుకే కాస్త హ్యూమర్ జోడించి ఆడుతానంటూ గతంలో చాలాసార్లు పేర్కొన్నాడు. తాజాగా బుధవారం ఆసీసీతో జరిగిన మూడో వన్డేలో కోహ్లి చర్య ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లి, స్టోయినిస్ల మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పిచ్ స్లో వికెట్కు అనుకూలిస్తుండడంతో స్టార్క్తో కలిసి మార్కస్ స్టోయినిస్ బంతిని పంచుకున్నాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్లో కేఎల్ రాహుల్, కోహ్లిలు క్రీజులో ఉన్నారు. బంతి వేసిన తర్వాత స్టోయినిస్ కోహ్లిని తన భుజాలతో నెట్టాడు. ఇది గమనించిన కోహ్లి స్టోయినిస్కు అడ్డంగా వచ్చి ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. కేవలం కళ్లతోనే ఒకరినొకరు కాసేపు చూసుకున్నారు. ఆ తర్వాత స్టోయినిస్ చిన్నగా నవ్వడంతో అసలు విషయం అర్థమైంది. నిజానికి ఇద్దరి మధ్య గొడవ ఫన్నీగానే జరిగింది. ఇది తెలియని అభిమానులు అరె నిజంగానే ఇద్దరికి గొడవైనట్లుందే అన్నట్లుగా చూశారు. కానీ చివరికి కోహ్లి, స్టోయినిస్లు కలిసి అభిమానులను పిచ్చోళ్లను చేశారు. ఇక మ్యాచ్లో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. 72 బంతుల్లో 54 పరుగులు చేసిన కోహ్లి వెనుదిరగ్గానే టీమిండియా ఓటమి దిశగా పయనించింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(40 పరుగులు), జడేజాలు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో టీమిండియా ఓటమి ఖరారైపోయింది. మూడో వన్డేలో విజయంతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. Marcus Stoinis and Virat Kohli 😹👌🤙 !! #ViratKohli𓃵 #stoinis#INDvsAUS #CricketTwitter pic.twitter.com/tqUFT9exNl — Diptiman Yadav (@Diptiman_yadav9) March 22, 2023 Virat Kohli and Marcus Stoinis friendly face-off. pic.twitter.com/I6RcwM1vXK — Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2023 చదవండి: సొంతగడ్డపై బెబ్బులే.. కానీ ఆసీస్కు మాత్రం దాసోహం ఇలా అయితే వరల్డ్కప్ కొట్టేది ఎలా? -
ఆఖరి బంతికి సిక్సర్ కావాలి, స్ట్రయిక్లో స్టోయినిస్.. ఏం జరిగిందంటే..?
బిగ్బాష్ లీగ్ 2022-23 సీజన్లో మరో రసవత్తర సమరం జరిగింది. గబ్బా వేదికగా బ్రిస్బేన్ హీట్-మెల్బోర్న్ స్టార్స్ మధ్య ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. మెల్బోర్న్ గెలవాలంటే ఆఖరి బంతికి సిక్సర్ బాదాల్సి ఉండింది. స్ట్రయిక్లో మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. గతంలో చాలా సందర్భాల్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించిన స్టోయినిస్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన లో ఫుల్ టాస్ బంతిని స్టోయినిస్ భారీ షాట్గా మలిచేందుకు విఫలయత్నం చేశాడు. మెల్బోర్న్ కేవలం ఒక్క పరుగుతో మాత్రమే సరిపెట్టుకుని, 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు ఓవర్లో (ఇన్నింగ్స్ 19వ ఓవర్) 21 పరుగులు పిండుకున్న స్టోయినిస్ (23 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), హిల్టన్ కార్ట్రైట్ (24 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు) జోడీ ఆఖరి ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. సామ్ హెయిన్ (41 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), పియర్సన్ (43 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మెల్బోర్న్ బౌలర్లలో లూక్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్ నైల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో మెల్బోర్న్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ వారికి విజయం దక్కలేదు. జో క్లార్క్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు), థామస్ రోజర్స్ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), క్యాంప్బెల్ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు), స్టోయినిస్ (36 నాటౌట్), హిల్టన్ (33 నాటౌట్) తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో మెల్బోర్న్ 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. బ్రిస్బేన్ బౌలర్లలో స్వెప్సన్ 2, జేమ్స్ బాజ్లీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో బ్రిస్బేన్ 13 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో (ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (13 పాయింట్లు) ఎగబాకింది. -
స్టొయినిస్ విధ్వంసం.. లంకపై ఆసీస్ ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 25) జరిగిన సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీపావళి తర్వాతి రోజు స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ రాకెట్ ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ను ఒంటిచేత్తో గెలిపించాడు. స్టొయినిస్ విధ్వంసకర ఇన్నింగ్స్తో పెర్త్ మైదానం దద్దరిల్లింది. స్టొయినిస్ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయి కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు. లంక నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్టొయినిస్ మెరుపు హాఫ్ సెంచరీతో (18 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) లంక బౌలర్లను చీల్చిచెండాడు. ఫలితంగా ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పథుమ్ నిస్సంక (45 బంతుల్లో 40; 2 ఫోర్లు), అసలంక (25 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వా (23 బంతుల్లో 26; 3 ఫోర్లు), చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు హేజిల్వుడ్, కమిన్స్, స్టార్క్, అగర్, మ్యాక్స్వెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు తలో వికెట్ పడగొట్టడంతో శ్రీలంక నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ (11), మిచెల్ మార్ష్ (17) వికెట్లు కోల్పోయి తడబడినప్పటికీ.. కెప్టెన్ ఫించ్ (42 బంతుల్లో 31 నాటౌట్; సిక్స్), మ్యాక్స్వెల్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 13 ఓవర్లో మ్యాక్సీ ఔట్ కావడంతో బరిలోకి దిగిన స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. స్టొయినిస్ విధ్వంసం ధాటికి ఆసీస్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: రాణించిన బౌలర్లు.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంక -
వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఆస్ట్రేలియా మరో కీలక పోరుకు సిద్దమైంది. స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా తలపడనుంది. అయితే ఈ సిరీస్కు గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ దూరమయ్యాడు. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 శుక్రవారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో అయితే స్టోయినిస్ మాత్రం గోల్డ్ కోస్ట్కు ఆస్ట్రేలియా జట్టుతో వెళ్లకుండా పెర్త్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. పెర్త్ వేదికగా ఆదివారం(ఆక్టోబర్ 9)న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్కు స్టోయినిస్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీమిండియాతో టీ20 సిరీస్కు దూరమైన ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్.. విండీస్తో సిరీస్కు జట్టులోకి వచ్చారు. ఇక స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. ఈ మెగా ఈవెంట్లో ఆసీస్ తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్22న న్యూజిలాండ్తో తలపడనుంది. వెస్టిండీస్ సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాత్త్ వేడ్ , డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. చదవండి: రోహిత్, కోహ్లి, సూర్య కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే! -
Ind Vs Aus: భారత్తో సిరీస్.. ఆసీస్కు భారీ షాక్! ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్!
