-
నా జీవితంలో అవి చీకటి రోజులు : ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్లో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనస్ని ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తొలి నాళ్లల్లో హాలీవుడ్లో తన ప్రయాణం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్కి వెళ్లిన తర్వాత నా కెరీర్ మళ్లీ మొదట్నుంచి మొదలైందా? అనే భావన కలిగింది. హాలీవుడ్లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. ఒంటరిగా ఫీలయ్యాను. చాలా భయం వేసింది. కొన్ని తిరస్కరణలూ ఎదురయ్యాయి.ఇలా హాలీవుడ్లో నా కెరీర్ తొలి రోజులు ఓ చీకటి అధ్యాయంలా గడిచాయి. ఇండియాలో నేనో స్టార్ హీరోయిన్ని అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్లో నా పని చేసుకుంటూ వెళ్లాను. అందుకే ఇప్పుడు హాలీవుడ్లో మంచి స్థాయిలో ఉండగలిగానని నా నమ్మకం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఫిల్మ్లో నటిస్తున్నారు. -
స్టార్ హీరోయిన్ సోదరుడి నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల హోలీ వేడుకల్లో సందడి చేసింది. తన భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టీతో కలిసి హోలీ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న భామ కుటుంబ సభ్యులతో పండుగ చేసుకున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే తాజాగా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్మెంట్కు హాజరైంది ప్రియాంక చోప్రా. పంజాబీ సంప్రదాయంలో జరిగిన రోకా వేడుకలో సందడి చేసింది. ప్రియాంక సోదరుడైన సిద్దార్థ్.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయతో నిశ్ఛితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. సిద్ధార్థచోప్రా, నీలం ఉపాధ్యాయ జంటకు మా అందరి ఆశీర్వాదాలు అంటూ రాసుకొచ్చింది. కాగా.. 2019లో సిద్ధార్థ్కి ఇషితా కుమార్తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఊహింనచి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఇషిత 2021లో మరొకరిని పెళ్లి చేసుకుంది. వధువు ఎవరంటే.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయ తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో మిస్టర్- 7తో చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. ఆ తరువాత ఉన్నోడు ఒరు నాల్ అనే తమిళ సినిమాలో నటించింది. నీలం ఉపాధ్యాయ చివరిసారిగా 2017లో రిలీజైన టాలీవుడ్ చిత్రం తమాషాలో కనిపించింది. View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ మీరా చోప్రా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా తన ప్రియుడు రక్షిత్తో ఏడడుగులు వేసింది. గతంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన మీరా.. ఈ రోజు కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్కు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను మీరా తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మీరా అభిమానులు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం మీరా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తెలుగువారికి సైతం సుపరిచితులైన మీరా.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్. 1920: లండన్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ . ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. మీరా చోప్రా టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.కాగా.. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) -
మిస్ వరల్డ్: ఈ స్టన్నింగ్ ఇండియన్ బ్యూటీల గురించి తెలుసా?
అందరమూ కలలు కంటాం. వాటిల్లో కొన్ని చాలా పెద్దవి,చాలా చిన్నవి. చిన్నదైనా పెద్దదైనా ఆ కలను నేర్చుకునే పట్టుదల మాత్రం కొందరికే ఉంటుంది. కలలను సాకారం చేసుకునే అదృష్టం కొంతమందికే సాధ్యం. అందులోనే చాలా ప్రత్యేకమైంది అయితే ఆ జర్నీ చాలా కష్టం. ఇక, బ్యూటీ, మోడలింగ్ రంగంలో అమ్మాయిలు రాణించాలంటే నిజంతా అది కత్తి మీద సామే. అలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రపంచ సుందరీమణులుగా,విజేతలుగా నిలిచారు. ప్రపంచ వేదికల మీద మన దేశాన్ని అత్యున్నతంగా నిలబెట్టారు. తాజాగా మిస్ వరల్డ్ 2023 సంబరాలకు ఇండియా వేదిక కానుంది. బ్యూటీ విత్ పర్పస్ థీమ్తో ఈ పోటీలు ఘనంగా నిర్వహించనుంది. ప్రతీ ఏడాది వివిధ దేశాల్లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ఈసారి భారత్ ఆతిథ్యమివ్వనుంది. దీంతో మిస్ వరల్డ్ ఈవెంట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఎపుడు నిర్వహించారో తెలుసా? యునైటెడ్ కింగ్డమ్లో ఎరిక్ మోర్లీ 1951లో ఈ పోటీలకు నాంది పలికారు. ఇంగ్లీషు టెలివిజన్ వ్యాఖ్యాత ఎరిక్ డగ్లస్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీ , కమ్ డ్యాన్సింగ్ ప్రోగ్రామ్ను మొదలు పెట్టారు. 1978ల ఆయన నిష్క్రమించడంతో అతని భార్య బ్యూటీ క్వీన్ జూలియా మిస్ వరల్డ్ పోటీలను కొనసాగించింది. 82 ఏళ్ల వయసులో మోర్లీ 2000లో మరణించాడు. అతని భార్య, జూలియా మోర్లీ ఛైర్మన్గా ఉండగా కుమారుడు స్టీవ్ డగ్లస్ దాని సమర్పకులలో ఒకరుగా ఉన్నారు. లండన్లోని లైసియం బాల్రూమ్లో తొలి మిస్ వరల్డ్ టైటిల్ను మిస్ స్వీడన్, కికీ హాకోన్సన్ కైవసం చేసుకుంది. మన ముద్దుగుమ్మలు తమ అందానికి, సంకల్పాన్ని, తెలివితేటల్ని, జోడించి ఆరు సార్లు జగజ్జేతలుగా నిలిచారు. రీటా ఫారియా రీటా ఫారియా పావెల్ ఒక డాక్టర్. మోడలింగ్ రంగంలో రాణిస్తూ 1966లో మిస్ వరల్డ్ పోటీల్లో చరిత్ర సృష్టించింది. తొలి ఆసియా , భారతీయ మిస్ వరల్డ్ విజేతగా నిలిచి బ్యూటీ రంగంలో ఇండియాలో పేరును సమున్నతంగా నిలిపింది. మరియు ముంబైలో గోవా తల్లిదండ్రులకు జన్మించింది. వైద్య శిక్షణ పొందిన తొలి మిస్ వరల్డ్ విజేత ఆమె. ఏడాది పాటు మిస్ వరల్డ్గా ఉన్న ఆమె సినిమా ఆఫర్లను తిరస్కరించి వైద్య వృత్తికి అంకితమైంది. 1971లో, తన గురువు డేవిడ్ పావెల్ను వివాహం చేసుకుంది. ఐశ్వర్య రాయ్: ప్రపంచంలోనే అందాలరాణిగా నిలిచిన ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. 1994 మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకుని యూత్ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. రెండు ఫిల్మ్ఫేర్ నామినేషన్లతో సహా వివిధ అవార్డులును దక్కించుకుంది. అలాగే 2009లో భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని ,2012లో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్ను గెల్చుకుంది. డయానా హేడెన్: మోడల్, నటి డయానా హేడెన్ 1997లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మూడో భారతీయ మహిళ. అంతేకాదు ఈ పోటీల్లో మూడు సబ్ టైటిల్స్ను గెల్చుకున్న ఏకైక మిస్ వరల్డ్ కూడా యుక్తా ముఖి: మిస్ ఇండియాగా నిలిచిన నాల్గో భామ యుక్తా ఇంద్రలాల్ ముఖి. 1999లో మిస్ వరల్డ్ టైటిల్తోపాటు 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. మోడల్గాను, కొన్ని హిందీ సినిమాల్లోనూ కనిపించింది. ప్రియాంక చోప్రా : 2000లో మిస్ వరల్డ్ 2000 విజేత ప్రియాంక చోప్రా, మోడల్గా, హీరోయిన్గా రాణిస్తోంది. అంతేకాదు ఇండియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న హీరోయిన్లలో ఒకరిగా తన సత్తాను చాటుకుంటోంది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు , ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా పలు గౌరవాలను గెలుచుకుంది. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు వరించింది. అలాగే ఫోర్బ్స్ ఆమెను ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చింది. మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017 టైటిల్ను నటి , మోడల్ మానుషి చిల్లర్ గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో ఆమె తన సొంత రాష్ట్రం హర్యానాకు ప్రతినిధిగా పోటీ పడి, గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారతీయురాలిగా నిలిచింది. చారిత్రాత్మక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్లో సంయోగిత పాత్రతో ఆమె తొలిసారిగా నటించింది. -
డీప్ ఫేక్.. మరో స్టార్ హీరోయిన్ వీడియో వైరల్!
యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కత్రినా కైఫ్,అలియా భట్, కాజోల్ ఫోటోలు సైతం నెట్టింట వైరలయ్యాయి. దీంతో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్కు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ డీప్ ఫేక్ వీడియోలు ఎక్కడో ఒక చోట వైరలవుతూనే ఉన్నాయి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ డీప్ ఫేక్ బారిన పడింది. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా.. అందులోని వాయిస్ను మార్చి వైరల్ చేశారు. ఆమె ఓ నకిలీ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్ సింక్ అయ్యేలా క్రియేట్ చేశారు. ఆ వీడియోలో ఆమె తన వార్షిక ఆదాయాన్ని వెల్లడిస్తున్నట్లు రూపొందించారు. ఓ బ్రాండ్ ప్రకటనతో 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ ఆ బ్రాండ్నే ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ముంబై ఈవెంట్లో మెరిసిన ప్రియాంక.. వాచ్ ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అమెరికా సింగర్ నిక్ జోనాస్ను పెళ్లాడింది. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ 2023 హాజరైంది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఫెస్టివల్లో ప్రియాంక చోప్రా తళుక్కున మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తన భార్య ఫోటోలు చూసిన నిక్ జోనాస్ కామెంట్ చేశారు. (ఇది చదవండి: నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!) జియో మామి ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్ను ప్రారంభింంచిన ప్రియాంక చోప్రా అనంతరం ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీకి అధికారిక అధ్యక్షురాలిగా హోదాలో అడుగుపెట్టారు. అద్భుతంగా డిజైన్ చేసిన గౌను ధరించి.. రెడ్ కార్పెట్పై అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈవెంట్లో బాలీవుడ్ భామ ధరించిన లగ్జరీ వాచ్పైనే అందరి దృష్టి పడింది. ఆమె వాచ్ విలువు దాదాపు రూ.1.5 కోట్ల విలువైనదిగా తెలుస్తోంది. ప్రియాంక ధరించిన వాచ్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కేస్తో తయారు చేసినట్లు సమాచారం. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున ముంబై చేరుకుంది ప్రియాంక. ఎయిర్పోర్ట్లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ వేడుకలో ప్రియాంకతో పాటు సోనమ్ కపూర్ అహుజా, రిచా చద్దా, అలీ ఫజల్, దియా మీర్జా, షానయా కపూర్, డయానా పెంటీ లాంటి బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. కాగా.. ముంబయిలో జరుగుతున్న ఈ వేడుక అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. (ఇది చదవండి: శివాజీ ఎమోషనల్ వీడియో.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమజంట.. హాజరైన ప్రముఖులు!
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ లీలా ప్యాలెస్లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే అధికారికంగా పెళ్లి ఫోటోలను రిలీజ్ చేయనున్నారు. (ఇది చదవండి: చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!) పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. మనీష్ మల్హోత్రా, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం హాజరు కాలేదు. ఈ వేడుకకు ఆమె తల్లి, డాక్టర్ మధు చోప్రా హాజరయ్యారు. కాగా.. ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిణీతికి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్లో వివాహ రిసెప్షన్ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా ఎదిగిన భామ.. ఆ తర్వాత హాలీవుడ్కు మారింది. అమెరికాకు చెందిన నిక్ జోనాస్ ప్రేమవివాహాం చేసుకుంది. ఈ జంటకు సరోగసీ ద్వారా ఓ బిడ్డ కూడా జన్మించింది. అయితే ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా వివాహాబంధంలోకి అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాను ఆమె పెళ్లి చేసుకుంటోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వీరి వివాహ వేడుక జరుగుతోంది. ఇదంతా బాగానే ఉన్నా.. చెల్లి పెళ్లికి అక్క ప్రియాంక చోప్రా హాజరు కాకపోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బంధువులు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతున్న ప్రియాంత చోప్రా రాకపోవడం ఏంటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపింది. మొదట ఈ వివాహానికి ప్రియాంక వస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె పెళ్లి హాజరవ్వకుండా అభిమానులకు షాకిచ్చింది. సంగీత కచేరీకి హాజరు పరిణీతి చోప్రా పెళ్లికి రాని ప్రియాంక కాలిఫోర్నియాలోని బర్కిలీలో జరిగిన బంగ్లాదేశ్-అమెరికన్ ఆర్టిస్ట్ జై వోల్ఫ్ సంగీత కచేరీకి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆమె తన భర్త నిక్ జోనాస్ సోదరుడు ఫ్రాంక్లిన్ జోనాస్తో కలిసి జై వోల్ఫ్ కచేరీలో పాల్గొంది. అయినా చెల్లి పెళ్లికి రాకపోవడమేంటని ప్రియాంక తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Bushra Khan 🇧🇩 (@b.khanfident) -
ప్రియాంక చోప్రా సోదరి పెళ్లి.. ఆ మాత్రం రేంజ్ ఉండాల్సిందే!
బాలీవుడ్ భామ, ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాతో కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించిన భామ.. ఆ తర్వాత అఫీషియల్గా ప్రకటించింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఈనెలలోనే వివాహా బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వీరిపెళ్లి వేదికపై బీటౌన్లో తెగ చర్చనడుస్తోంది. తారల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వేదిక ముస్తాబవుతోంది. వీరి పెళ్లి కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఓ లుక్కేద్దాం. ఇద్దరు ప్రముఖ రంగాలకు చెందిన వారు కావడంతో అతిథులు సైతం అదేస్థాయిలో రానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!) బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఈనెల 24న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తేదీలను ఇంకా ధృవీకరించనప్పటికీ వారి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికగా నిలవనుంది. మూడు రోజుల పాటు జరిగే మెహందీ, సంగీత్, హల్దీ వేడుకల కోసం లీలా ప్యాలెస్ ముస్తాబవుతోంది. అత్యంత ఖరీదైన హోటల్ ఈ ప్యాలెస్లోని హోటల్ గది ఒక్కరోజుకు అత్యధికంగా రూ. 9 లక్షలకు పైగా ధర ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరు కానున్నారు. అయితే పెళ్లి తర్వాత గురుగ్రామ్లో గ్రాండ్గా రిసెప్షన్ బాష్ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మే 13న దిల్లీలోనిపరిణీతి, రాఘవ్ల నిశ్చితార్థ వేడుకకు కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ప్రియాంక చోప్రా హాజరయ్యారు. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) View this post on Instagram A post shared by 𝐓𝐡𝐞 𝐋𝐞𝐞𝐥𝐚 𝐏𝐚𝐥𝐚𝐜𝐞 𝐔𝐝𝐚𝐢𝐩𝐮𝐫 (@theleelapalaceudaipur) -
ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో విప్లవ వీరుడు కొమురం భీమ్గా సందడి చేసి మెప్పించిన ఎన్టీఆర్ తాజాగా 'దేవర'గా మరో కొత్త అవతారంలో మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ - కొరటాల శివ రాకింగ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. (ఇదీ చదవండి: నన్ను చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు.. రెండో పెళ్లిపై ఆశిష్ విద్యార్థి) ఈ ప్రాజెక్ట్ తర్వాత, ఎన్టీఆర్ తన 31వ సినిమా కోసం ప్రశాంత్ నీల్తో కలిసి పని చేయనున్నాడు. ఈ చిత్రం చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. త్వరలో సెట్స్పైకి వెళ్లేందుకు సిధ్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీపై మరో క్రేజీ బజ్ నెలకొంది. తారక్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుందట. అయితే, ఇంతకు ముందు ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించాయి. చివరకు ప్రియాంక కన్ఫార్మ్ అయినట్లుగా తెలుస్తోంది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రియాంక, తారక్ జోడి అయితే బాగుంటుందని మేకర్స్ అంచనా వేశారట. ఇక ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్.. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. (ఇదీ చదవండి: Bhola Sankar Movie: స్కెచ్ అదిరింది, చిరంజీవికి బాలకృష్ణ జై కొడతాడా?) -
ఇండియాకు ప్రియాంక చోప్రా.. అలా రావడం తొలిసారి!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు మారిపోయిన ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ ఉంటుంది. తాజాగా ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసింది. అక్కడ రాజకీయాలు భరించలేకే హాలీవుడ్కు మారిపోయానని తెలిపింది. అయితే హాలీవుడ్కు షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సరోగసి ద్వారా ఓపాప కూడా జన్మించింది. ప్రియాంక తన గారాలపట్టికి మాల్తీ మేరీ అని పేరు పెట్టింది. తాజాగా కూతురు, భర్తతో కలిసి తొలిసారిగా ఇండియాకు ప్రియాంక చోప్రా వచ్చారు. నిక్ జోనాస్, ప్రియాంక కుమార్తె మాల్తీ మేరీ శుక్రవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ కోసం వారు ముంబయికి వచ్చినట్లు సమాచారం. కాగా.. తన కూతురు మాల్తీని భారత్కు తీసుకురావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో కొన్ని ఫోటోలు షేర్ చేసినా పాప మాల్తీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుండేది. ఇటీవలే జొనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీ ముఖాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. MY NEICE , MY CUTEST HOOMAN YALL 🥹❤️❤️❤️ LOVE OF MY LIFE 🥹🥹❤️❤️ MM is truly her mothers daughter 🫶🫶 my god🥹🥹 #PriyankaChopra pic.twitter.com/oCz874XKbe — k. (@karishmaokay) March 31, 2023 -
నన్ను ఓ మూలన పడేశారు.. అందుకే తప్పుకున్నా: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను హాలీవుడ్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రియాంక చోప్రా వెల్లడించింది. బాలీవుడ్లో తనకు వచ్చిన అవకాశాల పట్ల సంతోషంగా లేనని తెలిపింది. దీనికి కారణం తాను అభద్రతాభావానికి గురి కావడమేనని పేర్కొంది. కాగా.. ప్రియాంక చోప్రా 2015 టెలివిజన్ సిరీస్ క్వాంటికోలో నటించిన తర్వాత హాలీవుడ్లోకి ప్రవేశించింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'తనను బాలీవుడ్లో ఓ మూలన పడేశారు. అంతేకాకుండా కొందరితో విభేదాలు ఏర్పడ్డాయి. ఆ రాజకీయాలు చేసే ఉద్దేశం నాకు లేదు. బాలీవుడ్ రాజకీయాలతో నేను విసిగిపోయా. అందుకే బాలీవుడ్ నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోవాలనిపించింది. అందుకే అమెరికా వచ్చేశా.' అని ప్రియాంక వివరించింది. ఆ సమయంలోనే తన మేనేజర్ అంజులా ఆచార్య తన మ్యూజిక్ వీడియోను చూసి యూఎస్లో పనిచేసే అవకాశం ఇచ్చారని ఆమె చెప్పింది. మ్యూజిక్ కెరీర్ సక్సెస్ కాకపోతే సినిమాల్లో ప్రయత్నించి చూడాలని ఒకరు సూచించారని ప్రియాంక తెలిపింది. అందుకే క్వాంటికోలో నటించానని చెప్పింది. ఆ తర్వాత బేబీవాచ్, మ్యాట్రిక్స్, రెవల్యూషన్స్, ద వైట్ టైగర్లో అవకాశాలను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. త్వరలో సిటాడెల్ సెకండ్ షోతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక నటించిన లవ్ ఎగైన్ అనే సినిమా మేలో విడుదల కానుంది. గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక.. నిక్ జోనస్ను 2018 డిసెంబర్లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో ఆమె రిచర్డ్ మాడెన్తో పాటు గూఢచారి పాత్రలో నటించారు. ఈ సిరీస్ ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. -
ప్రియాంక చోప్రాకు ఉపాసన థ్యాంక్స్.. పోస్ట్ వైరల్
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజిల్స్లో ఫుల్ బిజీ ఉన్నారు. తన భార్య ఉపాసనతో కలిసి ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంకతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అమెరికాలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్కు ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో పలువురు తారలు మెరిశారు. సౌత్ ఏషియన్ ఎక్స్లెన్స్ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో మెగా కోడలు ఉపాసన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంకతో దిగిన ఫోటోను ఉపాసన తన ఇన్స్టాలో పంచుకున్నారు. ఉపాసన ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘‘లాస్ ఏంజెల్స్ ఫ్యామిలీ.. ఎల్లప్పుడూ మాకోసం ఉన్నందుకు థ్యాంక్యూ ప్రియాంక' అని పోస్ట్ చేశారు. తాజాగా ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీమ్ సందడి చేయనుంది. ప్రియాంక ఇచ్చిన పార్టీలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్లో కనిపించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు ప్రీతిజింటా, జాక్వెలిన్ తదితరులు ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం ఆ వేడుక ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. మరోవైపు, ‘నాటు నాటు’ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సైతం ప్రియాంకతో ఫొటోలు దిగారు. ‘మగధీర’ తర్వాత రామ్చరణ్ - ప్రియాంక చోప్రా కలిసి ‘తుపాన్’ అనే సినిమా కోసం కలిసి పనిచేశారు. అప్పటి నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. -
ప్రత్యేక జెట్లో నిక్ బర్త్డే సెలబ్రేషన్స్.. ప్రియాంక చోప్రా గ్రాండ్ విషెష్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ బర్త్డేకు సర్ప్రైజ్ ఇచ్చింది. అతని పుట్టినరోజు వేడుకలను ఏకంగా ప్రత్యేక జెట్లో ప్లాన్ చేసింది. ఇవాళ నిక్ 30వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బర్త్డే వేడుకల కోసం ప్రైవేట్ జెట్ను వేదికగా మార్చింది. ఈ సందర్భంగా సింగర్ నిక్ జోనాస్ తన ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రియాంక చోప్రా స్పెషల్ జెట్లో కూర్చొని భర్తకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. అయితే ఈ వేడుక ఎక్కడ నిర్వహించారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. వేడుకలకు ముందు ప్రియాంక తన హ్యాండిల్పై ఫోటోను కూడా పంచుకుంది. (చదవండి: Priyanka Chopra: క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది) కాగా నిక్, ప్రియాంక 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్లోని ఓ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ గారాల పట్టికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’అని నామకరణం కూడా చేశారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) -
మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా
Priyanka Chopra Shares Her Daughter Malti First Pic: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక, నిక్ జోనస్లు తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఎప్పుడు బేబీ బంప్తో కనిపించని ప్రియాంక ఆకస్మాత్తుగా తల్లైనట్లు ప్రకటించడం అందరు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే సరోగసి ద్వారా వారు తల్లిదండ్రులు అయినట్లు ప్రియాంక సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. చదవండి: మదర్స్డే: అమ్మతో మెగా బ్రదర్స్.. వీడియో వైరల్ అంతేగాక ఇటీవల తమ గారాల పట్టి పేరు ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’ ప్రకటించిన ప్రియాంక తాజాగా కూతురి గురించి ఓ షాకింగ్ న్యూస్ పంచుకుంది. ఆదివారం మదర్స్ డే సందర్భంగా తొలిసారి తన కూతురు ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యింది ప్రియాంక. దాదాపు 100 రోజుల తర్వాత తన కూతురు ఇంటికి వచ్చిందని, మదర్స్ డే సందర్భంగా తమ ఇంట్లోకి నవ్వులు తిరిగొచ్చాయని ఆమె పేర్కొంది. వారి కూతురు మాల్తీ 100 రోజులకు పైగా హాస్పిటల్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. చదవండి: 'ప్రాజెక్ట్ కె'లో బాలీవుడ్ హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్! లాస్ ఎంజల్స్లోని పిల్లల హాస్పిటల్లో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. ఈ మేరకు తమ కూతురు పూర్తి ఆరోగ్యం ఇంటికి తిరిగి రావడంలో డాక్టర్లు, నర్సులు ముఖ్య పాత్ర పోషించారని, ఈ సందర్భంగా వారందరికి ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం తమ జీవితాల్లో మరో అధ్యాయం మొదలైందని, మమ్మీ-డాడీ లవ్స్ యూ.. అంటూ ప్రియాంక తన పోస్ట్లో రాసుకొచ్చింది. ఇక ఆమె పొస్ట్పై పులువురు బాలీవుడ్ స్టార్స్ స్పందిస్తూ వారు సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రితీ జింటా, పరిణితి చోప్రా, దియా మిర్జా, మలైక ఆరోరాలు కామెంట్స్ చేస్తూ లవ్ ఎమోజీతో ప్రియాంక, నిక్ దంపతుల కూతురు మల్తీకి స్వాగతం పలికారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'నిక్ జోనాస్ వైఫ్' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్..
Priyanka Chopra Get Angry For Calling Her Nick Jonas Wife: గ్లోబల్ స్టార్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం తన రాబోయే హాలీవుడ్ చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' ప్రమోషన్లో బిజీగా ఉంది. తాజాగా ప్రియాంక ఓ వార్తా కథనంపై విరుచుకుపడింది. ఇంకా అలా ఏన్నాళ్లు రాస్తారు అని మండిపడింది. మహిళలకు ఇంకా ఇలా ఎందుకు జరుగుతుందో అని అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల ఒక వెబ్సైట్ తన వార్తా కథనంలో ప్రియాంక చోప్రాను నిక్ జోనాస్ భార్యగా ప్రస్తావించడం (గుర్తింపు ఇవ్వడం) ప్రియాంక కోపానికి కారణమైంది. అలా రాసిన వార్తా కథనాన్ని తన ఇన్స్టా గ్రామ్లో షేర్ చేస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. 'మోస్ట్ ఐకానిక్ ఫిల్మ్ ఫ్రాంచైజీకి చెందిన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' చిత్రాన్ని నేను ప్రమోట్ చేస్తుంటే.. ఇప్పటికీ నేను 'ది వైఫ్ ఆఫ్..'గా సూచించబడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో దయచేసి వివరణ ఇవ్వమని కోరింది. నేను నా ఐఎండీబీ (IMDB) లింక్ని నా బయోకు జోడించాలా ?' అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. దీనికి ప్రియాంక భర్త నిక్ జోనాస్ను కూడా ట్యాగ్ చేసింది. ప్రియాంక తన రాబోయే ప్రాజెక్ట్ సిటాడెల్ షూటింగ్ని పూర్తి చేసుకుంది. తాను నటించిన 'ది మ్యాట్రిక్స్' ఫ్రాంచైజీలోని మూడో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ను ప్రియాంక అధికారికంగా ప్రారంభించింది. 'మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్' సినిమాలో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్, నీల్ పాట్రిక్ హారిస్, యాహ్యా అబ్దుల్-మతీన్ 2, జోనాథన్ గ్రోఫ్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక 'సిటాడెల్' సినిమాతోపాటు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఒక బాలీవుడ్ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి 'జీ లే జరా' అని పేరు పెట్టారు. ఇందులో కత్రీనా కైఫ్, అలియా భట్తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది ప్రియాంక జోనాస్. -
నిక్ జొనాస్పై ప్రియాంక వీడియో.. రూమర్స్కు చెక్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లుగా వచ్చిన వార్త షికారు కొట్టిన సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా ఈ వార్తపై తెగ చర్చ జరిగింది. ఇందుకు కారణం ప్రియాంక తన ఇన్స్టా గ్రామ్ ఫ్రొఫైల్లో నిక్ జోనాస్ పేరు తొలగించడమే. దీంతో ఒక్కసారిగా నెటిజన్స్ అవాక్కయ్యారు. ప్రియాంక కూడా నటి సమంతలా విడాకులు తీసుకోబోతుందా అని గుసగుసలు వినిపించాయి. దీంతో ఈ వార్తలను ఖండించింది ప్రియాంక తల్లి మధు చోప్రా. అవన్ని వట్టి పుకార్లే అని స్పష్టం చేసింది. అయితే తాజాగా ఆ రూమర్స్కు చెక్ పెట్టింది ప్రియాంక. ఇదీ చదవండి: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? తాజాగా ప్రియాంక తన ఇన్స్టా గ్రామ్లో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో నిక్ జొనాస్ను తన కామెంట్లతో ఓ ఆట ఆడేసుకుంది. నిక్ జొనాస్కు, ఆయన సోదరుల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ తనకే ఉన్నారని తెలిపింది. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వేదికగా జరిగిన జొనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్ కుటుంబం పాల్గొంది. ఈ షోకి జొనాస్ బ్రదర్స్తోపాటు వారి సతీమణులు కూడా హాజరయ్యారు. ప్రముఖ కమెడియన్ కెనన్ థాంప్సన్ హోస్ట్గా వ్యవహరించారు. ఇదీ చదవండి: కూతురి విడాకుల వార్తలపై మధు చోప్రా స్పందన 'నేను సంస్కృతి, వినోదం, సంగీతానికి గొప్ప స్థానం ఉన్న భారతదేశం నుంచి వచ్చాను. నా కంటే 10 ఏళ్లు చిన్నవాడు నిక్. మేమిద్దరం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. నాకు టిక్టాక్ ఎలా ఉపయోగించాలో నిక్ నేర్పితే, సక్సెస్ఫుల్ యాక్టింగ్ కెరీర్ ఎలా ఉంటుందో నేను చూపించాను. నాకు నిక్పై చాలా ప్రేమ ఉంది. నా జీవితాన్ని అతను పూర్తిగా మార్చేశాడు. జొనాస్ బ్రదర్స్కు పిల్లలున్నారు. మాది మాత్రమే పిల్లలు లేని జంట. కానీ ఇవాళ అందరిముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మేమిద్దరం ఈరోజు రాత్రి డ్రింక్ చేసి, రేపు ఉదయం ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నాం. ఈ షోలో జొనాస్ బ్రదర్స్ను రోస్ట్ చేయడం థ్రిల్లింగ్గా ఉంది'. అని ప్రియాంక చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియాంక అభిమానులకు గుడ్ న్యూస్.. అదేంటో తెలుసా ?
Priyanka Chopra Shares Her First Look Poster Of Matrix Resurrections Movie: బాలీవుడ్, హాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా హాలీవుడ్ చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్ను తన ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేశారు. 'ది మ్యాట్రిక్స్' సిరీస్లో వస్తోన్న నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్'. సినిమాలో ప్రియాంక పాత్ర ఎలా ఉండనుందో ఈ పోస్టర్లో చూపించారు. ఇందులో ప్రియాంక ఎరుపు రంగు ప్యాంటు, నలుపు బూట్లతో బ్లూ కలర్ టాప్ ధరించి ఉన్నారు. ఆమె హేయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో ఎప్పుడూ కనపడే నెంబర్ కోడ్స్ ఎరుపు, నీలం రంగుతో వేవ్స్ రూపంలో ఉండటం చూడొచ్చు. ఈ పోస్టర్ను ప్రియాంక తన ఇన్స్టా గ్రామ్లో షేర్ చేస్తూ 'ఆమె ఇక్కడ ఉంది. రీ-ఎంటర్' అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) చదవండి: ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్ ఈ హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక ఎలా ఉండనుందో అని ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రియాంక షేర్ చేసిన 'ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్' థియేటర్ రిలీజ్ పోస్టర్లో కూడా తాను లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ప్రియాంక మీరెక్కడ' అని కూడా ఓ అభిమాని కామెంట్ చేశాడు. సెప్టెంబర్లో ఈ చిత్రం మొదటి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రియాంక కళ్లద్దాలు ధరించి రెప్పపాటు క్షణంలో కనిపిస్తారు. మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ నాలుగో సినిమాను లానా వాచోస్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెబంర్ 22న థియేటర్స్, హెచ్బీవో (HBO) మ్యాక్స్లో విడుదల కానుంది. నవంబర్ 22న ప్రియాంక తన ఇన్స్టా గ్రామ్ ఫ్రొఫైల్లో పేరు మార్చిన సంగతి తెలిసిందే. చదవండి: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? -
ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సామ్.. వైరల్
సమంత పెళ్లి తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ కెరీర్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఆమె తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అక్కినేని కోడలు ‘శాకుంతలం’ మూవీని కంప్లీట్ చేసి, విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతు వాకుల్ రెండు కాదల్’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి టు టు టు మ్యూజికల్ వీడియో విడుదలై యూట్యూబ్లో ట్రేండింగ్లో ఉంది. తాజాగా ఈ పాటను చూసిన ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎంతో ఇప్రెస్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాంగ్ ఎంతో బావుందని, మూవీ టీంకి కంగ్రాట్స్ తెలిపింది. అంతేకాకుండా దర్శకుడు విఘ్నేష్కి పుట్టిన రోజు విషెస్ చెప్పింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత ఈ పోస్ట్ని చూసి.. మీ మాటలు మా మూవీ టీంకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పి, ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పింది. కాగా విఘ్నేష్ శివన్, నయన తార, లలిత్ కుమార్ సంయుక్తంగా ‘కాతు వాకుల్ రెండు కాదల్’ సినిమాని నిర్మిస్తున్నారు. చదవండి: ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటున్న ప్రియాంక చోప్రా This is super encouraging for us as a team .. Thankyou dear @priyankachopra 🙏❤️🤗🙌 https://t.co/t9jquNPZbr — S (@Samanthaprabhu2) September 19, 2021 -
‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటున్న ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనస్ 2018లో వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఈ జంట ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ప్రియాంక తన భర్త నిక్పై తనకున్న ప్రేమని మరోసారి బయటపెట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 17న) నిక్ పుట్టిన రోజు సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్. అత్యంత దయ, ప్రేమ ఉన్న వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఐ లవ్ యూ బేబీ’ అంటూ ప్రియాంక నిక్పై తనకున్న ప్రేమని వ్యక్తపరిచింది. చూడచక్కని ఈ జంటను చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. మీరెప్పుడూ ఇలాగే నవ్వుతూ, సంతోషంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే ప్రియాంక ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘నిక్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అనవసరంగా మాట్లాడడు. అతను నన్ను ఎంతో ప్రభావితం చేశాడు. అతని వల్లే మిర్చిలాగా ఘాటుగా ఉండే నేను ఎంతో కూల్గా మారిపోయాను’ అని తెలిపింది. కాగా ప్రస్తుతం యూకేలో సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కేవలం భర్త పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకు అమెరికా వచ్చింది. ప్రస్తుతం ఈ భామ ‘ది మ్యాట్రిక్స్: ది రిసరక్షన్స్’ అనే హాలీవుడ్ మూవీ నటిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
ది యాక్టివిస్ట్ రియాలిటీ షో: ప్రియాంక చోప్రా క్షమాపణలు
‘ది యాక్టివిస్ట్’.. అమెరికాలో ప్రసారం కానున్న ఓ రియాలిటీ షో. గ్లోబల్ యాక్లివిస్ట్ సంస్థ రూపొందిస్తుండగా అక్టోబర్ నుంచి సీబీఎస్ ఛానల్లో ప్రసారం కానుంది. సామాజిక అంశాల గురించి సాగే ఈ షో చుట్టూ వివాదాలు రాజుకోవడంతో.. హోస్ట్గా చేస్తున్న నటి ప్రియాంక చోప్రా బహిరంగంగా అందరికీ క్షమాపణలు చెప్పింది. ప్రియాంకతో పాటు సింగర్ ఉషర్, డ్యాన్సర్ జూలియేన్ హగ్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మొత్తం ఆరుగురు పార్టిసిపెంట్స్ పాల్గొంటారు. అందులో కనీసం ముగ్గురు పబ్లిక్ ఫిగర్స్ ఉంటారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం లాంటి అంశాలపై కార్యకర్తలతో చర్చిస్తారు. ఇందులో చర్చ జరిగిన తర్వాత వారిచ్చే సూచనలను జీ 20 సమావేశంలో వివరించాలని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి సామాజిక అంశాలను టీవీలోకి షోగా చేయడంపై వివాదం రాజుకుంది. ఈ వివాదంపై ప్రియాంక చోప్రా స్పందించింది.‘గతవారం నుంచి ఎంతోమంది చేస్తున్న కామెంట్స్ నన్ను బాధపెట్టాయి. ప్రజలకు మంచి చేసే విషయాల కోసం అందరూ చేతులు కలిపితే కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఎందరో సమస్యలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది’ అని చెప్పింది. ఇంకా.. ‘మీరు తప్పుగా భావిస్తున్న ఈ షోలో నేను పాల్గొనడం మిమ్మల్ని ఎంతో బాధించిందని నాకు తెలుసు. దానికి క్షమాపణలు’ అని తెలిపింది. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
రూ. 7.5 కోట్లు సేకరించాం: ప్రియాంక దంపతులు
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమ వంతుగా ఆయా కోవిడ్ కేర్ సెంటర్లకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్తో కలిసి భారత్లోని కోవిడ్ బాధితుల కోసం నిధులను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 7.5 కోట్లు) సేకరించినట్లు తాజాగా ప్రియాంక సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే 3 మిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తాజాగా ఆమె చెప్పారు. ఈ మొత్తం భారతదేశంలో కోవిడ్తో బాధపడుతున్న వారికి వెచ్చించాలని ప్రియాంక-నిక్ దంపతులు భావిస్తున్నారు. గివ్ ఇండియా ద్వారా ఈ నిధులను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 7.5 కోట్ల రూపాయల నిధులు సేకరించామని చెప్పారు. ఈ డబ్బును భారత్లో ఎలా వినియోగించనున్నారో వివరాలు అడుగుతూ గివ్ ఇండియా సీఈఓ అతుల్ సతీజాతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సంభాషణను ప్రియాంక షేర్ చేశారు. ఈ ఫండ్ను భారత్లో ఆక్సీమీటర్లు అవసరమైన ప్రాంతాల్లో వెచ్చించేలా ప్లాన్ చేస్తున్నట్లు సతీజా చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో టీకాలు అందుబాటులో లేవని, వారి కోసం కూడా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తామని ఆయన వివరించారు. అదే విధంగా ఆపదలో ఉన్న భారత్కు టీకాలు పంపి ఆదుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను తాను కోరినట్లు ప్రియాంక తెలిపారు. భారత్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున తగిన విధంగా ఆదుకోవాలని బైడెన్కు వివరించినట్లు కూడా ప్రియాంక పేర్కొన్నారు. కాగా ఇటీవల ప్రియాంక భర్త నిక్ జోనస్ ఓ లైవ్ షోలో జరిగిన ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చారు. తాను తొందరగా కొలుకునేందుకు ప్రియాంక కారణమని, ప్రతి క్షణం తనను కనిపెట్టుకుని అన్ని విధాల సపర్యలు చేసిందని, గొప్ప భార్య అంటూ ప్రియాంక మీద నిక్ ప్రేమ కురిపించాడు. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
ప్రియాంకతో పెళ్లి వచ్చే జన్మలో అయినా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే హాలీవుడ్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నటి ప్రియాంక చోప్రా. తనకంటే పదేళ్లు చిన్నవాడైన ఆమెరికన్ పాప్ సింగర్ నిక్జోనస్తో ప్రేమలో పడిన ఈ భామ 2018లో అతడిని వివాహం చేసుకొని ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. తాజాగా ప్రియాంక పెళ్లికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రియాంక వివాహం మొదట దేవొంకే దేవ్ మహదేవ్ అనే హిందీ సీరియల్ నటుడు మోహిత్ రైనాతో చేయాలని ఆమె కుటుంబసభ్యులు భావించారట. ఈ సీరియల్లో శివుడి పాత్రలో కనిపించిన మోహిత్ ప్రియాంకకు సరిజోడి అని ఆమె తల్లి ఫిక్సయిందట. అంతేకాకుండా అతడి గురించి ఎంకర్వ్యైరీ కూడా చేసి ఎంతో మంచివాడని, మోహిత్తోనే ప్రియంకకు పెళ్లి జరిపించాలని అనుకున్నారట. దీనికి సంబంధించిన వార్త మీడియాలో అప్పట్లో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని మోహిత్తో ప్రస్తావించగా..ప్రియాంక అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను సూపర్ స్టార్ అని కొనియాడారు. తాను కేవలం టెలివిజన్ నటుడిని అని, అయినా తన గురించి ప్రియాంక పేరేంట్స్ ఇలా ఆలోచించడం చాలా గొప్పవిషయమని అన్నారు. అయితే తనలాంటి చిన్న వ్యక్తితో ప్రియాంక పెళ్లి ఈ జన్మలో జరగకపోయినా, వచ్చే జన్మలో అయినా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇదిలా వుంటే ఈ ఏడాది ప్రియాంక బోలెడు ప్రాజెక్టులకు సంతకం చేసింది. అందులో టెక్స్ట్ ఫర్ యూ చిత్రాన్ని ఇదివరకే కంప్లీట్ చేయగా మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ‘సిటాడెల్’ అనే అమెజాన్ సిరీస్తో పాటు ‘మ్యాట్రిక్స్ 4’లోనూ నటిస్తోంది. ఇక ఈ మధ్యే న్యూయార్క్లో సోనా అనే రెస్టారెంట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్లు రాలేదు : మీరా చోప్రా అవును ఒప్పుకుంటున్న, నా వయసైపోతుంది: ప్రియాంక -
శ్రీదేవి నాకు రోల్మోడల్ : ప్రియంక చోప్రా
‘‘మీ రోల్ మోడల్ ఎవరు?’’ అని ఏ హీరోయిన్ని అడిగినా.. శ్రీదేవి పేరు చెప్పనివారు తక్కువమంది ఉంటారు. ఈ అతిలోక సుందరి పేరు చెప్పేవారిలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఇటీవల ఒక హాలీవుడ్ మ్యాగజైన్తో మాట్లాడుతూ శ్రీదేవి తనకు రోల్ మోడల్ అని ప్రియాంక అన్నారు. శ్రీదేవి గురించి ప్రియాంక చెబుతూ – ‘‘ఆవిడ బ్యూటీ ఐకాన్. శ్రీదేవి కెరీర్ని చూస్తూ పెరిగాను. ఫ్యాషన్ పరంగా ఆమె ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉండేవారు. అలాగే సినిమా సినిమాకి తన లుక్స్ మార్చుకుంటూ వచ్చారు. కొత్తగా కనబడడానికి ప్రయత్నించేవారు. శ్రీదేవి కళ్లు అద్భుతంగా ఉంటాయి. చాలా పెద్ద కళ్లు కూడా. హావభావాలను అద్భుతంగా పలికించేవారు. కెరీర్ విషయంలో చాలా శ్రద్ధగా ఉండేవారు. అందుకే ఆమె నాకు స్ఫూర్తి’’ అన్నారు. -
ఆస్కార్ ఫైనల్ బరిలో నిలిచిన చిత్రాలు ఇవే..
లండన్: ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్. 2020 ఏడాదికి గాను 93వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే నెల ఏప్రిల్ 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుకు పోటీపడే చిత్రాల నామినేషన్ను లండన్లో ప్రియాంక- నిక్ జోనాస్ దంపతులు 2021 ఆస్కార్ నామినేషన్ చిత్రాల జాబితాను సోమవారం ప్రకటించారు. 2018లో వచ్చిన బ్లాక్ ఫాంథర్ సినిమాతో చాడ్విక్ బోస్మాన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అతను నటించిన ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రం ప్రస్తుతం ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ రేసులో ఉంది. కాగా, బోస్మాన్ గతేడాది క్యాన్సర్తో మరణించడం విషాదకరం. క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించిన టెనెట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఉంది. ఇదిలా ఉండగా భారత్ నుంచి ఆస్కార్కు పోటీపడ్డ సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా..!) ఆస్కార్ బరిలో నుంచి వైదొలిగింది. మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ వేడుకలు కోవిడ్-19 కారణంగా రెండు నెలల పాటు వాయిదా పడ్డాయి. 2021 ఆస్కార్ నామినేషన్లు - పూర్తి జాబితా ఉత్తమ చిత్రం కేటగిరీ ది ఫాదర్ జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య మాంక్ మినారి నోమాడ్ ల్యాండ్ ప్రామిసింగ్ యంగ్ వుమన్ సౌండ్ ఆఫ్ మెటల్ ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 ఉత్తమ దర్శకుడు కేటగిరీ థామస్ వింటర్బర్గ్, (అనదర్ రౌండ్) డేవిడ్ ఫించర్, (మాంక్) లీ ఐజాక్ చుంగ్, (మినారి) క్లోస్ జావో, (నోమాడ్లాండ్) ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) ఉత్తమ నటుడు కేటగిరీ రిజ్ అహ్మద్, (సౌండ్ ఆఫ్ మెటల్) చాడ్విక్ బోస్మాన్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఆంథోనీ హాప్కిన్స్, (ది ఫాదర్) గ్యారీ ఓల్డ్మన్, (మాంక్) స్టీవెన్ యూన్, (మినారి) ఉత్తమ నటి కేటగిరీ వియోలా డేవిస్, (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఆండ్రా డే, (ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే) వెనెస్సా కిర్బీ, (పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్) ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్, (నోమాడ్ల్యాండ్) కారీ ముల్లిగాన్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) ఉత్తమ సహాయ నటుడు కేటగిరీ సాచా బారన్ కోహెన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7) డేనియల్ కలుయా, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) లెస్లీ ఓడోమ్ జూనియర్, (వన్ నైట్ ఇన్ మయామి) పాల్ రాసి, (సౌండ్ ఆఫ్ మెటల్) లాకీత్ స్టాన్ఫీల్డ్, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) ఉత్తమ సహాయ నటి కేటగిరీ మరియా బకలోవా, (బోరాట్ సబ్సీక్వెంట్ మూవీఫిల్మ్) గ్లెన్ క్లోజ్, (హిల్బిల్లీ ఎలిజీ) ఒలివియా కోల్మన్, (ది ఫాదర్) అమండా సెయ్ ఫ్రిడ్, (మాంక్) యుహ్-జంగ్ యూన్, (మినారి) ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీ విల్ బెర్సన్ & షాకా కింగ్, (జుడాస్ అండ్ బ్లాక్ మెసయ్య) లీ ఐజాక్ చుంగ్, (మినారి) ఎమరాల్డ్ ఫెన్నెల్, (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్) డారియస్ మార్డర్ & అబ్రహం మార్డర్, (సౌండ్ ఆఫ్ మెటల్) ఆరోన్ సోర్కిన్, (ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీ లవ్ అండ్ మాన్స్టర్స్ మిడ్నైట్ స్కై ములన్ ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్ టెనెట్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ ఆన్వర్డ్ ఓవర్ ద మూన్ ఎ షాన్ ది షీప్ మూవీ: ఫార్మగెడాన్ సౌల్ వోల్ఫ్ వాకర్స్ (చదవండి: ఆస్కార్ నుంచి సూర్య సినిమా అవుట్.. నిరాశలో ఫ్యాన్స్)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement