padma devendar reddy
-
మెదక్లో గెలుపొంది.. ఉన్నత పదవుల్లోకి..!
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా ఎంతో మందికి మంచి పదవులను అందించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. ప్రముఖులుగా చరిత్రలో లిఖించింది. గతంలో ఇక్కడి నుంచి పోటీచేసి గెలిచిన నాయకులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతి లాంటి ఉన్నతమైన పదవులు అలంకరించారు. అలా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న వారంతా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోను మెదక్ జిల్లాకు ఆ విధమైన ప్రత్యేక ఏర్పడింది. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీచేసి విజయం సాధించి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. పద్మాదేవేందర్రెడ్డి.. పద్మాదేవేందర్రెడ్డి 2001లో టీఆర్ఎస్ అవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2001లో రామాయంపేట జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం స్వరాష్ట్రం కోసం 2008లో కేసీఆర్ పిలుపు మేరకు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీచేయగా ఓడిపోయారు. ఆ తరువాత 2009లో టికెట్ దక్కక పోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 2014లో మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొంది తెలంగాణలో తొలి ఉప సభాపతిగా పనిచేసి చరిత్రలో నిలిచారు. అనంతరం 2018లో సైతం ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ 1980లో లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ(కాంగ్రెస్) నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదివిని అలంకరించారు. అప్పట్లో ఇందిరాగాంధీకి 3,01,577 ఓట్లు రాగా తన ప్రత్యర్థి జనతాపార్టీకి చెందిన జైపాల్రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ 2,19,124 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ముఖ్యమంత్రిగా అంజయ్య.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెదక్ జిల్లా రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన టి.అంజయ్య 1980 అక్టోబర్ నుంచి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో చెన్నారెడ్డి సీఎంగా కొనసాగుతున్న సందర్భంగా ఆయనను మార్చి అంజయ్యకు సీఎంగా అవకాశం కల్పించారు. ఆయన అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తుండగా దానికి రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎంపిక కాకుండానే సీఎం పదవి చేపట్టారు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఏదో ఒక చోటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలి. ఈ నేపథ్యంలో అప్పటికే రామాయంపేట ఎమ్మెల్యేగా ముత్యంరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా టి.అంజయ్య కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామాయంపేట స్థానానికి ఎన్నికలు నిర్వహించగా ప్రతిపక్షాలు సైతం నామినేషన్ వేయక పోవడంతో టి.అంజయ్య ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం పదవిని అలంకరించి 16 నెలల పాటు కొనసాగారు. ఉప ముఖ్యమంత్రిగా జగన్నాథరావు మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యే గెలుపొందిన సీహెచ్ జగన్నాథరావు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 24 నుంచి సెప్టెంబర్ 20 వరకు సుమారు ఏడు నెలల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవి కూడా చదవండి: ఐదేళ్లు మీకోసం రక్తం ధారపోస్తా..! : మంత్రి గంగుల కమలాకర్ -
TS Election 2023: 'పద్మా నా బిడ్డ' : సీఎం కేసీఆర్
మెదక్: అభివృద్ధిలో మెదక్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. పట్టణం చుట్టూ రింగ్రోడ్డు నిర్మిస్తాం.. రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా మారుస్తాం.. కౌడిపల్లి, రామాయంపేటలో డిగ్రీకళాశాలు ఏర్పాటు చేస్తాం.. టూరిజం అభివృద్ధికి రూ.100 కోట్లతో పాటు పలు వరాలు కురిపించారు సీఎం కేసీఆర్. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రగతి శంఖారావం సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ, ఎస్పీ, సమీకృత కలెక్టరేట్ భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మెదక్ పట్టణం చుట్టూ రింగ్రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను తీరుస్తామన్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తానని, కౌడిపల్లికి, రామాయంపేటకు డిగ్రీకళాశాలలను మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టు, మెదక్ ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, కొల్చారం మండల కేంద్రంలోని జైనమందిరం తదితర ప్రదేశాల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తునట్లు వెల్లడించారు. అలాగే మెదక్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున రూ.125 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ధరణిని తీసి వేద్దామంటున్నారు. మీరేమంటారని సీఎం ప్రశ్నించడంతో వద్దూ వద్దూ అంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పద్మా నా బిడ్డ.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నా కూతురులాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే విన్నవించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రగతిలో మెదక్ జిల్లాను మెరిపిస్తామన్నారు. మరి మీరు మాత్రం గతంలో కన్నా అధిక మెజార్టీతో పద్మాదేవేందర్రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. దీంతో సభ ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మారుమోగింది. -
టీఆర్ఎస్లో పోటాపోటీ.. ప్రజాక్షేత్రంలో బిజీగా నేతలు
సాక్షి, మెదక్: అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న టీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు పోటాపోటీ కార్యక్రమాలకు తెరలేపారు. బహిరంగంగా ఎక్కడా విభేదాలు కనబడకున్నా.. అంతర్గతంగా ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నట్లు చర్చసాగుతోంది. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ జనం మధ్యలో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రజల మద్దతుకై ఆరాటం ► అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువున్నా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటి నుంచే ప్రజల మద్దతును కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ► మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తు న్న ముఖ్య నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ, ఏ చిన్న అవ కాశం ఉన్నా వదులుకోకుండా హాజరవుతున్నారు. ► ఎవరి వర్గాన్ని వారు కాపాడుకుంటూ పోటీపోటీగా అధికార, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ మొదలైంది. మెదక్ నియోజకవర్గంలో.. ► మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి ఇప్పటికే జిల్లా పార్టీ పగ్గాలను సీఎం కేసీఆర్ అప్పగించటంతో నియోజకవర్గంతో పాటు ఇతర ముఖ్య పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ బీజీగా గడుపుతున్నారు. ► ప్రతీ మంగళవారం క్యాంపు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పద్మాదేవేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ► అవకాశం దొరికినప్పుడల్లా మెదక్ జిల్లాకు రైలు, మెడికల్ కళాశాల మంజూరు తదితర పనులపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ► సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి జన్మదినం సందర్భంగా గతేడాది ఆగస్టులో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో భారీ ర్యాలీ, కటౌట్లతో హంగామా చేశారు. ► తమ వర్గీయులతో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై దృష్టి పెడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో... ► సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి పోటాపోటీగా పర్యటనలు చేస్తూ, స్థానికంగా ఎక్కువ సమయం ఉండేలా చూసుకుంటున్నారు. ► నర్సాపూర్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సు నితా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఆమె వర్గీయులు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ► మరోవైపు మదన్రెడ్డి అనుయాయులు ఆయన పుట్టిన రోజున ఆలయాల్లో పూజలు చేశారు. నర్సాపూర్ నుంచి చాకరిమెట్ల వరకు కాలినడకన వెళ్లి పూజలు నిర్వహించారు. ► మెదక్లో పద్మాదేవేందర్రెడ్డి, శేరి సుభాష్రెడ్డిలు, నర్సాపూర్లో మదన్రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి ఎవరికి వారు ప్రజల్లో ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ► ఈ క్రమంలో అధికార పక్షానికి చెందిన ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా ఏర్పడడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెండు నియోజకవర్గాలు.. ► జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాలు ఉన్నా, మెదక్ మాత్రమే పూర్తిస్థాయి నియోజకవర్గంగా కొనసాగుతోంది. ► మెదక్ నియోజకవర్గంలోని హవేళిఘనాపూర్, రామాయంపేట, పాపన్నపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలతో పాటు మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ► నర్సాపూర్ నియోజక వర్గంలో నర్సాపూర్, శివ్వంపేట, వెల్దూర్తి, కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, నర్సాపూర్ మున్సిపాలితో పాటు హత్నూర మండలం ఉన్నా, పాలనా సౌలభ్యం కోసం దానిని సంగారెడ్డి జిల్లాలో కలిపారు. ► గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరబాద్లను, దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాలను, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలాన్ని, అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గ్, మండలాలను మెదక్ జిల్లాలో కలిపారు. ► ఇటీవల ఏర్పడిన మాసాయిపేట మండలంతో కలిపి జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి. (క్లిక్: అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది?) -
ఓట్ల పండుగ.. జనం నిండుగ
సాక్షి,మెదక్: మెదక్ నియోజకవర్గంలో గురువారం జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 273 పోలింగ్ కేంద్రాల్లో 72.84 శాతం పోలింగ్ జరిగింది. ఇందులో చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ నమోదై నియోజకవర్గంలోనే ముందంజలో ఉంది. ఇక చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ కాగా రామాయంపేట మండలంలో 73.76 శాతం, నిజాంపేటలో 69.49 శాతం, పాపన్నపేట మండలంలో 71.46 శాతం, రేగోడ్ మండలంలో 66 శాతం, పెద్దశంకరంపేట మండలంలో 69 శాతం, టేక్మాల్ మండలంలో 68.33 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని 27 వార్డుల్లో మొత్తం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలనుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్లో యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సందర్శించి ఓటింగ్ సరళిన అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను ఆకట్టుకునేందుకు బెలూన్ల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. నవాబుపేటలో మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఆయన సతీమణి గాయత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వైస్చైర్మన్ రాగి అశోక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు సెల్పీలు దిగుతూ సందడి చేశారు. శభాష్ పోలీస్ పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుగా నిర్వహించిన పలువురు కానిస్టేబుళ్లు తమ సేవా ధృక్పదాన్ని చూపి పలువురి చేత శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులను సేవలందించారు. నడవలేని వికలాంగులు, వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మహిళల కోసం వెయింటింగ్ హల్.. చిన్నశంకరంపేట(మెదక్): ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాలి. అయితే ఓ గ్రామ సేవకుడి ఐడియా మహిళలకు క్యూౖలో నిలబడె శ్రమను తప్పించింది. మండలంలోని మడూర్లోని ఓ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారి కోసం వెయింట్ హాల్ ఏర్పాటుచేశారు. దీంతో ఎండలో వచ్చినవారు వెయింట్ హాల్ కూర్చొని సేదతీరారు. గ్రామ సేవకుడు యాదగిరిని పలువురు అభినందించారు. -
అడ్వకేట్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా...!!!
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి 2001లో టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అడ్వకేట్ గా పనిచేసిన అనుభవం ఆమెకు రాజకీయాల్లో కలిసొచ్చిన అంశం. టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటకీ ఆమె మాత్రం తన ధైర్యం కోల్పోలేదు. ఆమె పోరాట పటిమ చూసి పార్టీయే దిగివచ్చింది. ఈ ఒక్క విషయం చాలు పద్మా దేవేందర్ రెడ్డి ఏంటో తెలుసుకోవడానికి! విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే ఆసక్తి కనబర్చిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే జెడ్పీటీసీ మెంబర్గా గెలిచి తన సత్తా చాటారు. పద్మా దేవేందర్ రెడ్డి చేరికతో బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న ఆమె భర్త కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. పెద్ద కుటుంబంలో జన్మించిన పద్మాదేవేందర్ రెడ్డి బాల్యమంతా ఊర్లోనే సాగింది. చిన్నప్పడు ఎప్పుడూ చదువులో ముందుండేవారు.చదువులో అందరికన్నా ముందుండాలనే పట్టుదలతో ఉండేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించిన పద్మా దేవేందర్ రెడ్డి చదువంతా కరీంనగర్ పట్టణంలోనే సాగింది. ఎల్ ఎల్ బీ పూర్తి కాగానే న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో దాదాపు మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 17 ఏళ్ల ప్రాయంలోనే వివాహం జరిగినప్పటికీ తాను మాత్రం లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని కుంటుంబం నుంచి వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే అని సన్నిహితులు చెబుతుంటారు. మంత్రివర్గంలో చేరాలని బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ కేసీఆర్ సూచనల మేరకు డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వం పద్మా దేవేందర్ రెడ్డిది. ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కలసి సిద్దిపేట నుంచి వరంగల్ వరకు సైకిల్ యాత్రలో పాల్గొని ఏ విషయంలోను మహిళలు పురుషుల కన్నా తక్కువ కాదని చాటి చెప్పారు. కుటుంబ నేపథ్యం : పేరు : మాధవరెడ్డిగారి పద్మా దేవేందర్ రెడ్డి జన్మస్థలం : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పుట్టిన తేదీ : జనవరి6,1969 తల్లిదండ్రులు : విజయా రెడ్డి,భూమి రెడ్డి చదువు : బీ.ఏ ఎల్.ఎల్.బి (ఉస్మానియా యూనివర్సిటీ) వివాహం : 22 పిబ్రవరి,1988 భర్త : ఎం దేవేందర్ రెడ్డి కుటుంబం : కుమారుడు పునీత్ రెడ్డి రాజకీయ నేపథ్యం : ►2001 లో టీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం ►2001 లో మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపు (జెడ్పీలో పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా) ►2004 లో రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక ► 2008 ఉప ఎన్నికల్లో ఓటమి (ఉద్యమంలో భాగంగా పదవి రాజీనామా, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి) ► 2009 లో ఎన్నికల్లో ఓటమి ►2009 లో టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ (కూటమి పొత్తుల్లో భాగంగా టీఆర్ఎస్ అథిష్టానం టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు) ► 2010 లో తిరిగి పార్టీలో చేరిక ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు (మళ్లీ ప్రస్తుత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ) ►2014-2018 తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్గా పని చేశారు. ఎ.రమణా రెడ్డి (ఎస్.ఎస్.జే) -
‘కాళేశ్వరం’తో రాష్ట్రం సస్యశ్యామలం
మహదేవపూర్(వరంగల్): ప్రపంచంలో అత్యంత వేగవంతంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు చరిత్రలో నిలిచిపోతారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను శనివారం పద్మాదేవేందర్రెడ్డి సందర్శించారు. ఉదయం 9 గంటలకు మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డకు చేరుకోవల్సిన పద్మాదేవేందర్రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. ఎల్ అండ్ టీ కంపెనీ అధికారులు, ఇంజనీర్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు. మేడిగడ్డ బ్యారేజీ డిప్యూటీ ఇంజనీయర్ సురేష్ బ్యారేజీ నిర్మాణ వివరాలను, నీటి ప్రవాహం, రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా గోదావరి, ప్రాణహిత నీటిని తరలించే విధానంపై మ్యాపు ద్వారా వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పద్మాదేవేందర్రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగంపై దృష్టి సారించలేదని, వలసాంద్రపాలకులు మన నీటిని దోచుకుపోతున్నా..తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. నిధులు, నీళ్లు, నియామకాల్లో వివక్షకు గురైన తెలంగాణ ప్రజానీకం ఉద్యమసారధి కేసీఆర్ వెంట నడిచి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగ నిపుణులతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గోదావరి నీటి వినియోగంపై చర్చించి ‘వ్యాప్కోస్’ సంస్థతో సర్వే చేయించారని అన్నారు. గోదావరిలోని తెలంగాణ వాటా 957 టీఎంసీల నీటిని వాడుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని దాంట్లో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి 16 టీఎంసీల నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎగువ ప్రాంతాలకు తరలించాలని ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ను ప్రారంభించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో 16 జిల్లాలకు సాగు, తాగునీటి వసతి కలుగుతోందని తెలిపారు. కరువుతో అల్లాడుతున్న మెదక్ జిల్లాకు సింగూర్ జలాలు మాత్రమే ఉండేవని, గత ప్రభుత్వం సింగూరు జలాలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు తరలించడంతో పంట భూములన్నీ బీళ్లుగా మారాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం తరుఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీపతి బాపు, నాయకులు సుంకె మధు, లక్ష్మణ్, బాబురావు, మాధవరావు తదితరులు ఉన్నారు. -
సమ్మె విరమించిన రేషన్ డీలర్లు
సాక్షి, హైదరాబాద్ : రేషన్ డీలర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్స్ సంఘం నేత రమేష్ ప్రకటించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. పెండింగ్ బకాయిల విడుదల, కనీస వేతనంపై హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు వెళతామని రమేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ.. మాకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వాజీర్ ఖాన్ కుటుంబాన్ని అదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. డిప్యూటీ స్పీకర్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. డీలర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కాగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ స్పీకర్, మంత్రులకు డీలర్లు ధన్యవాదాలు తెలిపారు. -
క్రాప్ కాలనీలఏర్పాటు
పాపన్నపేట(మెదక్): రైతు ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. ఏడుపాయల్లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దేశంలోని అన్ని వృత్తులు, ఉద్యోగస్తులకు సంఘాలున్నప్పటికీ రైతులకు మాత్రం ఎలాంటి సంఘాలు లేవని తెలిపారు. దీంతో వారు పండించిన పంటలకు దళారులు ధరలను నిర్ణయించే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దీని ద్వారా రైతులు ఎలాంటి పంటలు వేయాలి ? ఏ పంటకు డిమాండ్ ఉంది ? ఎంత పంట పండించాలి ? గిట్టుబాటు ధర ఎంత ఉండాలి ? ఈ విషయాలను క్రాప్ కాలనీల ద్వారా రైతు సమన్వయ సంఘాలు నిర్ణయిస్తాయని తెలిపారు. తెలంగాణలో రైతుల కోసం 24గంటల కరెంట్, సాగునీరు, ఎరువులు, విత్తనాలు ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. అనుకున్న ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాల భూమికి సాగునీరు అందుతుందన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి పంటల పెట్టుబడికోసం ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఇప్పటికే 2,400 ఏఈఓలను నియమించామన్నారు. 5వేల రైతులకు ఒక ఏఈఓ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి, ఎంపీపీ పవిత్ర, రైతు సమన్వయ సమితి జిల్లా అద్యక్షుడు టి. సోములు, ఏడుపాయల డైరెక్టర్లు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు చిన్నశంకరంపేట(మెదక్): శ్రీ సోమేశ్వర ఆలయ అభివృద్ధికి నిధులు అందించనున్నట్లు డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మడూర్ మధిర గ్రామమైన వెంకట్రావుపల్లి–కుర్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీసోమేశ్వర ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆలయల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. శ్రీసోమేశ్వర ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్, లక్ష్మారెడ్డి, రాజు, కుమార్గౌడ్, సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు సుధాకర్రావు, నాగరాజు, భూపాల్, వెంకటేశం, సత్యనారాయణ, పాల్గొన్నారు. కాగా ఈ ఈ కార్యక్రమాలు శ్రీఅష్టకాల నరసింహరామశర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మోణోత్తములచేత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్
మెదక్ మున్సిపాలిటీ: ‘జన్మనిచ్చింది మా తల్లిదండ్రులైతే.. రాజకీయ జన్మనిచ్చింది సీఎం కేసీఆర్’ అని డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం శాసనసభ ఉపసభాపతి జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను ఆడబిడ్డగా ఆదరించి ఆశీస్సులు అందజేసిన ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు. ఆమెకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే... రాజకీయ జన్మనిచ్చింది సీఎం కేసీఆర్ అని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి పనులు చేస్తూ పాలన కొనసాగిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ... అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. అలాగే భవిష్యత్ తరాలకు అన్ని హంగులతోకూడిన మెదక్ నియోజకవర్గాన్ని అందిస్తానని తెలిపారు. జన్మదిన వేడుకలు ఇలా... ఉదయం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అక్కడ కేక్కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఘనంగా సన్మానించారు. పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. అంతకు ముందు బాణాసాంచా కాల్చి స్వాగతం పలికారు. కౌన్సిలర్ మాయ మల్లేశం తయారు చేయించిన 50 కిలోల కేక్ను ఆమె కట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్రెడ్డి రక్తదానం చేశారు. ఆయనతో పాటు ఈ శిబిరంలో 70మంది వరకు రక్తదానం చేశారు. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నగేశ్, డీఆర్వో రాములు, ఆర్డీఓ మెంచు నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మెదక్ పట్టణ సీఐ భాస్కర్, రూరల్ సీఐ రామకృష్ణ, ఇరిగేషన్ ఈఈ ఏసయ్య, పంచాయతీరాజ్ ఈఈ, డీఏఓ పరశురాం, స్త్రీశిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి జ్యోతిపద్మ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన సంబురాలు.. ఆటోనగర్, ఖాజా ఇంజనీరింగ్ వర్క్షాప్వద్ద, పాత బస్టాండ్ వద్ద, మున్సిపల్ కార్యాలయంలో, జిల్లా గ్రంథాలయ సంస్థలో, జేఎన్ రోడ్డులో మేరు సంఘం ఆధ్వర్యంలో, 3, 4వ వార్డుల్లో, రాందాస్ చౌరస్తాలో, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, డాన్ బాస్కో హైస్కూల్లో , హోటల్ చంద్ర భవన్ వద్ద , హోటల్ బావర్చి ఆధ్వర్యంలో, ఎస్టీ బాలికల వసతి గృహంలో అంగరంగ వైభవంగా పద్మాదేవేందర్రెడ్డి జన్మదిన వేడకలను నిర్వహించారు. పలు చోట్ల అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. హోటల్ చంద్రభవన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు చీరలను పంచి పెట్టారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, కౌన్సిలర్లు అనిల్కుమార్, రబ్బీన్ దివాకర్, మధుసూదన్రావు, చంద్రకళ, విజయలక్ష్మి, గాయత్రి, లక్ష్మి, సులోచన, యశోద, రాధ, కౌన్సిలర్ సోహైల్, కో అప్షన్ సభ్యులు గంగాధర్, సాధిక్, జీవన్రావు, కిరణ్గౌడ్, టీఎన్జీఓస్ నాయకులు భూపాల్రెడ్డి, శ్యాంరావు, జెల్ల సుధాకర్, నరేందర్, సువర్ణ, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ చల్లా నరేందర్, గడ్డమీది కృష్ణాగౌడ్, వైస్ ఎంపీపీ లలితవిశ్వం, ఫాజిల్, శ్రీకాంత్ తదితరులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. చిన్నశంకరం పేటలో హోమం.. చిన్నశంకరంపేట(మెదక్): డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పుట్టినరోజు వేడుకలు శనివారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శ్రీఅనంతపద్మనాభస్వామి గుట్టపై సర్పంచ్ కుమార్గౌడ్ అధ్వర్యంలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీఅనంతపద్మనాభస్వామి, శివలింగాలకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రామాయంపేట ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను ఆమె కట్చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేగుంట నుంచి భారీ బైక్ ర్యాలీతో టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రాగౌడ్, కృపావతి, విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్లు మైనంపల్లి రంగారావు, సాన సత్యనారాయణ, సుధాకర్, సిద్దాగౌడ్, పడాల సిద్దిరాములు, టీఆర్ఎస్ నాయకులు రామ్రెడ్డి, లక్ష్మారెడ్డి, వడ్ల శ్రీనివాస్, రమేశ్గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ వెంకట్రెడ్డి, ఎస్ఐ ప్రకాష్గౌడ్, తహసీల్దార్ సహదేవ్లు బోకేలను శుభాకాంక్షలు తెలిపారు. -
జేసీబీ నడిపి.. సాధారణ కూలీగా డిప్యూటీ స్పీకర్
మెదక్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి శుక్రవారం మెదక్ పట్టణంలో పర్యటించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పట్టణంలోని నాయకుని చెరువులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా మహిళా నేత పద్మాదేవేందర్ రెడ్డి స్వయంగా జేసీబీ నడిపి పనులకు శ్రీకారం చుట్టడం విశేషం. పలుగు, పార చేతపట్టి సాధారణ కూలీగా మారిపోయి మట్టిని ఎత్తి పోశారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటలవరకు పట్టణంలోని బంగ్లా చెరువు, మల్లంచెరువులను డిప్యూటీ స్పీకర్ పరిశీలించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కలెక్టరేట్ లో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మెదక్ పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. -
కొత్త జిల్లా ఆవిర్భావ ఘడియల కోసం..
ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నా.. సీఎం కేసీఆర్ చొరవ వల్లే మెదక్ జిల్లా ఏర్పాటు ప్రజలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట జిల్లా అభివృద్ధికి ద్విముఖ వ్యూహం టూరిజం సర్క్వూట్, ఎడ్యుకేషనల్ హబ్ కోసం ప్రణాళిక ‘సాక్షి’తో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సాక్షి ప్రతినిధి మెదక్:మెదక్ జిల్లా ఆవిర్భావ క్షణాల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ‘ప్రజల నాలుగు దశాబ్దాల కల నెరవేరనుంది. సీఎం కేసీఆర్ కృషి ఫలితమే మెదక్ ప్రజల కల సాకారమైంది. విజయదశమి, కొత్త జిల్లా ఆవిర్భావంతో ఒకేరోజు రెండు పండుగలు వచ్చాయి’ అని పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం నుంచి మెదక్ జిల్లా మనుగడలోకి రానున్న నేపథ్యంలో కొత్త జిల్లా ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై పద్మాదేవేందర్రెడ్డి సోమవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. మెదక్ జిల్లాకు చారిత్రక నేపథ్యం... ‘మెదక్ జిల్లాకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. కాకతీయలు పాలనలో మెదక్ వెలుగొందింది. నిజాం పాలనలో సుభాగా ఉన్న ఈ ప్రాంతం ఆ తర్వాత మెదక్ పేరుతో జిల్లాగా ఏర్పాటైంది. ప్రత్యేక తెలంగాణతోపాటు మెదక్ ప్రజలు జిల్లా కేంద్రం కోసం ఉద్యమించారు. నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నా. ఎన్నికల సమయంలో మెదక్ జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చాం. మెదక్ జిల్లాను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ 2014 డిసెంబర్ 17న ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు ఇప్పుడు మెదక్ కేంద్రంగా జిల్లాగా మారుతుంది. 20 మండలాలు 8 లక్షల జనాభాతో మెదక్ జిల్లా ఏర్పాటవుతుంది. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. ఈ వేడుకల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వాములను చేస్తున్నాం. చిన్నజిల్లాతో అభివృద్ధి పరుగులు.. చిన్న జిల్లా ఏర్పాటుతో పాలనా సౌలభ్యం పెరుగుతుంది. తద్వారా జిల్లా అభివృద్ధి ఊపందుకుంటుంది. మెదక్ జిల్లా అభివృద్ధికి ద్విముఖ వ్యూహంతో ముందుకుసాగుతాం. వ్యవసాయం, పారిశ్రామికరంగాల అభివృద్ధితోపాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాం. మెదక్ జిల్లాకు అద్భుతమైన వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ మెదక్ జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తా. వ్యవసాయం, సాగునీటిరంగ, అటవీ అభివృద్ధి, విద్యా, పర్యాటకరంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అ«ధిక ప్రాధాన్యతనిస్తాం. జిల్లాకు ప్రస్తుతం 44వ నంబరు జాతీయ రహదారి ఉంది. భవిష్యత్తులో నర్సాపూర్-బోధన్, బోధన్-హసన్పర్తి రహదారులు హైవేగా మారే అవకాశం ఉంది. జాతీయ రహదారులతో జిల్లా అభివృద్ధి పరుగులు తీస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఎడ్యుకేషన్ హబ్, టూరిజం సర్క్యూట్గా.. మెదక్ జిల్లా పర్యాటకపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏడుపాయల, మెదక్ ఖిల్లా, చర్చి, పోచారం అభయారణ్యం తదితర ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్వూట్గా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తాం. మెదక్కు త్వరలో కేంద్రీయ విద్యాలయం, పీజీ కళాశాలలు రానున్నాయి. మెదక్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తాం. కొత్త జిల్లా అభివృద్ధి చెందేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యం ముఖ్యం. అందరినీ కలుపుకునిపోతూ జిల్లా అభివృద్ధికి పాటుపడతా’మని పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. -
ఆడపిల్లలను రక్షించుకుందాం
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బతుకమ్మ స్ఫూర్తితో ఆడపిల్లలను రక్షించుకోవాలన్నారు. ప్రెస్క్లబ్లో బతుకమ్మ పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు. సోమాజీగూడలోని ప్రెస్క్లబ్ హైదరాబాద్లో శుక్రవారం తొలిసారిగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. సేవ్ గర్ల్ చైల్డ్( ఆడపిల్లలను రక్షిద్దాం) అనే సామాజిక అంశంతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు భావితరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మకు పూజలు చేసి, ఆడిపాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి, ఈటల జమున, సుశీల కోదండరామ్, శోభ, వెంకట్ మంతెన, భీమ్ రెడ్డి, గాయనీ మధుప్రియ, ప్రెస్క్లబ్ సెక్రటరీ శ్రీగిరి విజయ్కుమార్ రెడ్డి, ఈసీ మెంబర్స్ సరస్వతి రమ, యశోద, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులను నిర్మించితీరుతాం
అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు ‘సింగూరు’ నీరు జిల్లాకే వినియోగం ‘ఘనపురం’ను పట్టించుకోని నాటి పాలకులు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మెదక్: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అడ్డుకుంటే వారికి ప్రజలే బుద్ధిచెబుతారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. కరువు, కాటకాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాజెక్ట్ల నిర్మించి కాల్వల ద్వారా సాగు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఆదివారం ఆమె మెదక్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల ఘనపురం ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక ఇప్పటి వరకు ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్ సిమెంట్లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించామన్నారు. సింగూరు నీటిని జిల్లాలో సాగునీటికే వాడాలని , హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం గోదావరి, కృష్ణ జలాలను రప్పించడం జరుగుతుందని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో అదనంగా ఆయకట్టు సాగవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్పార్టీ నాయకులు ఆ పనులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా ఘనపురం ప్రాజెక్ట్ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆమె వెంట జెడ్పిటీసీ లావణ్యరెడ్డి ఉన్నారు. -
ప్ర‘జల’ సాక్షి
♦ జనం గొంతు తడుపుతున్న ‘సాక్షి’ చలివేంద్రాలు ♦ మారుమూల పల్లెలకు ట్యాంకర్లతో నీటి సరఫరాకు శ్రీకారం (సాక్షి, నెట్వర్క్) ఎక్కడికక్కడ వట్టిపోయిన బోర్లు, నెర్రెలు విచ్చుకున్న నీటి వనరులు, గుక్కెడు నీళ్ల కోసం మైళ్లదూరం వెళ్తున్న జనం.. ప్రస్తుతం తెలంగాణ పల్లె చిత్రమిది. ఇలాంటి ఆపత్కాలంలో సామాజిక బాధ్యతగా, తమ వంతుగా ‘సాక్షి’ ప్రజల కోసం కదిలింది. ఎర్రటి ఎండలో బయటకు వచ్చిన జనం గొంతు తడిపేందుకు నడుంకట్టింది. పట్టణాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న కొన్ని పల్లెలు, గిరిజన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే సంకల్పంతో ముందుకు సాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ చలివేంద్రాలు.. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మెదక్ జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూరుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నీటి సరఫరాకు రెండు ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా రోజూ లక్ష లీటర్ల నీటిని సరఫరా చేయనున్నారు. ఈ ట్యాంకర్లను కలెక్టర్ రోనాల్డ్ రాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఇటీవల మెదక్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించి..ప్రజల దాహార్తిని తీర్చేందుకు ‘సాక్షి’ చూపుతున్న చొరవను కొనియాడారు. మహబూబ్నగర్లోని తెలంగాణ చౌరస్తాలో మంగళవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డీఎస్పీ కృష్ణమూర్తి, జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్ ప్రారంభించారు. సోమ, మంగళవారాల్లో జిల్లాలోని షాద్నగర్, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గ కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాగే, నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, బాన్సువాడ, బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి పట్టణాల్లో ‘సాక్షి’ ఏర్పాటు చేసిన చలివేంద్రాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో మంగళవారం ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే శంకర్నాయక్ ట్యాంకర్లను ప్రారంభించారు. పట్టణంలో కూరగాయల మార్కెట్లో చలివేంద్రాన్ని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ప్రారంభించారు. బచ్చన్నపేటతోపాటు కొడవటూరు, కొన్నె గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. నృత్యాలతో ‘సాక్షి’ ట్యాంకర్లకు స్వాగతం నీటిని పొదుపు చేస్తామని ప్రతిజ్ఞ కొండలమాటున నీటి కోసం అల్లాడుతున్న గిరిజనం దప్పిక తీరుస్తోంది ‘సాక్షి’. నల్లగొండ జిల్లా అనుముల మండలం ఎల్లాపురం పరిధిలోని చక్కోలం తండాకు మంగళవారం నుంచి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది సాక్షి. అనుముల మండల కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తండాకు ట్యాంకర్తో ‘సాక్షి’ వెళ్లడంతో గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ఎదురొచ్చి స్వాగతం పలికారు. తాగునీటిని పొదుపుగా వాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కరీంనగర్ జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభమయ్యాయి. గోదావరిఖని ఎన్టీపీసీ మేడిపెల్లి సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటయ్యూరుు. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్రావు, బెల్లంపల్లి కొత్తబస్టాండ్లో మునిసిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోనూ చలివేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లాపరిషత్ చైర్పర్సన్ కవిత ప్రారంభించారు. -
కొద్దిసేపు ప్యానెల్ స్పీకర్గా గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గీతారెడ్డి శనివారం స్పీకర్ స్థానం నుంచి ప్యానెల్ స్పీకర్గా కొద్దిసేపు సభను నడిపారు. హెచ్సీయూ, ఉస్మానియా యూనివర్సిటీ ఘటనలపై హోంమంత్రి ప్రకటన అనంతరం ఆ అంశంపై చర్చ జరిగింది. అస్వస్థత కారణంగా స్పీకర్ శనివారం అసెంబ్లీకి రాలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి విధులు నిర్వహించారు. ఆమె భోజన విరామానికి వెళ్లగా స్పీకర్ స్థానంలో గీతారెడ్డి ఉండి కొద్దిసేపు సభను నడిపారు. కాగా, తొలుత ప్యానెల్ స్పీకర్గా రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని కోరగా తనకంటే సీనియర్ అయిన గీతారెడ్డి పేరును ఆయన సూచించారు. ‘ఆస్థానంలో కూర్చున్న ఎవరైనా సభను ఆర్డర్లో పెట్టాల్సిందే. గీతారెడ్డి కూడా అదేపని చేశారు. ఆ కుర్చీకి ఉన్న పవర్ అది’ అని అసెంబ్లీ అనంతరం పద్మాదేవేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. -
సభలో కంటతడి పెట్టిన డిప్యూటీ స్పీకర్
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేనివారు సభను నిర్వహిస్తున్నారంటూ మంగళవారం సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపం చెందిన పద్మా దేవేందర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకుని 'మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవు.సభాపతిని డిక్టేట్ చేయడం సరికాదని, డీకే అరుణ వెంటనే క్షమాపణ చెప్పాలని' డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయడానికి వెనుకాడేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఏపీ శాసనసభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళ ఎమ్మెల్యేను ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేశారని, అయితే తాము అలాంటి చర్యకు పోదలచుకోలేదని అన్నారు. గతంలో తాము సభలో మాట జారితే తమ నాయకుడు...మంత్రులతో క్షమాపణ చెప్పించారని హరీశ్ రావు గుర్తు చేశారు. అది తమ సంస్కారమని, క్షమాపణ చెబితే కిరీటమేమీ పడిపోదని ఆయన అన్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై చేసిన వ్యాఖ్యలకు సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ సభలో అందరూ హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభాపతిపై ప్రతిపక్షానికి గౌరవముందని, సభ్యులు ఆవేశపడినా గతంలో తాము సర్ధుబాటు చేసిన ఘటనలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై వాదాపవాదాలు వద్దని అందరూ సమన్వయం పాటించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై డీకే అరుణ మాట్లాడుతూ... తాను ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. -
మహిళలకు అవకాశాలు ఇవ్వాలి
* మహిళా దినోత్సవంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి * చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ * మహిళలకు రక్షణ, సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రులు * విశిష్ట మహిళలకు పురస్కారాలు ప్రదానం సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ అనుత్పాదక రంగాలకే పరిమితమైన మహిళలు ఇప్పుడిప్పుడే స్వావలంబన సాధిస్తున్నారని... వారు మరింత ముందుకు వచ్చేలా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని పద్మాదేవేందర్రెడ్డి చెప్పారు. ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నా పార్లమెంటులో ఆమోదానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో మంత్రులందరూ సమష్టిగా నిర్వహించే బాధ్యతలను కుటుంబంలో మహిళ ఒంటిచేత్తో నిర్వహిస్తుందని పేర్కొన్నారు. చదువుకున్న స్త్రీ కుటుంబానికి దిక్సూచిలా నిలుస్తుందని, అవకాశాలు ఇస్తే మహిళలు ఐటీలోనే కాదు ఆకాశంలోనూ విహరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మహిళల ఆరోగ్యం, రక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి, ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఆ కమిటీ సిఫారసుల మేరకే ‘షీ’ టీమ్లు, షీ క్యాబ్లు, సఖి వంటి పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ దేశంలోనే తొలిసారిగా మహిళల కష్టాలను తీర్చడం కోసం ఇంటింటికీ తాగునీరందించే ‘మిషన్ భగీరథ’ను చేపట్టడం సాహసోపేత నిర్ణయమని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగ నియామకాల్లో తొలిసారిగా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సాహసం. విజ్ఞానం, ధర్మం, సహనం, ఓపిక తదితరాలకు మహిళలు ప్రతీకగా నిలుస్తారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వ్యవస్థలో మహిళలదే కీలకపాత్ర అని.. వారి హక్కులు, రక్షణ, గౌరవం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కార్యక్రమాలను కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ప్రశంసించారు. మహిళలకు పురస్కారాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 21మంది మహిళలను సత్కరించారు. లక్ష రూపాయల నగదు, జ్ఞాపికలతో వారిని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి సన్మానించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చెన్నబోయిన కమలమ్మ, రమా మెల్కోటే, బాల థెరీసా, ఎల్లవ్వ, లావణ్య, మన్నెం సరితారెడ్డి, కెప్టెన్ దీప్తి, తారాబాయి. సువర్చల, సురభి వాణీదేవి, సంధ్య, ఆలేరు విజయ, నిఖత్ జరీన్, అఖిలేశ్వరి, ఆవుల సరిత, గోగు శ్యామల, నేనావత్ దేవి, మొగులమ్మ, మంకూబాయి, డాక్టర్ ఫణిశ్రీ సాయి తదితరులు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గొంగిడి సునీత, కోవ లక్ష్మి, జడ్పీ చైర్పర్సన్లు సునీతా మహేందర్రెడ్డి, జి.పద్మ, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. -
'పురుష దినోత్సవం జరుపుకునేలా చేస్తా'
మహిళలు 'మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నట్లే పురుషులు కూడా పురుష దినోత్సవం నిర్వహించుకునేలా చేస్తానని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఆ రోజున తమ ఇబ్బందులు, కష్టాలను చర్చించుకునే అవకాశం దక్కేలా కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 'మహిళా ఉపాధ్యాయ సదస్సు'లో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. మనం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే మగవాళ్లంతా చూసి గర్వం అనుకుంటున్నారని... కాలు మీద కాలు వేసుకునేది గర్వంతో కాదు, కాళ్లు నొప్పులతోనేనని సరదాగా చమత్కరించారు. -
ఖేడ్లో వేడెక్కుతున్న రాజకీయం
పెరుగుతున్న నేతల మధ్య మాటలవేడి తూటాల్లా పేలుతున్న ప్రసంగాలు నారాయణఖేడ్ : ఉప ఎన్నిక పోరు వేడెక్కింది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి రగులుతోంది. అన్ని పార్టీల నుంచి రాష్ర్టస్థాయి నేతలు నారాయణఖేడ్ బాట పట్టారు. పోలింగ్కు వారం రోజుల సమయమే ఉండడంతో అన్ని పార్టీల నాయకులూ ఖేడ్లో మకాం పెట్టారు. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. 11తో ప్రచార పర్వం ముగుస్తుంది. ఇప్పటివరకు హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిన నాయకులు ఆ ఎన్నికలు ముగియడంతో ఖేడ్ ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు ఖేడ్ పట్టణంలో అడ్డా బిటాయించారు. అన్ని పార్టీల నాయకులు నారాయణఖేడ్ చేరుకొని ప్రచార వాగ్బాణాలు సంధిస్తున్నారు. జోరుమీదున్న కారు.. ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో నారాయణఖేడ్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించేందుకు సుమారు ఆరునెలల సమయం పట్టింది. ఈలోగా టీఆర్ఎస్ నాయకులు, మంత్రి హరీశ్రావు నాలుగైదు నెలల ముందు నుంచే నారాయణఖేడ్కు వస్తూ పోతూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయన పర్యటనలు, పనుల వేగం పెంచారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఆయన పూర్తిగా నారాయణఖేడ్పైనే దృష్టి సారించారు. వారం రోజులుగా ఆయన నిత్యం 15 గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మంత్రితోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సైతం ముమ్మర పర్యటనలు చేస్తున్నారు. వీరు నియోజకవర్గంలో సుమారు 30రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఈనెల 10న సీఎం కేసీఆర్ వస్తున్నందున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, బాబూమోహన్, జెడ్పీ చైర్మన్ రాజమణి , టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ తదితరులు పర్యటిస్తున్నారు. రంగంలో కాంగ్రెస్, టీడీపీ అగ్రనేతలు.. కాంగ్రెస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు సభల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి పాల్గొన్నారు. వీరితోపాటు డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, జగ్గారెడ్డి, శశిధర్రెడ్డి, గంగారాం పర్యటిస్తున్నారు. టీడీపీ తరఫున రేవంత్రెడ్డి పర్యటనలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఎర్రబెల్లి దయాకర్రావు సైతం ప్రచారం నిర్వహించారు. వీరితోపాటు పార్టీకి చెందిన రమరణ, మోత్కుపల్లి నర్సింహులు, వంటేరు ప్రతాపరెడ్డి, శశికళ పర్యటిస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నేతల మాటలు తూటాల్లా పేలుతూ మరింత వేడి పుట్టిస్తున్నాయి. -
'పద్మాదేవేందర్ కృషితో రామాయంపేట అభివృద్ధి'
రామాయంపేట (మెదక్ జిల్లా) : డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కృషితో రామాయంపేట మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆయన గురువారం రామాయంపేటలోని రైతుబజార్లో రూ.50లక్షలతో అదనపు పనులకు శంకుస్థాపన గావించిన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో రోడ్డు విస్తరణకు రూ.7.80 కోట్లతోపాటు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో అభివృద్ది పనులకు రూ.4 కోట్లు, తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికిగాను రూ. కోటి మంజూరయ్యాయన్నారు. స్థానికంగా ఉన్న మల్లె చెరువును మినీ ట్యాంక్బండుగా మారుస్తామని, త్వరలో గెస్ట్ హౌస్ నిర్మాణానికిగాను నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రామాయంపేట మండలంలో కరువు పరిస్థితులు నెలకొన్న కారణంగా గోదావరి జలాలు తరలిస్తామన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులను అడ్డుకుంటున్నారని హరీష్రావు ఆరోపించారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్రెడ్డి, స్థానిక ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్గౌడ్, స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి, మండల సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మానెగల్ల రామకిష్టయ్య, పున్న వెంకటస్వామి, మాజీ ఎంపీపీ సంపత్, పార్టీ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్రెడ్డి, జిల్లా నాయకుడు అందె కొండల్రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, మెదక్ ఆర్డీవో మెంచు నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల కల నెరవేరుతుంది
- ఆ సమయం ఆసన్నమైంది - ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం - డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి - హవేళిఘణాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన మెదక్: నిరుపేదల కల నెరవేరే సమయం ఆసన్నమైందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ మండలం హవేళి ఘణాపూర్ గంగిరెద్దుల కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లకు ఆమె భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలన్నారు. నిరుపేదల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ 125 గజాల్లో డబుల్ బెడ్రూమ్ను సకల సౌకర్యాలతో నిర్మించి ఇస్తున్నారన్నారు. ఇందుకోసం ఒక్కో ఇంటికి రూ.5,04,000 చొప్పున మంజూరు చేశారన్నారు. మెదక్ నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరైనట్టు చెప్పారు. వీటికి సంబంధించి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. కలెక్టర్ రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ హవేళి ఘణాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక గంగిరెద్దుల వారి కాలనీ హైదరాబాద్లా కనిపించాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతతో జరిగేలా లబ్ధిదారులు దగ్గరుండి చూసుకోవాలన్నారు. అంతకుముందు మండలంలోని పేరూర్లో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లతోపాటు ఇంకుడు గుంతలను డిప్యూటీ స్పీకర్ పరిశీలించారు. పేరూర్ గ్రామం మరో ఎర్రవల్లి కావాలని ఆమె ఆ కాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, డ్వామా పీడీ ఇంద్రకరణ్, ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపీపీ కొత్తపల్లి లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి, హవేళిఘణాపూర్ సర్పంచ్ సునీ తాసాయిలు, ఎంపీటీసీ శ్రీకాంత్, పేరూ ర్ సర్పంచ్ ర్యావ సుగుణ, నాయకులు కిష్టయ్య, అంజాగౌడ్, జయరాంరెడ్డి, సాయిలు, యాదగిరి, శ్రీనివాస్, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఏమిటీ ఈ నిర్లక్ష్యం?
- మరుగుదొడ్ల నిర్మాణాలపై డిప్యూటీ స్పీకర్ సమీక్ష - నివేదికల తయారీలో నిర్లక్ష్యంపై ఫైర్ - పది రోజులుగా ఏం చేస్తున్నారంటూ నిలదీత - ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన కలెక్టర్ మెదక్: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, అవసరాలు తదితర వివరాలపై నివేదిక తయారీలో అధికారుల నిర్లక్ష్యంపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి భగ్గుమన్నారు. శుక్రవారం మెదక్ ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి అధికారులతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజవకర్గంలోని చాలా గ్రామాల్లో అధికారులు మొక్కుబడిగా నివేదికలు తయారు చేశారని మండిపడ్డారు. మెదక్ మండలం ఖాజిపల్లి, ఫరీద్పూర్ గ్రామాల్లో అసలు మరుగుదొడ్లే లేవంటూ నివేదికలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫరీద్పూర్లో అసలు మరుగుదొడ్లు నిర్మించుకున్నవారే లేరంటూ తప్పుడు నివేదికలిచ్చిన గ్రామ కమ్యూనిటీ కోఆర్డినేటర్ (వెలుగు సీసీ) శంకర్ను, విధులకు హాజరు కానందున చిన్నశంకరంపేట ఈజీఎస్ ఏపీఓ ఈశ్వరమ్మను వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రోనాల్డ్రాస్ ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాలకు వెళ్లకుండానే నివేదికలు తయారు చేశారని మండిపడ్డారు. 26 వరకు పూర్తిస్థాయిలో నివేదికలు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, డ్వామా పీడీ ఇంద్రకరణ్, ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపీపీ కొత్తపల్లి లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, నియోజకవర్గంలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. -
తెలుగు అంటేనే తెలంగాణ భాష
- డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలుగు అంటేనే తెలంగాణ భాష అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ (తెలంగాణ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భాష పరంగా తెలంగాణ వివక్ష ఎదుర్కొందని, భాష, యాసను కాపాడుకోవాల్సిన అవసరం వుందన్నారు. తెలంగాణ భాష, నుడికారానికి కాళోజీ నిలువెత్తు రూపంగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు భాషపై మక్కువ ఎక్కువని సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి, కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. భాషా పండితులకు పదోన్నతుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని దేశపతి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తెలంగాణ భాష శ్వాసగా కాళోజీ సాహితీ సేద్యం చేశారని కవి నందిని సిద్ధారెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశంలో టీఎన్జీఓ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా పాల్గొన్నారు. -
'తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది'
మెదక్ టౌన్ : తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల కృషి ఎనలేనిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులకు సంబంధించిన హెల్త్కార్డుల ధరఖాస్తు ఫారాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమంలో ఎలా అయితే పని చేశారో బంగారు తెలంగాణ పునర్ నిర్మాణంలోనూ పాత్రికేయులు అలాగే పనిచేయాలన్నారు. సమాజంలోని లోటుపాట్లను ప్రజలకు తెలియజేసేది మీడియానేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి హెల్త్కార్డులు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్లో రూ.10కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు దేవయ్య, శ్రీనివాస్రెడ్డి, కామాటి కిషన్, శంకర్ దయాల్చారి, నాగరాజు, సురెందర్రెడ్డి, గోపాల్, సంగమేశ్వర్, రహ్మత్ అలీ తదితరులు ఉన్నారు. -
అలసత్వం వీడండి
పటాన్చెరు : అలసత్వంతో పనిచేస్తే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి వైద్యులను, సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురువారం పటాన్చెరులో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో సహ జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశాఖ పనితీరు మందగమనంతో సాగుతోందన్నారు. కష్టపడి పనిచేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. సమీక్షలో మంత్రి హరీశ్రావు, పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను మంత్రికి వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగన్నాథ్ మాట్లాడుతూ జిల్లాలో 42 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. అలాగే ఐసీయూ కేంద్రాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడూతూ పటాన్చెరు, సదాశివపేట, గజ్వేల్కు ఐసీయూ కేంద్రాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జోగిపేట, నర్సాపూర్, నారాయణఖేడ్లో ఆసుపత్రుల భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ విభాగం ఈఈ ఎం.రఘును ఆదేశించారు. జిల్లాకు 18 మంది వైద్య నిపుణులు కావాలని సూచించారు. ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. పటాన్చెరు ఆసుపత్రి పనితీరుపై అసంతృప్తి పటాన్చెరు ఆసుపత్రిలో వైద్యుల పనితీరుపై మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జహీరాబాద్లో ఒకే గైనకాలజిస్టు ఉన్నా నెలకు 400వరకు ప్రసవాలు చేస్తున్నారని అన్నారు. పటాన్చెరులో హైరిస్క్ కేంద్రం ఉన్నా ప్రసవాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. పటాన్చెరు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్న రూరల్ హెల్త్ సెంటర్ వైద్యులు వందపడకల ఆసుపత్రిలో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయించాలని మంత్రి లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు. డీసీహెచ్ఎస్పై హరీశ్ ఫైర్ ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల కోఆర్డినేటర్ నరేందర్బాబుపై మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సమీక్ష సమావే శానికి ఇలాగేనా వచ్చేది. ఆప్రాన్ ఏది? చేతిలో పెన్ను పుస్తకం ఏది? మేం ముఖ్యమంత్రి సమీక్షకు వెళ్తే పెన్ను పుస్తకాలు తీసుకుని వెళ్తాం. చెప్పింది రాసుకుంటాం’ అని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను వివరించడంలో నరేందర్బాబు విఫల్యం చెందడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఆర్డీవో పాల్గొన్నారు. -
జయశంకర్.. ఓ దిక్సూచి
మంత్రులు హరీశ్రావు, లక్ష్మారెడ్డి పటాన్చెరులో జయశంకర్ విగ్రహం ఆవిష్కరణ పటాన్చెరు : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రొఫెసర్ జయశంకర్ ఒక దిక్సూచి అని, ఆయన మార్గం అనుసరణీయమని మంత్రులు హరీశ్రావు, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి కొనియాడారు. గురువారం పట్టణంలో జయశంకర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జయశంకర్ ఆశయ సాధన దిశగా బంగారు, హరిత తెలంగాణ సాధించితీరుతామన్నారు. పేదలందరికీ మంచి వైద్యం, వారి ఆర్థిక స్థితి మెరుగు పడేందుకు ప్రాజెక్టులు రావాలని కోరేవారన్నారు. దేశపతి శ్రీనివాస్ ప్రసంగిస్తూ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి పితామహుడని గుర్తు చేశారు. జయశంకర్ సార్ తెలంగాణ తల్లి ఏర్పాటు చేసుకున్న న్యాయవాదని అభివర్ణించారు. ప్రజాకోర్టులో ఆయన తెలంగాణలో జరుగుతున్న అన్యాయంపై జీవితాంతం వాదించారని వివరించారు. జయశంకర్తో ఆయనకున్న గత స్మృతులను గుర్తు చేశారు. రూ. 270 కోట్లతో అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో కోటి రూపాయలు సాధించేందుకు ప్రభుత్వాల చుట్టూ ప్రజాప్రతినిధులు చెప్పులరిగేలా తిరిగేవారని గుర్తు చేశారు. కాని తమ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఒక్క పటాన్చెరుకే రూ. 270 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు వంద పడకల ఆసుపత్రికి ఆర్వో వాటర్ ప్లాంట్ను తన సొంత నిధులనుంచి వెచ్చించి నిర్మిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. జయశంకర్ విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి ప్రసాద్ను మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా సన్మానించారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి శంకుస్థాపన పటాన్చెరులో రూ. రెండు కోట్లతో నిర్మించనున్న జీహెచ్ఎంసీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పటాన్చెరు మైత్రిగ్రౌండ్స్లో రూ. రెండు కోట్లతో అధునాతన స్టేడియం నిర్మాణం కోసం మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎంజీ రోడ్డు నాలుగు లేన్లుగా వేసేందుకు మరో శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ పటాన్చెరు ఆర్అండ్బీ అతిథిగృహానికి రూ. 1.40 కోట్లతో కొత్త భవంతిని త్వరలో నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, రవీందర్రెడ్డి, బీహెచ్ఈఎల్ మాజీ యునియన్ నాయకులు ఎల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు గాలిఅనిల్కుమార్, ఆర్.కుమార్ యాదవ్, వంగరి అశోక్, జడ్పీటీసీ ప్రభాకర్, జీహెచ్ఎంసీ డిప్యూటి కమిషనర్ విజయలక్ష్మీ, నియోజక వర్గ స్థాయి నాయకులు, అన్ని గ్రామాల సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ముగిసిన పుష్కర పండుగ
పన్నెండేళ్లకొచ్చిన పుష్కరాలు.. గోదారి వైపు సకల జన పరుగులు.. పన్నెండు రోజుల పుణ్యస్నానాలు.. లక్షలాదిగా భక్తజన హారతులు.. గంగమ్మ తీరం జనతీర్థంగా.. మంగపేట మురవంగా.. రామన్నగూడెం రాజసంగా.. ముల్లకట్ట మురిపెంగా.. ఉట్టిపడిన సంప్రదాయం.. సమ్మక-సారలమ్మకు వందనం.. హేమాచలుడికి నీరా‘జనం’.. కాకతీయ కళను చాటిన రామప్ప దర్శనం.. గోదావరి పుష్కర మహోత్సవాలు శనివారం వైభవంగా ముగిశారుు. మంగపేటలో డిప్యూటీ సీఎం శ్రీహరి, జెడ్పీ చైర్పర్సన్ పద్మ, ఎమ్మె ల్యే ధర్మారెడ్డి, కలెక్టర్, ఎస్పీ పూజలు చేశారు. పూజారులు గోదారమ్మకు సంధ్యాహారతి ఇచ్చి, పన్నెండేళ్లకు కలుద్దామని బై..బై చెప్పారు. ముగిసిన పుష్కర మహోత్సవాలు - గోదావరి తల్లికి సంధ్యా హారతితో ఘన వీడ్కోలు - మంగపేటలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎంపీ కవిత పూజలు - హాజరైన జెడ్పీ చైర్పర్సన్ పద్మ, ఎమ్మెల్యే ధర్మారెడ్డి సాక్షి, హన్మకొండ : గోదావరి పుష్కర పండుగ ముగిసింది. చివరిరోజు శనివారం వరకు జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్ట ఘాట్లలో సుమారు 25ల క్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారని అధికారులు అంచనా వేశారు. 12రోజుల పాటు పో లీసులు, రెవెన్యూ అధికారులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు ‘పుష్కర’ సేవలో నిమగ్నమయ్యాయి. అగ్రస్థానంలో మంగపేటఘాట్ గోదావరి నదిలోని రామన్నగూడెం, ముల్లకట్ట తది తర ప్రాంతాల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో తక్కువ సంఖ్యలోనే భక్తులు పుష్కర స్నానా లు ఆచరించారు. అరుుతే, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న మంగపేట ఘాట్ వద్ద 90శాతం మంది పుణ్యస్నానాలు చేశారు. మంగపేట్తోపాటు రామన్నగూడెం, మంగపేటలోనూ నీటి నిల్వలు ఉన్న ప్రాంతం లో చలువపందిళ్లు, మహిళలు బట్టలు మార్చుకునే గదు లు ఏర్పాటు చేశారు. డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ అజ్మీరా సీతారాయం నాయక్ స్వయంగా ఏర్పాట్లు పర్యవే క్షించారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జేసీ ప్రశాంత్ జీవన్ పాటి ల్, ములుగు ఆర్డీవో మహేందర్జీ, ఐటీడీఏ పీవో అమయ్కుమార్ ఘాట్ల వద్దే మకాం వేశారు. పోలీసుల అంకితభావం వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్కిశోర్ఝా 12 రోజు ల పాటు పుష్కరఘాట్ల వద్దే ఉంటూ భక్తుల సేవలో నిమగ్నమయ్యూరు. భక్తులు వదిలేసిన వ్యర్థ్యాలు, చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుధ్య కార్మికు లు వందలాదిమంది పుష్కరఘాట్లు, గోదావరి తీ రంతోపాటు సమీప గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో విశ్రమించకుండా పనిచేశారు. నీటిలో దిగి స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా సుమారు 90 మంది గజఈత గాళ్లు అనునిత్యం కంటికి రెప్పలా కాపలాకాశారు. జనహారతి మంగపేట : పన్నెండు రోజుల్లో గోదావరితో కలి సి సుమారు 25 లక్షల మంది భక్తులను దీవిం చిన పుష్కరుడు శనివారం సెలవు తీసుకున్నా డు. ప్రభుత్వం తర ఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 5.35 గంటలకు శాస్త్రోక్తంగా పుష్కరాలకు సమాప్తం పలికారు. శ్రీసూక్త పద్ధతి న హేమాచల నర్సింహస్వామి, ఉమాచంద్రశేఖ రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, సుదర్శన అళ్వార్, గంగమ్మకు షోడ శోపచార పూ జలు నిర్వహించారు. అనంతరం తలపై హేమాచల లక్ష్మీనర్సింహస్వామి శఠారి, పాదుకలు త లపై ధరించిన కడియం గోదావరి వైపు అడుగు వేశారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ వాకాటి కరుణ ఆయన ముందు నడిచి గోదారమ్మకు చీరసారెలు సమర్పించారు. అనంతరం వీరు జల్లుస్నానం చేయడంతో పుష్కరాలు ముగి సినట్లరు్యంది. అర్చకులు విస్సావఝ్జల నరేశ్శర్మ, కొయ్యాడ శివరాం, వెంకటనారాయణ, రాజీవ్నాగశర్మ ఆధ్వర్యంలో గోదావరి మాతకు సంధ్యాహారతినిచ్చారు. -
‘జల’కాల కళకళ
గౌతమీ తీరం భక్తజన సంద్రం గోదావరి పుష్కరాలు తుది దశకు చేరారుు. నేడు మహాపుష్కరాలకు ముగింపు పలికేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భక్తులు భారీగా తరలిరావచ్చని అంచనా వేస్తున్నారు. పుష్కరాల 11వ రోజు శుక్రవారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భద్రాచలం, పర్ణశాల, మోతె ఘాట్లు కిటకిటలాడారుు. సారపాక యూగశాల నుంచి వైష్ణవ, నాగసాధువులు తరలివచ్చి పుష్కరస్నానం ఆచరించారు. కేసీఆర్ తనయ, నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పుష్కరపూజలు చేశారు. పిండప్రదానాలు, దానధర్మాలు యథాతథంగా కొనసాగారుు. భారీగా తరలివచ్చిన భక్తుల పుణ్యస్నానాలతో గోదావరి తీరం కళకళలాడింది. భద్రాచలం నుంచి సాక్షి బృందం : గౌతమీ తీరం భక్తజన సంద్రంలా మారింది.. పుష్కర స్నానంతో పుణ్యపలం అందుకోవాలని తరలివచ్చిన భక్తులతో నది పోటెత్తింది. వచ్చిపోయే వాహనాలతో జిల్లా రహదారులు రద్దీగా మారాయి. గోదావరి మహాపుష్కరాలలో భాగంగా 11వ రోజు శుక్రవారం జిల్లాలోని 8 ఘాట్లలో 4.5 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కొత్తగూడెం వద్ద ప్రైవేట్ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. ఖ మ్మం నుంచి వస్తున్న వాహనాలను కొత్తగూడెం ప్రకా శం స్టేడియంలో మూడుగంటల పాటు ఉంచారు. ఆ తర్వాత విడతల వారీగా తరలించారు. భద్రాచలంలోని ఘాట్లకు అత్యధికంగా 2 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. సారపాక వద్ద ఏర్పాటు చేసిన మోతె ఘాట్, పర్ణశాల ఘాట్లో కలిపి రెండు లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. సాధువుల పుష్కరస్నానాలు.. సారపాక యాగశాలలో యజ్ఞం నిర్వహిస్తున్న నాగ సాధువులు, వైష్ణవ సాధువులు భద్రాచలం ఘాట్లో పుష్కరస్నానం చేశారు. సాధువుల రాకను పురస్కరించుకొని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ ఘాట్ను పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. స్నానమనంతరం సాధువులు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం ఈవో కూరాకుల జ్యోతి సాధువులతో కొద్ది సేపు ముచ్చటించింది. యాగశాలలో ఏర్పాట్లు సక్రమంగా లేవని ఈవోకు సాధువులు ఫిర్యాదు చేశారు. మోతె ఘాట్లో ఎంపీ కవిత పుష్కర పూజలు.. కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవి త, డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జడ్పీ చైర్పర్సన్లు తుల ఉమ, గడిపల్లి కవిత, గద్దెల పద్మ, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత బూర్గంపాడు మండలం మోతెఘాట్ లో పుష్కర పూజలు చేశారు. అక్కడ్నుంచి నేరుగా ప ర్ణశాలకు వెళ్లి అక్కడి దేవాలయాన్ని దర్శించుకున్నా రు. తిరిగి భద్రాచలం చేరుకొని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పర్ణశాల ఘాట్లో జిల్లా కలెక్టర్ ఇలంబరితి సతీసమేతంగా పుష్కరస్నానం ఆచరించారు. సత్తుపల్లి ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య మణుగూరు మండలం చిన్నరావిగూడెం ఘాట్లో పుష్కరస్నానం చేశారు. 6 అడుగుల మేర పెరిగిన నదీ నీటిమట్టం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చర్ల మండలంలోని తాలిపేరుకు భారీగా వరదనీరు చేరింది. ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో 14 గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. సుమారు 6 అడుగుల మేరకు నీటి మట్టం పెరగడం వల్ల ఘాట్ల సమీపం వరకు నీరు వచ్చింది. భక్తులను కొద్ది దూరం మేరకు మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. -
ఇదేం ఆస్పత్రి..!
పాపన్నపేట : అటెండెన్స్ రిజిష్టర్ లేదు.. డాక్టర్లులేరు.. 11 మంది సిబ్బందికి ముగ్గురే ఉన్నారు. ఇలాంటి ఆస్పత్రిలో నిరుపేదలకు ైవైద్యసేవలు ఎలా అందజేస్తారంటూ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహం రెండు గంటలకి కూడా డాక్టర్ రాకపోవడంపై ఆమె మండి పడ్డారు. ఆస్పత్రిలో 11 మంది సిబ్బంది ఉండగా, ఒక నేత్రవైద్యుడు, నర్స్, మరో ఉద్యోగి మాత్రమే విధులకు హాజరు కావడంపై ఆమె విస్తుపోయారు. అటెండెన్స్ రిజిష్టర్ తీసుకరమ్మని సిబ్బందిని ఆదేశించగా, వారు అరగంటకు పైగా వెతికి ఖాళీ చేతులతో తిరిగివచ్చారు. దీంతో పద్మాదేవెందర్రెడ్డి తమాషా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అందుతున్న సేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన సేవలందడంలేదంటూ బాధితుల వాపోయారు. దీంతో ఆమె జిల్లా వైద్యాధికారికి ఫోన్చేసి గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతుకుముందు నార్సింగి వద్ద మార్కెట్ కమిటీ నిర్మాణం కోసం భూమిని చదును చేస్తున్న ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఆమె వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవెందర్రెడ్డి, ఎంపీపీ పవిత్ర, వైస్ ఎంపీపీ విష్ణువర్దన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
అవినీతి అడ్డా.. మెదక్ ఖిల్లా ..!
♦ అధికార పార్టీ అండతో జోరుగా వసూళ్ల దందా.. ♦ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డిపై కాంగ్రెస్ నేతల ధ్వజం మెదక్టౌన్ : అవినీతి, అక్రమాలకు, కమిషన్ల వసూళ్లకు మెదక్ ఖిల్లాపై ఉన్న హరిత హోటల్ అధికారిక పార్టీ నేతలకు అడ్డాగా మారిందని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కొండన్ సురేందర్గౌడ్, తోట అశోక్ ధ్వజమెత్తారు. ఆదివారం మెదక్ పట్టణంలోని రాజీవ్ భవన్ వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మనా.. లేక ఆమె భర్త దేవేందర్రెడ్డా.. చెప్పాలన్నారు. ఏడుపాయల జాతర కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ. రెండు కోట్లు ఎటుపోయోయే చెప్పాలని, దీనిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులపైనా చర్యలు తప్పవన్న సీఎం కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. డ డిప్యూటీ సీఎం రాజయ్యను అవినీతి, అక్రమాల పేరుతో తొలగించిన సీఎం కేసీఆర్ పద్మాదేవేందర్రెడ్డిని కూడా తొలగించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే మెదక్ రోడ్డు వెడల్పు వ్యవహరంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో డిప్యూటీ స్పీకర్ను తొలగించుంటే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తామని హెచ్చరించారు. -
భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు
డిప్యూటీ స్పీకర్ ఏటూరునాగారం : గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి శనివారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ను సందర్శించారు. ఘాట్ నుంచి సుమారు కిలో మీటరు దూరంలోని జంపన్నవాగు సమీపంలోకి వెళ్లారు. అక్కడ షామినాయాల వద్ద భక్తుల సౌకర్యాలు, ఇబ్బందులు పరి శీలించారు. ఘాట్ నుంచి నదిలోని నీటి ప్రాంతం వరకు ఇసుక బస్తాలపై కాలి నడకన వెళ్లారు. నదీతీరంలో మరోమూ డు టెంట్లు వేయూలని, నీటిసౌకర్యం కల్పించాలని ఆర్డీవో మహేందర్జీని ఆదేశించారు. ఘాట్కు కొద్ది దూరంలోని మూలమలుపు వద్ద నీటి ఉధృతి ఉం దని, అక్కడ ఘాట్ నిర్మిస్తే బాగుండేదని డిప్యూటీ సీఎంతో అన్నారు. రామన్నగూడెం ఘాట్ను సందర్శించిన ఎంపీ సీతారాంనాయక్.. అధికారులు భక్తుల సేవ లో నిమగ్నం కావాలని ఆయన కోరారు. -
పారిశ్రామికవేత్తలకు పవర్
కేసీఆర్ ప్రకటనతో కొత్త ఊపు ♦ 24 గంటలూ ఇక కరెంట్ కోతలుండవని భరోసా ♦ కొడకంచిలో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రారంభం ♦ పలుచోట్ల మొక్కలు నాటిన సీఎం పటాన్చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన పారిశ్రామికవేత్తల్లో కొత్త జోష్ను తెచ్చింది. పారిశ్రామిక రంగానికి 24 గంటలూ కరెంటు సరఫరా ఉంటుందని, ఇక కోతలు ఉండవని ప్రకటించడం వారిలో ఆనందాన్ని నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం పటాన్చెరు, జిన్నారం మండలాల్లో పర్యటించారు. మొదట పాశమైలారం పారిశ్రామికవాడలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. రుద్రారంలోని ఎంఎస్ఎన్, తోషిబా పరిశ్రమ ఆవరణలోనూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయా పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. ఆయన పర్యటన ఆద్యంతం గోప్యంగా సాగింది. పర్యటన షెడ్యూల్ ప్రకారం జరగలేదు. ఉదయం 11.45కి పటాన్చెరులోని ఈద్గాకు చేరుకుని మొక్కలు నాటి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తరువాత జిన్నారం మండలం కొడకంచిలో కొత్తగా ఏర్పాటుచేసిన డెక్కన్ ఆటో పరిశ్రమను ప్రారంభించారు. అక్కడ జరిగిన సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోనే నంబర్వన్ పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చామని, పారిశ్రామికవేత్తలు తెలంగాణలో భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. హరితహారం పథకాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు. తెలంగాణ అంతా పచ్చదనం పరచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశం అనంతరం పాశమైలారం పారిశ్రామికవాడకు వెళ్లారు. ఆ తరువాత రుద్రారంలో భోజనం చేసుకుని 2.15 నిమిషాలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఆరోగ్యం సరిగ్గా లేదంటూనే ఆయన ఈ పర్యటనను విజయవంతంగా ముగించారు. ఇదిలా ఉండగా పటాన్చెరు దర్గా వద్ద స్థానిక ముస్లిం పెద్దలు సీఎంను సన్మానించారు. వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు కేసీఆర్కు బెలూన్లు పట్టుకొని స్వాగతం పలికారు. మొక్కలు నాటిన తరువాత కేసీఆర్ బెలూన్లను గాల్లోకి వదిలారు. ఉదయం 10.30 గంటలకే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు దేశపతిశ్రీనివాస్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈద్గా వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అయితే కేసీఆర్ నేతలతో కరచాలనం చేసి స్థానిక నాయకులను పలుకరిస్తూ ముందుకు సాగారు. -
ఇష్టారాజ్యం!
నెలన్నర రోజులుగా కార్మికులకు అందని వేతనాలు ఆరునెలలుగా బిల్లులకు నోచుకోని రైతులు ఎన్డీఎస్ఎల్ తీరుపై కార్మికులు, కర్షకుల గుర్రు త్వరలో సమస్యలు తీరుస్తామంటున్న డిప్యూటీ స్పీకర్ మెదక్ రూరల్ : నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం మొండివైఖరి కారణంగా అటు కార్మికులు, ఇటు కర్షకులు అవస్థలు పడుతున్నారు. నెలన్నర రోజులుగా జీతాలు లేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. చెరకును ఫ్యాక్టరీకి తరలించి ఆరు నెలలు కావస్తున్నా బిల్లులు అందక రైతులు సతమతమవుతున్నారు. ఈ యేడు ఎన్డీస్ఎల్ 95 వేల టన్నుల చెరకును గానుగాడించింది. ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించడంతో రైతులు చెరకును ఇతర ఫ్యాక్టరీలకు తరలించారు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య కూడా 170కి పడిపోయింది. ఫ్యాక్టరీలో వాటాను కొనుగోలు చేసిన దక్కన్ పేపర్ మిల్లు యజమాని ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ అటు కార్మికులను ఇటు కర్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కార్మికులకు ప్రతినెలా ఒకటి నుంచి ఏడో తేదీ మధ్య జీతాలు ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం నెలన్నర రోజులైనా వేతనాలు అందని పరిస్థితి. ఫలితంగా కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. క్రషింగ్కు సంబంధించిన డబ్బులు రైతులకు రూ.21 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.7కోట్లు మాత్రమే చెల్లించారు. మరో రూ.14 కోట్లు బకాయిలున్నాయి. ఆరు నెలలు కావస్తున్నా బిల్లులు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ యేడు 75 వేల క్వింటాళ్ల చక్కెరను యాజమాన్యం విక్రయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఫ్యాక్టరీలో నిలువ ఉన్న చక్కెర కేవలం 9 వేల క్వింటాళ్లు మాత్రమేనని తెలిసింది. రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరిగినందున మిగతా చక్కెరను విక్రయించరాదని కేన్ కమిషనర్ నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశాలు అందినట్లు తెలిసింది. అయినప్పటికీ యాజమాన్యం స్పందించక పోవడంతో అటు కార్మికులు, ఇటు కర్షకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండుసార్లు వేతన సవరణను ఎగ్గొట్టారు... నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంది. ఫ్యాక్టరీ యజమాన్యం ఇప్పటికే రెండుసార్లు వేతన సవరణను ఎగ్గొట్టింది. ఈ విషయమై లేబర్ కమిషనర్కు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. - ముక్తార్ హైమద్, టీఎంఎస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి అర్ధాకలితో అలమటిస్తున్నాం... అసలే అరకొర వేతనాలు. ఆ వేతనాలు కూడా సరిగా రావడం లేదు. నెలన్నరైనా జీతాలు రాకపోవడంతో మా కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. యాజమాన్యం స్పందించి వెంటనే వేతనాలు చెల్లించాలి. - సత్తయ్య, ఎన్డీఎస్ఎల్ కార్మికుడు వారం రోజుల్లో బిల్లులు.. వారం రోజుల్లో చెరకు రైతులకు బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం టన్ను చెరకు ధరను రూ.2,260 కన్నా ఎక్కువగా ఇవ్వనని మొండికేస్తే సీఎం కేసీఆర్ రైతుల బాగుకోరి టన్నుకు రూ.340 చొప్పున ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెల్లించారు. అయినా యాజమాన్యం రైతులకు బిల్లులు చెల్లించ డం లేదు. ప్రభుత్వమే చొరవ తీసుకొని వారం రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించడంతోపాటు కార్మికులకు సైతం వేతనాలు ఇప్పిస్తాం. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీఎం ఆశీస్సులతో రైతులు, కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటాం. - పద్మాదేవేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ -
చెరువులను కాపాడుకుందాం
పునరుద్ధరణ పనులు ఉద్యమంలా చేపడదాం జర్నలిస్టులు చెరువులు దత్తత తీసుకోవడం అభినందనీయం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి కవలంపేటలో చెరువు పనులు ప్రారంభం సంగారెడ్డి రూరల్ : గ్రామాలకు జీవనాధారమైన చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదే వేందర్రెడ్డి అన్నారు. సంగారెడ్డి మండలం క వలంపేట ఊదం చెరువు పునరుద్ధరణకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) దత్తత తీసుకొంది. ఈ చెరువు పూడికతీత పనులను గురువారం డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... గత 60 ఏళ్ల పాలనలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ఫలితంగా చెరువుల ఆధారిత పనులు, వృత్తులు కుంటుపడి వలసలకు దారితీశాయన్నారు. చెరువులను పునరుద్ధరించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టారన్నారు. ఒక్కప్పుడు తెలంగాణలో 262 టీఎంసీల నీరు 18 లక్షల ఎకరాలకు సాగయ్యేదని, చెరువులు నిర్లక్ష్యానికి గురవడంతో ఆ సంఖ్య కేవలం 3 లక్షల ఎకరాలకు పడిపోయిందన్నారు. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టంలో 45 వేల చెరువుల పునరుద్ధరణకు రూ.20 వేల కోట్లను మంజూరు చేసిందన్నారు. పనులు ఉద్యమంలా సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పోలీసు శాఖ కిసాన్సాగర్ చెరువును దత్తత తీసుకోగా జర్నలిస్టులు ఊదం చెరువును దత్తత తీసుకొనేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కవలంపేటలో 33/11 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమైక్య పాలనలో చెరువుల విధ్వంసం: అల్లం నారాయణ సమైక్య పాలనలో చెరువుల విధ్వంసమైనట్టు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వాటి పునరుద్ధరణ యజ్ఞంలా సాగుతోందన్నారు. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంలో పనిచేసిన స్ఫూర్తితో చెరువుల పునరుద్ధరణలో కూడా జర్నలిస్టులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెరువుల దత్తతకు జర్నలిస్టులు ముందుకు రావడం సంతోషకరమని కలెక్టర్ రాహుల్ బొజ్జా అన్నారు. పనులు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ... రూ.14.50 కోట్లతో నియోజకవర్గంలో 36 చెరువుల పనులు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం జర్నలిస్టు వెంకటేశ్గౌడ్ రూపొందించిన మిషన్ కాకతీయ పాటల సీడీని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్, సంగారెడ్డి జడ్పీటీసీ సభ్యుడు మనోహర్గౌడ్, కవలంపేట గ్రామ ఇన్చార్జి సర్పంచ్ రవికుమార్, ఎంపీటీసీ విజయలక్ష్మి, టీయూడబ్ల్యూజే రాష్ర్ట ఉపాధ్యక్షుడు పల్లె రవి, కోశాధికారి మారుతీసాగర్, టీ న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్, జిల్లా నాయకులు యాదగిరి గౌడ్, జానకీరాం, పరుశరాం,యోగానంద్రెడ్డి, విష్ణు, వేణుగోపాల్రెడ్డి, ఆంజనేయులు, ధారాసింగ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు శ్రీనివాస్చారి, విజయేందర్రెడ్డి, నరహరిరెడ్డి, మండల నాయకులు అశోక్, ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యులు చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మెదక్ టౌన్ : దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలన్నారు. దీంతో రైతులకు మద్దతు ధరతో పాటు డబ్బులు త్వరగా వస్తాయన్నారు. ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలు కూడా మార్కెట్ కమిటీలోనే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట ఆర్డీఓ నగేష్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశం గుప్తా పాల్గొన్నారు. దాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు:డిప్యూటిస్పీకర్తో రైతుల మొర మెదక్ రూరల్ : ధాన్యం కొనుగోలు కేంద్రంలో వారం రోజులుగా తూకం వేయడం నిలిపివేశారని, దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో జక్కన్నపేట రైతులు మొరపెట్టుకున్నారు. బుధవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మండల పరిధిలోని జక్కన్నపేటలోని ఓ వివాహనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ గతసంవత్సరం నుండి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం కొనసాగుతున్నప్పటికీ తమకు నిర్వాహకులు కొనుగోలు ప్రతం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే తూకం వేయడం నిలిపి వేశారని వారు డిప్యూటీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి, కొనుగోలు పత్రాలను ఇప్పిస్తానని హమీ ఇవ్వటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఇంట్లో కూర్చోని జీతాలు తీసుకుంటున్నారా?
►క్షేత్రస్థాయిలో సమస్యలు పట్టవా? ►జీహెచ్ఎంసీ ఉప కమిషనర్పై డిప్యూటీ స్పీకర్ ఫైర్ ►స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొన్న పద్మాదేవేందర్రెడ్డి రామచంద్రాపురం : ‘ప్రజా సమస్యలు పట్టవా?.. మీరు ఉన్నది ఎందుకు?.. ఇంట్లో కూర్చోని జీతాలు తీసుకోవడానికా?’ అంటూ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్పై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మండిపడ్డారు. తీరు మారకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా మంగళవారం రామచంద్రాపురంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పర్యటించారు. మొదట పాత రామచంద్రాపురానికి వచ్చిన వారితో స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనేక ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉపకమిషనర్కు అనేకసార్లు ఫిర్యాదు చేసినా కనీసం వచ్చి చూడలేదని, ఆమె కార్యాలయానికి ఆనుకొని ఉన్న తమ పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా చోట్ల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె అక్కడే ఉన్న ఉపకమిషనర్ విజయలక్ష్మిపై మండిపడ్డారు. ‘మీరు ఇంట్లో కూర్చుని జీతాలు తీసుకుంటున్నారా?’ అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలు రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్న ఈ సమస్య పట్టలేదా? అని ఉపకమిషనర్ను నిలదీశారు.ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకొని క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజాసమస్యలు పరిష్కరించాలని సూచించారు. ‘ఎక్కడికెళ్లినా ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారని, మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ స్పీకర్ స్థానికులకు సూచించారు. బయట చెత్త వేసిన వారికి జరిమానా విధించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె ఎల్ఐజీ కాలనీలోని చెత్తను ట్రాక్టర్లో పోశారు. స్థానికుల వినతిపత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్, నాయకులు ఆదర్శ్రెడ్డి, కుమార్గౌడ్, మోహన్రెడ్డి, బురుగడ్డ నగేష్, పృథ్వీ, తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ తెలంగాణ.. అచ్ఛా మెదక్
పట్టణం రూపురేఖల్ని మారుద్దాం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి పట్టణంలో ‘స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ’ మెదక్ టౌన్ : నాలుగేళ్లలో మెరుగైన ప్రణాళికలతో మెదక్ పట్టణం రూపురేఖలు మారుస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘అచ్ఛా మెదక్.. స్వచ్ఛ తెలంగాణ’ నినాదంతో మెదక్ ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్నారు. పట్టణాన్ని 9 సెక్టార్లుగా విభ జించి 27 వార్డుల్లో కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామన్నారు. రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం కోసం పట్టణానికి రూ.16 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. మంచినీటి కోసం రూ.25 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. ఖిల్లాపై భారీ ట్యాంకు నిర్మించి ప్రతి ఇంటికి తాగునీరందిస్తామన్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రజల అవసరాలకు సరిపోవట్లేదని, మరో రెండు మార్కెట్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. 4 ఎకరాల స్థలంలో వైకుంఠధామం (శ్మశానవాటిక) ఏర్పాటు చేస్తామన్నారు. భౌతికకాయాలను తరలించేందుకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో రూ.12 లక్షలతో వైకుంఠ రథాన్ని కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలకు మొదటి విడతగా 800 మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. 400 మందికి ప్రస్తుతం మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్డీఓ మెంచు నగేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ పథకాల్లో అధికారులంతా భాగస్వాములు కావాలని పిలునిచ్చారు. మెదక్ ఏరియా ఆస్పత్రిని దత్తత తీసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని డీఎస్పీ రాజారత్నం తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి లబ్ధిదారులకు మరుగుదొడ్ల నిర్మాణ పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటి, చెత్తా చెదారాన్ని ట్రాక్టర్లలో నింపి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కమిషనర్ వెంకటేశం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫాజిల్, మహిళ అధ్యక్షురాలు జెల్ల గాయత్రి తదితరులు పాల్గొన్నారు. -
పని చేయకపోతే వెళ్లిపోండి
ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి వైద్యులపై ఆగ్రహం రామాయంపేట : విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఇక్కడి నుంచి బదిలీ చేయించుకొని వెళ్లిపోవాలని, ఇక్కడే పని చేయాలనుకుంటే బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను హెచ్చరించారు. శుక్రవారం ఆమె రామాయంపేట ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలను వాకబు చేశారు. తమకు సరైన వైద్యం అందడంలేదని పలువురు పద్మాదేవేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వైద్యులపై మండిపడ్డారు. గురువారం రాత్రి జప్తి శివునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో వైద్యసేవలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఒకరు చనిపోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని డిప్యూటీ స్పీకర్ కోపోద్రిక్తులయ్యారు. జాతీయ రహదారిపై రాత్రి వేళలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయని డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇందుకు సిద్ధంగా లేనివారు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకొని వెళ్లాలన్నారు. ఆమె వెంట ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, సర్పంచ్ పాతూరి ప్రభావతి, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి తదితరులు ఉన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయం
చిన్నశంకరంపేట: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ తమది రైతు ప్రభుత్వమైనందున వారికి మేలు చేసే చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోకూడదనే, పంట చేతికొచ్చే ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు సహకార సంఘాల ఆధ్వర్యంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. దళారులను నమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రం లోనే రైతులు ధాన్యం విక్రయించాలన్నారు. ధాన్యం విక్రయించిన 72 గంటల్లో నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమచేస్తారన్నారు. వడగళ్ల వానలతో రైతులు నష్టపోతే వెంటనే అధికారులతో పంటనష్టం వివరాలు సేకరించామని, వారికి నెల రోజుల్లో పరిహారం అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యమని ఆ దిశగా సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట ఎంపీపీ అధ్యక్షుడు కృపావతి, స్థానిక సర్పంచ్ కుమార్గౌడ్, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ జైసింగ్, తహశీల్దార్ నవీన్కుమార్,ఎంపీడీఓ రాణి, ఐకేపీ ఏపీఎం ఇందిర, సర్పం చ్లు సాన సత్యనారాయణ, నర్సమ్మ, అంజయ్య, సొసైటీ చైర్మన్లు శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాజు, నరేందర్, రమేష్, సుధాకర్, సిద్దిరాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్డీఎస్ఎల్కు మంచి రోజులు మెదక్ రూరల్: నిజాం దక్కన్ షుగర్(ఎన్డీఎస్ఎల్) ఫ్యాక్టరీకి మంచిరోజులు వచ్చాయని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆమె లింగ్సాన్పల్లి, మాచవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాక్టరిని స్వాధీనం చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ఓ కమిటీ నియమించారని, ఈ కమిటీ ఫ్యాక్టరీని ఎలా స్వాధీనం చేసుకోవాలనే అంశంపై చర్చిస్తుందన్నారు. అలాగే రైతులకు చెల్లించాల్సిన రూ.21 కోట్లకు గాను కేవలం రూ. 7కోట్లు మాత్రమే యాజమాన్యం చెల్లించిదని ఆ డబ్బులను సైతం వారం రోజుల్లో రైతులకు చెల్లించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఒకవేళ ఆడబ్బులను ఫ్యాక్టరీ యజమాని సకాలంలో చెల్లించకుంటే ప్రభుత్వమే చెల్లించి కంపెనీకి ఇచ్చే డబ్బుల్లో మినహాయించుకుంటుందన్నారు. ఫ్యాక్టరీని సొసైటీ ద్వారా నడిపించేందుకు రైతులకే అప్పగిస్తామన్నారు. దీంతో రైతులకు ఫ్యాక్టరీ కార్మికులందరికి మంచి రోజులు వచ్చాయన్నారు. అంతకు ముందు గ్రామంలో ఎన్డీఎస్ఎల్ కార్మికులు పూలమాలతో డిప్యూటీ స్పీకర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్య, పార్టీ మండల అధ్యక్షుడు అంజాగౌడ్ పాల్గొన్నారు. -
శాశ్వత పనులకు సీఎం పెద్దపీట
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పాపన్నపేట: సీఎం కేసీఆర్ శాశ్వత ప్రాతిపదికన ఉపయోగపడే పనులకే పెద్దపీట వేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు గురువారం పాపన్నపేట మండలంలోని నార్సింగిలో మిషన్ కాకతీయ కింద చెరువుల పూడిక తీత పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువులు ఉండేవన్నారు. 18లక్షల ఎకరాల పంటలుసాగు అయ్యేవన్నారు. ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం మూలంగా బంగారంలా ఉన్న చెరువులు సాసర్ల మాదిరిగా తయారయ్యాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.20వేల కోట్ల రూపాయలతో మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టారన్నారు. నియోజకవర్గంలో 86 చెరువుల మరమ్మతులకు రూ.15కోట్లు మంజూరైనట్లు చెప్పారు. పనులు కూడా ప్రారంభించామన్నారు మరో విడతగా వంద గ్రామాల్లో 176 చెరువుల పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం చేపట్టిన నార్సింగి గ్రామ చెరువుకు 68 ఎకరాల ఆయకట్టు ఉందని, 25ఎకరాల శిఖం భూమి ఉన్నట్లు తెలిపారు. ఈ పనులకు గ్రామ రైతులు సహకరించి, చెరువు మట్టి పంట పొలాల్లోకి తరలించుకోవాలన్నారు. తద్వారా సారవంతమైన భూమిగా మారుతుందన్నారు. దీంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. గతంలో రైతులు చెరువు మట్టిని వినియోగించి 30 శాతం అధిగ దిగుబడులు సాధించేవారన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు వాడకం పెరగడంతో 50యేళ్లకే వృద్ధులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచులు నీటికోసం తిప్పలు పడకుండా సీఎం కేసీఆర్ వాటర్గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పాపన్నపేట మండల కేంద్రంతోపాటు యూసుఫ్పేట, కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం పాపన్నపేటలో అర్ధంతరంగా ఆగిన పలు ప్రభుత్వ భవనాలను ఆమె పరిశీలించారు. ఆమె వెంట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి, ఎంపీపీ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్నబాలగౌడ్, వైస్ఎంపీపీ విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాపూరావు, నార్సింగి సర్పంచ్ కిష్టయ్య, ఎంపీటీసీ చంద్రకళ, డీసీసీబీ డెరైక్టర్ మోహన్రెడ్డి, కొత్తపల్లి ఎఫ్ఏసీఎస్ చైర్మన్ దేశ్యనాయక్, ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ రాములు తదితరులు పాల్గొన్నారు. . -
ఉద్యమంలా.. చెరువుల అభివృద్ధి
⇒ మిషన్ కాకతీయతో నీటి వనరులకు మహర్దశ ⇒ పూడికతీత మట్టితో పొలాలకు భూసారం ⇒ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ⇒ రాయినిపల్లి పాత చెరువులో పూడికతీత ప్రారంభం ⇒ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మెదక్రూరల్: చెరువుల అభివృద్ధిని ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గ్రామ ఉమ్మడి ఆస్తి అయిన చెరువు, కుంటలను కాపాడుకుంటేనే భవిష్యత్తు అంతా బాగుంటుందన్నారు. ఆదివారం ఆమె మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా రాయినిపల్లి పాత చెరువులో పూడిక తీత పనులను ఆమె ప్రారంభించారు. స్వయంగా పలుగు పట్టి మట్టితవ్వారు. తట్టలతో మట్టిని ట్రాక్టర్లో పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడారు. చెరువు అనేది తల్లిలాంటిదన్నారు. చెరువుల్లో పూడిక తీసి ఆ మట్టిని రైతుల పొలాలకు కొట్టేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నార న్నారు. చెరువుల మట్టిని పొలంలో వేస్తే భూసారం గణనీయంగా పెరిగి రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. కట్టల బలోపేతం, తూములు, అలుగులు, పంట కాలువలు, గైడ్వాల్స్ తదితర వాటి మరమ్మతుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసిందన్నారు. చెరువులు నిండితే ఆయకట్టు భూములన్నీ సస్యశ్యామలంగా మారుతాయన్నారు. తెలంగాణలో 45 వేల చెరువులున్నాయని, వీటిని ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొదటి విడతలో భాగంగా ప్రతి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం లభించేలా 9 వేల చెరువుల మరమ్మతులకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ఒకప్పుడు చెరువు, కుంటల ఆధారంగా 18 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తే చెరువు, కుంటలు పూడుకుపోవడంతో నేడు కేవలం 2 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతున్నాయన్నారు. ఇప్పుడైతే స్వచ్ఛమైన కల్లు దొరకడం లేదు.. చెరువు కట్టలు బలోపేతమైతే వాటిపై ఈత చెట్లు పెట్టుకునే వీలుంటుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. దీంతో స్వచ్ఛమైన కల్లు దొరుకుతుందని.. అదే సమయంలో గౌడ కులస్తులకు జీవనోపాధి లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం స్వచ్ఛమైన కల్లు లేదని అంతా మందు కల్లే దొరుకుతుందన్నారు. చెరువులు నిండితే మత్స్యకారులకు సైతం చేపలు పెంచుకునే వీలుంటుందని, వారికీ జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. వర్షాలు పుష్కలంగా కురిసేందుకు వీలుగా చెట్లను పరిరక్షించడంతోపాటు మొక్కలను విరివిగా పెంచేందుకు సీఎం ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలో 3.50 కోట్ల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ పొలం గట్లు, బీడు భూములు, ఇంటిపరిసరాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం రాయినిపల్లి పాతచెరువులోనే కార్యకర్తలు, ప్రజలతో ఆమె సహపంక్షి భోజనం చేశారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. మెదక్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం రూ.3.37 కోట్లు మంజూరయ్యాయి. వీటికోసం డిప్యూటీ స్పీకర్ శంకు స్థాపనలు చేశారు. బాలానగర్, తిమ్మక్కపల్లి, పిల్లికొట్టాల్, శివ్వాయిపల్లి, వెంకటాపూర్ రోడ్లకు ఆమె శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీపీ లక్ష్మి కిష్టయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి, నాయకులు కిష్టయ్య, అంజాగౌడ్, శ్రీనివాస్రెడ్డి, సాయిలు, శ్రీనివాస్, యాదగిరి, సిద్ధిరాములు, నాగులు, సాంబశివరావుతోపాటు ఇరిగేషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జనారణ్యమే..
ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం జాతరను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ చలిగంగ స్నానాలు.. శివసత్తుల సిగాలు జనసంద్రంగా.. మంజీర తీరం దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు పాపన్నపేట : ఏడుపాయలకు జనం పోటెత్తారు.. ఎటు చూసినా జనమే జనం.. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యాటక ఉత్సవమైన ఏడుపాయల జాతర మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డిలు దుర్గమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించి, జాతర ప్రారంభించారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గా భవానీ జాతర మంగళవారం వైభవంగా మొదలైంది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జెడ్పీచైర్పర్సన్ రాజమణి ఉదయం 10గంటలకు ఏడుపాయలకు చేరుకున్నారు. పాలక మండలి చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఈఓ వెంకట కిషన్రావులు ఆలయ మర్యాదల ప్రకారం వారికి స్వాగతం పలి కారు. అనంతరం కార్యనిర్వహణ అధికారి కార్యాలయం నుంచి పట్టువస్త్రాలను తీసుకెళ్లి దుర్గమ్మ తల్లికి సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల వేదిక వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి జాతర ప్రారంభమైనట్లు ప్రకటించారు. మూడు రోజులపాటు జరిగే ఈ జాతర కోసం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాల నుంచి అశేష ప్రజానీకం తరలివచ్చింది. విశేష అలంకరణ.. అశేష జనవాహిని... ఎరుపురంగు పట్టు చీర, భారీ పూలదండలతో అమ్మవారిని ఆకర్షణీయంగా అలంకరించారు. జాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తెల్లవారు జామునే లారీలు, బస్సులు,ట్రాక్టర్లు, ఆటోలు, ఎడ్లబళ్లపై ఏడుపాయలకు చేరుకున్నారు. మంజీరనదిలో చలిగంగా స్నానాలు చేసిన భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఘనపురం ఆనకట్ట తీరం, చెక్డ్యాం, ఆలయం ముందు బ్రిడ్జి ప్రాంతాలు, ఫౌంటెన్ల వద్ద స్నానాలు చేసే భక్తులతో మంజీర తీరం కిటకిటలాడింది. అనంతరం భక్తులు శివదీక్షలు చేపట్టారు. హోరెత్తిన సందడి.. కొంతమంది మహిళలు సిగాలు ఊగుతూ దుర్గామాతకు జై అంటూ డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వచ్చి దుర్గమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది బోనాల ఊరేగింపు నిర్వహించగా, ఇంకొంతమంది తలనీలాలు, ఒడిబియ్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం పూట భక్తు ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ రానురాను సాయంత్రానికి జనం తాకిడి ఎక్కువైంది. చెక్డ్యాం, ఘనపురం ఆనకట్ట, నాగ్సాన్పల్లి దారులన్నీ ఏడుపాయలకే అన్నట్లు జనంతో కిటకిట లాడాయి. భక్తులకు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా మెదక్ డీఎస్పీ రాజారత్నం ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వాహనాలన్నింటిని చెలిమల కుంటలోని మైదానంలోనే పార్కింగ్ చేయిస్తున్నారు. దీంతో జాతరలో ఎలాంటి ట్రాఫిక్ అం తరాయం ఏర్పడటం లేదు. అమ్మవారి ఆల యం ముందు కూడా రెండు బ్రిడ్జిలను భక్తుల రాకపోకలకనుగుణంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. దీంతో ఎలాంటి ఇబ్బం దులు కలగడం లేదు. స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లు నిరంతరం పహారా కాస్తూ.. భక్తులు లోతైన ప్రదేశంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పంచాయతీ సిబ్బంది జాతరలో కనీసం కాగితం కూడా కనిపించకుండా నిరంతరం శుభ్రం చేస్తున్నారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు జాతరలో మకాంవేసి ఘనపురం నీటిని క్రమబద్ధం గా వదులుతున్నారు. వైద్యులు తమ సేవలందిస్తున్నారు. ఏడుపాయల పాలక వర్గ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఈఓ వెంకటకిషన్రావు, ధర్మకర్తలు జాతరలో నిరంతర సేవలందిస్తున్నారు. జాతరలో మరింత భద్రత చర్యలు ఏడుపాయల జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. అలాగే అమ్మవారి ఆలయం వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్, మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఏడుపాయల్లో మకాం వేసి భక్తులకు సేవలందిస్తున్నారు. భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో వాటర్ ప్యాకెట్ల పంపిణీ పాపన్నపేట:ఏడుపాయల జాతరకు తరలివచ్చిన భక్తుల కోసం భారతి సిమెంట్ ఆధ్వర్యంలో లక్ష వాటర్ ప్యాకెట్లను ఉచితంగా అందజేశారు. జాతరలోని అమ్మవారి ఆలయం ముందు, స్థానిక బస్టాండ్ ఆవరణలో రెండు క్యాంపులు ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా దుర్గమ్మ తల్లి దర్శనార్థం క్యూలైన్లలో నిలబడ్డ భక్తులు ఈ వాటర్ ప్యాకెట్లతో సేదదీరారు. మూడేళ్లుగా భారతి సిమెంట్ ఆధ్వర్యంలో ఏడుపాయలో ఉచితంగా వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్ మార్కెటింగ్ మేనేజర్ పి.ఎస్. కరునాకరణ్, టెక్నికల్ మేనేజర్ ఓబుల్రెడ్డి, సతీష్కుమార్, లీడర్లు రాలింగేశ్వర ట్రేడర్స్ లింగమూర్తి, శ్రీసాయి ట్రెడర్స్ నర్సింలు, బాలాజిసాయిరాం ట్రెడర్స్ సంగారెడ్డి, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పోచారం అభయారణ్యానికి పూర్వవైభవం
నాగిరెడ్డిపేట :నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దులో గల పోచా రం అభయారణ్యంతోపాటు, పోచారం ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామ న్న అన్నారు. అభయారణ్యం వద్ద పర్యావరణ విద్యాకేంద్రా న్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రెండు జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం అభయారణ్యాన్ని శనివారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. అభయారణ్యంలో తిరుగుతూ జింకలను, నెమళ్లను, దుప్పిలను, మనుబోతులను వారు తిలకించారు. చాలా దూరం కాలినడకన తిరిగారు. అభయారణ్యం లోని జంతువుల గురించి ఫారెస్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోచారం ప్రాజెక్టును వారు సందర్శిం చారు. ప్రాజెక్టు వద్ద ఉన్న నిజామాబాద్, మెదక్ జిల్లా అతి థిగృహాలను పరిశీలించారు. వాటికి మరమ్మతులు చేపడతామన్నారు. ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టులను కలిపి పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని చెప్పారు. పర్యావరణ విద్య కేంద్రం పోచారం అభయారణ్యం వద్ద పర్యావరణవిద్య కేంద్రాన్ని(ఎన్విరాల్మెంట్ ఎడ్యూకేషన్ సెంటర్) ఏర్పాటు చే స్తామని అటవీశాఖ, వెనుకబడిన తరగతుల మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అభయారణ్యాన్ని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అటవీశాఖలో ఖాళీగా ఉన్న 2,600 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9 వన్యప్రాణికేంద్రాలు ఉన్నాయన్నారు. పోచారం అభయారణ్యంలో స్థాయికి మించి జంతువుల సంఖ్య పెరిగిందని, ఎక్కువగా ఉన్న జంతువులను ఇతర వన్యప్రాణి కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో అడవులను, వన్యప్రాణులను సంరక్షించుకునేలా చర్యలు చేపడతామన్నారు. అభయారణ్యంతోపాటు ప్రాజెక్టును తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు కలుగకుండా హరిత హోటల్ను ఏర్పాటు చేయిస్తామని ఆయన చెప్పారు. వారి వెంట మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్ధన్గౌడ్ తదితరులు ఉన్నారు. -
జగతి మెచ్చేలా జాతర
ఏడుపాయలకు నిధులు మంజూరు కోటి రూపాయలతో జాతరకు కొత్తకాంతులు తీరనున్న భక్తుల కష్టాలు మెదక్ : వెయ్యేళ్ల చరిత్ర గల ఏడుపాయల జాతరకు మునుపెన్నడూ లేనిరీతిలో రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేందుకు సిద్ధమైంది. తెలంగాణలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన ఏడుపాయల జాతరకు ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు ఎప్పుడు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. కానీ లక్షలాది భక్తులు తరలివచ్చే జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర ప్రాముఖ్యతను, తెలంగాణ సంస్కృతికిని దశదిశలా చాటేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నిధులు విడుదల చేశారు. దీంతో ఈ సారి జాతర కొత్త కాంతులీననుంది. ఈమేరకు జాతర ఏర్పాట్లు ఘనంగా చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. నిధులివ్వని గత పాలకులు దండకారణ్యంలో మంజీరనది ఒడ్డున వెలసిన ఏడుపాయల వనదుర్గ లక్షలాది భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. కాకతీయుల కాలం నుంచి ఏడుపాయల దుర్గా భవాని ప్రాశస్తం పెరిగింది. 2006లో అప్పటి మెదక్ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి కృషి మేరకు టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరి నాగిరెడ్డి ఏడుపాయల జాతరను పర్యాటక ఉత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏటా మాఘ అమావాస్య, మహాశివరాత్రి జాతర, నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి. మహాశివరాత్రి జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. ఏటా సుమారు రూ.2 కోట్ల ఆదాయం ఉంటుంది. అయినప్పటికీ జాతర సందర్భంగా గత ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయలేదు. జాతరకు దేవాదాయ శాఖ తరఫున సుమారు రూ.27 లక్షలు ఖర్చు చేస్తుంటారు. సుమారు 20 ప్రభుత్వ శాఖల అధికారులు వచ్చే కొద్దిపాటి నిధులతోపాటు దేవాదాయ శాఖ చేసే ఆర్థిక సాయంతో జాతర నిర్వహిస్తుంటారు. దీంతో లక్షలాది భక్తులు తరలివచ్చే జాతర అసౌకర్యాలకు అడ్రస్గా మారుతోంది. సేదదీరేందుకు నీడ కరువు ఏడుపాయల్లో మొత్తం 42 షెడ్లు ఉండగా, అందులో దేవాదాయ శాఖకు సంబంధించినవి ఆరు, దాతలు నిర్మించినవి 36 షెడ్లు ఉన్నాయి. జాతర సమయంలో దాతలు విడిది చేయడంతో భక్తులకు ఒక్కషెడ్డుకూడా దొరకని పరిస్థితి నెలకొంటోంది. గత సంవత్సరం జాతర సమయంలో వర్షం పడడంతో భక్తులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా పరుగులు తీసి బండరాళ్ల మాటున తలదాచుకున్నారు. ఇక సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కనీసం వేదిక లేక పోవడంతో ఓ భవనం స్లాబ్పై ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రదర్శనలిస్తున్నారు. స్నానఘాట్లు లేక పోవడంతో మంజీరనదిలో స్నానాలు చేస్తూ భక్తులు మృత్యువాత పడ్డ సంఘటనలు కోకొల్లలు. దుస్తులు మార్చుకునేందుకు గదులు లేక...సరిపడ టాయిలెట్లు లేక మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేకం. తాగునీరు కరువై..గుంతలుపడ్డ రోడ్లతో భక్తులు అనేక అవస్థలు పడుతుంటారు. పార్కింగ్ స్థలం లేక వాహనదారులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. జాతర నిర్వహణ కోసం వచ్చే మహిళా అధికారులకు కనీస సౌకర్యాలు లేక పడేపాట్లు వర్ణణాతీతం. రూ.1 కోటి నిధులతో జాతరకు కొత్త కాంతులు ప్రభుత్వం విడుదల చేసిన కోటి రూపాయలతో జాతరను ధూంధాంగా నిర్వహించేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి నిపుణులైన అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్ ఏడుపాయలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, టాయిలెట్లు, స్నానఘాట్లు, మహిళల ఇబ్బందులు, రోడ్లు, పారిశుద్ధ్యం, అలంకరణ తదితర విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఏడుపాయల జాతరను భక్తులకు మరవని జ్ఞాపకంగా మిగిల్చేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అధికార వర్గాలను సమాయత్తం చేస్తున్నారు. జోరుగా సాగుతున్న బ్రిడ్జి పనులు వనదుర్గమాత ఆలయం ఎదుట రూ.25 లక్షలతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఆలయం ముందు, మంజీరానది పాయపై ఇరుకైన వంతెన ఉండటంతో జాతర సమయంలో తొక్కిసలాట జరిగేది. దీనిపై ఆలయ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, జైకా నిధుల కింద బ్రిడ్జి నిర్మాణం రూ.25 లక్షలు మంజూరయ్యాయి. దీంతో మహాశివరాత్రి జాతర వరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ వెంకట కిషన్రావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి పక్కన కూడా మరో బ్రిడ్జి నిర్మించనున్నట్లు ఈఓ తెలిపారు. -
మరవని మజిలీ కావాలి
పాపన్నపేట: ‘తరగని భక్తికి.. పర్యాటక అందాలకు నిలయం ఏడుపాయల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి జాతర ఇది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఈ వేడుకలు మరచిపోని మజిలీ కావాలి. అధికారులంతా సమన్వయంతో పనిచేసి జాతరను జయప్రదం చేయాలి. ఎలాంటి అవకతవకలు జరిగినా.. అవమానాల పాలవుతాం’ అంటూ.. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి శనివారం ఏడుపాయల్లో జరిగిన జాతర సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు జరిగే ఏడుపాయల జాతరకు సంబంధించి 20 శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జా, డిప్యూటీ స్పీకర్లు అధికారుల విధులను, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. జాతరకు సుమారు 7లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్ట్కు 0.3టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్, కలెక్టర్లు తెలిపారు. ఫిబ్రవరి 15 వరకే నీరు వచ్చేలా చూస్తామన్నారు. జాతరకు దేవాదాయ శాఖ నుండి సుమారు రూ.27లక్షలు ఖర్చు చేస్తామని, ప్రభుత్వ పరంగా మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్రెడ్డి కోరారు. జాతర భక్తులకు 30లక్షల లీటర్ల నీటిని పంపిణీ చేస్తామని, ఆర్డ బ్ల్యుఎస్ ఈఈ విజయ్ప్రకాశ్ తెలిపారు. 24గంటలపాటు విద్యుత్ సేవలందిస్తామని, 13 అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ సదాశివారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నుంచి 120, హైదరాబాద్ నుంచి 50 బస్సులను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 300 మంది పారిశుద్ధ్య కార్మికులతో జాతరలో చర్యలు చేపట్టనున్నట్లు డీపీఓ ప్రభాకర్రెడ్డి వివరించారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు 24గంటలపాటు వైద్య సేవలందిస్తామని డీఎంహెచ్ఓ బాలాజీ పవర్ తెలిపారు. ఇద్దరు డిఎస్పీలు, 10మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 1250 మంది పోలీసులతో భద్రత చర్యలు చేపట్టనున్నట్లు డీఎస్పీ రాజారత్నం తెలిపారు. జాతర ప్రారంభోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి వచ్చే అవకాశం ఉన్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. జాతరలో చిరు వ్యాపారులు రోడ్లపైకి రాకుండా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావద్దని, స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జాలు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రసాద్, ఈఓ వెంకటకిషన్రావులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ మెంచు నగేష్, స్థానిక సర్పంచ్ ఇందిర నర్సింలుగౌడ్, ఎంపీపీ పవిత్ర, జెడ్పీటీసీ స్వప్న, ఎంపీటీసీ సత్యనారాయణ, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ధూంధాంగా ఏడుపాయల జాతర
పాపన్నపేట: ‘‘మాస్టర్ ప్లాన్తో ఏడుపాయలకు మెరుగులు దిద్దుతాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న తొలి అతిపెద్ద జాతర ఏడుపాయలే. ఇక నుంచి ఏడుపాయల వనదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తాం. మాస్టర్ ప్లాన్ సర్వే కోసం రూ.20 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నాం. జానపదుల జాతరగా పేరొందిన ఏడుపాయల జాతరను ధూంధాంగా నిర్వహించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేందుకు శాయశక్తులా కృషి చేస్తాం’’ అని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏడుపాయల్లో మాఘ అమావాస్య ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏడుపాయల జాతరను తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ఎస్.కుమార్ ఆర్కిటెక్చర్ కంపెనీతో ఒప్పందం జరిగినట్లు చెప్పారు. వెంటనే యాక్షన్ప్లాన్ తయారు చేసేందుకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి అతిపెద్ద జాతర ఏడుపాయల జాతరేనన్నారు. ఇకనుంచి ప్రతి మహాశివరాత్రి జాతరకు ప్రభుత్వం తర ఫున దుర్గమ్మతల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, ఈ మేరకు దేవాదయ శాఖ మంత్రితో మాట్లాడామని చెప్పారు. ఈ మహాజాతరను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఈనెల 24న కలెక్టర్, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతిరోజు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏడుపాయల్లో విశాలమైన రోడ్లు, అందరికీ సరిపడ తాగునీరు, విద్యుత్ కాంతులు, పచ్చని హరిత వనాలు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. జైకా నిధుల కింద అమ్మవారి ఆలయం ఎదుట బ్రిడ్జిని, 33/11కేవీ సబ్స్టేషన్ను, ఔట్పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు. వనదుర్గ ప్రశస్తిని తెలంగాణలోని పల్లెపల్లెకూ విస్తరింపజేస్తామన్నారు. అమ్మవారి పవిత్రతను కాపాడుతూ యజ్ఞశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. డిప్యూటీ స్పీకర్ వెంట పాలక మండలి చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఆర్డీఓ మెంచు నగేష్, ఈఓ వెంకట కిషన్రావులు ఉన్నారు. -
కల్యాణ ‘లక్షి’ ఏదీ?
డిప్యూటీ స్పీకర్ ఆగ్రహించినా.. సామాన్యుడి ఆవేదన చెందినా అధికారులు మాత్రం ఏమాత్రం లెక్కచేయడం లేదు. అందువల్లే సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యా ణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు జిల్లా దయనీయంగా ఉంది. పథకం ప్రారంభించి మూడు నెలలైనా జిల్లాలో ఏ ఒక్కరూ లబ్ధిపొందలేకపోయారంటే మన అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. * జిల్లాలో అమలుకాని పథకం * అయోమయంలో దరఖాస్తుదారులు * డిప్యూటీ స్పీకర్ ఆగ్రహించినా స్పందించని అధికారులు ‘నలుగురు నిరుపేద ముస్లింల దరఖాస్తులను నేనే స్వయంగా నింపాను..పెళ్లికి నెల రోజుల ముందే వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. పెళ్లి రోజు నాటికి పథకం డబ్బు అందేలా చూడాలని జేఏసీ మూర్తికి నేను ఫోన్ చేసి మరీ చెప్పాను. పెళ్లి అయిపోయింది కానీ పథకం సర్కార్ సాయం మాత్రం అందలేదు. తీరా నేను వచ్చి చూస్తే దరఖాస్తుల వివరాలను కూడా రికార్డుల్లో పొందుపరచలేదు. మీరు (అధికారులు) అనుసరిస్తున్న తీరు ఆందోళనకరం’ -నవంబర్ 15న సంక్షేమ పథకాల సమీక్షలో అధికారులపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆగ్రహం ‘‘సర్కార్ పైసలిస్తుందన్న ధీమాతో అప్పుజేసి పిల్ల పెండ్లి జేసిన. రోజులు గడుస్తుండటంతో అప్పులొళ్లు రోజూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేనుకూడా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా, నా ఇంటి లక్ష్మి వెళ్లిపోయింది. సర్కారు పెట్టిన కల్యాణ లక్ష్మి వెక్కిరిస్తోంది’’ ‘కల్యాణ లక్ష్మి’కి దరఖాస్తు చేసుకున్న దుబ్బాక మండలం చెల్లాపూర్కు చెందిన పరశురాములు ఆవేదన ఇది సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సర్కార్ కల్యాణ ‘లక్ష్మి’ పథకం ప్రారంభించి మూడు మాసాలు కావొస్తున్నా ఇంకా బాలారిష్టాలు మాత్రం దాటలేదు. ఎస్సీ, ఎస్టీ, యువతులకు వివాహాలకు ఆర్థిక తోడ్పాటుకు ‘కల్యాణ లక్ష్మి’, మైనార్టీ యువతుల కోసం షాదీ కోసం ‘షాదీముబారక్’ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రూ. 10 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి, అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసినా.. జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా పథకం అందలేదు. డబ్బులొస్తాయన్న నమ్మకంతోనే కానుకలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం... ఇంతవరకూ సర్కార్ సాయం అందకపోవడంతో బంగారు తల్లులకు మెట్టినింట్లో తిప్పలు తప్పడం లేదు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, అధికారులు నుంచి ‘రేపు రాపో... మాపు రాపో’ అన్న సమాధానం తప్ప మరొక్కటి రావటం లేదని వినోద ఆవేదన వ్యక్తం చేశారు. షాదీముబారక్ పథకం కింద 117 మంది, కల్యాణ లక్ష్మి పథకం కింద 11 మంది గిరిజన మహిళలు, 25 దళిత యువతులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతంపెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి. కానీ పథకం కింద అందాల్సిన సొమ్ములు మాత్రం ఇంతవరకు అందలేదు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. కానీ ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. వరం ఊరిస్తోంది... నిజానికి పేద కుటుంబాలకు రూ.51 వేల ఆర్థిక సహాయం అనేది పెద్ద వరం. వధువు తల్లిదండ్రులు ఇప్పుడు పెళ్లి పనుల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కూడా ఓ ముఖ్య తంతుగా పెట్టుకున్నారు. ప్రభుత్వం కోరినట్టు నెల రోజుల ముందుగానే అన్ని ఆధారాలతో, అధికారులు కోరిన సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెళ్లి ముగిసిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పథకం మాత్రం అందకపోవడం గమనార్హం. ఇటీవలే కూతురు పెళ్లి చేసిన జహీరాబాద్ మండలం గౌసాబాద్ తండాకు చెందిన జాబిబాయి, తిస్రాం పవార్ల దంపతులను పలకరిస్తే...‘పథకం ఉంటదని టీవీ చేప్తే బిడ్డ పెళ్లి పెట్టుకున్న. రూ.51 వేలు సిన్న మాట కాదు. 2014 డిసెంబర్ 3న లగ్గం పెట్టుకున్నాం. నా బిడ్డపేరు అంజన. అల్లుని పేరు మిథున్ రాథోడ్. ఆయనది బీదర్ దగ్గర చించోళి తాలూకా సూర్యానాయక్ తాండ. పెండ్లికి నెల ముందే దరఖాస్తు చేసినం...పెండ్లి అయిపోయి నెల దాటుతోంది. డబ్బులు మాత్రం రాలేదు. రూ.2 లక్షలకు పైగా అప్పుజేసిన. నా బిడ్డ పెండ్లికి నేను అప్పు చేసుకున్న కానీ ప్రభుత్వం చెప్పినట్టు రూ. 51 వేలు ఇస్తే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అయినట్టు ఉండేది’. అని చెప్పారు. మంజూరితోనే సరి.... కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో రెండు గిరిజన కుటుంబాలు కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి. సీతారాం తండాకు చెందిన ధర్మవ్వ తన కూతురు రమావత్ మీన వివాహం గత డిసెంబర్ 18న చేసింది. నవంబర్ నెలలో కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 31న పథకం మంజూరు పత్రం ఇచ్చారు. డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని అధికారులు చెప్పారట. ఎకౌంట్ తీసి 20 రోజులు దాటినా ఇప్పటి వరకు డబ్బులు మాత్రం జమ కాలేదంటోంది ధర్మవ్వ. ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోని చందర్తండాలో నాన్గోత్ బద్య, మంగమ్మకు ఇద్దరు కూతుళ్లు. అందులో మొదటి కూతురు మంజూలకు డిసెంబర్ 12న పెళ్లి చేశారు. నానా తంటాలు పడి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి వివాహానికి 15 రోజుల ముందే పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 31న పథకం మంజూరు పత్రాలను అందజేసిన అధికారులు డబ్బు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంటి లక్ష్మి వెళ్లిపోయింది.. దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన వనమ కనకవ్వ, పరుశురాములు ఏకైక కూతురు చంద్రకళ. చంద్రకళను చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి చెందిన సుల్తాన్ మల్లయ్య కుమారుడు కనకరాజుకిచ్చి డిసెంబర్ 17న వివాహం జరిపించారు. నవంబర్ మాసంలోనే పరుశురాములు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. పథకం మీద నమ్మకంతో అయినోళ్ల దగ్గర డబ్బు చేబదులు తీసుకొచ్చి పెళ్లి తంతు ముగించారు. కానీ ఇంతవరకూ పరుశురాములు సర్కార్ సాయం అందలేదు. గజ్వేల్లోనూ గదే తీరు గజ్వేల్...సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. అందుకే ఇప్పుడు ఉన్నత, అత్యున్నత స్థాయి అధికార గణం అంతా గజ్వేల్ నియోజకవర్గంలోనే చెక్కర్లు కొడుతోంది. కనీసం ఇక్కడైనా పథకం అమలు తీరు అద్భుతంగా ఉంటుందేమోనని పరిశీలిస్తే... అక్కడ కూడా ఇదే పరిస్థితి. నియోజకవర్గంలోని గజ్వేల్ మండలంలో కల్యాణ లక్ష్మి పథకానికి 2, షాదీ ముబారక్ పథకానికి మరో రెండు, తూప్రాన్లోనూ రెండు పథకాలకు రెండు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ములుగులో రెండు పథకాలకు కలుపుకొని 11, వర్గల్లో రెండు, జగదేవ్పూర్ మండలంలో మూడు దరఖాస్తులు మాత్రమే అందాయి. జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో కల్యాణ లక్ష్మి పథకం అమలు తీరుపై పరిశీలన జరపగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనే నిబంధన ఎన్నో ఇబ్బందులు పడ్డామని గ్రామానికి చెందిన బొమ్మల లింగయ్య తెలిపారు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నా...ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది అధికారులు చెప్పలేదని లింగయ్య వాపోయాడు. చేబర్తి గ్రామానికి తెడ్డు కిష్టయ్య,కిష్టమ్మ దంపతులు కూతురు అరుణ పెండ్లి కోసం కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 12న ఆరుణ పెళ్లి చేసినా, ఇంత వరకు డబ్బులు రాలేదని చెప్పారు. ‘‘అప్పులు జేసి పెండ్లి జేసినం.. సర్కార్ సాయం అందుతదనుకుంటే ఇంకా అందకపాయే’’ అంటూ లింగయ్య అందోళన చెందారు. -
చెరకు రైతుకు తీపి కబురు...
* టన్ను చెరకుకు రూ.2,600 ఇచ్చేందుకు సీఎం సముఖత * సర్కార్ తరఫున రూ.340 రైతు ఖాతాల్లో జమ * డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి వెల్లడి * ఆనందంలో రైతన్నలు మెదక్: ధరాఘాతంతో విలవిల్లాడుతున్న చెరకు రైతుకు తీపి కబురు అందింది. చెరకుకు గిట్టుబాటు కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్ను కలిసిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డికి బర్త్డే గిఫ్ట్ దొరికింది. టన్ను చెరకుకు రూ.2,600 చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, ఈ మేరకు రెండు రోజుల్లో జీఓ వెలువడుతుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులకు ఈ సంవత్సరం ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.2,260 లు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే గత ఏడాది రూ.2600 చెల్లించిన యాజమాన్యం ఈసారి రూ.360లు తగ్గించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో సోమవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, చెరకు రైతు నాయకులతో సీఎంను కలిసి రైతుల బాధలు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రాష్ట్ర ప్రభుత్వం తరఫున టన్ను చెరకుకు రూ.340 రైతుల ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చినట్లు పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో జీఓ వెలువడుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఎన్డీఎస్ఎల్ పరిధిలోని చెరకు రైతులను చెరకు సాగు అవగాహన నిమిత్తం మహారాష్ట్ర పంపేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. మహారాష్ట్రలో చెరకు రైతులు ఎకరాకు 80 నుంచి 100 టన్నుల చెరకును పండిస్తున్నందున వారి వ్యవసాయ విధానాన్ని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్డీఎస్ఎల్ మంభోజిపల్లి పరిధిలో ఈ సంవత్సరం 1.20 లక్షల టన్నుల చెరుకు గానుగ ఆడనుంది. సీఎం తాజా హామీతో సుమారు 2,590 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. నాకిది బర్త్డే గిఫ్ట్ చెరకు రైతు కష్టాలు తీర్చాలని సీఎం కలిశాను. మంగళవారం నా జన్మదినం. చెరకు రైతుకు మేలు జరిగేలా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగానే నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ రైతుల కోసం ఎంతటి వ్యయ ప్రయాసలైనా భరిస్తుందని ఆ సంఘటనతో మరోసారి తేలిపోయింది. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని ఎన్డీఎస్ఎల్ పరిధిలో గల మూడు ఫ్యాక్టరీల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. -పద్మాదేవేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ -
అలక.. ఆగ్రహం
కోమటిరెడ్డి : మేడమ్... నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి : కుదరదు.. మీ పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు మాట్లాడారు.. కోమటిరెడ్డి : మేడమ్...నేను డిప్యూటీ లీడర్ను...నాకు అవకాశం ఇవ్వండి.. డిప్యూటీ స్పీకర్ : లేదండీ... ఇప్పటికే మీ వాళ్లు మాట్లాడారు... సీన్కట్ చేస్తే సభలో కోమటిరెడ్డి లేరు. ఏమయిందోనని అనుకుంటుంటేనే ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి దగ్గరకు వెళ్లారు ఏదో చెప్పి వచ్చారు. మళ్లీ కోమటిరెడ్డి సభలోకి ఎంట్రీ సీఎం : కోమటిరెడ్డి గారు మంత్రిగా పనిచేశారు.. ఆయనంటే మాకు గౌరవం.. ఆయన సభ మీద అలిగివెళ్లిపోతే ఎలా..? కోమటిరెడ్డి : లేదు సార్... నేను అనవసరంగా మైక్ అడిగేవాడిని కాదు... అయినా నేను అలిగింది సభపై కాదు.. స్పీకర్ మీద. * అసెంబ్లీలో హాట్టాపిక్గా మారిన కోమటిరెడ్డి * మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని సభనుంచి వెళ్లిపోయిన సీఎల్పీ ఉపనేత * బుజ్జగించిన సీఎం కేసీఆర్ * సభపై కాదు స్పీకర్మీద అలిగానన్న మాజీమంత్రి సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఇదంతా గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జరిగిన చర్చ... ఈ ఉదంతంతో జిల్లాకు చెందిన సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీలో హాట్టాపిక్గా మారిపోయారు. తనకు సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ ఆయన అలక.. ఆగ్రహాన్ని కలగలిపి వ్యవహరించిన తీరు ఆసక్తిని రేకెత్తించింది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో శాంతించిన ఆయన ఒకదశలో తాను రాజీనామాకు కూడా సిద్ధమయ్యానని ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ఈ ఆసక్తికర సన్నివేశం వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోమటిరెడ్డి కోరారు. అప్పుడు అధ్యక్షస్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆయనకు అవకాశం ఇచ్చేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ముగ్గురు మాట్లాడారని, కూర్చోవాలని ఆయనను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రెండు, మూడుసార్లు స్పీకర్ను మైక్ అడిగిన కోమటిరెడ్డి ఉన్నట్టుండి సభ నుంచి వెళ్లిపోయారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్న ఆగ్రహంతో వెళ్లిపోయి లాబీలో కూర్చున్నారు. పరిస్థితిని గమనించిన అధికార పక్ష నేతలు కోమటిరెడ్డి అలిగి వెళ్లిపోయారనుకుని ఇద్దరు దూతలను ఆయన వద్దకు పంపారు. టి.రామ్మోహన్రెడ్డి (కాంగ్రెస్), గువ్వల బాలరాజు (టీఆర్ఎస్)లు ఆయన వద్దకు వెళ్లి సీఎం సభలోకి రమ్మంటున్నారని కోరారు. దీంతో సభలోకి వచ్చిన కోమటిరెడ్డిని ఉద్దేశించి సీఎం కూడా సరదాగా మాట్లాడారు. కోమటిరెడ్డి సీనియర్ సభ్యుడని, మంత్రిగా పనిచేసిన ఆయన సభమీద అలిగి వెళ్లిపోతే ఎలా అని ప్రశ్నించారు. అప్పుడు స్పీకర్ కోమటిరెడ్డికి అవకాశం ఇవ్వడంతో తాను అనవసరంగా మైక్ అడిగే వాడిని కాదని, అయినా తాను అలిగింది సభపై కాదని, స్పీకర్మీద అలిగానని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. తమ జిల్లాలో అన్నీ సిమెంట్ పరిశ్రమలేనని, వాటి వల్ల వచ్చే దుమ్ము తప్ప జిల్లాకు ఒరిగిందేమీ లేదని, హైదరాబాద్ - నల్లగొండ ఇండస్ట్రీ కారిడార్ను మొదటి దశలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంమీద గురువారం అసెంబ్లీలో కోమటిరెడ్డి ఎపిసోడ్ సభ్యులకు కొంత ఉల్లాసాన్ని కలిగించింది. -
డిప్యూటీ స్పీకర్ వివక్ష: జానా
సాక్షి, హైదరాబాద్: ‘సభలో సంయమనం పాటిస్తూ అర్థవంతమైన చర్చ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. విపక్ష సభ్యులు మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో మంత్రులు మధ్య మధ్య అడ్డుతగులుతున్నారు. అధికారపక్షానికి అత్యధిక సమయం ఇస్తూ, ప్రతిపక్ష సభ్యులను పట్టించుకోవడం లేదు. పాలకపక్షం, విపక్షాల నడుమ మధ్యవర్తిగా ఉండాల్సిన చైర్ ఆ పనిచేయడం లేదు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పూర్తి వివక్ష చూపిస్తున్నారు..’ అని సీఎల్పీ నేత కె.జానారెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం శాసనసభలో సంక్షేమ అంశాలపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్కుమార్ మాట్లాడుతుండగా పదేపదే మంత్రులు అడ్డుపడడం, మధ్యలో టీఆర్ఎస్కు చెందిన ఓ సభ్యునికి అవకాశం కల్పించడం, సంపత్కు అసలు మైక్ ఇవ్వకపోవడం వంటి పరిణామాలతో కాంగ్రెస్ శాసనసభా పక్షం వాకౌట్ చేసింది.అనంతరం సీఎల్పీ నేతజానారెడ్డి ఎమ్మెల్యేలతో కలసి విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ తమను గుర్తించడం లేదని, విపక్ష సభ్యులకు మైక్ ఇవ్వడం లేదన్నారు. సభావ్యవహారాలు పూర్తిగా అప్రజాస్వామికంగా ఉన్నాయని, వాకౌట్ చే స్తున్నామని విపక్ష నేత ప్రొటెస్ట్ చేయడానికి కూడా మైక్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే భట్టివిక్రమార్క విమర్శించారు. మంత్రి హరీష్రావు స్క్రీన్ప్లేతో, ఆయన కనుసన్నల్లో సభా వ్యవహారాలు సాగుతున్నాయని ఆరోపించారు. సభను టీఆర్ఎస్ ఆఫీసులా భావిస్తున్నారని విరుచుకుపడ్డారు. -
సర్వేపై అపోహలొద్దు
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట: ఈ నెల 19న ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేం దుకు వచ్చిన ఆమె సోమవారం రామాయంపేట, రాయిలాపూర్ గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 19న సర్వే చేపడుతున్నందున అందరు విధిగా ఇండ్లలో ఉండి సర్వే సిబ్బందికి సహకరించాలని, ఇండ్లలో లేని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవన్నారు. గ్రామాల్లో ప్రత్యేకాధికారితో పాటు తహశీల్దార్, ఎంపీడీఓ సర్వే విషయమై సమీక్ష జరుపుతారన్నారు. హైదరాబాద్ శాంతి భద్రతల అధికారాలను గవర్నర్కు అప్పగించే విషయమై ఆమె మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న నియమ నిబంధనలనే మన రాష్ర్టంలో కూడా పాటించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కీలక పాత్ర పోషించారని, రాయిలాపూర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి వారం రోజుల్లో జీఓ విడుదల కానుందని, దసరా నుంచి వృద్ధులు, వితంతువులకు పెరిగిన పింఛన్లు మంజూరవుతాయని తెలిపారు. ఒక ఏడాదిపాటు విద్యుత్ కోత ఉంటుందని, ఆ తరువాత 24 గంటల పాటు ఎలాంటి కోత లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందని, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం,మెదక్ ఆర్డీఓ వనజాదేవి, రామాయంపేట ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు జితేందర్గౌడ్, ఎంపీడీఓ అనసూయబాయి, జెడ్పీటీసీ సభ్యురాలు బిజ్జ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చెర్మైన్ రమణ తదితరులు పాల్గొన్నారు -
ఆగస్టు 15న భూ పంపిణీ: డిప్యూటీ స్పీకర్
మెదక్ రూరల్: మెదక్ నియెజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆమె మండలంలోని పలుగ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముత్తాయికోటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఘణపూర్ ప్రాజెక్టు పరిధిలోని కాల్వలకు సిమెంట్ లైనింగ్ చేపట్టేందుకు గతంలో రూ.25 కోట్లు జైకా నిధులు మంజూరైనా అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా పనులు చేపట్టలేదన్నారు. తమ ప్రభుత్వం వెంటనే ఆ నిధులను వెనకి ్క రప్పించి పనులు ప్రారంభించిందన్నారు. జైకా నిధులతో కాల్వల మరమ్మతు పనులు చేపట్టి ఆయకట్టు చివరి వరకు సాగునీరందించడమే లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ ద్వారా గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. గామాభివృద్ధి కోసం స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు స్థానిక నాయకులు ప్రజలతో మమేకమై ముఖ్యమైన మూడు సమస్యలను గుర్తించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే క్రమపద్ధతిలో పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లోని సమస్యలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే పల్లెల సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో సమస్యలను గుర్తించి గ్రామ ఎడాప్షన్ అధికారికి సూచించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి కిష్టయ్య, జెడ్పీటీసీ సభ్యరాలు లావణ్యరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు లలిత, ఎంపీటీసీ భిక్షపతి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, విశ్వం, జయరాంరెడ్డి, కిషన్గౌడ్, పద్మారావు, కొంపల్లి సుభాష్రెడ్డి సాయిలు, ప్రభాకర్, పాల్గొన్నారు. అబివృద్ధి పనులకు శంకుస్థాపన ముత్తాయికోటలో వాటర్ ట్యాంకు నిర్మాణం కోసం రూ.18 లక్షలతో శంకుస్థాపన చేసిన అనంతరం దేవుని కూచన్పల్లిలో రూ. 14 లక్షలతో చేపట్టనున్న ట్యాంకు నిర్మాణ పనులకు శంకుస్థాపన, రాయినిపల్లి రూ. 5 లక్షలతో సీసీరోడ్డుకు శంకుస్థాపన, తిమ్మనగర్లో రూ. 5 లక్షలతో సీసీరోడ్డుకు శంకుస్థాపనతో పాటు రూ. 6 లక్షలతో అదనపు తరగతి గదికి శంకుస్థాపన, తిమ్మనగర్లో రూ. 9 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ. 6 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు గదికి డిప్యూటీ స్పీకర్ ప్రారంభోత్సవం చేశారు. దళితులకు ఆగస్టు 15న భూ పంపిణీ మెదక్ మున్సిపాలిటీ: ఎంపిక చేసిన నిరుపేద దళితులకు ఆగస్టు 15న భూ పంపిణీ చేస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆమె మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతకు ముందు ఆమె స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ దళితుల భూ పంపిణీకి సంబంధించి మండలంలోని రాయిన్పల్లిలో 29 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. వీరిలో ముగ్గురు భూమి లేని నిరుపేదలని, మిగతా వారు గుంటల భూమి కలిగి ఉన్నారని తెలిపారు. పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రతి సమస్యను ప్రజల ద్వారా తెలుసుకొని ప్రభుత్వ ప్రణాళికలో పొందుపర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన పట్టణం-మన ప్రణాళిక’ అనే కార్యక్రమం ప్రారంభించిందన్నారు. పునర్నిర్మాణం అవసరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకంటే పునర్నిర్మాణమే ఎంతో కీలకమని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో కృషి చేసి రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేయాలన్నారు. పునర్నిర్మాణం జరుగకుంటే ప్రత్యేక రాష్ట్రం సాధించి ప్రయోజనం ఉండదన్నారు.అనంతరం క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలన్నారు. అంతేకాకుండా ప్రతి వినతి పత్రాన్ని పూర్తి సమాచారంతో రిజిస్టర్ చేయాలని సూచించారు. సమస్య పరిష్కరించిన అనంతరం లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలుంటే క్యాంపు కార్యాలయ సిబ్బంది దృష్టికి తేవాలన్నారు. అనంతరం ఆమె పట్టణంలోని మెదక్ నర్సింగ్హోమ్ వద్ద నారాయణ హృదయాలయ ఆస్పత్రి వారు రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపీపీ లక్ష్మి, పీఆర్ఓ జీవన్రావు తదితరులు పాల్గొన్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం మెదక్ మున్సిపాలిటీ: రేషన్ నుంచి పింఛన్ దాకా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆమె మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 12వ వార్డులో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసి, 5వ వార్డులో జరుగుతున్న ‘‘మనవార్డు-మన ప్రణాళిక’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్లునాటే కార్యక్రమం నుంచి నీటి సమస్య, పింఛన్, శ్మశాన వాటిక, విద్యావకాశాలు, యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వార్డుల్లో చెత్త పేరుకు పోవడం, డ్రైనేజీలు శుభ్రం చేయక పోవడం వంటి సమస్యలు తమ దృష్టికి వస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా డ్రెయినేజీలు నిండితే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ భవనం, సీఆర్సీ భవనం, లోవోల్టేజీ, మంచినీటి సమస్యలను వార్డు ప్రజలకు ఆమె దృష్టికి తెచ్చారు. వీటిపై ఆమె స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్రెడ్డి, కౌన్సిలర్లు విజయలక్ష్మి, రాధ, చంద్రకళ, గాయత్రి, సలాం, రాంగిరిశ్రీనివాస్, సోహైల్, కమిషనర్ వెంకటేశం, మేనేజర్ శ్రీనివాస్, ఆర్డీఐ రాములు, సిబ్బంది శ్యామ్, చిత్తారిశ్రీను, ఆబేద్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, కృష్ణారెడ్డి, గంగాధర్, జీవన్రావు,గోవింద్, అంకంరవి తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటి స్పీకర్గా పద్మా దేవేందర్ రెడ్డి
-
పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విపక్షాలు కూడా పద్మా దేవేందర్ రెడ్డి అభ్యర్ధిత్వానికి మద్దతు తెలపడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్పీకర్ మధుసూదనాచారి గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు వివిధ పార్టీల నాయకులు పద్మ దేవేందర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. మరోవైపు తెలంగాణ శాసనసభ ఉపసభాపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. -
డిప్యూటి స్పీకర్కు కేసీఆర్ అభినందనలు
-
ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేం: కేసీఆర్
హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ పదవిపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తగ్గటం లేదు. స్పీకర్ ఎన్నిక ఏకపక్షంగా జరిగినందున డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలంటూ విపక్ష నేతలు బుధవారం సీఎం కేసీఆర్ను కలిశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ పదవిపై వెనక్కి తగ్గలేమని ఆయన విపక్షాలను సముదాయించారు. మరోవైపు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, వామపక్ష పార్టీలు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపాయి. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కూడా పద్మాదేవేందర్రెడ్డికి మద్దతు ప్రకటించారు. పలువురు కాంగ్రెస్ నేతలు పద్మా దేవేందర్రెడ్డికి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే మరి కొందరు నేతలు ప్రతిపక్షాలకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
'ప్రతిపక్షాలతో సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తాం'
హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రతిపక్ష సభ్యులు తర్జన భర్జన పడుతున్నారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వటం సంప్రదాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి అన్నారు. అయితే అధికార టీఆర్ఎస్ డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించిందని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై ఇతర ప్రతిపక్షాలతో సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తామని గీతారెడ్డి తెలిపారు. డిప్యూటీ స్పీకర్ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం, లేదంటే ప్రతిపక్షాలు నుంచి అభ్యర్థిని పోటీకి పెట్టడం, కాదంటే ఎన్నికకు దూరంగా ఉండటం ఈ మూడు ప్రత్యామ్నాయాలు తమ ముందు ఉన్నాయని ఆమె చెప్పారు. మరోవైపు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడానికి ఎం.పద్మా దేవేందర్రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంలేదు. డిప్యూటీ స్పీకర్గా ఉంటే రాజకీయంగా నష్టపోతానని, దానికన్నా ఎమ్మెల్యేగా ఉంటేనే మంచిదని పేర్కొంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలంటూ ఆమెకు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్రావు ద్వారా కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఇందుకు పద్మ అంగీకరించలేదు. -
గులాబీ దళమిదే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 69 మంది పేర్లు ప్రకటించగా వాటిలో జిల్లాలో ఆరు పేర్లు ఖరారు చేశారు. శుక్రవారం పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో జాబితా విడుదల చేశారు. అయితే గురువారం రాత్రి ‘సాక్షి’కి అందిన అభ్యర్థుల జాబితాలోంచి దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి పేరు గల్లంతయింది. ‘సాక్షి’కి అందిన పక్కా సమాచారంతో ఏడు నియోజకవర్గాల్లో ఏడు మంది అభ్యర్థుల పేర్లను శుక్రవారం సంచికలో ‘గులాబీ దళం ఖరారు’ శీర్షికన ప్రచురించింది. ముందు చెప్పినట్టుగానే గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్దిపేటకు తన్నీరు హరీశ్వర్రావు, ఆందోల్ నుంచి బాబూమోహన్, సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్, పటాన్చెరుకు మహిపాల్రెడ్డి, మెదక్ అసెంబ్లీ నుంచి పద్మా దేవేందర్రెడ్డి పేర్లనే టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఇద్దరిని కూర్చోబెట్టిన తర్వాతే.... తుదిరూపు దిద్దుకున్న తొలి జాబితాలో సోలిపేట రామలింగారెడ్డి పేరు ఖరారైంది. అధికారికంగా విడుదలైన జాబితాలో ఆయన పేరు లేకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఠమొదటిపేజీ తరువాయి పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితోపాటు, కొత్త ప్రభాకర్రెడ్డి పోటీ పడుతున్నారు. సోలిపేట ఉద్యమంలో ముందు నడిచి, జైలు పాలయ్యారు. ఉద్యమం నడపటానికి అవసరమైన సమయంలో కొత్త ప్రభాకరరెడ్డి ఆర్థికంగా సహకరించారు. దాదాపు సోలిపేటకు టికెట్ ఖరారు అయినట్టేనని గులాబీ బాస్ సంకేతాలు పంపారు. అయితే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కొత్త ప్రభాకర్రెడ్డిని పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాతే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. రెండో జాబితాలోనైనా సోలిపేట పేరునే ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సంగారెడ్డి: చింతా ప్రభాకర్ స్వస్థలం సదాశివపేట 1988లో టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలైంది. పీఎస్ఎంఎల్ పరిశ్రమలో ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా పనిచేశారు. 1995లో టీడీపీ నుంచి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ బీ ఫారం ఇచ్చి మహాకూటమి పొత్తుతో మళ్లీ వెనక్కి తీసుకుంది. టీడీపీ రెబల్గా పోటీ చేశారు. జగ్గారెడ్డి చేతిలో 6,772 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేశారు. చింతా ప్రభాకర్కు 34,329 ఒట్లు పడగా... జగ్గారెడ్డికి 41,101 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి మండలం ఆయన్ను బాగా దెబ్బతీసింది. గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(కేసీఆర్) స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడక గ్రామం 1983కి ముందు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి సిద్దిపేట నుంచి తొలిసారిగా పోటీ చేసి కాంగ్రెస్ నేత అనంతుల మదన్మెహన్పై ఓటమిపాలయ్యారు. 1985 నుంచి 1999 వరకు అసెంబ్లీ నుంచి వరుసగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో శాసనసభా డిప్యూటీ స్పీకర్గా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2001 ఏప్రీల్ 27న ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి)ని స్థాపించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. 2004 ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. ఆరు నెలల పోర్ట్పోలియో లేని మంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేంద్ర కార్మిక మంత్రిగా ఏడాదిన్నర కాలం పనిచేశారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మరోసారి కరీంనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008లో కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ స్ధానం పోటీ చేసి విజయం సాధించారు. మెదక్: పద్మా దేవేందర్రెడ్డి స్వగ్రామం రామాయంపేట మండలం కోనాపూర్. 2001లో రాజకీయాల్లోకి వచ్చారు. రామాయంపేట జెడ్పీటీసీగా టీఆర్ఎస్ నుంచి 12 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జిల్లా పరిషత్లో ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2004లో రామాయంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీచేసి 32 వేల ఓట్లతో గెలుపొందారు. 2007లో కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్-టీడీపీ పొత్తులో భాగంగా ఆమెకు టికెట్ రాలేదు. అప్పటికే రామాయంపేట పునర్విభజనలో మెదక్ నియోజకవర్గంలోకి వెళ్లింది. టీఆర్ఎస్ రెబల్గా పోటీ చేశారు. దాదాపు 24 వేల ఓట్లు సాధించారు. పాపన్నపేట మండలం, మెదక్ పట్టణంలో పద్మకు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. ఆందోల్: పల్లి బాబూమోహన్ స్వస్థలం ఖమ్మం జిల్లా , తిరుమలయపాలెం మండలం, బీరోలు గ్రామం, 1974 నుంచి 1988 వరకు రెవెన్యూ శాఖలో ఆర్ఐగా పనిచేశారు. 1988 నుంచి సినిమా రంగంలోకి వచ్చారు 1998ఉప ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఆందోల్ నుంచి పోటీచేసి గెలిచారు. 1999లో రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో కాంగ్రెస్ దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు. 2009లో మరోసారి పోటీ చేసి దామోదర రాజనర్సింహ చేతిలోనే 2,906 ఓట్ల స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆయనకు 75,765 ఓట్లు పడగా రాజనర్సింహకు 78,671 కోట్లు వచ్చాయి. రాయికోడ్, టేక్మాల్ మండలాలు బాబూమోహన్ను దెబ్బతీశాయి. 2014లో టీఆర్ఎస్లో చేరి మళ్లీ ఆందోల్ బరిలో నిలబడ్డారు. పటాన్చెరు: గూడెం మహిపాల్రెడ్డి స్వస్థలం పటాన్చెరు. 1996-99 వరకు పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు 1995లో ఎంపీటీసీగా, 2001లో పటాన్చెరు ఎంపీపీగా ఎన్నిక 2009లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఎన్నికల తర్వాత టీడీపీలో, 2013లో వైఎస్సార్సీపీలో చేరారు. 2014లో టీఆర్ఎస్లో చేరి, పటాన్చెరు టిక్కెట్ పొందారు. సిద్దిపేట.. తన్నీరు హరీష్రావు 1971 జూన్ 3న సిద్దిపేటలో సత్యనారాయణ, లక్ష్మీ దంపతులకు జన్మించారు. స్వగ్రామం.. కరీంనగర్ జిల్లా, బెజ్జింకి మండలం, తోటపల్లి గ్రామం. టీఆర్ఎస్ ఆవిర్భావం కంటే ముందే టీడీపీలో రాజకీయ ప్రయాణం. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. 2004 అక్టోబర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా హరీష్రావు.. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం 2008 మే ఉప ఎన్నికల్లో హరీష్రావు.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి భైరి అంజయ్యపై భారీ మెజారిటీతో గెలుపు 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భైరి అంజయ్యపై 64.677వేల ఓట్ల మెజార్టీతో హరీష్రావు గెలుపు 2010 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్గౌడ్పై 95.858 ఓట్ల మెజార్టీతో హరీష్రావు విజయం. ఈ మెజార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. -
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి
మెదక్ టౌన్, న్యూస్లైన్: తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయం వద్ద మున్సిపల్ వార్డు సభ్యులకు సంబందించి 9 మంది అభ్యర్థుల పేర్లను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ పట్టణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారన్నారు. పట్టణాభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. 13 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను భరించి కేసీఆర్ ఢిల్లీ పెద్దలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించారని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త రాగి అశోక్ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అనంతరం పట్టణంలోని 9వ వార్డులకు సంబంధించి పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించారు. 1వ వార్డులో శ్రీధర్యాదవ్, 2వ వార్డులో రాగి అశోక్, 3వ వార్డులో జెల్ల గాయత్రి సుధాకర్, 4వ వార్డులో సలాం, 5వ వార్డులో మెంగని విజయలక్ష్మి, 8వ వార్డులో మాయ మల్లేశం, 12వ వార్డులో మోచి కిషన్, 18వ వార్డులో ఏ.కృష్ణారెడ్డి, 26వ వార్డులో రెహనా బేగంను ప్రకటించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం. దేవేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్య శ్రీనివాస్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కిష్టాగౌడ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, గంగాధర్, జీవన్, శ్రీకాంత్, ముకుందం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్కో కార్యాలయం ముట్టడి
రామాయంపేట, న్యూస్లైన్: కరెంట్ కోతలపై రైతులు, ప్రజలు కన్నెర్రచేశా రు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ట్రాన్స్కో కార్యాలయంను ముట్టడించారు. కోతలను ఎత్తివేయాలంటూ ధర్నా చేపట్టారు. బుధవారం రామాయంపేట మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహం నుండి రైతులు, ప్రజలు ర్యాలీగా బయలుదే ట్రాన్స్కో కార్యాలయం ము ట్టడించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలతోపాటు పట్టణంలో విద్యుత్ కోతలు అధికమయ్యాయని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతులకు నిరంతరాయంగా ఏ డు గంటల కరెంటు సరఫరా చేయకుండా నాలుగు గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో ఉద యం 10 గంటల నుండి 12 గంటల వర కు, సాయంత్రం 4 గంటల నుండి 6 గం టల వరకు కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. కాగా అదనంగా మరో రెండు గంటలు ఎల్సీల పేరిట కరెంటు కోతలు విధిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రైతులకు, ప్రజలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని లేకుంటే త్వరలో డీఈ కార్యాలయం ముట్టడిస్తామని హె చ్చరించారు. అనంతరం ఎస్ఈతో ప ద్మా దేవేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడి కరెంటు సమస్యను అడిగి తెలుసుకున్నా రు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, మాజీ ఎంపీపీలు పుట్టి విజయలక్ష్మీ, గుండా ఎల్లం, బిజ్జ సంపత్, టిఆర్ఎస్ జిల్లా యూత్ ప్రధా న కార్యదర్శి అందె కొండల్ రెడ్డి, రామాయంపేట, నిజాంపేట, తొనిగండ్ల, దం తేపల్లి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, జాన్సీలింగాపూర్ సర్పంచ్లు ప్రభావతి, తిర్మల్గౌడ్, పిట్ల శామయ్య, గొల్ల గాలవ్వ నారాయణ, మానెగల్ల రామకిష్టయ్య, రామాయంపేట ఉప సర్పంచ్ నాగేశ్వర్ రె డ్డి, చిలుక గంగాధర్, వార్డు సభ్యులు పోచమ్మల పద్మ, పోచమ్మల ఐలయ్య, చింతల ఏసుపాల్, బాదె చంద్రం, మల్లారెడ్డి, సుభాష్, అక్కన్నపేట మాజీ సర్పంచ్ జంగం సిద్ధరాంలు, ఉప సర్పంచ్ కమ్మరి ప్రభాకర్, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. కిరణ్ను బర్తరఫ్ చేయాలి పాపన్నపేట: కుట్రలు, కుతంత్రాలతో, నాటకాలు, బహురూపులతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశా రు. బుధవారం మండల పరిధిలోని మల్లంపేట, పాపన్నపేట గ్రామాల్లో జరిగిన బోనాల పండగ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముసాయిదా బిల్లుకు, ఒరిజనల్ బిల్లుకు తేడా తెలియని కిరణ్ స్పీకర్గా, ప్రభుత్వ విప్గా, ఎమ్మెల్యేగా పనిచేయడం దురదృష్టకరమన్నారు. కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబులిద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. వందమంది కిరణ్లు, చంద్రబాబులు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని, అక్కడ అన్ని పార్టీల అధినేతలు కలిసి తెలంగాణకు మద్దతు కూడగడతారని తెలిపారు. -
సీమాంధ్ర ఎమ్మెల్యేల తీరుపై నిరసనలు
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీమాంధ్ర నేతలు వ్యవహరించిన తీరుపై జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర ఎమ్మెల్యేలు పోటీపడి ముసాయిదా బిల్లును చించివేయడంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినాయకత్వం పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించి సీమాంధ్ర నేతల దుశ్చర్యలను ఎండగట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీఎం కిరణ్కుమార్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనలు తెలిపారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మెదక్లో స్థానిక ఐబీ అతిథి గృహం నుంచి బస్ డిపో వరకు సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం కిరణ్ కుమార్రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ నేత, మునిసిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించి కిరణ్, చంద్రబాబుల దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో గజ్వేల్లో స్థానిక వివేకానంద చౌక్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను దహనం చేశారు. అందోల్ నియోజకర్గ ఇన్చార్జి పి.కిష్టయ్య నేతృత్వంలో జోగిపేటలోని హనుమాన్ చౌరస్తాలో చంద్రబాబు దిష్టిబొమ్మను తగలబెట్టారు. పటాన్చెరు బస్టాండు ఎదురుగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు, సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నారాయణ్ఖేడ్లో రాజీవ్ చౌరస్తా వద్ద సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. దుబ్బాకలో స్థానిక బస్టాండు ఎదురుగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.