Australia tour of India, 2022- Ind Vs Aus T20 Series: టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. కాగా రోహిత్ సేనతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు కంగారూ జట్టు భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే మంగళవారం(సెప్టెంబరు 20)న ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టులో మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్ చోటు దక్కించుకున్నారు. ఈ ముగ్గురి స్థానాలు భర్తీ చేసేది వీళ్లే! అయితే, ఈ ముగ్గురిని గాయాల బెడద వేధిస్తోంది. స్టార్క్ ఇప్పుడిప్పుడే మోకాలి నొప్పి నుంచి కోలుకుంటుండగా.. మార్ష్ పాదానికి గాయమైంది. ఇక స్టొయినిస్ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. ఇక వీరి స్థానాలను ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎలిస్, ఆల్రౌండర్లు డేనియల్ సామ్స్, సీన్ అబాట్లతో భర్తీ చేసినట్లు సమాచారం. కాగా అక్టోబరు 16 నుంచి స్వదేశంలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్కప్-2022 టోర్నీలో కూడా తాము భారత్తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనున్నట్లు సీఏ వెల్లడించింది. డేవిడ్ వార్నర్(ఈ ఓపెనర్కు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో అతడి స్థానంలో కామెరూన్ గ్రీన్) మినహా అందరూ టీమిండియాతో సిరీస్ ఆడతారని పేర్కొంది. అయితే, ప్రస్తుతం స్టార్క్, స్టొయినిస్, మార్ష్ గాయాల కారణంగా దూరమయ్యారు. ప్రపంచకప్ ఆరంభం నాటికి వీరు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. టీమిండియాతో టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా (తాజా) జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడం జంపా. చదవండి: Ind Vs Pak: సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే! సూర్యకుమార్లో మనకు తెలియని రొమాంటిక్ యాంగిల్.. -
కెరీర్కు టర్నింగ్ పాయింట్.. ఆ ఒక్క సెంచరీ వెనుక విషాద కథ
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. టి20 క్రికెట్లో విధ్వంసకర ఆటకు పెట్టింది పేరు. ఇటీవలే ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్కు ఆడిన స్టోయినిస్ 11 మ్యాచ్ల్లో 156 పరుగులు మాత్రమే చేసి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే కొన్ని కీలక ఇన్నింగ్స్లతో మాత్రం మెరిశాడు. ఇక ఆస్ట్రేలియా తరపున 48 మ్యాచ్ల్లో 1200 పరుగులు సాధించాడు. స్టోయినిస్ ఖాతాలో ఆరు హాఫ్ సెంచరీలు.. ఒక సెంచరీ ఉన్నాయి. ఆరోజు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 286 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్లో పూర్తిగా తడబడింది. 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అప్పుడు మార్కస్ స్టోయినిస్ క్రీజులోకి వచ్చాడు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనవేళ లోయర్ ఆర్డర్లో జేమ్స్ ఫాల్కనర్(25), పాట్ కమిన్స్(36)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి జట్టును విజయం వైపు నడిపించాడు. ఓవరాల్గా 117 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 146 పరుగులు నాటౌట్గా నిలిచాడు. అతని దాటికి ఆసీస్ విజయానికి చేరువగా వచ్చినప్పటికి ఆరు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఒక రకంగా ఆసీస్ ఓటమి పాలైనప్పటికి స్టోయినిస్కు ఆ సెంచరీ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తాజాగా ఆ సెంచరీ వెనుక ఉన్న ఒక విషాద కథను స్టోయినిస్ తాజాగా రివీల్ చేశాడు. స్టోయినిస్ సెంచరీ చేసే సమయానికి అతని తండ్రి ఆసుపత్రి బెడ్పై ఉన్నాడు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న తండ్రి కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు. ''నేను వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన రోజున నా తండ్రి ఆసుపత్రిలో కీమో థెరపీ చేయించుకుంటున్నాడు. నేను సెంచరీ చేశానన్న విషయం తెలుసుకున్న నా తండ్రి అక్కడున్న అన్ని టీవీలను ఆన్ చేశాడు. కానీ ఏ ఒక్క దాంట్లోనూ నేను ఆడుతున్న మ్యాచ్ కనిపించలేదట. దీంతో అక్కడున్న నర్సును పిలిచి.. నా కొడుకు ఇవాళ సెంచరీ సాధించాడు.. దానిని నా కళ్లతో చూడాలి అని కోరాడు. వెంటనే ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి నా తండ్రి కోసం సదరు చానెల్ను పెట్టారు. ఆ క్షణంలో నా సెంచరీని టీవీలో కళ్లారా చూసిన నాన్న కళ్లను చమర్చడం నర్సు ఆ తర్వాత చెప్పుకొచ్చింది. నా జీవితంలో అది ఎంతో సంతోష క్షణం. ఆ తర్వాత కొన్నాళ్లకే నాన్న క్యాన్సర్ మహమ్మారితో కన్నుమూశారు. నా కెరీర్కు టర్నింగ్ పాయింట్ అయిన సెంచరీ ఆ తర్వాత ఒక విషాదాన్ని తీసుకువస్తుందని ఊహించలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Suved Parkar Ranji Debut: రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర -
అంపైర్ వైడ్ ఇచ్చుంటే లక్నో మ్యాచ్ గెలిచేదేమో!
ఐపీఎల్ 2022లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే స్టోయినిస్ క్రీజులో ఉన్నంతవరకు మ్యాచ్ లక్నోవైపే మొగ్గు చూపింది. ఎందుకంటే స్టోయినిస్ క్రీజులో ఉన్నప్పడు లక్నో విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు కావాలి. స్టోయినిస్తో పాటు జాసన్ హోల్డర్ క్రీజులో ఉండడంతో విజయంపై ఆశలు బలంగా ఉన్నాయి. ఈ దశలో ఒక అంపైర్ ఒక బంతిని వైడ్ బాల్గా పరిగణించకపోవడంతో స్టోయినిస్ తన ఫోకస్ను కోల్పోయి వికెట్ పోగొట్టుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ జోష్ హాజిల్వుడ్ వేశాడు. హాజిల్వుడ్ వేసిన ఓవర్ తొలి బంతి ఆఫ్స్టంప్కు దూరంగా వెళ్లింది. అయితే అంపైర్ మాత్రం వైడ్ ఇవ్వలేదు. దీంతో వైడ్ ఇవ్వకపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్టోయినిస్ అంపైర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఫోకస్ కోల్పోయిన స్టోయినిస్ హాజిల్వుడ్ వేసిన తర్వాతి బంతికే క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో కోపంతో ఊగిపోయిన స్టోయినిస్ అంపైర్ను సీరియస్గా చూస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అయితే స్టోయినిస్ విషయంలో అంపైర్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో తప్పుబట్టారు. బంతి అంత క్లియర్ ఆఫ్స్టంప్కు దూరంగా వెళ్తుంటే వైడ్ ఇవ్వకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''ఒకవేళ అంపైర్ వైడ్ ఇచ్చుంటే లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ గెలిచేదేమో.. ఎవరికి తెలుసు'' అంటూ కామెంట్ చేశారు. అయితే మరికొందరు మాత్రం లక్నో మేనేజ్మెంట్ను తప్పుబట్టారు. చేజింగ్ సమయంలో దాటిగా ఆడే స్టోయినిస్ లాంటి బ్యాటర్ను లేటుగా పంపించడమేంటని చురకలు అంటించారు. చదవండి: Kohli-Wasim Jaffer: కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ IPL 2022: చహల్ హ్యాట్రిక్.. ఆ పోజుతో ప్రతీకారం తీర్చుకున్నాడా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Marcus Stoinis adding some extra colorful vocabulary to this night of IPL action. pic.twitter.com/vGf7d2oIFp — Peter Della Penna (@PeterDellaPenna) April 19, 2022 -
సిక్స్ కొట్టగానే నవ్వింది.. ఆమె ఎవరి గర్ల్ఫ్రెండ్ తెలుసా?
