Pressure
-
చంద్రబాబు పాత కేసులు..ఐఏఎస్లపై ఒత్తిళ్లు..?
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు పాత కేసుల్లో సాక్షులైన ఐఏఎస్ అధికారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాబు అవినీతి కేసుల్లో ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులను మళ్లీ స్టేట్మెంట్ ఇవ్వాలని సీఐడీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.స్కిల్ డెవలప్మెంట్,ఫైబర్ నెట్,అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్,సిహెచ్ శ్రీధర్ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా వీరిని ఫైబర్ నెట్ స్కామ్,అమరావతి అసైన్డ్ భూముల కేసుల్లో మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఐఏఎస్లపై సీఐడీ ఒత్తిడి చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. సీఆర్పీసీ 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చెయ్యడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.ఇదీ చదవండి: సూపర్సిక్స్కు ఎగనామం -
ప్రెజర్ నుంచి ప్లెజర్కు...
పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగంలో పని ఒత్తిడి, సంసార జీవితంలో ఆర్థిక సమస్యల ఒత్తిడి, వ్యాపారంలో నష్టాల ఒత్తిడి... ‘ఒత్తిడి’ రాక్షస పాదాల కింద ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి. అయితే ఒత్తిడి అనేది తప్పించుకోలేని పద్మవ్యూహమేమీ కాదు. ఒత్తిడిని చిత్తు చేసే వజ్రాయుధం, ఔషధం సంగీతం అని తెలిసిన స్వప్నరాణి... ఆ ఔషధాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు, గృహిణుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమందికి చేరువ చేస్తోంది. మరోవైపు మరుగునపడిన జానపదాలను వెలికి తీస్తూ ఈ తరానికి పరిచయం చేస్తోంది. ‘సంగీతం ఈ కాలానికి తప్పనిసరి అవసరం’ అంటుంది.నిజామాబాద్కు చెందిన స్వప్నరాణి సంగీతం వింటూ పెరిగింది. సంగీతం ఆమె అభిరుచి కాదు జీవనవిధానంగా మారింది. యశ్వంత్రావ్ దేశ్పాండే దగ్గర హిందుస్తానీ సంగీతంలో డిప్లమా, పాలకుర్తి రామకృష్ణ దగ్గర కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసింది. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ, పీహెచ్డీ చేసింది. ఉత్తర తెలంగాణలో సంగీతంలో పీహెచ్డీ చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందింది.‘ఇందూరు జానపద సంగీతంలో శాస్త్రీయ ధోరణులు’ అనే అంశంపై పరిశోధన చేసింది. తన పరిశోధనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆరువందలకు పైగా జానపద పాటలను సేకరించింది. సంగీతం అనేది నిలవ నీరు కాదు. అదొక ప్రవాహ గానం. ఆ గానాన్ని సంగీత అధ్యాపకురాలిగా విద్యార్థులకు మాత్రమే కాదు వయో భేదం లేకుండా ఎంతోమందికి చేరువ చేస్తోంది స్వప్నరాణి.స్వప్నరాణి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడానికి కనీస అర్హత ఏమిటి?‘నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది’ అనే చిన్న మాట చాలు.నిజామాబాద్లోని ప్రభుత్వ జ్ఞానసరస్వతి సంగీత, నృత్య పాఠశాలలో అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ తిప్పోల్ల స్వప్నరాణి ‘నాకు వచ్చిన సంగీతంతో నాలుగు డబ్బులు సంపాదించాలి’ అనే దృష్టితో కాకుండా ‘నాకు వచ్చిన సంగీతాన్ని పదిమందికి పంచాలి’ అనే ఉన్నత లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.స్వప్నరాణి దగ్గర పాఠాలు నేర్చుకున్న వారిలో కాస్తో కూస్తో సంగీత జ్ఞానం ఉన్నవారితో పాటు బొత్తిగా స ప స లు కూడా తెలియని వారు కూడా ఉన్నారు.స్వప్న శిష్యుల్లో సాధారణ గృహిణుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఎంతోమంది ఉన్నారు.‘సంగీతం గురించి వినడమే కానీ అందులోని శక్తి ఏమిటో తెలియదు. స్వప్న మేడమ్ సంగీత పాఠాల ద్వారా ఆ శక్తిని కొంచెమైనా తెలుసుకునే అవకాశం వచ్చింది. స్ట్రెస్ బస్టర్ గురించి ఏవేవో చెబుతుంటారు. నిజానికి మనకు ఏ కాస్త సంగీతం వచ్చినా ఒత్తిడి అనేది మన దరిదాపుల్లోకి రాదు’ అంటుంది ఒక గృహిణి.‘సంగీతం నేర్చుకోవాలనేది నా చిన్నప్పటి కల. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కల కలగానే మిగిలిపోయింది. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాను. ఈ టైమ్లో సంగీతం ఏమిటి అనుకోలేదు. స్వప్నగారి పాఠాలు విన్నాను. నా కల నెరవేరడం మాట ఎలా ఉన్నా... సంగీతం వల్ల ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను’ అంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి.ఇప్పటికి ఐదుసార్లు శతగళార్చన కార్యక్రమాలు నిర్వహించిన స్వప్న ‘సహస్ర గళార్చన’ లక్ష్యంతో పనిచేస్తోంది. ‘రాగం(నాదం), తాళంలో శృతిలయలు ఉంటాయి. నాదంలో 72 ప్రధాన రాగాలు ఉంటాయి. ఏ శబ్దం ఏ రాగంలో ఉండాలో ట్రాక్ తప్పకుండా ఉండాలంటే నేర్చుకునేవారిలో ఏకాగ్రత, నిబద్ధత తప్పనిసరిగా ఉండాలి. ఒక దీక్షలా అభ్యసిస్తేనే సంగీతంలో పట్టు సాధించడం సాధ్యమవుతుంది’ అంటుంది స్వప్నరాణి.భవిష్యత్తుకు సంబంధించి స్వప్నరాణికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. తన విద్యార్థులను ప్రతి ఏటా పుష్య బహుళ పంచమి రోజున తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువాయూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు సంసిద్ధం చేయడం వాటిలో ఒకటి. భవిష్యత్తులో సహస్ర గళార్చన కార్యక్రమాలు ఎక్కువగా చేసే లక్ష్యంతో శిష్యులను తీర్చిదిద్దుతుంది.సంగీతం... ఈ కాలానికి తప్పనిసరి అవసరం‘సంగీతం మనకు ఏం ఇస్తుంది?’ అనే ప్రశ్నకు ఒక్క మాటల్లో జవాబు చెప్పలేం. సంగీతం అనేది తీరని దాహం. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమంది ఒత్తిడి గురవుతున్నారు. అందుకే ఈ కాలానికి సంగీతం అనేది తప్పనిసరి అవసరం.సంగీతం వినడమే కాదు నేర్చుకోవడం కూడా గొప్ప అనుభవం. నా పరిశోధనలో భాగంగా మరుగున పడిన ఎన్నో జానపదాలను సేకరించిన వాటిని ఈ తరానికి పరిచయం చేస్తున్నాను.– స్వప్నరాణి– టి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
అకడమిక్ ప్రెజర్తో తస్మాత్ జాగ్రత్త!
యవ్వనం అంటేనే ఒక తుఫాను. అనేకానేక శారీరక, మానసిక, భావోద్వేగ, హార్మోన్ల మార్పులు ఒక్కసారిగా చుట్టుముడతాయి. వాటిని అర్థం చేసుకోలేక యువత ఒత్తిడికి లోనవుతుంటారు. ఇవి చాలవన్నట్టు పదోతరగతి, ఇంటర్మీడియట్లలో చదువుల ఒత్తిడి పెరుగుతోంది. అది ప్రాణాలు బలికోరేంత ప్రమాదకరంగా మారుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (Nఇఖఆ) డేటా ప్రకారం 2020లో సుమారు 10,500 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల్లో 40 శాతం చదువుల ఒత్తిడితో ముడిపడి ఉన్నవేనని విద్యా మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది. మరికొందరు తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతున్నట్లు తేలింది. తల్లిదండ్రులు, కార్పొరేట్ కాలేజీలు..తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ తల్లిదండ్రులు చదువు విషయంలో పిల్లల మీద వాళ్ల స్థాయికి మించిన ఒత్తిడి పెడుతున్నారు. ఇంట్లో ఉంటే చదువుకు ఇబ్బంది పడతారని హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. ఇక కార్పొరేట్ కళాశాలలు కల్పించే ఒత్తిడి చెప్పనలవికాదు. వారం వారం పరీక్షలు నిర్వహిస్తూ, వాటిలో వచ్చే మార్కులను బట్టి క్లాసులు మారుస్తూ మరింత ఒత్తిడి పెంచుతున్నారు.‡ తూతూమంత్రంలా ఏడాది చివర స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. మొదటిసారి ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండటం, ఆటపాటలు, వ్యాయామం లేకుండా నిరంతరం పరీక్షలు, గ్రేడ్ పాయింట్లు, ర్యాంకులు వంటివన్నీ విద్యార్థుల ఆత్మవిశ్వాసంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. పర్ఫెక్షనిజం ప్రభావం.. ఇన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో ఎలాగైనా సక్సెస్ సాధించాలని టీనేజర్లు భావిస్తారు. అందుకోసం అసాధ్యమైన టార్గెట్స్ పెట్టుకుంటారు. వాటిని సాధించేందుకు నిద్రమాని చదువుతుంటారు. కానీ పర్ఫెక్షనిజం ఫిక్స్డ్ మైండ్సెట్కు దారితీస్తుంది. చదువుకూ, వ్యక్తిత్వానికీ తేడా తెలుసుకోలేరు. పర్ఫెక్షనిజం వల్ల తమ తెలివితేటలు, సామర్థ్యాలు స్థిరంగా ఉంటాయని టీనేజర్లు నమ్ముతారు. ఇది వైఫల్యాలు శాశ్వతమని భావించేట్లు చేస్తుంది. దీంతో చిన్న ఫెయిల్యూర్ ఎదురైనా తట్టుకోలేక ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలకు లోనవుతున్నారు. ఇష్టంలేని చదువులు..చాలామంది విద్యార్థులు క్రీడలు, సంగీతం, డిస్కష¯Œ ్స, వాలంటీరింగ్ లాంటి భిన్న రంగాల్లో రాణించాలనుకుంటారు. కానీ ఆ వైపుగా ప్రోత్సహించే తల్లిదండ్రులు తక్కువ. దాంతో ఇష్టంలేని చదువులు టీనేజర్లలో ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు వారం వారం పరీక్షలు, మార్కులు, గ్రేడ్లు– టీనేజర్లను మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాలపరంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తున్నాయి. ప్రతి పనికీ వంద శాతం సమయం ఇవ్వలేకపోతున్నామనే అపరాధభావానికి లోనుచేస్తున్నాయి.బ్యాలెన్స్ ముఖ్యం.. అకడమిక్ ప్రెజర్ తగ్గాలంటే టీనేజర్లను తమకు నచ్చింది చదవనివ్వాలి. ఏం చదివామనేది కాదు, ఎలా చదివామనేది ముఖ్యమని తల్లిదండ్రులు గ్రహించాలి. ఇష్టంగా చదివినప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. చదువుతో పాటు స్పోర్ట్స్ లేదా వ్యాయామానికి అవకాశం కల్పించాలి. కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడం మాత్రమే సక్సెస్ అని భావించకుండా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆనందమే అసలైన సక్సెస్ అని నిర్వచించాలి.చదువుల ఒత్తిడికి కారణాలు.. 👉తమ పిల్లలు అత్యున్నత కెరీర్లో ఉండాలనే తల్లిదండ్రుల అంచనాలు · ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు, ఉన్నత విద్యాసంస్థల కోసం తీవ్ర పోటీ · క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ కన్నా మార్కులు, ర్యాంకులపైనే ఎక్కువ దృష్టి పెట్టడం · పాఠశాలల్లో, కళాశాలల్లో కౌన్సెలింగ్ సౌకర్యాలు తక్కువగా ఉండటం 👉 ఆటపాటలకు అవకాశం లేకపోవడం, కోచింగ్, ట్యూషన్ల వల్ల అదనపు భారం · తగిన వనరుల్లేకుండానే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ విద్యార్థులతో పోటీ 👉 అకడమిక్స్ను, ట్రెడిషనల్ జెండర్ రోల్స్ను బ్యాలెన్స్ చేయడానికి యువతులపై అదనపు ఒత్తిడిఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యూహాలు.. 👉 మీ బలాలను అర్థం చేసుకుని వాస్తవిక లక్ష్యాలను పెట్టుకోండి · తప్పులు, వైఫల్యాలను అర్థం చేసుకుని, వాటిని సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగే గ్రోత్ మైండ్ సెట్ను పెంపొందించుకోండి · చదువు ఎంత ముఖ్యమో నిద్ర, వ్యాయామం, విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని గుర్తించండి · సరైన టైమ్ మేనేజ్మెంట్ పద్ధతులు నేర్చుకుని, అమల్లో పెట్టండి · ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నప్పుడు మీలో మీరే బాధపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సైకాలజిస్టుల సహాయం తీసుకోండి. -
కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!
భారతీయ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు ఆందోళన వ్యక్తం చేశారు. చాలాకంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతూ ప్రెషర్ కుక్కర్లుగా మారుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని తగ్గించడానికి సంస్థలు వైవిధ్యభరితంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసే కంపెనీలు ఎక్కువకాలం నిలదొక్కుకోలేవని పేర్కొన్నారు.ఈసందర్భంగా శ్రీధర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ..‘కార్పొరేట్ సంస్థలు తమ టార్గెట్ల కోసం ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నాయి. సరైన సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోకుండా ఉన్నవారిపైనే టార్గెట్ అంతా మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారిపై ఒత్తిడిని పెంచుతూ ప్రెషర్కుక్కర్లుగా మారుతున్నాయి. చాలామంది ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. దాంతో ఒంటరితనం పెరుగుతోంది. ఆఫీస్లో ఉద్యోగుల ఒంటరితనం, ఒత్తిడిని దూరం చేసేందుకు సంస్థలు వైవిధ్య వాతావరణాన్ని సృష్టించాలి’ అన్నారు.‘టెక్నాలజీ విభాగంలో చాలా కంపెనీలు మోనోపోలి(గుత్తాధిపత్యం)గా అవతరిస్తున్నాయి. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కేంద్రం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగానే ఓఎన్డీసీ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇది అన్ని రంగాల్లోనూ వ్యాపించాలి. దానివల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అని శ్రీధర్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లఖ్నవూలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి
సాక్షి, అమరావతి: దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరుపై ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్డీ (ఓట్ ఫర్ డెమొక్రసీ) వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనా? ఎన్నికల సంఘం తొలుత వెల్లడించిన పోలింగ్ శాతానికి, తర్వాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండటం.. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 12.54 శాతం పోలింగ్ పెరగడంపై ఆ రెండు సంస్థలతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? పోలింగ్ శాతం ఇంత భారీ స్థాయిలో ఉండటానికి కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేసైనా ఉండాలి! లేదంటే ఈవీఎంలను మార్చైనా ఉండాలి! లేదంటే అవి సక్రమంగా పనిచేయకపోయి ఉండాలి! అంటూ వీఎఫ్డీ, ఏడీఆర్ వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? ఈవీఎంల పనితీరుపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను తాజాగా అధికారులు కోరుతుండటం ఎన్నికల ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.ఈవీఎంల పనితీరుపై వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫిర్యాదు..రాష్ట్రంలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో 81 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపును ఈసీ జూన్ 4న చేపట్టింది. అంటే పోలింగ్ పూర్తయిన 21 రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు గమనించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.విచారణ కోసం జూన్ 10న ఆయన రూ.94,400 ఫీజు కూడా చెల్లించారు. ఈవీఎంలో మెమరీని తొలగించారా..? మైక్రో కంట్రోలర్ ట్యాంపరింగ్ జరిగిందా? కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ పాట్స్ ట్యాంపరింగ్గానీ ఏమైనా మార్పులుగానీ జరిగాయా? అని అనుమానం వ్యక్తం చేస్తూ వాటిపై విచారణ చేయాలని ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని ఫిర్యాదు సమర్పించారు. విచారణకు రూ.5,66,400 ఫీజుగా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపైనా ఈనెల 25వతేదీ నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది.వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు..రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సందేహాలు రేకెత్తుతుండగా తాజాగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత అనుమానాస్పదంగా ఉంది. ఈవీఎంల ట్యాంపరింగ్పై వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫిర్యాదులను విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనకడుగు వేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది.ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే మీరు చెల్లించిన ఫీజు వెనక్కి ఇచ్చేస్తామని ప్రతిపాదిస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, వీఎఫ్డీలతోపాటు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, వివిధ రాజకీయపార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేననే అభిప్రాయం బలంగా కలుగుతోంది.ఇదే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను ‘సాక్షి’ సంప్రదించగా.. సీఈవో కార్యాలయానికి ఈ విచారణకు సంబంధం ఉండదని, ఇది పూర్తిగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫిర్యాదులపై ఆయా రిటర్నింగ్ అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. వారి సమక్షంలోనే ఈ విచారణ ప్రక్రియ జరుగుతుందని సీఈవో చెప్పారు.విచారణ నిర్వహించాల్సిందేఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు తేలింది. నా లోక్సభ స్థానం పరిధిలో 81 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్కు, కౌంటింగ్ తేదీకి మధ్య 21 రోజులు గడువు ఉంది. అయినా సరే ఈవీఎంలలో 99 శాతం ఛార్జింగ్ ఉండటాన్ని బట్టి చూస్తే ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానంతో ఫిర్యాదు చేశా. విచారణకు అయ్యే ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించా. అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని అధికారులు నన్ను కోరారు. ఫిర్యాదు ఉపసంహరించుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారు. దాన్ని నేను సున్నితంగా తోసిపుచ్చా. విచారణ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పా.– బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం లోక్సభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫీజు వెనక్కి ఇస్తామని పీఏకు ఫోన్ ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, ఓటింగ్ యంత్రాలను మార్చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశా. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫిర్యాదుపై విచారణ కోసం ఫీజు కూడా చెల్లించా. ఇప్పుడు ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నా పీఏకు అధికారులు ఫోన్ చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారట. దీనిపై విచారణ జరగాల్సిందే.. వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందేనని తేల్చి చెప్పా. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి -
Karimnagar: ఒత్తిడి తట్టుకోలేక మెడికో ఆత్మహత్య
కరీంనగర్క్రైం: ఎంబీబీఎస్ చదవడం కష్టంగా ఉందని మానసిక ఒత్తిడికి గురైన ఓ యువతి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కరీంనగర్లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన కోమళ్ల ప్రహ్లాదరావు–పద్మజ దంపతులు నగరంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నారు. కూతురు కోమళ్ల శిరీష(20) కూడా అదే కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే చదువు కష్టంగా ఉందని పలుమార్లు శీరీష తల్లిదండ్రులకు చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన శిరీష శనివారం ఉద యం కళాశాల నుంచి వచ్చి ఇంట్లో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుంది. తల్లి పద్మజ మధ్యా హ్నం ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు ఉరేసుకొని ఉండటాన్ని చూసి ఆందోళనకు గురైంది. స్థానికుల సహాయంతో ప్రభుత్వా స్పత్రికి తరలించగా అప్పటికే శిరీష మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రహ్లాదరావు ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు సర్కార్ ఒత్తిడి.. విద్యుత్ సంస్థల డైరెక్టర్ల రాజీనామా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఒత్తిడితో విద్యుత్ సంస్థల డైరెక్టర్లు రాజీనామా చేశారు. పది మంది ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల డైరక్టర్లచే చంద్రబాబు సర్కార్ బలవంతంగా రాజీనామాలు చేయించింది. రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. డైరెక్టర్లచే రాజీనామా చేయించాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పది మంది డైరెక్టర్ల రాజీనామాలను విద్యుత్ శాఖ ఆమోదించింది.ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ సీఎంవో నుంచి కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. రాజీనామా చేసేంత వరకు గ్రూప్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేశారు.దేశంలో అన్ని రాష్ట్రాలలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో లీకేజీ ఆరోపణలు ఉన్నాయి.. ఏపీలో మాత్రమే లీకేజీ ఆరోపణలు లేకుండా చైర్మన్ గౌతం సవాంగ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహించారు. రికార్డు స్థాయియిలో ఆరోపణలకు తావులేకుండా ఫలితాలు వెల్లడించారు. చివరికి ప్రభుత్వ ఒత్తిడితో గౌతం సవాంగ్.. చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా లేఖను ఆయన గవర్నర్కి పంపించగా, రాజీనామాను ఆమోదించారు.ఇదీ చదవండి: ‘రింగ్’లో మింగారు!ఏపీపీఎస్సీ సభ్యులపైనా రాజీనామా చేయాలని తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ ఒత్తిడితోనే మెయిన్స్ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించడానికి ఏపీపీఎస్సీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే. -
డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!
డైట్ల ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారపదార్థాలను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఫైబర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తీసుకుంటే..శరీరానికి ఉపయోగపడే గట్ బ్యాక్టీరియా అందిస్తుంది. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుందని పరిశోధన పేర్కొంది. అంతేగాదు ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎలా రక్తపోటుని తగ్గిస్తాయో సవివరంగా పేర్కోంది. ఏం చెబుతోందంటే.. మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో మహిళలు, పురుషులు బీపీని తగ్గించడానికి తినాల్సిన డైటరీ ఫైబర్(ఎక్కువ ఫైబర్ ఉన్నవి) కొద్ది మొత్తంలో అందించారు. ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్న వారిలో రక్తపోటు తగ్గడమే గాక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. మందులతో సంబంధంల లేకుండా బీపీ గణనీయంగా తగ్గడం గుర్తించామనని అన్నారు పరిశోధకులు. అంతేగాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బీపీ ఎక్కువ ఉన్న మహిళలు ఉదాహరణకు 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రోజుకి సుమారు 28% పైబర్ తీసుకోవాలని సూచించింది. అదే పురుషులకైతే రోజుకి 38 గ్రాముల వరకు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీని వల్ల ప్రతి అదనపు 5 గ్రా సిస్టోలిక్ బీపీ 2.8 mmHgకి, డయాస్టోలిక్ బీపీ 2.1 mmHgకి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ పైబర్ కంటెంట్ ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన గట్ మైక్రోబయోమ్ని అందించి తద్వారా బీపీకి దోహదపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూన్ రెగ్యులేటరీ యాసిడీలను ఉత్పత్తి చేసేలా అనుమతిస్తుందని తెలిపారు. ఈ అధ్యయనం హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ కోసం డైటరీ ఫైబర్కి ప్రాధాన్యత ఇవ్వడం గురించి హైలెట్ చేసిందని పరిశోధకుడు మార్క్స్ చెప్పారు. తాము రోగులకు ట్రీట్మెంట్లో భాగంగా అధిక ఫైబర్ ఉన్న పదార్థాలను ఇచ్చాక రక్తపోటు తగ్గి హృదయ నాళాలను మెరుగ్గా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పాశ్చాత్యుల ఆహారంలో పుష్కలంగా పీచు పదార్థాలు ఉండవని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్) పేర్కొంది. అలాగే పెద్దలు సగటు ఆహారంలో కనీసం 15 గ్రాముల చొప్పున ఫైబర్ తీసుకోవాలని పేర్కొంది. ఇక్కడ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి సాధారణ నియమంగా, ప్రతి భోజనంలో కనీసం ఒక తృణధాన్యాలు (ఉదా., బియ్యం, మొక్కజొన్న, ఓట్స్, క్వినోవా, బుల్గుర్) చేర్చండి హోల్గ్రెయిన్ బ్రెడ్ను ఎంచుకోండి (ఒక స్లైస్లో అత్యధిక మొత్తంలో పీచు ఉంటుంది) తెల్ల బియ్యంతో కాకుండా బ్రౌన్ రైస్తో ఉడికించాలి సలాడ్లకు బీన్స్ జోడించండి - దీనిలో ప్రతి ½ కప్పు సర్వింగ్లో 7 నుంచి 8 గ్రా ఫైబర్ ఉంటుంది వారానికి రెండు లేదా మూడు సార్లు, సూప్లు, కూరలు వంటి వాటిలో మాంసానికి బదులుగా చిక్కుళ్ళు (ఉదా., పప్పులు, బఠానీలు, బీన్స్, చిక్పీస్, వేరుశెనగలు) వేయండి. రోజుకు కనీసం ఐదు పండ్లు లేదా కూరగాయలను తినే యత్నం చేయండి తృణధాన్యాలకు పండ్లను జోడించడం మరింత మంచిది. పండ్ల రసాల కంటే పండు పలంగా తినడానికే ప్రయత్నించండి. ఇలా చేస్తే శరీరానికి అవసరమయ్య ఫైబర్ అంది రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది లేదా మందుల అవసరం లేకుండానే రక్తపోటు తగ్గిపోవడం జరుగుతుంది. (చదవండి: పప్పు మంచిదని తినేస్తున్నారా..?ఐతే వీళ్లు మాత్రం..) -
ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్
వెరైటీ ఫుడ్ ఇష్టం ఉండనిదెవరికి? కానీ చేసుకోవడమే మహాకష్టం. చేసిపెట్టే మెషిన్స్ ఉంటే ఆ టెన్షన్ ఎందుకు? ఈ ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ ఇంట్లో ఉంటే ఆ టెన్షనే ఉండదిక. ఇందులో 3 రకాల నూడుల్స్ చేసుకోవచ్చు. అలాగే మురుకులు, సన్న జంతికలనూ తయారు చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీల సాయంతో పోర్టబుల్ వైర్లెస్ మెషిన్గా పని చేస్తుంది ఇది. డివైస్కి ముందు వైపు పవర్ ఆన్/ఆఫ్ బటన్ ఉంటుంది. దాని సాయంతో దీన్ని వినియోగించుకోవడం చాలా తేలిక. ఇది వైర్లెస్ కావడంతో ఎక్కడికైనా ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. మూడు వేరు వేరు మోల్డ్స్(హోల్స్తో కూడిన రేకులు) లభిస్తాయి. వాటిని మార్చుకుని ఈ డివైస్ని వినియోగించుకోవచ్చు. దీని ధర 72 డాలర్లు (రూ.5,968) ఇవి చదవండి: వినియోగదారుల డిమాండ్లో.. మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్! -
ఇంట్లో అక్వేరియం ఉంటే డాక్టర్ ఉన్నట్టే
అక్వేరియం వద్ద కాసేపు గడిపితే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గుతాయని ఎన్విరాన్మెంట్ అండ్ బిహేవియర్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.ప్లిమౌత్ యూనివర్సిటీ, నేషనల్ మెరైన్ అక్వేరియం ఆధ్వర్యంలో పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనాన్ని ఈ జర్నల్ ప్రచురించింది. తీవ్ర ఒత్తిడిలో జీవనం సాగించే పట్టణ జనాభాలో ఒత్తిడిని తగ్గించే కారకాలపై ఈ బృందం పరిశోధనలు జరిపింది. రోజులో 10 నిమిషాల సేపు ఒక అక్వేరియం ముందు కూర్చుని అందులో కదిలే చేపలను గమనిస్తే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ బాగా నియంత్రణలోకి వస్తాయని ఆ బృందం గుర్తించింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఓ గాజు పెట్టె.. దాని నిండా నీళ్లు.. అడుగున రంగు రాళ్లు.. రెండు మూడు లైవ్ ఫ్లాంట్స్.. దానిలో నాలుగైదు చేపలు.. ఇదే కదా అక్వేరియం అంటే. చెప్పడానికైతే అంతే. కానీ తరచి చూస్తే దానిలో ఓ సైన్స్ ఉంది. ఆ పెట్టెలోపల ఓ పర్యావరణం ఉంది. ఆ నీళ్లలో ఒక జీవన చక్రం ఉంది. అందులోని చేపలకు తమదైన ఓ ప్రపంచమూ ఉంది. అంతేకాదు.. అది ఓ ప్రశాంత నిలయం. దాంతో మన ఇంటిలోనూ ఒక ప్రశాంతత. అక్వేరియంలోకి అలా చూస్తూ కాసేపు గడిపితే... ఎంత ఉత్సాహంగా ఉంటుందో అనుభవించి చూడాల్సిందే. ఒంటికి రంగులద్దుకున్న ఆ చేపలు.. వయ్యారంగా అలా కదులుతూ ఉంటే.. ఆ నీటిని సుతారంగా అలా చిలుకుతూ ఉంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఇంటికి అందం.. మనసుకు ఆహ్లాదం అక్వేరియం అనేది మన ఇంటికి అదనపు అందాన్నిస్తుంది. ఇంట్లో ఓ సరికొత్త శోభను తీసుకొస్తుంది.రంగు రంగుల చేపలతో అక్వేరియం ఉన్న ఇల్లు కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది. చాలా మంది అక్వేరియంను అందం కోసం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అక్వేరియంతో ఆరోగ్యం కూడా సమకూరుతుందంటే ఆశ్చర్యమే మరి. నీటిలో ఈదుతున్న చేపలను చూస్తూ రోజూ కొంత సమయం గడపడం అన్నది ఆరోగ్యంపై అమితమైన ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని, బీపీ, హార్ట్రేట్లు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ దరిచేరదని, ఆ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. అక్వేరియం వద్ద గడిపే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు.. చేపలకు ఫుడ్ వేయడం, నీళ్లు మార్చడం వంటి వాటితో క్రమశిక్షణ అలవడుతుంది. మనసికంగా పరిణతి సాధిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో.. అక్వేరియాలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. వాటిలో వేసే చేపలు, వాటి రకాలను బట్టి వాటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఈ అక్వేరియాల కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో వాటి వినియోగం పెరగడంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ముఖ్య పట్టణాల్లోనూ అందుబాటులోకొచ్చాయి. అనేక రకాలు..: అక్వేరియంలో పెంచే చేపల్లో రెగ్యులర్ గోల్డ్తో పాటు ఒరాండా, షుబుకిన్ గోల్డ్, బెట్టాస్, ఏంజిల్ ఫిష్, గౌరామీ, కోయీ కార్ప్స్, టైగర్ షార్క్, మోలీస్, గప్పీస్, ప్లాటీస్, ప్యారట్, టైగర్ ఆస్కార్స్ ఇలా పలు రకాలున్నాయి. రెగ్యులర్గా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే వాటికి ఆహారాన్నివ్వాలి. ఆహారం తక్కువైనా, ఎక్కువైనా చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బెట్టా వంటి ఫైటర్ ఫిష్లు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయి. అలాంటి చేపల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఫ్లవర్ హార్న్, అరవానా వంటివి కాస్త ధర ఎక్కువ. ఇవి కూడా ఒంటరిగానే ఉంటాయి. వాస్తుపరంగానూ ఇంటికి అక్వేరియం చాలా మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈశాన్యంలో ఉంటే ఆ ఇంటికి అన్ని రకాలుగా కలిసొస్తుందని విశ్వసిస్తారు. మనపై ఏదైనా నెగెటివ్ ప్రభావం పడినప్పుడు.. దానిని అక్వేరియంలోని చేపలు గ్రహించి మనల్ని రక్షిస్తాయని కూడా చాలామంది నమ్ముతారు. అక్వేరియం ఆరోగ్యదాయిని.. అక్వేరియంలోని చేపలను కొద్దిసేపు నిశితంగా పరిశీలించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎలక్ట్రో కన్వెన్షనల్ థెరపీ అవసరమైన వారు నీటి ట్యాంక్లోని చేపలను రోజూ చూడటం వల్ల వారిలో ఆందోళన 12 శాతం తగ్గిందని ఓ అ«ధ్యయనంలో తేలింది. ఇంట్లో అక్వేరియం ఉంటే డిమెన్షియా ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజాగా చేసిన పరిశోధన తేల్చి చెప్పింది. అక్వేరియంలో ఉండే రంగు, రంగుల చేపలు, అవి ఈదటం, నీటి బుడగల శబ్దాలు ఆటిజం ఉన్న పిల్లల్లో అటెన్షన్ను పెంచడమేగాక వారికి రిలాక్స్నిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. – సీతామహాలక్ష్మి జెట్టి, సైకాలజిస్ట్, గుంటూరు ఒత్తిడిని అధిగమించాను.. బాధ్యతలతో పని ఒత్తిడి ఉండేది. పిల్లలకోసంఇంట్లో ఈ మధ్యే ఓ అక్వేరియం ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజూ కాసేపు చేపలతో ఆడుకోవడం, వాటికి ఆహారం వేయడం, వారానికోసారి అక్వేరియంలో నీరు మార్చడం వంటివి చేస్తున్నాం. చాలా రిలాక్స్డ్గా ఉంటోంది. ఒత్తిడి చాలా వరకు తగ్గింది. – సీహెచ్వీబీ హరిణి, టీచర్, కొల్లూరు, బాపట్ల జిల్లా మెయింటెనెన్స్ సులభమే.. అక్వేరియం అనగానే మెయింటెనెన్స్ చాలా కష్టం కదా అని అనుకుంటుంటారు. ఇపుడు అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. క్లీనింగ్ సులభంగా చేసుకోవచ్చు. సులభమైన టిప్స్ కూడా ఉన్నాయి. బ్రీడర్ ఫిష్ఫామ్లలో చేపలు చాలా తక్కువ ధరలలో దొరుకుతు న్నాయి. అక్వేరియం, యాక్సెస్సరీస్ ధరలు కూడా ఇపుడు అందుబాటులోనే ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా వినియోగదారులకు చేరుస్తున్నారు. – పి.సాయి ఈశ్వర్, ఫార్చ్యూన్ ఆక్వాహబ్ (బ్రీడర్ ఫిష్ ఫామ్) నిర్వాహకుడు, వణుకూరు,కృష్ణా జిల్లా -
తరం తల్లడిల్లుతోంది..!
చిల్లా వాసు, ఏపీ సెంట్రల్ డెస్క్ బాపట్లకు చెందిన చెన్నుపాటి యశ్వంత్ చాలా తెలివైన విద్యార్థి. గతేడాది జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ (గుజరాత్)లో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ కాలికట్లో బీటెక్ కంప్యూటర్ సైన్సులో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. యశ్వంత్కు ఉజ్వల భవిష్యత్ ఖాయమని, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఆరు నెలలకే యశ్వంత్ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్ఐటీ కాలికట్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అందరూ నివ్వెరపోయారు. ...ఒక్క యశ్వంత్ మాత్రమే కాదు.. ఇలా ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యా శాఖ లెక్కల ప్రకారం.. 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2018 నుంచి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటీల విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014–21లో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్యల మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కర్మాగారంగా, కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సీటు ఎంత కష్టమంటే.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఐఐటీలు. వీటి తర్వాత స్థానం ఎన్ఐటీలది. ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మందిని తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేశారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాదికి 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా సీట్లు రానివారు, జేఈఈ మెయిన్లో ర్యాంకులు వచ్చినవారు ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం ఆరో తరగతి నుంచే ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా ఆరో తరగతి నుంచి ఇంటర్మిడియెట్ వరకు ఏడేళ్లపాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధించి ఐఐటీల్లో చేరుతున్నారు. ఎందుకిలా.. ఓవైపు అకడమిక్ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్.. ప్రాజెక్టు వర్క్, థీసిస్,ప్రాక్టికల్స్ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం. సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం.. భాషలు, ఆహారం, వాతావరణం అలవాటుపడలేకపోవడం గతంలో ఎంత సాధించినా.. ఐఐటీలు, ఎన్ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. గతంలో బట్టీ పట్టేస్తే సరిపోయేది.. ఇపుడు సృజనాత్మకత అవసరం.. ఇక్కడ మేథస్సుకే పని. విద్యార్థులకు ఇష్టంలేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం. ఏం చేయాలి? విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని నివారించడానికి బిజినెస్ క్లబ్బులు, ఫొటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్ క్లబ్బు, యోగా క్లబ్బు, మ్యూజిక్ క్లబ్బులు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి. పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించుకుని నేర్చుకునేలా చేయాలి. నిత్యం యోగా, ధ్యానం చేయించడంతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. విద్యార్థులు సోషల్ మీడియా సైట్లు, సైబర్ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి. కొద్ది రోజులే ఇబ్బంది.. మాది బాపట్ల జిల్లా. నేను ఎన్ఐటీ జంషెడ్పూర్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషా పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో పరాయి రాష్ట్రంలో ఉండాల్సి రావడం కూడా కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్స్టిట్యూట్లో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది పోగొట్టారు. బోధన పరంగా సంప్రదాయ విధానానికి, ఎన్ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన చర్చ, విశ్లేషణ.. సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతోంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతట మేమే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం. సుశ్వాంత్, బీటెక్ కంప్యూటర్ సైన్స్,థర్డ్ ఇయర్, ఎన్ఐటీ, జంషెడ్పూర్ కొంత సమయం పడుతోంది.. ఇప్పుడు 8వ తరగతి నుంచే జేఈఈకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతోంది. ఇంటర్మిడియెట్ వరకు టీచర్ పాఠం చెప్పడం.. బోర్డుపైన రాయడం.. నోట్సు చెప్పడం.. తర్వాత దాన్ని బట్టీ పట్టడం వంటి సంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త విధానాలను అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటివాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – ఎంఎన్ రావు, ఐఐటీ కోచింగ్ నిపుణులు, హైదరాబాద్ ప్రాథమిక దశలోనే నైపుణ్యాలు పెంపొందించాలి.. కేంద్ర విద్యా శాఖ ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. జేఈఈ రాసేవారిలో ఎక్కువ మంది సౌత్ ఇండియా వారే. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. ఇంటర్లోగంటల తరబడి చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ల్లో ర్యాంకులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు ఐఐటీల్లో అసలు పరీక్ష మొదలవుతోంది. అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్్టతో విద్యార్థులే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటుపడలేనివారు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. – కె.లలిత్ కుమార్, డైరెక్టర్, అభీష్ట ఎడ్యుగ్రామ్ లిమిటెడ్ -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
చిన్నవయసులోనే గజినీలుగా మరుతున్నారు.. విటమిన్ బి12 కారణమే
భద్రంగా దాచిన వస్తువును ఎక్కడ ఉంచిందీ గుర్తులేకపోవడం.. ఆఫీస్కు ఆలస్యమవుతోందనే భయంతో బైక్ కీస్ను మరిచి గబగబా ఇంటి నుంచి బయటకు వచ్చేయడం.. స్కూల్కి టైమ్ అవుతోందనే హడావుడిలో అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోవడం.. ఇలా చాలా మంది చిన్న వయసులోనే గజినీలుగా మారుతున్నారు. ఒకప్పుడు అరవై ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు కనిపించేది. ఇప్పుడు 16 ఏళ్ల వారినీ మతిమరుపు వేధిస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. పరీక్షల భయం, పని ఒత్తిడి, ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు. పౌష్టికాహార లోపం, కొన్ని రకాల రోగాలు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. టీనేజ్లోనే.. మతిమరుపు సమస్యకు టీనేజ్లో బీజం పడు తోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో అధికమవుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు ఏదో సమస్యతో తమ వద్దకు వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించగలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధిక ఒత్తిడి చేసే పనిలో టెన్షన్, యాంగ్జయిటీ, మానసిక అంశాలు జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత సతమతమవుతోంది. తీరా సమయానికి అది గుర్తుకు రాదు. అంతలా మెదడు పట్టు తప్పుతోంది. యాంగ్జయిటీతో ముప్పు మెమరీ పవర్ తగ్గిపోవడానికి మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జయిటీ. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటంతో ఒత్తిడి పెరిగిపోతోంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దీంతో విన్న విషయం గుర్తుకు రాని పరిస్థితి. ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, మార్కులపై వత్తిడి, పనిష్మెంట్లు, వారిలో ఒత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణమవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. బీపీ, మధుమేహం ప్రభావం డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటా యని వైద్యులు చెపుతున్నారు. ఆనందంగా ఉండకుండా, మానసికంగా మందకొడిగా ఉండటంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బీ 12 కారణమని, దాని లోపంతో సమస్య ఎదురవుతోందని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేక పోవడంతో బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి జరగడం లేదని చెబుతున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. బీ 12 నాన్ వెజ్లో అధికంగా, పుష్కలంగా లభిస్తుందని, ఆకుకూరలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఏకాగ్రతే లేదు యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదానిని మనసులో ముద్రించుకో వడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. గుర్తుంచు కున్నట్లుగా ఉంటుంది.. కానీ గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినక పోవడంతో, తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది. మతి మరుపునకు ప్రధాన కారణం ఒత్తిడి. డిప్రె షన్, యాంగ్జయిటీ, ఆల్కహాల్, మత్తు పదార్థా లకు అలవాటు పడిన వారిలో మతిమరుపు సమస్య తలెత్తుతోంది. ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరు బ్రెయిన్కు ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడు మతి మరుపు తగ్గే అవకాశం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలపై మార్కుల కోసం ఒత్తిడి తేకూడదు. ఒత్తిడి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. – డాక్టర్ ఆర్.తార, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వైద్య విభాగం, జీజీహెచ్ -
దారుణం: భాగస్వామిని ప్రెషర్ కుక్కర్తో బాది..
బెంగళూరు:కాలేజీ రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒక్కటిగా బతకాలనుకున్నారు. ఉద్యోగం కూడా ఒకే దగ్గర చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటున్నందున సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్యలో అనుమానం పెనుభూతంలా మారింది. తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భాగస్వామే ప్రెషర్ కుక్కర్తో బాది హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. ఇదీ జరిగింది.. దేవా(24), వైష్ణవ్(29) ఇద్దరూ కేరళకు చెందినవారు. ఇద్దరు కాలేజీ రోజుల్లోంచి ఒకరికొకరు తెలుసు. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బెంగళూరులోని ఓ రెంట్ హౌజ్లో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దేవా తనను మోసం చేస్తోందని వైష్ణవ్ అనుమానించసాగాడు. ఈ వ్యవహారంపై తరచూ గొడవ పడుతుండేవారు. శనివారం సాయంత్రం కూడా గొడవకు దిగారు. నిగ్రహం కోల్పోయిన వైష్ణవ్.. దేవాను ప్రెషర్ కుక్కర్తో తలపై బలంగా కొట్టాడు. దీంతో దేవా అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. అనంతరం ఘటనాస్థలం నుంచి వైష్ణవ్ పరారయ్యాడు. అక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై దేవా చెల్లి పొరుగువారిని సంప్రదించింది. విషయం తెలుసుకున్నవారు.. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇద్దరి మధ్య గొడవ గురించి తమకు తెలుసని దేవా తల్లిదండ్రులు తెలిపారు. ఈ అంశంలో కలగజేసుకుని సర్దిచెప్పామని పోలీసులకు తెలిపారు. పరారీలో ఉన్న వైష్ణవ్ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
రోజుకొక పెగ్గేసినా..అనర్థమే
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఒక పెగ్గు చొప్పున తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే ఏం కాదు అనుకుంటే.. అది పొరపాటేనని ఓ అధ్యయనం హెచ్చరించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించిన ఇటలీ, అమెరికాకు చెందిన ఓ మల్టీ నేషనల్ టీమ్ అధ్యయనం ప్రకారం.. తక్కువ మోతాదులో మద్యం సేవించే వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, అధిక రక్తపోటు బారినపడుతున్నారని వెల్లడైంది. 1997 నుంచి 2021 మధ్య కాలంలో జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో మద్యపానం వల్ల సంభవించే పర్యవసానాలపై ఏడు అధ్యయనాలు నిర్వహించారు. 20 నుంచి 70 ఏళ్ల వయసుతో పాటు అధిక రక్తపోటు లేని 19,548 మందిపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా 4 నుంచి 12 ఏళ్ల అనంతరం వీరి రక్తపోటు స్థాయిల్లో నిరంతర పెరుగుదలను కనుగొన్నారు. రోజుకు సగటున 12 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో ఐదేళ్లలో సిస్టోలిక్ రక్తపోటు 1.25 ఎంఎం హెచ్జీ పెరిగినట్టు గుర్తించారు. రోజుకు సగటున 48 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో సిస్టోలిక్ రక్తపోటు 4.9 ఎంఎం హెచ్జీ పెరిగినట్లు తేలింది.. ఒక్క రక్తపోటే కాదు.. అనేక సమస్యలు మద్యాన్ని ఎక్కువా.. తక్కువా.. అని కాదు.. ఏ పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎక్కువ పరిమాణంలో తాగే వారిలో వేగంగా, తక్కువ పరిమాణంలో తాగేవారిలో ఆలస్యంగా ప్రభావాలుంటాయి. రక్తపోటుతో పాటు కాలేయం, గుండె, మెదడుతో పాటు శరీరంలో మద్యపానానికి ప్రభావమవ్వని భాగం ఉండదు. ఆధునిక జీవనశైలి వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఇలా అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటికి మద్యపానం తోడైతే వేగంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మితంగా మద్యపానం ఆరోగ్యానికి మంచిదేనని గతంలో కొన్ని అధ్యయనాలు వచ్చినా.. అవి అవాస్తవమని తర్వాతి రోజుల్లో కొట్టిపడేశారు. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ -
Basara IIIT: మరో బలవన్మరణం
సాక్షి, నిర్మల్: భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన విద్యాక్షేత్రం.. విద్యార్థుల్ని బలిగొంటోందా?. ఫుడ్ పాయిజన్లు, విద్యార్థుల సమస్యలతో తరచూ వార్తల్లో నిలిచే బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మరో అఘాయిత్యం జరిగింది. మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితుడు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా ప్రకటించారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఆ క్యాంపస్లోనే చదువుతున్న తన సోదరుడితో మాట్లాడాడు కూడా. ఈ క్రమంలో గదిలో అచేతనంగా వేలాడుతూ కనిపించిన జాదవ్ను హుటాహుటిన భైంసా ఆస్పత్రికి తరలించింది ట్రిపుల్ ఐటీ సిబ్బంది. అయితే అప్పటికే జాదవ్ కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఉద్రిక్తత జాదవ్ క్యాంపస్లో చేరి నెల కూడా కాలేదు. అయితే వ్యక్తిగత కారణాలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డానని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బబ్లూ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించాల్సిన నేపథ్యంలో భైంసా ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉండడంతో.. భారీగా పోలీసులు మోహరించారు. వీసీ విచారం నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బబ్లూ మానసిక సమస్యలతో చనిపోయాడు. మధ్యాహ్నాం ఉరివేసుకోని అత్మహత్యచేసుకున్నాడు. ఇది విచారకరమైన ఘటన. కిందటి నెల 31వ తేదీన అడ్మిషన్ తీసుకున్నాడు. అతని అన్న కూడా ట్రిపుల్ ఐటీలోనే చదువుతున్నాడు. మధ్యాహ్నాం అతనితో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న సమస్యను బబ్లూ సోదరుడితో కూడా చెప్పుకోలేదు. ఆత్మహత్యకు పాల్పపడటం బాధాకరం. ::: వీసీ వెంకటరమణ నాలుగో ఘటన ఇదిలా ఉంటే.. ఈ విద్యా సంవత్సర కాలంలో నలుగురు మృత్యువాత చెందారు. డిసెంబర్లో ఒకరు, ఈ ఏడాది జూన్లో ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు జాదవ్ మృతితో ఆ సంఖ్య నాలుగుకి చేరింది. దీంతో అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? అనే ప్రశ్న ఉద్భవిస్తోంది. విద్యార్థుల బలవన్మరణాలపై క్యాంపస్ అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారు. అయితే.. ప్రాణం తీసుకునేంత ఒత్తిడికి విద్యార్థులు ఎందుకు చేరుకుంటున్నారు? అసలు వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు విద్యారంగ నిపుణులు. -
బీపీ ఉంటే ఆవేశపడరు..ఆవేశ పడటం వల్లే అది..
రక్తపోటు ముప్పు తప్పుతుంది ఇలా...నేటి ఆధునిక జీవన శైలి కారణంగా న్నపిల్లలనుం పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉరుకులు, పరుగులు... ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు, ఆవేశాలు, ఆవేదనలు, ఆందోళనలే. ఫలితంగా వయసుతో నిమిత్త లేకుండా రక్తపోటు పెరిగిపోతుంటుంది. హై బీపీ అనేక రోగాలకు ఆలవాలం. వచ్చాక బాధపడే కంటే రాకుండా నివారించుకోవడం మేలు. అందువల్ల అధిక రక్తపోటును ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం...చాలామంది అపొహ ఏమిటంటే ఎవరైనా ఇతరులమీద ఆవేశ పడుతుంటే, కేకలు వేస్తుంటే అదంతా బీపీ వల్ల అనుకుంటారు. అయితే అది తప్పు. బీపీ ఉండటం వల్ల ఆవేశపడరు. ఆవేశపడటం వల్ల బీపీ పెరుగుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ముందుగా ఆహారపదార్థాలలో రక్తాన్ని ఉద్రేకపరిచే పదార్థాలను నిషేధించాలి. ఆహారంలో వాడే ప్చమిర్చి బదులు ఎండుమిర్చిని... క్రమంగా దాని బదులు కారపు రుచికోసం మిరియాలను ఉపయోగించాలి. అంటే మిరియాల చారు, మిరియాల కారం ఇలాంటివన్నమాట. మనం వాడే రాళ్ల ఉప్పు గాని, షాపుల్లో దొరికే (అయోడైజ్డ్ సాల్ట్తో సహా) ఇతర ఉప్పుల బదులు సైంధవ లవణం వాడటం మంది. అదేవిధంగా పులుపు కోసం కొత్త చింతపండుకు బదులు పాతచింతపండు లేదా దేశవాళీ టమాటాలు ఉపయోగించడం శ్రేయస్కరం. గడ్డ పెరుగుకు బదులు పలుచని మజ్జిగ మంచిది. ఎందుకంటే, ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ పేగుల్లో విషపదార్థాలు లేకుండా ఉదరంలో పిత్తరసం ప్రకోపించకుండా రక్తపోటు పెరగకుండా కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. షాపుల్లో దొరికే స్వీట్లకు బదులు ఇంట్లో పాతబెల్లంతో చేసుకున్న తీపిని వాడుతుంటే ఎలాంటి ప్రమాదం రాదు. కూరల తయారీలో వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, అల్లం, జీలకర్ర, ధనియాలు, మిరియాలను ఉపయోగించడం ఆరోగ్యకరం. ఉదయం 9.30 గంటల లోపు, రాత్రి 7.30 గంటలలోపు తినడం ముగించాలి. రాత్రిపూట కప్పు నీటిలో చెంచా మెంతులు వేసి మూత పెట్టి ఉదయం బ్రష్ చేసుకోగానే ఆ నానబెట్టిన మెంతులను నమిలి తినాలి. మెంతులు నానబెట్టిన ఆ నీటిని కూడా తాగాలి. ఒక పచ్చి ఉల్లిపాయను ముక్కలుగా తరిగి కూరన్నంతో, మజ్జిగన్నంతోనూ కలిపి తింటుంటే క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. (చదవండి: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు) -
ప్రొఫెసర్ సాహసం.. నీటి అడుగులో 100 రోజులు! అన్నీ అక్కడే..!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ కళాశాల ప్రొఫెసర్ ఓ పరిశోధన కోసం నీటి అడుగున నివసిస్తున్నారు. 55 చదరపు మీటర్ల నీటి ఆవాసం, ఉపరితలం నుండి దాదాపు 30 అడుగుల లోతున జీవిస్తున్నారు. మానవ శరీరం దీర్ఘ కాలంపాటు విపరీతమైన ఒత్తిడికి గురైతే ఎలా స్పందిస్తుందనే విషయంపై అధ్యయనంలో భాగంగా ఈ సాహసం చేస్తున్నారు. ఇది విజయవంతమైతే ఈయన సూపర్ హ్యూమన్గా అవతరించి అరుదైన ఘనత సాధించనున్నారు. వినూత్న పరిశోధన చేస్తున్న ఈ ప్రొఫెసర్ పేరు జోసెఫ్ డిటూరి. వయసు 55 ఏళ్లు. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తరగతులను బోధిస్తున్నారు. ఇంతకుముందు 28 ఏళ్ల పాటు అమెరికా నౌకాదళంలో డైవర్గా పనిచేశారు. 2012లో కమాండర్గా పదవీ విరమణ చేశారు. అయితే గతంలో ఒకరు 73 రోజుల పాటు నీటి అడుగున జీవించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టి 100 రోజులు నీటిలోనే జీవించాలని జోసెఫ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రయోగం 30 రోజులకు పైగా పూర్తి చేసుకుంది. ప్రొఫెసర్ ఆరోగ్యాన్ని, ముఖ్యమైన అవయవాల పనితీరును వైద్యులు ఎప్పటికప్పడు నిశితంగా గమనిస్తున్నారు. అతని మానసిక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే తరచూ వైద్య పరీక్షలు కూడా చేస్తూ ప్రొఫెసర్ ఆరోగ్యంపై డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. 'మిలిటరీలో తన తోటి సైనికులు చాలా మంది బాధాకరమైన మెదడు గాయాలకు గురయ్యారు. హైపర్బారిక్ ప్రెజర్ సెరిబ్రల్ రక్త ప్రవాహాన్ని పెంచుతుందని వారికి బాగా తెలుసు. మెదడు గాయాలకు చికిత్స చేయడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని భావిస్తున్నా. వారికి ఎలా సహాయం చేయాలో నేర్చుకోవాలనుకున్నా. సముద్రంలో కనుగొనబడని జీవులలో అనేక వ్యాధులకు చికిత్స దొరుకుతుందని అనుకుంటున్నా' అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ ప్రయోగాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. ఇది విజయవంతం అయితే సరికొత్త విషయాలు తెలుస్తాయన్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇంత రిస్క్ చేయడం అవసరమా? అని కామెంట్ చేశారు. చదవండి: చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన అమెరికా..భారత్కే మద్దతు అని ప్రకటన -
డిపాజిట్ రేట్ల షాక్: తగ్గనున్న బ్యాంకింగ్ మార్జిన్లు
ముంబై: డిపాజిట్ రేట్ల పెరుగుదల నేపథ్యంలో బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న మార్చితో ముగిసే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.55 ఉంటే, 2023-24లో ఇది 3.45 శాతానికి తగ్గుతుందన్నది ఫిచ్ అంచనా. సుస్థిర అధిక రుణవృద్ధికి మద్దతు ఇవ్వడానికి పలు బ్యాంకులు భారీగా డిపాజిట్ల సేకరణకు మొగ్గుచూపుతుండడం తాజా ఫిచ్ నివేదిక నేపథ్యం. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీమార్జిన్ 3.1 శాతం అని పేర్కొన్న ఫిచ్, తాజా అంచనా గణాంకాలు అంతకుమించి ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. నివేదికలో మరిన్ని విశేషాలు చూస్తే.. ► మార్జిన్లో 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గుదల అంటే సమీప కాలంలో బ్యాంకుల లాభదాయకతను ప్రభావితం చేసే అవకాశం లేదు. అధిక రుణ వృద్ధి వల్ల అధిక ఫీజు ఆదాయం రూపంలో వస్తుంది. అలాగే ట్రజరీ బాండ్ల ద్వారా లాభాలూ ఒనగూరుతాయి. వెరసి ఆయా అంశాలు తగ్గనున్న మార్జిన్ల ఒత్తిళ్లను సమతూకం చేస్తాయి. అదే విధంగా బ్యాంకింగ్ మూలధన పటిష్టతకూ మద్దతునిస్తాయి. ► ఇక రిటైల్ అలాగే సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును నెమ్మదిగా పెంచినా, కార్పొరేట్ రుణ రేటును బ్యాంకులు క్రమంగా పెంచే వీలుంది. ఇది మార్జిన్ల ఒత్తిళ్లను తగ్గించే అంశం. ► 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రుణ వృద్ధి సగటును 17.5 శాతం ఉంటే, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 13 శాతంగా నమోదుకావచ్చు. రుణ డిమాండ్ క్రమంగా పుంజుకోవడం దీనికి నేపథ్యం. -
మనస్థాపానికి గురై అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి
-
కంటి నిండా నిద్ర కరవయిందా?
సెల్ఫ్ చెక్ చాలామంది తరచూ ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నా, అందుకు సరైన నిద్రలేకపోవడం కూడా ఒక కారణమనుకోరు. మీకు కూడా నిద్ర రాని సమస్య ఉందా? తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్చెక్ పూర్తి చేయండి. 1. రాత్రి వేళ నడుం వాల్చాక గంటలకొద్దీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. ఎ. అవును బి. కాదు 2. పగలు కాస్త కుదురుగా కూర్చుంటే చాలు, నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది. ఎ. అవును బి. కాదు 3. అర్ధరాత్రి మెలకువ వస్తే మళ్లీ నిద్రపోలేరు. ఎ. అవును బి. కాదు 4. పగలు చాలా ఆందోళనగా, చికాకుగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 5. మీటింగ్లలో వద్దనుకున్నా నిద్ర వస్తుంది. ఎ. అవును బి. కాదు 6. డ్రైవ్ చేస్తున్నప్పుడో, బస్సులో వెళుతున్నప్పుడో ఇట్టే నిద్ర వచ్చేస్తుంది. ఎ. అవును బి. కాదు 7. నిద్రలేవగానే మీరు ఫ్రెష్నెస్ ఫీల్ కారు. ఎ. అవును బి. కాదు 8. నిద్రలో గురకపెడతారని సన్నిహితులు మీకు చెబుతుంటారు. ఎ. కాదు బి. అవును 9. పనిపై ఏకాగ్రత చూపలేరు. ఎ. అవును బి. కాదు 10. స్లీపింగ్ పిల్స్ తరచూ వాడుతుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు 7 దాటితే మీరు నిద్ర కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారని అర్థం. ఇందుకు కారణాలేమిటో విశ్లేషించి, తగిన చర్యలు తీసుకోవాలి.. ‘బి’లు 7 కన్నా ఎక్కువ వస్తే నిద్ర గురించి ఆందోళన చెందనక్కర లేదు. -
విద్యార్థులపై ‘ప్రత్యేక’ ఒత్తిడి
సూర్యాపేట : రవికృష్ణ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు రావడంతో అమ్మమ్మ ఊరికి వెళ్లాలని ఫోన్ చేశాడు. ఇంతలోనే స్కూల్ నుంచి రవికృష్ణ తల్లికి ఫోన్వచ్చింది. వేసవి సెలవుల్లోనే పదో తరగతికి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఫలానా తేదీ నుంచి పంపండి.. మీ పిల్లాడు రాకపోతే వెనుకబడిపోతాడు. మీ ఇష్టం అంటూ చెప్పారు. తల్లిదండ్రులు కుమారుడ్ని ఊరికి పంపకుండా పాఠశాలకు పంపేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది రవికృష్ణ ఒక్కడిదే బాధే కాదు.. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట పట్టణాల్లోని చాలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి ఇదే. మానసిక ఆనందాన్ని కోల్పోతున్న పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన పోటీతత్వం పెరగడంతో రోజూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు చదువు అంటూ పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మానసిక ఆనందాన్ని కోల్పోతూ యాంత్రికంగా మా రిపోతున్నారు. కనీసం సెలవు రోజుల్లోనైనా ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపే అవకాశాలు కూడా కరువవుతున్నాయి. పాఠశాల యజమాన్యాలు చెప్పిన విధంగానే తల్లిదండ్రులు మద్దతిస్తూ.. పిల్లలను ఆటపాటలకు దూరం చేస్తున్నారు. పట్టింపులేని అధికారులు మామూలుగానే సెలవు రోజుల్లో విద్యాశాఖాధికారులు, ఇటు ఇంటర్ అధికారులకు తెలిసినా స్పందించిన దాఖలాలు లేవు. పేరుకే సెలవులు కానీ పనిచేస్తున్న పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. జూనియర్ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి జూనియర్ కళాశాలల విద్యార్థులకు మే 31 వరకు సెలవులు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. ఈ నిబంధనలను ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు బుట్టదాఖలు చేస్తున్నాయి. -
వాకింగ్ జాగింగ్
ఒత్తిడిని ఎదుర్కోవడం ఆధునికుల్లో అత్యధికుల్ని బాధిస్తోన్న ఒత్తిడికి వ్యాయామంలో పరిష్కారం లభిస్తుందనేది చాలా కాలంగా చాలా మంది వైద్యులు చెబుతున్నదే. అయితే దీని కోసం జిమ్లూ, ఇతరత్రా కసరత్తులూ ఏవీ అక్కర్లేదనీ వాటన్నింటికన్నా మిన్నగా కేవలం వాకింగ్తో ఒత్తిడికి చెక్ పెట్టవచ్చునని తాజాగా ఒక సర్వే వెల్లడించింది. మ్యాక్స్ బూపా వాక్ ఫర్ హెల్త్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 97శాతం మంది ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, జైపూర్ నగరాలకు చెందిన వారు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఉపకరిస్తున్న యాప్స్... ఇందులో 42శాతం మంది వృద్దులు ఒత్తిడిని ఎదుర్కోవడంలో వాకింగ్ను మించింది లేదని చెప్పగా, వాకింగ్ తర్వాత ఒత్తిడి, హైపర్ టెన్షన్ తగ్గిందని 50శాతం మంది మధ్యవయస్కులు చెప్పారు. ఆసక్తికరమైన అంశమేమిటంటే ఇందులో 40శాతం మంది వాకింగ్ యాప్స్ తమను నడకవైపు బాగా చైతన్యపరిచాయని వెల్లడించారు. వీరిలో 60శాతం మంది గాడ్జెట్స్ వాడడం వల్ల తమ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోగలుగుతున్నామన్నారు. మిగతా నగరాలతో పోల్చినప్పుడు ఢిల్లీ, ముంబయిలో అత్యధికంగా 70, 72 శాతం మంది గాడ్జెట్స్ వినియోగిస్తున్నారు. నడక లోపిస్తే ఆరోగ్యం పడకే... వాకింగ్ కేవలం కేలరీలను ఖర్చు చేయించడంతో ఊరుకోదు. హ్యాపీ హార్మోన్గా పేరుపడిన ఎండార్ఫిన్ను సైతం విడుదల చేస్తుంది. అది అయితే అదే సమయంలో రెగ్యులర్గా నడవని వారు డిప్రెషన్కు తొందరగా లోనవుతున్నారని సర్వే తేల్చింది. నడకకు దూరంగా ఉన్నవారిలో 15శాతం మంది డిప్రెషన్, హై స్ట్రెస్ లెవల్స్కు లోనవుతున్నారని వివరించింది. వాకింగ్తో మానసికపరమైన ఇతరత్రా ప్రయోజనాలూ కలుగుతున్నాయని సర్వే చెబుతోంది. నడక ద్వారా తమకు ఆత్మశోధనకు అవకాశం కలుగుతోందని 19శాతం మంది మధ్యవయస్కులు, స్వావలంబన అనుభూతి కలుగుతోందని 21శాతం మంది వృద్దులు అంటున్నారు. సాకులూ ఉన్నాయి... అయితే ఈ ఒత్తిడిని చిత్తు చేసే సులభమైన చికిత్సను అందుకోవడంలో మరికొన్ని భిన్న కోణాలను సైతం ఈ సర్వే ఎత్తి చూపింది. పాల్గొన్నవారిలో పలువురు వాకింగ్కు దూరంగా ఉండడానికి చెబుతున్న కారణాలలో... 43శాతం మంది తమకు వాకింగ్కు అవసరమైన సమయం లేదని అంటుంటే, 29శాతం మంది వాకింగ్ను బోర్ కొట్టించేదిగా భావిస్తున్నారు. 21శాతం మందికి వాకింగ్కు వెళ్లేందుకు సరైన తోడు దొరకడం లేదు. అలాగే మరో 21శాతం మందికి అసలు వాకింగ్ తమ మానసిక ఆరోగ్యానికి ఇంతగా ఉపయోగపడుతుందనే అవగాహనే లేదు. -
ఆధికార పార్టీ వేధింపులు తట్టుకోలేక..
-
వాటర్లో వర్కవుట్స్
జలకాలాడాలని అన్పించనిదెవరికి? సిక్సిటీస్లో ఉన్న వారిని కూడా సిక్స్టీన్కు లాక్కువచ్చేస్తుంది. కేరింతలు కొట్టేంత కిక్కు ఇచ్చేస్తుంది. జల‘కళ’లో ఉన్న మహాత్యమే అది. నీళ్ళు చూస్తే కలిగే ఉత్సాహమే వేరు. నీలిరంగులో నిర్మలంగా ఆహ్వానించే మంచి నీటి ముత్యాలు వంటిని తాకిన వెంటనే మనసులోని ఒత్తిడి నంతా చేతితో తీసినట్టు... ఓ అద్భుతమైన ఫీలింగ్. ఎక్సర్సైజ్లు కూడా అంతే. కాసేపు జిమ్లోనో, పార్కులోనో కసరత్తులు చేస్తూ గడిపితే మనసులోని చిరాకులు పరాకులు అన్నీ ఫటాఫట్. మరి ఇంత హాయినిచ్చే ఈ రెండిటినీ ఎంచక్కా జోడించేస్తే... ఒళ్ళంత తుళ్ళింత కల్గించే వాటర్నీ, వంటిని వంపులు తిప్పే వర్కవుట్లనీ జతచేసి... వాటర్వర్కవుట్స్ చేస్తే... డబుల్ మజా, డబుల్ పవర్ మన సొంతమవడం ఖాయం. మండుతున్నట్టు, మంట పక్కనే ఉన్నట్టు ఎండలు. ఇలాంటి వేడి వాతావరణంలో చెమట్లు కక్కుతూ నాలుగ్గోడల మధ్య వ్యాయామాలు చేయా లంటే çసహజంగానే చాలా మంది వెనకాడుతుం టారు.అయితే వ్యాయామానికి వ్యాయామం, చల్లదనానికి చల్లదనం రెండూ ఉంటాయని ఈ సీజన్లో ఈతకు మాత్రం సై అంటారు. కేవలం స్విమ్మింగ్తో సరిపెట్టేయకుండా నీళ్ళలోనే ఉంటూ బోలెడన్ని వర్కవుట్లు చేయాలని ఆశించే వారికి మంచి మార్గం ఆక్వా ఎరోబిక్స్. ఏమిటీ వాటర్ ఎరోబిక్స్? నీళ్ళలో వర్కవుట్స్ చేయడం అనేది చాలా కాలం క్రితమే విదేశాల్లో మొదలైంది. దాదాపు ప్రతి రిసార్ట్, స్పా, క్లబ్లలో వీటికోసం అవసరమైన ఏర్పాట్లు ఉంటాయక్కడ. కొన్ని యూరప్ దేశాల్లో అయితే ఇవి ఓ ఉత్సవంలా సాగుతాయి. పూర్తి వినోదభరితంగా ఉంటాయి. రొటీ¯Œ కు భిన్నంగా, వ్యాయామానికి వినోదం జోడింపుగా ఈ వాటర్ వర్కవుట్స్ సాగు తాయి. దాదాపు కంఠం వరకూ నీళ్ళలో నిలబడి గాలిలోకి చేతులు జాపుతూ చేసే ఎరోబిక్స్, తక్కువ బరువుతో చేసే వెయిట్ ట్రయినింగ్, స్ట్రెచ్చింగ్... వంటివన్నీ ఇందులో భాగమే. వీటినన్నింటిని కలిపి ఆక్వా ఎరోబిక్స్గా వ్యవహరిస్తారు. విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ వ్యాయామశైలి ఇప్పుడు మన మెట్రోలకూ విస్తృతంగానే విస్తరించింది... ఇంకా విస్తరిస్తోంది. లాభాలివే... నీళ్ళలో వ్యాయామం మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. నీటికి సాంద్రత ఎక్కువని తెల్సిందే. ఇది గాలికన్నా ఎక్కువగా దాదాపు 12 రెట్లు నిరోధక శక్తిని కోరుతుంది. నీళ్ళలో కదలికలు కాస్త కఠినంగా అన్పించడానికి కారణమిదే. దేహంలోని కేలరీలు ఎక్కువగా ఖర్చు అవడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. తద్వారా మన బాడీ టోనింగ్కూ ఉపకరిస్తుంది. నేలమీద చేసే ఎరోబిక్స్లో గంట వర్కవుట్కు 250–400 కేలరీలు ఖర్చయితే వాటర్లో చేసే ఈ ఎరోబిక్స్కు కనీసం 650–700 కేలరీలు ఖర్చవుతాయి. మిగిలిన అన్ని రకాల ఎరోబిక్స్ వ్యాయామాలతో పోల్చినపుడు ఇది సురక్షితమైనది. ఆరోగ్యకరమైంది. బాడీమజిల్ని, బోన్స్ని, జాయింట్స్ని ఒత్తిడికి గురిచే యదు. ఎందుకంటే దాదాపు 90 శాతం దాకా మన బరువుకు నీటి సపోర్ట్ లభిస్తుంది.రన్నింగ్, లేదా మరే ఇతర ఫ్లోర్ ఎక్సర్సైజ్లు చేసేవారికి వచ్చే సమస్యలకు భిన్నంగా ఈ వ్యాయామాల వల్ల ఎటువంటి జాయింట్ ప్రాబ్లమ్స్ రావు. నిర్విరామంగా దేహం నీళ్ళలో నానుతూ చల్లబడుతూ ఉండడం వల్ల సహజంగా వర్కవుట్ల కారణంగా పుట్టే వేడి చెమట వంటి ఇతరత్రా ఇబ్బందులు కలగవు. స్విమ్మింగ్ తెల్సి ఉండాలా? ఆక్వా ఎరోబిక్స్ చేయడానికి స్విమ్మింగ్ తెల్సి ఉండనక్కర్లేదు. స్విమ్మర్స్ కాని వాళ్ళు కూడా చేయవచ్చు. అయితే స్విమ్సూట్ మాత్రం తప్పనిసరి. అదే విధంగా ఆక్వా షూస్, స్విమ్ క్యాప్స్ వంటివి కూడా అవసరం. నీళ్ళలో ఉండగా స్థిరత్వాన్ని అందించేందుకు షూస్ ఉపకరిస్తాయి. మీ తల వెంట్రుకలు ముఖంపై పడి ఇబ్బంది పెట్టకుండా క్యాప్స్ కావాలి. వర్కవుట్స్ ఎలాంటివంటే.. బయట చేసే చాలా రకాల వర్కవుట్స్ని నీళ్ళలో కూడా చేయవచ్చు. నడవడం, రన్నింగ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు కూడా. జంపింగ్ జాక్స్ తరహా వ్యాయామాలు కూడా బావుంటాయి. దేహంలోని అన్ని మజిల్స్కూ ఇవి పని కల్పిస్తాయి. స్కైయింగ్ మోషన్ బ్యాక్, ఫోర్త్, లంగ్స్ ఇన్ ఛెస్ట్ డీప్ వాటర్, కిక్ బాక్సింగ్ మూవ్స్... వంటివి కూడా దీనిలో భాగంగా మార్చుకోవచ్చు. పరికరాలున్నాయి... ఈ వర్కవుట్ల కోసం ప్రత్యేకమైన పరికరాలు కూడా లభిస్తున్నాయి. బరువు తక్కువగా అన్పించే ఆక్వా డంబెల్స్ వీటిలో ఒకటి. ఈ డంబెల్స్తో బైసప్స్, ట్రైసప్స్, షోల్డర్స్కు నీళ్ళలో ఉండే వ్యాయామాలు చేయవచ్చు.ఇంకా నూడుల్స్ వంటి విభిన్న రకాల ఎక్విప్మెంట్ కూడా వినియోగించవచ్చు. అవసరమైన వస్తువులు... దాదాపు స్విమ్మింగ్కు అవసరమైన వన్నీ దీనికి కూడా అవసరమే. ఆక్వాబ్లాక్స్, ఫ్లోటేషన్ బెల్ట్స్, గ్లోవ్స్, కిక్బోర్ట్స్, ఆక్వాస్టెప్... వంటి వన్నీ కావాలి. ఎవరికి లాభం? వీటిని ప్రతిఒక్కరూ ప్రయత్నించవచ్చు. వయసుల కు లింగబేధాలకు అతీతంగా. క్రీడాకారులు, నృత్యక ళాకారులు, ఆరోగ్యార్ధులు, కొన్ని రకాల దీర్ఘకాలవ్యా« దులున్న వాళ్ళు, విభిన్న రకాల వ్యాయామాల పట్ల ఆసక్తి ప్రదర్శించేవారు, కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్దితుల వల్ల వ్యాయా మం చేయలేకపోతున్న వాళ్ళు... ఇలా అందరూ చేయదగ్గది. వారంలో 5 రోజులు చేస్తే చాలు. జాగ్రత్తలివే ►ఒంటరిగా వీటిని చేయాలనుకోవద్దు. నీళ్ళలోకి దిగేటపుడు దానిలోతు గురించి ఖచ్చితంగా తెల్సుకోవాలి. ►నీళ్ళు చాలా లోతుగా ఉంటే బ్యాలెన్స్ కోల్పోవడం, సరైన శైలిని కూడా విడవడం జరుగుతుంది. ►వ్యాయామానికి ముందుగా వార్మప్, ముగిసిన తర్వాత కూల్డవున్ ఎక్సర్సైజ్లు తప్పనిసరిగా చేయాలి. ►వాతావరణం బాగా చల్లగా ఉన్నపుడు మరింత చల్లనినీటిలో చేయడం వద్దు. నిర్ణీతవేడి నీళ్ళలో ఉండేలా చూసుకోవాలి. ► వాటర్ వర్కవుట్లంటే నొప్పి కలగనివి. ఏదైనా ప్రత్యేకమైన వర్కవుట్ వల్ల ఇబ్బందులñ దురైతే చేయడం మానేయాలి. ►మీ పరిస్ధితి, సామర్ధ్యాలను బట్టి వ్యాయామాలలో వేగాన్ని నిర్ణయించుకోవాలి. ►నీళ్ళలో వర్కవుట్ కదా అని నీళ్ళు తాగడంలో నిర్లక్ష్యం వద్దు. ప్రారంభంలోనూ, ముగిసిన తర్వాత మీ అవసరాన్ని బట్టి నీళ్ళు తాగుతుండాలి. ►కొత్తగా ప్రారంభిస్తున్నపుడు వైద్యుల సలహా, పర్యవేక్షకుని సూచనలు తప్పనిసరి. ఉపయోగాలెన్నో... ►యస్.సత్యబాబుటెంపరేచర్ కంట్రోల్ ఉన్న స్విమ్మింగ్ఫూల్ ఈ వాటర్ వర్కవుట్స్కు అనుకూలం. ► అన్నిరకాల ‘కార్డియో’వ్యాయామాలు నీళ్ళలో చేయవచ్చు. ►వాకింగ్ వంటి తేలికపాటి ఎక్సర్సైజ్తో ప్రారంభించాలి. ►మాయిశ్చరైజర్, వాటర్ రెసిస్టెంట్ సన్స్క్రీన్లను వాడాలి. ►నేలపైచేసే ఎక్సర్సైజ్లతో పోల్చితే వాటర్వర్కవుట్స్లో హార్ట్రేట్ తక్కువగా ఉంటుంది. కానీ లాభాలు మాత్రం ఎక్కువ. – యస్.సత్యబాబు తక్కువ బరువుండే ఆక్వా డంబెల్స్ను ఉపయోగించి చేసే వర్కవుట్స్ను ప్రారంభించాలిలా డంబెల్స్తో చేసేపుడు లోతు తక్కువగా ఉన్న చోటు ఎంచుకుని చేయాలి. నీళ్ళ నిరోధకశక్తిని ఎదుర్కుంటూ చేతుల్ని నలువైపులా తిప్పుతూ చేసే వర్కవుట్ ఇది. వంటికి తగిలించుకునే ఆక్వా న్యూడుల్స్ కూడా ఈ ఎక్సర్సైజ్లకు ప్రత్యేకం. నీళ్ళలో నిదానంగా తేలుతూ కూడా వర్కవుట్స్ చేయడానికి న్యూడుల్స్ ఉపకరిస్తాయి. స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడం అంటే ఆరోగ్యాన్ని ఆహ్వానించ డమే. అదే నీటిలో అయితే ఆనందాన్ని ఆస్వాదించడం కూడా. -
వేసవి వ్యాధులు... హోమియో పరిష్కారాలు
హోమియో కౌన్సెలింగ్ నా పేరు అనిల్కుమార్. వయసు 35 ఏళ్లు. మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాను. ఎండలో కొంతసేపు తిరిగిన వెంటనే నోరు తడి ఆరిపోతోంది. చెమటలు పడుతున్నాయి. తల తిరిగినట్లు అవుతోంది. దీనికి ముందుజాగ్రత్తలు చెప్పండి. అలాగే హోమియోలో వేసవి సమస్యలకు ఏవైనా పరిష్కారాలు ఉంటే సూచించండి. – సురేందర్రావు, వరంగల్ వేడికి నీరు ఎలా ఆవిరవుతుందో, వాతావరణంలో ఎండ వల్ల వేడిమి పెరిగేకొద్దీ మన శరీరంలోని నీరు కూడా అలాగే ఆవిరి అవుతుంది. ఎండాకాలంలో పెద్దవారు, చిన్నపిల్లలు ఎన్నో రకాల వ్యాధులకు గురవుతారు. మనం చెమట రూపంలో ఆవిరయ్యే నీటితో పాటు, సోడియమ్, పొటాషియమ్ మొదలైన లవణాలు కూడా నష్టపోతుంటాం. మిగతా కాలాల్లో కంటే వేసవిలో చెమట రూపంలో రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు నీటిని కోల్పోతుంటాం. ఎండలో తిరిగితే ఎండ దెబ్బ తగులుతుందని అనుకుంటాం. కానీ ఎండదెబ్బ అనేది హఠాత్తుగా జరగదు. ఆరోగ్యం మీద ఎండ ప్రభావం దశలవారీగా ప్రభావం చూపుతూ, చివరికి ఎండ దెబ్బకు దారితీస్తుంది. ఆ దశలు ... 1) అలసట; 2) హీట్ ఎగ్జాషన్; 3) హీట్ స్ట్రోక్. వడదెబ్బతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలిన వృద్ధులు, మహిళలు, చిన్నారు, విద్యార్థులు హోమియో మందులను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో కొన్ని రకాల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి... వడదెబ్బ, చికెన్పాక్స్, చర్మ సంబంధిత వ్యాధులు, అలర్జీ, చెమటకురుపులు, తలనొప్పి, ఆకలి మందగించడం, టైఫాయిడ్, నీళ్ల విరేచనాలు, మూత్ర సంబంధ వ్యాధులు, కలరా మొదలైనవి. కారణాలు: ∙కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం ∙ఎండల్లో ఎక్కువగా తిరగడం ∙మద్యం సేవించడం ∙బయట కొన్న పదార్థాలు తినడం ∙తీవ్ర ఒత్తిడికి లోనుకావడం లక్షణాలు: ∙నీరసం, తల తిరగడం ∙సొమ్మసిల్లి పడిపోవడం ∙ఒంటినొప్పులు, తలనొప్పి ∙హైఫీవర్, వాంతులు ∙మూత్రం గాఢమైన పసుపురంగులో ఉండి మంటగా రావడం. చికిత్స: వడదెబ్బతో పాటు ఎండాకాలంలో వచే ఇతర వ్యాధులకు హోమియోలో అద్భుతమైన మందులు ఉన్నాయి. వేసవిలో వచ్చే వ్యాధులకు నేట్రమ్మ్యూర్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బ్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి తీవ్రత, లక్షణాలతో పాటు ఇతర వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని వైద్యుల పర్యవేక్షణలోమందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ తిరగబెట్టే అవకాశాలు తక్కువే..! క్యాన్సర్ కౌన్సెలింగ్ క్యాన్సర్ ఉన్న శరీర భాగాన్ని తొలగించివేసిన తర్వాత భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా? నా భార్య (36 ఏళ్లు)కు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేస్తే క్యాన్సర్ ఉన్న ఎడమ రొమ్మును తొలగించి వేస్తారని, అయినప్పటికీ మళ్లీ శరీరంలోని మరో చోట క్యాన్సర్ వస్తుందేమోనని ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతోంది. రాత్రిళ్లు సరిగా నిద్రకూడా పోవడం లేదు. బ్రెస్ట్క్యాన్సర్ వస్తే తప్పనిసరిగా ఆ రొమ్మును తీసివేయాల్సిందేనా? దీనివల్ల వైవాహిక జీవితం దెబ్బతింటుందా? హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుందా? వేరే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా? మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? దయచేసి వివరంగా తెలపండి. – మనోజ్కుమార్, హైదరాబాద్ శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగించివేసిన తర్వాత మళ్లీ క్యాన్సర్ రాదు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందువల్ల అంటే ఆపరేషన్ చేయడం వల్ల మొత్తం క్యాన్సర్ కణాలు సమూలంగా తొలగించడం అన్నిసార్లూ సాధ్యం కాదు. రొమ్ము క్యాన్సర్ సర్జరీ తర్వాత ఆ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కల రేడియేషన్తో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కీమోథెరపీ కూడా చేయడం ద్వారా ఆ ప్రదేశంలో మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. అయితే శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా కొంతమంది మహిళలకు బ్రెస్ట్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చినట్టు గుర్తించారు. అయితే ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం మాత్రం ఇక దాదాపుగా ఉండదు. రెండు అండావయాలను తొలగించి వేసిన మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ మరణాలు 80 శాతం తగ్గిపోయినట్టు, బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం 50 శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తెలిసింది. ఇక బ్రెస్ట్ క్యాన్సర్లో రొమ్మును తొలగించివేయడంపైన చాలా అపోహలు, అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. క్యాన్సర్ సోకినప్పుడు పూర్తి రొమ్మును తొలగిఒచడం చాలా అరుదుగా జరుగుతుంది. రోగ నిర్ధారణ పరీక్షలపై ఆధారపడి క్యాన్సర్ సోకిన భాగాన్ని మాత్రమే తొలగిస్తాం. దాని వల్ల రూపం చెడకుండా, గీత కనిపించకుండా ఉండేందుకు తొలగించిన భాగంలో శరీరంలోని మరో చోటి నుంచి కొంత భాగాన్ని తెచ్చి పార్షియల్ ఫిల్లింగ్ ద్వారా భర్తీ చేస్తాం. తర్వాత సాధారణ రూపంలో పోలిస్తే రొమ్ములో పెద్దగా తేడా కనిపించదు. మొత్తంగా రొమ్మును తీసివేయడం వల్ల మహిళ మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆమె మానసిక కుంగుబాటు (డిప్రెషన్)కు గురికావచ్చు. కానీ రొమ్మును తొలగించడం శరీరంలోని హార్మోన్లు, జీవక్రియలను ఏమీ ప్రభావితం చేయదు. ఇది సాధారణ వైవాహిక జీవితంపై ప్రభావం కూడా చూపదు. మంచి సర్జికల్ ఆంకాలజిస్టులను కలవండి. ఆ నిపుణులు సహాయపడగలరు. మేము స్టేజ్ 1, స్టేజ్2, కొన్నిసార్లు స్టేజ్3 స్థాయిలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు కూడా చికిత్స చేస్తున్నాం. మీ భార్య భయపడుతున్న పరిణామాలు ఏమీ ఎదురవ్వలేదు. అందువల్ల ఆందోళన పడవద్దని చెప్పండి. ఆమె భయపడుతున్నట్లు ఏమీ జరగదు. డాక్టర్ కె. శ్రీకాంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ తగిన జాగ్రత్తలతో... ఫిస్టులా తగ్గుతుంది ఫిస్టులా కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. గత మూడు నెలలుగా మలద్వారం చుట్టూ విపరీతమైన నొప్పి వస్తోంది. కుర్చీ మీద కూర్చోలేకపోతున్నాను. మలద్వారం వద్ద బుడిపె ఏర్పడి అందులోంచి చీము స్రవిస్తోంది. అప్పుడప్పుడూ జ్వరం కూడా వస్తోంది. దీనికి చికిత్స మార్గాలు చెప్పండి. – సందీప్కుమార్, నిర్మల్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే దీర్ఘకాలికంగా మీరు మలబద్దకంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు చెప్పినట్లుగా దీని లక్షణాల్లో భాగంగా మలద్వారం సమీపంలో ఒక చిన్న బుడిపె ఏర్పడుతుంద. ఆ బుడిపె మధ్య భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం నుంచి తరచు చీము, రక్తం వస్తుంటాయి. దీన్ని ఫిస్టులా అంటారు. కొన్నిసార్లు ఫిస్టులా మధ్యలో ఉండే రంధ్రం పూడుకుపోయి లోపల చీము, రక్తం నిల్వ ఉండిపోయి... నొప్పి వస్తుంటుంది. ఈ టైంలో జ్వరం కూడా రావచ్చు. చికిత్స: ఫిస్టులా అన్నది సాధారణంగా మందులతో నయం చేయలేని వ్యాధి. దీన్ని తొలగించడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. అయితే కొన్ని జాగ్రత్తలతో దీన్ని రాకుండా నివారించవచ్చు. నివారణ: n మలబద్దకం లేకుండా చూసుకోవాలి n ఆహారంలో ఆకుకూరలు, పీచుపదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి n ఇలా చేయడం ద్వారా మలబద్దకాన్ని నివారించుకోవచ్చు. తద్వారా పరిస్థితి ఫిస్టులా వరకు వెళ్లకుండా జాగ్రత్త వహించవచ్చు n పరిశుభ్రమైన లో దుస్తులు (అండర్వేర్)లు మాత్రమే ధరించాలి n డ్రైవింగ్ ఎక్కువగా చేసేవారు లేదా ఆ వృత్తిలో ఉన్నవారు మలద్వార ప్రాంతాన్ని ఎప్పుడూ బట్టలతో కప్పివేసి ఉంచేలా కాకుండా... అక్కడ గాలి తగులుతూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి n గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో, ఎండలో శ్రమించేవారు చెమట రూపంలో నీటిని ఎక్కువగా కోల్పోతుంటారు. ఈ కారణంగా కూడా మలబద్దకం రావచ్చు. ఇలాంటివాళ్లు తగినంత మంచినీటిని తాగుతూ ఉండటం ద్వారా మలబద్దకం సమస్యను నివారించుకోవచ్చు. మలబద్దకమే ఫిస్టులా సమస్యకు ప్రధానమైన మూలకారణం అయినందువల్ల... ముందుగా మలబద్దకాన్ని నివారించుకుంటే ఫిస్టులాను నివారించినట్లే అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలి. డా‘‘ఎమ్.ఏ.సలీమ్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ సర్జరీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ -
ఒత్తిడి తగ్గదు సరికదా... ఎక్స్ట్రా డేంజర్స్
పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. చాలా ఒత్తిడి ఉండే వృత్తిలో ఉన్నాను. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాను. ఆ ఒత్తిడి తగ్గించుకోడానికి రోజూ సిగరెట్లు కాలుస్తుంటాను. రోజూ దాదాపు మూడు నాలుగు పెట్టెల సిగరెట్లు తాగుతుంటాను. ఇటీవల నాకు తీవ్రమైన ఆయాసం, దగ్గు వస్తోంది. సరిగా నిద్రపట్టడం లేదు. మామూలు సమస్యే కదా తగ్గిపోతుంది అనుకున్నాను. దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోంది. మందులు వాడుతున్నా రోజురోజుకూ పెరుగుతోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – శామ్యూల్, కరీంనగర్ సిగరెట్ కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు... ఆ తర్వాత వదులుకోలేని వ్యసనంగా మారి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. రోజుకు మూడు పాకెట్ల సిగరెట్లు కాల్చడం అంటే చాలా పెద్ద విషయం. అది ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... చర్మసంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మీరు వెంటనే ధూమపానం మానేయండి. వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడిని తగ్గిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొతతాగడం మానేస్తే... అది మీ ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది. డాక్టర్ పి. నవనీత్ సాగర్రెడ్డి,సీనియర్ పల్మునాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ ఐబీఎస్... భయపడాల్సిందేమీలేదు! హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. భోజనం తిన్న వెంటనే టాయిలెట్కు వెళ్లాల్సి వస్తోంది. బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. మలంలో జిగురు కనిపిస్తోంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి. ఆత్మన్యూనతతో బాధపడుతున్నాను. – మహేశ్కుమార్, తాడేపల్లిగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్వాడటం జన్యుపరమైన కారణాలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. రోగ లక్షణాలను బట్టి, కడుపులో పరాన్నజీవులు ఉన్నాయా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు. మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ పరీక్షలు నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే... జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ చికిత్స ద్వారా చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
టెండనైటిస్ తగ్గుతుంది..!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నేను బాస్కెట్బాల్ ప్లేయర్ను. నాకు కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ను సంప్రదిస్తే టెండన్స్కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు కలుగుతుంది. హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. – మనోజ్కుమార్, నందికొట్కూరు మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి హోమియో ద్వారా పరిష్కారం లభిస్తుంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అంటారు. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. ఇవి సాగగల గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కారణాలు : వయసు పెరగడం, గాయం కావడం... వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్పై అధిగ ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. క్రీడల వల్ల: పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైన వాటివల్ల ∙డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది ∙కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ టెండినైటిస్ సంభవించే అవకాశం ఉంది. లక్షణాలు: ∙టెండినైటిస్కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలను గమనించవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ∙కంప్యూ టర్లను, కీబోర్డులను, మౌస్లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం ∙పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం ∙వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం ∙క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం... ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించి రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల... ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా దానిని నయం చేయడం సాధ్యమవుతుంది. అంతే కాకుండా టెండన్స్ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఆల్ ద బెస్ట్!!
పిల్లలు పరీక్షలకు రెడీ.. ఆల్ ద బెస్ట్!! పేరెంట్స్ చెయ్యాల్సిందంతా చేశారు! స్ట్రెస్ లేకుండా.. స్ట్రెస్ ఇవ్వకుండా పిల్లల్ని పరీక్షలకు పంపించండి! ఆల్ ద బెస్ట్!! పిల్లల పరీక్షలు తల్లిదండ్రులకు పెద్ద పరీక్షే. పిల్లలు ఎలాగూ కష్టపడుతున్నారు. పెద్దల యాంగ్జయిటీ అంతా ‘మనం కూడా కష్టపడుతున్నామా’ అన్నదే. పిల్లల పరీక్షల్లో భాగస్వాములుగా కాకపోతే ఫెయిలవుతామేమో అన్న భయం. ‘ఆ ఫార్మూలా గుర్తుంటుందా?’, ‘ఏ కాంటినెంట్ పక్కన ఆఫ్రికా ఉందో జ్ఞాపకం ఉంటుందా?’, ‘ఏ ప్లస్ బి హోల్స్క్వేర్ ఎంత?’, ‘సెకండ్ టైమ్ రివిజన్ కంప్లీట్ అయిందా?’ , ‘పొద్దున మూడింటికి అలారమ్ పెట్టి లేపుతాను సరేనా?’ .. పిల్లలకు ఇవ్వన్నీ చెప్పాలంటే పేరెంట్స్ ఎంతగా ప్రిపేర్ కావాలి? ప్రిపేర్ అయ్యేది పేరెంట్స్.. పరీక్ష రాసేది పిల్లలు. పిల్లలు మంచి మార్కులతో పాసవ్వాలనే యాంగ్జయిటీలో ఒక్కోసారి పిల్లల్ని కూడా యాంగ్జయిటీకి గురిచేస్తున్నారు. పిల్లల్లో లేని భయాన్ని సృష్టిస్తున్నారు. దాంతో జవాబులన్నీ తెలుసుండీ కూడా ఆన్సర్ పేపర్ ముందుకు వెళ్లేసరికి బ్లాంక్ అయిపోతున్నారు పిల్లలు. అందుకు పిల్లలకు కొంచెం ఊపిరాడే చోటిస్తే బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు. పిల్లలూ అదే కోరుకుంటున్నారని తెలిసింది.. ఓ సోడా కంపెనీ తన సీఎస్సార్ కింద చేసిన ఓ డిజిటల్ ప్రమోషన్లో. ఇందులో పెద్దలు పెట్టిన ఒత్తిడితో సతమతమవుతున్న çపధ్నాలుగు, పదిహేనేళ్ల వయసు పిల్లలు.. పెద్దల నుంచి తాము ఎలాంటి మద్దతును ఆశిస్తున్నారో తెలుపుతూ తమ తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశారు. చూస్తుంటే.. వింటుంటే.. హృదయం ద్రవిస్తోంది. ఆ ఉత్తరం ముక్కలను మీకోసం పట్టుకొచ్చాం.. ఒక్కసారి చదవండి! పిల్లల మనసు అర్థమవుతుంది! మీ స్ట్రెస్ చూస్తుంటే నర్వస్గా ఉంటుంది.. ప్రియమైన అమ్మా, నాన్నకు.. నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. అయినా చదువు విషయంలో మీ ప్రవర్తన నాకు అర్థంకాదు. ఫ్రెండ్స్తో కలవనివ్వరు. ఆడుకోనివ్వరు. ఓ బందీలా చూస్తారు. ఎందుకమ్మా? ఎందుకు నాన్నా? నాకు పరీక్షలొస్తున్నాయంటే మీరు స్ట్రెస్ ఫీలవుతారు. మీ స్ట్రెస్ చూస్తుంటే నాకు నర్వస్గా ఉంటుంది. మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమంటే నాకు చాలా కన్సర్న్ నాన్నా.. అమ్మా! కాని కొన్నిసార్లు, కొన్ని విషయాల్లో నన్ను వదిలేయండి. నన్నుగా ఉండనివ్వండి. ప్లీజ్! జీవితంలో మీ గౌరవాన్ని ఎక్కడా తగ్గించను. నన్ను కన్నందుకు మీరు గర్వపడేలా చేస్తాను. ఇట్లు మీ కూతురు కేసంగ్ నన్ను నమ్మండి ప్లీజ్ డియర్.. అమ్మా అండ్ అప్పా.. ఏ విషయంలోనైనా నాకెంత బెరుకు, భయమో మీకు తెలుసు. ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకొని మీకు ఈ ఉత్తరం రాస్తున్నా. కిందటేడాది నేను మంచి మార్కులు తెచ్చుకోలేదు. కాని ఈసారి మార్కుల కోసం బాగా కష్టపడుతున్నా. టీవీలో ఫుట్బాల్, క్రికెట్ మ్యాచెస్ చూడాలనుకుంటా. వాటితో రిలాక్స్ అవాలనుకుంటా. నా ప్రెషర్ తగ్గించుకోవాలనుకుంటా. కాని మీరు పరీక్షల కోసం టీవీ కనెక్షన్ కట్ చేయించారు. దయచేసి నన్ను అర్థంచేసుకోండి! నేను బాగా చదువుతున్నాను. నన్ను నమ్మంyì ప్లీజ్! మీ ప్రవర్తన వల్ల చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నా. ఎవరితో మాట్లాడకుండా బాత్రూమ్లోకి వెళ్లి తలుపేసుకొని నన్ను నేను బంధించుకోవాలనిపిస్తోంది. మనింటిని నార్మల్ హౌజ్లా ఉంచడమ్మా...! ఇట్లు మీ అబ్బాయి కార్తిక్ ప్లీజ్ హెల్ప్ మీ నాన్నా.. ప్రియమైన నాన్నకు.. నాకు ఎగ్జామ్స్ అంటే భయంలేదు. మీరంటేనే భయమేస్తోంది. ఎంతలా అంటే మిమ్మల్ని తలచుకుంటే ధైర్యం రావాల్సింది పోయి కళ్లల్లో నీళ్లొస్తున్నాయి. అందరిముందు నిషి ఆంటి కూతురుతో నన్ను కంపేర్చేయొద్దు ప్లీజ్! నన్ను నాలా ఉండనివ్వండి నాన్నా! నువ్ అనుక్షణం నా గురించే ఆలోచిస్తూ.. నాతోనే ఉన్నా నువ్వు నాతో ఉన్నావన్న ధైర్యమే నాకు రావడంలేదు నాన్నా.. నిన్ను తలచుకుంటేనే భయమేస్తోంది. ప్లీజ్ హెల్ప్ మీ నాన్నా.. మీ లవింగ్ డాటర్ నిఖిత భయమేస్తోంది.. ప్రియమైన అమ్మా, నాన్నకు.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. భయమేస్తోంది. సరిగ్గా రాయలేనేమో అని కాదు.. మీరు నామీద పెట్టుకున్న అంచనాలను తలచుకుంటే భయమేస్తోంది. నా చదువు పట్ల మీరెంత శ్రద్ధ పెడుతున్నారో నాకు తెలుసు. కానీ నేనూ అంతే కష్టపడుతున్నానని మీకెందుకు అర్థంకావట్లేదమ్మా? ఎంత చదువుతున్నా.. ఎన్ని మార్క్స్ వస్తున్నా ఇంకా చదవట్లేదనే తిడ్తున్నారు. తట్టుకోలేకపోతున్నానమ్మా.. అందుకే పరీక్షలు వస్తున్నాయంటే భయమేస్తోంది! మీ ఒత్తిడికి ఊపిరాడనట్టవుతోంది. స్కూల్ నుంచి, మీ నుంచి పారిపోవాలనిపిస్తోంది. ప్లీజ్ నన్ను డిమోటివేట్ చేయొద్దమ్మా! నా మానాన నన్ను చదవనివ్వండి. మీరు తలెత్తుకునేలా చేస్తాను. ప్రామిస్! లవ్ యూ మా.. లవ్ యూ పా..! ఇట్లు మీ కూతురు అనీష మార్కులు తప్ప జీవితమే లేనట్టు... డియర్ మదర్.. నాతో నువ్వెప్పుడూ మార్కులు, కాంపిటీషన్ గురించే మాట్లాడతావ్! నువ్వు చెప్పినన్ని మార్కులు తెచ్చుకోకపోతే.. టాపర్స్తో కంపీట్ చేయలేకపోతే ఇక నా లైఫ్ వేస్ట్ అన్న ఫీలింగ్ను కలిగిస్తున్నావ్! మార్కులు తప్ప నాకు ఇక లైఫే లేదన్న ఫీల్ వస్తోందమ్మా..! జీవితమంటే మార్కులేనా అమ్మా...? నువ్వు, నాన్న .. నాతో ఒక్కసారి కూడా నెమ్మదిగా మాట్లాడరు. మార్కుల గురించి కాక ఇంకో టాపిక్ తీసుకురారు. మీరనుకున్నదానికంటే ఒక్క మార్క్ తక్కువైనా నా మీద గట్టిగట్టిగా అరుస్తారు. తిడ్తారు. మీరు తిట్టిన రాత్రిళ్లు ఒక్క క్షణం కూడా నాకు నిద్ర ఉండదు తెలుసా అమ్మా.. ! నువ్వు నామీద అరిచిన ప్రతిసారీ నాకెంతో దూరమైపోయినట్టు.. నువ్వో కొత్త మనిషిలా కనిపిస్తావమ్మా! ఆ క్షణంలో నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. కడుపులో తిప్పుతుంది. వామ్టింగ్ వచ్చినట్టువుతుంది. అమ్మా.. నేను బాగా చదువుతానమ్మా.. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను తిట్టొద్దమ్మా! మీ కూతురైనందుకు చాలా గర్వంగా ఉంది. నాకోసం ఇంతగా కష్టపడుతున్నందుకు మీకెప్పుడూ రుణపడి ఉంటా. మీ గౌరవం నిలబెడ్తా. ఇట్లు మీ చిట్టితల్లి టీనా మైడియర్ పేరెంట్స్.. పది గంటలపాటు ఒక్క ఉదుటున.. కుదురుగా కూర్చోని చదివేంత ఎనర్జి నాకు లేదని మీకు తెలుసు. అయినా ఎటూ కదలనివ్వకుండా నా గదిలో కూర్చోబెట్టి చదివిస్తుంటారు. పైగా అరగంటకు ఒకసారి వచ్చి చెక్ చేస్తుంటారు నేను కుదురుగా ఉన్నానో లేదోనని. ఇదంతా నాకు చాలా బాధగా ఉంది. మీరలా చేయడం వల్లే నేను నా కాన్సంట్రేషన్ను కోల్పోతున్నాను. అమ్మా... నాన్నా.. ప్లీజ్ మాటిమాటికి నా సిన్సియారిటీని చెక్ చేయకండి! నా కాన్ఫిడెన్స్ను దెబ్బతీయకండి.ప్లీజ్... ఇట్లు మీ అబ్బాయి అన్షుల్ ఇవి ఉత్తరాలు కావు.. పసి హృదయాల ఆవేదనకు అక్షర రూపాలు. టీనేజర్స్లో అంతకంతకు పెరుగుతున్న డిప్రెషన్, సూసైడల్ టెండన్స్లకు కారణం పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టే ఒత్తిడేనని ఎన్నో నివేదికలు, మానసిక విశ్లేషణలూ ఘోషిస్తున్నాయి. ఈ తరమే రేపటి మన దేశ బంగారు భవిష్యత్తు. వాళ్ల అభ్యర్థనను అర్థం చేసుకుందాం. మన పిల్లల్ని కాపాడుకుందాం! మార్కుల మిల్లుల్లా కాదు మానవత్వమున్న మనషుల్లా పెంచుకుందాం! -
పరీక్షలకు వారం ముందు తీవ్ర ఒత్తిడి
న్యూఢిల్లీ: మరో వారంలో పరీక్షలు ఉన్నాయంటే విద్యార్థులు పడే ఒత్తిడి ఓ రేంజ్లో ఉంటుందని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది. పరీక్షలు ఒక నెల రోజుల సమయం ఉండగా కేవలం 13.4 శాతం మాత్రమే ఉన్న ఒత్తిడి అదే వారం రోజుల ముందు 82.2 శాతానికి చేరుకుంటుందని తేలింది. విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులపై ఈ పరీక్షల ఒత్తిడి ఎంతో ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రుల అంచానాలను అందుకోవడంపై 16 ఏళ్ల విద్యార్థి తీవ్ర ఒత్తిడికి గురవుతుండగా, 17 ఏళ్ల విద్యార్థి గతంలో పొందిన తక్కువ మార్కులపై తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని అధ్యయనం తేల్చింది. ఒక కచ్చితమైన సమయపాలన, చదివే విధానాలను అవలంబించి ఒత్తిడిని అధిగమించవచ్చునని సైకాలజిస్టు సుష్మ హెబ్బార్ సూచించారు. సాధారణంగా చాలా మంది చివరి నిమిషంలో చదివే విధానాలను మార్పు చేస్తుంటారని అలా చేయకుండా అవే పద్ధతులను కొనసాగించాలని సుష్మ తెలిపారు. -
రిలాక్స్... రీఛార్జ్
యోగా వ్యాయామం ఏదైనా సరే ఒత్తిడిని దూరం చేయాలే తప్ప మరింత ఒత్తిడికి గురి చేయకూడదు. మరీ ముఖ్యంగా మండు వేసవిలో యోగ సాధన చేసేవాళ్లు... పూర్తి రిలాక్స్డ్గా ఉండాలి. అప్పుడే ఆసనాలు రీఛార్జ్ సాధనాలుగా మారతాయి. యోగ సాధన సమయంలో ఒత్తిడి దరి చేరకుండా మధ్యలో రిలాక్స్ అయ్యేందుకు సైతం కొన్ని ఆసనాలు చేయవచ్చు. నిరాలంబాసన: పొట్టమీద పడుకుని ఆసనాలు చేస్తున్నప్పుడు మధ్యలో రిలాక్స్ అవడానికి చేసే ఆసనం ఈ నిరాలంబాసనం. బోర్లా పడుకుని ఏదైనా ఆసనం చేస్తున్నప్పుడు (ఉదాహరణకు ధనురాసనం, శలభాసనం, సానాసనం) పొట్టమీదనే కాకుండా ఊపిరితిత్తులు, గుండె భాగాలపై కూడా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది కనుక అలాంటి ప్రతి ఆసనం చేసిన తరువాత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా అవసరం. అంటే, శ్వాస వేగం తగ్గి తిరిగి శ్వాస సాధారణ స్థితికి వచ్చేంతవరకు రిలాక్స్ అవ్వాలి. నిరాలంబాసనంలో రిలాక్స్ అయ్యేటప్పుడు పొట్ట, పొత్తి కడుపు, కటి భాగాలు పూర్తిగా సౌకర్యవంతంగా కింద కుర్చీసీటులో ఆని ఉండాలి. ఊపిరితిత్తులకు గుండెకు విశ్రాంతి కోసం ఛాతీభాగం పైకి లేపి గడ్డం కింద రెండు చేతులతో సపోర్ట్ ఉంచాలి. ఈ ఆసనం నేల మీద చేసినట్లయితే కాళ్లు రెండు నేల మీద ఉంచవచ్చు. కుర్చీలో చేస్తున్నాం కనుక కాళ్లు రెండూ చాపి (స్టెచ్ చేసి) ఉంచిన దానికన్నా మడచి ఉంచినందువల్ల హామ్స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్, గ్లూటియస్ కండరాలు పూర్తిగా రిలాక్స్డ్గా ఉంటాయి. ఈ ఆసనంలో పొట్ట భాగాలకు సున్నితంగా మసాజ్ జరుగు తుంది. పొట్టలోని ట్రేప్డ్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది. స్పైనల్ డిజార్డర్స్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. హై బిపి, మానసిక ఒత్తిడి, ఫాటిగ్యూ, యాంగై్జటీ వంటి సమస్యలను దూరం చేసి మనసుకు ప్రశాంతతను కలుగజేస్తుంది. ఆలంబన అనగా సపోర్ట్, నిరాలంబన అనగా నో సపోర్ట్ అంటే ఈ స్థితిలో మనసుకు ఆలోచనరహిత స్థితికి చేరే అవకాశం ఉన్నది. (మనసుకు ఆలోచనలే ఆలంబన) కనుక దీనికి నిరాలంబాసన అని పేరు. సాలబం భుజంగాసన : ఇంతకు ముందు ఉన్న నిరాలంబ స్థితిలో నుండి, అరచేతులు కుర్చీసీటు భాగంలో గట్టిగా ప్రెస్ చేస్తూ ఛాతీని కొంచెం పైకి లేపి మడిచి ఉంచిన కాళ్లను స్ట్రెయిట్గా వెనుకకు స్ట్రెచ్ చేసి, తలని గడ్డాన్ని వీలైనంత పైకి లేని 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత తిరిగి వెనుకకు నిరాలంబాసనంలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి. ఇది బిగనర్స్కి కొత్తసాధకులకు ముందుంగా ఇవ్వబడే తేలికపాటి బ్యాక్ బెండ్ పోశ్చర్. ఉపయోగాలు: లో బ్యాక్ పెయిన్ అంటే ఔ1 నుంచి ఔ5 రీజియన్లో ఉన్న సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. అబ్డామినల్ మజిల్స్కి వ్యాయామం అవుతుంది. లంగ్స్ ఛెస్ట్, హార్ట్ మజిల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఇది తేలికపాటి ఆసనం కనుక ఆస్త్మా సమస్య, ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్న వాళ్లు కూడా చక్కగా సాధన చేయవచ్చు. కచ్చితమైన రిలీఫ్ దొరుకుతుంది. జాగ్రత్తలు: ఏదైనా బ్యాక్ ఇంజ్యూరీ అయ్యి స్పైనల్ సర్జరీ అయిన వాళ్లు, తొలి త్రైమాసికంలో ఉన్న గర్భిణీస్త్రీలు నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. రెండవ లేదా మూడవ త్రైమాసికంలో ఉన్న స్త్రీలు పొట్టమీద పడుకొని చేసే ఆసనాలు ఏవీ కూడా చేయకూడదు. దానికి బదులుగా ఇదే భంగిమని గోడకి ఎదురుగా కొంచెం దూరంలో ఆపోజిట్లో నిలబడి చేతులు రెండు గోడకి ప్రెస్ చేస్తూ షోల్డర్, ఛాతీ ఓపెన్ అయ్యేటట్లుగా ప్రయత్నం చేయవచ్చు. సమన్వయం: సత్యబాబు ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
సిరలు ఉబ్బడం వల్లనే ఆ ఇబ్బంది
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 51 ఏళ్లు. విపరీతంగా ముక్కితే గానీ నాకు మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – కేశవరావు, హబ్సిగూడ ఇటీవల మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్వామికా, అల్యూమినా, కొలిన్సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ ఎ.ఎం.రెడ్డి సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ గుక్కపడితే పాప నీలంగా మారుతోంది! పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు 10 నెలలు. ఒక్కోసారి ఇక అదేపనిగా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటుంది. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం నీలంగా అవుతోంది. ఆ సమయంలో పాపను చూస్తుంటే ఆందోళనగా ఉంది. దయచేసి పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – షమీమ్బేగం, కొత్తగూడెం మీ పాప ఎదుర్కొంటున్న సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. అంటే పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండిపోతుందన్నమాట. పిల్లల్లో కోపం / ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నారుల్లో ఐదు శాతం మందిలో ఇది చాలా సహజం. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఇలాంటి లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ కొన్ని అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు. ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్లో... సింపుల్, సైనోటిక్, పాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి అవసరం. చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ లక్షణం కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా ఏవైనా తీవ్రమైన సమస్య ఉందేమో అన్నది తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్ను సంప్రదిస్తే చాలు. డాక్టర్ రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ హైదరాబాద్ -
‘వైకుంఠ’ దర్శన టికెట్ల కోసం ఒత్తిడి
టీటీడీకీ భారీగా అందుతున్న లేఖలు సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శన టికెట్ల కోసం టీటీడీపై ఒత్తిడి పెరిగింది. అతిముఖ్యమైన ఆ పర్వదినాన స్వామిని దర్శించుకునేందు కు ప్రముఖులు పోటెత్తనున్నారు. ఆ మేరకు లేఖలు అందుతున్నా పరిమిత సంఖ్యలోనే టికెట్లు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 8న వైకుంఠ ఏకాదశి, 9న ద్వాదశి ఘడియల్లో మాత్రమే తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) తెరిచి భక్తులను అనుమతిస్తారు. ప్రదక్షిణ చేసేందుకు వీఐపీ భక్తులు మరింత పోటెత్తే అవకాశం ఉందని ఇప్పటికే టీటీడీ అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే వందల సంఖ్యలో లేఖలు, ఫ్యాక్స్ సమాచారం, సెల్ఫోన్ సందేశాలు అందుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణకు చెందిన సుమారు 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరో 20 మంది ఎంపీలు, 200 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, మరో 100 దాకా న్యాయవిభాగం ప్రముఖులు రానున్నారు. ఆ మేరకు వారి నుంచి వైకుంఠ దర్శనం కోసం టీటీడీకి సిఫారసు లేఖలు అందాయి. వీఐపీలు, వారి బం«ధువులు కలిపి వేల సంఖ్యలోనే తిరుమలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. టికెట్లలో భారీగా కోత రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాల్లో భారీగా కోత వేసి, ఒకరికి 6 టికెట్లు మించకుండా కేటాయింపులు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు భావిస్తున్నారు. 2014లో ఏకాదశి రోజున 2,700 టికెట్లు, 2015లో 2,800 టికెట్లు మాత్రమే కేటాయించి, వారికి వేకువజామున 3.30లోపే దర్శనం పూర్తి చేశారు. అదే విధానాన్ని ఈసారి కూడా అమలు చేయా లని యోచిస్తున్నారు. ఏకాదశిన తరలివచ్చే ప్రముఖులకు బస, దర్శనం కల్పించే విషయంలో టీటీడీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. గదుల కేటాయింపును రెవెన్యూ, రిసెప్షన్ విభాగా««ధిపతులకు అప్పగించింది. వీటిని సజావుగా నిర్వ హించేందుకు 60 మందికిపైగా సిబ్బందిని నియమించారు. 7వ తేదీ నుంచే సుమారు 3 నుంచి 4 వేల వరకు గదులు ముందస్తుగా బ్లాక్ చేయనున్నారు. -
వ్యాయామం చేస్తే నిద్రపడుతుందా? పట్టదా?
లైఫ్ స్టైల్ కౌన్సెలింగ్ నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. అయితే వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. ఇందులో ఏది వాస్తవమో చెప్పండి. – శివకుమార్, హైదరాబాద్ మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్సైజ్కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ పగటి వెలుగు వచ్చాక చేస్తే ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వ్యాయామం చేయలేకపోతే సాయంత్రం చేయవచ్చు. రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంటుంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండాలి. ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవి కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు. యోగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్ చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్గా) కాకుండా... మరీ తక్కువగా కాకుండా... మాడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. కంటినిండా నిద్రపొండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్ స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ సీఎబీజీ అంటే... కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 65. ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని చెప్పారు. సీఏబీజీ అంటే ఏమిటి? – నీరజ, కందుకూరు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తసరఫరా అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం సాధారణంగా బైపాస్ సర్జరీ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో ‘కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్’ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్ (అడ్డంకి)ని బైపాస్ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్ చేసే ప్రక్రియను రీ–వాస్క్యులరైజేషన్ అంటారు. ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్ అయిన నాళాల వద్ద బైపాస్ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్ అపోహ పడకూడదు. అందుకే ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా రోగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. డాక్టర్మ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మరీ ఒత్తిడికి లోనుకావద్దు...
ఫ్యామిలీ డాక్టర్ నా వయసు 35 ఏళ్లు. ఒక ప్రైవేటు కంపెనీలో ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాను. మాకు ఎప్పటికప్పుడు టార్గెట్స్ ఉంటాయి. ఇతర కంపెనీల నుంచి పోటీ వల్ల పని ఒత్తిడి కూడా ఎక్కువైంది. అయితే కొంత కాలం నుంచి నేను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. గుండె బరువుగా ఉండటం, ఛాతీలో నొప్పి రావడంతో పాటు ఒక్కోసారి గుండె అతి వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను. డాక్టర్ను కలిస్తే బీపీ ఉందని చెప్పారు. మందులు రాసిచ్చారు. వాడుతున్నాను. ఉద్యోగపరమైన ఒత్తిడి తగ్గించుకోవాలన్నారు. కానీ టార్గెట్ పూర్తి చేస్తేనే జీతం వస్తుంది. ఈ వయసులో ఉద్యోగం మారలేను. పని ఒత్తిడి వల్ల నాకు భవిష్యత్తులో ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి చెప్పండి. - శ్రీధర్, నిడదవోలు సాధారణంగా బీపీ లేదా గుండెజబ్బులు అప్పట్లో వయసు రీత్యా మాత్రమే వచ్చేవి. కానీ గత దశాబ్దకాలం నుంచి పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. ఉద్యోగం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి లేదా ఇతరత్రా కారణాల వల్ల నిండా పాతికేళ్లు నిండని వయసు వాళ్లలో కూడా గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి తీవ్రమైన అనర్థాలు కూడా జరుగుతున్నాయి. బీపీతో మొదలైన సమస్య తీవ్రమైన గుండెపోటుకు దారితీస్తుంది. చికిత్స అందించి ప్రాణాలను కాపాడే సమయం కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు. గుండె సమస్యలనేవి ఆ స్థాయిలో లోలోపలే చేయాల్సిన చేటును చేసేస్తాయి. ఇక మీ విషయానికి వస్తే... మీరు చెబుతున్న లక్షణాలు గుండెకు సంబంధించిన సమస్యలేనని కచ్చితంగా చెప్పవచ్చు. పని ఒత్తిడి వల్ల ఇప్పటికే మీరు బ్లడ్ ప్రెషర్ బారిన పడ్డారు. అలాగే మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల గుండె లయలోనూ మార్పులు సంభవిస్తున్నట్లు కనిపిస్తోంది. మీరు ఎక్కువగా మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తుండటంతో అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమస్య ఇప్పుడు చిన్నదిగా కనిపించినా, ఆ తర్వాత బీపీ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. మీ కుటుంబలోగానీ, మీ వంశంలో గానీ ఎవరికైనా గుండెజబ్బులు లాంటివి ఉంటే త్వరగా అవి మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్ను కలిసి వీలైనంత త్వరగా సరైన పరీక్షలు చేయించి, గుండె పనితీరును తెలుసుకొని తగిన మందులు వాడాల్సిన అవసరం ఉంది. మీరు సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త వహించండి. రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయాయం, లేదా వాకింగ్ చేయండి. మంచి జీవనశైలి నియమాలు పాటించండి. పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మానసికంగానూ ప్రశాంతత చేకూరుతుంది. ఆరోగ్యమూ కుదుట పడుతుంది. డాక్టర్ ఎ. రవికాంత్ సీనియర్ కార్డియాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ తలనొప్పి తగ్గేదెలా? నాకు 26 సంవత్సరాలు. గత మూడు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. తల చుట్టూ తాడు బిగించినట్లుగా నొప్పి వస్తోంది. ఒక్కోసారి రోజంతా కూడా వస్తోంది. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - నీరజ్, వరంగల్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు టెన్షన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఆలోచనలు ఎక్కువ కావడం, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి ఎక్కువ కావడం, మానవసంబంధాలలో మార్పులు రావడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడే రిలాక్సేషన్ థెరపీ, కౌన్సెలింగ్తో తగిన ఉపశమనం పొందవచ్చు. అప్పటికీ తగ్గకపోతే మందులు వాడటంతో కూడా యాభై శాతం కేసుల్లో తలనొప్పిని తగ్గించవచ్చు. దాదాపు మూడు నుంచి ఆరు నెలల పాటు ఈ మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ముందుగా మీ సమస్యకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి డాక్టర్ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, సమస్యను నిర్ధారణ చేసుకున్న తర్వాతే మందులు వాడాలి. నా వయసు 30 ఏళ్లు. గత పదేళ్లుగా తలనొప్పితో బాధపడుతున్నాను. తలనొప్పి వచ్చే ముందు చూపు సరిగా కనిపించదు. తర్వాత భరించలేనంత నొప్పి వస్తోంది. ఆ తర్వాత ఏ మాత్రం శబ్దం విన్నా, ఎండ చూసినా తట్టుకోలేకపోతున్నాను. నొప్పి వచ్చిన రెండు రోజుల వరకు నీరసించిపోతున్నాను. మా అమ్మగారికి కూడా తలనొప్పి వస్తోంది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. - శైలజ, విజయవాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న యువతుల్లో ఎక్కువ. వేళకి భోజనం చేయడం, ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం, కంటి నిండా నిద్రపోవడం వంటివి చేయడం ద్వారా దీన్ని చాలావరకు నివారించవచ్చు. అయితే బాగా ఎండలోగానీ, చలిలోగానీ బయటకు వెళ్లకపోవడం మేలు. పని ఒత్తిడి ఎక్కువైనా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పనిచేసే చోట సరైన పొజిషన్లో కూర్చుని పనిచేయడం కూడా ముఖ్యమే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చేయడం అవసరం. పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటిస్తూ, ఈ మైగ్రేన్ తలనొప్పి మళ్లీ రాకుండా మందులు వాడాల్సి ఉంటుంది. మీరు ముందుగా మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్ను సంప్రదించి, సమస్య నిర్ధారణ జరిగాక, తగిన మందులు వాడితే మీ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళీధర్రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
నోట్ల రద్దు...బ్యాంకర్లపై ఒత్తిడి
విజయవాడ: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు ఆర్బీఐ నుంచి తమకు ఒత్తిడి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా.. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అంతా ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బ్యాంకర్లు.. పది రోజుల నుంచి డిపాజిట్లను స్వీకరించడం తప్ప తాము ఏ పనిచేయలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం, ఆర్బీఐల నుంచి తమకు తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆరోగ్యాన్ని ఫిట్గా ఉంచుదాం..
సాక్షి, సిటీబ్యూరో ఆధునిక జీవనంలోని ఒత్తిడిని అధిగమించి చక్కని ఆరోగ్యాన్ని సొతం చేసుకోవాలంటే వ్యాయామమే మార్గమని పలువురు సినీ సెలబ్రిటీలు సూచించారు. జూబ్లిహిల్స్ రోడ్నెం:36లో నెలకొల్పిన వెంకట్ ఫిట్నెస్ ఎట్ సోల్ను సినీహీరో రామ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఎంతో కాలంగా పరిచయం ఉన్న వెంకట్ ట్రైనర్గా చక్కని పనితీరు కనబరుస్తారన్నారు. ట్రైనర్ వెంకట్ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు, పర్సనల్ ట్రైనింగ్ తమ ప్రత్యేకతలన్నారు. కార్యక్రమంలో టాలీవుడ్ యువ కథా నాయకులు ప్రిన్స, చరణ్దీప్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్షన్.. టెన్షన్
* మారుతున్న జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి * విజయవాడ, గుంటూరు నగరాల్లో సర్వే * 25 శాతం మందికి ఇదే ప్రధాన సమస్య * ప్రాథమిక దశలో గుర్తిస్తే మంచిదంటున్న వైద్యనిపుణులు * నేటి నుంచి ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు తెల్లారి లేస్తే అంతా ఉరుకులు పరుగులే... జీవనశైలి మారిపోయింది. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి..? ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం.. గుంటూరు డెస్క్: విజయవాడ, గుంటూరు ప్రాంతాలు రాజధానిగా అభివృద్ధి చెందడంతో మానసిక వత్తిళ్లు సైతం అదే రీతిలో పెరుగుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. ఇటీవల ఓ సంస్థ రెండు నగరాల్లో 1250 మందిని సర్వే నిర్వహించగా, ప్రతి నలుగురులో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యకు గురవుతున్నట్లు తేలింది. అంటే 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. 22–29 సంవత్సరాల మధ్య వయస్సు వారు 55 శాతం మంది వత్తిళ్లకు గురవుతుండగా, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు 42.5 శాతం మంది మానసిక వత్తిళ్లకు గురవుతున్నట్లు తేలింది. వ్యాధులకు మూలం ఒత్తిళ్లు.. వ్యక్తులు సమర్థులైన, బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలంటే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. శారీరక శ్రమ తక్కువ, మానసిక శ్రమ ఎక్కువ అయిపోతున్న ఆధునిక జీవనశైలిలో గుండెజబ్బు, మధుమేహం, అల్సర్లు వంటి రుగ్మతలు చోటుచేసుకుంటున్నాయి. పదేళ్లలోపు పిల్లల నుంచి కళాశాల విద్యార్థుల వరకు, అలాగే ఉద్యోగులు, గృహిణిలు, వ్యాపారస్తులు, సేవా రంగంలో ఉన్న వారు తమ రోజువారీ జీవితాల్లో తీవ్రమైన మానసిక వత్తిడికి, శ్రమకు గురవుతున్నారు. గ్రామీణుల కంటే పట్టణ వాసులే ఎక్కువ మానసిక సంఘర్షణకు గురవుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు. మానసిక ప్రథమ చికిత్స... ఈ ఏడాది నినాదం సమాజంలో రోజు రోజుకు మానసిక సంఘర్షణలకు గురవుతున్న వారి సంఖ్య పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా అక్టోబరు 4 నుంచి 10 వరకూ మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలను నిర్వహించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతిఏటా ఒక నినాదంతో ముందుకెళ్తుండగా, ఈ ఏడాది మానసిక ప్ర«థమ చికిత్స (సైకాలజిక్ ఫస్ట్ ఎయిడ్) అనే థీమ్తో అవగాహన కలిగించనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలు, వైద్య సంఘాలు మానసిక ఆరోగ్యంపై వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.. ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యం అందుబాటులో ఉంది. సమస్య తీవ్రతరం కాకుండా ప్రాథమిక దశలో గుర్తించి మానసిక వైద్యుడిని సంప్రదిస్తే కౌన్సెలింగ్తో పాటు, మందుల ద్వారా నయం చేయవచ్చు. – డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులు యుక్త వయస్సు వారిలో ఎక్కువ సమస్యలు.. యుక్త వయస్సులో ఉన్న వారే ఎక్కువగా మానసిక సంఘర్షణలకు గురవుతున్నారు. పెళ్లైన∙కొత్తలో భార్యాభర్తల మధ్య సర్దుబాటు సమస్యలు, ఇద్దరూ వేర్వేరు ఆలోచనలు కలిగి ఉండటం అందుకు కారణంగా నిలుస్తున్నాయి. కొన్ని సందర్భాలలో విడాకుల వరకూ దారితీస్తుంది. సెక్సువల్ ప్రాబ్లమ్స్తో కూడా మా వద్దకు వస్తున్నారు. అటువంటి వారికి కౌన్సెలింగ్ ద్వారా వత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేలా చేయవచ్చు. విద్యార్థుల్లో వత్తిడితో కూడుకున్న సమస్యలు పెరిగిపోయాయి. వారిని ఈ సమస్య నుంచి కాపాడుకోవాలి. – డాక్టర్ టీఎస్రావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించడమే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోవడమే మానసిక వత్తిళ్లు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రోజులో ఇద్దరు కలిసి అర్ధగంట కూడా మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. పిల్లలతో కలిసి ఉండే సమయం కూడా చాలా తక్కువే. దీంతో వత్తిళ్ల నుంచి ఉపశమనం లభించడం లేదు. ఒకప్పుడు ఇంట్లోని అమ్మమ్మ, తాతయ్యలు తమ ఓదార్పు ద్వారా వత్తిడిని పోగోట్టేవారు. ఇప్పుడు అలాంటి వారు లేక పోవడంతో కౌన్సిలర్స్ను ఆశ్రయిస్తున్నారు. – డాక్టర్ గర్రే శంకరరావు, ఉపాధ్యక్షుడు, ఏపీ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ -
పెద్ద సమస్య అయితే తప్ప యాంటిబయాటిక్స్ వద్దు!
పరిపరి శోధన పిల్లలకు దగ్గు వస్తున్నా లేదా జలుబు కనిపించినా తల్లిదండ్రులు తమంతట తామే వారికి యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. పిల్లలకు వచ్చే సమస్యతో తల్లడిల్లిపోయి తక్షణం తగ్గడానికి యాంటీబయాటిక్స్ రాయమంటూ డాక్టర్లను అడుగుతుంటారు. అయితే చిన్న చిన్న సమస్యల కోసం ఆన్ కౌంటర్ మెడిసిన్గా లేదా డాక్టర్ను ఒత్తిడి చేసైనా పిల్లలకు యాంటీబయాటిక్స్ వాడటం సరికాదని తాజా పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇలా చిన్న వయసులోనే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పెద్దయ్యాక వారిలో డయాబెటిస్ వచ్చేలా చేసేందుకు అవకాశాలు ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కోసారి చిన్న వయసులోనే కనిపించే టైప్-1 డయాబెటిస్ కూడా వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. పిల్లలందరిలోనూ ఈ అవకాశం ఎక్కువే అయినా మగపిల్లల్లో ఇలా జరిగే అవకాశాలు మరింత ఎక్కువని ‘జర్నల్ నేచర్ మైక్రోబయాలజీ’ అనే మెడికల్ జర్నల్ వివరిస్తోంది. -
హైకోర్టు చెప్పినా వేధింపులా?
పంజగుట్ట: గణేష్ ఉత్సవాలను గతంలో మాదిరిగానే నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసినా పోలీసు అధికారులు నిబంధనల పేరుతో వేధించడం తగదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు అన్నారు. గణేష్ నిమజ్జనంతో కాలుష్యం వెలువడటం లేదని పొల్యూషన్ కంట్రోల్బోర్డు నివేదిక ఇచ్చిందని, ఎత్తు విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు పేర్కొన్నా ఎత్తు తగ్గించాలని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు హిందువుల హక్కని, ఇందుకు పోలీసుల అనుమతి అవసరం లేదని, కేవలం సమాచారం ఇస్తే సరిపోతుందన్నారు. వినాయక ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, నిమజ్జనం రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. నగరంలోని 150 డివిజన్లలోని మండప నిర్వాహకులను సమన్వయం చేస్తూ సమస్యలు పరిష్కరించేలా బీజేపీ ఐటీ సెల్ సభ్యురాలు మాధవి రూపొందించిన ‘భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్’ యాప్ను సోమవారం ఎర్రమంజిల్లోని ఎన్కెఎం గ్రాండ్లో ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు భగవత్రావు, శశిధర్, కరోడియల్, రామరాజులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ... మొహంజాహీ మార్కెట్ వద్ద మెట్రోరైల్ వంతెన 27 అడుగుల ఎత్తు ఉందని మెట్రో అధికారులు చెబుతున్నా పోలీసులు ఎత్తు తగ్గించుకోవాలని వేధిస్తున్నారన్నారు. విద్యుత్ పర్మిషన్లతో పోలీసులకు సంబంధం లేదన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం ఉత్సవ కమిటీతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకోవాలని కోరారు. -
ఎస్సీ వర్గీకరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం
సూర్యాపేట మున్సిపాలిటీ : తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణకు పార్లమెంటులో బిల్లు పెట్టించే విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కోకన్వీనర్ తప్పెట్ల శ్రీరాములుమాదిగ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెప్పుకు, డప్పుకు రూ. 2 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10 నుంచి మహాపాదయాత్ర కొనసాగుతుందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కొండగడుపుల సూరయ్య, రాష్ట్ర అధ్యక్షులు యాతాకుల భాస్కర్మాదిగలను శ్రీరాములుమాదిగ ప్రకటించారు. సమావేశంలో చింతా బాబు, యాతాకుల సునీల్, పరశురాములు, రవి, ఉపేందర్, మల్సూర్, దుబ్బ రమేష్,ఎల్లయ్య, సాయికుమార్, సంజయ్, మధు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం
సూర్యాపేట మున్సిపాలిటీ : తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణకు పార్లమెంటులో బిల్లు పెట్టించే విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కోకన్వీనర్ తప్పెట్ల శ్రీరాములుమాదిగ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెప్పుకు, డప్పుకు రూ. 2 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10 నుంచి మహాపాదయాత్ర కొనసాగుతుందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కొండగడుపుల సూరయ్య, రాష్ట్ర అధ్యక్షులు యాతాకుల భాస్కర్మాదిగలను శ్రీరాములుమాదిగ ప్రకటించారు. సమావేశంలో చింతా బాబు, యాతాకుల సునీల్, పరశురాములు, రవి, ఉపేందర్, మల్సూర్, దుబ్బ రమేష్,ఎల్లయ్య, సాయికుమార్, సంజయ్, మధు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. -
తండ్రుల ఒత్తిడి వల్ల పిల్లలకూ సమస్యలే!
మీరు తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారా? మీ పిల్లల దగ్గర కూడా మీ అసహనం ప్రదర్శిస్తున్నారా? తండ్రుల మానసిక ఒత్తిడి పిల్లల వికాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు పరిశోధకులు. పారాడే వయసులోనూ పిల్లలు తండ్రుల ఒత్తిడిని గ్రహించగలరని వెల్లడించారు మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న తండ్రులను గమనిస్తూ ఉండే పిల్లలు ఆ తర్వాత పెరుగుతూ ఉండే క్రమంలో తమ భావవ్యక్తికరణ సరిగా జరపలేరని పేర్కొంటున్నారు ఈ అధ్యనానికి నేతృత్వం వహించిన టామీషా హేర్వుడ్. ఇలాంటి తండ్రులు వెంటనే పిల్లల సమక్షంలో తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచిస్తున్నారు. ‘‘ఒత్తిడిని నియంత్రించుకోకపోవడం వల్ల తండ్రులు తాము డిప్రెషన్కు లోనుకావడంతో పాటు తమ పిల్లల వికాసానికీ ప్రతిబంధకమవుతారు’’ అంటూ హెచ్చరిస్తున్నారు ఆ అధ్యయనంలో పాలుపంచుకున్న మానసిక నిపుణులు. -
వివిధ షేర్లపై జీఎస్టీ బిల్లు ప్రభావం
ముంబై: ఇటీవల భారత స్టాక్ మార్కెట్లు జీఎస్ టీ బిల్లు (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ) అంచనాలపై భారీగా లాభపడ్డాయి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఈబిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. చర్చను మొదలుపెట్టిన కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కేంద్రం బిల్లుపై ప్రతికూలంగా స్పందించారు. తన వ్యాఖ్యలతో సభలో కాక పుట్టించారు. దీంతో సభలో చర్చ వాడి వేడిగా సాగుతోంది. అటు ఈ అనిశ్చితితో మదుపర్ల లాభాల స్వీకరణ, అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. అయితే బిల్లుకు పార్లమెంటు లో ఆమోదం లభిస్తే 29 రాష్ట్రాల్లో, అనేక పరోక్ష పన్నులు, పన్నుల విధింపు ప్రక్రియలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈనేపథ్యంలో మార్కెట్ లోని 10 షేర్లకు సానుకూలంగా మారనుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. హీరో మోటార్ కార్ప్: 8 శాతం తగ్గనున్న ఆన్-రోడ్ ధరలతో ఎంట్రీ లెవర్,ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఈ కంపెనీ లాభపడనుంది. మారుతి సుజుకి : ఆన్ రోడ్ ధరలతో తగ్గింపుతో ఎంట్రీ లెవల్ కారు సెగ్మెంట్ లో .. 8 శాతం ధరలు తగ్గనున్నాయి. దీంతో ఈ సెగ్మెంట్ లో 80 శాతం వాటాను కలిగివున్న మారుతి అతిపెద్ద లబ్దిదారుగా అవతరిస్తుంది. అమర్ రాజా బ్యాటరీస్: అసంఘటిత రంగం నుంచి వ్యవస్థీకృత సెగ్మెంట్ వాణిజ్యంలోకి మారడం.. బ్యాటరీ విభాగంలో అమర్ రాజా బ్యాటరీస్ శుభపరిణామం. ఏషియన్ పెయింట్స్, పిడిలైట్ : ప్రస్తుత 25 శాతం నుంచి పన్ను రేట్లు సుమారు 18 శాతానికి తగ్గితే అసంఘటిత కంపెనీల నుంచి పోటీ తగ్గి ఈ రెండు భారీగా లాభపడనున్నాయి. ఎందుకంటే అసంఘటిత, సంఘటిత ప్లేయర్స్ మధ్య ధర అంతరం తగ్గి క్రమంగా వారినుంచి పోటీ తగ్గుతుంది దీంతో ఈరంగాలకు జీఎస్ టీ ఆమోదం సానుకూలం. షాపర్స్ స్టాప్ : ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అంశం దీనికి కూడా సానుకూలం అంశం. అన్ ఆర్గనైజ్డ్ రంగంనుంచి పోటీ తగ్గుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. సెంచరీ ప్లై:జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తే ప్లైవుడ్ పరిశ్రమలో ప్రస్తుతం 65-70 శాతం మార్కెట్ వాటా కలిగి మేజర్ కంపెనీ సెంచరీకి శుభపరిణామం. అసంఘటిత సెక్టార్ నుంచి ఇది వ్యవస్థీకృత విభాగంలోకి షిప్ట్ అవుతుంది. టీసీఐ: అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీలు తొలగించడం ద్వారా హబ్-అండ్-స్పోక్ మోడల్డ్ వేర్ హైస్ చెయిన్లు లాభం. ప్రధానంగా ఖర్చుల తగ్గడంతో సామర్థ్యాలను భరోసా పెరుగుతుంది. గతి: ఎనలేని ఆదాయం అవకాశాలల కల్పనతో ఈ కామర్స్ సొల్యూషన్స్ గతికి పెద్ద మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఇది భారతదేశం లో ఇకామర్స్ విస్తరణకు దారితీయనుంది. హావెల్స్ , వి-గార్డ్ , సింఫనీ , క్రాంప్టన్ కన్జ్యూమర్: పన్ను రేట్లను : పన్నుశాతం తగ్గడంతో ఈ కంపెనీలు భారీగా లాభపడనున్నాయి. ప్రస్తుతం పన్ను 26-29 శాతంనుంచి 18 శాతానికి తగ్గనుంది. ఎసీసీ: జీఎస్టీ బిల్లు ఆమోదం ప్రధానంగా సిమెంట్ కంపెనీలకు లాభాలపంట పండిస్తున్నాయి. ఎఫెక్టివ్ రేట్లు తగ్గింపు , సరఫరా వ్యయాల తగ్గింపు ద్వారా ప్రయోజనం ఉంటుంది. ప్రతికూలం జీఎస్ టీ ఆమోదం పొందితే సిమెంట్ ,టుబాకో సెక్టార్ లపై ఒత్తిడి పడనుంది. ప్రధానంగా 40 శాతం పన్నుతో టొబాకో కంపెనీ ఐటీసీకి చెంపెపెట్టులాంటిదే. అలాగే ఇంటర్ స్టేట్ టాక్స్ పరిణామంతో కమర్షియల్ వాహనాలకు డిమాండ్ తగ్గడంతో అశోక్ లే లాండ్ కు కష్టాలు తప్పవు. విలువైన మెటల్స్ పై 2-6 శాతం పన్నుతో బంగారు , వజ్రాల ఆభరణాల తయారీదారు టైటాన్ కు ప్రతికూలంగా ఉండనుంది. అంతేకాదు బ్రాండెడ్ ఆభరణాలు రేట్లు భారీగా పెరగనున్నాయి. అలాగే ప్రింట్ మీడియాషేర్లకు కూడా ప్రతికూలమనే చెప్పాలి. ప్రింట్ ప్రకటనలు, ప్రసరణ ఆదాయం జిఎస్టి పరిధిలోకి వస్తే, ముద్రణ సంస్థలు ప్రతికూల ప్రభావం ఉంటుందని బ్రోకరేజ్ సంస్థలు నివేదిస్తున్నాయి.వీటిలో హిందూస్తాన్ మీడియా , హెచ్టి మీడియా , జాగరణ్ ప్రకాషన్ , డిబి కార్పొరేషన్ ప్రధానమైనవి. -
రక్త ప్రసరణకు శీర్షాసనం
లైఫ్ రక్తాన్ని గుండెకు చేర్చడానికి రక్తశుద్ధి జరగడానికిఈ ఆసనం చాలా మంచిది. మనసుకి మంచి ఏకాగ్రతను అలవాటు చేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి ఒత్తిడి నుంచి దూరంగా ఉండటానికి లేదా ఉపశమించడానికి చాలా ఉపయోగకరమైనది ఈ ఆసనం. ఆసనాలన్నింటిలోకి ముఖ్యమైనది శీర్షాసనం. తలక్రిందులుగా చేసే ఆసనాలలో ఇది అత్యంత ప్రధానమైనది. ముందుగా మోకాళ్లు మడచి సీటు భాగం వెనుక పాదాల మీద ఆనేటట్లుగా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ మార్జాలాసనంలోకి వచ్చి (రెండు చేతులు మోకాళ్ల మీద వంగి) అక్కడ నుండి అర్థ అధోముఖ శ్వాసాసనం లోకి కావాలి. అటు నుంచి తలక్రిందకు ఉంచి అరచేతులు రెండూ (చేతి వేళ్లు లాక్ చేసి ఉంచి) తలకి వెనుక వైపుగా.. నేల మీద తలకి సపోర్ట్గా ఆనించాలి. అలాగే, వంగి ఉన్న మోకాళ్లను నెమ్మదిగా స్ట్రెయిట్గా చాపి లేదా అలానే కొంచెం మడిచి ఉన్న స్థితిలోనే ఉంచాలి. రెండు కాళ్లను ఒకేసారి నేల మీద నుండి గాలిలోకి పైకి లేపి.. కాళ్లు, నడుము భాగాలను కొంచెం కొంచెం నిటారుగా పైకి తీసుకువెడుతూ ఉండాలి. ఈ సమయంలో శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ పూర్తి స్థితిలోకి వెళ్ళాలి. పూర్తి ఆసన స్థితిలో రెండు లేదా ఐదు నిమిషాల పాటు ఉండటం వల్ల ఆసనం పూర్తి ఉపయోగాలు చేకూరుతాయి. పూర్తి ఆసన స్థితిలో సాధారణ శ్వాస తీసుకుంటూ మనసుకు సహస్రారం మీద, తల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ కేంద్ర నాడీ మండల వ్యవస్థ మీద ఉంచాలి. దీంట్లో సాధకులు రెండు కాళ్లను పక్కలకు స్లిట్ చేయవచ్చు. లేదా ఒక కాలును నిటారుగా ఉంచి రెండవకాలుని వృక్షాసన స్థితిలో ఉంచవచ్చు. లేదా రెండు కాళ్లను బద్ధ కోణాసనంలో లాగా లేదా పద్మాసనంలో కాని ఉంచవచ్చు. ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చేటప్పుడు ఒక్కసారిగా శరీరాన్ని భూమి మీద పడవెయ్యకూడదు. వెనుకకు వచ్చేటప్పుడు కూడా చాలా నిదానంగా రావడం మంచిది. ఉపయోగాలు: శరీరం క్రింది భాగాల్లో స్టాగినెంట్ అయిన రక్తాన్ని గుండెకు చేర్చడానికి రక్తశుద్ధి జరగడానికి ఈ ఆసనం చాలా మంచిది. దీని వల్ల తల, మెదడు, కార్నివాల్ నెర్వస్ సిస్టమ్కి రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. మాస్టర్ గ్లాండ్ అయిన పిట్యుటరీ గ్రంధిని ఉత్తేజపరచడం కారణంగా మిగిలిన ఎండోక్రైన్ గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది. కళ్లకు చాలా మంచిది. కోర్ మజిల్స్, భుజాలు, చేతులు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. లింఫటిక్ సిస్టమ్ని ఉత్తేజపరచడం వల్ల టాక్సిన్స్ ఎక్కువగా శరీరంలో నుంచి బయటకు పోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనసుకి మంచి ఏకాగ్రతను అలవాటు చేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి ఒత్తిడి నుంచి దూరంగా ఉండటానికి లేదా ఉపశమించడానికి చాలా ఉపయోగకరమైనది ఈ ఆసనం. వర్టిగో సమస్య ఉన్నవారు, స్పాండిలైటిస్ సమస్య వున్నవారు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది. శీర్షాసనం పూర్తి అయిన తరువాత శవాసనంలో విశ్రాంతి పొందాలి. లేదా ధ్యానంలో కూర్చొని వచ్చే మార్పులు గమనించాలి. జాగ్రత్తలు: ఇది కష్టమైన ఆసనం కనుక యోగనిపుణుల పర్యవేక్షణలో చేయాలి. మొదటిసారిగా సాధన చేసేవారు తోటి సాధకుల సపోర్ట్ తీసుకుని చేయడం మంచిది. గోడని ఆధారంగా చేసుకుని కూడా సాధన చేయవచ్చు. తలకింద ఒక కుషన్ (దిండు)ను ఉంచి సాధన చేస్తే కొంచెం తేలికగా ఉండి, ఒక వేళ బ్యాలెన్స్ తప్పి పక్కలకు కాని, వెనుకకు కాని పడిపోయినప్పటికీ ప్రమాదం అంతగా ఉండదు. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా మెడ, భుజ భాగాలకు గాయలు కావచ్చు. ముఖ్యగమనిక: పూర్తి ఆసనస్థితిలో ఉండగలిగినవారు అను నిత్యం సాధన చేసేవారు మాడు భాగాన్ని నేలమీద ఉంచడం కాకుండా నుదురుకి మాడు భాగానికి మధ్యలో ఉండే కపాల భాగం (ప్రీ పోర్షనల్ కార్టెక్స్ భాగాన్ని) నేల మీద ఉంచి అక్కడ లోడ్ పెట్టడం మంచిది. సమన్వయం: ఎస్. సత్యబాబు, సాక్షి ప్రతినిధి ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
కాలుష్య కారకులకు భారీ జరిమానా..!
న్యూఢిల్లీః రాజధాని నగరంలో కాలుష్య నివారణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరో అడుగు ముందుకేసింది. కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతున్ననగరంలో ఇకపై ధ్వని కాలుష్యాన్ని కూడా అరికట్టేందుకు చర్యలు తీసుకోనుంది. సైలెన్సర్ లేని వాహనాలు నడిపేవారిపై ఆంక్షలు విధించి, కాలుష్య కారకులకు 5000 రూపాయల జరిమానా విధించనుంది. హస్తినలో వాయు కాలుష్యమే కాదు, ధ్వని కాలుష్యం కూడ ఎక్కువేనని గుర్తించిన ఎన్జీటీ.. కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న వ్యక్తులపై కొరడా ఝుళిపించనుంది. సైలెన్సర్ లేని వాహనాలను నడుపుతూ, నగరంలో తీవ్ర శబ్దకాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై 5000 వేల రూపాయలు జరిమానా వేయాలని ప్రకటించింది. ఎన్జీటీ ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం.. భరించరాని, నిబంధనలకు విరుద్ధమైన ధ్వని కాలుష్యాన్ని సృష్టించేవారిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం కింద చలాన్స్ మరియు పెనాల్టీలు విధించినట్లుగానే పర్యావరణ కాలుష్యాన్ని సృష్టించే నేరస్థులు 'పొల్యూటర్ పేస్' (కాలుష్య కారకులు) ఆధారంగా 5000 రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ ఎం ఎస్ నంబియార్ దర్శకత్వంతో కూడిన ధర్మాసనం తెలిపింది. అలాగే వాతావరణ పరిహారాన్ని ప్రత్యేక ఖాతాలో జమచేయాలని ట్రాఫిక్ పోలీసులకు గ్రీన్ ప్యానెల్ సూచించింది. నేరస్థులకు నోటీసులు జారీ చేయడంలో ఎన్జీటీని సంప్రదించేందుకు ట్రాఫిక్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. భారీ శబ్దం వచ్చే హారన్స్ తీవ్ర శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తాయన్న ట్రిబ్యునల్.. వాటి వాడకంపై దేశరాజధానిలో నిషేధం విధించింది. వాహనాల్లో హారన్స్ నుంచి వచ్చే శబ్దం కాలుష్యానికి ప్రధాన సమస్య అని, ముఖ్యంగా ఢిల్లీలో ట్రక్కు డ్రైవర్ల వంటివారు మితిమీరి హారన్ మోగించడంతో పాటు, డిటిసి బస్సులతో వచ్చే శబ్దం వల్ల కూడా నగరంలో కాలుష్యం తీవ్రమౌతోందని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ అధికారులు ఈ కోణంలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వశాఖ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి, నగరంలో శబ్దకాలుష్యాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించింది. -
మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దు
మండ్య: జీవితంలో ఎదేరయ్యే సమస్యల ఒత్తిడిని జయించలేక నేటి యువత మాదకద్రవ్యాలకు బానసలవుతున్నారని మండ్య యూత్ గ్రూప్ అధ్యక్షుడు అనిల్ విచారం వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ కాలేజ్లో మండ్య యూత్ గ్రూప్, సాంస్కృతిక వేదికల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు విద్యార్థులపై చూపుతున్న దుష్ర్పభావాలపై శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించవలసిన విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలవుతుండడం శోచనీయమన్నారు. మాదకద్రవ్యాల మత్తులో యువత నేరాలకు పాల్పడుతుండడంతో వారితో పాటు వారి కుటుంబ సభ్యలు కూడా సమాజంలో ఛీత్కారాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. -
వెన్నునొప్పి తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియో ప్రక్రియలో చికిత్స ఉందా? దయచేసి వివరించగలరు. - సుమన్, బాలాపూర్ ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన సమస్య. వెన్నుపూసలు అరగడం అన్నది ఒకప్పుడు ఒక వయసు పైబడిన వారిలోనే కనిపించేంది. కానీ మారుతున్న జీవనశైలితో పాటు తాము నిర్వహించే వృత్తుల్లో భాగంగా వెన్నుపై భారం పడేలా పనిచేయడం, ఇతర కారణాల వల్ల ఇది చాలా విస్తృతంగా కనిపిస్తోంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం మన వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా కొందరు పేషెంట్లలో ఉంటుంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. అయితే హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్కులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి చాలా బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ అది లూకోడెర్మాకు దారితీయదు పిడియాట్రిక్ కౌన్సెలింగ్ మాకు కొద్దిరోజుల క్రితం పాప పుట్టింది. పాపకు తలలో కొంత మేర వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇదేమైనా భవిష్యత్తులో ల్యూకోడెర్మా వంటి జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందా? - రవికుమార్, నందిగామ మీ పాపకు ఉన్న కండిషన్ (లోకలైజ్డ్ ప్యాచ్ ఆఫ్ వైట్ హెయిర్)ను పోలియోసిస్ అంటారు. సాధారణంగా ఇది తల ముందు భాగంలో అంటే నుదుటిపై భాగంలో కనిపిస్తుంటుంది. అయితే మరెక్కడైనా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఉందంటే అది ప్రతీసారీ తప్పనిసరిగా ఏదో రుగ్మతకు సూచిక కానక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని జన్యుపరమైన సమస్యలకు సూచన కావచ్చు. చర్మంలోని పిగ్మెంట్లలో మార్పుల వల్ల కూడా రావచ్చు. కంట్లో పిగ్మెంట్కు సంబంధించిన ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఏదైనా హార్మోనల్ సమస్యలు (అంటే థైరాయిడ్, జననేంద్రియాలకు సంబంధించినవి) ఉండటానికి సూచన కావచ్చు. ఇలాంటి అసోసియేటెడ్ సమస్యలేవీ లేకపోతే మీ పాపకు ఉన్న ఈ లక్షణం... ల్యూకోడెర్మా లాంటి సమస్యకు దారితీసే అవకాశం లేదు. పాపను ఒక్కసారి పీడియాట్రీషియన్కు చూపించండి. మీరు రాసినదాన్ని బట్టి పాపకు తక్షణ చికిత్స ఏదీ అవసరం లేదు. మీరూ ఈ విషయంలో ఆందోళన పడకుండా ఒకసారి డాక్టర్ను కలిసి ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధరించుకొని నిశ్చింతగానే ఉండండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ డెంగ్యూ ఫివర్ కౌన్సెలింగ్ ప్లేట్లెట్స్ తగ్గితే..? ఈ మధ్య మా బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. రక్తపరీక్షలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం చూసి, మా డాక్టర్ డెంగ్యూ కావచ్చని అనుమానించారు. అసలు డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏమిటి, దాని వివరాలు చెప్పండి. - సుగుణకుమారి, విశాఖపట్నం మీ డాక్టర్ చెప్పినట్లుగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం డెంగ్యూ వ్యాధిలోని ఒక లక్షణం. వైరల్ జ్వరాల్లో డెంగ్యూ కూడా ఒక రకం జ్వరం. ఈ వ్యాధికి ఆర్బోవైరస్ అనే జాతికి చెందిన సూక్ష్మజీవి ఒక కారణం. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. కంటికి కనిపించదు. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్టై జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. దీన్ని వ్యాప్తి చేసే దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటిపూటే కుడుతుంది. దోమ కుట్టిన తర్వాత ఐదు రోజుల నుంచి ఎనిమిది రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో సాధారణ డెంగ్యూ మామూలుగానే తగ్గిపోతుంది. కానీ డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్లో అవయవాల్లో అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉన్నందున ఇది ప్రమాదకరమైనది. డెంగ్యూవ్యాధి లక్షణాలు : ఉన్నట్లుండి జ్వరం రావడం తీవ్రమైన తలనొప్పి, ఇది కూడా ఎక్కువగా నొసటిపై వస్తుంది. కంటిలో నొప్పి వచ్చి కన్ను కదిలించినప్పుడు నొప్పి ఎక్కువవుతుంది. కండరాలు, కీళ్లనొప్పి వికారం నోరు ఎండిపోయినట్లుగా అవుతుంది. చాలా ఎక్కువగా దాహం వేస్తుంది. ఇక మీ డాక్టర్ చెప్పినట్లుగా ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల డెంగ్యూ వ్యాధిగా అనుమానిస్తుండవచ్చు. డెంగ్యూ ప్రమాదకరమైనది కాబట్టి సాధారణంగా దాన్ని వ్యాప్తి చేసే దోమలు గుడ్లు పెట్టడానికి అనువైన స్థలాలలో... అంటే ఎయిర్కూలర్స్, పూలకుండీల కింద పెట్టే సాసర్లు, ఆరుబయట పారేసి ఉన్న టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వ చేసే తొట్టి వంటివి, నీరు కదలకుండా ఉండే ఫౌంటేన్లు, ఖాళీ డ్రమ్ములు, సన్షేడ్పై వాన నీరు నిలిచిపోయే బిల్డింగులలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ డాక్టర్ చెప్పిన విధంగా మీ బాబుకు చికిత్స చేయించండి. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
వాయిదా పద్ధతొద్దు దేనికైనా
బద్ధకిష్టులకు పరిష్కార మార్గాలు ‘అబ్బబ్బ... ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న పని.ఇప్పటికీ పూర్తి కాలేదు... ’ మనలో చాలామంది నోట తరచూ వినిపించే మాట ఇది. నిజానికి ఇది ఒక లోపమే! ఒక్క ముక్కలో చెప్పాలంటే - వాయిదా మనస్తత్త్వం. స్థాయిలో తేడా ఉండవచ్చేమో కానీ, మనస్తత్త్వం మాత్రం కామన్. చెడు అలవాట్లు మానుకోవడం, మంచి అలవాట్లు చేసుకోవడం, చదువులో పూర్తి చేయాల్సిన పోర్షన్, ఆఫీసులో పూర్తి చేయాల్సిన పని - ఇలా రకరకాల వాటిలో ఈ లక్షణం తొంగి చూస్తుంటుంది. ఇలాంటి మనస్తత్త్వం ఉండేవారందరినీ మనస్తత్త్వ నిపుణులు వివిధ వర్గాలుగా విభజించారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎలా ఉంటారు, ఒత్తిడి పెరిగితే తడబడిపోతారా, ఫెయిల్యూర్ వస్తే తట్టుకుంటారా లాంటి పలు అంశాల ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు. ఆ వర్గీకరణ, అలాంటి వాయిదా మనస్తత్త్వం ఉన్నవాళ్ళు తమను ఎలా చక్కదిద్దుకోవాలో చూద్దాం... అతి ధైర్యవంతుల రకం ఈ రకమైన వాయిదా వ్యక్తులు ఆఖరు క్షణంలో పని మొదలుపెడతారు. ఆఖరు క్షణం దగ్గర పడుతోందనే ఒత్తిడి ఉన్నప్పుడే తాము బాగా పనిచేయగలుగుతామని భావిస్తారు. సర్వసాధారణంగా వీళ్ళు తమ బద్ధకం కారణంగా ఆఖరు నిమిషం వరకు పని వాయిదా వేసుకుంటూ వస్తారు. చివరికి వచ్చేసరికి హడావిడిగా పని పూర్తి చేయాల్సొచ్చి, పొరపాట్లు చేసే ప్రమాదం ఉంటుంది. ఈ రకం వ్యక్తులు పని విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ, ఆ పని ఎంత నాణ్యంగా పూర్తయిందన్న దానిపై పట్టింపు పెట్టుకోరు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులు మెడ మీద కత్తి లాంటి డెడ్లైన్లు పెట్టుకోవాలి. ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకుంటూ వెళ్ళాలి. తమ పనిని తామే అంచనా వేసుకుంటూ పోవాలి. పనిని అనుకున్నట్లు పూర్తి చేస్తే తమను తాము అభినందించుకోవాలి. పూర్తి చేయకపోతే తమకు తామే పనిష్మెంట్ కూడా వేసుకోవాలి. అలా స్వీయ నియంత్రణ వల్ల వాయిదా మనస్తత్త్వాన్ని దూరం చేసుకోగలుగుతారు. పనికి అడ్డంకులు సృష్టించుకొనే రకం ఈ రకం వాయిదా మనుషులు కూడా ఆఖరి నిమిషంలో ఒత్తిడి మధ్య పనిచేస్తేనే తాము బాగా పనిచేయగలమని పొరపడుతుంటారు. వీళ్ళలో విచిత్రం ఏమిటంటే - తమ పనికి తామే అడ్డంకులు సృష్టించుకుంటూ ఉంటారు. పనిచేసే క్రమంలోని ఈ అడ్డంకుల రీత్యా తమకు తామే ఆ పని నుంచి పక్కకు వస్తారు. పనిలో ఆలస్యమేమిటని అడిగితే, ఆ తప్పు మరొకరి మీద నెట్టేస్తుంటారు. అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా, పనిలో క్వాలిటీ మాత్రం తగ్గకూడదనుకుంటారు. పరిష్కారం: మీరు గనక ఇలాంటి రకం వ్యక్తులైతే, అడ్డంకుల గురించి కూడా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు, పనిలో కాసేపు విరామం తీసుకొని, ఆ టైమ్లో ఫేస్బుక్ చూసుకోవడం మీకు అలవాటు అనుకుందాం. దీని వల్ల పని టైమ్ వృథా అవుతుంది. ఆ మేరకు పని ఆలస్యమవుతుంది. ఈ సంగతి గ్రహించి, మీ లంచ్ బ్రేక్ టైమ్లోనో ఏమో ఈ ఫేస్బుక్ చూసే వ్యవహారం పెట్టుకున్నారనుకోండి. ఇటు ఫేస్బుక్ చూడడం ఆగదు. అటు పని సమయం వృథా కాదు. మామూలు టైమ్కే పని పూర్తయిపోతుంది. డెసిషన్ని తప్పించుకొనే రకం ఈ రకం వాయిదా మనుషులు ఏ నిర్ణయమూ తీసుకోకుండా వాయిదా వేస్తుంటారు. వీళ్ళకు పని విషయంలోనూ భయమే. ఆ భయంతో పని అసలు మొదలే పెట్టరు. ఇలా నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల ఫెయిల్యూర్ వస్తుందని కానీ, ఇతరులు తమను అంచనా వేస్తారని కానీ భయం ఉండదు కదా అని తృప్తి పడుతుంటారు. ఫలానా టైమ్లోగా పని పూర్తి కావాలనే డెడ్లైన్లు ఉన్నాయంటే, తెగ బాధపడిపోతారు. చేసే పని నాణ్యంగా ఉండాలని అనుకుంటారు కానీ, ఆఖరు నిమిషంలోని ఒత్తిడిని సరిగ్గా సంబాళించుకోలేరు. సాధారణంగా ఈ రకం వ్యక్తులు తమ పనితో సంతోషంగా ఉంటారు. కానీ, ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని తెగ వర్రీ అవుతుంటారు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకొనేందుకు గట్టిగా నిర్ణయించుకోవాలి. ‘‘మనం ఏం చేసినా ఎదుటివాళ్ళు కొందరు జడ్జ్ చేసి, ఏదో ఒకటి అంటారు. కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ కూడా అవుతాం. అయినా ఫరవాలేదు. ప్రపంచమేమీ తలకిందులు కాదు. దాని నుంచి కూడా నేర్చుకుంటా’’ అని తమకు తామే గట్టిగా చెప్పుకోవాలి. పక్కవాళ్ళ మీద నెట్టేసే రకం ఇలాంటి రకం వ్యక్తులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో గందరగోళంలో ఉంటారు. అందుకే, ఇతరులనే నిర్ణయం తీసుకోనిస్తారు. ఈ గందరగోళం వల్ల పని ఆలస్యమవుతుంది. ఫెయిల్యూర్ భారాన్ని కూడా ఇతరుల మీదే పడేస్తారు. వీళ్ళకు కూడా తమ పని పట్ల సంతృప్తి ఉంటుంది కానీ, ఇతరులు ఏమంటారోనన్న శంక పీడిస్తూ ఉంటుంది. ఈ రకం వాయిదా మనుషులు ఒక పట్టాన పని మొదలుపెట్టరు. పరిష్కారం: ఇలాంటి వ్యక్తులకు ఏది ముందుగా ఎంచుకోవాలనే మీమాంస వచ్చినప్పుడు - రెండు రకాల మార్గాలున్నాయి. ఉన్నవాటిలో అతి పెద్ద పనిని ముందుగా చేపట్టి, అది అయ్యాక మిగిలిన చిన్న పనుల్లోకి వెళ్ళాలి. ఇక, రెండో పద్ధతి ఏమిటంటే - పెద్ద పనిని ముందుగానే చిన్న చిన్న పనులుగా విడగొట్టుకోవాలి. ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం మీద తమలోని వాయిదా మనస్తత్త్వాన్ని ఎవరికి వారు గుర్తించి, సరిదిద్దుకోవాలి. బద్ధకాన్ని వదిలించుకొని, పనిలో పడాలి. పైన చెప్పిన పరిష్కార మార్గాల్ని అలవాటు చేసుకోవాలి. అందుకోసం మానసికంగా కృతనిశ్చయంతో ఉండాలి. వాయిదా పద్ధతిని సరైన సమయంలో మార్చుకుంటే, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. పనిలో పురోగతితో, జీవితం కూడా ఆనందంగా మారుతుంది. మరింకేం... వాయిదా వేయకుండా ఆచరణలో పెట్టండి. ఆల్ ది బెస్ట్! ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలనుకొనే రకం ఈ రకం వ్యక్తులు తమ పని ఏ మాత్రం తప్పు లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలని, అసలు విమర్శలే రాకూడదనీ అనుకోవడం వల్ల ఆలస్యం జరుగుతుంటుంది. ఈ పర్ఫెక్షనిజమ్కి మూలకారణం ఏమిటంటే మనస్సులోని ఆందోళన. వీళ్ళు పని మొదలుపెట్టేస్తారు కానీ చేయాల్సిన పనుల జాబితా మాత్రం కొండవీటి చాంతాడంత ఉంటుంది. కాబట్టి ఒత్తిడి ఎదురైనప్పుడు తడబడతారు. ఇలాంటి పర్ఫెక్షనిస్టులు అవతలివాళ్ళు ఏమంటారో అన్న దాని గురించి అతిగా ఆలోచిస్తుంటారు. ఇతరుల్ని నిర్ణయం తీసుకోనిచ్చి ఆందోళనను అప్పటికి దూరం చేసుకుంటూ ఉంటారు. పరిష్కారం: పర్ఫెక్షనిజమ్ తప్పు కాదు కానీ పనిని వాయిదా వేయకుండా టైమ్కి పూర్తి చేయడం కోసం ఇలాంటి వ్యక్తులు ‘ఎస్.ఎం.ఎ.ఆర్.టి’ (స్మార్ట్ -స్పెసిఫిక్, మెజరబుల్, ఎటైనబుల్, రిలవెంట్, టైమ్ బౌండ్) లక్ష్యాలను పెట్టుకోవాలి. లక్ష్యాలు నిర్ణీతంగా, అంచనా వేయడానికి వీలుగా, అందుకోదగినట్లుగా ఉండాలి. సమయానికి తగ్గవై ఉండాలి. నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా ఉండాలి. ఎవరం ఏ పని చేసినా అందులో అసలు తప్పులే లేకుండా ఉండడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. చేసే పనిలో ఎప్పటికప్పుడు మెరుగుదల సాధించాలి. -
గ్యాంగ్ రేప్ బాధితురాలి ఆత్మహత్య
స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేయడమే కాక, కేసు కాకుండా సెటిల్మెంటుకు రావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడంతో.. బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని హర్ష్ విహార్ ప్రాంతంలో జరిగింది. 24 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి 22 ఏళ్ల అమ్మాయిపై దాదాపు నెల రోజుల క్రితం సామూహిక అత్యాచారం చేశాడు. ఇప్పుడు కోర్టు వెలుపల సెటిల్మెంటు చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. ఇది భరించలేని ఆమె తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తనగదిలోకి వెళ్లి పడుకున్న ఆమె పొద్దున్న ఎంత పిలిచినా లేవట్లేదు. దాంతో తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి చూడగా, అప్పటికే ఆమె మరణించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన స్నేహితుడే తన మిత్రులతో కలిసి తనపై గ్యాంగ్ రేప్ చేశాడని బాధితురాలు మే నెలలో పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిందితుడిని అరెస్టుచేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బాధితురాలికి కౌన్సెలింగ్ చేయించినా, ఆమె తీవ్ర డిప్రెషన్ లోనే ఉంది. అయితే స్థానికుల కథనం మరోలా ఉంది. తనను పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తితో కలిసి ఆమె వెళ్లిపోయిందని, ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి పోలీసుల వద్దకు వెళ్లి అతడిపై కిడ్నాప్, రేప్ కేసు పెట్టారని అంటున్నారు. అతడి స్నేహితులలో ఒకరు కూడా తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చె ప్పారు. తన వల్ల కుటుంబానికి వచ్చిన అప్రతిష్టను తాను తట్టుకోలేకపోతున్నానని, అందుకే తనువు చాలిస్తున్నానని సూసైడ్ లేఖలో తెలిపింది. -
గాలిలో యముడు
వాయు కాలుష్యం పూర్ణాయుష్షు అనేది అదృష్టం అనే చెప్పాలి. ఆహారం, నీరు, పని విధానం, వత్తిడి ఎంత ఆయుష్షును హరిస్తున్నాయోగాని ఊరికే రోడ్డు మీదకు వచ్చి గాలి పీలిస్తే మాత్రం భారతదేశంలో మూడు నుంచి నాలుగేళ్ల ఆయుష్షు కోల్పోక తప్పదని తాజా అధ్యయనం తెలుపుతోంది. పూణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటెరాలజీ తాజా అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యానికి ఆయుష్షు కోల్పోతున్నవారు దేశవ్యాప్తంగా న్యూఢిల్లీలో మొదటి స్థానంలో ఉన్నట్టుగా తేలింది. ఢిల్లీలోని వాయు కాలుష్యానికి అక్కడి ప్రజలు కనీసం ఆరు నుంచి ఏడు సంవత్సరాల ఆయుష్షును కోల్పోతున్నారట. మన దేశంలో ఏటా వాయు కాలుష్యం పరోక్షంగా ఐదున్నర లక్షల మందిని బలిగోరుతుండగా నేరుగా శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడి 31,000 మంది మృత్యువాత పడుతున్నారు. ఇటీవల ప్రపంచంలోని 100 దేశాల్లో మూడు వేల నగరాల్లో కాలుష్య ప్రమాణాలను పరీక్షించగా న్యూ ఢిల్లీ పదకొండో స్థానంలో నిలిచిందంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాలిలో ప్రమాదకరమైన విషకారకాలు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండగా తర్వాతి స్థానం మహారాష్ట్ర, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత బీహార్ ఉన్నాయి. ఇక ఓజోన్ విషకారకాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. పర్యావరణం పట్ల జాగరూకులై ఉండటం వృక్ష వికాసం దీనికి విరుగుడు అని గ్రహించాలి. -
సర్టిఫికెట్ల విషయంలో ఎటువంటి ఒత్తిడీ లేదు!
న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల వ్యవహారంలో తమపై ఎటువంటి రాజకీయ ఒత్తిడీ లేదని, తమను ఏ శక్తీ ప్రభావితం చేయలేదని ఢిల్లీ యూనివర్శిటీ వెల్లడించింది. మోదీ సర్టిఫికెట్ల ధృవీకరణ విషయంలో చట్ట ప్రకారమే పరిశీలనా కార్యక్రమం జరిగిందని వర్శిటీ ప్రకటించింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, ఢిల్లీ యూనివర్శిటీ ఇచ్చిన డిగ్రీ సర్టిఫికెట్లు ఫోర్జరీలని, వర్శిటీలో తాము స్వయంగా పరిశీలిస్తామన్న కేజ్రీవాల్... ధృవీకరణకోసం డీయూను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికెట్ల సమస్యపై వైస్ ఛాన్స్ లర్ యోగేష్ త్యాగితో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో వర్శిటీ రాజకీయ ఒత్తిడులకు తలొగ్గుతోందన్న ఆరోపణలు అసత్యాలని, యూనివర్శిటీ ఆర్టీఐ సెల్... చట్ట ప్రకారం పనిచేస్తుందని వీసీ తెలిపారు. ప్రధాని సర్టిఫికెట్ల విషయంలో తమపై ఎటువంటి ఒత్తిడీ లేదని ఢిల్లీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తరుణ్ దాస్ సైతం వెల్లడించారు. ఆప్ ప్రతినిధుల బృందం మోదీ బిఏ రికార్డులను పరిశీలించేందుకు అనుమతించాలన్న డిమాండ్ తో విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో వారు ఉత్త చేతులతో తిరిగి వెళ్ళాల్సి వచ్చిందని వీసీ అన్నారు. ప్రధానమంత్రి బిఏ, ఎంఏ డిగ్రీలు నకిలీలని, మార్క్స్ లిస్టుతోపాటు, సర్జిఫికెట్ పై ఆయన పేరులో కూడ అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయన్న ఆప్ ఆరోపణలు అసత్యాలని తేలిపోయింది. మోదీ డిగ్రీ రికార్డులను బయట పెట్టిన వర్శిటీ... ఆయన సర్టిఫికెట్లు ప్రామాణికమైనవేనని, మార్కులిస్టులో చిన్నపాటి తప్పిదాలు మాత్రం కనిపించాయని తెలిపింది. అంతేకాక ఆయన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లకు సంబంధించిన అన్ని రికార్డులు తమవద్ద ఉన్నాయని దాస్ తెలిపారు. -
24 జిల్లాలా..? ఎక్కడెక్కడ..?
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆఖరి కసరత్తు మొదలైంది. తెలంగాణలో ఇప్పుడున్న పది జిల్లాలకు అదనంగా 14 లేదా 15 కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వచ్చే జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త జిల్లాలను ప్రకటిస్తామని వెల్లడించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జిల్లాలతో పాటు రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్వవ్యస్థీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా ఏయే పట్టణాలు జిల్లాలుగా అవతరిస్తాయనేది అన్ని ప్రాంతాల ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. వీటిపై కసరత్తుకు గత ఏడాది సెప్టెంబరులోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ సారధ్యంలో నలుగురు కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే తన తొలి నివేదిక సిద్ధం చేసింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు భౌగోళికంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాలను బట్టి కొత్త జిల్లాలు, వాటి సరిహద్దులుండేలా ప్రతిపాదనలు రూపొందించింది. ఈమేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారిక సన్నాహాలు పూర్తి చేసింది. గత ఏడాది నవంబరులోనే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ ఫార్మేషన్ యాక్ట్-1974ను తెలంగాణ డిస్ట్రిక్ ఫార్మేషన్ యాక్ట్గా పరిగణిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నేతల నుంచి పెరిగిన ఒత్తిడి: కొత్త జిల్లాల ఏర్పాటును వీలైనంత తొందరగా పూర్తి చేయాలని సొంత ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతకాలంగా సీఎంపై ఒత్తిడి పెంచారు. నియోజకవర్గాల పెంపు, కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ తమ సెగ్మెంట్లు అటుదిటుగా మారిపోతే తమ రాజకీమ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని, అందుకే రాబోయే ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వీరందరూ సీఎంను కోరుతున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతమున్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి లేఖ రాసింది. దీంతో వీటికి అనుగుణంగానే రాష్ట్రంలో కొత్త జిల్లాలు అవతరిస్తాయనే ప్రచారం జరిగింది. కానీ నియోజకవర్గాల సంఖ్య పెంపు ఎప్పటిలోగా జరుగుతుందనే విషయంలో కేంద్రం నుంచి స్పష్టత లేదు. ఈలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా తెరపైకి తీసుకురావటంతో రాజకీయ శ్రేణుల్లో కలకలం మొదలైంది. కరీంనగర్, వరంగల్తో పీటముడి: ఎన్నికల ముందు, సీఎం హోదాలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రాంతాలను కొత్త జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని అక్కడి ప్రజలకు వాగ్దానం చేశారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలుచోట్ల స్పష్టమైన సంకేతాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సిద్ధిపేట, నల్లగొండ జిల్లాలో సూర్యాపేటను జిల్లాగా మారుస్తామని వివిధ సందర్భాల్లో సీఎం ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లాలో నాగర్కర్నూలు, వనపర్తి, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సర్కారు తుది పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడున్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను నాలుగు జిల్లాలుగా విభజించే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొత్తగా వికారాబాద్, ఇబ్రహీంపట్నం, చార్మినార్, గోల్కొండ, సికింద్రాబాద్ జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు. ఏయే ప్రాంతాలను ఏ జిల్లా పరిధిలో చేర్చాలనే విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పాలమూరులో కొనసాగుతున్న దీక్షలు: మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు తీవ్రస్థాయికి చేరాయి. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, జనగాంను జిల్లా కేంద్రాలుగా మార్చాలని స్థానికులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల కమిటీకి తమ అభ్యర్థనను అందించారు. ములుగు కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజాప్రతినిధులు హైదరాబాద్కు వచ్చి సీఎస్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మహబూబ్నగర్లో గద్వాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆందోళన కొనసాగుతోంది. ఇదే డిమాండ్తో ఏర్పడ్డ జేఏసీ మూడు నెలలుగా అక్కడ రిలే నిరాహార దీక్షలు చేపడుతోంది. మరోవైపు ఇబ్రహీంపట్నం, మేడ్చల్ కేంద్రాలను జిల్లాలుగా మార్చాలని రంగారెడ్డి ప్రాంత ప్రతినిధులు పట్టుబడుతున్నారు. ప్రస్తుత జిల్లాలు.. కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఆదిలాబాద్: మంచిర్యాల కరీంనగర్: జగిత్యాల వరంగల్: భూపాలపల్లి మెదక్: సంగారెడ్డి, సిద్ధిపేట, మహబూబ్నగర్: నాగర్కర్నూలు, వనపర్తి నల్గొండ: సూర్యాపేట ఖమ్మం: కొత్తగూడెం రంగారెడ్డి: వికారాబాద్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ హైదరాబాద్: సికింద్రాబాద్, చార్మినార్, గోల్కొండ. -
ఒత్తిడితో ఓడిపోతున్నవిద్యార్థి
సమకాలీనం ఐఐటీ పేరిట పెద్ద మొత్తంలో ఫీజులు రాబట్టి రాజస్థాన్లోని కోట తదితర ప్రాంతాల్లో ఏం చేస్తున్నారో, ఎలా కోచింగ్ కార్ఖానాలు నడుపుతున్నారో మీడియా కళ్లకు కట్టింది. ఈ ముతక పద్ధతుల్ని గుడ్డిగా సమర్థించే తల్లిదండ్రులు కూడా జరుగుతున్న అనర్థంలో ప్రధాన దోషులే! జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం ఒక్క 2014 లోనే ఆంధ్రప్రదేశ్లో 333 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క విశాఖ పట్నంలోనే, మూడేళ్ల కాలంలో 13 మంది మరణించారు. సామాజిక మాధ్యమంలో ఓ మెసేజ్ రెండు రోజులుగా బాగా చక్కర్లు కొడుతోంది. ‘‘..... ఇంటర్ ఫలితాలు వచ్చాయి. నాకు తెలిసిన ఓ పదిమంది పిల్లలు పరీక్షలు రాసిన వారిలో ఉన్నారు. ఫలితాలు కనుక్కుందామని కొందరికి ఫోన్ చేశాను. ఒకమ్మాయికి ఫోన్ చేస్తే, వాళ్ల అమ్మ రిసీవ్ చేసుకుంది. ‘అమ్మాయికి మూడ్ బాగా లేదు, పడుకుంది’ అనగానే ఆశ్చర్యమేసింది. తెలివికల పాప, పొరపాటున తప్పిందా? అని అనుమానమొచ్చి ‘ఎన్నిమార్కులొచ్చాయి?’ అనడిగా. 975 అని జవాబిచ్చిందామె. ‘అబ్బో చాలా మంచి మార్కులు, మరి మూడ్ బాగాలేకపోవడం ఏమిటి?’ అన్నాను. ‘తను 985 ఎక్స్పెక్ట్ చేసింది. దాంతో డిప్రెషన్లో ఉంది. మాక్కూడా తృప్తి లేదు. అందుకే బయటికెక్కడికీ వెళ్లలేదు’ అని ఆమె సమాధానం. మరొకరికి ఫోన్ చేస్తే, ఆ అమ్మాయిపెద్దగా ఏడుస్తున్న శబ్దం ఫోన్లోనే వినిపించింది. వాళ్ల అమ్మ ఫోన్ తీసుకొని ‘‘మార్కులు తక్కువ వచ్చాయి. పొద్దుట్నుంచి ఏడుస్తోంది. ఓదార్చడం మా వల్ల కావట్లేదు.’’అని చెప్పింది. ‘ఎన్ని వచ్చాయ’ని అడిగితే, 985 అని బదు లిచ్చింది. నాకు చిరు కోపమొచ్చి, ‘మా బోటివాళ్లు పార్టీ అడుగుతారని అలా అంటున్నట్టున్నారు, 985 అంటే గొప్ప మార్కులు కదా!’ అన్నాను. ‘ఫలితాలు రాగానే వాళ్ల కాలేజీ నుంచి ఎవరో ఫోన్ చేశారు. ఇంకొక్క రెండు మార్కులు వచ్చుంటే నీ పేరు, ఫోటో ఫ్లెక్సీలకు ఎక్కేది, ఎంత పని చేశా వమ్మా!, నీకు ఇలా తక్కువొస్తాయనుకోలేదు అందిట. దాంతో దిగులు చెంది, కుమిలి కుమిలి ఏడుస్తోంది’ అని వివరించిందా తల్లి. ఇంకో ఫోన్ కాల్కి స్పందించిన విద్యార్థి తండ్రి, ‘‘ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. డాక్టర్ని చేయాలనుకున్నాం. 20 వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కూడా కొనిపెట్టాము. అయిదారు వేల రూపాయలు పరీక్షల ముందు డ్రస్లకే అయ్యాయి. లక్షల రూపాయలు కాలేజీకి ఫీజులు కట్టాము. కాలేజీకి వెళ్లడానికి హోండా యాక్టివా కావాలంటే, అదీ కొని పెట్టాము. చివరకు 965 మార్కులు తెచ్చుకొని మా ఆశలు నీరు గార్చి...’’ ఇదీ వరుస! వెయ్యి మార్కులకు 750 వచ్చినా, 850 వచ్చినా, చివరకు 985 మార్కులు వచ్చినా ఎవరికీ సంతృప్తి లేదు. ఎవరి స్థాయిలో వారు ఎత్తై లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, అది దక్కలేదని కుమిలి పోతూ తాము దిగులు పడుతున్నారు. లోపం ఎక్కడుంది? పిల్లల్లోనా, తల్లిదండ్రుల్లోనా, టీచర్లలోనా, చదువుల్లోనా, విద్యావ్యవస్థలోనా....? ప్రభు త్వంలోనా? సమాజంలోనా...? ఇలా కొన్ని ప్రశ్నల్ని సంధించారీ మెసేజ్లో! ఇంతకీ ఇది నిజంగా జరిగిందా? వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడానికి ఎవరైనా తమ యథాశక్తి ఊహించి చక్కటి కథనాన్ని ప్రచారంలోకి తెచ్చారా? తెలీదు కానీ, చదివిన వారంతా ‘నిజమే కదా! బయట పరిస్థితి అచ్చు ఇలాగే ఉంది’ అని మాత్రం అనుకుంటున్నారు. ఒత్తిళ్లలో నలుగుతున్న లేలేత మెదళ్లు ! ఫలితాల తర్వాత కేవలం మార్కుల్ని చూసి విద్యార్థులు, వారి తలిదండ్రులు, టీచర్లు... స్పందించే తీరును బట్టి పిల్లలెంత ఒత్తిడిలో విద్యాభ్యాసం చేస్తు న్నారో ఇట్టే తెలిసిపోతోంది. వారి వయసుకు, స్థాయికి మించిన ఒత్తిళ్లకు వారు లోనవుతున్నారు. విద్యావిధానం, మార్కుల పద్ధతి, ముల్యాంకన తీరు ఇవన్నీ లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. సిలబస్ కూడా అంతే! అనారో గ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సాంకేతికమైన శాస్త్రీయ అంశాలు తప్పితే జీవితాంశాలు సిలబస్లోంచి క్రమంగా తొలగిపోతున్న తీరు కూడా వారి ఎదుగుదల, ఆలోచనా ధోరణిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చిన్న వయసునుంచి వారికి అపరిమితమైన లక్ష్యాల్ని నిర్దేశి స్తున్నారు. పిల్లల తెలివితేటల్ని, వారెదిగిన క్రమాన్ని, ఇష్టాయిష్టాల్ని... ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తల్లిదండ్రులు తామాశించే కోర్సుల్లో చేర్పిస్తున్నారు. ఇతర విద్యార్థులతో పోలిక తీసుకువచ్చి నిత్యం సంఘర్షణకు గురిచేస్తున్నారు. ఇటు తల్లిదండ్రులు, అటు కాలేజీల వారూ గుదిబండ ల్లాంటి ఈ లక్ష్యాలు విధిస్తుండటంతో పిల్లలు ఇంటా-బయటా తీవ్ర ఒత్తిళ్లకు గురికావాల్సి వస్తోంది. మార్కులు రాకుంటే మరణమే శరణ్యమా? బుధవారం విడుదల చేసిన జేఈఈ (మెయిన్-2016) ఫలితాల్లో అఖిల భారత స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలుగు విద్యార్థి సాయితేజ ఒక గొప్ప మాట చెప్పారు. ‘‘నేననుకుంటా... నా విజయానికి కారణం గట్టి పునాది. స్కూల్ స్థాయిలోనే నాకు ఉపాధ్యాయులు ఎంతో మేలు చేశారు. బట్టీ పట్టడం కాకుండా కాన్సెప్ట్స్పైనే దృష్టి కేంద్రీకరించేలా బోధించారు. నా తల్లిదండ్రులు కూడా అన్ని స్థాయిల్లో నాకు దన్నుగా ఉండి, నాలో స్థైర్యం పెరిగేలా చేశారు. ఒత్తిడిలేని వాతావరణంలో చదవడం వల్ల అవసరాన్ని బట్టి నేను వెంటనే కాన్సెప్ట్స్ను గుర్తుతెచ్చుకోవడం చాలా తేలికయింది’’ అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ అవకాశం ఎంత మందికి ఉంది? ఐఐటి పేరిట పెద్ద మొత్తంలో ఫీజులు రాబట్టి రాజస్థాన్లోని కోట తదితర ప్రాంతాల్లో ఏం చేస్తున్నారో, ఎలా కోచింగ్ కార్ఖానాలు నడుపుతున్నారో మీడియా కళ్లకు కట్టింది. ఈ ముతక పద్ధతుల్ని గుడ్డిగా సమర్థించే తల్లి దండ్రులు కూడా జరుగుతున్న అనర్థంలో ప్రధాన దోషులే! జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం ఒక్క 2014 లోనే ఆంధ్ర ప్రదేశ్లో 333 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క విశాఖ పట్నంలోనే, మూడేళ్ల కాలంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు యత్నించగా అందులో 13 మంది మరణించినట్టు పోలీస్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (పీసీఆర్బీ) చెబుతోంది. వారంతా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువు తున్న వారే! కడప జిల్లాకు చెందిన నాగేంద్ర కుమార్రెడ్డి గత సంవత్సరం సెప్టెంబరు నెలలో మద్రాస్ ఐఐటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తానాశించిన ప్లేస్మెంట్ రాలేదనే ఒత్తిడికి గురై ఓ తెలుగు విద్యార్థి ఖరగ్పూర్ ఐఐటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మూడో సంవత్సరంలో తగినన్ని మార్కులు రాలేదని జితీష్ శర్మ అనే విద్యార్థి ముంబై ఐఐటిలో బలవంతంగా తనువు చాలించాడు. ఇష్టంలేని కోచింగ్కు పంపుతున్నారనే వ్యధతో బిహార్లో వైష్ణవి ఆత్మహత్య చేసుకుంది. ఆశించింది దక్కలేదని పదోతరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు విద్యార్థులు బలవన్మ రణాల పాలయ్యారు. మన ఆలోచనల్లోనూ లోపమే! ప్రగతి కారకంగా లేని మన విద్యావిధానమే పెద్ద అవరోధం. దీనికి తోడు తల్లి దండ్రుల ఆలోచనా ధోరణిలో కూడా లోపముంది. ఇక బోధకులు సరేసరి! తాము చేసే కోర్సుల పట్ల, భవిష్యత్తు పట్ల, అసలు జీవితం పట్లనే విద్యా ర్థులకు విశ్వాసం కలిగించలేకపోతున్నాయి. పుస్తక పరిధి దాటని మార్కుల సాధన విద్యార్థి ప్రతిభను లెక్కగట్టే ఒక కొలమానమే తప్ప అదే సర్వస్వం కాదు. ఉద్యోగాలు పట్టుకోవడం, సమయస్ఫూర్తి, నైపుణ్యాల్ని ప్రదర్శించడం, ప్రతికూల పరిస్థితుల్లో నెట్టుకురావడం, ఎదుగుదల... ఇటు వంటివన్నీ, పుస్తకేతరమైన తెలివితేటలతోనే సాధ్యమని ఎన్నోమార్లు రుజు వైంది. ఆ నైపుణ్యాల్ని పెంచడంపై మనవాళ్లకు శ్రద్ధే ఉండదు. వ్యక్తిత్వ నిర్మాణం కోసం ప్రణాళికే లేదు. అందుకే, అకడమిక్గా ఎంతో గొప్ప ర్యాంకులు వచ్చి, తేలిగ్గా ప్రవేశాలు పొందే తెలుగు విద్యార్థులు ఐఐటి, ఐఐఎమ్, బిట్స్ వంటి సంస్థల్లోకి వెళ్లి అక్కడ కోర్సుల్లో రాణించేది తక్కువ. ప్రాథమిక, ముఖ్యంగా ఉన్నత విద్యా స్థాయిలో కార్పొరేట్, ఇతర ప్రయివేటు విద్యా సంస్థల కన్నా జిల్లాపరిషత్ బడుల స్థాయి సర్కారు విద్యా విధానమే గొప్పదని నిపుణులంటారు. పుట్టిన ప్రతి బిడ్డను ఐఐటికో, ఐఐఎమ్కో, ఎమ్బీబీఎస్కో పంపాలనుకోవడం కూడా అత్యాశను మించిన దురాశ. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 19 లక్షల మంది రెండు సంవత్సరాల ఇంటర్ పరీక్షలకు హాజరవుతుంటే, దాదాపు నాలుగున్నర లక్షల మంది ఐఐటి, ఎన్ఐటి, బిట్స్, ఎమ్సెట్, ఇతర ఇంజనీరింగ్ కోర్సులకోసం సన్నద్ధమ వుతారు. నికరంగా జేఈఈ కి రెండు రాష్ట్రాల్లో కలిపి సగటున 1.30 లక్షల మంది రాస్తుంటారు. సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 1.50 లక్షల మంది, తెలం గాణలో 1.40 లక్షల మంది ఏటా ఎమ్సెట్ రాస్తారంటే ఇక పరిస్థితిని ఊహిం చుకోవచ్చు. రాపిడి పెట్టి వీళ్లని పరీక్షకు సిద్ధం చేసే కార్పొరేట్ కాలేజీలు తెలంగాణలో 160 దాకా ఉంటే, ఏపీలో 260 వరకున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, సివిల్ సర్వీసెస్ తప్పితే.... ఇక ఏ చదువులూ లేనట్టు వేలం వెర్రిగా పరుగులు తీయడంలో మనవాళ్లదే అగ్రతాంబూలం! ఒత్తిళ్ల నుంచి సురక్షిత పొత్తిళ్లకెలా...? హేతుబద్ధం కాని చిన్న చిన్న కారణాలతో తనువు చాలిస్తున్న యువతరాన్ని బతికించుకోవాలి. వృత్తి విద్యా కళాశాలల్లో, కోచింగ్ సెంటర్లలో ప్రధానంగా విద్యాపరమైన ఒత్తిళ్ల కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని కేంద్ర మానవ వనరుల శాఖ కూడా ఓ అధ్యయనం తర్వాత అంగీకరించింది. ఫలితాలు, మార్కులు సాధించకుంటే కుటుంబీకులు అంగీ కరించరని, జీవితం వృథా అనుకుంటూ విద్యార్థులు ఒత్తిళ్లకు గురవు తున్నారని, ఈ స్థితిని అధిగమించాలనీ హెచ్చార్డీ శాఖ పేర్కొంది. సవాళ్లకు ఓ శారీరక ప్రతిస్పందనగా ఒత్తిడిని నిర్వచిస్తారు. అన్ని వేళలా నష్టదాయకం కాదని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒత్తిడి సత్ఫలితాల్నిస్తుందనీ నిపుణులు వివరిస్తారు. అది పరిధులు, పరిమితులు దాటకుండా జాగ్రత్త పడాలి. పరిధులు దాటుతున్న సంకేతాల్ని గ్రహించాలి. ఇంటివద్ద, కాలేజీల్లో, హాస్టళ్లలో... ఇలా వేర్వేరు చోట వేర్వేరు ఒత్తిడి సంకేతాలొస్తుంటాయి. విద్యా ర్థుల్లో ముఖ్యంగా పోటీ పరీక్షలకు, వృత్తి కోర్సులకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఒత్తిళ్లు తీవ్రం కాకుండా చూసే ఒక నిఘా వ్యవస్థ ఉండాలి. వారికి ఒత్తిళ్ల నుంచి విముక్తి కలిగించే ‘కంపెన్సేటరీ రిలాగ్జేషన్ ప్రోగ్రామ్’ (సీఆర్పీ) పకడ్బందీగా అమలుపరచాలని నిపుణులంటారు. కానీ, విద్యను ఫక్తు లాభా పేక్షతో వ్యాపారంగా నడుపుతున్న కార్పొరేట్ సంస్థలు ఈ పనికి ససేమిరా అంటాయి. సమయం, డబ్బు వృథా అనేది వారి భావన. తల్లిదండ్రులైనా ఈ వాస్తవాల్ని గ్రహించి, ఆయా సంస్థలపై నిఘా వేయాలి. ప్రభుత్వాలీ విష యంలో తగినంత చొరవ చూపాలి. సామాజిక వేత్తలు కూడా చేయి కలపాలి. అందరం కలిసి దేశ భవిష్యత్ సంపద అయిన విద్యార్థులు-యువతరాన్ని ఒత్తిళ్ల నుంచి, ఆత్మహత్యల నుంచి, బలవన్మరణాల నుంచి కాపాడుకోవాలి. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
పెరుగుతో అధిక రక్తపోటు దూరం
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ల అవసరమే రాదన్నట్లు.. రోజుకో పెరుగుకప్పు తింటే.. రక్తపోటు దూరం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నెలకోసారి పెరుగు తినేవారి కంటే వారానికి ఐదారు కప్పుల పెరుగు తినేవారిలో రక్తపోటు ప్రమాదం 20 శాతం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. గుండెజబ్బులు, స్ట్రోక్స్ వంటి ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పే అధికరక్తపోటును పెరుగు నియంత్రిస్తుందని అధ్యయనాల్లో తెలుసుకున్నట్లు అమెరికా బోస్టన్ విశ్వవిద్యాలయంలో డాక్టొరల్ విద్యార్థి, ప్రధాన పరిశోధకుడు జస్టిన్ బ్యూండియా చెప్తున్నారు. పాలు... పాలతో తయారయ్యే జున్ను వంటి పదార్థాలు కూడా ప్రతిరోజూ తీసుకోవడం మేలని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ఇతర పాల ఉత్పత్తులకంటే పెరుగు అత్యధికంగా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. మధ్యవయసువారిలో రక్తపోటుపై పెరుగు ప్రభావం కనుగొనేందుకు 25-55 మధ్య వయసున్న మహిళలపై అధ్యయనాలు నిర్వహించారు. అలాగే 40-75 మధ్య పురుషుల ఆరోగ్య పరిస్థితులనూ పరిశీలించారు. అధిక మొత్తంలో పెరుగు తీసుకునేవారు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారి మధ్య ప్రభావాలు భిన్నంగా ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. పండ్లు, కూరగాయలు, గింజలు, బీన్స్ వంటి ఆహారం తీసుకునే వారిని, వారంలో ఐదారుసార్లు పెరుగు తినేవారిని పోల్చి చూసినా... పెరుగు లేదా పాల ఉత్పత్తులు తీసుకునేవారే బలంగా ఉండటంతోపాటు, రక్తపోటు ప్రమాదం తక్కువగా ఉన్నట్లు అధ్యయాల్లో తేలిందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన ఎపిడమియాలజీ, లైఫ్ స్టైల్ 2016 సైంటిఫిక్ సెషన్స్ లో ప్రచురించారు. పాలలో రెండు చెంచాల పెరుగు కలిపి గది ఉష్ణోగ్రతలోనే సహజపద్ధతిలో పెరుగు తయారు చేస్తారు. యోగర్ట్ కూడా పాల ఉత్పత్తే అయినా కొంత కృత్రిమంగా తయారవుతుంది. రెండింటిలో ఏ రూపంగా తీసుకున్నా ఇది మహిళల్లో రక్తపోటును నియంత్రిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. -
ఆర్థిక సమస్యలతో దంపతుల బలవన్మరణం
ఘట్కేసర్: ఆర్థిక సమస్యల కారణంగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లోని వెంకటాద్రి టౌన్షిప్లో నివాసం ఉండే రాజేంద్రప్రసాద్(40), అన్నపూర్ణ(35) దంపతులు సోమవారం రాత్రి విషం తాగారు. మంగళవారం వారు ఉదయం లేవకపోయేసరికి వారి ఇద్దరు కుమారులు చుట్టుపక్కల వారికి తెలిపారు. వారు వచ్చి చూసేసరికి విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రుల మృతితో కుమారులు విషాదంలో మునిగిపోయారు. -
కుక్కర్లో తల పెట్టిన ఐదేళ్ల బాలుడు
-
కేంద్రంపై 'ప్రత్యేక' ఒత్తిడి తేవాలి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం కర్నూలులో ఐద్వా రాష్ట్ర నాయకురాలు టీసీ లక్ష్మమ్మ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఓ వైపు కేంద్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెబుతున్నా.. ముఖ్యమంత్రి ఇంకా ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సైతం మాట మారుస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లోని రెండు నదులకు జాతీయ హోదా కల్పించేందుకు సీఎం కృషి చేయాలన్నారు. రాయలసీమలో ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం తీరును ప్రజలకు వివరించేందుకు సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాఘవులు తెలిపారు. -
తీవ్ర ఒత్తిడిలో పోలీస్
నిరంతర పనితో ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, ప్రవర్తనపై దుష్ర్పభావం పోలీసులకు 8 గంటల షిఫ్ట్ విధానం తప్పనిసరి చేయాలి కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి పోలీసుల పనితీరుపై ‘ఆస్కి’ అధ్యయన నివేదిక సిఫారసులు సాక్షి, హైదరాబాద్: అందరికీ భద్రత కల్పించే పోలీసు తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నాడు. సెలవులు, షిఫ్టులు ఎరగని విధులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. పోలీసుల కాఠిన్యం, కరకుదనం, దుష్ర్పవర్తనలు వంటి వాటికి నిరంతర పని ఒత్తిడే ప్రధాన కారణమని ప్రఖ్యాత పరిపాలన శిక్షణ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) దేశ వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. తీవ్ర పని ఒత్తిడితో పోలీసులు ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని సైతం కోల్పోతున్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. 23 రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోని వివిధ వర్గాలకు చెందిన దాదాపు 12,156 మంది పోలీసులను ఈ సర్వేలో భాగస్వామ్యం చేసింది. పోలీసులు ఒక్కొక్కసారి ఏకంగా 24 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని.. సెలవును సైతం దాసోహం చేసి డ్యూటీకి హాజరు కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని నివేదిక తేల్చింది. డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అత్యవసర పరిస్థితి ఎదురవతుండటంతో దాదాపు 80 శాతం మంది సిబ్బందిని తిరిగి పిలిపించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇలా ఎక్కువ గంటలపాటు పనిచేయడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని.. పని ఒత్తిడి చీకాకుల్లో సామాన్యులపై నోరు పారేసుకున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని.. ఈ నేపథ్యంలో పోలీసులు రోజురోజుకూ సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నారని వెల్లడించింది. షిఫ్ట్ పద్ధతి పెడితే మేలు పోలీసులో మార్పు తీసుకొచ్చేందుకు షిఫ్ట్ పద్ధతి పెడితే ఎలా ఉంటుందన్న దానిపై ఆస్కి చర్చించింది. ఇప్పటికే కేరళలో అమల్లో ఉన్న ఎనిమిది గంటల డ్యూటీ వ్యవస్థ విజయవంతమైనట్లుగా వెల్లడైంది. మధ్యప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న పోలీసు స్టేషన్లకు వెళ్లి చేసిన అధ్యయనంలో కూడా ఇదే విషయం తేటతెల్లమైందని తెలిపింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బందిని పెంచాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. -
రేషన్ మాఫియా!
కర్నూలు: రేషన్ దుకాణాలను అధికార పార్టీ నాయకులు తన్నుకుపోతున్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి నిబంధనలను తోసిరాజని ఇష్టానుసారంగా తమ అనుయాయులకు కేటాయించుకుంటున్నారు. ఇదే అదనుగా రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. పేదలకు దక్కాల్సిన సబ్సిడీ సరుకులను బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారు. రాయితీ సరుకులను అక్రమంగా సేకరించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఉండే పట్టణ కేంద్రాల్లోనే యథేచ్ఛగా రేషన్ సరుకులు బ్లాక్మార్కెట్కు తరలిపోతున్నాయి. రేషన్ సరుకులను అక్రమంగా సేకరిస్తున్న రేషన్ మాఫియా ఇప్పుడు చౌకధరల దుకాణాలపై కన్నేసింది. భారీ మామూళ్లు ఇచ్చి ప్రజాప్రతినిధులు, అధికారులను తమ గుప్పెట్లోకి తీసుకుని ప్రజాపంపిణీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కర్నూలు జిల్లాలో దాదాపు 100కు పైగా చౌక ధరల దుకాణాలను నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేయడంలో ఈ మాఫియా సఫలీకతమైంది. ఇదీ అసలు కథ... కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,411 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అవకతవలకు పాల్పడిన కొం దరు రేషన్ డీలర్లను గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్, కోడుమూరు, బనగానపల్లె, నందికొట్కూరులో పలు చౌకధరల దుకాణాలపై 6ఎ కేసులు నమోదు చేశారు. వీటిని సమీపంలోని కొందరు డీలర్లకు అప్పగించారు. ఇప్పుడు వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి తాత్కాలిక ప్రాతిపదికన కొత్తవారికి అప్పగించారు. రేషన్ మాఫియా సిఫార్సు చేసిన వారికి వీటిని కేటాయించారు. అయితే రేషన్ దుకాణాలకు తాత్కాలిక కేటాయింపులు చేయవద్దని ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఇటీవల వంద మందికి అక్రమంగా దుకాణాలు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో రేషన్ దుకాణం కోసం రూ. లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు ఈ మలికి అంటించినట్లు ఆరోపణలున్నాయి. రేషన్ మాఫియాకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా తలొగ్గితే ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టే ప్రమాదం ఉంది. వాస్తవంగా చౌకధరల దుకాణాల కేటాయింపు అధికారం ఆర్డీవోలకు ఉంది. వీటికి నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ను అనుసరించి భర్తీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించకూడదు. కానీ కర్నూలు జిల్లాలో పదుల సంఖ్యలో దుకాణాలను తాత్కాలిక ప్రాతిపదికన కేటాయిస్తూ ఆర్డీవోలు ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. దీనికి కొత్త రంగు పులిమారు. 6ఎ కేసుల్లో ఉన్న ఈ ఐదు దుకాణాల నుంచి తమకు సరుకులు సక్రమంగా అందడంలేదని, దూరంగా వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు అందినట్లు సృష్టించి, ఈ సాకుతో తాత్కాలిక ప్రాతిపదికన చౌకధరల దుకాణాలు కేటాయించారు. దీనిపై దుమారం రేగుతోంది. అంతా బహిరంగమే... జిల్లాలో ప్రతీ నెలా రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని సేకరించి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా.. కిరోసిన్ను ఆటోలకు, లారీలకు అధిక ధరలకు బహిరంగంగా విక్రయిస్తున్నా మాఫియా ఆగడాలను అడ్డుకునేవారే లేరు. కర్నూలు నగరంలోనూ, జాతీయ రహదారిపైనా ఇదే పరిస్థితి. రేషన్ బియ్యంను డీలర్ల నుంచి కిలో రూ. 10 కొనుగోలు చేస్తూ, వీరు మాత్రం బయట రూ. 15 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతీ నెలా రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు. కిరోసిన్ది ఇదే పరిస్థితి. దీనికి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నారు. రేషన్ డీలర్లు విధిగా వారి వద్ద ఉన్న సరుకులను రేషన్ మాఫియాకే విక్రయించాలని, లేకపోతే కేసులు పెట్టిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. పేదలకు చెందాల్సిన బియ్యం, కిరోసిన్ను బోగస్ కార్డులు, తూకాల్లో తేడాలతో కొందరు డీలర్లు మిగుల్చుకుంటున్నారు. వీటిని రేషన్ మాఫియాకు విక్రయిస్తున్నారు. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా అధికారయంత్రాంగం పట్టించుకోవడం లేదు. రేషన్ దుకాణాల్లో తనిఖీలు కూడా చేయడం లేదు. తూకాల్లో తేడా..? రేషన్ దుకాణాల్లో సరుకులు సరైన తూకంతో అందించడంలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. చాలా దుకాణాల్లో ప్రతీనెలా 3 క్వింటాళ్ల వరకు బియ్యం మిగుల్చుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మిగతా సరుకులది అదే పరిస్థితి. కర్నూలు, నందికొట్కూరు, బనగానపల్లె తదితర చోట్ల రేషన్ దుకాణాల నుంచి ప్రతీనెలా సరుకులను సేకరించడానికి మాఫియా ప్రాంతాలను పంచేసుకున్నారు. ఇటు డీలర్లు, మాఫియా చేసేది అక్రమమైనా అధికార యంత్రాంగం మాత్రం వారిచ్చే మామూళ్లు తీసుకుంటూ నిద్ర మత్తులో జోగుతోంది. -
సైకిల్ తొక్కండి... చల్లబడండి!
మీరు తరచుగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఆగ్రహంతో ఊగిపోతున్నారా? ఉత్సాహలేమితో బాధ పడుతున్నారా? ఏ పనీ చేయాలనిపించడం లేదా? అయితే మీకో కూల్ ఐడియా...పై లక్షణాలు మీలో కనిపించినప్పుడు నడకకు లేదా సైకిల్ తొక్కడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీలో సరికొత్త ఉత్సాహం తొంగిచూస్తుంది. ‘సైకిలింగ్, నడక ద్వారా కలిగే ఉపయోగాలు’ అంశంపై నార్విచ్ మెడికల్ స్కూల్, ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ పరిశోధకుడు ఆడం మార్టిన్ అధ్యయనం చేశారు. ఎక్కువగా నడిచేవారు, ఎక్కువగా సైకిలింగ్ చేసేవారి జీవన శైలిని, మానసిక స్థితిగతులను లోతుగా అధ్యయనం చేశారు. తన అధ్యయనానికి సంబంధించిన వివరాలను ‘ప్రివెంటివ్ మెడిసిన్’ జర్నల్లో ప్రచురించారు. ‘‘మరీ ఎక్కువ దూరమైతే తప్ప నడకకు లేదా సైకిలింగ్కు ప్రాధాన్యత ఇవ్వడమే మంచిది. దీనివల్ల ఆఫీసుకు ఆలస్యం అవుతుందనుకుంటే...కాస్త ముందుగానే బయలుదేరితే మంచిది’’ అంటున్నాడు మార్టిన్. ‘‘మా ఇంటి నుంచి ఆఫీసు పదికిలోమీటర్ల దూరం. గత పదిహేడు సంవత్సరాల నుంచి రోజూ ఆఫీసుకు నడిచే వెళుతున్నాను. ఇప్పటి వరకు నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాలేదు. రోజూ ఇరవై కిలోమీటర్ల దూరం నడుస్తున్నాను కాబట్టి... ప్రత్యేకంగా వ్యాయామాలేవి చేయడం లేదు. రవాణా ఖర్చులు కూడా మిగులుతున్నాయి’’ అంటున్నాడు లండన్లో పని చేసే ఒక ఉద్యోగి. అతని సంగతి పక్కన పెట్టండి. మరి మీరు? -
దహిస్తోంది అసూయాగ్ని
న్యూఢిల్లీ: మనకు లేదనుకుంటే బాధ... ఎదుటివారికి ఉందనుకుం టే మరింత బాధ. అది మనల్ని ఆవహించినప్పుడు అంతగా తెలీదు... దహిస్తున్నప్పుడు తెలుస్తుంది. దాన్ని వదిలించుకోవడం ఎంత కష్టమో..! అసూయ అంటే ఒక భావోద్వేగం. ప్రపంచంలో దీనికి అ తీతులైనవారెవరైనా ఉన్నారంటే వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చేమో. అసూయకు లోనైతే... అసూయకు గురైనవారు భయం, కోపం, ఓటమి, అనుమానం, ఒత్తిడి, విచారం, బాధ, ఆత్మన్యూనత లాంటి వివిధ రకాల భావాలకు లోనవుతా రు. నిరుత్సాహపూర్వకమైన, నిరాశాపూరితమైన పరిస్థితుల్లోకి ఇది వారిని నెట్టేస్తుంది. కనీసం సన్నిహితులతో కూడా పంచుకోలేని పరిస్థితి ఇది. దీని ని అణచుకోకుండా పెరగనిచ్చామంటే అది స్లోపాయిజన్లా మారిపోతుంది. అంచనాలు అందుకోలేకపోవడం మన గురించి, మన చుట్టూ ఉన్నవారి గురించి చాలాసార్లు మనం కొన్ని వాస్తవ విరుద్ధమైన అంచనాల్లో ఉంటాం. అదే విధంగా మన పనులన్నీ సులభంగా అయిపోవాలని, అన్నీ తేలికగా అమరిపోవాలని ఆశిస్తాం. అయితే అలా జరగనప్పుడు, అవి సమకూర్చుకున్నవారి వైపు అనుకోకుండానే చూస్తాం. నిజానికి అది అనవసరమైన చూపే. కానీ ఆ చూపే మనల్ని అసూయ అనే అగాథంలోకి విసిరేస్తుంది. అభద్రతాభావం సమాజంలో మన చుట్టూ ఉన్నత స్థాయిలో మన జీవితం కూడా ఉండాలని భావిస్తాం. అలా కానప్పుడు మనల్ని మిగిలిన వారు చిన్నచూపు చూస్తారేమోననే అభద్రతా భావానికి లోనవుతాం. ఆ అభద్రతా భావమే ఎదుగుతున్నవారిపై మనం అసూయపడేలా చేస్తుంది. పోలిక వద్దు మనం ఎవరికి వారు వైవిధ్యంతో, మనదైన వ్యక్తిత్వంతో జన్మించాం. సమాజపరమైన స్థాయి బేధా లు ఎలా ఉన్నా... మనం మాత్రం ఇతరులతో పోల్చుకోవడం మానుకోవాలి. మనం స్పెషల్ అనే ఫీలింగ్ని ప్రేమించాలి. ఇతరులకు ఉన్న డబ్బు, కీర్తి, విజయాలు, రూపం... మనకు లేవే అనుకోవడం కన్నా మనకు ఉన్నవే ఉన్నతమైనవిగా భావించి ఆనందించాలి. మన ప్రయాణం మనదే అని గుర్తించాలి. మన గురించి మనమే చింతించడం మానాలి ఎప్పుడూ మన గురిం చే ఎక్కువగా ఆలోచిం చడం వల్ల వచ్చే సమస్యల్లో ఇదొకటి. కాబ ట్టి అది తగ్గించాలి. ఇతరుల్ని పొగడడం నేర్చుకోవాలి. ఇతరుల విజ యాలను గుర్తించడం, వారిని ప్రశంసించడం అల వరచుకోవాలి. తోటివారిని అభినందించడం ద్వారా వచ్చే ఆనందాన్ని ఆస్వాదించాలి. ఇలాంటి మార్పు చేర్పుల వల్ల ఒకప్పుడు మనకు అసూయ ను కలిగించినవి ఎంత చిన్న విషయాలో అర్థమౌతుంది. లాజిక్ అవసరం ఒక వ్యక్తి శారీరకంగా ఫిట్గా ఉండి, చూడడానికి ఆరోగ్యవంతంగా కనిపిస్తే వెంటనే అసూయకు గురవ్వడం సులభం. అయితే మనం నిజంగా రోజూ వర్కవుట్స్ చేయగలమా? మనం ఆరోగ్యకరమైన ఆహారానికి మాత్రమే పరిమితం కాగలమా? అలా కానప్పుడు ఇక అసూయ చెందాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి లాజికల్ థిం కింగ్తో అంకురించిన అసూయ ఆమడ దూరం పారిపోతుంది. మీ జీవితంలోని మంచి మీద దృష్టి పెట్టండి మన జీవితంలోనూ ఎన్నో విజయాలుంటాయి. చుట్టుపక్కల ఉన్నవారు సాధించలేనివేవో మనం సాధించే ఉంటాం. అవి గుర్తించాలి. చాలా మంది కి లేని సామర్థ్యాలను మనకు భగవంతుడు ఇచ్చే ఉంటాడు. అవి ఏమిటో వెలికి తీసి వాటిని ఉపయోగించుకుని ఇతరులకుసాయపడడం మొదలు పెట్టాలి. తప్పకుండా మనకన్నా చాలా విషయా ల్లో తక్కువగా ఉన్నవారు ఉండే ఉంటారు. వారిని చూసి గొప్పలకు పోకుండా వారికి అవసరమైన సాయం చేయడం ద్వారా మన ఉన్నతిని మనమే గౌరవించుకున్నవారమవుతాం. అసూయ గుడ్డిది కూడా ప్రేమ ఒక్కటే కాదు అసూయ కూడా గుడ్డిదేనట. డెలావెర్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఓ సర్వేలో అసూయ అనే పొరలు కళ్లకు కమ్ముకోవడం అనే మాట నానుడికి అనేది మాత్రమే కాదని నిజమని తేలింది. మనిషి మస్తిష్కంలో అసూయ పెరిగిపోతే అది కంటి ముందు కనపడేచిత్రాలను చూడనీకుండా తాత్కాలికంగా అంధత్వాన్ని ప్రాప్తింపజేస్తుందని తమ ముందున్న వాటిలో ఏది సరైందో తెలుసుకోలేకపోతారని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే అనుబంధాలకు సంబంధించిన అంశంలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా ఈర్ష్యాసూయలకు గురవుతున్నారని మిస్సోరి వెస్ట్రన్ స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మెదడే కీలకం బ్రెయిన్లోని కొన్ని ప్రాంతాలు మనల్ని జెలసీకి గురయ్యేలా చేస్తున్నాయని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించే సిఎన్ఎస్ స్పెక్ట్రమ్స్ జర్నల్ తన తాజా వ్యాసంలో ఓ పరిశోధనా ఫలితాలు వెల్లడిం చింది. మానవ అనుభూతికి సంబంధించిన ఒక సహజమైన భావోద్వేగమే అయినప్పటికీ ఇది ఆత్మహత్యలకు, ఉన్మాదానికి, తీవ్రమైన మానసిక ఒత్తిడికి, హత్యలకు సైతం దారితీయడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నట్టు వీరు గుర్తించారు. పరిశోధకుల్లో ఒకరైన డొనాటెల్లా మరాజ్జిటి మాట్లాడుతూ... ‘అసూయ కలిగే పరిస్థితిని ఒకప్పుడు కేవలం సైకాలజిస్ట్లు, సైక్రియాట్రిస్ట్లు మాత్రమే పరిశీలించేవారు. అయితే ఇప్పుడు ఇది ఒక న్యూరో సైన్స్కు సంబంధించిన అంశంగా కూడా మారింది’ అన్నారు. ఫేస్బుక్ ఒక కారణం ఇటీవలి ఆధునిక పరిస్థితులు ఈ భావోద్వేగం మరింత పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని గుర్తిస్తున్నారు. వాటిలో ఫేస్బుక్ కూడా ఒకటి. వ్యక్తిగత విషయాలను చెప్పుకునేందుకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్న ఈ సోషల్ మీడియా అసూయను రాజేస్తోందట. అత్యధికంగా ఫేస్బుక్ను వినియోగిస్తున్నవారిలో అత్యధికులు అసూయాపరులుగా మారుతున్నారని ఓ ఆన్లైన్ సర్వేలో తేలింది. మానసిక నిపుణుల మాట స్వల్పంగా అసూయ ఉండడం అనేది చాలా సహజమైనది, అవసరమైనది కూడా. జీవితంలో ఎదిగేందుకు విజయాలు సాధించేందుకు అది ఉపయోగపడుతుంది. అయితే కొందరి విషయంలో ఇది శృతి మించుతోంది. దీన్నే ‘డెల్యూజనల్ డిజార్డర్’గా సైకలాజికల్ పరిభాషలో వ్యవహరిస్తాం. ఈ పరిస్థితికి లోనైనవారు తాము కోరుకున్నది ఇతరులకు దక్కడాన్ని సహించే దశను దాటిపోతారు. దీంతో వీరిలో నేరస్వభావం కూడా ఏర్పడుతుంది. నలుగురితో కలవలేకపోవడం, తరచుగా ఇతరులతో పోల్చుకుంటూ బాధపడుతుం డడం... వంటి లక్షణాలున్న వారి విషయంలో కుటుంబసభ్యులు అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా స్వభా వంతమలో పెరుగుతుంటే అదొక వ్యాధిగా గుర్తిం చాలే తప్ప తమ ఆలోచన సరైనదే అనుకోకూడదు. అవసరమైతే చికిత్సకు సిద్ధపడాలి. మరోవైపు చిన్నవయసు నుంచే ఈ తరహా స్వభావాలు పెరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలని గుర్గావ్లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి చెం దిన మానసిక వైద్యుడు అన్నారు. -
ముసురు వానలే..
50 శాతం లోటు వర్షపాతం రెండు మండలాల్లోనే సాధారణం 35 మండలాల్లో లోటు 20 మండలాల్లో అత్యల్పం వర్షాకాలం మొదలైన నెలరోజుల తర్వాత అల్పపీడనం పుణ్యమాని ముసురు మురిపించింది. జిల్లాలో మూడు రోజులుగా చినుకులు సవ్వడి చేస్తున్నా గట్టి వర్షాలు పడకపోవడం నిరాశపర్చింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమైనప్పటికీ అంతలోనే మబ్బులు తేలిపోవడం ఆందోళనకు గురిచేసింది. తేలికపాటి వానలతో ఇప్పటికే నాటిన విత్తనాలకు ప్రాణం పోసినట్లయింది. అయితే ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల అరకలు ముందుకు సాగే పరిస్థితి లేదు. ఇప్పటికీ అన్నదాతలు పూర్తిస్థాయిలో పొలం పనుల్లో నిమగ్నం కాలేదు. వరినార్లకు ఊరటనిచ్చే వర్షాల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడంలేదు. - కరీంనగర్ అగ్రికల్చర్ కరీంనగర్ అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా జూలైలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 92.2 మిల్లీమీటర్లు కాగా, 55 మిల్లీమీటర్ల మాత్రమే నమోదయింది. గతేడాది ఇదే సమయానికి 103 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్లో సాధారణ వర్షపాతం 153 మిల్లీమీటర్లకు గాను 78.7 మిల్లీమీటర్లుగా రికార్డయింది. జూన్, జూలై మాసాల్లో సాధారణ వర్షపాతం 270.8 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 136.7 మిల్లీమీటర్లే కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 50 శాతం లోటు వర్షపాతం నమోదయింది. జిల్లాలో 57 మండలాలకు గాను 35 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. 20 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయింది. సారంగాపూర్, చొప్పదండి మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయినట్టు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. సారంగాపూర్లో 273 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 310.4, చొప్పదండిలో 260.1కి గాను 253.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లోటు వర్షపాతం మండలాలు.. కమాన్పూర్, పెగడపల్లి. గంగాధర. హుస్నాబాద్, జూలపల్లి, మెట్పల్లి, భీమదేవరపల్లి, గొల్లపల్లి, జగిత్యాల, కథలాపూర్, శ్రీరాంపూర్, కోరుట్ల, కరీంనగర్, మంథని, మల్యాల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి, ఓదెల, జమ్మికుంట, వీణవంక, కోహెడ, ధర్మారం, సైదాపూర్, ముత్తారం, ఎల్కతుర్తి, కాటారం, మహాముత్తారం, రామడుగు, ఎలిగేడు, మల్హర్, బెజ్జంకి మండలాల్లో లోటు వర్షపాతం నమోదయింది. అత్యల్ప వర్షపాతం మండలాలు.. రాయికల్, సుల్తానాబాద్, కేశవపట్నం, మేడిపల్లి, సిరిసిల్ల, రామగుండం, చందుర్తి, ఇల్లంతకుంట, తిమ్మాపూర్, ఎల్లారెడ్డిపేట, వెల్గటూర్, వేములవాడ, మహదేవపూర్, బోయినిపల్లి, చిగురుమామిడి, కొడిమ్యాల, మానకొండూర్, కోనరావుపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో అత్యల్ప వర్షపాతం రికార్డయింది. రెండు రోజుల్లో 5.1 మిల్లీమీటర్లు.. జిల్లాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8గంటల వరకు 40 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 5.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మహాముత్తారం మండలంలో 33.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మహదేవపూర్లో 18.4, మల్యాల 18.2, కాటారం 14.6, ముత్తారం 13.4, రాయికల్ 13, మేడిపల్లి, తిమ్మాపూర్ 12.2, కమాన్పూర్ 10.6, మల్హర్ 9.3, మంథని, పెద్దపల్లి 8.2, కోరుట్ల 8, కాల్వశ్రీరాంపూర్ 7.6, రామగుండంలో 7.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో మోస్తరుగా జల్లులు పడ్డాయి. -
ఒత్తిడితో పాటే వచ్చే జబ్బులూ ..
నగర జీవితంలో ఒత్తిడి తప్పదు. ఒత్తిడితో పాటే వచ్చే జబ్బులూ తప్పవు. ‘సిటీ’జనులు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా, డయాబెటిస్, ఆర్థరైటిస్, హైపోథైరాయిడిజం, చర్మ వ్యాధులు, జుట్టు రాలడం వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. జీవనశైలి కారణంగా కొన్ని, కాలుష్యం కారణంగా మరికొన్ని... ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామంటోంది ‘రెవా’. అమెరికాలో శిక్షణ పొందిన తమ వైద్య బృందం, అత్యంత అధునాతన వైద్య పరీక్షా సౌకర్యాలు ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకైనా ఇట్టే చెక్ పెట్టగలవని ‘రెవా’ నిర్వాహకులు చెబుతున్నారు. ‘రెవా’ 360 డిగ్రీస్ కంప్లీట్ హెల్త్ సొల్యూషన్స ప్రోగ్రామ్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను సమర్థంగా నయం చేయడమే కాకుండా, భవిష్యత్తులో తిరిగి వ్యాధుల బారిన పడకుండా తమ నిపుణులు తగిన సలహాలు, సూచనలు ఇస్తారని అంటున్నారు. -
కన్నీటి సేద్యం తప్పదా?
సాగునీటి కోసం ఖరీఫ్ రైతు ఎదురుచూపు వెనక్కి వెళ్లిన వర్షాలు మాయమైన అల్పపీడనం మళ్లీ పాత రోజులు విజయవాడ సిటీ : ఖరీఫ్ సాగు చేసి ఆర్థిక బాధలనుంచి కాస్త ఒడ్డున పడాలనుకుంటున్న రైతులకు నిరాశ తప్పేట్టులేదు.గడువు ముగిసినా ఇంతవరకు సాగర్జలాలను విడుదల చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. మళ్లీ పాత రోజులు పునరావృతమవుతాయేమోనని భయపడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. అల్పపీడనం ఏర్పడినట్లే ఏర్పడి అల్లంతలో మటుమాయమైంది. రైతాంగం వారం రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రోహిణీ కార్తె వెళ్లి, మృగ శిర కార్తె వచ్చి ఒక పాదం గుడుస్తున్నా, వర్షాలు కురవక పోగా తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. ఏరోజు కారోజు మబ్బులు కమ్మి వర్షం పడకుండానే రోజులు గడిచిపోతున్నాయి. దాంతో ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడతాయో లేదోననే ఆందోళనలో అన్నదాతలున్నారు. వర్షాలు కురిస్తేనే సాగర్నుంచి సాగునీరు వదిలే వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు పడకపోతే సాగర్ నుంచి నీరు వదిలే అవకాశం లేదని, ఒకవేళ వర్షాలు కురిసినా రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణానదిలోకి నీరు విడుదల అనుమానమేనంటున్నారు. నేటివరకు సాగుకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. గత సంవత్సరం జూన్ 3వ తేదీనే సాగుకు నీరు విడుదల చేశారు. ఈ క్రమంలో నెలాఖరు నాటికి కూడా సాగునీరు వదిలేది అనుమానమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారం, లేదా కనీసం 15తేదీలోగా నీరు విడుదలైతే ఖరీఫ్కు ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతాంగం భావిస్తున్నారు. గత సంవత్సరం ఖరీఫ్, రబీలో 207.07 క్యూసెక్కుల నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. సముద్రంలోకి 399.24 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. గత ఏడాది జూలైలో కృష్ణా తూర్పు కాలువకు 3.70, ఆగస్టులో 22.02, సెప్టెంబర్లో 24.02, అక్టోబర్లో 13.63, నవంబర్లో 12,77, డిసెంబర్లో 4.62 టీఎంసీలు విడుదల చేశారు. కృష్ణా పశ్చిమ కాలువకు జూన్లో 0.13, జూలై 1.81, ఆగస్టు 14.14, సెప్టెంబర్ 12.50, అక్టోబర్ 6.91, నవంబర్ 9.25, డిసెంబర్లో 6.53 టీఎంసీల నీరు విడుదల చేశారు. ఖరీఫ్ నీటివిడుదలను డిసెంబర్ 22తో నిలిపి వేశారు. ఇక రబీలో కేఈ మెయిన్ కాలువకు జనవరిలో 13,84, ఫిభ్రవరిలో 11.00, మార్చిలో 16.86, ఏప్రిల్లో 10.14 టీఎంసీల నీరు వదిలారు. కేడబ్ల్యూ మెయిన్ కాలువకు జనవరిలో 7.46, ఫిభ్రవరిలో 5.57, మార్చిలో 7.90, ఏప్రిల్లో 2.30 టీఎంసీల నీరు వదిలారు. గత ఏడాది ఖరీఫ్లో 129.59, రబీలో 77.47 టీ ఎంసీల నీటిని వినియోగించుకున్నారు. ఈ ఏడాది కూడా అదే విధంగా సాగునీరు అవసరం ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణా ప్రాంతంలో వర్షాలు పడితేనే దిగువనున్న కృష్ణానదిలోకి నీరు వస్తుందని లేకుంటే సాగునీరు విడుదలపై ఆశవదులుకోవాల్సిందేనని రైతులు ందోళన చెందుతున్నారు. -
ఆడవాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన 5 విషయాలు...
నేర్చుకుందాం... మార్చుకుందాం ఆడవాళ్లు, మగవాళ్లు వేరు వేరు గ్రహాల నుంచి వచ్చారని చెప్పుకుంటున్నా... ఒకే గ్రహంలో, ఒకే భూమి మీద, ఒకే కప్పు కింద ఉండాలి కాబట్టి... మన నుంచి వాళ్లు, వాళ్ల నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన నుంచి వాళ్లు ఏం నేర్చుకుంటారు? అనేది పక్కన పెడితే, వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని... హడావిడి నిర్ణయాలు తీసుకోరు. పదిమందితో మాట్లాడిగానీ ఒక నిర్ణయానికి రారు. మనలో కొందరు: ఒకరి సలహా తీసుకోవడం ఏమిటి? నాకు ఆ మాత్రం తెలియదా? అనే అహం మనసులో ఏ మూలో ఉంటుంది. * ఎన్ని పనులు నెత్తి మీద ఉన్నా... గందరగోళానికి, ఒత్తిడికి గురి కారు. ‘ఒత్తిడి’ ‘అరుపులు’ అనేవి పనికి కావలసిన ఇంధనం కాదు అనే విషయం వారికి తెలుసు. పెదవుల మీద చెరగని చిరునవ్వే వారి బలం. మ. కొ: రోజూ చేస్తున్న పనికి అదనంగా ఒక పని తోడైతే చాలు! ఆకాశం నుంచి ఆరువందల కేజీల బరువు నెత్తి మీద పడ్డట్లు ఫీలవుతారు. కోపం, అసహనం అనే ఇంధనంతో ‘పని బండి’ని నడపాలనుకుంటారు. నెలకు ఎంత జీతం వస్తుంది...ఎంత ఖర్చు చేయాలి? ఎంత పొదుపు చేయాలి? అనేదాని గురించి వారికి స్పష్టత ఉంటుంది. అనవసర ఖర్చులు, ఆర్భాటపు ఖర్చులు చేయరు. మ. కొ: స్నేహితుల ముందు గొప్ప కోసం, ‘డబ్బు లెక్క చేయడు’ అనే పేరు కోసం ఎడా పెడా ఖర్చు చేస్తారు. ఇబ్బందుల్లో పడిపోతారు. ఖాళీ సమయం ఉంటే కొత్త వంటకమో, కొత్త అల్లికలో నేర్చుకుంటారు. పిల్లలకు ట్యూషన్ చెబుతారు. మ. కొ: మగాడు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం మర్యాద కాదనుకుంటారు తప్ప, ఇంట్లో ఉండి నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించరు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బార్పాలై దుర్వినియోగమవుతారు. మల్టీ టాస్క్ అండ్ బాలెన్స్: ఒక సమయంలో అనేక రకాల పనులు చేసినా అన్నిటి మధ్య సమన్వయం ఉండేలా చూసుకుంటారు. ఒకదానికొకటి అడ్డు రాకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా ఆ తప్పు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మ.కో: ఒకటికంటే ఎక్కువ పనులు చేయాల్సివచ్చినప్పుడు ‘గందరగోళం’ అనుకోని అతిథిగా వస్తుంది. దీంతో తప్పు మీద తప్పు చేస్తాం. తప్పును సవరించుకోకపోగా ‘రెండు పడవల మీద ప్రయాణం కష్టం’ అనే సిద్ధాంతాన్ని నమ్మి రథాన్ని వెనక్కి మళ్లిస్తాం. -
అయ్యా...పిల్లల మీద అరవకండి!
మానసికం బయట ఎన్ని పనులున్నా, వాటి తాలూకు ఒత్తిడి ఉన్నా, ఎన్ని సమస్యలున్నా...ఇంట్లోకి వచ్చాక మాత్రం ప్రశాంతంగా ఉండడం, కుటుంబంతో సంతోషంగా గడపడం అనేది ‘గృహస్థు లక్షణం’ అంటారు పెద్దలు. కాని కొందరు తండ్రులు మాత్రం బయటి ప్రపంచం ఒత్తిడి, కోపాన్నంతా ఇంట్లో ప్రదర్శిస్తుంటారు. ‘‘నాన్న...మా స్కూల్లో ఇవ్వాళి’’ అని పిల్లాడు తన క్లాసులో జరిగిన విషయాన్ని చెప్పబోతుంటే- ‘‘అబ్బ... రాగానే మెదడు తింటావు.... వెళ్లు’’ అంటూ కసురుకుంటారు కొందరు. పిల్లాడు నాన్స్టాప్గా ఏడవడానికి ఇంతకుమించిన కారణం అక్కర్లేదు కదా! అయితే ఇదేమీ అషామాషీగా తీసుకోవల్సిన విషయం కాదు అంటున్నారు మానసిక విశ్లేషకులు. తరచుగా పిల్లల మీద అరవడం వల్ల, అది వారి ప్రవర్తన మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందట. అలాగే, క్రమశిక్షణ పేరుతో పిల్లలని శిక్షించడం వల్ల మార్పు రాక పోగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ‘‘పిల్లల పెంపకంలో శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తరచుగా అరవడం వల్ల...పిల్లల్లో నాన్న అంటే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అది మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, ఈ ప్రభావం వల్ల పిల్లలు ఇతరులతో కలవలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అంటున్నాడు డెన్మార్క్కు చెందిన సైకాలజిస్ట్ ఎరిక్ సిగార్డ్. -
కుమిలి కుమిలి.. గుండె పగిలి..
న్యూస్లైన్, కామారెడ్డి : గల్ఫ్కు వెళ్లిన వారిలో చాలా మంది ఒత్తిళ్లకు లోనవుతున్నారు. పని ఒత్తిడి, అప్పుల కుంపటి వారి ని వేదనకు గురి చేస్తున్నాయి. కొన్ని కంపెనీల్లో అడ్డగోలు పనులు చేయించుకునే యాజమాన్యాలు.. సరై న వేతనాలు ఇవ్వకపోవడం, వేతనాన్ని సక్రమంగా చెల్లించకపోవడంతో వలస జీవులు ఆర్థికంగా సతమతమవుతున్నారు. అప్పులు తీరకముందే ఇంటికి వెళితే అప్పులవాళ్లకు ఏమని సమాధానం చెప్పేదని మనోవ్యథకు గురవుతున్నారు. దీనికి తోడు కుటుం బానికి దూరంగా ఉండాల్సి రావడంతో ఒత్తిడి తీవ్ర మై అనారోగ్యం పాలవుతున్నారు. వైద్యం చేయించుకునేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు మృత్యువాత పడుతున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లి విదేశాల్లో గతేడాది 50 మందికిపైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతోనో.. అనారోగ్యంతోనో మృత్యువాతపడ్డారని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇంకొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరణవార్త చేరిన తర్వాత కడసారి చూపుకోసం అయినవారు నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వారు మరోవైపు అప్పులు ఇచ్చినవారి నుంచి వేధింపులను ఎదుర్కోవాల్సిన దుస్థితి. దీంతో వారూ నలిగిపోతున్నారు. 2013లో అనారోగ్యంతో విదేశాల్లో మరణించిన వారి వివరాలు.. మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెకు చెందిన మహబూబ్(33) జనవరి 19న గుండెపోటుతో సౌదీలో మరణించారు. భీమ్గల్కు చెందిన గంగాధర్(50) జనవరి 24న దుబాయిలో గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ మండలం తిర్మన్పల్లికి చెందిన ఇస్మాయిల్ ఫిబ్రవరి 1న గుండెపోటుతో ఒమన్లో మరణించారు. కమ్మర్పల్లి మండలం చౌటుప్పల్కు చెందిన సుభాష్ అనారోగ్యంతో ఫిబ్రవరి 9 బహ్రెయిన్లో మరణించారు. కామారెడ్డి మండలం కొటాల్పల్లికి చెందిన సిద్దరాములు గుండెపోటుతో సౌదీలో మరణించారు. ఆయన మృతదేహం నెలరోజుల తర్వాత ఫిబ్రవరి 14న స్వగ్రామం చేరింది. జక్రాన్పల్లి మండలం పడకల్కు చెందిన ఈర్ల లింగన్న(45) మార్చి 8న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. దోమకొండకు చెందిన దాసరి సిద్దరాములు (41) మార్చి 16న అనారోగ్యంతో దుబాయిలో మరణించారు. బాల్కొండ మండలం రెంజర్లకు చెందిన శ్రీనివాస్(35) ఏప్రిల్ 18న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. కమ్మర్పల్లికి చెందిన గంగాధర్(45) జూన్ 21న దుబాయిలో గుండెపోటుతో మరణించారు. నవీపేట మండలం బినోలాకు చెందిన ఒడ్డెన్న(45) సౌదీలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతదేహం మూడు నెలల తర్వాత జూలై 3వ తేదీన స్వగ్రామానికి చేరింది. ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్కు చెందిన తిరుపతి(45) జూలై 7న సౌదీలో గుండెపోటుతో మరణించారు. నందిపేట మండలం మారంపల్లికి చెందిన పెద్ద సాయాగౌడ్(50) దుబాయిలో అనారోగ్యానికి గురై జూలై 11 మరణించారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన రాజన్న (50) దుబాయిలో గుండెపోటుకు గురై జూలై 13న మరణించారు. వేల్పూర్కు చెందిన నాగేశ్(38) జూలై 29 దుబాయిలో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతదేహం ఐదు నెలల తర్వాత స్వగ్రామం చేరింది. ఆర్మూర్కు చెందిన శ్రీనివాస్(35) ఆగస్టులో అబుదాబీలో గుండెపోటుకు గురై మరణించారు. డిచ్పల్లి మండలం నడిమితండాకు చెందిన బంతిలాల్(40) సౌదీలో అనారోగ్యంతో ఆగస్టు 10 న మరణించారు. భిక్కనూరు మండలం రాజంపేటకు చెందిన రాజయ్య(45) ఆగస్టు 20 దుబాయిలో గుండెపోటుతో మరణించారు. నిజామాబాద్కు చెందిన తసిప్(30) సెప్టెంబర్ 4న గుండెపోటుతో సౌదీలో మరణించారు. వేల్పూర్ మండలం జాన్కంపేటకు చెందిన శ్రీనివాస్ సెప్టెంబర్ 15 న సౌదీలో అనారోగ్యంతో మరణించారు. ధర్పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన బాలగంగాధర్ అనారోగ్యంతో సెప్టెంబర్ 22న ఖతార్లో మరణించారు. నందిపేట మండలం కుద్వాన్పూర్కు చెందిన పోశెట్టి(46) అక్టోబర్ 21న గుండెపోటుతో సౌదీలో మరణించారు. డిచ్పల్లి మండలం ఇందల్వాయికి చెందిన గొల్ల రాములు(38) నవంబర్ 9 న కువైట్లో గుండెపోటుతో మరణించారు. మాక్లూర్ మండలం గుంజిలికి చెందిన మోనాజీ(36) నవంబర్ 11న అనారోగ్యంతో దుబాయిలో మరణించారు. నవీపేట మండలం పాత కమలాపూర్కు చెందిన రమేశ్(28) నవంబర్ 18న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని రమేశ్ తల్లి లక్ష్మి గుండెపగిలి మరణించింది. నిజామాబాద్ మండలం గుండారం గ్రామానికి చెందిన అలీముద్దీన్(50) నవంబర్లో గుండెపోటుతో రియాద్లో మరణించారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగుకు చెందిన రాములు(40) నవంబర్ 19న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సయ్యద్ జైలాని(24) నవంబర్ 25న అబుదాబిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. కమ్మర్పల్లి మండలంలోని హాసాకొత్తూర్కు చెందిన శ్రీనివాస్(44) అనారోగ్యంతో సౌదీలో మరణించారు. ఆయన మృతదేహం మూడు నెలల తర్వాత డిసెంబర్ 3న స్వగ్రామం చేరింది. గాంధారి మండలం ముదెల్లికి చెందిన లక్ష్మయ్య(45) డిసెంబర్ 4 న షార్జాలో మరణించారు. మృతికిగల కారణాలు తెలియరాలేదు. జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్కు చెందిన బాలు(55) డిసెంబర్ 17న దుబాయిలో గుండెపోటుతో మరణించారు. వేల్పూర్కు చెందిన హన్మండ్లు (50) మే 18న గుండెపోటుతో దుబాయిలో మరణించారు. వారం రోజుల తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. -
ఒత్తిడికి చిత్తు కావొద్దు
సెబర్సిటీ, న్యూస్లైన్: లక్షల్లో సంపాదన...అయినా తీవ్ర మానసిక ఒత్తిడితో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్ను మొగ్గలోనే తుం చేసుకుంటున్నారు. మరికొందరు వ్యాధులబారిన పడుతున్నారు. ఒత్తిళ్లను దూరం చేసుకుంటే ఆత్మహత్య ఆలోచన నుంచి బయటపడొచ్చని పలువురు మానసిక విశ్లేషకులంటున్నారు. ఐటీ నిపుణులు మానసిక ఒత్తిడిని జయించేందుకు అవసరమైన సూచనలపై ఇంటర్నేషనల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఇస్మా) ఫౌండర్ అండ్ ట్రస్టీ డాక్టర్ బి. ఉదయ్కుమార్ రెడ్డితో ‘సాక్షి’ వూట్లాడింది. ఒత్తిడికి కారణాలు, వాటిని తగ్గించుకొనేందుకు ఆయన ఇచ్చిన సూచనలు ఇవీ... మూడు రకాలు.. సమస్యల్లో ఉన్న వ్యక్తి వూత్రమే ఒత్తిడికి గురవ్వాలని ఏం లేదు. ఎదుటి వారి కష్టాన్ని తమదిగా భావించి ఒత్తిడికి లోనయ్యే వారూ ఉంటారు. ఇలాంటి వారికే కష్టం వస్తే ఇక అంతే సంగతులు. ప్రధానంగా ఒత్తిడి వుూడు రకాలు. మొదటి దశ: మొదటి దశలో నిరుత్సాహంగా ఉంటారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. విద్యార్థులైతే కళాశాల/పాఠశాలలకు, ఉద్యోగులైతే ఆఫీసులకు వెళ్లరు. వె ళ్లినా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడుపుతారు. డ్రెస్సెన్స్ పాటించరు. రెండోదశ: చీటికి మాటికి చిరాకు పడతారు. తలనొప్పిగా ఉన్నట్టు ఫీలవుతుంటారు. రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తుంటారు. బంధువులతో గంటల తరబడి మాట్లాడదామని అనుకుంటారు. వారు మాట్లాడకపోతే కన్నీరు పెట్టుకుంటారు. మూడో దశ: సమాజం తనను వెలి వేసిందని అంటుంటారు. తమని తాము ఒంటరిగా భావిస్తుంటారు. నేను దీనికీ పనికిరానని అనుకుంటారు. ఆత్మహత్యకు పాల్పడే దశలో రెండు మూడు రోజుల ముందు తమ స్నేహితులతో చనిపోతేనే అన్ని సమస్యలకు తీరతాయని చెబుతుంటారు. యోగాతో ఎంచక్కా... ప్రతి మనిషిలోనూ పాజిటివ్, నెగిటివ్ ఆలోచనలుంటాయి. కొందరు తాను చేయబోయే ప్రతీ పనిలోను కష్టాలే ఎదురవుతాయేమోననే నెగిటివ్ ఆలోచనలతో ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడికి దూరంగా ఉండాలంటే ఈ తరహా నెగిటివ్ ఆలోచనలు ముందుగా దూరం చేసుకోవాలి. ఇందుకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. నిత్యం యోగా చేసేవారు చలాకీగా ఉంటారు. అంతేకాదు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీంతో ఇక ఒత్తిడికి గురయ్యే అవకాశమే ఉండదు. ఇదే తరహాలో ఎరోబిక్స్ వంటి వ్యాయామాలు కూడా ఒత్తిడిని దూరం చేస్తారుు. సమస్యలతో బుర్రవేడెక్కినప్పుడు మంచి పాట విన్నా, సినిమా చూసినా, పుస్తకాన్ని చదివినా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా నాట్యం, ఫొటోగ్రఫీ వంటి వ్యాపకాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. మనసైన వారితో కాసేపు.. నగరంలోని ఐటీ ఉద్యోగుల్లో దాదాపు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటారు. కెరీర్లో ఎదగాలనే తపనతో తమ సమయాన్నంతా ఆఫీసుకే అంకితం చేస్తారు. ఈ కారణంగా మనసైన వారితో కాసేపు గడిపేందుకు కూడా సమయం దొరకదు. దీంతో కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. దీనికి తోడు ఆఫీసులోని సమస్యలు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ కారణాలతోనే చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి తమ జీవితాలనే అర్ధంతరంగా ముగించేస్తున్నారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడి ఇంట్లో మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే మనషుల అండదొరికితే ఎంతటి సమస్యలనైనా సులభంగా ఎదుర్కోవచ్చనే ధైర్యం కలుగుతుంది. అందుకే కుటుంబసభ్యులతో మనసు పంచుకోవడానికి వీకెండ్లో షికార్లలకు వెళ్లడం, పిల్లలతో కాసేపు కార్టూన్ నెట్వర్క్లు చూడడం, తల్లిదండ్రులతో కాసేపు కబుర్లు చెప్పడం వంటివి చేయాలి. ఇవి మనలోని ఒత్తిళ్లను దూరం చేస్తాయి. నోట్ రాసి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య ఉప్పల్, న్యూస్లైన్: ‘కేవలం పని చేయడానికి, డబ్బులు సంపాదించడానికేనా జీవితం... స్నేహితులు లేరు.. బంధువు లేరు... జీవితంలో ఆనందం లేదు... నిత్యం ఒత్తిడి తోనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది.. ఈ ఒత్తిడిని తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా’ .. అమ్మా నన్ను క్షమించు... వచ్చే జన్మంటూ ఉంటే నీ కడుపునే పడతా.. అంటూ సూసైడ్ నోట్ రాసి’ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉప్పల్లో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ పద్మావతి కాలనీకి చెందిన యేశాల మార్కండేయ కుమార్తె నందిత(30) అమెరికాలోని పోర్ట్ల్యాండ్లో ఇంటెల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎయిరో స్పేస్ ఇంజినీర్గా 2011 జనవరిలో చేరింది. తండ్రి మార్కండేయ ఏపీసీపీడీసీఎల్లో అత్యున్నత స్థాయి ఉద్యోగం చేస్తూ ఐదేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. తండ్రి మృతి చెందినప్పటి నుంచీ నందిత తీవ్రమానసిక వేదనకు గురవుతోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా నెలకు దాదాపు రూ. 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఆమెకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఒంటరితనాన్ని ఆమె భరించలేకపోయింది. పని ఒత్తిడితోపాటు, మానసిక ప్రశాంతత లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. రెండు నెలల పాటు సెలవు పెట్టి సంక్రాంతి పండుగ కోసమని ఈనెల 9 న ఉప్పల్లోని ఇంటికి వచ్చింది. ఈనెల 16 సాయంత్రం ఇంట్లోని బెడ్రూంలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి పిలిచినా పలకక పోవడంతో అనుమానం వచ్చి చూసే సరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. కాగా, నందిత ఆత్మహత్య చేసుకోవడానికి ముందే 14వ తేదీన సూసైడ్ రాసి ఇంట్లోని టేబుల్ డెస్క్లో పెట్టింది. కాగా, నందిత ఆత్మహత్య విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. -
సిమాంద్రనేతల పై తీవ్ర ఒత్తిడి