New Zealand Vs Bangladesh
-
పాకిస్తాన్పై గెలిచి విజయంతో ముగిస్తాం: బంగ్లాదేశ్ కెప్టెన్
‘‘ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడించగల సత్తా మా జట్టుకు ఉంది. చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం’’... ఐసీసీ టోర్నమెంట్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో(Najmul Hossain Shanto) చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే, ఈ వన్డే ఈవెంట్ ఆరంభమైన ఆరు రోజుల్లోనే.. లీగ్ దశలోనే బంగ్లాదేశ్ ప్రయాణం ముగిసిపోయింది.గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత టీమిండియా చేతిలో ఓడిన షాంటో బృందం.. సోమవారం నాటి మ్యాచ్లో న్యూజిలాండ్(Bangladesh Vs New Zealand) జట్టు చేతిలోనూ ఓటమిని చవిచూసింది. తద్వారా సెమీస్ కూడా చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బ్యాటర్ల వైఖరిని ఎండగట్టాడు.పదే పదే అవే తప్పులు..‘‘గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని పదే పదే చెప్పాను. కానీ మేము మళ్లీ అదే రిపీట్ చేస్తున్నాం. బ్యాటింగ్ విభాగంలో మేము మెరుగుపడాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ తర్వాత కచ్చితంగా బ్యాటింగ్ యూనిట్లో మార్పులు ఉంటాయి.బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది. కానీ గత రెండు మ్యాచ్లలోనూ అలా జరుగలేదు. ఓడిన ప్రతిసారీ సిబ్బందిపై వేటు వేయడం, మార్చడం చేయలేము. ఆటగాళ్లు కూడా తమ వైఖరిని మార్చుకోవాలి. ఓటమిని తేలికగానే అంగీకరిస్తున్నట్లుగా ఉందిఇప్పటికే చాలా మందికి చాలా అవకాశాలు ఇచ్చాము. అయినా.. ప్రతిసారి మేము ఓటమిని తేలికగానే అంగీకరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇకపై మేము మరింత జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది’’అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో నజ్ముల్ షాంటో పేర్కొన్నాడు.ఇక కివీస్ మ్యాచ్లో తమ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ‘‘మాకు శుభారంభమే లభించింది. కానీ మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయాం. మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. నిజానికి పిచ్ బ్యాటింగ్కు సహకరించింది. అయినా.. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం.పాక్పై గెలిచి విజయంతో ముగిస్తాంఅయితే, మా బౌలింగ్ పట్ల నేను సంతోషంగానే ఉన్నాను. గత రెండేళ్లుగా మా బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఇక లీగ్ దశలో మాకు మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. పాకిస్తాన్పై గెలిచి విజయంతో ఇంటిబాట పట్టాలని పట్టుదలగా ఉన్నాం. ఏదేమైనా మేమైతే బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుగుపడాల్సి ఉందని కచ్చితంగా చెప్పగలను’’ అని షాంటో అన్నాడు. కాగా రావల్పిండిలో సోమవారం కివీస్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఇక టీమిండియా, న్యూజిలాండ్లతో మ్యాచ్లలో బంగ్లా గట్టి పోటీనిచ్చిప్పటికీ.. దానిని విజయంగా మలచుకోలేకపోయింది. ఇక నజ్ముల్ షాంటో భారత్తో మ్యాచ్లో డకౌట్ కాగా.. కివీస్తో మ్యాచ్ల మాత్రం అర్ధ శతకం(77)తో రాణించాడు. మిగతా వాళ్లలో జాకిర్ అలీ(68, 46), తౌహీద్ హృదోయ్(భారత్పై శతకం) మాత్రమే మెరుగ్గా ఆడారు. కాగా గ్రూప్ దశలో ఆఖరిగా గురువారం(ఫిబ్రవరి 27) రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో బంగ్లాదేశ్ తలపడుతుంది. బంగ్లా మాదిరే ఆడిన రెండు మ్యాచ్లలో ఓడి నిష్క్రమించిన పాక్.. ఆఖరి మ్యాచ్లోనైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.చదవండి: Aus vs SA: కీలక మ్యాచ్కు వర్షం అడ్డంకి.. ఒకవేళ రద్దైతే..! -
పాకిస్తాన్కు భారీ షాక్.. టోర్నీ నుంచి ఔట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ కథ ముగిసింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ తమ సెమీస్ ఆశలను బంగ్లాదేశ్పై పెట్టుకుంది. ఈ క్రమంలో సోమవారం రావల్పండి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పరాజయం పాలైంది.దీంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు అవిరయ్యాయి. ఒకవేళ ఈ మ్యాచ్లో బంగ్లా గెలిచుంటే.. అప్పుడు మూడు జట్లకు సెమీస్ అవకాశాలు ఉండేవి. కానీ బంగ్లా ఓటమి పాలవ్వడంతో మరో మ్యాచ్ మిగిలూండగానే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పాకిస్తాన్ మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని భావించింది. కానీ తొలి రెండు మ్యాచ్ల్లో అన్ని విభాగాల్లో విఫలమై ఘోర ఓటములను మూట కట్టుకుంది. మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పాక్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టడానికి గల కారణాలపై ఓ లుక్కేద్దాం.బ్యాటింగ్లో ఫెయిల్..పాకిస్తాన్ ఓటములకు ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమనే చెప్పుకోవాలి. మొదటి రెండు మ్యాచ్ల్లోనూ పాక్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న బాబర్ ఆజం తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కివీస్తో జరిగిన మ్యాచ్లో బాబర్ 64 పరుగులు చేసినప్పటికి.. ఛేజింగ్లో స్లో ఇన్నింగ్స్ ఆడి విమర్శల మూటకట్టుకున్నాడు. ఏ జట్టుకైనా ఓపెనింగ్ భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం.కానీ పాకిస్తాన్కు మాత్రం మొదటి రెండు మ్యాచ్ల్లో కనీసం 50 పరుగుల భాగస్వామ్యం కూడా రాలేదు. అంతకు తోడు రెగ్యూలర్ ఓపెనర్ ఫఖార్ జమాన్, సైమ్ అయూబ్ గాయాల పాలవ్వడం కూడా పాక్ విజయవకాశాలను దెబ్బతీశాయి. మిడిలార్డర్లో సైతం పాకిస్తాన్ బలహీనంగా కన్పించింది.ప్రతీ మ్యాచ్లోనూ సత్తాచాటే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్... ఈ టోర్నీలో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రిజ్వాన్.. భారత్తో మ్యాచ్లో 46 పరుగులు సాధించాడు. అదేవిధంగా తయ్యబ్ తాహిర్ను జట్టులోకి ఎందుకు తీసుకున్నారో ఆర్ధం కావడం లేదు.తొలి రెండు మ్యాచ్ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే అతడు పరిమితమయ్యాడు. మొదటి మ్యాచ్లో విఫలమైనప్పటికి అతడిని భారత్తో మ్యాచ్కు కూడా కొనసాగించారు. అక్కడ కూడా అతడు అదే తీరును కనబరిచాడు. ప్రస్తుత పాక్ జట్టులో హిట్టింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు ఒక్కరు కూడా కన్పించడం లేదు.బౌలింగ్లో కూడా..పాకిస్తాన్ క్రికెట్ ఫాస్ట్ బౌలింగ్కు పెట్టింది పేరు. పాకిస్తాన్కు ప్రధాన బలం పేస్ బౌలింగ్. ప్రతీ మ్యాచ్లోనూ వారు స్పిన్నర్ల కంటే పేసర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. గత కొంత కాలంగా షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రవూప్ పేస్ త్రయం పాక్కు ఎన్నో అద్బుత విజయాలను అందించింది. కానీ ఈ సారి మాత్రం ఈ పేస్ త్రయం చేతులేత్తేసింది. రెండు మ్యాచ్ల్లోనూ ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు తమ సత్తాచాటలేకపోయారు. తమ పేలవ బౌలింగ్తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వీళ్లతో పోలిస్తే స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్ ఎంతో బెటర్. రెండు వికెట్లే తీసినప్పటికి పొదుపుగా బౌలింగ్ చేశాడు.ఫీల్డింగ్ వైఫల్యం..పాకిస్తాన్ ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యం మరో కారణంగా చెప్పవచ్చు. అప్పటికి, ఇప్పటికీ పాకిస్తాన్ ఫీల్డింగ్ మాత్రం మారలేదు. క్యాచ్స్ విన్ మ్యాచ్స్ అంటారు. తొలి రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ ఫీల్డర్లు తీవ్ర నిరాశపరిచారు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టామ్ లాథమ్ క్యాచ్ విడిచిపెట్టడంతో అతడు ఏకంగా సెంచరీ బాదేశాడు.భారత్తో మ్యాచ్లోనూ శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ క్యాచ్లను పాక్ ఫీల్డర్లు జారవిడిచారు. మూడు విభాగాల్లో విఫలమం కావడంతో టోర్నీ ఆరంభమైన ఆరు రోజుల్లోనే పాక్ కథ ముగిసింది. ఇక పాక్ తమ చివరి మ్యాచ్లో ఫిబ్రవరి 27 రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. అదేవిధంగా గ్రూపు-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు తమ సెమీస్ బెర్త్లను ఖారారు చేసుకున్నాయి.చదవండి: కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు.. అయినా అతడు ఎదుగుతున్నాడు! -
సెంచరీతో మెరిసిన రవీంద్ర.. బంగ్లాను చిత్తు చేసిన కివీస్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. దీంతో కివీస్ తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. 237 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 46.1 ఓవర్లలో చేధించింది.బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో యువ ఆటగాడు రచిన్ రవీంద్ర అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన తొలి మ్యాచ్లోనే రవీంద్ర శతకొట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ ప్లేయర్లు విల్ యంగ్, కేన్ విలియమ్సన్ వికెట్లు కోల్పోయిన కివీస్ను రచిన్ ఆదుకున్నాడు.డెవాన్ కాన్వేతో కలిసి స్కోర్ను బోర్డును ముందుకు తీసుకు వెళ్లాడు. ఈ క్రమంలో 95 బంతుల్లో తన నాలుగో సెంచరీ మార్క్ను రవీంద్ర అందుకున్నాడు. ఓవరాల్గా 105 బంతులు ఎదుర్కొన్న రచిన్.. 12 ఫోర్లు, ఓ సిక్సర్తో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు టామ్ లాథమ్(55), డెవాన్ కాన్వే(30) రాణించారు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, నహిద్ రాణా, ముస్తఫిజుర్ రెహ్మాన్, రిషాద్ తలా వికెట్ సాధించారు.ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులకే పరిమితమైంది.కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మైఖల్ బ్రేస్వెల్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు విలియమ్ ఓ రూర్క్ రెండు, హెన్రీ, జామీసన్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ శాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) టాప్ స్కోరర్గా నిలవగా.. జాకర్ అలీ(45), రిషద్ హొస్సేన్(26) రాణించారు. -
బంగ్లా బౌలర్ సూపర్ డెలివరీ.. కివీస్ ఓపెనర్కు ఫ్యూజ్లు ఔట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రావల్పిండి వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ పోరాడుతోంది. 237 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బంగ్లా బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లా స్పీడ్ స్టార్ టాస్కిన్ అహ్మద్ తొలి ఓవర్లోనే తన జట్టుకు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాడు. టాస్కిన్ సంచలన బంతితో న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన టాస్కిన్.. ఆఖరి బంతిని యంగ్కు అద్బుతమైన లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని యంగ్ స్ట్రైట్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్-ప్యాడ్ గ్యాప్ మధ్య నుంచి దూసుకెళ్లి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో యంగ్ ఒక్కసారిగా బిత్తరపోయాడు.టాస్కిన్ దెబ్బకు కివీ ఓపెనర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత ఓవర్లోనే కేన్ విలియమ్సన్(5) సైతం ఔటయ్యాడు. అయితే రచిన్ రవీంద్ర(59) నిలకడగా ఆడుతుండడంతో కివీస్ 25 ఓవర్లకు ముగిసేసరికి 111 పరుగులు చేసింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులకే పరిమితమైంది.కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మైఖల్ బ్రేస్వెల్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు విలియమ్ ఓ రూర్క్ రెండు, హెన్రీ, జామీసన్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ శాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) టాప్ స్కోరర్గా నిలవగా.. జాకర్ అలీ(45), రిషద్ హొస్సేన్(26) రాణించారు. 𝗧𝗔𝗦𝗞ed him! 🔥A peach of a delivery by #TaskinAhmed sends Will Young packing on a duck! 👌#ChampionsTrophyOnJioStar 👉 #BANvNZ | LIVE NOW on Star Sports 2 & Sports 18-1📺📱 Start Watching FREE on JioHotstar! pic.twitter.com/Jl6nwTn5rh— Star Sports (@StarSportsIndia) February 24, 2025 -
చెలరేగిన కివీస్ బౌలర్లు.. 236 పరుగులకే పరిమితైన బంగ్లాదేశ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులకే పరిమితమైంది.కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మైఖల్ బ్రేస్వెల్ నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లా టాపర్డర్ను దెబ్బతీశాడు. బ్రేస్వెల్ను ఎదుర్కోలేక బంగ్లా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ కివీ స్టార్ స్పిన్నర్ తన 10 ఓవర్ల కోటాలో 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అతడితో పాటు విలియమ్ ఓ రూర్క్ రెండు, హెన్రీ, జామీసన్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ శాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) టాప్ స్కోరర్గా నిలవగా.. జాకర్ అలీ(45), రిషద్ హొస్సేన్(26) రాణించారు. కాగా ఈ మ్యాచ్లో కివీస్ విజయం సాధిస్తే సెమీస్కు ఆర్హత సాధిస్తుంది.న్యూజిలాండ్తో పాటు భారత్ కూడా అధికారికంగా గ్రూపు-ఎ నుంచి సెమీస్ అడుగుపెడుతోంది. భారత్ ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో బంగ్లా ఓడిపోతే, పాకిస్తాన్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. తమ సెమీస్ ఆశలను బంగ్లాపైనే పెట్టుకుంది. అయితే కివీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉండడంతో పాక్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టేట్లే కన్పిస్తోంది.చదవండి: అతడు ఫామ్లో లేడన్నారు.. కానీ మాకు చుక్కలు చూపించాడు: పాక్ కెప్టెన్ -
ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో(Nazmul Hossain Shanto) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడించగల సత్తా తమ జట్టుకు ఉందని పేర్కొన్నాడు. తమకు గతంలో నాణ్యమైన పేసర్లు, మణికట్టు స్పిన్నర్లు లేరని.. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నాడు.తొలుత టీమిండియాతోఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల బౌలర్లు, బ్యాటర్లు జట్టులో పుష్కలంగా ఉన్నారని షాంటో సహచర ఆటగాళ్లను కొనియాడాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ ఫిబ్రవరి 20న దుబాయ్లో టీమిండియాతో మ్యాచ్లో రంగంలోకి దిగనుంది.అనంతరం ఫిబ్రవరి 24న రావల్పిండిలో న్యూజిలాండ్తో, ఫిబ్రవరి 27న అదే వేదికపై పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో ఐసీసీతో మాట్లాడిన కెప్టెన్ నజ్ముల్ షాంటో తమ జట్టు ఈ టోర్నీలో విజేతగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే‘‘చాంపియన్స్గా నిలిచేందుకే మేము టోర్నీ ఆడేందుకు వెళ్తున్నాం. ఇందులో పాల్గొంటున్న ఎనిమిది జట్లు కూడ ఇందుకు అర్హత కలిగినవే. ప్రతి జట్టులోనూ నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇక మా జట్టు సామర్థ్యాల పట్ల నాకు నమ్మకం ఉంది.ఎవరూ ఒత్తిడిగా ఫీలవ్వడం లేదు. ముందుగా చెప్పినట్లు ఈ ఈవెంట్లో ఆడే ప్రతి జట్టు విజేతగా నిలవాలని భావించడం సహజం. అయితే, మా తలరాతలో ఏముందో తెలియదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కఠినంగా శ్రమిస్తున్నాం.లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం ఉంది. జట్టులోని పదిహేను మంది సభ్యుల పట్ల నాకు విశ్వాసం ఉంది. మ్యాచ్ను ఒంటి చేత్తో మలుపు తిప్పగల సత్తా వారిలో ఉంది. గత కొంతకాలంగా మా జట్టులో నాణ్యమైన పేస్ బౌలర్లు, మణికట్టు స్పిన్నర్లు లేరనే లోటు ఉండేది.అయితే, ఇప్పుడు మా పేస్ దళం పటిష్టంగా ఉంది. మంచి స్పిన్నర్లు కూడా ఉన్నారు. మాదొక సమతూకమైన జట్టు. జట్టులోని ప్రతి సభ్యుడు తమ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారనే నమ్మకం ఉంది. మాదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా మేము ఓడించగలం’’ అని నజ్ముల్ షాంటో విశ్వాసం వ్యక్తం చేశాడు. నాడు సెమీస్లోకాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించగా.. బంగ్లాదేశ్ సెమీ ఫైనల్ చేరింది. అయితే, సెమీస్లో టీమిండియా చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడి నిష్క్రమించింది. ఇక వన్డే ఫార్మాట్ టోర్నీలో నాడు ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్ ఎమాన్, నాసుమ్ అహ్మద్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా. చదవండి: క్రెడిట్ అతడికే ఇవ్వాలి.. నా స్థానంలో ఎవరున్నా జరిగేది అదే: రోహిత్ శర్మ -
NZ vs BAN 3rd T20: బంగ్లాపై న్యూజిలాండ్ విజయం.. సిరీస్ సమం
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను విజయంతో న్యూజిలాండ్ ముగించింది. మౌంట్ మంగ్నూయ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో(డీఎల్ఎస్) కివీస్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో న్యూజిలాండ్ సమం చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. కివీస్ బౌలర్ల దాటికి 110 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. సౌథీ, మిల్నే, సీర్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ ఇన్నింగ్స్ 95/5(14.4 ఓవర్లు) వద్ద మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గే సూచనలు కన్పించకపోవడంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 17 పరుగుల అధిక్యంలో ఉన్న కివీస్ను డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు. న్యూజిలాండ్ కూడా స్వల్ప లక్ష్య చేధనలో కాస్త తడబడింది. 38 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఫిన్ అలెన్(38), నీషమ్(28) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్, షోర్ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించగా.. రెండో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
NZ Vs Ban: ఆకస్మిక వర్షంలో తడిసిముద్దైన ఆటగాళ్లు.. మ్యాచ్ రద్దు
New Zealand vs Bangladesh, 2nd T20I: న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మ్యాచ్కు వరణుడు అడ్డుతగిలాడు. మౌంట్ మౌంగనీయ్లో ఇరు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైపోయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్ల సిరీస్లో బంగ్లా 1-0తో ఆధిక్యం నిలబెట్టుకోగలిగింది. కాగా నజ్ముల్ హొసేన్ షాంటో కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు కివీస్ పర్యటనకు వెళ్లింది. ఈ యువ బ్యాటర్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్లో ఆఖరి మ్యాచ్లో అనూహ్య విజయం సాధించింది. తద్వారా క్లీన్స్వీప్ గండాన్ని తప్పించుకోవడమే గాకుండా.. న్యూజిలాండ్ గడ్డ మీద తొలి వన్డే గెలుపు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. తొలి టీ20 గెలుపు ఇక మూడో వన్డేలో ఆతిథ్య కివీస్ను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఊహించని రీతిలో టీ20 సిరీస్ను విజయంతో ఆరంభించింది. నేపియర్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో శాంట్నర్ బృందంపై ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక కివీస్ గడ్డ మీద బంగ్లాదేశ్కు ఇదే తొలి టీ20 గెలుపు కూడా కావడం విశేషం. ఆకస్మిక వర్షం.. తడిసిపోయిన ఆటగాళ్లు ఈ క్రమంలో రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావించిన నజ్ముల్ షాంటో బృందం.. అందుకు తగ్గట్లుగానే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ షోరిఫుల్ ఇస్లాం.. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్(2)ను పెవిలియన్కు పంపి శుభారంభం అందించాడు. అయితే, 23 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి ప్రమాదకరంగా మారుతున్న మరో ఓపెనర్ టిమ్ సిఫార్ట్ను తంజీం హసన్ సకీబ్ అవుట్ చేశాడు. వీరి స్థానాల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ 18(24 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ 9(14 బంతుల్లో) పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. And that's that! Unfortunately, the 2nd @BLACKCAPS v Bangladesh T20I at Bay Oval in Tauranga has been officially called off due to the rain 😢☔ Blackcaps v Bangladesh: 3rd T20I | Sunday from 12.30pm on TVNZ 1 and TVNZ+ pic.twitter.com/TsZoLLfRJm — TVNZ+ (@TVNZ) December 29, 2023 మ్యాచ్ రద్దు అయితే, 11 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆకస్మికంగా వర్షం మొదలైంది. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు: 72/2. ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలు దాటినా తెరిపినివ్వలేదు. ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువ కావడంతో న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య డిసెంబరు 31 (ఆదివారం) నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. ఇందులో గనుక బంగ్లాదేశ్ గెలిస్తే కివీస్ గడ్డపై మరో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం!! Heavy rain still falling at Bay Oval. The latest time play can begin again is 10:28pm #BANvNZ pic.twitter.com/w85rLJjE7F — BLACKCAPS (@BLACKCAPS) December 29, 2023 -
న్యూజిలాండ్లో బంగ్లాదేశ్ సంచలనాలు: మొన్న అలా.. ఇప్పుడిలా!
New Zealand vs Bangladesh, 1st T20I: న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. మూడో వన్డేలో కివీస్ను చిత్తు చేసి చరిత్ర సృష్టించి బంగ్లా... మొదటి టీ20లో సంచలన విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్లో తొలి టీ20 గెలుపు నమోదు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్లో ఆతిథ్య జట్టు ఆధిపత్యాన్ని 2-1కు తగ్గిస్తూ ఆఖరి మ్యాచ్లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. గెలుపు జోష్లో టీ20 సిరీస్ను మొదలుపెట్టిన బంగ్లా.. నేపియర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్నర్ మెహదీ హసన్ రెండు, షోరిఫుల్ ఇస్లాం వరుస వికెట్లు తీసి.. కివీస్ను ఆరంభంలోనే దెబ్బకొట్టారు. టాపార్డర్ను కకావికలం చేశారు. వీరిద్దరి దెబ్బకు ఓపెనర్లు ఫిన్ అలెన్(1), సీఫర్ట్(0).. డారిల్ మిచెల్(14), గ్లెన్ ఫిలిప్స్(0) పూర్తిగా విఫలమై పెవిలియన్ చేరారు. మిగిలిన వాళ్లలో జిమ్మీ నీషం 48, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 23 పరుగులతో రాణించగా.. నిర్నీత 20 ఓవర్లలో కివీస్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ 42 పరుగులు(నాటౌట్), నాలుగో నంబర్ బ్యాటర్ సౌమ్య సర్కార్ 22 పరుగులతో మెరుగ్గా ఆడారు. వీరిద్దరి తోడు మెహదీ హసన్ 16 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18.4 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసింది బంగ్లాదేశ్. తద్వారా న్యూజిలాండ్ గడ్డ మీద పొట్టి ఫార్మాట్లో తొలి విజయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: #Virat kohli: విరాట్ కోహ్లికి ఘోర అవమానం! మండిపడుతున్న ఫ్యాన్స్ -
NZ vs Ban: బంగ్లా సంచలన విజయం.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర
New Zealand vs Bangladesh, 3rd ODI: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. మూడో వన్డేలో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించింది. పటిష్ట కివీస్ జట్టును సొంతగడ్డపై 98 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది. సిరీస్ కివీస్దే కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. కివీస్ బంగ్లాను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఇక రెండో వన్డేలోనూ ఏడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలోనూ జోరును కొనసాగిస్తూ వైట్వాష్ చేయాలని భావించిన న్యూజిలాండ్ ఆశలపై పర్యాటక బంగ్లా జట్టు నీళ్లు చల్లింది. నేపియర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బంగ్లాదేశ్ పేసర్లు అయితే, ఆరంభం నుంచే దూకుడు పెంచిన బంగ్లా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను తిప్పలు పెట్టారు. పేసర్లు షోరిఫుల్ ఇస్లాం మూడు, తాంజిం హసన్ సకీబ్ మూడు, సౌమ్యా సర్కార్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ ఒక వికెట్ పడగొట్టాడు. బంగ్లా ఫాస్ట్బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఓపెనర్ విల్ యంగ్ 26 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. మరో ఓపెనర్, వరల్డ్కప్ సెంచరీల వీరుడు రచిన్ రవీంద్ర ఎనిమిది పరుగులకే పరిమితం అయ్యాడు. ఇక కెప్టెన్ టామ్ లాథం 21 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 31.4 ఓవర్లలో కేవలం 98 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. నజ్ముల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్ గడ్డపై కొత్త చరిత్ర లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బౌలింగ్తో ఆకట్టుకున్న బ్యాటర్ సౌమ్యా సర్కార్ 16 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అనముల్ హక్ 37 పరుగులతో రాణించగా.. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో అజేయ అర్ధ శతకం బాదాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా బంగ్లాదేశ్కు న్యూజిలాండ్ గడ్డమీద ఇదే తొలి వన్డే విజయం కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్న్యూస్!.. కెప్టెన్ దూరం! -
న్యూజిలాండ్కు బిగ్ షాక్.. జట్టు నుంచి తప్పుకున్న విలియమ్సన్
స్వదేశంలో బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్టార్ పేసర్ కైల్ జేమీసన్ బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని శుక్రవారం న్యూజిలాండ్ క్రికెట్ దృవీకరించింది. కాగా బంగ్లాతో టీ20 సిరీస్కు న్యూజిలాండ్ క్రికెట్ తొలుత ప్రకటించిన జట్టులో విలియమ్సన్, జేమీసన్ ఇద్దరూ ఉన్నారు. అయితే మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న విలియమ్సన్కు మరి కొన్ని రోజులు విశ్రాంతి అవరసమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే బంగ్లాతో సిరీస్ నుంచి కేన్ మామ తప్పుకున్నాడు. జేమీసన్ కూడా తన మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇక విలియమ్సన్ స్ధానాన్ని యువ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రతో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసిది. అదే విధంగా జమీసన్ స్ధానంలో పేసర్ ఢఫీ జట్టులో వచ్చాడు. కాగా విలయమ్సన్ తప్పుకోవడంతో మిచెల్ శాంట్నర్కు జట్టు పగ్గాలను కివీస్ సెలక్టర్లు అప్పగించారు. డిసెంబర్ 27న నేపియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ టీ20 జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ -
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ సొంతం
నెల్సన్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం అందుకుంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(89), నికోల్స్(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. అతడితో పాటు ముష్పికర్ రహీం(45) పరుగులతో రాణించాడు. ఇక కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్సన్, ఆశోక్ చెరో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 23న నేపియర్ వేదికగా జరగనుంది. చదవండి: IPL Auction: విరాట్ కోహ్లికి రూ.42 కోట్లు.. టీమిండియా మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బద్దలు
నెల్సన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సర్కార్.. ఎట్టకేలకు తన బ్యాట్ను ఝుళిపించాడు. ఈ మ్యాచ్లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో బంగ్లా క్రికెటర్గా సర్కార్ నిలిచాడు. ఈ జాబితాలో లిట్టన్ దాస్(176) అగ్రస్ధానంలో ఉన్నాడు. సచిన్ రికార్డు బ్రేక్.. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన సర్కార్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆసియా క్రికెటర్గా సర్కార్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 2009లో క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్తో జరిగిన మ్యాచ్లో సచిన్ 163 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అయితే తాజా మ్యాచ్తో సర్కార్ 14 ఏళ్ల మాస్టర్బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్క్యాప్స్ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(89), నికోల్స్(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్(169) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్సన్, ఆశోక్ చెరో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 23న నేపియర్ వేదికగా జరగనుంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాదేశ్ ఓటమి
బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం డునెడిన్ వేదికగా బంగ్లాదేశ్తో తొలి వన్డేలో 44 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. బంగ్లా కెప్టెన్ షాంటో టాస్ గెలచి తొలుత న్యూజిలాండ్ను బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే కివీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్లలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 30 ఓవర్లకు కుదించాడు. నిర్ణీత 30 ఓవర్లలో కివీస్ 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ విల్ యంగ్(84 బంతుల్లో 105, 14 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ లాథమ్(92) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం రెండు, మెహది హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. మిగితా నాలుగు వికెట్లు కూడా రనౌట్లే కావడం గమనార్హం. అనంతం డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లా టార్గెట్ను 30 ఓవర్లలో 245 పరుగులగా నిర్ణయించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో అనముల్ హక్(43) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో సోధీ, మిల్నీ, క్లార్క్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: ENG vs WI: ఎస్ఆర్హెచ్ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే -
మీర్పుర్ పిచ్పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ
మీర్పుర్ వేదికగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆసక్తికర రూలింగ్ ఇచ్చింది. మీర్పుర్ పిచ్ (షేర్ ఏ బంగ్లా స్టేడియం, ఢాకా) అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ల పిచ్ కాదని ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పిచ్ నాసిరకంగా తయారు చేయబడిందని, పిచ్పై బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యిందని, దీని వల్ల ఇరు జట్ల బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మ్యాచ్ రిఫరి డేవిడ్ బూన్ తన నివేదికలో పేర్కొన్నాడు. ప్రమాదకరమైన పిచ్ను తయారు చేసినందుకుగాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అక్షింతలు వేసిన ఐసీసీ.. మీర్పుర్ పిచ్కు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రిఫరి బూన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మీర్పుర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో మ్యాచ్లో పర్యాటక న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో న్యూజిలాండ్ 1-1తో సిరీస్ను సమం చేసుకుంది. బ్యాటర్లకు ఏమాత్రం సహకరించని మీర్పుర్ పిచ్పై కివీస్ బౌలర్లు ఒకింత లబ్ది పొందారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 172, రెండో ఇన్నింగ్స్లో 144 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో స్వల్ప ఆధిక్యాన్ని (180 ఆలౌట్) పొంది, రెండో ఇన్నింగ్స్లో (139/6) అతి కష్టంమీద బంగ్లా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పిచ్పై బంతి అనూహ్యంగా బౌన్స్ అయినప్పటికీ స్పిన్నర్లకు అత్యధిక వికెట్లు లభించడం విశేషం. -
బంగ్లాదేశ్పై న్యూజిలాండ్ విజయం.. సిరీస్ సమం
మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో కివీస్ సమం చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్లాక్ కాప్స్ విజయంలో గ్లెన్ ఫిలిప్స్(40 నాటౌట్), మిచెల్ శాంట్నర్(35) కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్కు కష్టంగా ఉన్న వికెట్పై ఫిలిప్స్, శాంట్నర్ అద్బుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్ మిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తైజుల్ ఇస్లాం రెండు, షోర్ఫుల్ ఇస్లాం ఒక వికెట్ సాధించారు. అంతకుముందు 38/2 ఓవర్ నైట్ స్కోర్తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 144 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆజాజ్ పటేల్ 6 వికెట్లతో బంగ్లాపతనాన్ని శాసించాడు. అతడితో పాటు శాంట్నర్ 3 వికెట్లు సాధించాడు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది. కివీస్ తొలి ఇన్నింగ్స్లో కూడా గ్లెన్ ఫిలిప్స్ 87 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. -
BAN vs NZ: బంగ్లాదేశ్తో రెండో టెస్టు.. గ్లెన్ ఫిలిప్స్ విరోచిత పోరాటం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్కు కష్టంగా ఉన్న పిచ్పై 88 పరుగులు చేసి జట్టును అదుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 9 సిక్స్లు ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ ప్రత్యర్ఢి బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. తన జట్టుకు 180 పరుగులు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఫిలిప్స్తో పాటు జామీసన్(20), మిచెల్(18) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్లు తైజుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. నయీం హసన్, షోర్ఫుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు సాధించాడు. ఇక మూడో రోజు ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు కేవలం 32 ఓవర్ల ఆటమాత్రమే సాధ్యపడింది. ప్రస్తుతం క్రీజులో జకీర్ హసన్(16), మోమినుల్ హక్(0) ఉన్నారు. చదవండి: LLC 2023: గంభీర్తో గొడవ.. శ్రీశాంత్కు లీగల్ నోటీసులు -
BAN VS NZ 2nd Test: తొలి రోజు 15 వికెట్లు.. రెండో రోజు వర్షార్పణం
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మిర్పూర్లో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆటలో ఏకంగా 15 వికెట్లు నేలకూలగా, రెండో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గురువారం భారీ వర్షం వల్ల స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోజు ఆట రద్దైంది. కాగా, ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే ఆలౌటైంది. సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ చెరో 3 వికెట్లు, అజాజ్ పటేల్ 2, కెప్టెన్ సౌథీ ఓ వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్ను ఆలౌట్ చేశారు. బంగ్లా ఇన్నింగ్స్లో ముష్ఫికర్ రహాం (35) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన న్యూజిలాండ్ కూడా తడబడింది. బంగ్లా స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మెహిది హసన్ మీరజ్ 3, తైజుల్ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ (4), డేవాన్ కాన్వే (11), కేన్ విలియమ్సన్ (13), హెన్రీ నికోల్స్ (1), టామ్ బ్లండెల్ (0) విఫలం కాగా.. డారిల్ మిచెల్ (12), గ్లెన్ ఫిలిప్స్ (5) క్రీజ్లో ఉన్నారు. -
బంగ్లాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! కేన్ మామ దూరం
వన్డే ప్రపంచకప్-2023 తర్వాత తొలి వైట్బాల్ సిరీస్కు న్యూజిలాండ్ సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కివీస్ తలపడనుంది. ఈ సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో టామ్ లాథమ్ను సారధిగా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక దేశీవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లెగ్ స్పిన్నర్ ఆదిల్ అశోక్, జోష్ క్లార్క్సన్, విల్ ఓ'రూర్క్లకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా వన్డే వరల్డ్ప్లో దుమ్మురేపిన యువ సంచలనం రచిన్ రవీంద్ర కూడా బంగ్లా సిరీస్కు అందుబాటులో ఉన్నాడు. డిసెంబర్ 17న డునెడిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో వన్డేలకు కివీస్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఆది అశోక్, ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, రచిన్ రవీంద్ర, ఇష్ సోధి, విల్ యంగ్. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు.. వీడియో వైరల్ -
Ban vs NZ: న్యూజిలాండ్కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్.. తొలిరోజే..
Bangladesh vs New Zealand, 2nd Test: బంగ్లాదేశ్తో రెండో టెస్టులోనూ న్యూజిలాండ్కు శుభారంభం లభించలేదు. తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టును 172 పరుగులకే కట్టడి చేశామన్న సంతోషం కివీస్ జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజు ఆట ముగిసే సరికి అనూహ్యంగా బంగ్లాదేశ్ ఆధిక్యంలోకి వచ్చింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిల్హైట్లో జరిగిన తొలి మ్యాచ్లో కివీస్కు ఘోర పరభావం ఎదురైంది. బంగ్లాదేశ్ గడ్డపై మొదటిసారి ఆతిథ్య జట్టు చేతిలో.. అది కూడా 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని భావిస్తోంది టిమ్ సౌథీ బృందం. ఇందులో భాగంగా ఢాకాలో బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను 172 పరుగులకు కట్టడి చేసింది. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్ రెండు, సౌథీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆరంభంలోనే కివీస్కు షాక్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ టామ్ లాథమ్ను 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు పంపించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(11), వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(13)ను మెహిది హసన్ మిరాజ.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(1)ను తైజుల్ అవుట్ చేశారు. ఆరో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ను హసన్ మిరాజ్ డకౌట్ చేయగా.. వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 12, ఎనిమిదో స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 12.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసి వెనుకబడిపోయింది. హైలైట్స్ ఇవే ఇక ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం వింతైన పద్ధతిలో అవుట్ కావడం హైలైట్గా నిలిచింది. జెమీసన్ బౌలింగ్లో వికెట్ల దిశగా వెళ్తున్న బంతిని చేతితో ఆపి రహీం హ్యాండిలింగ్ ద బాల్ నిబంధన వల్ల పెవిలియన్ చేరాడు. మరోవైపు.. తొలిరోజు ఆటలోనే మొత్తంగా 15 వికెట్లు కూలడం మరో విశేషం. మొత్తానికి ఢాకా పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. ఇక న్యూజిలాండ్ ప్రస్తుతం బంగ్లా కంటే 117 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు! నా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: లారా Did Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while... . .#BANvNZ pic.twitter.com/SC7IepKRTh — FanCode (@FanCode) December 6, 2023 -
అలా ఔటైన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ముష్ఫికర్ రహీం
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 6) మొదలైన రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్ల తర్వాత ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. బంగ్లా టాపార్డర్ బ్యాటర్లంతా (హసన్ జాయ్ (14), జకీర్ హసన్ (8), షాంటో (9), మొమినుల్ హక్ (5)) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరగా.. ముష్ఫికర్ రహీం (35), షాదత్ హొసేన్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేసి జట్టును ఆదుకున్నారు. మెహిది హసన్ మీరజ్ (9 నాటౌట్), నురుల్ హసన్ (0 నాటౌట్) బంగ్లాను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా.. బంగ్లాదేశ్ వెటరన్ ఆటగాడు, ఆ జట్టు వికెట్కీపర్ ముష్ఫికర్ రహీం ఓ అరుదైన పద్దతిలో ఔటయ్యాడు. బంతికి చేతితో అడ్డుకుని ముష్ఫికర్ పెవిలియన్కు చేరాడు. హ్యాండిల్ ద బాల్ నిబంధన మేరకు రహీం ఔటైనట్లు అంపైర్లు ప్రకటించారు. జేమీసన్ బౌలింగ్లో బ్యాటింగ్ చేస్తున్న రహాం బంతిని డిఫెన్స్ ఆడగా అది కాస్త వికెట్లను ముద్దాడే దిశగా వెళ్లింది. దీంతో అప్రమత్తమైన రహీం బంతి వికెట్లు తాకకుండా అడ్డుకున్నాడు. టెస్ట్ల్లో హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటైన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా రహీం రికార్డుల్లోకెక్కాడు. Mushfiqur Rahim becomes the first Bangladesh player to be dismissed for handling the ball.pic.twitter.com/cMdWVcNpNt— CricTracker (@Cricketracker) December 6, 2023 టెస్ట్ల్లో ఓవరాల్గా ఈ నిబంధన ద్వారా ఇప్పటివరకు 11 మంది ఔటయ్యారు. రహీం 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రహీంకు ముందు మైఖేల్ వాన్, మహేళ జయవర్ధనే, మర్వన్ ఆటపట్టు, స్టీవ్ వా, గ్రహం గూచ్, డెస్మండ్ హేన్స్, మొహిసిన్ ఖాన్, ఆండ్రూ హిల్డిచ్, రసెల్ ఎండీన్, లియోనార్డ్ హట్టన్ హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటయ్యారు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ తొలి టెస్ట్లో ఓటమిపాలై సిరీస్లో వెనుకపడి ఉంది. -
న్యూజిలాండ్పై చారిత్రత్మక విజయం.. బంగ్లా ఆటగాళ్లకు బంపరాఫర్!?
సెల్హాట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించించిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై బంగ్లాదేశ్కు న్యూజిలాండ్పై ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. అయితే ఈ చారిత్రత్మక విజయం సాధించింనందుకు బంగ్లా జట్టు ఆటగాళ్లకు ఆ దేశక్రికెట్ బోర్డు బంపరాఫర్ ఇచ్చింది. ఈ గెలుపులో భాగమైన ఆటగాళ్లకు బోనస్ ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు. "ఆటగాళ్లకు బంగ్లా క్రికెట్ బోర్డు నుంచి ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఉంటుంది. సొంత గడ్డపై కివీస్పై తొలి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మా బాయ్స్కు బోనస్ ఇవ్వాలని నేను బీసీబీ అధ్యక్షుడితో మాట్లాడాను. అది కచ్చితంగా జరుగుతోంది. మా జట్టు ఢాకాకు చేరుకున్న తర్వాత వారితో కలిసి బీసీబీ అధ్యక్షుడు డిన్నర్ చేస్తారు. అనంతరం బోనస్కు సంబంధించిన ప్రకటన చేయవచ్చు" అని విలేకురల సమావేశంలో జలాల్ యూనస్ పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 26 నుంచి ఢాకా వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. -
WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్లో పాకిస్తాన్..
ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ టాప్-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాగా బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం ముగిసిన మొదటి మ్యాచ్లో కివీస్ను చిత్తు చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్.. న్యూజిలాండ్పై విజయం సాధించడం ఇదే మొదటిసారి. చారిత్మక విజయంతో బంగ్లాదేశ్ ఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్గా నజ్ముల్ షాంటో తొలి ప్రయత్నంలోనే చారిత్రాత్మక విజయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023- 25 సీజన్ నడుస్తోంది. అగ్రస్థానం ఇంకా పాకిస్తాన్దే తాజా సైకిల్లో భాగంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్లలో రెండూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టును ఓడించి 24 పాయింట్లతో టాప్లో ఉంది. మరోవైపు.. జూలైలో వెస్టిండీస్లో పర్యటించిన టీమిండియా రెండింట ఒక మ్యాచ్ గెలిచి.. మరొకటి డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 16 పాయింట్లతో రెండో స్థానం(66.67 శాతం)లో ఉండేది. అయితే, తాజాగా న్యూజిలాండ్పై గెలుపుతో విజయశాతం(100 శాతం) విషయంలో మెరుగ్గా ఉన్న బంగ్లా ఇప్పుడు టీమిండియాను వెనక్కినెట్టింది. PC: ICC మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా ఈక్రమంలో రోహిత్ సేన ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 18 పాయింట్లు(విజయశాతం 30)తో నాలుగు, వెస్టిండీస్ 4 పాయింట్లు(16.67 శాతం)తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ కేవలం 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉండగా.. శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తదితర జట్టు ఇంకా తాజా సైకిల్లో పాయింట్ల ఖాతా తెరవనే లేదు. రెండుసార్లు చేదు అనుభవమే కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిస్తే 12, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక సీజన్ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ ట్రోఫీని తొలుత న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఈ రెండు పర్యాయాలు ఫైనల్ వరకు చేరిన టీమిండియాకు ఆఖరి పోరులో ఓటమి తప్పలేదు. చదవండి: టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
న్యూజిలాండ్కు భారీ షాక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. భారీ విజయంతో..
Bangladesh vs New Zealand, 1st Test: పటిష్ట న్యూజిలాండ్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్పై భారీ విజయం సాధించింది. తొలి టెస్టులో టిమ్ సౌథీ బృందాన్ని ఏకంగా 150 పరుగుల తేడాతో చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. కాగా రెండు టెస్టులు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం(నవంబరు 28) ఇరు జట్ల మధ్య సిల్హెట్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య బంగ్లా 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ను బంగ్లాదేశ్ 338 పరుగుల వద్ద ముగించగా.. కివీస్ 181 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్, తైజుల్ ఇస్లాం ఆరు వికెట్లతో చెలరేగి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్ రూపంలో కీలక వికెట్లు తీసిన తైజుల్.. కైలీ జెమీషన్, ఇష్ సోధి, టిమ్ సౌథీలను కూడా అవుట్ చేసి శనివారం నాటి ఐదోరోజు తొలి సెషన్లోనే మ్యాచ్ను ముగించాడు. టెస్టుల్లో షాంటో బృందం సరికొత్త చరిత్ర ఇలా బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్పై బంగ్లాదేశ్కు ఇదే తొలి టెస్టు గెలుపు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు తొలిసారి సారథిగా వ్యవహరించిన నజ్ముల్ షాంటో ఈ మేరకు చారిత్రాత్మక విజయం అందుకోవడం విశేషం. ఇక గత 18 టెస్టుల్లోనూ బంగ్లాదేశ్కు ఇదే రెండో విజయం కావడం గమనార్హం. నాలుగో రోజు ఆట ముగిసిందిలా కాగా.. 332 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డరైల్ మిచెల్ (44 నాటౌట్) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (4/24) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 212/3తో శుక్రవారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (67), మెహదీ హసన్ మిరాజ్ (50 నాటౌట్) అర్ధసెంచరీలు చేశారు. ఇక ఐదో రోజు ఆటలో భాగంగా విజయానికి కివీస్ మరో 219 పరుగులు చేయాల్సి ఉండగా.. స్పిన్నర్ నయీం హసన్ తొలి వికెట్ తీయగా.. తైజుల్ మరో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఓటమిని ఖరారు చేశాడు. చదవండి: అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
బంగ్లాదేశ్తో తొలి టెస్టు.. ఓటమి అంచుల్లో న్యూజిలాండ్
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్తో జరగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓటమి అంచున నిలిచింది. 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ విజయానికి ఇంకా 219 పరుగులు అవసరమ్వగా.. బంగ్లా విజయానికి కేవలం 3 వికెట్ల దూరంలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో న్యూజిలాండ్ బ్యాటర్లు డార్లీ మిచెల్(44), ఇష్ సోధి(7) పరుగులతో ఉన్నారు. తొలి టెస్టులో కివీస్ ఓటమి నుంచి గట్టుఎక్కాలంటే ఏవైనా అద్బుతాలు జరిగాలి. కాగా సెకెండ్ ఇన్సింగ్స్లో బంగ్లా స్పిన్వలలో కివీస్ బ్యాటర్లు చిక్కుకున్నారు. బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 4 వికెట్లతో కివీస్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తైజుల్ ఇస్లాంతో పాటు షార్ఫుల్ ఇస్లాం, మెహాది హసన్, నయీం హసన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బంగ్లాదేశ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ షాంటో(105) సెంచరీతో మెరిశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ 4 వికెట్లు, ఇష్ సోధి రెండు వికెట్లు సాధించారు. అదే విధంగా బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు మాత్రమే చేసింది. చదవండి: VHT 2023: దినేష్ కార్తీక్ విధ్వంసం.. 13 ఫోర్లు, 4 సిక్స్లతో! అయినా పాపం -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ కెప్టెన్.. విరాట్ కోహ్లి, స్మిత్ సరసన
సిల్హెట్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్లో శాంటో సెంచరీతో మెరిశాడు. 192 బంతుల్లో 10 ఫోర్లతో శాంటో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. క్రీజులో శాంటో(104), ముస్తిఫిజర్ రహీం(43) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన షాంటో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్గా అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా షాంటో నిలిచాడు. ఓవరాల్గా టెస్టు కెప్టెన్సీ అరంగేట్రంలో సెంచరీ చేసిన 32వ క్రికెటర్గా షాంటో ఈ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. చదవండి: టీ20 వరల్డ్కప్లో రోహిత్, కోహ్లి ఆడుతారా? ఇంగ్లండ్ లెజెండ్ సమాధానమిదే -
కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీ.. విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సమం
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ వైట్బాల్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 189 బంతుల్లో 11 ఫోర్లతో విలియమ్సన్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. టెస్టుల్లో విలియమ్సన్కు ఇది 29వ సెంచరీ. తద్వారా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆసీస్ దిగ్గజం బ్రాడ్మన్ రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్లో ఇప్పటివరకు 29 సెంచరీలు సాధించగా.. బ్రాడ్మన్ పేరిట కూడా 29 టెస్టు సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా మరో అరుదైన రికార్డును కేన్ మామ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి కివీస్ క్రికెటర్గా విలియమ్సన్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్కు ముందు శ్రీలంకపై కూడా కేన్ రెండు టెస్టుల్లో వరుసగా రెండు సార్లు సాధించాడు. కాగా విలియమ్సన్కు ఓవరాల్గా ఇది 42వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక బంగ్లాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో విలియమ్సన్ 104 పరుగులు చేశాడు. 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కివీస్ 262 పరుగులు చేసింది. -
WC 2023: ఎదురులేని న్యూజిలాండ్..బంగ్లాదేశ్ను చిత్తు చేసి హ్యాట్రిక్ కొట్టిన కివీస్
వన్డే వరల్డ్కప్-2023లో న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను మట్టికరిపించిన కివీస్.. రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. తాజాగా బంగ్లాదేశ్తో శుక్రవారం నాటి మ్యాచ్లోనూ జయభేరి మోగించింది. చెలరేగిన ఫెర్గూసన్ చెన్నైలోని చెపాక్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్.. షకీబ్ అల్ హసన్ బృందాన్ని బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలి బంతికే కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. ఓపెనర్ లిటన్ దాస్ను డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ 16 పరుగులకే నిష్క్రమించగా.. మెహిదీ హసన్ మిరాజ్ 30, షకీబ్ 40, ముష్ఫికర్ రహీం 66 పరుగులతో రాణించారు. ఆఖర్లో మహ్మదుల్లా 41 పరుగులతో అజేయంగా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 2, మ్యాట్ హెన్రీ 2, లాకీ ఫెర్గూసన్ 3, సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు. సమిష్టిగా రాణించి ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడింది కివీస్. ఓపెనర్గా వచ్చిన రచిన్ రవీంద్ర 9 పరుగులకే అవుట్ కాగా.. డెవాన్ కాన్వే(45)తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. వచ్చీ రాగానే కేన్ మామ మళ్లీ నాలుగో స్థానంలో వచ్చిన డారిల్ మిచెల్ 67 బంతుల్లో 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్తో వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో అడుగుపెట్టిన కేన్ మామ.. 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్లో 42.5 ఓవర్లలోనే టార్గెట్ను ఛేజ్ చేసిన కివీస్ 2 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 8 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టింది. లాకీ ఫెర్గూసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. -
WC 2023: ముష్ఫికర్- షకీబ్ సరికొత్త చరిత్ర.. సెహ్వాగ్- సచిన్ రికార్డు బ్రేక్
ICC Cricket World Cup 2023- New Zealand vs Bangladesh: బంగ్లాదేశ్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీం- షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ జోడీ వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్.. తమ మూడో మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్(ఎంఏ చిదంబరం స్టేడియం) వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. సెంచరీ భాగస్వామ్యంతో.. ఈ క్రమంలో తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఓపెనర్ లిటన్ దాస్ డకౌట్గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ 16 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ మెహిదీ హసన్ మిరాజ్ 30 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నజ్ముల్ హొసేన్ షాంటో(7) పూర్తిగా నిరాశపరిచాడు. ఇలా 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును కెప్టెన్ షకీబ్ అల్ హసన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం ఆదుకున్నారు. అద్భుత భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు బాటలు వేశారు. షకీబ్ 51 బంతుల్లో 40 రన్స్ తీయగా.. ముష్ఫికర్ రహీం 75 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించాడు. అత్యధిక పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీగా.. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్ చరిత్రలో అరుదైన భాగస్వామ్య రికార్డు నెలకొల్పారు. ఇద్దరూ కలిపి 19 ఇన్నింగ్స్లో 972 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు. తద్వారా సెహ్వాగ్- సచిన్ల రికార్డును అధిగమించారు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్ కలిపి 20 ఇన్నింగ్స్లో 971 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ జాబితాలో 20 ఇన్నింగ్స్లో 1220 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా మాజీ స్టార్లు ఆడం గిల్క్రిస్ట్- మాథ్యూ హెడెన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లా, టీమిండియా జోడీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరో రికార్డు.. ఇది సమంగా.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక 50+ పార్ట్నర్షిప్స్ నమోదు చేసిన జోడీలు ఆడం గిల్క్రిస్ట్- మాథ్యూ హెడెన్- 12 వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్- 8 ముష్ఫికర్ రహీం- షకీబ్ అల్ హసన్- 8. కాగా కివీస్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు స్కోరు చేసింది. చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. కెప్టెన్ వచ్చేశాడు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్- బంగ్లాదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. విల్యంగ్ స్ధానంలో విలియమ్సన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. మెహది హసన్ స్ధానంలో మహ్మదుల్లా జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీలో కివీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. బంగ్లాదేశ్ ఇంకా బోణీ కొట్టలేదు. తుది జట్లు బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(సి), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్ న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ -
న్యూజిలాండ్కు గుడ్న్యూస్.. కేన్ మామ వచ్చేసాడు!
వన్డే ప్రపంచకప్-2023లో వరుసగా మూడో విజయంపై న్యూజిలాండ్ కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్తో మ్యాచ్కు బరిలో దిగనున్నాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్లకు గాయం కారణంగా విలియమ్సన్ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు కేన్ మామ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. విలియమ్సన్ రాకతో కివీస్ జట్టు మరింత బలంగా తయారుకానుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ సందర్భంగా గాయపడిన విలియమ్సన్ అప్పటినుంచి కివీస్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు రెండు వామప్ మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్ చేసిన కేన్.. మ్యాచ్ మధ్యలోనే రిటైర్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇప్పడు తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో రిఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు స్టార్ పేసర్ టిమ్ సౌథీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. సౌథీ చేతివేలి గాయంతో బాధపడతున్నాడు. ఈ క్రమంలో బంగ్లాతో మ్యాచ్కు కూడా సౌథీ దూరమయ్యే ఛాన్స్ ఉంది. వరల్డ్కప్కు న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, విల్ యంగ్, టిమ్ సౌతీ, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి చదవండి: SMT 2023: తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్గా ప్రమోషన్ -
సొంతగడ్డపై బంగ్లాదేశ్కు చుక్కెదురు.. సిరీస్ కైవసం చేసుకున్న కివీస్
సొంతగడ్డపై బంగ్లాదేశ్కు చుక్కెదురైంది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మూడో వన్డేలో పర్యాటక జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 34.3 ఓవర్లలోనే 171 పరుగులకు ఆలౌటైంది. ఆడమ్ మిల్నే (4/34), ట్రెంట్ బౌల్ట్ (2/33), మెక్కొంచి (2/18) బంగ్లా పతనాన్ని శాశించగా.. లోకి ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర తలో వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో (76) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. తౌహిద్ హ్రిదోయ్ (18), ముష్ఫికర్ రహీమ్ (18), మహ్మదుల్లా (21), మెహిది హసన్ (13) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ యంగ్ (70), హెన్రీ నికోల్స్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. ఫిన్ అలెన్ (28), టామ్ బ్లండెల్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ అరంగేట్రం ఆటగాడు డీన్ ఫాక్స్క్రాఫ్ట్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టగా.. నసుమ్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. -
BAN VS NZ 3rd ODI: బంగ్లాదేశ్ ఆల్రౌండర్ అరుదైన ఘనత
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మహ్మదుల్లా అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో 21 పరుగులు చేసిన అతను.. తన వ్యక్తిగత స్కోర్ 1 వద్ద వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. మహ్మదుల్లాకు ముందు తమీమ్ ఇక్బాల్ (243 మ్యాచ్ల్లో 8357 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (256 మ్యాచ్ల్లో 7406), షకీబ్ అల్ హసన్ (240 మ్యాచ్ల్లో 7384 పరుగులు) వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నారు. కెరీర్లో మొత్తంగా 221 వన్డేలు ఆడిన మహ్మదుల్లా 3 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీల సాయంతో 5020 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో అతను 82 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (సెప్టెంబర్ 26) జరుగుతున్న చివరి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 34.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (2/33), ఆడమ్ మిల్నే (4/34), ఫెర్గూసన్ (1/26), రచిన్ రవీంద్ర (1/20), కోల్ మెక్కొంచి (2/18) బంగ్లాదేశ్ను దెబ్బతీశారు. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (76) ఒక్కడే రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా, ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. -
ఔటైనా వెనుక్కి పిలిచారు.. బంగ్లాదేశ్ క్రీడా స్పూర్తి! వీడియో వైరల్
ఢాకా వేదికగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రనౌట్ అయ్యి పెవిలియన్కు వెళ్తున్న కివీస్ బ్యాటర్ను వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు క్రీడా స్పూర్తిని చాటుకుంది. ఏం జరిగిందంటే? ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 167 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో కివీస్ స్పిన్ ఆల్రౌండర్ ఇష్ సోధి జట్టును అదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసేందుకు బంగ్లా పేసర్ హసన్ మహమూద్ సిద్దమయ్యాడు. అయితే తొలి బతి వేసేందుకు సిద్దమైన మహమూద్.. నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోదీని రౌనౌట్(మన్కడింగ్) చేశాడు. సోధి క్రీజు దాటడం గమనించిన మహమూద్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్ను పడగొట్టాడు. వెంటనే రనౌట్కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ కొత్త నిబంధనల ప్రకారం ఔట్గా ప్రకటించాడు. దీంతో నిరాశతో పెవిలియన్ వైపుగా సోధి నడిచాడు. బంగ్లాదేశ్ క్రీడా స్పూర్తి.. సరిగ్గా ఇదే సమయంలో బంగ్లాదేశ్ తమ క్రీడా స్పూర్తిని చాటుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్, సహచర ఆటగాళ్లు అంపైర్లతో చర్చలు జరిపి సోదీని వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే హసన్ మహమూద్ పరిగెత్తుకుంటూ వెళ్లి సోధిని వెనుక్కి పిలిచాడు. మళ్లీ తిరిగి వచ్చిన సోదీ నవ్వుతూ హసన్ మహమూద్ను కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చూసిన అభిమానులు బంగ్లాదేశ్ మంచి మనసుకు పిధా అయిపోయారు. కాగా ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్పై 86 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. చదవండి: Asian Games 2023: సెమీస్లో బంగ్లాదేశ్ చిత్తు.. ఫైనల్కు చేరిన భారత్ #BabarAzam𓃵 Asif Hassan Mahmud mankad Ish Sodhi then made him come back. Umpire gave it out (Rabitholebd Sports) pic.twitter.com/tyDbSr5WPJ — Muhammad Farhan Ali (@imrealfarhanali) September 23, 2023 -
వరుణుడి ఖాతాలో మరో మ్యాచ్
గత రెండు, మూడు వారాల్లో చాలావరకు అంతర్జాతీయ మ్యాచ్లు వర్షాల కారణంగా రద్దైన విషయం విధితమే. వర్షకాలంలో ఇది సాధారణమైన విషయమే అయినప్పటికీ.. పలు కీలక మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. తాజాగా మరో మ్యాచ్ కూడా వరుణుడి ఖాతాలోకి చేరింది. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఢాకా వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు, ప్రారంభమయ్యాక 5వ ఓవర్లో వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడిన న్యూజిలాండ్ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. 5వ ఓవర్ తర్వాత మ్యాచ్ మరో 28 ఓవర్ల పాటు సజావుగా సాగింది. ఇన్నింగ్స్ 34వ ఓవర్ జరుగుతున్న సమయంలో వర్షం మళ్లీ మొదలై ఆటకు ఆటంకం కలిగించింది. అప్పటికి న్యూజిలాండ్ స్కోర్ 33.4 ఓవర్లలో 136/5గా ఉంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టామ్ బ్లండెల్ (8), కోల్ మెక్కొంచీ (8) క్రీజ్లో ఉన్నారు. కివీస్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (58), హెన్రీ నికోల్స్ (44) రాణించగా.. ఫిన్ అలెన్ (9), చాడ్ బోవ్స్ (1), రచిన్ రవీంద్ర (0) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నసుమ్ అహ్మద్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా సెప్టెంబర్ 23న జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం బంగ్లా, న్యూజిలాండ్ జట్లు వరల్డ్కప్లో పాల్గొనేందుకు భారత్కు చేరుకుంటాయి. వర్షం కారణంగా నిన్న, ఇవాళ రద్దైన మ్యాచ్లు.. ఇంగ్లండ్ వర్సెస్ ఐర్లాండ్ తొలి వన్డే ఏషియాన్ గేమ్స్ 2023 మహిళల క్రికెట్లో భారత్, పాక్ మ్యాచ్లు బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే -
10 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కు.. న్యూజిలాండ్ కెప్టెన్గా స్టార్ బౌలర్
బంగ్లాదేశ్తో జరిగే వన్డేసిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు టామ్ లాథమ్, టిమ్ సౌథీ వంటి చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు కివీస్ సెలక్టర్లు విశ్రాంతిని కల్పించారు. ఈ క్రమంలో బంగ్లాతో సిరీస్కు న్యూజిలాండ్ కెప్టెన్గా ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఎంపికయ్యాడు. ఫెర్గూసన్ కివీస్ సారథ్య బాధ్యతలు చేపట్టడం ఇదే తొలి సారి. ఇక ఇదే విషయంపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందిస్తూ.. "లాకీ ఫెర్గూసన్ అంతర్జాతీయ స్ధాయిలో చాలా అనుభవం ఉంది. ఇప్పటివరకు బౌలింగ్ యూనిట్ను ముందుకు నడిపించిన లాకీకి.. ఓవరాల్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. అతడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని నేను భావిస్తున్నా" అని పేర్కొన్నాడు. 10 ఏళ్ల తర్వాత బంగ్లాకు.. కాగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుండడం 10 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారి ఈ పర్యటనలో భాగంగా కివీస్ మూడు వన్డేలు, రెండు టెస్టులు అతిథ్య బంగ్లాదేశ్తో ఆడనుంది. కివీస్ రెండు దఫాలుగా బంగ్లాదేశ్ టూర్కు వెళ్లనుంది. తొలి దశ పర్యటనలో మూడు వన్డేలు న్యూజిలాండ్ ఆడనుంది. సెప్టెంబర్ 21న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం నవంబర్ 28 నుంచి టెస్టు సిరీస్ మొదలు కానుంది. ఇక బంగ్లా టూర్కు దూరమైన డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ ,టిమ్ సౌథీ.. వన్డే ప్రపంచకప్కు అందుబాటులో రానున్నారు. న్యూజిలాండ్ వన్డే జట్టు: లాకీ ఫెర్గూసన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, చాడ్ బోవ్స్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, కైల్ జామీసన్, కోల్ మెక్కాంచీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, రాచిన్ రవీంద్ర, రచిన్ రవీంద్ర, విల్ యంగ్ Lockie Ferguson to lead New Zealand in Bangladesh this month. Several first-choice players have been rested for the series ahead of the World Cup - https://t.co/GI8HKbN36v pic.twitter.com/SBM7GdpAQz — Cricbuzz (@cricbuzz) September 2, 2023 -
NZ Vs Ban: దంచి కొట్టిన ఫిలిప్స్.. బంగ్లా అవుట్! ఫైనల్లో న్యూజిలాండ్తో పాటు..
New Zealand T20I Tri-Series 2022- New Zealand vs Bangladesh, 5th Match: న్యూజిలాండ్- పాకిస్తాన్- బంగ్లాదేశ్ త్రైపాక్షిక టీ20 సిరీస్లో భాగంగా ఆతిథ్య కివీస్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. క్రైస్ట్చర్చ్ వేదికగా బుధవారం (అక్టోబరు 12) జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించింది. 48 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన సౌథీ బృందం.. ఫైనల్లో పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్కప్-2022 సన్నాహకాల్లో భాగంగా అక్టోబరు 7న కివీస్, పాక్, బంగ్లా జట్ల మధ్య ట్రై సిరీస్ ఆరంభమైంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచ్లలో పాకిస్తాన్ రెండింట.. ఆతిథ్య న్యూజిలాండ్ మూడింట గెలుపొంది ఫైనల్కు అర్హత సాధించాయి. ఇక ఈ టూర్లో బంగ్లాదేశ్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తాజాగా కివీస్తో జరిగిన మ్యాచ్లోనూ 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దంచికొట్టిన గ్లెన్ ఫిలిప్స్ క్రైస్ట్చర్చ్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది షకీబ్ అల్ హసన్ బృందం. బంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్లు ఫిన్ అలెన్(32), డెవాన్ కాన్వే(64) అదిరిపోయే ఆరంభం అందించారు. వన్డౌన్లో వచ్చిన మార్టిన్ గప్టిల్ సైతం 34 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 24 బంతుల్లో 2 బౌండరీలు, 5 సిక్స్లు బాది 60 పరుగులు సాధించాడు. 🔊 Well taken in the crowd! Glenn Phillips with back to back sixes in the 16th over. Follow play LIVE in NZ with @sparknzsport & @todayfm_nz 📲 #NZvBAN pic.twitter.com/dSnyIyvUVH — BLACKCAPS (@BLACKCAPS) October 12, 2022 షకీబ్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా ఈ మేరకు బ్యాటర్ల విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 5 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు మెరుగైన ఆరంభం లభించినా.. దానిని నిలబెట్టుకోలేకపోయింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన షకీబ్ అల్ హసన్ 44 బంతుల్లో 70 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నా.. లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలైంది. దీంతో 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమిని మూటగట్టుకుంది బంగ్లాదేశ్. కివీస్ బౌలర్లలో కెప్టెన్ టిమ్ సౌథీకి రెండు, ఆడం మిల్నేకు మూడు, మైఖేల్ బ్రాస్వెల్కు రెండు వికెట్లు దక్కాయి. Full and straight! Adam Milne strikes with his third ball LIVE in NZ on @sparknzsport 🔥 #NZvBAN pic.twitter.com/326Q4EQOuh — BLACKCAPS (@BLACKCAPS) October 12, 2022 ఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్ ఇక అద్భుత ఇన్నింగ్స్తో అదరొట్టిన కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్.. గురువారం పాకిస్తాన్తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. మరోవైపు.. కివీస్, పాకిస్తాన్ శుక్రవారం (అక్టోబరు 14) ఫైనల్లో తలపడనున్నాయి. చదవండి: T20 World Cup 2022: ఫిట్నెస్ టెస్టులో క్లియరెన్స్.. ఆస్ట్రేలియాకు షమీ Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్ పరిస్థితి ఇదీ అంటూ వసీం జాఫర్ ట్రోల్! -
రాణించిన రాస్ టేలర్.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ లెజెండ్స్ సూపర్ విక్టరీ సాధించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా దిగ్గజాలు 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేశారు. వికెట్కీపర్ దిమాన్ ఘోష్ (32 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), అలోక్ కపాలీ (21 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. ఓపెనర్లు నజీముద్దీన్ (0), మెహ్రబ్ హొసేన్ (1) దారుణంగా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో కైల్ మిల్స్ 2 వికెట్లు పడగొట్టగా.. బెన్నెట్కు ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనతంరం 99 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ దిగ్గజ టీమ్.. 9.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ జేమీ హౌ (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. డీన్ బ్రౌన్లీ (19 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ రాస్ టేలర్ (17 బంతుల్లో 30 నాటౌట్; 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. బంగ్లా బౌలర్లలో అబ్దుర్ రజాక్, అలోక్ కపాలీకి తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి (2 మ్యాచ్ల్లో ఓ విజయం) ఎగబాకగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక టేబుల్ టాపర్గా కొనసాగుతుండగా.. ఇండియా లెజెండ్స్, విండీస్ లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్, న్యూజిలాండ్ లెజెండ్స్, ఇంగ్లండ్ లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్ వరుసగా రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇవాళ ఇదే వేదికగా మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్లో విండీస్ లెజెండ్స్ను ఇంగ్లండ్ దిగ్గజ టీమ్ ఢీకొట్టాల్సి ఉంది. -
మెగా ఈవెంట్కు ముందు కావాల్సినంత ప్రాక్టీసు.. పాక్- కివీస్- బంగ్లా సిరీస్!
T20 WC 2022- Pakistan New Zealand Bangladesh Tri Series: టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో ట్రై సిరీస్ ఆడనుంది. ఈ ఏడాది అక్టోబరులో ఈ మేరకు జరిగే సిరీస్కు న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ వేదిక కానుంది. కాగా విధంగా గతేడాది న్యూజిలాండ్ జట్టు అర్ధంతరంగా పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబరులో అక్కడికి వెళ్లేందుకు కివీస్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అక్టోబరు 16న టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఇందుకు సుమారు వారం రోజుల ముందు జరుగనున్న ఈ ట్రై సిరీస్తో పాక్, కివీస్, బంగ్లా జట్లకు కావాల్సినంత ప్రాక్టీసు దొరకనుంది. ఇక అక్టోబరు 8న న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన కనబరిచాయి. అయితే, సెమీస్లో పాక్ ఆస్ట్రేలియా చేతిలో ఓడగా.. ఫైనల్లో అదే ఆసీస్ జట్టు చేతిలో పరాజయం పాలై న్యూజిలాండ్ రన్నరప్గా నిలిచింది. పాకిస్తాన్- న్యూజిలాండ్- బంగ్లాదేశ్: ట్రై సిరీస్ షెడ్యూల్-హాగ్లే ఓవల్ మైదానం, క్రైస్ట్చర్చ్ ►అక్టోబరు 8: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 9: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ►అక్టోబరు 10: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ►అక్టోబరు 11: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 12: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ►అక్టోబరు 13: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 14: ఫైనల్ చదవండి: నాన్న రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: రోహిత్ శర్మ కుమార్తె -
NZ W Vs Ban W: బంగ్లాదేశ్పై న్యూజిలాండ్ అద్భుత విజయం.. ఏకంగా..
ICC Women World Cup 2022 Nz Vs Ban: ఐసీసీ మహిళా వరల్డ్కప్-2022 టోర్నీలో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. బంగ్లాదేశ్ మహిళా జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్లోని యూనివర్సిటీ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 27 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్లు షమీమా సుల్తానా(33 పరుగులు) ఫర్జానా హక్(52 పరుగులు) మినహా మిగతా వాళ్లంతా అత్యల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ మహిళా జట్టు ఒక వికెట్ కోల్పోయి 20 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. సుజీ బేట్స్ అద్భుత హాఫ్ సెంచరీ(79 పరుగులు- 8 ఫోర్లు)తో అజేయంగా నిలిచి వైట్ ఫెర్న్స్' విజయంలో కీలక పాత్ర పోషించింది. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. ఇక ఓపెనర్, కెప్టెన్ సోఫీ డివైన్ 14 పరుగులు చేయగా.. మరో బ్యాటర్ అమీలియా కెర్ 47 పరుగులు(నాటౌట్) సాధించింది. ఐసీసీ మహిళా వరల్డ్కప్-2022 న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు: బంగ్లాదేశ్- 140/8 (27) న్యూజిలాండ్- 144/1 (20) 9 వికెట్ల తేడాతో వైట్ ఫెర్న్స్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సుజీ బేట్స్ చదవండి: Ind W Vs Pak W: పాక్ కెప్టెన్ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు.. ఈ ఫొటో ఎంత అందంగా ఉందో! వైరల్ -
NZ Vs Ban 2nd Test: భారీ విజయం.. కివీస్ ఆటగాడికి ఊహించని షాక్
NZ Vs Ban 2nd test: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైలీ జెమీషన్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) భారీ షాకిచ్చింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. క్రైస్ట్చర్చ్లో బంగ్లాదేశ్తో రెండో టెస్టు సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఈ మేరకు జరిమానా విధించింది. అంతేగాక డిసిప్లనరీ రికార్డులో డిమెరిట్ పాయింట్ను చేర్చింది. అసలేం జరిగిందంటే... రెండో టెస్టులో భాగంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో జెమీషన్ 41వ ఓవర్ వేశాడు. ఈ క్రమంలో బంగ్లా ఆటగాడు యాసిర్ అలీని అవుట్ చేసిన తర్వాత అభ్యంతరకర పదజాలం వాడాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ ప్రవర్తనా నియమాళిలోని ఆర్టికల్ 2.5ని అనుసరించి చర్యలు చేపట్టింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టింది. కాగా అంతర్జాతీయ మ్యాచ్లో ఒక బ్యాటర్ను అవుట్ చేసిన తర్వాత వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే అత్యధికంగా 50 శాతం కోత విధించే అవకాశం ఉంటుంది. ఇక జెమీషన్ గతేడాది మార్చిలో బంగ్లాతో వన్డే మ్యాచ్ సందర్భంగా... 2020లో పాకిస్తాన్తో మ్యాచ్ సమయంలో ఇలాగే వ్యవహరించి చిక్కులు కొనితెచ్చుకున్నాడు. ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ బంగ్లాదేశ్పై ఇన్నింగ్స్ మీద 117 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో జెమీషన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022 Title Sponsor: ఇకపై వివో ఐపీఎల్ కాదు.. టాటా ఐపీఎల్ What a way to finish the Test! @RossLTaylor takes his THIRD Test wicket to finish the Test inside 3 days at Hagley Oval. We finish the series 1-1 with @BCBtigers. #NZvBAN pic.twitter.com/2GaL0Ayapr — BLACKCAPS (@BLACKCAPS) January 11, 2022 -
NZ Vs BAN: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు
Edabot Hossain: క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ ఆటగాడు ఎబాదత్ హొసేన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. గత 10 ఇన్నింగ్స్ల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా పరుగుల ఖాతా తెరవని తొలి అంతర్జాతీయ క్రికెటర్ రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ మార్టిన్, శ్రీలంక ఆటగాడు లహీరు కుమార వరుసగా 9 ఇన్నింగ్స్ల్లో సున్నా పరుగులకే పరిమితం కాగా, తాజాగా వారి రికార్డును హొసేన్ తిరగరాశాడు. గత 10 ఇన్నింగ్స్ల్లో 7 సార్లు ఖాతా తెరవకుండా నాటౌట్గా నిలిచిన హోసేన్.. 3 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ రికార్డుతో పాటు హొసేన్ మరో అవమానకర రికార్డును సైతం సొంత చేసుకున్నాడు. టెస్ట్ల్లో 16 ఇన్నింగ్స్ల తర్వాత అతి తక్కువ పరుగులు చేసిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్లు ఆడిన హొసేన్.. 16 ఇన్నింగ్స్ల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. 2019లో భారత్తో జరిగిన కోల్కతా టెస్ట్లో చేసిన 2 పరుగులే అతనికి అత్యధికం. ఈ జాబితాలో హొసేన్ తర్వాత జింబాబ్వే మాజీ ఆటగాడు పోమీ బాంగ్వా (16 ఇన్నింగ్స్ల తర్వాత 16 పరుగులు), టీమిండియా పేసర్ బుమ్రా (16 ఇన్నింగ్స్ల తర్వాత 18 పరుగులు) ఉన్నారు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్టులో బంగ్లా పేసర్ ఎబాదత్ హొసేన్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఆరు, రెండో ఇన్నింగ్స్లో ఓ వికెట్ పడగొట్టి కివీస్పై సంచలన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లో టామ్ లాథమ్(252), డెవాన్ కాన్వే(109) చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 521/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ట్రెంట్ బౌల్ట్(5/43), సౌథీ(3/28), జేమీసన్(2/32)ల ధాటికి 126 పరుగులకే కుప్పకూలింది. చదవండి: ఎక్కడ మొదలెట్టానో అక్కడే ఉన్నాను.. టీమిండియా పేసర్ ఆసక్తికర ట్వీట్ -
WTC 2021 23: టాప్-5లోకి బంగ్లాదేశ్... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే!
WTC 2021-23 Updated Points Table: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా కివీస్ గడ్డ మీద అన్ని ఫార్మాట్లలోనూ తొలి మ్యాచ్ గెలిచిన ఘనత సాధించింది. 8 వికెట్ల తేడాతో మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్ విజేతను మట్టికరిపించి సత్తా చాటింది. దీంతో బంగ్లాదేశ్ ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. కాగా డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో భాగంగా స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్ వైట్వాష్కు గురైన సంగతి తెలిసిందే. అయితే, కొత్త సంవత్సరంలో న్యూజిలాండ్ పర్యటనకు వచ్చిన మొమినల్ బృందానికి ఈ మేరకు చారిత్రక విజయం లభించడంతో టాప్-5లో చోటు దక్కించుకుంది. ఇక యాషెస్ సిరీస్ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా 36 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఈ సీజన్లో ఇంతవరకు అపజయం చవిచూడని శ్రీలంక 24 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ 36, భారత్ 53 పాయింట్లతో తర్వాతి స్థానాలు ఆక్రమించాయి. ఇంగ్లండ్తో, స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లలో భాగంగా రెండింటిని డ్రా చేసుకోవడం సహా ఒక మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్లో చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో నాల్గవ గెలుపు నమోదు చేసింది. చదవండి: Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు! Bangladesh Team dressing room celebrations following the historic win at Mount Maunganui.#BCB #cricket #BANvsNZ pic.twitter.com/78pGFQ30wP — Bangladesh Cricket (@BCBtigers) January 5, 2022 -
‘మేము అధిగమించాం’.. డ్రెస్సింగ్రూంలో బంగ్లా జట్టు సంబరాలు.. వైరల్
Bangladesh Celebration In Dressing Room Video Viral: జనవరి 5.. 2022.. బంగ్లాదేశ్ టెస్టు చరిత్రలో ఇదొక మరుపురాని రోజు. న్యూజిలాండ్ను న్యూజిలాండ్లోనే ఓడించి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి టెస్టులో విజయం సాధించి కివీస్ గడ్డ మీద మూడు ఫార్మాట్లలోనూ ఒక్కసారి కూడా గెలవలేదన్న అపఖ్యాతిని చెరిపేసుకుంది. అంతేకాదు దాదాపు 11 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మౌంట్ మంగనూయిలో జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మొమినల్ హక్ సారథ్యంలోని జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. డ్రెస్సింగ్ రూంలో విజయాన్ని ఆస్వాదిస్తూ.. ‘‘ఏదో ఒకరోజు మేము అధిగమించి తీరతాం’’ అన్న అర్థంతో కూడిన పాటను పాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను బంగ్లాదేశ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా కివీస్తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇబాదత్ హొసేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు! Bangladesh Team dressing room celebrations following the historic win at Mount Maunganui.#BCB #cricket #BANvsNZ pic.twitter.com/78pGFQ30wP — Bangladesh Cricket (@BCBtigers) January 5, 2022 -
Nz Vs Ban: టెస్టు చాంపియన్ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు
Nz Vs Ban 1st Test: Bangladesh Historic Win Records: గతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది. కివీస్ గడ్డపై తమ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసి సగర్వంగా రెండు మ్యాచ్ల సిరీస్ను ఆరంభించింది. ఈ విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినల్ హక్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇది సమష్టి విజయం. జట్టులోని ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించారు. నిజానికి ఈ విజయానికి కారణం మా బౌలర్లే. మ్యాచ్ ఆసాంతం అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇబాదత్ నిజంగా అద్భుతమే చేశాడు. గత రెండు టెస్టు మ్యాచ్లలో మా ప్రదర్శన బాగా లేదు. కానీ ఇక్కడ మంచి ఆరంభం లభించింది. అయితే, ఈ గెలుపును ఇక్కడితో మర్చిపోయి.. క్రైస్ట్చర్చ్ టెస్టులో మరింత ఉత్తమంగా రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్తో తొలి టెస్టులో విజయంతో బంగ్లా సాధించిన రికార్డులు: ►కివీస్ గడ్డపై బంగ్లాదేశ్కు ఇదే తొలి టెస్టు విజయం. 16 ఓటముల తర్వాత ఈ గెలుపు బంగ్లా సొంతమైంది. ►అన్ని ఫార్మాట్లలోనూ ఇదే మొట్టమొదటి గెలుపు. 2001 నుంచి ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లు కలిపి 32 మ్యాచ్లు ఆడిన బంగ్లాను అన్నింటిలోనే పరాజయమే వెక్కిరించింది. తాజా విజయంతో గెలుపులేదనే లోటు తీరిపోయింది. ►అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్ కివీస్ను ఓడించడం ద్వారా విదేశీ గడ్డ మీద మేటి జట్టు(టాప్-5)ను మట్టికరిపించడం కూడా బంగ్లాకు ఇదే తొలిసారి. ►2011 జనవరి (హామిల్టన్లో పాకిస్తాన్ విజయం) తర్వాత న్యూజిలాండ్లో ఆ జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా మొమినల్ బృందం నిలిచింది. చదవండి: Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు! Congratulations @BCBtigers. Well played on all fronts. #NZvBAN pic.twitter.com/EYCU1CpQWV — BLACKCAPS (@BLACKCAPS) January 5, 2022 -
బంగ్లాదేశ్ సంచలనం.. న్యూజిలాండ్పై ఘన విజయం.. సరికొత్త చరిత్ర
Bangladesh Beat New Zealand By 8 Wickets In 1st Test: మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో సొంత గడ్డపై ఆతిథ్య కివీస్ను మట్టి కరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్ను ఓడించి కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. కాగా కివీస్ గడ్డపై బంగ్లాకు ఏ ఫార్మాట్లోనైనా ఇదే తొలి విజయం కావడం గమనార్హం. మొమినల్ హక్ సారథ్యంలోని జట్టు బంగ్లాకు ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఈ రికార్డును సాధించింది. దీంతో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. వైవిధ్యమైన పేస్ బౌలింగ్తో న్యూజిలాండ్ వెన్ను విరిచిన ఇబాదత్ హొస్సేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఏడు వికెట్లతో మెరిసి అవార్డు అందుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్ల విజృంభణతో 169 పరుగులకే చాపచుట్టేసింది. పర్యాటక బంగ్లా 458 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించగా... రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్కు అవకాశమే కనిపించని సందర్భాల్లో.. Rassie van der Dussen Dismissal: శార్దూల్ బౌలింగ్లో ప్రొటిస్ ఆటగాడు అవుట్.. వివాదం! Bangladesh have made cricket history with their first Test win over the @BLACKCAPS Always great to see our lads in action on home soil, don’t miss Test 2 starting 9 Jan on Spark Sport#SparkSport #NZvBAN pic.twitter.com/5qv4GmxGN3 — Spark Sport (@sparknzsport) January 5, 2022 Congratulations @BCBtigers. Well played on all fronts. #NZvBAN pic.twitter.com/EYCU1CpQWV — BLACKCAPS (@BLACKCAPS) January 5, 2022 -
Nz Vs Ban 1st Test: అత్యంత చెత్త రివ్యూ ఇదే... అనవసరంగా..
Nz Vs Ban 1st Test: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు కూడా మెరుగ్గా రాణించింది ఆతిథ్య బంగ్లాదేశ్. అంతకు ముందు బ్యాటర్ల విజృంభణతో 458 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన బంగ్లా... కివీస్ రెండో ఇన్నింగ్స్లో భాగంగా 5 వికెట్లు కూల్చింది. కానీ, క్యాచ్లు డ్రాప్ చేయడం, రనౌట్లు మిస్ చేయడం వంటి తప్పిదాల కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ముఖ్యంగా 37వ ఓవర్లో టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో ఆఖరి నిమిషంలో రివ్యూ కోరి వేస్ట్ చేసుకుంది. టస్కిన్ వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడేందుకు రాస్ టేలర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో టేలర్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు భావించిన బంగ్లా కెప్టెన్ మొమినల్ అప్పీలు చేయగా నెగటివ్ ఫలితం వచ్చింది. దీంతో అతడు రివ్యూకు వెళ్లగా అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. బ్యాటర్ను నాటౌట్గా ప్రకటించారు. అంతేగాక బంగ్లాకున్న రివ్యూ అవకాశాలు అన్నీ ఊడ్చుకుపోయాయి. కాగా బంతి రాస్ టేలర్ బ్యాట్ను తాకినట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ మొమినల్ రివ్యూకు వెళ్లడాన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇప్పటి వరకు చూసిన అత్యంత చెత్త రివ్యూ ఇదే’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్ WORST REVIEW EVER??! Bangladesh lost their last remaining review when THIS was given 'not out' for LBW! FOLLOW #NZvBAN LIVE: 👉 https://t.co/vIAFgN1IK7 👈 pic.twitter.com/f8CmxEKkpk — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) January 4, 2022 -
న్యూజిలాండ్పై చెలరేగిన బంగ్లాదేశ్ బ్యాటర్లు.. బౌలర్లకు చుక్కలే
మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడుతోంది ఈ మ్యాచ్లో భాగంగా మూడో రోజుకూడా బంగ్లాదేశ్ పూర్తి అధిపత్యం చలాయించింది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మోమినుల్ హక్(88), వికెట్ కీపర్ లిటన్ దాస్(86) పరుగులతో రాణించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 73 పరుగులు అధిక్యంలోఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్ మూడేసి వికెట్లు తీశారు. ఇక న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్గా కేఎల్ రాహుల్.. ఇది ప్రతి ఆటగాడి కల! -
క్రికెట్ అభిమానులకు అమెజాన్ ప్రైమ్ శుభవార్త..
Live Cricket Streaming On Amazon Prime: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్.. కొత్తగా క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్లోకి అడుగు పెట్టింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నూతన సంవత్సరం(2022) తొలి రోజు ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ను లైవ్లో ప్రసారం చేయడం ద్వారా సరికొత్త రంగంలోకి అరంగేట్రం చేసింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట లైవ్ స్ట్రీమ్ కావడంతో క్రికెట్ అభిమానులు ఈ ఓటీటీ ప్లాట్ఫాం ద్వారా క్రికెట్ను వీక్షించారు. అమెజాన్ ప్రైమ్.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో ఒప్పదం కుదుర్చుకుని, స్వదేశంలో జరిగే అన్ని అంతర్జాతీయ వన్డేలు, టీ20లు, టెస్ట్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కాగా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఇదివరకే క్రికెట్ మ్యాచ్లను లైవ్లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. చదవండి: కాన్వే అద్భుత శతకం.. తొలి రోజు ఆటలో న్యూజిలాండ్దే పైచేయి -
కాన్వే అద్భుత శతకం.. తొలి రోజు ఆటలో న్యూజిలాండ్దే పైచేయి
బే ఓవల్: నూతన సంవత్సరం(2022) తొలి రోజున ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్లో డెవాన్ కాన్వే(227 బంతుల్లో 122; 16 ఫోర్లు, సిక్స్) అద్భుత శతకంతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో ఆతిధ్య న్యూజిలాండ్దే పైచేయిగా నిలిచింది. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో పర్యాటక బంగ్లా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌలర్ షోరిఫుల్ ఇస్లాం కివీస్ను ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ టామ్ లాథమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి షోరిఫుల్ బౌలింగ్లో ఔట్ కావడంతో న్యూజిలాండ్ ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. Devon Conway! A single to go to a 100 in his first Test in New Zealand. A special way to start 2022. Follow play LIVE with @sparknzsport. #NZvBAN pic.twitter.com/BHVNhjgmLE — BLACKCAPS (@BLACKCAPS) January 1, 2022 వన్ డౌన్లో బ్యాటింగ్కు దిగిన కాన్వే.. మరో ఓపెనర్ విల్ యంగ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరు రెండో వికెట్కు 138 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోర్ 139 పరుగుల వద్ద ఉండగా విల్ యంగ్(52) రనౌట్ కావడంతో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన రాస్ టేలర్(31), టామ్ బ్లండెల్(11) నామమాత్రపు స్కోర్లు చేసి ఔట్ కాగా, కాన్వే శతక్కొట్టిన అనంతరం వెనుదిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ 2, ఎబాదత్ హుసేన్, మొమినుల్ హాక్ తలో వికెట్ పడగొట్టగా.. విల్ యంగ్ రనౌటయ్యాడు. కాగా, గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో గాయపడి కాన్వే.. 7 వారాల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. అనంతరం గాయం నుంచి కోలుకుని ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీ బాదాడు. చదవండి: గాయం నుంచి తిరిగొచ్చాడు.. 2022లో తొలి సెంచరీ బాదాడు -
అందుకే టెస్టు సిరీస్కు దూరం.. 3 ఫార్మాట్లు ఆడటం కష్టం.. త్వరలోనే గుడ్బై!
Shakib Al Hasan Comments: ‘‘ఏ ఫార్మాట్ ఆడటం ముఖ్యమైనదో... దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నాకు తెలుసు. టెస్టు క్రికెట్ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. టెస్టులు ఆడతానో లేదో తెలియదు. ఒకవేళ ఆడినా.. ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు. వన్డేల్లో భాగం అవ్వాలో లేదో కూడా నిర్ణయించుకోవాలి. వేరే ఆప్షన్ లేదు కాబట్టి వన్డేలు ఆడాల్సిందే’’అని బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. త్వరలోనే టెస్టులకు గుడ్బై చెప్పనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. కాగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో వ్యక్తిగత కారణాల వల్ల టీమ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు షకీబ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో జట్టుకు దూరం కావడం వివాదానికి దారి తీసినా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం అతడికి సెలవులు మంజూరు చేసింది. ఈ క్రమంలో స్థానిక టీవీ చానెల్ల్తో మాట్లాడిన షకీబ్ టెస్టులకు ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. ఏదో ఒక ఫార్మాట్ను ఎంచుకోవాల్సి వస్తే మాత్రం వన్డేల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ‘‘నేను ఇప్పటికిప్పుడు టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలుకుతానని చెప్పడం లేదు. టీ20 వరల్డ్కప్-2022 తర్వాత పొట్టి ఫార్మాట్లో కూడా ఆడకపోవచ్చు. టెస్టులు, వన్డేలు ఆడతాను. అయితే.. మూడు ఫార్మాట్లు ఆడటం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమే. రెండు టెస్టులకోసం నెలలపాటు కష్టపడటంలో అర్థం లేదనిపిస్తోంది. బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత సరైన ప్రణాళికతోనే ముందుకు వెళ్తాను. స్మార్ట్గా ఆలోచించాలి కదా. జనవరిలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాను’’ అని షకీబ్ చెప్పుకొచ్చాడు. అదే విధంగా బయో బబుల్ జీవితం జైలులా ఉందన్న ఈ ఆల్రౌండర్... ‘‘నచ్చిన చోటుకు వెళ్లకుండా ఒకే చోట ఉండటం మనసుకు కష్టంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్ జట్టు చూడండి ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచించిందో... కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాళ్ల అండర్-19 జట్టును ప్రపంచకప్ టోర్నీకే పంపలేదు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇలా కుటుంబాలకు దూరంగా ఉంటూ... ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉండటం కష్టంగా ఉంటుంది. వారి పెంపకంపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్నాళ్ల పాటు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నా’’ అని షకీబ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్కు దూరమైనట్లు వెల్లడించాడు. చదవండి: IND vs SA: 'మనోళ్లనే ముప్పతిప్పలు పెట్టాడు.. ఆ బౌలర్కు అవకాశమిస్తే' -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. కివీస్పై తొలిసారి..
ఢాకా: న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఆతిధ్య బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా జరిగిన నాలుగో టీ20లో పర్యాటక జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లా జట్టు.. తొట్ట తొలిసారిగా న్యూజిలాండ్పై టీ20 సిరీస్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. బంగ్లా బౌలర్లు నసుమ్ అహ్మద్(4/10), ముస్తాఫిజుర్(4/12) ధాటికి 19.3 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. విల్ యంగ్(48 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ లాథమ్(26 బంతుల్లో 21; ఫోర్) రెండంకెల స్కోర్ చేయడంతో కివీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా సైతం ఆరంభంలో తడబడినప్పటికీ.. కెప్టెన్ మహ్మదుల్లా(48 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చివరి దాకా క్రీజ్లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి ఓపెనర్ మహ్మద్ నయిమ్(35 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) సహకారం అందించడంతో బంగ్లా జట్టు 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ 2, కోల్ మెక్ కొన్చి ఓ వికెట్ పడగొట్టారు. కెరీర్ బెస్ట్ గణాంకాలతో న్యూజిలాండ్ నడ్డి విరిచిన నసుమ్ అహ్మద్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్ల్లో బంగ్లా జట్టు గెలుపొందగా.. మూడో టీ20ని న్యూజిలాండ్ నెగ్గింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి మ్యాచ్ శుక్రవారం(సెప్టెంబర్ 10) ఇదే వేదికగా జరుగనుంది. చదవండి: ఆ క్రికెట్ దిగ్గజం సలహాలు నా ఆటతీరుని మెరుగుపర్చాయి.. -
ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం..
అక్లాండ్: మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం బంగ్లాదేశ్తో జరిగిన ఆఖరి టీ20లో న్యూజిలాండ్ యువ క్రికెటర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్లో మూడో టీ20 ఆడుతున్న అలెన్.. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలెన్(29 బంతుల్లో 71; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసంతో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు చేసి, 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఫిన్ అలెన్.. ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో అలెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ చూసిన ఆర్సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జోష్ ఫిలిప్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో ఫిన్ అలెన్ను ఆర్సీబీ కనీస ధరకు(రూ.20 లక్షలు) దక్కించుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ను 10 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఫిన్ అలెన్కు అండగా మార్టిన్ గప్తిల్(19 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్లతో 44) చెలరేగి ఆడాడు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన బంగ్లా జట్టు.. 9.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో మహమ్మద్ నైమ్(19), సౌమ్య సర్కార్( 10), మోసెద్దెక్ హుసేన్(13) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టాడ్ ఆస్టల్ 4, సౌథీ 3 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉండగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను సైతం న్యూజిలాండ్ 3-0తో వైట్వాష్ చేసింది. చదవండి: ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్.. -
డక్వర్త్ కన్ఫ్యూజన్: కివీస్, బంగ్లా రెండో టీ20లో హైడ్రామా
నేపియర్: క్రికెట్ ప్రేమికులు అంపైర్స్ కాల్ కన్ఫ్యూజన్ నుంచి తేరుకోక ముందే మరో అర్ధం కాని సమస్య తెరముందుకొచ్చింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో డక్వర్త్ లూయిస్ పద్దతి, సరికొత్త కన్ఫ్యూజన్కు దారి తీసింది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడుతున్న బంగ్లా జట్టు డక్వర్త్ లూయిస్ పద్దతిపై సరైన అవగాహన లేక, తప్పుడు టార్గెట్ను నిర్ధేశించుకొని బరిలోకి దిగింది. ఆతరువాత మ్యాచ్ రిఫరీ సైతం సరికొత్త రూల్స్ విషయంలో తికమకపడి లక్ష్యాన్ని రెండోసార్లు మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం కన్ఫ్యూజన్కు మారిన ఐసీసీ రూల్సే కారణమని అంటున్నారు విశ్లేషకులు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20కి వర్షం అడ్డుపడింది. ఆ సమయానికి న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 173 పరుగులు చేసింది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్కు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని విధించారు. అయితే మారిన డక్వర్త్ లూయిస్ పద్ధతిపై సరైన అవగాహన లేని బంగ్లా జట్టు, తాము ఛేజ్ చేయాల్సింది 16 ఓవర్లలో 148 పరుగులు అని భావించి బరిలోకి దిగింది. ఈ క్రమంలో 1.3 ఓవర్ల తర్వాత గంధరగోళానికి లోనై మ్యాచ్ రిఫరీని సంప్రదించగా, ఆయన మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు. 10 నిమిషాల చర్చల అనంతరం తిరిగి ప్రారంభంమైన మ్యాచ్లో తొలుత బంగ్లాకు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన మ్యాచ్ రిఫరీ.. ఆతరువాత దాన్ని 16 ఓవర్లలో 171 పరుగులుగా మార్చాడు. దీంతో మ్యాచ్ మధ్యలో పెద్ద హైడ్రామానే నెలకొంది. డక్వర్త్ లూయిస్ కొత్త రూల్స్ విషయంలో బంగ్లా జట్టు కన్ఫ్యూజ్ అయ్యిందంటే ఒక అర్ధముంది, ఏకంగా మ్యాచ్ రిఫరీనే కన్ఫ్యూజ్ అయ్యాడంటే రూల్స్ ఎంత తికమక పెడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చంటున్నారు క్రికెట్ అభిమానులు. కాగా, 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా జట్టు 16 ఓవర్లలో 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ను ఆతిధ్య జట్టు 2-0తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: హార్ధిక్ తన బ్యాటింగ్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకున్నాడు.. -
వావ్.. వాట్ ఎ స్టన్నింగ్ క్యాచ్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. కళ్లు చెదిరే విన్యాసం చేస్తూ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. సూపర్ మ్యాన్లా ఒంటి చేత్తో బంతిని అందుకొని వావ్ అనిపించాడు. అతని ఫీల్డింగ్ విన్యాసానికి అభిమానులు ముగ్దులైపోయారు. ప్రస్తుతం ఆ స్టన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. బౌల్ట్ పట్టిన ఈ క్యాచ్ను ట్రెండ్ సెట్టింగ్ క్యాచ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఆఖరి బంతిని బౌలర్ మ్యాట్ హెన్రీ ఔట్ ఆఫ్ ది హాఫ్ స్టంప్ దిశగా సంధించగా.. బంగ్లా బ్యాట్స్మన్ లిటన్ దాస్ పుల్ షాట్ ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో సూపర్ క్యాచ్ను అందుకున్నాడు. The Boult Special. 😳😳#NZvBAN pic.twitter.com/MQuORWNfhP — CricTracker (@Cricketracker) March 26, 2021 కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. డెవాన్ కాన్వే(110 బంతుల్లో 126; 17 ఫోర్లు), డారిల్ మిచెల్(92 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగటంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బంగ్లా జట్టును మ్యాట్ హెన్రీ(4/27), జేమ్స్ నీషమ్(5/27) దారుణంగా దెబ్బతీయడంతో ఆతిధ్య జట్టు 164 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను కివీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. -
ప్రపంచకప్-2019: బంగ్లాపై కివీస్ విజయం
సాక్షి స్పోర్ట్స్: ప్రపంచకప్-2019లో భాగంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా విసిరిన 244 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. న్యూజిలాండ్ బ్యాట్స్మన్లలో రాస్ టేలర్(80) టాప్ స్కోరర్గా నిలిచాడు. కేన్ విలియమ్సన్(40) ఫర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో మిరాజ్, షకీబ్, సైఫుద్దీన్, మోసడాక్ హుస్సేలకు తలా రెండు వికెట్లు దక్కాయి. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్కు సరైన ఆరంభం లభించలేదు. షకీబుల్ హాసన్(64) ఒక్కడే ఫర్వాలేదనించాడు. మిగతా వారంతా 30 లోపే పరుగులు సాధించారు. తలా ఓచేయి వేయడంతో 49.2 ఓవర్లలో 244 పరుగుల స్కోరు చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీకి 4 వికెట్లు, బౌల్ట్కు రెండు, ఫెర్గూసన్, గ్రాండ్హోమ్, శాంటర్కు తలా ఓ వికెట్ దక్కింది. గెలుపులో కీలక పాత్ర పోషించిన రాస్ టేలర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
బంగ్లాతో మ్యాచ్: కివీస్ లక్ష్యం 245
లండన్ : తొలి మ్యాచ్లో బలమైన దక్షిణాఫ్రికాపై గెలిచి ఊపుమీదున్న బంగ్లాదేశ్.. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో మాత్రం తడబడింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భాగంగా బుధవారం కివీస్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లా 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు షకీబుల్ హసన్(64) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్లు తలో రెండు వికెట్లు తీయగా, ఫెర్గుసన్, సాంట్నర్, గ్రాండ్హోమ్లు తలో వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాకు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్లు మంచి శుభారంభాన్నే అందించారు. అయితే భారీ స్కోర్ మలచడంలో విఫలమయ్యారు. సౌమ్య సర్కార్(25)ను హెన్రీ ఔట్ చేయడంతో బంగ్లా వికెట్ల పతనం ప్రారంభమైంది. అనంతరం మరో ఓపెనర్ తమీమ్(24) కూడా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన గత మ్యాచ్ హీరో రహీమ్(19) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నా షకీబ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో అర్దసెంచరీ పూర్తి చేసిన అనంతరం షకీబ్ కూడా వెనుదిరిగాడు. మిథున్(26), మహ్మదుల్లా(20), సైఫుధ్దీన్(29)లు భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యారు. దీంతో 49.2 ఓవర్లలో 244 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌటైంది. -
బంగ్లా మరో పంచ్ ఇచ్చేనా?
లండన్: ఈ వన్డే వరల్డ్కప్లో దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టును ఓడించిన బంగ్లాదేశ్.. న్యూజిలాండ్తో మ్యాచ్కు సన్నద్ధమైంది. మరో పంచ్ ఇవ్వాలని భావిస్తోంది. ఇక తానాడిన తొలి మ్యాచ్లో శ్రీలంకను చిత్తు చేసిన కివీస్ కూడా మరో విజయం కోసం తపిస్తోంది. తాజా మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటివరకూ కివీస్-బంగ్లాదేశ్లు 35 వన్డేలు ఆడగా న్యూజిలాండ్ 24 మ్యాచ్ల్లో గెలవగా, 10 మ్యాచ్ల్లో బంగ్లా గెలిచింది. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. ఇక ప్రపంచకప్లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్లు ఆడాయి. ఈ నాలుగు మ్యాచ్ల్లో కివీస్నే విజయం వరించింది. ఇది బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్కు 200 మ్యాచ్. బంగ్లాదేశ్ తరఫున 200 మ్యాచ్లు పూర్తి చేసుకోనున్న మూడో క్రికెటర్గా షకీబ్ గుర్తింపు పొందుతాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మొర్తజా (208 మ్యాచ్లు), ముష్ఫికర్ రహీమ్ (206 మ్యాచ్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. తుది జట్లు బంగ్లాదేశ్ మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబుల్ హసన్, ముష్పికర్ రహీమ్, మహ్మద్ మిథున్, మహ్మదుల్లా, మొసదెక్ హుస్సేన్, మెహిది హసన్, మహ్మద్ సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ రహ్మాన్ న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, కోలిన్ మున్రో, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, గ్రాండ్హోమ్, మిచెల్ సాంత్నార్, మ్యాట్ హెన్నీ, ఫెర్గ్యుసన్, ట్రెంట్ బౌల్ట్