national high way
-
నిజమే..! ఇది ముక్కుసూటి రహదారే..!! సుమారు..
ఎంతటి రాచమార్గానికైనా మలుపులు ఉంటాయి. అక్కడక్కడా వంకరలుంటాయి. ఎలాంటి వంకరలు లేకుండా ఏకధాటిగా ముక్కుసూటిగా సాగిపోయే రహదారి ఇది. ప్రపంచంలోని అతి పొడవాటి ముక్కుసూటి రహదారి ఇదే!.ఈ రహదారి సౌదీ అరేబియాలో ఉంది. ఏకంగా 240 కిలోమీటర్ల దూరం వరకు ఈ రహదారి ముక్కుసూటిగా సరళరేఖలా తిన్నగా ఉంటుంది. సౌదీ అరేబియా నైరుతి ప్రాంతంలోని అల్ దర్బ్ పట్టణం నుంచి తూర్పు ప్రాంతంలోని అల్ బతా పట్టణాన్ని కలుపుతూ ఉన్న ఈ 10వ నంబరు రహదారి మొత్తం పొడవు 1474 కిలోమీటర్లు. ఇది రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా సాగుతుంది.ఎడారి మీదుగా సాగే మార్గంలోనే దీనిని ఎలాంటి మలుపులు, వంకరలు లేకుండా 240 కిలోమీటర్ల పొడవున కేవలం సరళరేఖ మార్గంలో మాత్రమే కాదు, ఎలాంటి ఎగుడు దిగుడులు ఎత్తు పల్లాలు కూడా లేకుండా నిర్మించడం విశేషం.ఇవి చదవండి: పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? వింటే షాకే! -
టోల్ ఫీజుకు డబ్బులు లేక.. రాంగ్రూట్లో ప్రయాణించిన ఆర్టీసీ బస్సు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దుబారి టోల్ ఫీజు చెల్లించలేని కేఎస్ ఆర్టీసీ బస్సు వెనక్కు వెళ్లి పోయిన సంఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్వేపై చోటుచేసుకుంది. బుధవారం బెంగళూరు నుండి మైసూరు వెళ్తున్న బస్సుకు ఫాస్ట్ట్యాగ్ లేకపోవడంతో రామనగర తాలూకా శేషగిరి టోల్ వద్ద డబుల్ చార్జ్ చెల్లించాలని టోల్ సిబ్బంది చెప్పారు. దీంతో డ్రైవర్ అంత డబ్బులు తన వద్ద లేవని బస్సు వెనక్కు తీసుకుని కొన్ని కిలోమీటర్ల దూరం రాంగ్ రూట్లోనే వచ్చాడు. అనంతరం సర్వీస్ రోడ్ ద్వారా ప్రయాణించాడు. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్నారు. చదవండి మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటి తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు -
అల్జీరియాలో 34 మంది మృతి
అల్జీర్స్: దక్షిణ అల్జీరియాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై బస్సు, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 34 మంది మరణించారు. మరో 12 మంది గాయాలపాలయ్యారు. పరస్పరం ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లోనూ మంటలు చెలరేగాయని, అందుకే భారీగా ప్రాణనష్టం జరిగిందని అధికారులు చెప్పారు. సహారా ఎడారి సమీపంలో తామన్రసెట్ ప్రావిన్స్లో తెల్లవారుజామున 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. -
రహదారుల అభివృద్ధిలో ముందడుగు
రహదారులకు మహర్దశ పట్టింది.. జాతీయ రహదారుల నిర్మాణంతో కొత్త జిల్లాల రూపురేఖలు మారనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా రాష్ట్రంలో హైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వగా.. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.1,490 కోట్లు విడుదల చేసింది. ఎన్హెచ్–216, ఎన్హెచ్–165 విస్తరణ పనులు జరుగనున్నాయి. నరసాపురం: కోనసీమ, కోస్తా ప్రాంతాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలని కూడా నిర్ణయించారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న వశిష్ట వారధి డిమాండ్ ఇన్నాళ్లకు తీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వ యంగా రంగంలోకి దిగి జాతీయ రహదారుల కో సం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన సంప్ర దింపులు సత్ఫలితాలను ఇచ్చాయి. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కు రూ.1,490 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొత్త జిల్లాలో నాలుగు లైన్ల రహదారు లు అందుబాటులోకి రా నున్నాయి. దశాబ్దాల కల సాకారం కాకినాడ జిల్లాలోని కత్తిపూడి నుంచి ఒంగోలుకు వెళ్లే 216 జాతీయరహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా కోనసీమ, కోస్తా ప్రాంతాలను కలుపుతూ బైపాస్ ని ర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ.490 కోట్ల నిధులు కేటాయించింది. కోనసీమ జిల్లాలోని దిండి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర సాపురం మండలంలోని సీతారాంపురం వరకు బై పాస్ను నిర్మించనున్నారు. దీంతో జిల్లావాసులు ఎదురుచూస్తున్న నరసాపురంలో వశిష్ట గోదావరిపై వారధి నిర్మాణం కల సాకారం కానుంది. వంతెన నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో స్థల సేకరణ పూర్తిచేసింది. ఫలించిన ప్రయత్నం : ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు జిల్లాలో హైవేల నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్కు వివరించారు. ఎన్హెచ్ 216కు బైపాస్, ఎన్హెచ్ 165 నాలుగు లైన్ల విస్తరణ విషయాలపై సీఎం ద్వారా కేంద్ర మంత్రికి లేఖ ఇప్పించారు. రూపురేఖలు మారనున్నాయి సీఎం వైఎస్ జగన్ కృషితోనే నిధులు మంజూర య్యాయి. కొత్త జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1,490 కోట్లను కేంద్రం కేటాయించడం రికార్డు. ఇంత పెద్ద స్థాయిలో నిధుల కేటాయింపు ఎన్నడూ లేదు. వశిష్ట వంతెన నిర్మాణం కూడా పూర్తవుతుంది. రానున్న ఐదేళ్లలో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. నరసాపురం, భీమవరం నుంచి విజయవాడకు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడుతుంది. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్విప్ పనులు ఇలా.. ఎన్హెచ్ 216 బైపాస్ రూ. 490 కోట్లు కోనసీమ జిల్లా దిండి నుంచి మలికిపురం, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి మీదుగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని రాజుల్లంక నుంచి సీతారాంపురం వరకు ఎన్హెచ్ 165 1,000 కోట్లు పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా జాతీయ రహదారి విస్తరణ నాలుగు లైన్లుగా విస్తరణ జాతీయరహదారి 165 పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకు 107 కిలోమీటర్ల మేర ఉంది. దిగమర్రు నుంచి ఆకివీడు వరకు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి రూ.1,000 కోట్లు మంజూరు చేశారు. ఆకివీడు నుంచి పామర్రు వరకు నాలుగు లైన్ల పనులు ఏడాది క్రితమే ప్రారంభమయ్యాయి. ఎన్హెచ్–165ను దిగమర్రు జంక్షన్ నుంచి ఎన్హెచ్–216కి అనుసంధానం చేస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. తాజాగా విధులైన నిధులతో దిగమర్రు నుంచి ఆకివీడు వరకు పనులు మొదలు కానున్నాయి. ఈ నిర్మాణంతో భీమవరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. -
అదొక రాకాసి రహదారి
-
ఆ జాతీయ రహదారి మృత్యు దారి!.. ఐదేళ్లలో 1066 ప్రమాదాలు.. కారణాలేంటి?
జైనథ్ మండలంలోని గిమ్మ ఎక్స్రోడ్ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ఈనెల 16న లారీ ఢీకొని ఆంకోలి గ్రామానికి చెందిన వడరపు రాజారెడ్డి(59) మృతిచెందాడు. మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా వన్వే ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడిపి బైక్ను ఢీకొన్నాడు. జైనథ్ మండలం భోరజ్ వద్ద ఈనెల 17న ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఆకిటి వెంకట్రెడ్డి ఏకైక కూతురు చైత్ర(13)కు జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. భోరజ్ ఎక్స్ రోడ్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొంది. చైత్ర కుడివైపుకు పడిపోవడంతో లారీ ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆదిలాబాద్ పట్టణం సాయినగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఏనుగు పద్మ(56) శుక్రవారం స్కూటీపై బేల మండలం ఏటీ పాఠశాలకు బయల్దేరారు. జైనథ్ మండలం భోరజ్ చెక్పోస్ట్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆమె కిందపడిపోగా, లారీ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పాఠశాలకు బయల్దేరిన 15 నిమిషాల్లో మృత్యువు కబళించింది. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో సుమారు వంద కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న 44వ నంబర్ జాతీయ రహదారి నెత్తురోడుతోంది. ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఈ రోడ్డుపై ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. ప్రమాదాల నివారణకు కృషి చేయాల్సిన రోడ్ సేఫ్టీ కమిటీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2016 నుంచి 2020 వరకు ఎన్హెచ్ 44పై 1,066 ప్రమాదాలు జరుగడం కమిటీల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ఈ కమిటీలో కీలకపాత్ర పోషించే రవాణా శాఖ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బారికేడ్లతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. శుక్రవారం ఉదయం ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి బారికేడ్లే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో సంఘటన స్థలంలో నిరసన చేపట్టిన కొంతమంది రవాణ శాఖపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. చదవండి: మేడారం వెళ్లే దారిలో ఘోర రోడ్డు ప్రమాదం. నలుగురు మృత్యువాత రవాణాశాఖే ఉల్లంఘన..! సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లాకేంద్రం శాంతినగర్కు చెందిన టీఆర్ఎస్ నేత బాలూరి గోవర్ధన్రెడ్డి వివిధ అంశాలపై 2020లో వివిధ వివరాలను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్లోని ప్రాంతీయ అధికారిని కోరగా, అదే సంవత్సరం జూన్ 16న మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా హైదరాబాద్లోని బోయిన్పల్లి వరకు జాతీయ రహదారిపై హైవే అథారిటీ ద్వారా ఎలాంటి చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరగలేదని సమాధానం ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో జైనథ్ మండలం భోరజ్ చెక్పోస్టు వద్ద బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. భద్రత కమిటీలో కీలకంగా వ్యవహరించాల్సిన రవాణాశాఖ పరంగానే లోపాలు కనిపిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. నిధులు మంజూరైనా నిర్లక్ష్యం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బోయిన్పల్లి వరకు జాతీయ రహదారి 44కు సంబంధించి రహదారి భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ గతంలో ఆడిట్ నిర్వహించారు. అనేక బ్లాక్ స్పాట్స్లను గుర్తించారు. ప్రమాదాల నివారణ కోసం రహదారిపై చేపట్టాల్సిన పనులకు సంబంధించి పెన్గంగ నుంచి ఇచ్చోడ దగ్గర ఇస్లాంనగర్ వరకు వివిధ రోడ్డ భద్రత పనుల కోసం రూ.40.28 కోట్లు మంజూరు చేశారు. అందులో కొన్ని పనులు పూర్తి చేశారు. మిగతా పనులు నిర్మాణంలో ఉన్నాయి. భోరజ్ వద్ద స్లిప్ రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతోనే ద్విచక్రవాహనదారులు జాతీయ రహదారిమీదుగానే ప్రయాణిస్తున్నారు. స్లిప్ రోడ్డు నిర్మాణమై ఉంటే గురువారం చైత్ర(13), శుక్రవారం ఉపాధ్యాయురాలు పద్మ(56) దానిమీదుగా ప్రయాణించేవారు. వారి ప్రాణాలు పోయేవికావు. ఇక్కడ సమష్టిగా రోడ్డు భద్రతావైఫల్యం కనిపిస్తోంది. స్పీడ్ గన్లు ఎక్కడ? జిల్లాలో పెన్గంగ వద్ద నుంచి జాతీయ రహదారి 44 మొదలవుతుంది. నిర్మల్ జిల్లా వరకు వంద కిలో మీటర్ల పరిధిలో జిల్లాలో విస్తరించి ఉంది. ఈ రహదారిపై మావల నుంచి నిర్మల్ వైపు వెళ్లే దారిలో పోలీసు శాఖ పరంగా పలుచోట్ల స్పీడ్ గన్లు ఏర్పాటు చేసి అతివేగంగా వెళ్లే వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. పెన్గంగ నుంచి మావల వరకు స్పీడ్ గన్లు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్నారు. చదవండి: పెట్టీ కేసులో సైఫాబాద్ పోలీసుల దురుసు ప్రవర్తన.. లాఠీలతో మహిళలపై దాడి? వరుస ప్రమాదాలతో ఆందోళన.. మూడు రోజులుగా ఈ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. పెన్గంగ నుంచి ఇస్లాంనగర్ వరకు జాతీయ రహదారి రెన్యూవల్ పనులు జరుగుతున్నాయి. హైవే నుంచి స్లిప్ రోడ్లు, సర్వీస్ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అనేకంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు మృత్యువాత పడ్డ తర్వాత భద్రత కమిటీ మేల్కొంది. శుక్రవారం సాయంత్రం ఈ కమిటీ సభ్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇకనైనా వేగిరంగా పనులు చేపట్టి హైవేపై ప్రాణాలు పోకుండా చర్యలు చేపడతారో.. లేదో వేచిచూడాలి. కాగా పనుల విషయంలో వివరాలు అడిగేందుకు ఎన్హెచ్ఏఐ పీడీ శ్రీనివాస్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
నేషనల్ హైవేపై దృష్టి సారించిన ఎమ్మెల్యే రోజా
-
ఏడుగురిని బలి తీసుకున్న మలుపు.. ఆ ఇంట్లో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం
6 People Died in a Road Accident Near Chandragiri Zone: అమ్మా.. నాన్నా.. తాతా.. నానమ్మా.. అన్న పలకరింపులతో వారం కిందటి వరకు ఈ ఇల్లు సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ ఇంటి పరిసరాల్లో శ్మశాన నిశ్శబ్దం అలముకుంది. ఆరుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఈ ఇంటిలో ఒక్క చిన్నారిని మాత్రమే మృత్యుదేవత విడిచిపెట్టింది. మిగిలిన వారందరినీ మింగేసి ఆ పసిదానికి కన్నీటి జ్ఞాపకాలను మిగిల్చింది. రాజాం/తిరుపతి రూరల్/ తిరుపతి తుడా : ఏ వీధికి వెళ్లినా వారి మాటలే. ఏ అరుగున విన్నా వారి ముచ్చట్లే. ఆదివారం ఉదయం చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని మేడమర్తిని ఏడిపించింది. ఈ ఊరిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలవ్వడంతో ఊరుఊరంతా ఆదివారం గుండెలవిసేలా రోదించింది. గ్రామానికి చెందిన కంచరాపు శ్రీరామమూర్తి(65)తో పాటు అతని భార్య సత్యవతి(55), కుమారుడు సురేష్కుమార్(35), కోడలు మీనా (28), మనవరాలు జోష్మిక నందిత(ఏడునెలలు)తో పాటు పూసపాటిరేగకు చెందిన ఆయన వియ్యంకులు పైడి గోవిందరావు(58), వియ్యంకురాలు పైడి హైమావతి(53) చంద్రగిరి వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. పెద్ద మనవరాలు జిషిత మాత్రమే ప్రాణాలు దక్కించుకుంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మృతుల స్వగ్రామం మేడమర్తిలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీరామమూర్తి ఇంటిల్లిపాదీ తీర్థయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆముదాలవలసలో ఉంటున్న ఆయన సోదరుడు రంగారావు భోరున విలపిస్తున్నారు. తిరుపతి సమీపంలో ఉన్న తమ బంధువులను సంఘటనా స్థలానికి పంపించి సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రమాదంలో మృతి చెందిన మీనా సోదరి శ్రీలత కన్నీరుమున్నీరవుతున్నారు. చిత్రంలో నవ్వుతూ కనిపిస్తున్న వారు సురేష్, మీనా, జిషిత. సురేష్కు ఐదేళ్ల కిందట వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందటే మెరైన్ ఇంజినీర్గా కొలువు సాధించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతోంది. ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ సురేష్, మీనాను మృత్యువు తీసుకెళ్లిపోయింది. రెండేళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది. మృత్యుమలుపు..! పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభిస్తున్నాయి. చిత్తూరు– తిరుపతి మార్గంలో కొత్తగా ప్రారంభించిన సువిశాలమైన హైవేపై కొన్ని మలుపులు మృత్యు ఘంటికలను మోగిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి సమీపంలో అగరాల వద్ద మలుపునకు ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి. ఆదివారం ఉదయం కారు ప్రమాదం కూడా ఇక్కడే సంభవించింది. శ్రీకాకుళం జిల్లా మేడమర్తి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురిని ఈ మలుపే బలితీసుకుంది. గతంలో ఈ ప్రాంతంలోనే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది కర్ణాటక వాసులు దుర్మరణం పాలవడం స్థానికులు మర్చిపోకముందే మరో ఘటన సంభవించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కనీసం సూచిక బోర్డులైనా ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. నమ్మలేకపోతున్నాం రెండురోజుల కిందటే శ్రీరామమూర్తి కుటుంబంతో తిరుపతి వెళ్లా డు. సొంతకారులో వెళుతున్నానని, త్వరగా వచ్చేస్తాంలే అని చెప్పాడు. ఆదివారం ఉద యం కూడా ఫోన్లో మాట్లాడాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. – కేవీ రమణ, మేడమర్తి మాతోనే చదువుకున్నాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సురేష్కుమార్ ఐదో తరగతి వరకూ మాతోనే గ్రామంలో చదివాడు. ఉన్నత విద్య, ఇంటర్, బీటెక్ కోర్సులను శ్రీకాకుళం, విశాఖపట్నంలో పూర్తి చేశాడు. అందరితో సరదాగా ఉండేవాడు. చిన్నకూతురు మొక్కు కోసం తిరుపతికి వెళుతున్నామన్నాడు. ఇంతలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. – కె.రాము, మేడమర్తి -
రెండు బైపాస్లు.. 14 అండర్పాస్లు..
సాక్షి, హైదరాబాద్: ఎక్స్ప్రెస్ వే తరహాలో మరో జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. ఇది నాలుగు వరుసల జాతీయ రహదారే అయినప్పటికీ, మధ్యలో రోడ్డు మీదుగా ఇతర చిన్న రహదారుల నుంచి వచ్చే వాహనాలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అండర్ పాస్లను నిర్మిస్తూ ఎక్స్ప్రెస్ వే తరహాలో నిర్మించనున్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారికి మార్గం సుగమమైంది. మరో రెండు నెలల్లో టెండర్ల కసరత్తు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలంలో ఇది అందుబాటులోకి రానుంది. నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ దారిలోని మన్నెగూడ కూడలి వరకు ఈ నాలుగు వరుసల విశాలమైన రోడ్డు అందుబాటులోకి వస్తుంది. మన్నెగూడ నుంచి పరిగి మీదుగా కర్ణాటకలోని బీజాపూర్ వరకు కొనసాగుతుంది. మన్నెగూడ కూడలి వరకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నాలుగు వరుసలుగా దీన్ని నిర్మించనుండగా, అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డును వెడల్పు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం పర్యవేక్షిస్తోంది. ఈ విభాగం ఇప్పటికే తన పరిధిలోని రోడ్డును 30 మీటర్లకు విస్తరించింది. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ తన అ«దీనంలోని రోడ్డును 4 వరుసలుగా విస్తరించేందుకు సమాయత్తమైంది. 60 మీటర్ల వెడల్పుతో.. గతంలో రాష్ట్ర రహదారిగా ఉన్న బీజాపూర్ రోడ్డును 163వ నంబర్ జాతీయ రహదారిగా కేంద్రం ప్రక టించింది. ఇప్పుడు దాన్ని భారత్మాల పరియోజన పథకంలో చేర్చి ఇటీవలే ఎన్హెచ్ఏఐకి అప్పగించింది. అప్పా కూడలి వరకు విశాలంగానే ఉన్న రోడ్డు ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో 25 మీటర్లు, కొన్ని చోట్ల 30 మీటర్లుగా ఉంది. ఇప్పుడు దాన్ని 60 మీటర్లకు విస్తరించనున్నారు. ఇందులో ప్రధాన రోడ్డు 45 మీటర్లుగా ఉండనుంది. మధ్యలో నాలుగున్నర మీటర్ల సెంట్రల్ మీడియన్ ఉంటుంది. ప్ర ధాన క్యారేజ్ వే 30 మీటర్లుగా ఉంటుంది. దీనికి చివరలో వాలు, ఆ తర్వాత డ్రెయిన్ ఇలా మొత్తం 45 మీటర్ల వెడల్పుతో రోడ్డు ఉంటుంది. ఇక రెండు వైపులా విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ఇతర అవసరాల కోసం 15 మీటర్ల (రెండువైపులా కలిపి) స్థలం ఉంటుంది. పెరిగిన ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని.. తాండూరు, వికారాబాద్, పరిగి, బీదర్ సహా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఈ రోడ్డునే వినియోగిస్తుండటంతో కొంతకాలంగా ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. గతంలో శివారు ప్రాంతంగా ఉండి అంతగా రద్దీలేని మొయినాబాద్ ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిపోతోంది. మొయినాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఫామ్హౌస్లు బాగా పెరిగాయి. వాటికి నిత్యం వచి్చపోయే వారితో రద్దీ మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని విస్తరించాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. కాగా, అప్పా కూడలి నుంచి 46.405 కి.మీ. దూరం వరకు, అంటే పరిగి కూడలిలో ఉండే మన్నెగూడ వరకు ఎన్హెచ్ఏఐ ఇప్పుడు పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మొత్తం 221.90 హెక్టార్ల భూమిని కేంద్ర భూసేకరణ చట్టం కింద సమీకరిస్తున్నారు. చిన్న రోడ్లతో ఇబ్బంది లేకుండా.. ఈ రోడ్డుపై వాహనాల రద్దీ నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేశారు. ముఖ్యంగా మధ్యలో ఉండే గ్రామాల వద్ద చిన్న రోడ్ల మీదుగా వచ్చే వాహనాలతో ఇబ్బంది లేకుండా అండర్పాస్లు నిర్మిస్తున్నారు. ఆ వాహనాలు ప్రధాన రోడ్డు దిగువగా అండర్పాస్ల నుంచి ముందుకుసాగుతాయి. చిన్న రోడ్లలోవాహనాల సంఖ్య ఎక్కువగా ఉండే ఆరు చోట్ల భారీ అండర్పాస్లు నిర్మిస్తారు. వీటి నుంచి బస్సులు, ట్రక్కులు, కంటెయినర్ వాహనాల లాంటి భారీ వాహనాలు వెళ్లిపోతాయి. ఇక 8 చోట్ల చిన్న అండర్పాస్లు నిర్మిస్తారు. వీటి నుంచి కార్లు లాంటి తక్కువ ఎత్తుండే వాహనాలు వెళ్తాయి. మొయినాబాద్ వద్ద 4.35 కి.మీ. మేర, చేవెళ్ల వద్ద 6.36 కి.మీ. మేర రెండు బైపాస్ రోడ్లను నిర్మిస్తారు. మన్నెగూడకు సమీపంలోని అంగడి చిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్ప్లాజా నిర్మిస్తారు. ప్రమాదకరంగా మలుపులున్న 0.725 కి.మీ. పరిధిలో రోడ్డును నేరుగా ఉండేలా(రీఅలైన్మెంట్) మారుస్తారు. -
195 కి.మీ. ఎన్హెచ్కు నిధులు
సాక్షి, న్యూఢిల్లీ: 2020–21 సంవత్సరానికి రాష్ట్రంలో రూ.1,005.38 కోట్ల వ్యయంతో 195.6 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. నిజాంపేట–బీదర్ ఎన్హెచ్ 161బీపై అదనంగా 2 లేన్ అప్గ్రెడేషన్ కోసం అవసరమైన భూ సేకరణకు రూ.27.79 కోట్లు మంజూరు చేసినట్లు వివరించా రు. నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి కింద ఎన్హెచ్–565లోని నకిరేకల్–నాగార్జునసాగర్ మధ్య ప్రాంతంలో పునరావాసం, అప్గ్రేడ్ చేసేందుకు ఇంకా మిగిలి ఉన్న పనులను మంజూరు చేసినట్లు మంగళవారం ట్విట్టర్ వేదికగా గడ్కరీ ప్రకటించారు. అంతేగాక హైదరాబాద్–బెంగళూర్ జాతీయ రహదారి–44లో రోడ్డు రవాణా భద్రతను మెరుగుపరిచేందుకు అవసరమైన సర్వీసు రోడ్లు, వాహన అండర్ పాస్ల నిర్మాణం కోసం రూ.21.16 కోట్లు మంజూరు చేశామ న్నారు. ఎన్హెచ్–163లోని హైదరాబాద్–భూపాలపట్నం మధ్య రహదారికి రూ.48.32 కోట్లు మంజూరు అయ్యిందన్నారు. ఇదే జాతీయ రహదారిలోని 2 లేన్ల రహదారులను 4 లేన్లులుగా అభివృద్ధి చేసేందుకు రూ.317.19 కోట్లు కేటాయించామన్నారు. ఎన్హెచ్–63పై ఉన్న ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ మధ్య రహదారిని 6 లేన్లకు విస్తరించడంతో పాటు పునరావాసం కల్పించడం, సర్వీస్ రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, రహదారి భద్రతా సదుపాయాలు తదితర అంశాల అభివృద్ధికి రూ.545.11 కోట్లు మంజూరు అయ్యాయని గడ్కరీ వెల్లడించారు. ఎన్హెచ్ –167లోని జడ్చర్ల్ల–కల్వకుర్తి మధ్య జడ్చర్ల్ల పట్టణంలో 4 లేన్ల ఆర్ఓబీ నిర్మాణం/పునర్నిర్మాణం కోసం రూ.45.81 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు. చదవండి: 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ -
రోడ్లపై యువతుల దందా..
-
రోడ్లపై యువతుల దందా..
సాక్షి, మేడ్చల్ : ఈజీ మనీకి అలవాటు పడి రోడ్లపై దందాకు దిగారు కొందరు యువతులు. వచ్చీ, పోయే వాహనాలను అడ్డగించి డబ్బులు వసూలు చేస్తూ పోలీసులకు చిక్కారు. వివరాలు.. రాజస్థాన్, గుజరాత్ రాష్టాలకు చెందిన యువతులు ఐదు బృందాలుగా ఏర్పడి, జాతీయ రహదారి, నిర్మానుష ప్రాంతాలను టార్గెట్ చేశారు. ఓ గ్రూపు ఘట్కేసర్ రోడ్లపై స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలు అంటూ డబ్బులు వసూలు చేయసాగింది. ఆ గ్రూపులోని యువతులు వచ్చీ, పోయే వాహనాలను ఆపి దందాకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వని వారిని బెదిరించసాగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి : రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్పోర్టుల కేసు రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్పోర్టుల కేసు -
పోలీస్ జీప్ను చూసి ఆ ఇద్దరు మహిళల పరుగులు..
కోల్కతా : మహిళల వేషధారణతో నేషనల్ హైవేపై నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో రానాఘాట్ పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలోని నేషనల్ హైవే 34పై రాత్రి వేళ పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున చీకటిలో నిలుచుని ఉన్న ఇద్దరు మహిళలు వీరి కంటపడ్డారు. పోలీస్ వాహానాన్ని చూడగానే ఆ ఇద్దరు మహిళలు అక్కడినుంచి పరిగెత్తటం మొదలెట్టారు. ( పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్ ) దీంతో పోలీసులకు వారిపై అనుమానం వచ్చింది. ఇద్దర్నీ వెంటాడి పట్టుకున్నారు. అనంతరం వారు మహిళలు కాదని, పురుషులని తెలిసి షాక్ అయ్యారు. అర్థరాత్రి పూట నేషనల్ హైవేపై మహిళల వేషంలో నిల్చుని, వాహనాలను ఆపి వాటిని హైజాక్ చేస్తామని, అలా కుదరకపోతే అందులోని వ్యక్తిని దోచుకుంటామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. -
వరంగల్ హైవేపై 2 ఆర్టీసీ బస్సులు ఢీ
సాక్షి, వరంగల్ అర్బన్: పండగపూట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. వివరాలు.. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 24మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్వారంటైన్ నుంచి 100 మంది పరారీ
గువహటి : తమకు సరైన ఆహరం, నీళ్లు అందించడం లేదంటూ కరోనా రోగులు ఆందోళనకు దిగారు. క్వారంటైన్ సెంటర్ నుంచి 100కు పైగా కరోనా రోగులు పారిపోయి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ ఘటన అసోంలోని కామ్రూప్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే గదిలో 10 నుంచి 12మందిని ఉంచుతున్నారని, భౌతిక దూరం ఎలా పాటించాలని ప్రశ్నించారు. తమకు సరైన ఆహరం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ కరోనా రోగులు జాతీయ రహదారిపై నిరసన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన డిప్యూటీ కమిషనర్ కైలాష్ కార్తీక్.. పై అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని, సరైన వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రోగులు తిరిగి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. (పక్కా ప్లాన్తో ప్రియుడితో కలిసి క్వారంటైన్కు..) ఈ ఘటన ఆరోగ్య శాఖ మంత్రి హిమంత భిశ్వ శర్మ మాట్లాడుతూ.. ఒకవేళ క్వారంటైన్ సెంటర్లో ఇబ్బందులు ఎదుర్కొంటే వారు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండొచ్చని పేర్కొన్నారు. సాధ్యమైనంతగా సౌకర్యాల లేమి లేకుండా చూసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్నారని అన్నారు. అంతేకాకుండా వేరే రాష్ర్టాలతో పోలిస్తే ఆర్థిక భారం అయినప్పటికీ అస్సాంలోనే కరోనా టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. (కరోనాతో మాజీ సీనియర్ అధికారి, రచయిత్రి మృతి) -
నేషనల్ హైవేపై పోర్న్ వీడియో..
-
నేషనల్ హైవేపై పోర్న్ వీడియో..
మిచిగాన్ : ఓ ఇద్దరు యువకులు చేసిన అల్లరి పనికి మిచిగాన్ హైవేపై వెళుతున్న ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ప్రచార ప్రదర్శనలు రావాల్సిన బిల్బోర్డుపై బూతు చిత్రాలేంటని ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం మిచిగాన్ నేషనల్ హైవేపై బైకుమీద వెళుతున్న ఇద్దరు వ్యక్తులు బిల్బోర్డును కంట్రోల్ చేసే గది దగ్గరకు వెళ్లారు. తమ సెల్ఫోన్లో ఉన్న పోర్న్ వీడియో బిల్బోర్డు తెరపై వచ్చేలా చేశారు. దీంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో హైవేపై ఉన్న బిల్బోర్డు తెరలపై పోర్న్ వీడియోలోని దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో హైవేపై వెళుతున్న వారు ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అక్కడినుంచి వెళ్లిపోతూ ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఆ ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిల్బోర్డుపై దాదాపు 17 నిమిషాల పాటు పోర్న్ వీడియోలు ప్రదర్శితమయ్యాయి. ఇది గమనించిన పోలీసులు సంబంధిత వ్యక్తులను అలర్ట్ చేశారు. వారు వెంటనే వీడియోలను నిలిపివేశారు. బిల్బోర్డ్ గది సీసీ టీవీ ఫొటేజ్ల ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. -
స్పీడ్ లిమిట్లోనే ఉన్నా... భారీగా చలాన్లు..!
న్యూఢిల్లీ : అనుమతించిన స్పీడ్లోనే వాహనాలు ప్రయాణించినప్పటికీ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధించారు. వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వేసిన చలాన్లను విత్డ్రా చేసేందుకు నిర్ణయించారు. వివరాలు.. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న 24వ జాతీయ రహదారిపై ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో దాదాపు ఒకటిన్నర లక్షల చలాన్లు విధించారు. వీటిలో అధిక భాగం ఓవర్స్పీడ్కు సంబంధించినవే. అయితే, ఉన్నఫళంగా చలాన్లు విత్డ్రా చేస్తామనడానికి కారణాలేంటనే ప్రశ్నకు ట్రాఫిక్ ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. జాతీయ రహదారులపై గంటకు 70 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించాలి. ఈ మేరకు ప్రజా పనుల విభాగం వేగం 70 దాటితే శిక్షార్హులు అనే బోర్డులు కూడా పెట్టాయి. అయితే, 24వ జాతీయ రహదారిపై నిజాముద్దీన్ బ్రిడ్జి, ఘాజీపూర్ మధ్య 60 కి.మీ వేగంతో వెళ్లిన వాహనాలకు సైతం చలాన్లు విధించారు. దాంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే చలాన్లు వెనక్కు తీసుకుని ఉండొచ్చు’ అని అన్నారు. ఇదిలాఉండగా.. ఓవర్స్పీడ్ చలాన్లను ఇప్పటికే చాలామంది చెల్లించారని.. మరి ఆ సొమ్మునంతా వారికి తిరిగి ఇస్తారా అనే ప్రశ్నకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల నుంచి సమాధానం కరువైంది. అక్రమంగా ఫైన్లు వేయడంతో కోర్టుకు వెళ్తామన్న పలువురి హెచ్చరికల నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక విమర్శల నుంచి తప్పించుకోవడానకి 60 కి.మీ వేగం దాటితే శిక్షార్హులు అనే సూచిక బోర్డులు పెట్టాలని ట్రాఫిక్ అధికారులు ప్రజా పనుల విభాగాన్ని కోరడం గమనార్హం. -
నెత్తు‘రోడు’తున్నాయి
ఉమ్మడి జిల్లాలో రహదారులు నెత్తు‘రోడు’తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. కనీసం ఒకరిద్దరు చనిపోతూనే ఉన్నారు. ఇంకొందరు గాయాలపాలవుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడల్లా డ్రైవర్ అజాగ్రత్త.. అతివేగమే ప్రమాదానికి కారణాలని చెప్పుకొస్తున్న అధికారులకు తమ తప్పు మాత్రం కనిపించడం లేదు. సాక్షి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలోని రహదారులను అద్దంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న అధికార యంత్రాంగం ప్రమాదకర మలుపులు.. కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా మొద్దు నిద్రపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకేజీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతోనూ ఆ రహదారులను మరమ్మతు చేయించుకోవడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీసం జాతీయ రహదారుల నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 2,600 కి.మీ. ఆర్అండ్బీ, సుమారు ఏడు వేల కి.మీ. పంచాయతిరాజ్ రోడ్లు ఉన్నాయి. తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే రోడ్ల నిర్మాణంలో నాణ్యత అంశాల పరిశీలన, పర్యవేక్షణతో పాటు ఏయే ప్రాంతాల్లో మలుపులు ఉన్నాయి? ఎక్కడెక్కడ కల్వర్టులు ఉన్నాయి? వాటి వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, కల్వర్టుల మరమ్మతు చేపట్టాల్సిన బాధ్యత ఈ రెండు శాఖలదే. అయితే వందలాది మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, కల్వర్టుల వద్ద రక్షణ చర్యలు లేవంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ మలుపుల వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగి.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతో మంది క్షతగాత్రులయ్యారు. అయినా ఇంతవరకు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. 613 కి.మీ. ఎన్హెచ్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 613 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. మొత్తం 110 గ్రామాల మీదుగా రహదారుల నిర్మాణం జరిగింది. తరచూ ప్రమాదాలు జరిగే 68 ప్రాంతాలను అధి కారులు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ వరకు అప్గ్రేడ్ అయిన 167 జాతీయ రహదారి పనులు నత్తకు నడకనేర్పుతున్నాయి. రాయచూర్ నుంచి మహబూబ్నగర్ వరకు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండగా.. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వరకు పనులు పూర్తి దశలో ఉన్నా.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై డీఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా 167 జాతీయ రహదారి పనుల్లో భాగంగా జడ్చర్ల–కల్వకుర్తి వరకు మొదటి బిట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. పనుల గడువు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉందన్నారు. ఆలోపే పనుల పూర్తితో పాటు ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు.. రోడ్డుకు రేడియం ఏర్పాటు చేయిస్తామన్నారు. అటకెక్కిన ‘ట్రామాకేర్’ ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరిగితే కొనఊపిరితో ఉన్న క్షతగాత్రులను ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రధాన ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే.. చాలా వరకు ప్రమాదాలు జరిగిన ప్రాంతాల సమీపంలో పెద్ద ఆస్పత్రులు లేకపోవడం.. ఉన్న ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది.. రోగులను కాపాడేంత స్థాయిలో వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలు లేవు. దీంతో ఆయా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినా ప్రాథమిక చికిత్స అందించి ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆస్పత్రికి చేరుకునేలోపే గాయపడినవారు చనిపోవడం జరుగుతోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలందించేలా ఉమ్మడి జిల్లా పరిధిలోని జడ్చర్ల, కొత్తకోట వంటి ప్రమాదాలు జరిగే ప్రధాన ప్రాంతాల్లో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన ప్రతిపాదనల్ని అధికారులు నివేదించారు. తర్వాత ఆ సెంటర్ల ప్రతిపాదనలు అటకెక్కాయి. మరోవైపు సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు అలసిపోతే వారు సేద తీరేందుకు జాతీయ రహదారులపై ఏర్పాటు చేయాల్సిన రెస్ట్ సెంటర్ల నిర్వహణపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల టాయిలెట్ల నిర్వహణ బాగా లేకపోవడంతో వాహనదారులు అక్కడక సేద తీరేందుకు ఇష్టపడడం లేదు. వీరిలో కొందరు రహదారుల వెంట ఉన్న హోటళ్లు.. దాబాల వద్ద ఆగి విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా మంది ఆగకుండా వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు
సాక్షి, గుత్తి రూరల్: జక్కలచెరువు శివారులో ఇసురాళ్లపల్లి క్రాస్ వద్ద 67వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం తిమ్మాపురానికి చెందిన రామాంజనేయులు, పెద్దొడ్డికి చెందిన వీరన్న, కోడలు సునీత, అనంతపురానికి చెందిన వాణి, కుమారుడు నరసింహ, కుమార్తె నందిని, రంగమ్మ, గుంతకల్లు మండల మొలకలపెంటకు చెందిన పార్వతి పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో జరిగే వివాహానికి గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్లే ఆటో ఎక్కారు. ఇసురాళ్లపల్లి క్రాస్ వద్ద వేగంగా వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడ్డ వారిలో రామాంజనేయులు మినహా అందరూ బంధువులు. తీవ్రంగా గాయపడ్డ వారిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ రామాంజనేయులు, వాణి, వీరన్న, సునీతలను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హోదా సరే.. గుర్తింపు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల గుర్తింపు విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు. రాష్ట్రంలోని పలు రహదారులను జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) జాతీయ రహదారులుగా గుర్తించింది. వీటిని అధికారికంగా నోటిఫై చేసి, గెజిట్లో చేర్చాల్సిన కేంద్రం మాత్రం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రూ.17,000 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులకు శంకుస్థాపన, 7 ప్రాజెక్టులకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. విభజన హామీల ప్రకారం తమకు రావాల్సిన జాతీయ రహదారులనే అడుగుతున్నామని కొత్త డిమాండ్లేవీ లేవని రాష్ట్ర ఎంపీలు అంటున్నారు. కనీసం ఉన్న జాతీయ రహదారుల విస్తరణ కూడా చేపట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం ఖర్చు భరిస్తామంటున్నా.. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ అభివృద్ధికి జాతీయ రహదారుల అభివృద్ధి అత్యవసరం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 3,155 కి.మీ. పొడవైన 25 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో ఇప్పటికే 1,388 కి.మీ.ల మేర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. మిగిలిన 1,767 కి.మీల మేర రోడ్ల గుర్తింపును ఖరారు చేయకుండా తాత్సారం చేస్తోంది. ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ, ఇతర ఖర్చుల్లో సగం వరకు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రం మీనమేషాలు లెక్కించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? రాష్ట్రంలోని 13 రహదారులకు కేంద్రం గతంలోనే జాతీయ రహదారుల హోదా ఇచ్చింది. వీటిని ఇంతవరకూ అధికారికంగా గెజిట్లో చేర్చలేదు. దీంతో ఇవి పేరుకు మాత్రమే జాతీయ రహదారులుగా మిగిలాయి. మొత్తం 1,767 కి.మీ.ల దూరం ఉన్న ఈ రహదారులకు అధికారిక గుర్తింపులో మోక్షం కలగకపోవడం గమనార్హం. హోదా దక్కినా గుర్తింపు రానివి ఇవే! 1. మెదక్–రుద్రూర్–బాసర–భైంసా (ఎన్హెచ్ 61, 166 కి.మీ.), 2.కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి (ఎన్హెచ్ 563, 165 కి.మీ.), 3.సరపాక–ఏటూరునాగారం–కాళేశ్వరం–చెన్నూరు–కౌతాల– సిర్పూర్ (306 కి.మీ.) 4.మిర్యాలగూడ–పిడుగురాళ్ల –నర్సంపేట (26 కి.మీ) 5.భద్రాచలం–మీలుగుజిల్లి–జంగారెడ్డిగూడెం–దేవురపల్లి (68 కి.మీ) 6. జహీరాబాద్–బీదర్–దేగీర్ (25 కి.మీ) 7. చౌటుప్పల్– ఇబ్రహీంపట్నం–ఆమనగల్–షాద్నగర్–చేవెళ్ల–శం కర్పల్లి–కంది (ఎన్హెచ్–65, 183 కి. మీ.) 8. మెద క్–సిద్దిపేట–ఎల్కతుర్తి (ఎన్హెచ్– 65, 133 కి.మీ) 9.హైదరాబాద్ ఓఆర్ఆర్ వలిగొండ–తొర్రూర్–నెల్లికుదురు–మహబూబాబాద్–ఇల్లందు–కొత్తగూడెం (ఎన్హెచ్ 30, 234 కి.మీ.), 10. తాండూరు–కొడంగల్–మహబూబ్నగర్ రోడ్ (96 కి.మీ.), 11 కొత్త కోట–గూడూరు–మంత్రాలయం (ఎన్హెచ్–167, 70 కి.మీ.), 12. రంగశాయిపేట– చింత నెక్కొండ–కేసముద్రం–మహబూబాబాద్ (71 కి.మీ.) 13.బహదూర్పల్లి–అశ్వాన్పల్లి–గోరియావీడు–నేరేడుపల్లి తండా–గర్మిలపల్లి–బుర్రాపల్లి–ఎంపేడ్–వావిలాల– జమ్మికుంట–వీణవంక– కరీం నగర్ (131 కి.మీ.). కాగా, రాష్ట్రంలోని పలు రోడ్ల విస్తరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. కనీసం వీటి విస్తరణకైనా అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిని కేంద్రం ఇంకా పట్టించుకోవట్లేదు. పార్లమెంటులో నిలదీస్తాం: వినోద్ రహదారులకు కిలోమీటరుకు రూ.4 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన 1,767 కి.మీ.లకు రూ.7,068 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. వీటికి అధికారిక గుర్తింపు, నిర్మాణానికి కావాల్సిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియట్లేదు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిశాం. తాజాగా మరోసారి లేఖ రాశాం. స్పందించకుంటే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం. -
జాతీయ రహదారిపై చిరుత మృతి.. కలకలం
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని మర్రిపాడులో చిరుత పులి మృతి కలకలం రేపింది. అడవిలోంచి ఓ చిరుత పులి బాటసింగంపల్లి జాతీయ రహదారిపైకి రావటంతో గుర్తు తెలియని వాహనం ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందింది. తరుచూ చిరుత పులులు ఇలా రహదారులపైకి వస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
‘జబర్దస్త్’ కమెడియన్కు తప్పిన ప్రమాదం
సాక్షి, మహబూబ్నగర్: ‘జబర్దస్త్’ కమెడియన్ చలాకి చంటికి మంగళవారం పెను ప్రమాదం తప్పింది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కాగా, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి చంటి సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వల్ప గాయాలైన చంటికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణాలు తీసిన ట్రావెల్స్ బస్సు
అప్పుడే తెల్లవారుతోంది. జాతీయ రహదారిపై భారీ శబ్దం. ఏం జరిగిందో అని ఉలిక్కి పడిన జనం రోడ్డు మీదకు వచ్చే సరికి భీతావహు పరిస్థితి. రోడ్డుపై క్షతగాత్రులు రక్తపు మడుగులో చెల్లాచెదురుగా పడి ఉన్నారు. వాహనంలో ఇరుక్కున్న ఇంకొందరి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం ధ్వనించింది. వాహనంలో కూర్చున్న స్థితిలోనే డ్రైవర్, మహిళ, తల్లి ఒడిలోనే ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. కొన్ని గడియల్లో దైవ సన్నిధికి చేరుకుంటామనుకున్న కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుతూనే ఈ ఘోర కలిని చూసిన స్థానికులు చలించిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలో చేయ్యేసి రోడ్డుపై పడిన, వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను వెలికి తీసి 108 వాహనాల్లో నాయుడుపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర దుర్ఘటన పెళ్లకూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. మృతులంతా గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం నాయుడుపాలెం గ్రామస్తులు. పెళ్లకూరు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా పెళ్లకూరు వద్ద శనివారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనా స్థలిలో క్షతగ్రాతుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలవగా, 12 మంది గాయపడ్డారు. ట్రావెల్స్ బస్సును తుఫాన్ వాహనం ఢీకొనడంతో గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన మాసబోయిన సుబ్బులు, చిన్నారి సాయివెంకటచరణ్ (3), డ్రైవర్ వెన్నపూస పుల్లారెడ్డి (28) అక్కడికక్కడే మృతి చెందగా, మరో చిన్నారి పూజితను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలి లో తీవ్ర రక్త గాయాలైన క్షతగాత్రులు కాపాడండి.. అంటూ ఆర్తనాదాలు చేశారు. తీవ్రంగా గాయపడిన పత్తి శీను, కోటేశ్వరమ్మ దంపతులతో పాటు బంధువులు ఆంజనేయులు, భూలక్ష్మి, ఇనుముల పుల్లమ్మ, నాగరాజు, ఎడ్ల చరణ్, ఎడ్ల శీను, కత్తి ఆదిలక్ష్మి, ఇనుముల భార్గవి, ఇనుముల శ్రీనివాసులు, ఇనుముల వెంకటేష్ గాయాలతో కొందరు వాహనంలో ఇంకొందరు నడిరోడ్డుపై చెల్లాచెదురుగా పడి సాయం కోసం చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై మహ్మద్ హనీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను నాయుడుపేట వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో జాతీయ రహదారి మార్గంలో రోడ్డుకు ఇరువైపులా సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, స్థానికుల చొరవతో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. సమాచారం అందుకున్న గూడూరు డీఎస్పీ రాంబాబు, డీటీసీ శివరామ్ప్రసాద్, ఆర్టీవో చం దర్, ఎంవీఐ జకీర్ ప్రమాదస్థలిని పరి శీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ ట్రావెల్ బస్సు డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, బస్సును స్వాధీనం చేసుకున్నారు. -
జూన్లో అమిత్ షా తెలంగాణ పర్యటన
సాక్షి, హైదరాబాద్: జూన్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 14న అమిత్షాతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ఉందని, ఆ సమావేశంలో అమిత్ షా పర్యటన తేదీలు ఖారారవుతాయని పేర్కొన్నారు. అమిత్ షా పర్యటన విధి, విధానాల ఖరారు కోసం ఈ నెల 17, 18 తేదిల్లో హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం కానున్నారని తెలిపారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ హజరవుతున్నారన్నారు. తెలుగురాష్ట్రాలకు కేంద్ర ఎంతో సాయం చేసింది తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎంతో సాయం చేస్తున్నప్పటికీ.. ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రంపై అనవసర నిందలు వేయడం సరికాదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రెండు రోజుల క్రితమే హైదరాబాద్లో 1500 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. నాలుగేళ్లలో తెలంగాణకు 3వేల కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చిన ఘనత గడ్కరీదేనన్నారు. 50 వేల కోట్ల రూపాయలతో జల రవాణా మార్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీటి సమస్యలు ఉండవని పేర్కొన్నారు. ‘రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం కేంద్రం 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కూడా కేంద్రం అన్ని రకాల అనుమతులు మంజూరు చేసింది. అయినా కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేయడం దారుణమ’ని లక్ష్మణ్ అన్నారు. ఈ నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎంత ఖర్చుచేసింది, ఎంత అభివృద్ధి చేసిందనే దానిపై చర్చకు సిద్ధమని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని టీడీపీ కోరుకుంటోందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ బీజేపీని ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. -
ఎన్హెచ్ 161కి కేంద్రం అనుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జాతీయ రహదారి 161 నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ మధ్య 157 కి.మీ. మేర ఎన్హెచ్ 161 నిర్మాణానికి ఈ మేరకు అనుమతులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. బుధవారం ఎంపీ జితేందర్రెడ్డితో కలసి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి పలు జాతీయ రహదారులకు అనుమతుల మంజూరుపై ఆయన చర్చించారు. అలాగే చౌటుప్పల్, షాద్నగర్, కంది మధ్య 205 కి.మీ. జాతీయ రహదారికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్లు సమర్పించామని, టెండర్లకు అనుమతులివ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు దేశంలోని అన్ని జాతీయ రహదారులకు కలిపే యూనిక్ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ప్రాజెక్టు విషయమై గతంలో కేంద్ర మంత్రిని కలిశారని వివరించారు. దీనిపై రాష్ట్ర అధికారులతో చర్చించి త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. మహబూబ్నగర్–జడ్చర్ల రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మార్చడంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇక సీఆర్ఎస్ కింద తెలంగాణకు రూ.వెయ్యి కోట్ల నిధులను విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. ‘మహా’గవర్నర్ విద్యాసాగర్రావును కలసిన తుమ్మల మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావును మంత్రి తుమ్మల మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్యాసాగర్రావును కేజీ మార్గ్లోని మహారాష్ట్ర సదన్లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. -
టీఆర్ఎస్ నేత డ్యాన్స్.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: ఆయన గ్రేటర్లో కార్పొరేటర్.. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ.. సమస్యలపై స్పందిస్తూ అందరి మన్ననలు పొందారు. పౌరుల సమస్యలపై విభిన్నంగా స్పందించే ఆయన అందరికీ ఆదర్శమంటూ గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రశంసించారు. అయితే సదరు కార్పొరేటర్కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. హయత్నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి.. స్నేహితులు, అనుచరులతో కలిసి రెండురోజుల క్రితం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లారు. అక్కడ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ హైవేపై ఆగి అనుచరులతో కలిసి తీన్మార్ ఆడారు. ఇరువైపులా వాహనాలు వస్తున్నా పట్టించుకోకుండా.. కారులో పాటలు పెట్టుకుని నడిరోడ్డుపై చిందులేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన అనుచరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇపుడు వైరల్గా మారింది. ఓ ప్రజాప్రతినిధి రోడ్డుపై కారు ఆపి ఇలా డ్యాన్సులు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజానికి, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే ఇలా ప్రవర్తించడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. -
రహదారులు రక్తసిక్తం..
ఆదిలాబాద్టౌన్: రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రయాణికుల పాలిట మృత్యుదారులుగా మారుతున్నాయి. మానవ తప్పిదమే మనకు భద్రత లేకుండా చేస్తోంది. ఎటు నుంచి ఏ వాహనం ఢీకొని ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. రోడ్డు ప్రమాదాలకు రహదారుల నిర్మాణం ఒక కారణమైతే, నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, మద్యం సేవించడం ఇతర కారణాలుగా చెప్పవచ్చు. నిత్యం జిల్లాలో మూడు నుంచి నాలుగు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతను పాటిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గుడిహత్నూర్ మండలం జాతీయ రహదారి తెలంగాణ దాబా వద్ద ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. తప్పెవరిదైనా రోడ్డు ప్రమాదంలో మూడు నిండు ప్రాణాలు గాలి లో కలిసిపోయాయి. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాహన చోదకులు నిబంధనలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా చూసుకోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జాతీయ రహదారి ప్రమాదాలే ఎక్కువ.. జిల్లాలో జాతీయ రహదారిపైనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గతంలో రహదారి భద్రత విభాగం గుర్తించింది. ఇందులో గుడిహత్నూర్ జాతీయ రహదారి, నేరడిగొండ, మావల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదేవిధంగా పలు గ్రామాలకు వెళ్లే రహదారులపై ఉన్న వంతెనలు ఇరుకుగా, కాలంచెల్లినవి కూడా ఉండడం తో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జాతీయ రహదారిపై సరైన సూచిక బోర్డులు లేకపోవడం, వాహనాల అతివేగమే ప్రమాదాలకు దారితీస్తోంది. దీంతోపాటు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించకపోవడం, రోడ్లపై వాహనాలు నిలుపుతుండడంతో రాత్రి సమయంలో వేగంగా వచ్చే వాహనాలు వాటికి ఢీకొని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించడం, అతివేగం, సీటుబెల్టు, హెల్మెట్లు ధరించకపోవడం, జాతీయ రహదారిపై ప్రమాద స్థలాలు గుర్తించకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్స్ లేకపోవడం, వాహనాలు ఇష్టారీతిన నడపడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురేసి, ఆట్లో పరిమితికి మించి ప్రయాణికుల తరలింపుతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటిస్తే మేలు.. జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మించేటప్పుడు షెల్టర్లు, బర్ములు సక్ర మంగా ఉన్నాయా? లేదా? ఒకటికి రెండు సార్లు కచ్చితంగా చూడాలి. కూడలి వద్ద అవతలి నుంచి వచ్చే వారు ఎదురుగా వస్తున్న వారికి 40 నుంచి 50 డిగ్రీల కోణంలో కనిపించాలి. రోడ్డు మలుపు పూర్తిగా తిరకగముందే ఎదురుగా వచ్చే వాహనాలు దారి ఇచ్చే విధంగా ఉండాలి. రహదారులపై ప్రమాదకరమైన ప్రాంతాన్ని సూచించేందుకు హెచ్చరికల బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వీటిని ఆయా స్పాట్లకు 200 మీటర్ల దూరంలో ఒక బోర్డు, 100 మీటర్ల దూరంలో ఒక బోర్డు ఉంచాలి. వేగ నియంత్రణ కోసం రహదారి స్థితిని బట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అందు కోసం జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్స్పాట్, మూలమలుపుల వద్ద రంబ్లర్స్ట్రిప్స్ను అతికించాలి. డెత్స్పాట్ వద్ద డివైడర్ల ఎత్తు పెంచి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటిని గుర్తించేలా రిఫ్లెక్టీవ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి. ప్రమాదభరితమైన ప్రాంతాల్లో డివైడర్లు రాత్రివేళల్లో కూడా కనిపించేలా క్యాట్ఐస్ ఏర్పాటు చేయాలి. యువతే అధికం.. యువకుల చేతిల్లోకి వెళ్తున్న బైక్లు కళ్లెంలేని గుర్రాల్లా మారుతున్నాయి. అతి వేగంతో ప్రయాణిస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టడమే కాకుండా, ఇతర ప్రయాణికులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. కొన్నిసార్లు ఆగి ఉన్న వాహనాలను ఢికొట్టి మృత్యుఒడిలోకి జారిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతు న్న వారిలో యువకులే అధికంగా ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, చిన్న వాహ నాలపై అధిక సంఖ్యలో కూర్చోవడం వంటివి భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. యువకులు దూకుడు తగ్గిస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు. పిల్లలపై ఉన్న ప్రేమతో 18 ఏళ్లు నిండకుండానే తల్లిదం డ్రులు ముందూ వెనుక చూడకుండా వాహనాలు కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించాలి. నిబంధనలకు తిలోదకాలు.. వాహనదారులు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. హెల్మెట్ లేకుం డా ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం చట్టరీత్యా నేరం. అయితే జిల్లాలో హెల్మెట్ వాడే వారి సంఖ్య చాలా తక్కువ. జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు అరుదుగా వాడుతున్నారు. అంతర్గత రోడ్లపై హెల్మెట్ ధరించే వ్యక్తులు దాదాపు లేరనే చెప్పాలి. -
ముగ్గురిని బలిగొన్న నిర్లక్ష్యం
అంతసేపు ఆనందంగా గడిపారు. సరిగ్గా 15 నిమిషాల్లో ఇల్లు చేరుతామనుకున్నారు.. అంతలోనే రోడ్డుప్రమాదం వారింట విషాదాన్ని నింపింది. గుడిహత్నూర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుడిహత్నూర్(బోథ్) : మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. పోలీసులు, మృతుడి మిత్రులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్కు చెందిన స య్యద్ అహ్మద్ (43) గత కొన్ని సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. తరుచూ ముప్కాల్లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం భార్య ఫర్హానాబేగం, కొడుకు సయ్యద్ ఉమర్ (9) కూతురు మహదియాతోపాటు డ్రైవర్ బిలాల్ (22) ఎర్టీగా వాహనంలో ముప్కాల్లో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి తిరుగు ప్రయాణంలో నిర్మల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆదిలాబాద్కు బయలు దేరారు. మండల కేంద్రం దాటిన తర్వాత తెలంగాణ దాబా వద్ద హైవే స్పీడ్ ట్రాక్పై ఓ లారీ టైరు పగలడంతో ఆగి ఉంది. ఇది గమనించని కారు డ్రైవర్ లారీని రాత్రి 11 గంటల సమయంలో ఢీకొట్టాడు. ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ముందు సీట్లో కూర్చున్న తండ్రీకొడుకులు సయ్యద్ అహ్మద్, సయ్యద్ ఉమర్, డ్రైవర్ బిలాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భార్య ఫర్హానాబేగం, కూతురు మహదియాకు తీవ్రగాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించి క్షతగాత్రులను రిమ్స్కు తరలించారు. మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన ఓ కుటుంబం ప్రమాదానికి గురికావడం వీరిలో తండ్రీకొడుకులు చనిపోవడం..మృతుడి భార్య, కూతురు తీవ్రంగా గాయపడడంతో సన్నిహితులు, కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.కిరణ్కుమార్ తెలిపారు. నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు తీసింది హైవేపై నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన హైవే పెట్రోలింగ్తోపాటు సదరు హైవే నిర్వహణ సంస్థ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమైంది. లారీ టైరు పేలి మరమ్మతు కోసం గంటల తరబడి హైవే స్పీడ్ ట్రాక్పై నిలిచి ఉంది. వెంటనే ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడంలో ఆయా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో పాటులారీ డ్రైవర్ కనీసం ఇండికేటర్లు, ఇతరాత్ర ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో లారీ చీకట్లో కనిపించలేదు. కారు డ్రైవరు సైతం అతివేగంగా ఉండడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కంటే ముందే పలువురు లారీ చీకట్లో కనిపించక వాహనాన్ని అదుపు చేసుకొని ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. ఇరువురి నిర్లక్ష్యం మూడు ప్రాణాలను తీసింది. -
మృత్యుమార్గం..
బూర్గంపాడు : మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామం మృత్యుమార్గాన్ని తలపిస్తోంది. ఈ గ్రామం వద్ద ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు తమ నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా మణుగూరు–కొత్తగూడెం జాతీయ రహదారి పనులు మోరంపల్లిబంజర గ్రామం కూడలిలో అస్తవ్యస్తంగా చేపట్టడంతో నిర్మాణం అసంపూర్తిగా వదిలేశారు. మణుగూరు వెళ్లే రహదారి మార్గంలో రహదారి ఒక పక్క ఎత్తు, మరోపక్క పల్లంగా నిర్మించడంతో ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆ ప్రాంతానికి చేరుకోగానే అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడి పలువురు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎంతో మంది గాయాలపాలవుతున్నారు. రాత్రి వేళ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఆ ప్రాంతం ప్రమాదాలకు నెలవుగా మారింది. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టడం లేదు. తరచూ ప్రమాదాలు జరగడంపై స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రెండు రోజుల వ్యవధిలో రెండు రోడ్డు ప్రమాదాలలో ఒక మహిళ, ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడంఢఢతో పాటు పలువురు గాయపడ్డారు. జనవరి 30వ తేదీ రాత్రి అశ్వాపురంకు చెందిన బైరిబొయిన లింగమ్మ, మరో ఇద్దరు యువకులు బైక్పై అశ్వాపురం నుండి పాల్వంచ వెళ్తుండగా మోరంపల్లిబంజర వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. లింగమ్మ తలకు బలమైన గాయంకాగా ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ముగ్గురిని మోరంపల్లిబంజర పీహెచ్సీకి తరలించగా చికిత్స పొందుతూ లింగమ్మ మృతి చెందింది. జనవరి 31 రాత్రి మణుగూరుకు చెందిన ధరావత్ రవీందర్, మోహన్రావు, రూపలు ముగ్గురు బైక్పై మోరంపల్లిబంజర నుండి మణుగూరు వస్తుండగా కొత్తగూడెం–మణుగూరు జాతీయ రహదారిపై అదే ప్రాంతంలో బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. రహదారిపై అటుగా వస్తున్న లారీ వీరిని ఢీకొట్టడంతో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుండటంతో కలత చెందిన స్థానికులు బుధవారం రాత్రి రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానికుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామవడంతో బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఇప్పటికైనా అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ స్పందించి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసి మోరంపల్లిబంజరలో ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
సురక్షిత ప్రయాణం
జనగామ: ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖవంతం అనే నినాదం ప్రతి బస్సుపైనా కనిపిస్తుంది. అంకితభావం కలిగిన డ్రైవర్లు ఈ నినాదాన్ని అక్షర సత్యంగా మార్చారు. ప్రైవేట్ వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ ప్రయాణం సురక్షితమన్న భావన ప్రజలకు కల్పించడంలో సఫలీకృతులయ్యారు. జిల్లాలో ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు స్వల్పం. ఈ నెల19 నుంచి ప్రారంభమైన ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాలు 25 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి అధికారుల ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. బస్సు కండీషన్, డ్రైవింగ్ చేసే సమయంలో ఏకాగ్రత.. ప్రయాణికులతో ఎలా ఉండాలనే దానిపై నిపుణులతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. బస్సును ఈ రోజు పూర్తి ఏకాగ్రతతో నడిపిస్తాను, అవసరమైన సమయంలో వేగాన్ని నియంత్రణ చేస్తూ, ప్రయాణికులకు సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తానని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఉత్తమ డ్రైవర్లకు బహుమతులను అందిస్తున్నారు. తగ్గిన ప్రమాదాలు... ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితనే భావన ప్రయాణికుల్లో బలంగా నాటుకు పోయింది. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా డ్రైవర్పై పని ఒత్తిడి తక్కువ. మూడేళ్లుగా జనగామ జిల్లా పరిధిలో ఆర్టీసీ ప్రమాదాలు తక్కువనే చెప్పుకోవచ్చు. 2015తో పోలిస్తే 2016లో ప్రమాదాల సంఖ్య తగ్గింది. 2015లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. చిన్నవి, పెద్దవి కలుపుకుని జరిగిన ప్రమాదాల్లో 12 మంది క్షతగాత్రులయ్యారు. 2016లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడగా..మేజర్, మైనర్ ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 2015తో పోలిస్తే మూడు శాతం మేర ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2017 ఏప్రిల్లో సిద్దిపేట జిల్లా కేంద్రంలో జనగామ డిపోకు చెందిన బస్సు ఢీకొని ఓ మహిళ చనిపోగా.. తొమ్మిది రోడ్డు ప్రమాదాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై.. వరంగల్–హైదరాబాద్, సిద్దిపేట–విజయవాడ జాతీయ, స్టేట్ హైవేలపై ప్రైవేట్ వాహనాల రోడ్డు ప్రమాదాలు ఎక్కువే. అతివేగం, మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. అమాయకులను బలి చేస్తున్నారు. జనగామ జిల్లాలో 2015 సంవత్సరంలో జాతీయ, రాష్ట్ర రహదారిలో 320 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగగా..ఇందులో 170 మందికి పైగా మృతి చెందారు. 350 మందికి పైగా తీవ్ర, స్వల్ప గాయాలయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్, పోలీసు పెట్రోలింగ్, నిరంతర నిఘా పెంచడంతో 2016లో ప్రమాదాల సంఖ్య 292కు తగ్గి పోయింది. ఈ ప్రమాదాల్లో 133 మంది అక్కడికక్కడే చనిపోగా.. 299 మంది గాయాల పాలయ్యారు. 2017లో 265 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగగా..100కు పైగా మృతి చెందారు. నేడు ఫ్యామిలీ కౌన్సెలింగ్.. తరుచూ రోడ్డు ప్రమాదాలు చేస్తున్న డ్రైవర్లకు కుటుబ సభ్యులతో కౌన్సెలింగ్ ఇస్తారు. డ్రైవర్ ఇంటి నుంచి వెళ్లే క్రమంలో ఎలాంటి చికాకులు ఉండకుండా సంతోషంగా ఉండేలా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు వివరిస్తారు. బస్సులో ప్రయాణిస్తున్న ఎన్నో కుటుంబాలు డ్రైవర్పై ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని గర్తుంచుకోవాలని సూచిస్తారు. 23న బస్సు కండీషన్పై అవగాహన బస్సు కండీషన్, ప్రమాదాన్ని గమనించి వేగాన్ని ఎలా అదుపు చేసుకోవాలనే దానిపై మంగళవారం అవగాహన కలిగిస్తారు. గతంలో రోడ్డు ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు ఉత్తములతో శిక్షణ ఇప్పిస్తారు. అవసరమైన సమయంలో వారిని శిక్షణ కోసం రీజియన్కు పంపిస్తారు. 24న ఉత్తమ డ్రైవర్లకు సత్కారం వారోత్సవాల ముగింపులో ఉత్తమ సేవలందించిన డ్రైవర్లను బుధవారం సత్కరిస్తారు. మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచేలా వారి ఫొటోలను ప్రదర్శిస్తారు. విజయాలు అందరికి తెలిసేలా వారి సర్వీసు రికార్డులో ఫొటోలు ఉంచుతారు. 25న సేవా కార్యక్రమాలు రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం రక్తదాన శిబిరాలు, సేవా కారక్రమాలను చేపడుతారు. డ్రైవర్లు రక్తదానం చేసి తమలోని మానవత్వాన్ని చాటుకుంటారు. అత్యవసర సమయంలో ఈ రక్తాన్ని వినియోగిస్తారు. ప్రయాణికుల సేవలో.. జనగామ డిపో పరిధిలో 125 బస్సులు నిత్యం 40 వేల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చుతున్నాయి. ఆర్టీసీలో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ. వంద శాతం యాక్సిడెంట ఫ్రీ జోన్గా జనగామను తీర్చి దిద్దేందుకు డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. గత మూడేళ్లుగా పరిశీలిస్తే ప్రమాదాలను చాలా వరకు నియంత్రించగలిగాం. – శ్రీనివాసరావు, జనగామ డిపో మేనేజర్ ఆర్టీసీ రూల్స్ పాటించాలి వాహన డ్రైవర్లు, యజమానులు ఆర్టీ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. అన్ని అనుమతులు పొందిన తర్వాతనే వాహనాన్ని రోడ్డు ఎక్కించాలి. ముఖ్యంగా ఫిట్నెస్, ఇన్సూరెన్స్, లైసెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఓవర్లోడ్ ఉంటే కేసులు తప్పవు. నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేస్తూ..అవగాహన కలిగిస్తున్నాం. మధ్యం సేవించి ఎవరూ కూడా డ్రైవింగ్ చేయరాదు. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ వాడకం తప్పనిసరి చేసుకోవాలి. – రమేష్రాథోడ్, డీటీఓ, జనగామ -
ఖరారు కాని మద్యం పాలసీ
ప్రొద్దుటూరు : మద్యం షాపుల యజమానులు అయోమయంలో పడ్డారు. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 31 వరకు మద్యం దుకాణాలకు గడువు ఉంది. అయితే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు దుకాణాలు ఉండరాదని ఇటీవల సుప్రీంకోర్డు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వ్యాపారులు డీలా పడ్డారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 109 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు 91 మద్యం షాపులు, 6 బార్లు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ విధానం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలసీలో ప్రాంతాలతో సంబంధం లేకుండా వైన్ షాపులు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 16 షాపులు, 6 బార్లు రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వేంపల్లి నుంచి ప్రొద్దుటూరు, రాజుపాళెం మీదుగా చాగలమర్రి వరకు ఉన్న రహదారి స్టేట్ హైవే కిందికి వస్తుంది. దీంతో కొర్రపాడు రోడ్డులోని భగత్సింగ్ కాలనీ, రాజుపాళెంలో ఉన్న మద్యం షాపులకు ఈ నిబంధన వర్తిస్తుంది. చాపాడు, లింగాపురం, మైదుకూరు రోడ్డు, కేకే స్ట్రీట్, వైఎంఆర్ రాజీవ్ సర్కిల్, టిబిరోడ్డు, గాంధీరోడ్డులోని గాంధీబొమ్మ పరిసర ప్రాంతాల్లోని మద్యం షాపులు 500 మీటర్లలోపు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం పట్టణ, మండలాల్లో 90 శాతం పైగా మద్యం దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. ప్రస్తుతం వార్డుల వారీగా దుకాణాలను నిర్వహిస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాల నిర్వహణ జరగాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో అధికారులే మద్యం షాపు ఏర్పాటుకు స్థలాలను గుర్తిస్తారా లేక ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చనే నిబంధన వస్తే ఏం చేయాలని వైన్షాపు యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాలేదు.. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 20న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర, జాతీయ రహదారుల్లోని 500 మీటర్ల లోపు ఉన్న మద్యం దుకాణాలు, బార్లను గుర్తించి అధికారులకు నివేదిక పంపించాం. –బాలకృష్ణన్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు -
కారు బోల్తా.. నలుగురికి గాయాలు
బద్వేలు అర్బన్: బద్వేలు మైదుకూరు జాతీయ రహదారిలోని నందిపల్లె సమీపంలో శుక్రవారం కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైనవారిలో ఒకరికి త్వరలోనే పెళ్లి జరగనుండడంతో పత్రికలు పంచి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ముద్దనూరుకు చెందిన మునెయ్యకు త్వరలో పెళ్లి జరగనుండడంతో బద్వేలు సమీపంలోని డి. అగ్రహారంలో ఉన్న అక్క ఇంటికి వెళ్లి పెళ్లిపత్రిక ఇచ్చారు. అనంతరం పట్టణంలోని వెంకటయ్యనగర్లో ఉన్న మరో బంధువుకు పెళ్లిపత్రికలు ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగి ముద్దనూరుకు వెళ్తుండగా నందిపల్లె సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి బోల్తాపడింది. వెంటనే స్థానికులు కారులో ఉన్న మునెయ్యతోపాటు అతడి మేనల్లుడు చైతన్య, అక్కకుమారుడు రాహుల్, కుమార్తె రాశిలను బయటకు తీసి 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా తీవ్ర గాయాలైన మునెయ్యను కడప రిమ్స్కు తరలించారు. -
లారీ ఢీకొని ఒకరి మృతి
దువ్వూరు: మండలంలోని జాతీయ రహదారిపై డాబా వద్ద ఆదివారం లారీ, బైక్ ఢీకొనడంతో భర్త మృతి చెందగా, భార్య తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుడిపాడుకు చెందిన గద్దా బాలయ్య అలియాస్ యేసోబు (46), ఆయన భార్య మరియమ్మ దువ్వూరులోని చర్చికి ప్రార్థనల నిమిత్తం వచ్చారు. తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో బైక్పై వెళ్తున్న వీరిని లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. డాబా యజమాని మనోహర్రెడ్డి వీరిని తన ఆటోలో దువ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో బాలయ్య సాయంత్రం మృతి చెందాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు. -
లారీ ఢీకొని ఒకరి మృతి
దువ్వూరు: మండలంలోని జాతీయ రహదారిపై డాబా వద్ద ఆదివారం లారీ, బైక్ ఢీకొనడంతో భర్త మృతి చెందగా, భార్య తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుడిపాడుకు చెందిన గద్దా బాలయ్య అలియాస్ యేసోబు (46), ఆయన భార్య మరియమ్మ దువ్వూరులోని చర్చికి ప్రార్థనల నిమిత్తం వచ్చారు. తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో బైక్పై వెళ్తున్న వీరిని లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. డాబా యజమాని మనోహర్రెడ్డి వీరిని తన ఆటోలో దువ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో బాలయ్య సాయంత్రం మృతి చెందాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం: ట్రాఫిక్ జామ్
మనుబోలు (నెల్లూరు) : జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపుడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టడంతో.. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో.. జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాలను తొలగించే యత్నం చేస్తున్నారు. -
యువకులను వెంబడించిన ఏనుగులు
రామకుప్పం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాయకనేరి గ్రామ శివారులోని జాతీయ రహదారిపైకి మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. సమీప అడవిలోని ఏనుగుల గుంపు జాతీయరహదారికి అడ్డంగా వచ్చాయి ఫలితంగా ఆ మార్గంలో తమిళనాడులోని పేర్నంబట్టు వైపు వెళ్లే వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. రామకుప్పం మండలం నెర్నిమల తాండాకు చెందిన నలుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వస్తుండగా కొన్ని ఏనుగులు వారిని వెంబడించాయి. భయభ్రాంతులకు గురైన ఆ యువకులు వేగంగా వచ్చి అటవీ అధికారులకు సమాచారం అందించారు. రాత్రి 9 గంటలకు టవీ అధికారులు సంఘటన స్థలానికి బయలుదేరారు. -
రైతులకు మార్కెట్ ధర చెల్లించాలి
కృష్ణా జిల్లా జి.కొండూరులో 33వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు గురువారం ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వం సరైన ఇవ్వటం లేదని రహదారిపై రాస్తారోకోకు దిగారు. మార్కెట్ రేటు ప్రకారం ఎకరా రూ.2 కోట్లు పలుకుతున్న భూములకు ప్రభుత్వం కేవలం రూ.16 లక్షలు మాత్రమే చెల్లిస్తుండటంతో ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం కనీసం రూ.కోటి ఐనా చెల్లించాలని ధర్నా చేపట్టారు. రైతులు చేపట్టిన రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. -
గండేపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం
-
జాతీయ రహదారిపై మొసలి మృతి
నిర్మల్ అర్బన్ (ఆదిలాబాద్) : నిర్మల్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ మొసలి మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చిన మొసలిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయింది. గమనించిన స్థానికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ జీవన్రెడ్డి, ఎస్సై సునీల్కుమార్, పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మృతిచెందిన మొసలిని పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి, కళేబరాన్ని వారికి అప్పగించారు. బైపాస్ రోడ్డు సమీపంలో రెండు చెరువులు, సరస్వతీ కాలువ ఉండడంతో వాటిలో ఎక్కడి నుంచైనా మొసలి వచ్చి ఉంటుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
ఆటోలో గంజాయి తరలిస్తుండగా పట్టివేత
తూర్పుగోదావరి(పిఠాపురం): తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఈఘటన మండల కేంద్రంలోని 216 నంబరు జాతీయ రహదారిపై ఆటోలో ఇద్దరు వ్యక్తులు మూడు బస్తాల్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అనంతరం ఆటోను కూడ సీజ్ చేశారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎన్హెచ్గా కోదాడ-కల్వకుర్తి మార్గం
కేంద్రానికి ఎంపీ గుత్తా విజ్ఞప్తి న్యూఢిల్లీ: కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ-కల్వకుర్తి రోడ్డు మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధిపరచాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్సభలో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేక ప్రస్తావనల కింద కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ‘దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనను అమలు చేస్తే ఇది వెనకబడిన ప్రాంతాల అభ్యున్నతికి, పారిశ్రామికరంగ అభివృద్ధికి, పర్యాటక కేంద్రాల అనుసంధానానికి దోహదపడుతుంది. ఈ అంశంపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రికి చాలాసార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు పంపింది. అందువల్ల తక్షణం దీనిని జాతీయ రహదారిగా ప్రకటించి ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’ అని గుత్తా పేర్కొన్నారు. -
కలకలం కలవరం
♦ ముచ్చెమటలు పట్టించిన తుపాకీ ♦ నందిగామ ఘటనపై వెంటాడిన సిమీ అనుమానాలు ♦ దోపిడీ దొంగలని ముగింపు నందిగామ జాతీయ రహదారిపై దోపిడీ ఘటన పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. కొద్ది రోజులుగా సిమీ ఉగ్రవాదులు విజయవాడ నగరానికి రాకపోకలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజా ఘటన ఖాకీలను కలవరపర్చింది. విజయవాడకు చెందిన వ్యక్తిని తుపాకీతో బెదిరించి దోచుకున్నట్టు తెలిసిన వెంటనే జాతీయ రహదారిపై భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానిత వాహనాలను తనిఖీ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో దోపిడీ దొంగల పనే అని తేలడంతో కూల్ అయ్యారు. జిల్లాలో పెరుగుతున్న గన్కల్చర్, దోపిడీ దొంగల బీభత్సం పోలీసుల పనితీరుకు సవాల్ విసురుతున్నాయి. విజయవాడ సిటీ : జాతీయ రహదార్లను అడ్డాగా చేసుకొని దోపిడీ ముఠాలు తిరుగుతున్నాయా? ఒంటరి వ్యక్తులను కారులో ఎక్కించుకొని తుపాకులతో బెదిరించే కొత్త సంస్కృతికి తెరలేపారా? నందిగామ, రాజమండ్రిలో జరిగిన దోపిడీలను పరిశీలిస్తే ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఆయుధాలతో హైవే ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. అవకాశం ఉన్నచోట దోపిడీలకు తెగబడుతున్నాయి. నందిగామ సమీపంలోని హనుమంతునిపాడు సమీపంలో జరిగిన దోపిడీ కూడా ఇదే తరహాలో జరిగి ఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. విజయవాడకు చెందిన పప్పుల వ్యాపారి పులిపాటి సురేష్కుమార్ను నందిగామ సమీపంలోని హనుమంతునిపాడు వద్ద తుపాకీ చూపి బెదిరించిన వ్యక్తులు అతని ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి వెళ్లేందుకు కుమ్మరిపాలెం సెంటర్లో బస్సు కోసం వేచి చూస్తున్న సురేష్కుమార్ను ఏపీ 31క్యూ 3438 ఎరుపు రంగు ఇండికా కారులో వెళుతున్న వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. తాము సూర్యాపేట వరకు వెళుతున్నట్టు చెప్పడంతో సురేష్కుమార్ వారి కారెక్కగా హనుమంతునిపాడు వద్ద దోపిడీ జరిగింది. గత రాత్రి రాజమండ్రిలో ఓ వ్యక్తిని బెదిరించి నగలు దోచుకున్న వ్యక్తులు కూడా వీరేనని బాధితుని సమాచారం ఆధారంగా భావిస్తున్నారు. అక్కడ దోపిడీ చేసిన తర్వాత ఏలూరు లేదా రాజమండ్రిలో ఆదివారం రాత్రి షెల్టర్ తీసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం. ఒక్కరేనా... జరిగిన దోపిడీ ఒకే తరహాదైనప్పటికీ కారు రంగులు తేడా రావడం పోలీసులకు అంతుచిక్కడం లేదు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రిలో ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకొని బెదిరించిన ఆగంతకులు నగదు, నగలు దోపిడీ చేశారు. ఆగంతకులు తెలుపు రంగు కారులో వచ్చినట్టు అక్కడి పోలీసులకు బాధితుడు తెలిపాడు. ఇక్కడ ఎరుపు రంగు కారులో వచ్చి దోపిడీ చేశారు. దోపిడీ చేసిన విధానం, వ్యవహరించిన తీరు, మాట్లాడిన భాష రెండు చోట్లా బాధితులు చెప్పేది ఒకే విధంగా ఉంది. అంటే అక్కడ దోపిడీ చేసిన వ్యక్తులే ఇక్కడ కూడా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ నేరం చేసిన తర్వాత కారు మార్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని బట్టి ముఠాలో ఎక్కువ మంది సభ్యులు ఉండొచ్చని తెలుస్తోంది. నందిగామ దోపిడీ నిందితులు తెలంగాణా జిల్లాలకు పరారై ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు.. ఆ దిశగా అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చి చెక్పోస్టులను అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో విశాఖ పోలీసుల సాయంతో కారు యజమానిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బాధితుడు చెపుతున్న కారు విశాఖ రవాణా శాఖ కార్యాలయంలో రశ్మిత పాత్రో అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. దీనిని బట్టి కారు ఉపయోగిస్తున్న వ్యక్తుల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త కల్చర్ దోపిడీల్లో గన్ కల్చర్ మొదలైంది. గతంలో జరిగిన దోపిడీలకు భిన్నంగా తుపాకీ చూపించి సొత్తు దోచుకునే ముఠాలు తయారయ్యాయి. గతంలో జాతీయ రహదార్లను అడ్డాగా చేసుకొని దోపిడీలు చేసిన ముఠాలు అనేకం ఉన్నాయి. నిర్జన ప్రదేశాల్లో వాహనాలను ఆపి దోచుకునేవారు. ఇందుకు భిన్నంగా కొత్త కల్చర్ రావడం పోలీసులను కలవరపరుస్తోంది. లిఫ్ట్ పేరిట నమ్మకంగా కారు ఎక్కించుకొని పిస్టల్ చూపి బెదిరించి దోపిడీలకు పాల్పడటం ఇటీవల కొత్తగా వెలుగులోకి వస్తోంది. గన్ చూపించి వ్యక్తుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రా ల్లో కారు చౌకగా నాటు తుపాకులు దొరుకుతున్నాయి. రూ.15వేల నుంచి రూ.50వేల వరకు వెచ్చిస్తే ఆధునిక ఆయుధాలు, తూటాలు ఇస్తున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ మాఫియా, కిరాయి హంతక ముఠాలు ఈ తరహా ఆయుధాలు వాడుతున్నాయి. కొత్తగా దోపిడీ ముఠాలు వీటిని వినియోగించడం ఆందోళనకర పరిణామం. -
హైవే పక్కన ఆక్రమణల తొలగింపు.. ఉద్రిక్తం
తడ(నెల్లూరు): నెల్లూరు జిల్లా తడ పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు బుధవారం ఉదయం చేపట్టిన చర్యలను వ్యాపారస్తులు అడ్డుకున్నారు. జాతీయ రహదారి పక్కనే స్థలాలను ఆక్రమించి కొందరు వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు, స్థానిక పంచాయతీ కార్యాలయ సిబ్బందితో కలసి బుధవారం ఉదయం పోలీసుల సమక్షంలో ఆక్రమణలను తొలగించే ప్రయత్నం చేశారు. తమకు ముందస్తు హెచ్చరిక లేకుండా, ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా ఆక్రమణలు తొలగించడం అన్యాయమని వారు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రెండు రోజుల్లోగా స్థలాలను ఖాళీ చేయాలని, లేకుంటే తామే తొలగిస్తామని సూళ్లూరుపేట సీఐ విజయకృష్ణ వారికి తెలిపారు. -
జాతీయ రహదారిలో ఆక్రమణల తొలగింపు
అనంతపురం : అనంతపురం జిల్లా చిలమత్తూరు జాతీయ రహదారిలోని చెక్పోస్టు వద్ద రోడ్లు భవనాల శాఖ స్థలంలో వెలిసిన ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. చెక్పోస్టు పరిసరాల్లోని ఆక్రమణలను పోలీసుల పర్యవేక్షణలో ఆర్ అండ్ బి అధికారులు శనివారం ఉదయం తొలగిస్తున్నారు. జేసీబీలను ఉపయోగించి భవనాలను కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. (చిలమత్తూరు ) -
ముద్దనూరు-జమ్మలమడుగు రోడ్డుకు మహర్దశ!
సాక్షి ప్రతినిధి, కడప: నేషనల్ హైవే-67 రోడ్డు పనుల్లో భాగంగా ముద్దనూరు- జమ్మలమడుగు రోడ్డుకు మహర్దశ పట్టింది. రూ.143 కోట్లుతో చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ముద్దనూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం, ఘాట్రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఎన్హెచ్-67లోని 513వ కిలోమీటరు (యామవరం) నుంచి 545వ కిలోమీటరు (జమ్మలమడుగు) వరకూ రోడ్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముద్దనూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి, ముద్దనూరు ఘాట్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. 32 కిలోమీటర్ల పరిధిలో నిర్వహించనున్న ఈ రోడ్డు పనులను రూ.143.8 కోట్లతో ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) ద్వారా చేపట్టనున్నారు. అందులో 3 కిలోమీటర్లు ఆయా గ్రామాల మధ్య ఫోర్లైన్ రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. మార్చిలో టెండర్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు దశాబ్దాల నిరీక్షణ.... ముద్దనూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఘాట్ రోడ్డు పునరుద్దరణ చేపట్టాలని జమ్మలమడుగు వాసులు మూడు దశాబ్దాలుగా ఆకాంక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి అభ్యర్థనల మేరకు అప్పటి పార్లమెంటు సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి నుంచి ఇప్పటి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వరకూ అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వందలాది రోడ్డు ప్రమాదాలు ఆ మార్గంలో సంభవించడమే అందుకు కారణం. ఎట్టకేలకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు నేషనల్ హైవే ఆథారిటీ ముందుకు రావడాన్ని జమ్మలమడుగు వాసులు హర్షిస్తున్నారు. -
ప్రాణాలతో చెలగాటం
జంతు కళేబరాలతో నూనె తయారీ పాలమూరు జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న పరిశ్రమలు హైదరాబాద్, బెంగళూరుకు సరఫరా ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హాటళ్లు, స్వీట్హౌస్లు, బేకరీలు, దాబాలలో వాడకం ఆ నూనె వాడితే ప్రాణాలకే ముప్పంటున్న వైద్యులు సాక్షి, మహబూబ్నగర్: అక్రమార్కులకు పాలమూరు జిల్లా అడ్డాగా మారుతోంది. కాసులకు కక్కుర్తి పడి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్నారు. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఇలాంటి నూనె మహబూబ్నగర్ జిల్లాలో పెద్దఎత్తున ఉత్పత్తి అవుతోంది. తయారీ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన మూడంచెల భద్రత మధ్య దందా నడుస్తోంది. వేలాది లీటర్లు అర్ధరాత్రి వేళ హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు సరఫరా అవుతోంది. అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రోజురోజుకు అక్రమ వ్యాపారం వేళ్లూనుకుంటోంది. ప్రధాన కేంద్రం పాలమూరు..! రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉండడం, జిల్లా గుండా జాతీయరహదారి-44 దాదాపు 200 కిలోమీటర్ల మేర విస్తరించడంతో అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారుతోంది. జిల్లాలో పారిశ్రామిక కేంద్రంగా మారిన కొత్తూరుతో పాటు షాద్నగర్, జడ్చర్ల, భూత్పూరు, అడ్డాకుల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి హైదరాబాద్, బెంగళూరు, రాయిచూరు తదితర ఇతర ప్రాంతాల నుంచి జంతువధశాలల నుంచి మృత కళేబరాలను రాత్రివేళ తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ పెద్ద కళాయిలు ఏర్పాటు చేసి నూనె తయారు చేస్తున్నారు. నూనె తయారీ తర్వాత వెలువడే వ్యర్థాలను ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జేసీబీల ద్వారా గుట్టల మధ్య పెద్ద గుంతలు తవ్వి అందులో పోసి మట్టితో పూడ్చేస్తున్నారు. పెద్దఎత్తున తయారీ... ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మృతకళేబరాల నుంచి ప్రతిరోజు వేలాది లీటర్లు తయారు చేస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు తయారీ కేంద్రాల్లో పనిచేసే కూలీలుగా బీహార్, ఒడిషా ప్రాంత వాసులను నియమించుకుంటున్నారు. తయారు చేసిన నూనె నిల్వ ఉంచేందుకు ట్యాంకులు, డ్రమ్ములు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి డబ్బాలలో నింపి ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రివేళ హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈ విధంగా తయారు చేసిన నూనెను ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హాటళ్లు, స్వీట్హౌస్లు, బేకరీలు, దాబాలలో వీటిని విరివిగా ఉపయోగించనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ నూనెను ఉపయోగించడం ద్వారా ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నూడుల్స్ తదితర వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయనే ఉద్దేశ్యంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా వీటి విలువ కూడా చాలా తక్కువగా ఉండడం చేత ఫుడ్ నిర్వాహకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వంట నూనెలు కిలోకు రూ.70 నుంచి రూ.వంద వరకు పలుకుతుండ గా... జంతుకళేబరాలతో తయారు చేసిన నూనె కేవలం కిలోకు రూ.30 నుంచి 40కే దొరుకుతోంది. కట్టుదిట్టమైన భద్రత.. జంతు కళేబరాలతో ఏర్పాటు చేసే కేంద్రాలన్నీ పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారికి దగ్గర్లోనే కేంద్రాలన్నీ ఏర్పాటు చేసినప్పటికీ అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. నూనె తయారీ కేంద్రాల వద్దకు కొత్త వ్యక్తి వెళ్తే దాడులకు పాల్పడేందుకు నిర్వాహకులు సిద్ధం చేసి ఉంచారు. అటుగా వెళ్లారంటే.. వేటాడేందుకు కుక్కలు, దాడులు చేసేందుకు కోతులకు సైతం శిక్షణ ఇచ్చారు. అయితే మృత కళేబరాలతో నూనె తయారు చేయడం వల్ల పెద్ద ఎత్తున దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్లో భూత్పూరు మండలం తాటికొండ గ్రామం వద్ద ఉన్న తయారీ కేంద్రం నుంచి వచ్చే దుర్వాసనను భరించలేక స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తయారీ కేంద్రంపై ఎమ్మెల్యే దాడిచేసి నూనె తయారు చేస్తున్న కళాయిలను ధ్వంసం చేశారు. తాజాగా జడ్చర్ల వద్ద వల్లూరులో జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత ప్రమాదకరం.. జంతు కళేబరాలతో తయారు చే సిన నూనె వాడకం ద్వారా అనేక దుష్పరిమాణాలు చోటు చేసుకుంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ నూనెలో అధిక కొలెస్ట్రాల్ ఉండడం చేత మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, గుండెపోటు, హార్మోన్లలో వ్యత్యాసాలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. జంతుకళేబరాల నుంచి వెలికితీసే నూనెలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ త్వరతగతిన క్యాన్సర్ ఉత్ప్రేరకాలకు పురిగొల్పుతోందని సూచిస్తున్నారు. అయితే ఇంత ప్రమాదకరమైన నూనె తయారవుతున్నా జిల్లా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఆహార కల్తీ నిరోధకశాఖ, వైద్య ఆరోగ్య, పరిశ్రమలశాఖల అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగా అక్రమార్కులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. -
అదుపుతప్పిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు
దామరచర్ల(నల్లగొండ): గుంటూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ కారునల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద అదుపుతప్పి ఒక బైక్, ఒక సైకిల్ను ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు, బైక్పై ఉన్న ఇద్దరితో పాటు సైకిల్పై వెళుతున్న ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. -
రెండు పెట్రోల్ ట్యాంకర్లలో అగ్నిప్రమాదం
విజయనగరం: జిల్లాలోని భోగాపురం మండలం లింగాలవలస వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రెండు పెట్రోల్ ట్యాంకర్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటలు అంటుకుని ఆయిల్ ట్యాంకర్లు తగులబడుతున్నాయి. అయితే ఘటన జరిగిన ప్రాంతానికి ప్రక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో అక్కడి స్థానికులు భయాందోళన పరుగులు తీస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
ఇద్దరు మృతి, డ్రైవరుకు గాయాలు పడగల్(వేల్పూర్), న్యూస్లైన్ : మండలంలోని పడగల్ క్రాస్రోడ్డు సమీపంలో 63 నంబరు జాతీయ రహదారిపై గురువారం వేకువజామున 3 గంటలకు ఆగి ఉన్న పేడ లారీని కారు ఢీకొంది. దీనిలో నరేందర్(40), తుంచపు కోటయ్య(50) అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారు డ్రైవర్ కలమూరి రాముకు గాయాలయ్యాయయి. ఎస్సై మురళి తెలిపిన వివరాలి ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలోని దీనదయాల్ కాలనీకి చెందిన కలమూరి రాము తనకారు(ఏపీ 15ఏఎఫ్ 8797)లో బుధవారం షంషాబాద్ ఎయిర్పోర్టుకు కిరాయిపై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గాంధారి మండలం రాంపూర్ గడ్డ తండాకు చెందిన కోటయ్యను, మెట్పల్లి మండలం బండ లింగాపూర్కు చెందిన నరేందర్ను ఎక్కించుకుని బయలు దేరాడు. జాతీయ రహదారిపై ఏఏకే 2579 నంబరు గల లారీ రాత్రిపూట ఎక్సెల్ విరిగి ఆగి ఉందన్నారు. కారు డ్రైవర్ రాము లారీని గమనించక అదపుతప్పి లారీని ఢీకొట్టిందన్నారు. నరేందర్, కోటయ్య కూర్చున్న భాగం లారీకి బలంగా తాకడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారన్నారు. డ్రైవర్ రామును 108 అంబులెన్స్లో ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరేందర్కు భార్య, రెండేళ్ల కూతురు, కోటయ్యకు భార్య, కొడుకు, కూతరు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. -
తిరుగు ప్రయాణంలో విషాదం
కల్వర్టును ఢీకొన్న కారు ఇద్దరు మృతి ఓర్వకల్లు, న్యూస్లైన్: బంధువుల వివాహానికి హాజరై సం తోషంగా తిరిగి వెళ్తున్న వారిని మృత్యువు కబళించింది. కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై నన్నూరు సమీపంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాత పడ్డారు. కోవెలకుంట్ల మండలం గోవిందపల్లెకు చెందిన వెంకటేశ్వరరెడ్డి(30), శివశంకర్రెడ్డి వరుసకు బంధువులు. కొద్ది సంవత్సరాల క్రితం వీరు వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ కూకట్పల్లిలో స్థిర పడ్డారు. బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలసి వీరు గురువారం కారులో గోవిందపల్లెకు చేరుకున్నారు. శుక్రవారం జమ్ములమడుగులో జరిగిన సమీప బంధువుల పెళ్లికి వెళ్లి అదే రోజు రాత్రి స్వగ్రామానికి తిరిగి వచ్చారు. రెండు రోజుల పాటు బంధువులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన వారు శనివారం ఉదయాన్నే కారులో హైదరాబాద్కు బయల్దేరారు. మార్గమధ్యంలో నన్నూరు సమీపంలో కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని సోదరి (అక్క) హైమావతి, శివశంకర్రెడ్డి భార్య పద్మావతి(34) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పద్మావతి మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. -
భద్రత కోసం వస్తూ...బలి
బీఎస్ఎఫ్ వాహనం బోల్తా, ధోబీ మృతి ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెచ్సీలు, ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలు విశాఖ సెవెన్ హిల్స్కు క్షతగాత్రుల తరలింపు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు అప్పుడే తెల్లవారుతోంది.... ఇంకా మం చుపొరలు వీడలేదు. చాలా దూరం నుంచి వస్తున్న వారంతా మరో 15 నిమిషాల్లో గమ్యం చేరుకుంటారు. ముందువెళుతున్న మూడు వ్యాన్లు వెళ్లిపోయాయి. నాల్గో వ్యాన్ కల్వర్టు దగ్గరకు వచ్చేసరికి అకస్మాత్తుగా రోడ్డుపై గేదె ప్రత్యక్షమైంది. అంతే దాన్ని తప్పించబోయే యత్నంలో వ్యాన్ అదుపుతప్పింది. హాహాకారాలు మిన్నం టాయి. అంతలోనే తేరుకున్న వారంతా అప్రమత్తమయ్యారు. గాయాలతో బయటపడ్డారు. అయితే అలసి కునుకుతీసిన ఓ ధోబీ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. బొండపల్లి, న్యూస్లైన్: బొండపల్లి మండలం కనిమెరక రెవెన్యూ పరిధిలోని బొడసింగిపేట జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఐదు గంటలకు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ ధోబీ మృతి చెందగా ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెచ్సీలు, ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రికి తరలించారు. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ అహ్మద్ తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా లక్ష్మీపురం నుంచి బీఎస్ఎఫ్ 28వ బెటాలియన్ సిబ్బంది 51 మందిని నాలుగు వ్యాన్లలో విజయనగరానికి రప్పించారు. అయితే గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. విజయనగరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో బొండపల్లి మండలం కనిమెరక రెవెన్యూ పరిధిలోని బొడసింగిపేట జాతీయ రహదారిపై గేదె అడ్డం రావడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఒక్కసారిగా వాహనం రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడపైకి వెళ్లి, పక్కనున్న గొతిలోకి బోల్తా పడిపోయింది. గోతిలో దట్టమైన పొదలు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే జవాన్లు అందరూ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై గాయాలతో బయటపడ్డారు. అప్పటికే నిద్రపోతున్న బీఎస్ఎఫ్కు చెందిన ధోబీ మునీంద్ర కుమార్ (40)పై ఆయుధాల కిట్లు పడిపోవడంతో తప్పించుకోలేక తీవ్ర గాయాలపాలయ్యాడు. అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెచ్సీలు ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ వ్యానులో మొత్తం పన్నెండు మంది ఉన్నారు. మునీంద్రకుమార్ది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూర్ జిల్లా జమునీయా గ్రామం. ఏఎస్ఐలు రాజేంద్రభారతి, విజయేంద్రసింగ్, హెచ్సీలు శైలింద్రకుమార్, అఖిలేష్చంద్, బోలారామ్లతో పాటు జవాన్లు ధీరేంద్రసింగ్, టీసీ దాస్, మనోజ్కుమార్, బిస్వాస్, గోపీనాథ్, హర్భజన్సింగ్ గాయాలపాలయ్యారు. వీరిని తొలుత 108 వాహనం సాయంతో విజయనగరం తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ సెవెన్హిల్స్కు తరలించారు. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్అహ్మద్, సీఐ చంద్రశేఖర్, బొండపల్లి ఎస్ఐ జె.తారకేశ్వరరావు, గజపతినగరం ఎస్ఐ సాయికృష్ణ, మానాపురం ఎస్ఐ యు.మహేష్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఏకే47 గన్లు, బుల్లెట్లు తదితర ఆయుధాలు ఉండడంతో వాహనం వద్ద బీఎస్ఎఫ్ సిబ్బంది పహారా కాశారు. ఎస్పీ సందర్శన ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ సంఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందితో మాట్లాడారు. అనంతరం గజపతినగరం ఆస్పత్రిలో ఉన్న ధోబీ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని విశాఖపట్నం విమానాశ్రయానికి బాక్స్లో తరలించారు. -
జిల్లారోడ్లకు మహర్దశ
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర విభజనతో జిల్లా రహదారులకు మహర్దశ పట్టనుంది. జిల్లాలోని రెండు రోడ్లు జాతీయ రహదార్లుగా మారనున్నాయి. రహదారుల పరంగా తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, పునర్వభజనతోపాటు ఈ ప్రాంతంలోని రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముసాయిదా బిల్లులో కేంద్ర మంత్రివర్గం పేర్కొంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి 5,215 కిలోమీటర్లుకాగా, తెలంగాణలోని పది జిల్లాల్లో కేవలం 1,700 కిలోమీటర్ల నిడివి మాత్రమే ఉంది. ఈ వ్యత్యాసాన్ని సవరించేందుకు కేంద్రం చర్యలను సూచించింది. తెలంగాణ ప్రాంతంలో రహదారులను విస్తరించడం, వెనుకబడిన ప్రాంతాలకు రవాణా వసతులను మెరుగుపర్చడం లాంటి బాధ్యతలను భారత జాతీయ రహదారుల అధారిటీ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. ముసాయిదాలో జాతీయ రహదారులుగా అభివృద్ధి పరచాలని ప్రతిపాదించిన ఐదు రహదారుల్లో రెండు రోడ్లు జిల్లా మీదుగా వెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఐదు రహదారులను నేషనల్ హైవేలుగా మార్చాలని ఇదివరకే కేంద్ర ఉపరితల రవాణా శాఖను కోరింది. తెలంగాణపై ఏర్పాటయిన మంత్రుల బృందం దృష్టికి కూడా రోడ్లకు సంబంధించిన అంశాలు వచ్చాయి. జిల్లాలన్నింటికి మెరుగయిన రోడ్డు సౌకర్యాలు ఉండాలన్న దృష్టితో ముసాయిదాలో ఈ ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి వాడరేవుకు కొత్తగా ప్రతిపాదించిన రహదారి జిల్లా మీదుగా వెళ్తుంది. ఆదిలాబాద్, ఉట్నూరు, ఖానాపూర్ నుంచి జిల్లాలోని కోరుట్ల, వేములవాడ మీదుగా ఈ రహదారి వెళ్తుంది. అక్కడ నుంచి సిద్దిపేట, జనగాం, సూర్యపేట, మిర్యాలగూడ మీదుగా ప్రకాశం జిల్లాకి ప్రవేశిస్తుంది. జగిత్యాల నుంచి మరో రహదారి కరీంనగర్, వరంగల్ మీదుగా ఖమ్మం, కోదాడ వరకు వెళ్తుంది. ఈ రెండు రహదారులను ముసాయిదాలో కేంద్ర మంత్రివర్గం చేర్చింది. ఈ రెండు రోడ్లను విస్తరించినట్లయితే జిల్లాలో రవాణావ్యవస్థ మెరుగుపడుతుంది. అంతరాష్ట్ర రహదారిగా అభివృద్ది చెందితే వాణిజ్యరంగంలో కూడా ప్రగతి సాధ్యమవుతుంది. వీటితోపాటు రెండోదశలో మావోయస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల విస్తరణపై దృష్టి సారించాలని కేంద్రం భావిస్తోంది. -
పంట కాలువలో లారీ బోల్తా
నక్కపల్లి న్యూస్లైన్: జాతీయ రహదారిపై గొడిచర్ల వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసుల కథనం ప్రకారం విజ యవాడ నుంచి విశాఖ వైపు కాగితాల లోడుతో వెళ్తున్న లారీ ముందువెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి గొడిచర్ల కూడలి వద్ద ఉన్న పంటకాలువలోకి బోల్తా పడింది. ఈ సంఘటనలో విజయవాడకు చెందిన లారీ డ్రయివర్ జె.నాగేశ్వరరావు (38) క్యాబిన్లో ఇరుక్కుపోయి మరణించాడు. బోల్తా పడుతున్నప్పుడు లారీ సమీపంలో బహిర్భూమికి వచ్చిన ముత్తిన వెంకటరమణ(32)ను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో తీవ్రం గా గాయపడిన డ్రయివర్ సోదరుడైన క్లీనర్ వెంకటదుర్గారావును తుని ఏరి యా ఆస్పత్రికి తరలించారు. డ్రయివర్ నిద్రమత్తులో ఉండ టం వల్ల లారీ అదుపు తప్పి పంటకాలువలోకి బోల్తా పడినట్టు తెలిసింది. క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రయివర్ మృతదేహాన్ని బయటికి తీసేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు. చుట్టం చూపుగా వచ్చి మృత్యువాత ప్రమాదంలో మరణించిన వెంకటరమణది తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి మండలం సీతయ్యపేట గ్రామం. భార్యాపిల్లలతో గొడిచర్లలో తోడల్లుడి ఇంటికి శనివారం వచ్చాడు. మంగళవారం వేకువజామున జాతీయరహదారిని ఆనుకుని పంటకాలువ వద్దకు బహిర్భూమికి వచ్చి లారీ ఢీకొని మృత్యువాత పడ్డాడు. స్వగ్రామానికి బుధవారం వెళ్లాల్లి ఉందని బందువుల చెబుతున్నారు. వెంకటరమణకు భార్య, అయిదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మరణంతో చిన్నారులను ఎలా పెంచాలని అతని భార్య సంఘటన స్థలం వద్ద రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్చార్జి ఎస్ఐ జి.ప్రేమ్కుమార్ విలేకరులకు తెలిపారు. -
నెత్తురోడిన రహదారులు
రాష్ట్రంలో మంగళవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 12మంది మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో లారీని కారు ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందగా వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో 7గురు దుర్మరణం పాలయ్యారు. సాక్షి, రాజమండ్రి : విజయదశమినాడు గ్రామ దేవతకు పూజలుచేసి, విజయవాడలో దుర్గమ్మను దర్శించుకునేందుకు బయలుదేరిన భక్తులు మార్గమధ్యంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం కొత్తకర్ణానివారిపాలెం నుంచి విజయవాడకు దుర్గమ్మను దర్శించుకునేందుకు కారులో 9మంది బయలుదేరారు. తెల్లవారుజామున 3.35 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొనడంతో విశాఖ జిల్లా సింహాచలం శ్రీనివాసనగర్కు చెందిన కారు డ్రైవర్ ధమర్సింగ్ శంకరరావు (28), కొత్తకర్ణానివారిపాలేనికి చెందిన గొన్నాశివకుమార్ (28), గద్దే శ్రీనివాసరావు(26) , విరోధి అప్పలశ్రీను(28), యర్రా రమేష్ (26) అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారును సిమెంట్ ట్యాంకర్ ఢీకొని... చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ బస్స్టేజీ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామానికి చెందిన పి. చెన్నారెడ్డి(45), ఆయన భార్య పవిత్ర(40), తల్లి శకుంతల(63), కుమారుడు సాయినాథ్రెడ్డి(5) అక్కడికక్కడే మరణించారు. నగరంలోని ఆస్పత్రికి వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుందని బంధువులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వరంగల్లో మరో ముగ్గురు... శాయంపేట : కారు, ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా తహారాపూర్(మాందారిపేట) వద్ద సోమవారం ఈ సంఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలీకి చెందిన 16 మంది మిత్రులు మూడు కార్లలో వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును చూసేందుకు బయలుదేరారు. తహారాపూర్ సమీపంలో ఒక కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న అనుమాండ్ల భరత్(26) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఇద్దరు మరణించారు. -
ఆత్మ సంతకం చేసింది!
సాక్షి, నిజామాబాద్ : కాసులు కురిపించే అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. * 93 లక్షల అంచనా వ్యయం కలిగిన అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు ఓ కాంట్రాక్టర్ మాయాజాలం చేశాడు. పదేళ్ల క్రితం పదవీ విరమణ చేసి, ఇటీవలే మరణించిన ఆర్అండ్బీ ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. అసలు ప్లాంటే లేకు న్నా.. ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. అనుమానం వచ్చి ఆ పత్రాలను పరిశీలించగా అవి బోగస్వని తేలాయి. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పాత జాతీయ రహదారి (చర్చి) నుంచి రైల్వేగేట్ వరకు ఉన్న రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని భా వించారు. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాల కింద మంజూరైన నిధులతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రెండు (*48 లక్షలు, *45 లక్షలు) బిట్లుగా మార్చి రెండు నెలల క్రితం మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. పలువురు కాంట్రాక్టర్లు ఈ పనుల కోసం పోటీ పడ్డారు. కాంట్రాక్టర్గా అవతారమెత్తిన ఓ పార్టీ నేత ఒకరు అంచనా వ్యయం కంటే 3.55 శాతం తక్కువకు కోట్ చేసి ఈ టెండరు దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ పనులకు టెండర్లు వేయాలంటే ఆ కాంట్రాక్టరుకు హాట్మిక్స్ ప్లాంట్ ఉండాలి. కానీ ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తాను ఓ వ్యక్తి వద్ద హాట్మిక్స్ ప్లాంటును లీజుకు తీసుకున్నానని పేర్కొంటూ భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఈ ప్లాంటుకు సంబంధించి ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను మున్సిపల్ అధికారులకు సమర్పించారు. మున్సిపల్ అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనా అని నిర్ధారించుకునేందుకు నిజామాబాద్లోని ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయానికి పంపారు. ఆర్అండ్బీ అధికారులు ఈ పత్రాలను పరిశీలించగా అవి బోగస్వని తేలింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు వారు గుర్తించారు. మరో విశేషమేంటే ఈ పత్రాలపై సంతకం చేసిన అధికారి కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ చేశారని, ఆయన ఇటీవలే మరణించారని ఆర్అండ్బీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలిస్తే ఆసలు ప్లాంటే లేదని తేలింది. చర్యలపై అనుమానాలు? బోగస్ పత్రాలను సృష్టించిన సదరు కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, బ్లాక్లిస్టులో పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇలా లేని ప్లాంటును ఉన్నట్లు చూపి.. పలు శాఖల ఉన్నతాధికారుల సంతకాలను ఫొర్జరీ చేసి బోగస్ పత్రాలు సృష్టించిన సదరు కాంట్రాక్టర్పై అధికారులు చర్యలు తీసుకునే సాహసం చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ ఆఫీసర్తో చర్చించి నిర్ణయం - బాలోజీనాయక్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ టెండరును ఫైనల్ చేసేందుకు పత్రాలను పరిశీలనకు పంపగా అవి బోగస్వని తేలింది. మున్సిపల్ ప్రత్యేక అధికారితో చర్చించాక బోగస్ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన కాంట్రాక్టర్పై చర్యల విషయమై నిర్ణయం తీసుకుంటాం. -
నిత్య నూతనమై..
ఏలూరు, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం జిల్లాలో నిత్యనూతనమై ఉవ్వెత్తున సాగుతూనే ఉంది. ‘జై సమైక్యాంధ్ర’ అంటూ అన్నివర్గాల ప్రజలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 52వ రోజైన శుక్రవారం కూడా వినూత్న నిరసనలతో విభజన నిర్ణయూనికి వ్యతిరేకంగా గర్జించారు. జిల్లా అంతటా బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, ఇన్కం టాక్స్, టెలిక ం, జాతీయ బ్యాంకులను ఎన్జీవోలు ముట్టడించి కార్యకలాపాలనుస్తంభింపచేశారు. బ్యాంకుల్లో రూ.250 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు స్తంభించారుు. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో నాయీ బ్రాహ్మణులు దీక్షలు చేశారు. దెందులూరు నుంచి రైతులు జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. రెండున్నర గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వంటావార్పు చేసి అన్నసమారాధన నిర్వహించారు. కొవ్వూరులో రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ మాదిగల ఆధ్వర్యంలో దండోరా కార్యక్రమం నిర్వహించారు. మంద కృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాళ్లపూడిలో మండల జేఏసీ ఆధ్వర్యంలో మత్స్యకారులు, ఎన్జీవోలు గోదావరిలో పడవల యాత్ర నిర్వహించారు. భీమవరం ప్రకాశం చౌక్లో సమైక్యవాదులు, ఉపాధ్యాయుల జాతీయ రహదారిని దిగ్బం ధించి నిరసన తెలిపారు. ఉండి సెంటర్లో మహిళలు రోకళ్లు, రోళ్లతో పిండి దంచి వినూత్న నిరసన తెలిపారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పోడూరు మండలం జిన్నూరులో ఉపాధ్యాయులు మానహారం చేపట్టారు. తణుకులో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉపాధ్యారుునులు బతుకమ్మ పండగ నిర్వహించగా, ఆర్టీసీ ఉద్యోగులు దుస్తులకు బదులు ఆకులను ధరించి ర్యాలీ చేశారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్లోని కాలువలో విద్యార్థి జేఏసీ ఆధ్యర్యంలో మూడు గంటలపాటు జలదీక్ష చేపట్టారు. ఉంగుటూరులో ఎ.గోకవరం పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు తహసిల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్ష చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో ఉద్యోగులు మోకాళ్లపై నడిచారు. నరసాపురం నియోజకవర్గ గౌడ సేవా సంఘం సభ్యులు కుటుంబాలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. దర్గా సెంటర్ నుంచి ప్రకాశం రోడ్డు మీదుగా ర్యాలీ సాగింది. నరసాపురం సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలు, పచ్చగడ్డి దుబ్బులతో మహిళలు ప్రదర్శన జరిపారు. నరసాపురం బార్ అసోసియేషన్కు చెందిన 45 మంది న్యాయవాదులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలకు రాజీనామా చేశారు. కేంద్ర మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో ఉపాధ్యాయులు 24 గంటల పల్లె మేలుకొలుపు దీక్ష చేపట్టారు. విజయవాడ సదస్సుకు ఎన్జీవోలు విజయవాడ స్వరాజ్య మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు జిల్లానుంచి ఎన్జీవోలు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఏలూరు, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలతోపాటు మండల ప్రధాన కేంద్రాల నుంచి 50 వాహనాల్లో విజయవాడ పయనమయ్యూరు. వైసీపీ మండల కన్వీనర్ల ఆమరణ దీక్ష గోపాలపురంలో గోపాలపురం, ద్వారకాతిరుమల, దేవరపల్లి మండలాల వైసీపీ కన్వీనర్లు గెడా జగదీష్, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, బుసన బోయిన సత్యనారాయణ శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తోట గోపి చేపట్టిన పాదయూత్ర మూడో రోజుకు చేరింది. పోలీస్ ఐలండ్ సెంటర్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నారుు. వీరవాసరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. నరసాపురంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 30వ రోజకు చేరాయి. హైదరాబాద్లో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్కు నిరసనగా చింతలపూడిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. -
జిల్లాలో 42వ రోజు కొనసాగిన సమైక్య ఉద్యమం
సాక్షి, తిరుపతి: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని జి ల్లావ్యాప్తంగా సమైక్యవాదులు మంగళవారం వినూత్న తరహాలో ఆందోళనలు చేశారు. ఉద్యమం 42వరోజుకు చేరింది. పుంగనూరులో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ వినాయకుని విగ్రహంతో ధర్నా, రాస్తారోకో నిర్వహిం చారు. నివాసాల్లో పూజలు చేసిన వినాయకుని విగ్రహాలను రోడ్డుపై పెట్టి భారీ ప్రదర్శన చేసి, నిరసన తెలియజేశారు. 22 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరులో విద్యార్థులు తెలుగుతల్లి మాస్క్లతో గాంధీ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగులు రాస్తారోకో, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది బస్టాండ్లో వివిధ క్రీడలు ఆడుతూ నిరసన తెలిపారు. పలమనేరులో ని వాసాల ముందు సమైక్య ముగ్గులు వేశారు. అనేక ప్రాం తాల్లో సమైక్య వినాయకుడిని ఏర్పాటు చేశారు. జేఏసీ దీక్షలు కొనసాగాయి. న్యాయవాదులు కోర్టు వద్ద యజ్ఞం చేశారు. రవీంద్ర భారతి విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో, మానవహారం నిర్వహించి మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయలు, విద్యార్థులు మానవహారం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి శివాలయంలో సమైక్యాంధ్ర కోసం ప్రత్యేక పూజలు చేశారు. వీ.కోటలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష, గణపతి పూజ చేశారు. వినాయకుని మాస్క్లతో నిరసన బెరైడ్డిపల్లిలో ఉపాధ్యాయులు వినాయకుని మాస్క్లు ధరిం చి ర్యాలీచేశారు. గంగవరంలో జాతీయ రహదారిని దిగ్బం ధించారు. కుప్పం, శాంతిపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ల రిలే దీక్షలు కొనసాగాయి. శాంతిపురంలో రహదారులను దిగ్బంధించారు. పుత్తూరులో ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. మదనపల్లెలోని టౌన్బ్యాంక్ కూడలిలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు ఉరి వేసుకున్నట్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ జూనియర్ క ళాశాలలు జేఏసీగా ఏర్పడి బెంగళూరు బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. బాలికల జూనియర్ కళాశాల వారు వంటావార్పు చేశారు. మదనపల్లె రూరల్ మండలం బసినికొండ మహిళా సంఘాల వారు పట్టణం భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. నగరంలోని అన్ని దీక్ష శిబిరాల్లో వినాయకుని విగ్రహాలు పెట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, నిరసన తెలియజేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులపై సమైక్యవాదులు బైఠాయించి, ధర్నా రాస్తారోకో కార్యక్రమా లు నిర్వహించారు. 16వరకు విద్యా సంస్థలు బంద్ ప్రయివేటు విద్యాసంస్థల యజమానులు బుధవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు మూసేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్డీవో, ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యం, సాప్స్ నాయకులు మంగళవారం రాత్రి సమావేశమై నిర్ణయించారు. అలాగే వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు కూడా బంద్ పాటించే విషయమై చర్చించారు. బుధవారం దీనిపై నిర్ణయం తీసుకుంటారు. -
దైవదర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన
పిఠాపురం, న్యూస్లైన్ : తెల్లవారకముందే వెళ్లి దైవదర్శనం చేసుకోవాలని బయలుదేరిన వారు శని వారం అర్ధరాత్రి పిఠాపురం వద్ద 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 23 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు, బాధితుల బంధువులు తెలిపి న వివరాల ప్రకారం మండల కేంద్రమైన పెదపూడికి చెందిన గున్నం భద్రం కుటుం బ సభ్యులు మొక్కు తీర్చుకునేందుకు బంధువులతో కలసి మొత్తం 26 మంది ఒక ట్రాక్టర్పై తుని సమీపంలోని తలుపులమ్మ లోవకు బయలుదేరారు. ఆదివారం మరో శుభకార్యంలో పాల్గొనాల్సి ఉండడంతో తెల్లవారకముందే లోవ వెళ్లి త్వరగా తిరిగి రావాలని భావించారు. శని వారం రాత్రి పది గంటల సమయంలో ఒక ట్రాక్టరుపై పెదపూడి నుంచి తలుపుల మ్మ లోవకు బయలు దేరారు. వారి వాహ నం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో పిఠాపురం బైపాస్ రోడ్డులో రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలోకి రాగానే కత్తిపూడి నుంచి కాకినాడ వైపు కంకర లోడుతో వస్తున్న లారీ అతి వేగంగా ఢీకొంది. ట్రాక్టర్ ముందు భాగం నుజ్జునుజైంది. అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్రగాయాలపాలయారు. సంఘటన స్థలానికి సమీపంలో ఒక శుభకార్యం జరుగుతుండడంతో ఆ కార్యక్రమంలోని యువకులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రైవేటు వాహనాలపై ఆస్పత్రికి తరలించేం దుకు కృషి చేశారు. గున్నం పాపాయమ్మ (70) అక్కడికక్కడే మృతి చెందగా, బొడ్డు లోకేష్ (12) పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించే లోపు కన్నుమూశాడు. ఆర్.సూరిబాబు (55)ను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బండారు రాజు, కాకర లోవ శుభాషిణి, గున్నం చిన వీర్రాజు, గున్నం లక్ష్మి, ఏ సత్యనారాయణ, కొంగర పాపారావు, పి సత్యనారాయణ, మాసిన సత్యవేణి, కోన శ్రీను, ఎస్. రామలక్ష్మి , బొడ్డు సురేఖ, జి. అనంతలక్ష్మి, కాకర గాయత్రి దేవి, సీహెచ్ లక్ష్మి ,కె.పద్మావతి, కాకర ఝాన్సీలక్ష్మి, ట్రాక్టరు డ్రైవరు ఎం.సత్తిబాబు, పందిరి వీరబాబు, నూనె వెంకటరావు, కె.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు, గున్నం సత్యనారాయణ, పి.విజయలక్ష్మి, పి.సత్యప్రసాద్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా కాకినాడలో ప్రభుత్వాస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం కారణంగా 216 జాతీయ రహదారిపై ట్రాఫిక్ కొంత సేపు నిలిచి పోయింది. వంట చేసుకోవడానికి ట్రాక్టరుపై తీసుకు వెళుతున్న గ్యాస్ సిలిండర్ ఎగిరిపడినప్పటికీ అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం లో లారీ డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పిఠాపురం టౌన్ ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు సంఘీభావం
నక్కపల్లి, న్యూస్లైన్ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు మంగళవారం రహదారుల దిగ్బంధం చేపట్టాయి. పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో జాతీయరహదారితోపాటు వివిధ రోడ్లపై ఆందోళనలు చేపట్టారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు సమన్వయకర్తలు, వివిధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రహదారుల దిగ్బంధనాన్ని జయప్రదం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త చెంగలవెంకటరావు, డీసీసీబీ మాజీడైరక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో నక్కపల్లి జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. నక్కపల్లి ,పాయకరావుపేట మండలాలకు చెందిన వందలాదిమంది పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్రెడ్డి అభిమానులు నాయకులు, కార్యకర్తలు జాతీయరహదారిపై ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గంటపాటు బైఠాయించారు. పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు ఇందులో పాల్గొన్నారు. నినాదాలతో జాతీయరహదారి హోరెత్తింది. జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో కొక్కిరాపల్లి జంక్షన్ వద్ద జాతీయరహదారిపై కూడా ఆందోళన చేపట్టారు. ఎల మంచిలి నియోజకవర్గ నాయకుడు బోదెపు గోవింద్, తదితరులు పాల్గొన్నారు. యల మంచిలి నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డే డ ప్రసాద్ ఆధ్వర్యంలో పూడిమడక వద్ద జాతీయ రహదారిపై మునగపాక నుంచి ర్యాలీ చేపట్టారు. సుమారు 45 నిముషాల పాటు దిగ్బంధం చేశారు. రాంబిల్లిలో చంటిరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టా రు. అంతకు ముందు రోడ్డుపై బైటాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశా రు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కశింకో ట వద్ద జాతీయరహదారిపై జిల్లా కన్వీనర్ వెంకట్రావుతోపాటు కార్యకర్తలు రాస్తారోకో,మానవహారం చేపట్టారు. సైకిల్ తొక్కారు. జగన్మోన్రెడ్డి, వైఎస్సార్కు అనుకూలంగా, కేసీఆర్,సోనియాగాంధీలకు వ్యతిరేకంగానూ నినాదాలు చేశారు. చోడవరంలో నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు పి.వి.ఎస్.ఎస్.రా జు తోపాటు రోలుగుంట మండల మాజీ ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి శ్రీనివాసరావు, అంకుపాలెం ఎంపీటీసీ మాజీ సభ్యుడు ము త్యాలనాయుడు ఆమరణదీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని జిల్లా కన్వీనర్తోపాటు చోడవరం సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ప్రారంభించారు. అనంతగిరి మండలకేంద్రంలో పా ర్టీ నాయకులు శెట్టి ఆనంద్, వీరాస్వామి, రామస్వామిల ఆధ్వర్యంలో రహదారిపై ఆం దోళన చేపట్టారు. చింతపల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. జల్లి సుధాకర్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. విగ్రహాల జంక్షన్ వద్ద వినూత్నంగా మోకాళ్లపై మానవహారం చేపట్టారు.