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ గర్ల్ఫ్రెండ్ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పటికే కేఎల్ రాహుల్ సెంచరీ దిశగా నడుస్తున్నాడు. అయితే మనీష్ పాండే 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ మురుగన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. స్టోయినిస్ కొట్టిన లాంగాన్ సిక్సర్ 104 మీటర్ల ఎత్తులో వెళ్లింది. ఆ తర్వాత తన ప్రేయసి కూర్చున్న వైపు తిరిగిన స్టోయినిస్ చిరునవ్వుతో థంబ్స్ అప్ చేస్తూ.. ''ఈ సిక్సర్ నీకే అంకితం'' అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. ఇది చూసిన స్టోయినిస్ గర్ల్ఫ్రెండ్ ఒక క్యూట్ స్మైల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Courtesy: IPL Twitter ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సీజన్లో తొలి సెంచరీతో మెరిశాడు. ఐపీఎల్ కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న రాహుల్.. కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు.ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి తర్వాత కెప్టెన్గా రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు. What a shot!! pic.twitter.com/b4XWOKTqcY — Cricketupdates (@Cricupdates2022) April 16, 2022 -
IPL 2022: స్టార్ల ఎంట్రీ.. అమీతుమీ తేల్చుకోనున్న లక్నో, ఢిల్లీ
ఐపీఎల్ 2022 సీజన్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్, కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 7) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్ల మధ్య ఈ ఆసక్తికర సమరం రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది. డీసీ తరఫున డేవిడ్ వార్నర్, అన్రిచ్ నోర్జే, ఎల్ఎస్జీ నుంచి మార్కస్ స్టోయినిస్ ఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ మ్యాచ్ మరింత రంజుగా మారనుంది. ప్రస్తుత సీజన్లో లక్నో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి జోరుమీదుండగా.. డీసీ ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించినప్పటికీ గెలుపుపై ధీమాగా ఉంది. వార్నర్, నోర్జే లాంటి స్టార్ల రాకతో పంత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తుండగా..ఆల్ రౌండర్ స్టోయినిస్ ఎంట్రీతో లక్నో సైతం ఏమాత్రం తగ్గేదేలేదంటుంది. లీగ్లో ఇరు జట్లు ఆడిన చివరి మ్యాచ్ల విషయానికొస్తే.. గత మ్యాచ్లో లక్నో సన్రైజర్స్పై అద్భుత విజయాన్నందుకోగా.. ఢిల్లీ గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. ఇక ఇరు జట్లలో మార్పులు చేర్పుల అంశాన్ని పరిశీలిస్తే.. ఈ మ్యాచ్ కోసం డీసీ జట్టులో మూడు మార్పులు జరిగే అవకాశం ఉంది. వార్నర్ రాకతో గత రెండు మ్యాచ్ల్లో ఓపెనర్గా బరిలోకి దిగిన టీమ్ సీఫెర్ట్పై వేటు పడనుండగా, ఖలీల్ అహ్మద్ స్థానంలో నోర్జే, గత రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన మన్దీప్ సింగ్ స్థానంలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్లకు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు లక్నో కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్ ఎంట్రీతో ఆండ్రూ టై బెంచ్కే పరిమితం కానున్నాడు. ఈ మార్పు మినహా ఎస్ఆర్హెచ్తో బరిలోకి దిగిన జట్టునే ఎల్ఎస్జీ యధాతథంగా కొనసాగించనుంది. బలాబలాల విషయానికొస్తే.. స్టార్ల రాకతో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. తుది జట్లు (అంచనా): లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), ఎవిన్ లూయిస్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, అంకిత్ రాజ్పుత్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, కేఎస్ భరత్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, రోవమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ చదవండి: ఢిల్లీ జట్టుకు గుడ్న్యూస్.. యార్కర్ల కింగ్ రానున్నాడు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: అందుకే గరుడ పక్షి, త్రివర్ణాలు, నీలం రంగు బ్యాట్: లక్నో
ఐపీఎల్-2022 సీజన్తో లక్నో ఫ్రాంఛైజీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆర్పీ సంజీవ్ గోయెంక గ్రూపు నేతృత్వంలోని ఈ ఫ్రాంఛైజీ తమ జట్టుకు లక్నో సూపర్ జెయింట్స్ అనే పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేఎల్ రాహుల్, రవి బిష్ణోయి, మార్కస్ స్టొయినిస్లను ఎంపిక చేసుకున్న ఈ కొత్త టీమ్.. సోమవారం తమ లోగోను ఆవిష్కరించింది. జాతీయ జెండా రంగులద్దిన ‘గరుడ’ పక్షి రెండు రెక్కల మధ్య బ్యాట్ బాల్తో ఈ లోగోను తీర్చిదిద్దారు. అదే విధంగా ఈ లోగోను ఎంపిక చేయడం వెనుక కారణాన్ని కూడా లక్నో ఫ్రాంఛైజీ వెల్లడించింది. ‘‘గరుడ- రక్షించగల శక్తి ఉన్నది.. వేగంగా కదిలే గుణం కలది.. గరుడ సర్వాంతర్యామి. భారత దేశంలోని ప్రతి సంస్కృతి, ఉప సంస్కతుల్లోనూ ఇది భాగం. ఇక త్రివర్ణాలతో కూడిన రెక్కలు.. లక్నో సూపర్ జెయింట్స్ పాన్ ఇండియా అప్పీల్కు ప్రతీక. పక్షి శరీరం, నీలం రంగుతో కూడిన బ్యాట్... క్రికెట్కు ప్రతీక. ఎరుపు రంగు బంతి, ఆరెంజ్ సీమ్.. జై తిలక్ను ప్రతిబింబిస్తుంది. పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు సాగే లక్నో సూపర్ జెయింట్స్ ప్రతి భారతీయుడికి చెందినది.. జాతిని ఏకం చేస్తుంది’’ అని పేర్కొంది. కాగా లక్నో ఫ్రాంఛైజీ... టీమిండియా వైస్ కెప్టెన్ రాహుల్కు 17 కోట్లు, ఆసీస్ ఆటగాడు స్టోయినిస్కి రూ.9.2 కోట్లు, అన్క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్, భారత అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ రవి బిష్ణోయ్కి 4 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ -
IPL 2022: అందుకే స్టొయినిస్ను ఎంపిక చేశారు: గంభీర్
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మెగా వేలం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆక్షన్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏకంగా 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2022 సీజన్తో ఎంట్రీ ఇవ్వనున్న లక్నో, అహ్మదాబాద్ ఇప్పటికే ముగ్గురి చొప్పున ఆటగాళ్లను ఎంచుకున్నాయి. గోయెంకా గ్రూపు నేతృత్వంలోని లక్నో జట్టు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రవి బిష్ణోయి, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ను ఎంపిక చేసుకుంది. ఈ నేపథ్యంలో లక్నో మెంటార్ గౌతం గంభీర్ మాట్లాడుతూ... స్టొయినిస్ను సెలక్ట్ చేసుకోవడం వెనుక కారణాలు వెల్లడించాడు. ‘‘బెన్స్టోక్స్.... తర్వాత స్టొయినిస్ను కంప్లీట్ ప్యాకేజ్గా చెప్పవచ్చు. తను బ్యాటింగ్ చేస్తాడు.. బౌలింగ్ చేస్తాడు.. అత్యుత్తమ ఫీల్డర్లలో తనూ ఒకడు. అతడి రాక నిజంగా జట్టుకు అదనపు బలం. టీ20 ప్రపంచకప్లో అతడి ఆటను చూశాం కదా. ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా స్టొయినిస్కు ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా స్టొయినిస్ ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. గతంలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ఈ ఆల్రౌండర్... టీ20 ప్రపంచకప్-2021 గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. కాగా రాహుల్కు 17 కోట్లు, స్టోయినిస్కి రూ.9.2 కోట్లు, అన్క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్, భారత అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ రవి బిష్ణోయ్కి 4 కోట్లు చెల్లించేందుకు లక్నో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇమ్రాన్ తాహిర్ విధ్వంసం.. 5 సిక్స్లు,3 ఫోర్లలతో.. .@TeamLucknowIPL have picked their three players 🙌🙌🙌 pic.twitter.com/IgJG5cPshJ — IndianPremierLeague (@IPL) January 22, 2022 -
IPL 2022: కేఎల్ రాహుల్కు జాక్పాట్.. లీగ్ చరిత్రలోనే అత్యధిక రెమ్యూనరేషన్
KL Rahul Signed For 17 Crores By Lucknow Franchise: టీమిండియా స్టార్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ జాక్పాట్ కొట్టేశాడు. ఐపీఎల్ కొత్త జట్టైన లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్సీ పగ్గాలతో పాటు భారీ రెమ్యూనరేషన్ను పొందాడు. ఈ క్రమంలో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. 2018 ఐపీఎల్ వేలానికి ముందు బెంగళూరు జట్టు కోహ్లికి 17 కోట్లు ఆఫర్ చేయగా.. తాజాగా కేఎల్ రాహుల్కు సైతం లక్నో ఫ్రాంచైజీ అంతే మొత్తం చెల్లించాలని నిర్ణయించింది. రాహుల్తో పాటు ఇదివరకే ఎంచుకున్న మరో ఇద్దరు ఆటగాళ్లకు కూడా లక్నో ఫ్రాంచైజీ భారీ ధరనే ఆఫర్ చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్కి రూ.9.2 కోట్లు, అన్క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్, భారత అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ రవి బిష్ణోయ్కి 4 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉంటే, మరో కొత్త ఐపీఎల్ జట్టైన అహ్మదాబాద్.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ హార్ధిక్ పాండ్యాకి 15 కోట్లు చెల్లించి, కెప్టెన్గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అలాగే అఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్కి కూడా అదే మొత్తం(15 కోట్లు) చెల్లించేందుకు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ డీల్ చేసుకుంది. ఆశ్చర్యకరంగా టీమిండియా టెస్ట్ ఓపెనర్ శుభ్మన్ గిల్పై కూడా అహ్మదాబాద్ భారీ మొత్తం వెచ్చించింది. అతన్ని ఏకంగా 8 కోట్లకు కొనుగోలు చేసింది. చదవండి: దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు.. 21 ఏళ్ల తర్వాత! -
IPL 2022: ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకున్న లక్నో.. రాహుల్కు ఎన్ని కోట్లంటే!
ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొత్త ఫ్రాంఛైజీ లక్నో బీసీసీఐ నిబంధనలను అనుసరించి తమ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. టీమిండియా వన్డే జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్, భారత లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయిని తమ జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురి కోసం లక్నో ఫ్రాంఛైజీ 30 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక రాహుల్ను మొదటి ఆప్షన్గా ఎంచుకున్న యాజమాన్యం అతడి కోసం 15 కోట్ల రూపాయలు వెచ్చించగా... స్టొయినిస్ను 11 కోట్లు, రవి బిష్ణోయిని 4 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పర్సులో 60 కోట్ల రూపాయలతో లక్నో మెగా వేలంలో పాల్గొననుంది. కాగా రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా వెంచర్స్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో ఏకంగా రూ.7,090 కోట్లు వెచ్చించి లక్నో ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్-2021 సీజన్లో కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాహుల్ ఆ టీమ్తో కొనసాగేందుకు ఇష్టపడక అందరికీ అందుబాటులోకి వచ్చాడు. ఇప్పుడు భారీ మొత్తంతో లక్నోకు సారథ్యం వహించేందుకు రాహుల్కు అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా... ఇప్పటి వరకు పంజాబ్, బెంగళూరు, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టొయినిస్కు అతని తాజా ఫామ్ ప్రకారం చూస్తే భారీ మొత్తం దక్కినట్లే! ఇక భారత అండర్– 19 తరఫున సత్తా చాటడంతో పాటు రెండు ఐపీ ఎల్ సీజన్లలో కేవలం 6.95 ఎకానమీతో 24 వికెట్లు తీసిన బిష్ణోయ్కు ‘అన్క్యాప్డ్’ కారణంగా తక్కువ మొత్తానికే లక్నో దక్కించుకుంది. చదవండి: IPL 2022: ధోని ‘గుడ్ బై’.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా రవీంద్ర జడేజా!? రాహుల్ ఆడిన 13 ఇన్నింగ్స్లో 626 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా మరో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పాండ్యా, రషీద్ కోసం రూ. 15 కోట్లు.. గిల్కు రూ. 7 కోట్లు చెల్లించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం-2022 నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చదవండి: IPL: అతడికి 16 కోట్లు.. అయ్యర్కు ఇప్పటి వరకు 35 కోట్లు.. ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్ పోటీ... రికార్డు బద్దలవడం ఖాయం! చదవండి: IPL Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే! -
T20 WC Winner Australia: షూలో డ్రింక్స్ తాగుతూ సంబరాలు.. అరె ఏంట్రా ఇది!
T20 WC 2021 Winner Australia: Players Drink From Shoes Celebrations Video Viral: ఆస్ట్రేలియాకు మొట్టమొదటి టీ20 వరల్డ్కప్ అందించిన ఆరోన్ ఫించ్ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. నవంబరు 14న న్యూజిలాండ్తో మ్యాచ్లో అద్భుత విజయం అందుకున్న ఆసీస్ జట్టు చాంపియన్గా అవతరించిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కంగారూలు.. కివీస్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టును గెలుపుబాట పట్టించారు. ఇక చారిత్రాత్మక, చిరస్మరణీయ విజయం సాధించిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూంలో వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంది ఫించ్ టీమ్. బూట్ల(షూ)లో డ్రింక్స్ నింపుకుని వాటిని తాగుతూ ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. సెమీస్ హీరోలు మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్ షూ విప్పేసి అందులో డ్రింక్స్ నింపుకుని తాగుతూ ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘అరె ఏంట్రా ఇది.. షూతో డ్రింక్స్ తాగటం... మీరు సూపర్.. వరల్డ్కప్ గెలిచారు కదా... మీ ఇష్టం కానీయండి.. కానీయండి’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా షూలో డ్రింక్స్ తాగటం ఆస్ట్రేలియన్ల సంప్రదాయాల్లో ఒకటి. అదృష్టం వరించినప్పుడు సంతోషంతో లేదంటే.. ఏవైనా కఠిన శిక్షల బారిన పడినపుడు ఇలా చేయడం వారికి అలవాటు. చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే.. How's your Monday going? 😅#T20WorldCup pic.twitter.com/Fdaf0rxUiV — ICC (@ICC) November 15, 2021 -
Adam Zampa: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ...
T20 World Cup 2021- Adam Zampa Says He Has Always Been Underestimated: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడం జంపా. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆసీస్ను సెమీ ఫైనల్ చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అంతేకాదు పాకిస్తాన్తో కీలకమైన సెమీ ఫైనల్లో ఒక వికెట్ తీసి ఆసీస్ తుదిపోరుకు అర్హత సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నవంబరు 14న న్యూజిలాండ్తో ఫైనల్లో ఆడేందుకు ఆడం జంపా సన్నద్ధమవుతున్నాడు. అయితే, ఈ మెగా ఈవెంట్లో ఆస్ట్రేలియాకు కీలకంగా మారి సత్తా చాటుతున్న ఆడం జంపా.. తనను ఎల్లప్పుడూ తక్కువగానే అంచనా వేస్తానని అంటున్నాడు. వరల్డ్కప్ ఆరంభానికి ముందు కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన తాను స్థానిక టీనేజర్లకు బౌలింగ్ చేస్తూ ప్రాక్టీసు చేశానని తెలిపాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ.. ‘‘నన్నెప్పుడూ అండర్ఎస్టిమేట్ చేస్తారనుకుంటాను. పదిహేను, పదహారేళ్ల కుర్రాడిగా ఉన్ననాటి నుంచి... నా కంటే మెరుగ్గా బౌలింగ్ చేయగల వాళ్లు ఉన్నారని భావిస్తా. అంతెంతుకు ఈ టోర్నమెంట్ తర్వాత కూడా... మరో సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనూ ఇలాగే జరుగుతుంది. తద్వారా నన్ను నేను మరింత మెరుగుపరచుకోగలను’’ అని జంపా చెప్పుకొచ్చాడు. ఇక తన బలాలు, బలహీనతలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి టీ20 వరల్డ్కప్లో మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సెమీస్ హీరో మార్కస్ స్టొయినిస్ ఆడం జంపా గురించి చెబుతూ... అతడిని అత్యంత నిజాయితీ గల ఆటగాడిగా అభివర్ణించాడు. పాకిస్తాన్తో సెమీ ఫైనల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. కాగా ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చిన జంపా.. కీలకమైన బాబర్ ఆజమ్ వికెట్ తీసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2021: పాపం కివీస్.. టి20 ప్రపంచకప్ కొట్టినా నెంబర్వన్ కాకపోవచ్చు.. టీమిండియాను ఓడిస్తేనే -
12 ఏళ్ల క్రితం కలిసి ఆడారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా
Daryl Mitchell, Marcus Stoinis Played Same Team Before 12 Years.. టి20 ప్రపంచకప్ 2021 తుది అంకానికి చేరుకుంది. నవంబర్ 14న జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. న్యూజిలాండ్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టగా.. అటు ఆస్ట్రేలియా పాకిస్తాన్ను ఓడించి తుది సమరానికి సిద్ధమైంది. ఇంగ్లండ్తో మ్యాచ్లో కివీస్ ఓపెనర్ డారిల్ మిచెల్ హీరోగా నిలిస్తే.. ఇటు పాకిస్తాన్తో మ్యాచ్లో వేడ్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్కస్ స్టోయినిస్ అంతే ప్రముఖపాత్ర పోషించాడు. చదవండి: T20 World Cup 2021: రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. మిచెల్, స్టోయినిస్లు ఇద్దరు 12 ఏళ్ల క్రితం ఒక టోర్నీలో కలిసి ఆడారు. కలిసి ఆడడమే కాదు.. ఏకంగా కప్ను కూడా అందించారు. విషయంలోకి వెళితే 2009లో మిచెల్, స్టోయినిస్లు ప్రీమియర్షిప్ క్రికెట్ టోర్నీలో స్కార్బరో అనే టీమ్కు ప్రాతినిధ్యం వహించారు. సెమీఫైనల్లో స్టోయినిస్ (189 పరుగులు ) సూపర్ శతకంతో మెరవడంతో స్కార్బరో ఫైనల్కు చేరింది. ఇక బేస్వాటర్-మోర్లీతో జరిగిన ఫైనల్లో డారిల్ మిచెల్ అనూహ్యంగా బౌలింగ్లో మెరిశాడు. 26 పరుగులకే నాలుగు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. అలా ఈ ఇద్దరు కలసి స్కార్బరో కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా మిచెల్, స్టోయినిస్లు టి20 ప్రపంచకప్ ఫైనల్లో ప్రత్యర్థులుగా తలపడనుండడం ఆసక్తికరంగా మారింది. చదవండి: Gautam Gambhir: అనూహ్యంగా సిక్స్ కొట్టిన వార్నర్.. ‘అలా చేయడం నిజంగా సిగ్గు చేటు’ -
T20 World Cup 2021: ఫైనల్కు ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ ఇంటికి
-
Marcus Stoinis: ధోని కాంప్లిమెంట్ ఇచ్చాడో.. సెటైర్ వేశాడో తెలియలేదు!
Marcus Stoinis Comments On MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా.. ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ను నాలుగుసార్లు చాంపియన్గా నిలిపిన కెప్టెన్గా.. అనేకానేక ఘనతలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక ఇలాంటి రికార్డులతోనే కాకుండా... ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో కూడా అతడు వ్యవహరించే తీరు కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది. టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో భాగంగా.. టీమిండియాతో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు వచ్చి ధోని వద్ద సలహాలు తీసుకోవడం అతడి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆస్ట్రేలియా ఆల్రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సైతం ఇదే మాట అంటున్నాడు. ఐపీఎల్-2021లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా ధోని తనతో మాట్లాడిన మాటలను స్టొయినిస్ గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు గ్రేడ్ క్రికెటర్స్ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ... ‘‘నిజానికి తను నాతో చాలా నిజాయితీగా మాట్లాడాడు. నా ఆట తీరు గురించి తనకు అవగాహన ఉంది. అందుకే నా కోసం సీఎస్కే ఎలాంటి ప్రణాళికలు రచించిందో.. ఫీల్డ్ను ఎలా సెట్ చేస్తారో కూడా చెప్పాడు. నిజానికి అది నాకు తను ఇచ్చిన కాంప్లిమెంటా లేదంటే... నీ గురించి మొత్తం తెలుసులేనన్న సెటైరో అర్థం కాలేదు(నవ్వులు)’’ అని స్టొయినిస్ వ్యాఖ్యానించాడు. ఇక క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్గా పేరొందిన ధోని.. ఫినిషింగ్కు సంబంధించి తనకు ఆసక్తికర విషయాలు చెప్పాడని స్టొయినిస్ పేర్కొన్నాడు. ‘‘కొంతమంది బాధ్యతాయుతంగా ఆడుతూ చివరి వరకు క్రీజులో ఉంటారు. మరికొందరు మ్యాచ్ ఆరంభంలోనే రిస్క్ తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ఇందులో ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అని తను అన్నాడు. నిజమే కదా’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా..‘‘ ఆటలో మన బలహీనతలను గుర్తించాలి.. అయితే అది మన బలాన్ని ప్రభావితం చేసేలా మాత్రం ఉండకూడదనే స్ఫూర్తిదాయక మాటలు చెప్పాడు’’ అని తెలిపాడు. కాగా స్టొయినిస్ ప్రస్తుతం టీ20 వరల్డ్కప్-2021లో ఆడుతుండగా... ధోని టీమిండియాకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్గా.. టీమిండియా మాజీ కోచ్! -
IND Vs AUS: అటు హార్దిక్.. ఇటు స్టోయినిస్.. ఇద్దరి పరిస్థితి ఒకటే
Hardik Pandya Vs Marcus Stoinis.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా నేడు టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఇద్దరు ఆల్రౌండర్లకు కీలకం కానుంది. వారిలో ఒకరు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అయితే.. మరొకరు ఆసీస్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్. ఇంగ్లండ్తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో హార్దిక్ బౌలింగ్ చేయలేదు. ఇక బ్యాటింగ్లో చివరలో వచ్చిన అతను 10 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆసీస్తో మ్యాచ్ హార్దిక్కు తన ఫిట్నెస్ నిరూపించుకునేందుకు మంచి అవకాశం. చదవండి: T20 WC 2021: స్కాట్లాండ్ తరపున తొలి బ్యాటర్గా రికార్డు మరోవైపు ఆసీస్ ఆల్రౌండర్ స్టోయినిస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఫామ్లేమితో సతమతమవుతున్న అతను ఈ మ్యాచ్లో ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. జట్టుకు ఆరో బౌలర్గా స్టోయినిస్ సేవలు అవసరమని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. కాగా యూఏఈ గడ్డపై బ్యాటింగ్లో స్టోయినిస్, హార్దిక్లకు మంచి రికార్డు ఉంది. హార్దిక్ 19 మ్యాచ్ల్లో 356 పరుగులు చేయగా.. స్టోయినిస్ 19 మ్యాచ్ల్లో 370 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్లో స్టోయినిస్ 19 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీయగా.. హార్దిక్ మాత్రం యూఏఈ గడ్డపై ఒక్కమ్యాచ్లోనూ బౌలింగ్ చేయలేదు. ఇక నేటి వార్మప్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. చదవండి: IND vs AUS: నేడు ఆసీస్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ -
నా ఉచిత సలహా ఉపయోగపడింది: సెహ్వాగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్కు చేరడంలో తాను ఇచ్చిన ఉచిత సలహా కూడా ఉపయోగపడిందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు.మార్కస్ స్టోయినిస్ను ఓపెనర్గా పంపమని తాను ఒక సలహా ఇస్తే, అది ఢిల్లీకి అడ్వాంటేజ్ అయ్యిందన్నాడు. ఈ మేరకు ఒక వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్-సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్-2 గురించి సెహ్వాగ్ మాట్లాడాడు. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయడం సరైన నిర్ణయంగా పేర్కొన్నాడు. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్ల్లో ఢిల్లీ ఛేజింగ్ చేస్తూ తడబడిన విషయాన్ని ప్రస్తావించిన సెహ్వాగ్.. క్వాలిఫయర్-2లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్కు మొగ్గుచూపడం వంద శాతం మంచి నిర్ణయమేనన్నాడు.‘ ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. కానీ ఇక్కడ ఆ జట్టు తీసుకున్న ఒక నిర్ణయంతో ఆశ్చర్యపోయా.స్టోయినిస్ను ఓపెనింగ్కు పంపమని నేను చెప్పా. అలాగే చేశారు. అది నేను ఇచ్చిన సలహానే కానీ ఉపయోగపడింది’ అని సెహ్వాగ్ తెలిపాడు. ఇక స్టోయినిస్ ఆరంభంలోనే ఇచ్చిన క్యాచ్ను సన్రైజర్స్ ఆటగాడు హోల్డర్ వదిలేయడంతో ఒక గొప్ప చాన్స్ను కోల్పోయిందన్నాడు. ఆ సమయంలో స్టోయినిస్ మూడు పరుగులే చేశాడని ,అప్పుడు అతని క్యాచ్ తీసుకుని ఉంటే ఢిల్లీపై ఒత్తిడి వచ్చేదన్నాడు. ఆ తర్వాత స్టోయినిస్ విలువైన పరుగుల్ని సాధించి ఢిల్లీ మంచి ఆరంభంలో కీలక పాత్ర పోషించాడన్నాడు. ఢిల్లీ 8 ఓవర్లు చేరేసరికి 80 పరుగులు దాటేసిందని, ఆ ఫుల్స్పీడ్నే తుది వరకూ కొనసాగించిందన్నాడు. రషీద్ ఖాన్ తన రెండో ఓవర్లో స్టోయినిస్ను బౌల్డ్ చేసినా అప్పటికే చాలా నష్టం జరిగిపోయిందన్నాడు. స్టోయినిస్ అయ్యే సమయానికి ధావన్ డ్రైవర్ సీట్(పైచేయి సాధించడంలో)లో కూర్చోవడంతో ఢిల్లీలో పరుగులు వేగం తగ్గలేదన్నాడు. ఈ మ్యాచ్లో స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 38 పరుగులు సాధించడంతో పాటు మూడు కీలక వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. -
69 రన్స్: ధావన్ ఔటైనా బాగుండేది...!
అబుదాబి: ఐపీఎల్ టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఇక లక్ష్యఛేధనకు దిగిన ముంబై తొలుత మందకొడిగానే ఆట ప్రారంభించినా, డికాక్, సూర్యకుమార్ యాదవ్ మెరుగ్గా రాణించడంతో 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న ఢిల్లీని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. కాగా ఆదివారం నాటి ఓటమి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు ఓపెనర్ శిఖర్ ధావన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా మెరుగైన స్కోరే చేసినప్పటికీ (52 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) మార్కస్ స్టోయినిస్ విషయంలో తప్పు చేశాడంటూ మండిపడుతున్నారు. ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ బదులు ధావన్ ఔటైనా బాగుండేదంటూ అసహనం వెళ్లగక్కుతున్నారు.(చదవండి: ముంబై మళ్లీ మురిసె...) ఇంతకీ విషయమేమిటంటే.. ముంబైతో జరిగిన మ్యాచ్లో బౌల్ట్ వేసిన 16వ ఓవర్లో ధావన్ ఒకటి, స్టొయినిస్ 2 ఫోర్లు కొట్టడంతో 16 పరుగులొచ్చాయి. ఢిల్లీ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్ ఇదే. అయితే ఆ తర్వాత ఓవర్లో రాహుల్ చహర్ వేసిన మూడో బంతి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లాంగ్ ఆన్ దిశగా బంతిని బాదిన స్టోయినిస్ రన్ తీశాడు. అయితే లాంగ్- ఆన్ బౌండరీ వద్ద ఉన్న సూర్యకుమార్ యాదవ్ కాస్త తడబడినా ఆఖరికి బంతిని చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ అప్పటికే ధావన్ మరో రన్ కోసం మార్కస్కు పిలుపునివ్వగా, అతడు క్రీజ్ వీడాడు. (చదవండి: ఖలీల్పై రాహుల్ తెవాటియా ఫైర్ !) అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సూర్యకుమార్ విసిరిన బంతిని చేతుల్లోకి తీసుకున్న రాహుల్ వికెట్ల మీదకు విసిరి, స్టొయినిస్ను రనౌట్ చేశాడు. ఈ పరిణామంతో కంగుతిన్న స్టోయినిస్ అసహనంగానే పెవిలియన్ బాటపట్టాడు. ఇక ఈ టోర్నీ ఆరంభం నుంచి మెరుగ్గా రాణిస్తున్న స్టోయినిస్ క్రీజులో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, అతడు కనీసం మరో 20 పరుగులైనా చేసేవాడంటూ ఢిల్లీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్ నుంచి తమను నిరాశపరుస్తున్న ధావన్, ఇప్పుడు కూడా వన్డే తరహా బ్యాటింగ్తో చిరాకు తెప్పించాడని, జట్టుకు భారంగా మారాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ‘కేదార్ ఒక్కడేనా.. నువ్వూ సరిగ్గా ఆడలేదు’) -
‘చోటు దక్కని ఆ క్రికెటర్లు నా కంటే టాలెంటెడ్’
మెల్బోర్న్: భారతీయ క్రికెటర్లపై ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ ప్రశంసలు కురిపించాడు. అసలు భారత క్రికెట్లో ఉన్న టాలెంట్ మరేక్కడా లేదంటూ కొనియాడాడు. ఇంకా ఇప్పటికీ చాలా మంది క్రికెటర్లు భారత జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న సంగతిని స్టోయినిస్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. నేటికీ భారత జాతీయ జట్టులో చోటు దక్కని క్రికెటర్లు తనకంటే ఎంతో టాలెంటెడ్ అంటూ పొగడ్తలు కురిపించాడు. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ విడుదల చేసిన స్టోయినిస్.. దీనిలో భాగంగా భారత క్రికెట్ జట్టును ఆకాశానికెత్తేశాడు. ‘ నాకు భారత్లో ఆడటం చాలా ఇష్టం. నేను భారతీయ సంస్కృతిని బాగా ఇష్టపడతా. భారత్లో ఎంతో నైపుణ్యం ఉన్న క్రికెటర్లు ఉన్నారు. వరల్డ్లోనే భారత్ మోస్ట్ టాలెంటెడ్ జట్టు. ఆ జట్టులో ఉన్న టాలెంట్ను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది’ అని స్టోయినిస్ పేర్కొన్నాడు. అదే డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సైతం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా 2018-19 ఆసీస్ పర్యటనలో భారత్ సాధించిన అద్భుత విజయాలను లాంగర్ గుర్తు చేసుకున్నాడు. ప్రధానంగా భారత్తో జరిగిన ఆ టెస్టు సిరీస్ను తమకు గెలిచే అవకాశాలు వచ్చినా దాన్ని కోల్పోయామన్నాడు. ఆ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియాల టీ20 సిరీస్ 1-1తో సమం కాగా, టెస్టు సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
స్టోయినిస్ అనుచిత ప్రవర్తన.. భారీ జరిమానా
మెల్బోర్న్: బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో దూకుడుగా ప్రవర్తించిన ఆసీస్ క్రికెటర్ మార్కస్ స్టోయినిస్పై భారీ జరిమానా విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. శనివారం మెల్బోర్న్ స్టార్స్-మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో స్టోయినిస్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ అయిన స్టోయినిస్.. మెల్బోర్న్ రెనిగేడ్స్ ఆటగాడే కేన్ రిచర్డ్సన్ను దూషించాడు. రిచర్డ్సన్పై వ్యక్తిగత దూషణలకు దిగాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ కావడంతో తన తప్పును స్టోయినిస్ ఒప్పుకున్నాడు. ఆ క్రమంలోనే అతనికి 7,500 డాలర్ల జరిమానా విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. తన ప్రవర్తనపై ఎటువంటి చాలెంజ్కు వెళ్లకుండా ఒప్పుకోవడంతో స్టోయినిస్కు జరిమానాతో సరిపెట్టారు. దీనిలో భాగంగా రిచర్డ్సన్కు అంపైర్లకు స్టోయినిస్ క్షమాపణలు చెప్పాడు. ‘ ఆ క్షణంలో ఏమైందో నాకు తెలీదు. నేను దూషించిన మాట వాస్తవం. నేను తప్పు చేసాను అనే సంగతిని వెంటనే తెలుసుకున్నా. ఇది నిజంగా పెద్ద తప్పిదమే. కేన్కు, అంపైర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని స్టోయినిస్ పేర్కొన్నాడు.ఆ మ్యాచ్లో స్టోయినిస్ జట్టు మెల్బోర్న్ స్టార్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెనిగేడ్స్ 143 పరుగుల టార్గెట్ను నిర్దేశించగా, దాన్ని స్టార్స్ 18.5 ఓవర్లలో ఛేదించింది. స్టోయినిస్(68 నాటౌట్), గ్లెన్ మ్యాక్స్వెల్(40)లు విజయంలో కీలక పాత్ర పోషించారు. -
అసభ్యంగా ప్రవర్తించాడని క్రికెటర్కు జరిమానా
మెల్బోర్న్ : ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ జరిమానా విధించింది. దేశవాలి టీ20బిగ్బాష్లీగ్లో మార్కస్ స్టొయినిస్ మెల్బోర్న్ స్టార్స్కు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్బాష్ లీగ్లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో శనివారం మెల్బోర్న్ స్టార్స్, రినిగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో స్టొయినిస్ తన సహచర ఆటగాడైన కేన్ రిచర్డ్సన్పై అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆటగాడిగా ప్రవర్తన నియమావళి ఉల్లగించినందుకు గాను కోడ్ ఆఫ్ కండక్ట్ కింద స్టొయినిస్కు 7500 ఆస్ట్రేలియన్ డాలర్లను జరిమానాగా విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.' నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నా. కేన్ రిచర్డ్సన్తో అసభ్యంగా ప్రవర్తించినందుకు గ్రౌండ్లోనే అంపైర్ల ముందు అతనికి క్షమాపణ చెప్పాను. నేను ఎందుకలా ప్రవర్తించానో నాకు మాత్రమే తెలుసు. క్రికెట్ ఆస్ట్రేలియా నాకు వేసిన జరిమానాను అంగీకరిస్తున్నా' అని మార్కస్ స్టొయినిస్ స్పందించాడు. సరిగ్గా ఆరు వారాల క్రితం ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్ విక్టోరియా తరపున మ్యాచ్ ఆడుతూ ఇదే తరహాలో తీవ్ర అసభ్యపదజాలంతో దూషించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ సస్పెన్షన్తో పాటు భారీ జరిమానాను విధించింది. దీంతో నవంబర్లో పాక్తో జరిగిన హోమ్ సిరీస్లో పాటిన్సన్ మొదటి టెస్టు మ్యాచ్కు దూరమయ్యాడు. కాగా బిగ్బాష్ లీగ్లో ఈ ఏడాది స్టొయినిస్ అసాధారణ ఆటతీరు కనబరిచి 281 పరుగులతో లీగ్ టాప్ స్కోర్ర్లలో ఒకడిగా నిలిచినా, జనవరిలో భారత్తో జరగనున్న వన్డే సిరీస్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు కేన్ రిచర్డ్సన్ మాత్రం ఈ సిరీస్కు ఎంపిక కావడం విశేషం. 2018లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినప్పటి నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పు చేసిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది. బాల్ ట్యాంపరింగ్ చేసినందుకు అప్పటి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లు ఏడాది , బౌలర్ బెన్క్రాప్ట్ 9 నెలల పాటు జట్టుకు దూరమయ్యరు.కాగా మార్కస్ స్టొయినిస్ను డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 4.80 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా, కేన్ రిచర్డ్సన్ను ఆర్సీబీ రూ. 4 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. (క్రికెట్కు పఠాన్ గుడ్బై ) (ముగిసిన ఐపీఎల్ వేలం) -
స్టొయినిస్ సిల్లీ రనౌట్..
-
సిల్లీ రనౌట్.. ఆసీస్ ఫ్యాన్స్ ఫైర్
లండన్: ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ స్టొయినిస్ రనౌట్ అయిన తీరుపై ఆ జట్టు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో అనవసరంగా రనౌటైన అతడిపై సోషల్మీడియా వేదికగా మండిపడుతున్నారు. నాన్స్ట్రైక్లో ఉన్న స్టీవ్ స్మిత్ సంకేతాలను ఏమాత్రం పట్టించుకోకుండా తొందరపడ్డాడని, లేని పరుగు కోసం యత్నించి స్టొయినిస్ రనౌట్ అయ్యాడని విమర్శిస్తున్నారు. ఇక ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్తో పాటు డగౌట్లో ఉన్న సారథి ఆరోన్ ఫించ్ కూడా స్టొయినిస్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా అదిల్ రషీద్ వేసిన 42వ ఓవర్ ఐదో బంతిని స్టీవ్ స్మిత్ లాంగాఫ్ వైపు కొట్టి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే మరో ఎండ్లో ఉన్న స్టొయినిస్ లేని రెండో పరుగు కోసం పరిగెత్తాడు. కానీ స్మిత్ రెండో పరుగు కోసం అనాసక్తిగా ఉండటంతో క్రీజుకు దగ్గర్లోనే ఆగిపోయాడు. అయితే పరుగు పందెంలో పాల్గొన్న ఆటగాడిగా పరిగెత్తుకుంటూ రెండో ఎండ్కు చేరుకున్నాడు. అప్పటికే బెయిర్ స్టో బంతిని అందుకొని కీపర్ బట్లర్కు అందించడంతో స్టొయినిస్ పెవిలియన్ బాట పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. -
పాక్తో మ్యాచ్కు స్టోయినిస్ ఔట్
టాంటాన్: వన్డే వరల్డ్కప్లో బుధవారం పాకిస్తాన్తో జరుగనున్న మ్యాచ్కు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న స్టోయినిస్.. పాక్తో మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు.. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడైన స్టోయినిస్.. భారత్తో మ్యాచ్లో ఐదో ఓవర్ వేస్తుండగా పక్కటెముకలు పట్టేశాయి. అది అతన్ని బాధించడంతో తన స్పెల్ను కొనసాగించలేకపోయాడు. కాగా, తిరిగి 48 ఓవర్తో పాటు చివరి ఓవర్ వేశాడు. కాగా, ఆ గాయం నుంచి స్టోయినిస్ ఇంకా పూర్తిగా కోలుకోలేకపోవడంతో పాక్తో మ్యాచ్కు దూరమయ్యాడు. ఒకవేళ ఈ మెగా టోర్నీ నుంచి స్టోయినిస్ వైదొలిగితే ఆ స్థానాన్ని మిచెల్ మార్ష్తో భర్తీ చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ సూత్రప్రాయంగా వెల్లడించాడు. వరల్డ్కప్కు స్టోయినిస్ దూరమైన పక్షంలో మిచెల్ మార్ష్ జట్టులో కలుస్తాడని స్పష్టం చేశాడు. -
ఎంత దురదృష్టవంతుడివయ్యా.. స్టొయినిస్!
నాగ్పూర్ : ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్క్ స్టొయినిస్ అంత దురదృష్టవంతుడు క్రికెట్ ప్రపంచంలోనే ఎవరూ లేనట్టున్నారు. నాగ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ను ఓడించెంత పనిచేసిన ఈ ఆసీస్ ఆల్రౌండర్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే అవాక్కయ్యే విషయం తెలిసింది. ఈ మ్యాచ్లో 52 పరుగులతో ఆఖరి ఓవర్ వరకు పోరాటం చేసిన స్టొయినిస్.. చివరకు విజయ్ శంకర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగడంతో ఆసీస్ పోరాటం ముగిసింది. అయితే స్టొయినిస్ ఇప్పటి వరకు 26 వన్డేలు ఆడగా.. ఒక సెంచరీతో పాటు 6 అర్థసెంచరీలు సాధించాడు. అతను ఇప్పటి వరకు 50కి పైగా పరుగులు చేసిన ప్రతి మ్యాచ్ ఆసీస్ ఓడిపోవడం గమనార్హం. ఆఖరికి సెంచరీ చేసిన మ్యాచ్లో కూడా ఆసీస్ పరాజయం పాలైంది. 2017లో న్యూజిలాండ్పై స్టొయినిస్(146 నాటౌట్) అజేయ సెంచరీ చేయగా.. ఆసీస్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అదే ఏడాది కోల్కతా వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 62 పరుగులతో నాటౌట్గా నిలవగా.. ఆసీస్ 50 పరుగులతో పరాజయం పాలైంది. ఇక 2018లో స్టొయినీస్ 4 అర్ధసెంచరీలు సాధించగా.. ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆసీస్ గెలవలేదు. ఇక తాజాగా భారత్తో జరిగిన మ్యాచ్లోను అర్థసెంచరీతో ఆఖరి వరకు పోరాడినా 8 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో ఎంతైనా స్టొయినిస్ దురదృష్టవంతుడేనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. -
‘పాండ్యా కన్నా మావాడే బెటర్’
సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిరీస్ అంటేనే మాటల యుద్దం. అందులోనూ స్వదేశంలో ఘోర ఓటమి అనంతరం టీమిండియా పర్యటన నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లు కవ్వింపులకు దిగుతున్నారు. తాజాగా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ కోహ్లి సేనకు ఆసీస్ ఆటగాళ్లతో ఇబ్బందులు తప్పవంటున్నాడు. ముందుగా ఆసీస్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్పై ప్రశంసల జల్లు కురిపించాడు. స్వదేశమైనా, విదేశమైనా తనదైన రీతిలో రెచ్చిపోవడమే స్టోయినిస్కు తెలుసంటూ కితాబిచ్చాడు. ఈ సందర్భంలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రస్తావిస్తూ.. పాండ్యా కంటే స్టోయినిసే గొప్ప ఆటగాడంటూ వ్యాఖ్యానించాడు. పాండ్యా ఇంకా మెరుగుపడాలని, పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అలవరుచుకోవాలని హెడెన్ సూచించాడు. ధవన్కు ఇబ్బందులు తప్పవు.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్కు ఆసీస్ స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్తో ఇబ్బందులు తప్పవని ఈ ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు హెచ్చరించాడు. కమిన్స్ తన వైవిద్య బంతులతో ధవన్ను బోల్తా కొట్టిస్తాడనన్నాడు. స్వింగ్, షార్ట్ పిచ్ బంతులు ఆడటంలో పరిణితి సాధించాలని ధవన్కు సూచించాడు. అయితే భారత్ మణికట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ను మాత్రం పొగడ్తలతో ముంచెత్తాడు. చహల్తో ఆసీస్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ మ్యాక్స్వెల్కు ఇబ్బందేనని వివరించాడు. భారత్ పిచ్లపై మ్యాక్స్వెల్ రాణించలేకపోతున్నాడని పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఈ యువ స్పిన్నర్ 40 వన్డేల్లో 71 వికెట్లు, 29 టీ20ల్లో 45 వికెట్లు తీశాడని.. దీంతోనే చహల్ ప్రతిభ అర్థమవుతుందని హెడెన్ తెలిపాడు. ఇక భారత్ పర్యటనలో ఆసీస్ జట్టు రెండు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. విశాఖపట్నం వేదికగా ఈ నెల 24న తొలి టీ20 జరగనుంది. స్వదేశంలో ఆసీస్పై సిరీస్లు గెలిచి ఆత్మస్థైర్యంతో ప్రపంచకప్లోకి అడుగుపెట్టాలని కోహ్లిసేన భావిస్తుండగా.. స్వదేశంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ జట్టు ఆరాటపడుతోంది. -
బ్యాడ్ లక్.. కొంపముంచిన రనౌట్!
ఆక్లాండ్: ఒక్క రనౌట్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. మార్కస్ స్టోయినిస్ చేసిన అసమాన పోరు వృథా అయింది. న్యూజిలాండ్ తో సోమవారం జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టోయినిస్ చివరివరకు పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. అవతలివైపు ఉన్న హాజిల్ వుడ్ తప్పిదంతో స్టోయినిస్ శ్రమ ఫలించలేదు. 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్ తో విజయం అంచుల వరకు తీసుకొచ్చాడు. 43 ఓవర్లలో క్రీజులోకి వచ్చిన చివరి బ్యాట్స్ మన్ హాజిల్ వుడ్ అవుట్ కాకుండా చూసేందుకు తానే స్ట్రెకింగ్ తీసుకుంటూ వచ్చాడు. వరుసగా మూడు ఓవర్ల పాటు చివరి బంతికి సింగిల్ తీసి తానే స్ట్రెకింగ్ తీసుకున్నాడు. హాజిల్ వుడ్ 26 నిమిషాల పాటు క్రీజులో ఉన్నా ఒక్క బంతిని కూడా ఎదుర్కోనివ్వకుండా స్టోయినిస్ కాపు కాశాడు. అంతేకాకుండా పదో వికెట్ కు 54 పరుగుల పార్టనర్ షిప్ నమోదైతే అందులో హేజిల్వుడ్ ది ఒక్క పరుగు కూడా లేదు. 47వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి మళ్లీ స్ట్రెకింగ్ కు వద్దామనుకున్న స్టోయినిస్ ప్రయత్నానికి విలియమ్సన్ గండి కొట్టాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ హేజిల్వుడ్ను అనూహ్యంగా రనౌట్ చేయడంతో స్టోయినిస్ పోరాటం ముగిసింది. ఆరు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అయితే స్టోయినిస్ అసమాన పోరాటం క్రికెట్ అభిమానులతో పాటు దిగ్గజాలను ఆకట్టుకుంది. స్టోయినిస్ పై పలువురు మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపించారు.