promotions
-
Satyameva Jayate: నమ్మించి ప్రాణాలు తీస్తున్నారు.. వీళ్లా మన హీరోలు?
-
ఓయూలో ‘పదోన్నతుల’ రగడ!
ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో పదోన్నతుల రగడ కొనసాగుతోంది. అధిక వేతనం కోసం కొంతమంది ప్రొఫెసర్లు (Professors) అడ్డదారిలో ప్రమోషన్లు పొందారనే అంశం ఓయూ అధ్యాపక, విద్యార్థి వర్గాల్లో కలకలం రేపుతోంది. తప్పుడు సమాచారం ఇచ్చి 50 మంది ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు పొందినట్లు ‘ఔటా’ ఫిర్యాదు చేయగా, మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్, సైన్స్ మాజీ డీన్ ప్రొఫెసర్ బాలకిషన్ పదోన్నతులను రద్దు చేస్తూ యూజీసీ (UGC) ఉత్తర్వులు జారీ చేసింది.కొత్తగా సీనియర్ ప్రొఫెసర్ హోదా.. యూనివర్సిటీల్లో బోధన, పరిశోధనలకుగాను ప్రొఫెసర్లను నియమిస్తారు. ప్రొఫెసర్ కంటే ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లేదా రీడర్ హోదాలు ఉంటాయి. అయితే బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టాక సీనియర్ ప్రొఫెసర్ అనే మరో హోదాను సృష్టించింది. సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్గా 10 ఏళ్ల సరీ్వస్, 10 పరిశోధనా పత్రాలు(పబ్లికేషన్స్), ఇద్దరు విద్యార్థులకు పీహెచ్డీ పర్యవేక్షకులు(గైడ్షిప్)గా ఉండాలి. సీనియర్ ప్రొఫెసర్కు నెలకు రూ.3.40 లక్షల వరకు వేతనంతోపాటు పింఛను, ఇతర అలవెన్సులు ఉంటాయి.తొలిసారి 51 మందికి అవకాశంఓయూ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొ.రవీందర్ హయాంలో మూడుసార్లు జరిగిన కెరియర్ అడ్వాన్స్డ్ స్కీమ్(సీఎస్ఎస్) పదోన్నతుల్లో 51 మంది సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. కానీ, అందులో కొందరికి యూజీసీ నిబంధనల ప్రకారం పరిశోధనా పత్రాలు 10 కంటే తక్కువగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(ఔటా) నాయకులు ఫిర్యాదు చేశారు. ఔటా ఫిర్యాదు మేరకు ఓయూ మాజీ వీసీ ప్రొ.తిరుపతిరావు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. అయితే కమిటీ విచారించిన అంశాలను బహిర్గతం చేయాలని ఔటా నాయకులు కోరినా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ‘గతం గతః భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడాలి’అని కమిటీ విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇద్దరి పదోన్నతులు చెల్లవు: యూజీసీ ఓయూలో ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతులు చెల్లవని యూజీసీ తేల్చి చెప్పింది. మాజీ వీసీ ప్రొ.రవీందర్, సైన్స్ మాజీ డీన్ ప్రొ.బాలకిషన్కు యూజీసీ నిబంధనల ప్రకారం 10 పరిశోధనాపత్రాలు లేవని తేలడంతో వారి పదోన్నతులు రద్దు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మరో 40 మందికి కూడా 10 పరిశోధన పత్రాలు లేవని ఔటా, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినవారికి ఇంతకాలం చెల్లించిన వేతనం, పింఛన్ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.చదవండి: పాతబస్తీ మెట్రో పనులు.. చకచకా!నిబంధన మేరకే..: ప్రొ.రవీందర్ ఓయూలో తొలిసారిగా చేపట్టిన సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మాజీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వివరణ ఇచ్చారు. ప్రొఫెసర్ బాలకిషన్పై వచ్చిన ఆరోపణలను విచారించి ఆయనకు ఇచ్చిన పదోన్నతిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తనకు 10 పబ్లికేషన్స్ ఉన్నాయని, తప్పుడు తడకగా సమాచారాన్ని ఆర్టీఏ ద్వారా సేకరించి తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా, అక్రమ పదోన్నతులను రద్దు చేసి, ఇంతవరకు పొందిన వేతనం, పింఛన్ను రికవరీ చేయాలని ఔటా అధ్యక్షుడు ప్రొ.మనోహర్, ఏఐఎస్ఎఫ్ నేత నెలి సత్య డిమాండ్ చేశారు. -
నీటి శాఖ ఇక పటిష్టం!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను పటిష్టపరచడంతో పాటు ఇంజనీర్ల పనితీరు, సామర్థ్యం పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓ వైపు ఇంజనీర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యంగా గత పదేళ్లుగా తాత్కాలిక (అడ్హక్) పదోన్నతులే కల్పిస్తుండగా, ఇకపై ఈ విధానానికి శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టనుంది. వచ్చే 10–15 రోజుల్లోగా అర్హులైన ఇంజనీర్లందరికీ సాధారణ పదోన్నతులు ఇవ్వడంతో పాటు బదిలీల ప్రక్రియ చేపట్టనుంది.తమ తుది తీర్పునకు లోబడి పదోన్నతులు కల్పించుకోవాలని ఇటీవల రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పదోన్నతులు, బదిలీలపై కసరత్తు ప్రారంభించింది. కమిటీ సిఫారసుల మేరకు.. ఏఈ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు అందరికీ ప్రమోషన్లు కల్పించబోతోంది. పదోన్నతుల విషయంలో జోన్–5, జోన్–6 ఇంజనీర్లతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఒక జోన్ వారికే పదోన్నతుల్లో ప్రాధాన్యత కల్పించడంతో తమకు అన్యాయం జరిగిందని మరో జోన్ ఇంజనీర్లు కోర్టును ఆశ్రయించారు. ఉద్యోగంలో చేరాక డిప్లమా చేసిన వారికి ఏఈలుగా పదోన్నతి కల్పిస్తుండడంతో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో నియమితులైన ఏఈఈలు తమ పోస్టులను కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో పదోన్నతులపై అధ్యయనం కోసం నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం) విజయభాస్కర్ రెడ్డితో ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవ్వనున్న సిఫారసుల ఆధారంగా ఈ నెలాఖరులోగా మెరిట్ కమ్ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ (రామగుండం), ఈఎన్సీ (ఓ అండ్ ఎం) పోస్టులతో పాటు 9 సీఈ, 27 ఎస్ఈ, 26 ఈఈ పోస్టులను పదోన్నతులు, బదిలీల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. సీఈలు క్షేత్ర స్థాయిలోనే ఉండాలి నీటిపారుదల శాఖలో టెరిటోరియల్ చీఫ్ ఇంజనీర్లుగా కీలక పోస్టుల్లో ఉన్న కొందరు అధికారులు తమ పని ప్రదేశంలో ఉండకుండా హైదరాబాద్లో ఉంటున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చిoది. ఇంకొందరు సీఈలకు హైదరాబాద్లోని జలసౌధలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఈలందరూ ఇకపై క్షేత్ర స్థాయిలోనే తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే మిర్యాలగూడ ఈఈని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే క్రమంలో ఇటీవల నియమితులైన కొత్త ఏఈఈలు కొంత కాలం పాటు క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిందేనని, బదిలీల్లో వీరికి స్థానచలనం కల్పించరాదని నిర్ణయం తీసుకుంది. వీరిలో బాగా పనిచేసే ఇంజనీర్లకు ప్రోత్సాహకంగా ప్రత్యేక పదోన్నతులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. రిటైర్ అయితే ఇంటికే.. ఇకపై రిటైరైన ఇంజనీర్ల పదవీ కాలం పొడిగించరాదని ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత పదేళ్లలో కీలకమైన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లుగా రిటైరైన ఇంజనీర్లే కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లను తొలగించింది. ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఓ సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఎక్స్టెన్షన్లో ఉన్న ఓ కీలక ఇంజనీర్ నీళ్లు నమిలారు. దీంతో మళ్లీ ఆయన పదవీకాలాన్ని పొడిగించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పోస్టులో మరో ఇంజనీర్ను అదనపు బాధ్యతల కింద నియమించింది. ఇదే సమయంలో మరో ఇంజనీర్ సైతం తన పదవీకాలం పొడిగింపునకు తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నా ఫలించలేదు. -
15 రోజుల్లో ఇరిగేషన్ ఇంజనీర్లకు ప్రమోషన్లు
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలోని అన్ని స్థాయిల ఇంజనీర్లకు 15 రోజుల్లోగా పదోన్నతులు, బదిలీలు చేపడుతామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఇంజనీర్లు పనిచేసే ప్రాంతంలోనే నివాసం ఉండాలని స్పష్టంచేశారు. బాధ్యతలను విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం జలసౌధలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి ఫిర్యాదు ఆధారంగా మిర్యాలగూడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను మంత్రి సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో 1,300 మంది నియామకంఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టేందుకు 700 మందికి పైగా ఏఈఈలను నియమించామని, అందులో దాదాపు 100 మంది ఐఐటీ, ఎన్ఐటీల గ్రాడ్యుయేట్లు ఉన్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాల్వలపై పర్యవేక్షణకు 1,800 మంది లష్కర్లను నియమిస్తున్నామని చెప్పారు. నీటిపారుదల శాఖలో మరో 1,300 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని టీజీపీఎస్సీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల కృష్ణా జలాల వాటా నుంచి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించడాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రాతపూర్వకంగా సమ్మతించిందని తప్పుబట్టారు. తెలంగాణకు 550 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపిస్తున్నామని, ఆరు నెలల్లో సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుల చెల్లింపులకే సగం నిధులుబీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నీటిపారుదల శాఖ అస్తవ్యస్తంగా మారిందని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాల్వల నిర్వహణను నాడు పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు రూ.1.81 లక్షల కోట్లు అప్పు చేసినా ఆయకట్టు మాత్రం అభివృద్ధి కాలేదని అన్నారు. ఈ అప్పులభారం నీటిపారుదల శాఖపై తీవ్రంగా పడిందని తెలిపారు. బడ్జెట్లో ఈ శాఖకు రూ.22 వేల కోట్లు కేటాయిస్తే, రూ.11 వేల కోట్లు అప్పుల చెల్లింపులకే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులను పునర్వ్యవస్థీకరించి, వడ్డీలను తగ్గించడంతో పాటు కాలపరిమితి పెంచడం ద్వారా శాఖపై భారం తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేటీఆర్ను ప్రశాంతంగా వేడుకలు చేసుకోనీయండి: కోమటిరెడ్డి ఫార్ములా– ఈ రేసు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ కేసు గురించి మీడియా ప్రశ్నించగా.. కొత్త సంవత్సరం సందర్భంగా కేటీఆర్ను రెండుమూడు రోజులు ప్రశాంతంగా వేడుకలు చేసుకోనీయండి అని సెటైర్ వేశారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కోసం బీఆర్ఎస్ హయాంలోనే 70 శాతం భూసేకరణ పూర్తిచేశామన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటనను కోమటిరెడ్డి కొట్టిపారేశారు. గత ప్రభుత్వం యుటిలిటీ చార్జీలు కట్టకపోతే ప్రాజెక్టు నిలిచిపోగా, తాను కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి ప్రాజెక్టును రివైవ్ చేయించినట్టు తెలిపారు. సమీక్షలో ఎమ్మెల్యేలు మందుల సామేలు, లక్ష్మారెడ్డి, బాలూనాయక్, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
వెంకీ మామ పాత్రల్లో హీరోయిన్స్.. వీరిద్దరిని గుర్తు పట్టారా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రంలో వెంకీ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. అయితే అందరిలా రోటీన్గా కాకుండా కాస్తా డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల సాంగ్ రిలీజ్ సమయంలోనూ అందరికంటే భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఈ సారి ఏకంగా వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలను ఎంచుకున్నారు. అదేంటో మీరు చూసేయండి.ఈ మూవీ మీనాక్షి చౌదరి, ఐశ్వర్వ రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా వీరిద్దరిని వెంకీ గెటప్లోకి మార్చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరిని వెంకీ చిత్రం బొబ్బిలి రాజాలో రాజా పాత్ర గెటప్లో ముస్తాబు చేశారు. అలాగే ఐశ్వర్య రాజేశ్ వెంకటేశ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం చంటి పాత్ర గెటప్లో సందడి చేసింది. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఇద్దరు హీరోయిన్లు వెంకీ మామ వేషధారణలో డ్యాన్స్తో అదరగొట్టేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడి జయం మనదేరా చిత్రంలోన మహదేవ నాయుడు పాత్ర, ఘర్షణ చిత్రంలోని డీసీపీ రామచంద్ర పాత్రలో దిల్ రాజు సందడి చేశారు.కాగా.. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ కూడా విడుదలైంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. Let's celebrate the new year with a very special interview, "VENKY MAMAs tho #SankranthikiVasthunam" ❤️🔥Presenting @aishu_dil as CHANTI from #CHANTI 😍Stay tuned for the next one and keep guessing 😉#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/jYNxMrAbGl— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 Ayyo Ayyo Ayayyoooo 😄Presenting @Meenakshiioffl as RAJA from #BobbiliRaja 😍Stay tuned for the next one and keep guessing 😉#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/btrn9IedG6— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 -
డిసెంబర్ 5న పుష్ప-2 రిలీజ్.. ప్రమోషన్లలోనూ తగ్గేదేలే!
ఎన్నో రోజులుగా నిరీక్షణకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 ది రూల్ ఈ గురువారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఓవర్సీస్ ఫ్యాన్స్కైతే ఒక రోజు ముందుగానే పుష్ప-2 రిలీజవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా చిత్రబృందం ఇవాళ తెలంగాణలో భారీ ఈవెంట్ నిర్వహించనుంది. యూసుఫ్గూడలోని పోలీస్గ్రౌండ్స్లో పెద్దఎత్తను ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.అయితే ఇటీవల ముంబయిలోనూ పుష్ప-2 మేకర్స్ ప్రమోషన్స్లో భాగంగా ప్రెస్మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో సరికొత్త పంథాలో దూసుకెళ్తోంది పుష్ప టీమ్. ముంబయిలోని మెట్రో రైళ్లకు ఎక్కడ చూసినా పుష్ప-2 పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా- బిగ్గెస్ట్ ప్రమోషన్స్ అంటూ పుష్ప టీమ్ ఈ వీడియోను షేర్ చేసింది.కాగా.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప చిత్రానికి సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటించింది. మరోసారి శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డులు సృష్టిస్తోంది.The Brand is everywhere 🔥🔥Mumbai Metro wrapped with Pushpa Branding 💥💥Biggest Indian Film - Biggest Promotions across India #Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/qCDPlKnXD5— Pushpa (@PushpaMovie) December 2, 2024 -
'పుష్ప 2' ప్రమోషన్లలో బన్నీ టీ-షర్ట్లు గమనించారా? (ఫొటోలు)
-
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి అలా!
మహేశ్బాబు మేనల్లుడు అశోక్ గల్లా, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా ద్వారా మిస్ ఇండియా మానస వారణాసి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ వర్మ రాసిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. అందరిలా కాకుండా కాస్తా వైరైటీగా మూవీ ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదటి ఐదు నిమిషాల మూవీని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. #DevakiNandanaVasudeva ఏం అయివుంటుంది? pic.twitter.com/FR1sIUH5xf— Kakinada Talkies (@Kkdtalkies) November 19, 2024 -
'అమ్మ, నాన్న పెట్టిన పేరు అదే'.. హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబయి, హైదరాబాద్లో ఫుల్ బిజీగా ఈవెంట్స్లో పాల్గొన్నారు. శివ దర్శకత్వంలో వస్తోన్న హిస్టారికల్ యాక్షన్ మూవీ కంగువా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఇవాళ వైజాగ్లో కంగువా చిత్రయూనిట్ సభ్యులు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో సూర్యతో పాటు డైరెక్టర్ శివ, నిర్మాత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వైజాగ్ సిటీ నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిందని అన్నారు. మా అమ్మ, నాన్నలకు ఎంతో ఇష్టమైన నగరాల్లో వైజాగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ..'వైజాగ్ సిటీ నాకు చాలా ప్రత్యేకం. అంతేకాదు ఈ రోజు నాకు స్పెషల్ డే. 2015లో సింగం-3 షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చా. ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం అమ్మ, నాన్న వైజాగ్కు వచ్చారు. కానీ ఆ తర్వాత నా సినిమా షూటింగ్స్ అప్పుడు కూడా ఇద్దరు వచ్చేవారు. ఇక్కడ ప్రజల ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాతో అన్నారు. నాకు మా అమ్మ, నాన్న పెట్టిన పేరు శరవణన్. సినిమాల్లోకి వచ్చాకే నా పేరు సూర్యగా మారింది. నా పట్ల తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. నా పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కంగువా సినిమా చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. కంగువా చిత్రం వచ్చేనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
2000 కోట్లు టార్గెట్..? దీవాళీ నుంచి పుష్ప ప్రమోషన్స్ షురూ..!
-
ఫ్లైట్లోనూ వదల్లేదు.. ఇలా కూడా చేస్తారా!
టాలీవుడ్ హీరోయిన్, తెలుగుమ్మాయి అనన్య నాగళ్ల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ ఏడాదిలో ఇటీవలే తంత్ర, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్ను అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పొట్టేల్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్నారు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ నిర్మించారు. కాగా.. పొట్టేల్ చిత్రాన్ని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు.అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో పొట్టేల్ చిత్రబృందం వచ్చినా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏకంగా వారు ప్రయాణించే ఫ్లైట్లోనే సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. ఫ్లైట్లో కూర్చుని ఉన్న ప్రయాణికులకు పొట్టేల్ మూవీ పోస్టర్లను అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాం' అంటూ అనన్య నాగళ్ల వీడియోను ట్విటర్లో పంచుకుంది. కాగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.(ఇది చదవండి: ఎందుకింత నెగెటివిటీ?.. నెటిజన్స్పై మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!)కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది.ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాంPottel promotions in flight #ananyanagalla #pottelonoct25th pic.twitter.com/TwftS1dxBn— Ananya Nagalla (@AnanyaNagalla) October 17, 2024 -
మరో ఆరు నెలలు.. వాయిదా వేసిన దిగ్గజ కంపెనీ
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చాలా కంపెనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా ఎంతోమంది ఉద్యోగులను తొలగించిన దిగ్గజ కంపెనీలు.. ఇప్పుడు వేతనాలను పెంచడానికి ససేమిరా అంటున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు జీతాల పెంపును నిలిపివేయడమే కాకుండా.. ప్రమోషన్స్, బోనస్ వంటి వాటిని కూడా వాయిదా వేస్తూ వస్తున్నాయి.సాధారణంగా జూన్ లేదా జులై నెలలో వేతనాల పెరుగుదల, ప్రమోషన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీలు దీనిని వాయిదా వేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో అతి పెద్ద ఐటీ కంపెనీ 'అసెంచర్' 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్, శ్రీలంకలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచలేదు. ఎక్కువ పర్ఫామెన్స్ చేసినవాళ్ళకైనా జీతాలు పెంచే అవకాశం ఉందేమో అని ఎదురు చూస్తే.. వారికి కూడా చుక్కెదురైంది.ఇటీవల అసెంచర్ చేసిన ప్రకటనలో.. ప్రమోషన్లకు సంబంధించిన గడువును మరో ఆరు నెలలకు వాయిదా వీడింది. ఇంతకు ముందు ప్రమోషన్స్ ఈ ఏడాది చివరకు ఉంటాయని చెప్పిన కంపెనీ.. ఇప్పుడు వచ్చే ఏడాది జూన్కు వాయిదా వేసింది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటం చేత ఈ ఆలస్యం జరుగుతోందని సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: 10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీటెక్నాలజీ దిగ్గజం అసెంచర్ ప్రపంచవ్యాప్తంగా 7,50,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కన్సల్టింగ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీ ఆర్థిక పరమైన అనిశ్చితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉద్యోగుల మీద పడింది. ఏది ఏమైనా త్వరలోనే ఉద్యోగులకు శుభవార్త వినిపించనుంది. -
ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రముఖ కన్సల్టింగ్, ఐటీ సంస్థ యాక్సెంచర్ చేదు వార్త చెప్పింది. కన్సల్టెన్సీ రంగంలో కొనసాగుతున్న సవాళ్లను సూచిస్తూ యాక్సెంచర్ తన ప్రమోషన్ సైకిల్లో గణనీయమైన మార్పును ప్రకటించింది. పదోన్నతుల ప్రక్రియను ఆరు నెలలు ఆలస్యం చేసింది.యాక్సెంచర్లో ప్రమోషన్లు ఆనవాయితీ ప్రకారం డిసెంబర్లో చేపడతారు. కానీ బ్లూమ్బెర్గ్ ద్వారా పొందిన అంతర్గత కంపెనీ సందేశం ప్రకారం.. ప్రమోషన్లు ఇప్పుడు వచ్చే జూన్లో జరుగుతాయి. కార్పొరేట్ వ్యయం, స్థూల ఆర్థిక అస్థిరత కఠినతరం కావడం వంటివాటతో ఆర్థిక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆఫీస్కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!క్లయింట్ వ్యూహాలు, డిమాండ్ స్థాయిలకు అనుగుణంగా కంపెనీ విజిబులిటీకి కొత్త ప్రమోషన్ షెడ్యూల్ సరిగ్గా సరిపోతుందని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. ఎందుకంటే ఇవి సాధారణంగా సంవత్సరం మధ్య నాటికి స్పష్టంగా తెలుస్తాయి. ఈ వార్తల తర్వాత యాక్సెంచర్ స్టాక్ మంగళవారం దాదాపు 5 శాతం క్షీణతను చూసింది.కన్సల్టెన్సీ పరిశ్రమను ప్రభావితం చేసే విస్తృత ఆందోళనలకు ఇన్వెస్టర్లు ప్రతిస్పందించారు. ప్రమోషన్లను ఆలస్యం చేయాలనే యాక్సెంచర్ నిర్ణయం కన్సల్టెన్సీ పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. మెకిన్సే, ఎర్నెస్ట్ & యంగ్, ప్రైస్వాటర్హౌస్కూపర్స్ వంటి కంపెనీలు కూడా ఆర్థిక ఇబ్బందులకు ప్రతిస్పందనగా సిబ్బంది సర్దుబాట్లు చేశాయి. -
పవర్ కపుల్ స్వీట్ మెమరీస్ : రిషబ్ శెట్టి చేతికి కల్కి ‘బుజ్జి’ (ఫొటోలు)
-
తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీలు
-
పదోన్నతులు ఎలా ?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో పదోన్నతులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈఓ నుంచి ఏఓకు, ఏఓ నుంచి ఏడీఏ పోస్టులకు పదోన్నతులు నిర్వహించేందుకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు ఉత్తర్వు లు ఇచ్చారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ కన్వీనర్గా, సహకార శాఖ కమిషనర్, ఉపకార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా రెండేళ్ల కాల పరిమితితో డీపీసీని ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖలోని మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించడమే దీని ఉద్దేశమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలంటే, ఆయా పోస్టుల్లో ప్రస్తుతమున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. ఉదాహరణకు ఏఓ నుంచి ఏడీఏ పోస్టుల్లోకి ప్రమోషన్ ఇవ్వాలంటే, ఏడీఏ పోస్టుల్లో ఖాళీలు ఉండాలి. కానీ ఏడీఏ నుంచి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు పదోన్నతులు జరపకుండా, ఖాళీలు ఎలా ఏర్పడతాయని వ్యవసాయ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అతి కొద్దిగా మాత్రమే రిటైర్మెంట్లు ఉంటాయి. కాబట్టి పూర్తిస్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఇక ఏఈఓ నుంచి ఏఈలుగా పదోన్నతులు ఇవ్వాలన్నా అటువంటి క్లిష్టమైన పరిస్థితే తలెత్తుతుంది. పైస్థాయిలో కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ ఆఫీసర్ల పదోన్నతులు చేయడం కుదరదని అంటున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులువ్యవసాయశాఖలో దాదాపు 500 మందికి పైగా పదోన్నతు లకు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒకేసారి అన్ని శాఖల్లో పదోన్నతులు జరిగినా, వ్యవసాయశాఖలో మాత్రం చేయలేదు. ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేదని సాకులు చెబుతూ పదోన్నతులు ఆపేశారని అంటున్నారు. ఏఓ స్థాయి నుంచి అడిషనల్ డైరెక్టర్ కేడర్ వరకు పదోన్న తులు జరగాలి. సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతులు నిర్ణీత కాలంలో జరపకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని సంఘాల నేతలు అంటున్నారు. పదోన్నతులు రాకపోవడం వల్ల సీనియర్లు మనోవేదనకు గురవుతున్నారు. దీనివల్ల పోస్టింగ్ల్లోనూ అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నా రు. ఇప్పుడు కేవలం రెండు కేడర్లలో పదో న్నతులకు మాత్రమే డీపీసీని ఏర్పాటు చేశారు. దీని వల్ల పైస్థాయిలో కద లిక రాకుంటే వీటికి కూడా ప్రమోషన్లు ఇచ్చే పరి స్థితి ఉండదని అంటున్నారు. ఆయా విషయాలపై ఇటీవ ల అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవ స్థాపక అధ్యక్షుడు కె.రాము లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నికలకు ముందే విజ్ఞప్తి చేశారు. కానీ ప్రక్రియ మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. బదిలీల మాటేంటి?గత ప్రభుత్వంలో అంటే దాదాపు ఐదారేళ్ల క్రితం వ్యవసాయ శాఖలో బదిలీలు జరిగాయి. అవి కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అనేకమంది ఉద్యోగులు ఒకే చోట తిష్టవే యగా, కొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ అన్యా యానికి గురవుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు వ్యవసా య ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నాయి. ఉద్యోగు ల్లో దాదాపు 2 వేల మందికి పైగా బదిలీలకు ఎదు రుచూస్తున్నారు. కొందరైతే అక్రమ బదిలీలు చేయించుకుంటున్నారన్న విమర్శ లున్నాయి. మరికొందరైతే డిప్యూ టేషన్లు చేయించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ లో చాలామంది డిప్యూటేషన్లు, ఓడీలు, ఫారిన్ సర్వీసులపై ఉంటున్నారు. బదిలీలు జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికీ డిప్యూటేషన్లకు వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆ అధికారి వెల్లడించారు. నిర్ణీత సమయం ప్రకారం బదిలీ లు జరగాలని, అది ఉద్యోగుల హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు. -
అమెరికాలో సూర్య గ్రహణం సందడి
ఉత్తర అమెరికా ఆకాశంలో సోమవారం (ఏప్రిల్ 8) నాడు కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అక్కడి జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. ఇది కెనడా నుండి నిష్క్రమించే ముందు టెక్సాస్తో పాటు 14 ఇతర అమెరికా రాష్ట్రాలను దాటనుంది. ఇది 2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని పలు మార్కెట్లతో పాటు టూరిజం విభాగం గ్రహణ వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సౌత్వెస్ట్, డెల్టా వంటి విమానయాన సంస్థలు సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి విమాన మార్గాలను ప్రకటించాయి. అలాగే పలు మార్కెట్లలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఎక్లిప్స్ సేఫ్టీ గ్లాసెస్ అమ్మకానికి అందుబాటులో ఉంచారు. అలాగే వివిధ రంగురంగుల టీ షర్టులు, ఖగోళ సావనీర్లు విక్రయిస్తున్నారు. 2017లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు పలు కంపెనీలు దానిని ఆదాయమార్గంగా మార్చుకున్నాయి. వాటిలో క్రిస్పీ క్రీమ్ కూడా ఉంది. షార్లెట్, నార్త్ కరోలినాకు చెందిన ఈ సంస్థ 2017 సూర్య గ్రహణం సందర్భంగా పరిమిత-ఎడిషన్ చాక్లెట్ గ్లేజ్డ్ డోనట్లను విడుదల చేసింది. -
ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన ఫ్యామిలీ స్టార్ బ్యూటీ!
సీతారామం సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్కు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంతే కాకుండా గతేడాది నాని సరసన హాయ్ నాన్న చిత్రంతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్లో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నా మృణాల్ ఠాకూర్ హైదరాబాద్లో సందడి చేసింది. బల్కంపేట్లో ఉన్న ఎల్లమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుటుంబ సంప్రదాయాలు, ఏదైనా పెద్ద పని ప్రారంభించే ముందు ఒక్క క్షణం ఆగి ప్రార్థించండి.. వీలైతే ఆలయాన్ని సందర్శించండి అంటూ తన ఇన్స్టాలో పంచుకుంది. ఆలయంలో పూజలు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
వాళ్లు పోతే పోనీ.. దిగ్గజ ఐటీ కంపెనీలో ప్రమోషన్లు!
Wipro Promotions : భారతీయ ఐటీ సేవల సంస్థ విప్రో ఉద్యోగులకు ప్రమోషన్లు ప్రకటించింది. ఆరుగురు ఉద్యోగులను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు, మరో 25 మందిని వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు ప్రమోట్ చేసినట్లు అంతర్గత మెమోలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల కంపెనీ అయిన విప్రో నుంచి ఉన్నత స్థాయి నిష్క్రమణల పరంపర తర్వాత సీనియర్-స్థాయి అట్రిషన్ను నిరోధించే చర్యగా ఈ ప్రమోషన్లను పరిశ్రమ పరిశీలకులు భావిస్తున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడింట్గా పదోన్నతి పొందిన చీఫ్ డెలివరీ ఆఫీసర్ అజిత్ మహాలే, హెల్త్కేర్ పోర్ట్ఫోలియో లీడర్ అనూజ్ కుమార్, క్యాప్కో సీఎఫ్ఓ బెంజమిన్ సైమన్, కెనడా కంట్రీ హెడ్ కిమ్ వాట్సన్, యూరప్ క్లౌడ్ సేల్స్ హెడ్ శ్రీనివాసా హెచ్జి, క్లౌడ్ ఆర్మ్ స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్మ్ హెడ్ సతీష్ వై ఉన్నారు. గత సంవత్సరం ఫైనాన్స్ చీఫ్ జతిన్ దలాల్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రాట్మాన్, డిజిటల్ అండ్ క్లౌడ్ హెడ్ భరత్ నారాయణన్ సహా చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు విప్రోను వీడారు. నియామక సంస్థ ఎక్స్ఫెనో డేటా ప్రకారం.. దేశంలోని ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడింట్, వైస్ ప్రెసిడింట్, సీనియర్ వైస్ ప్రెసిడింట్ పోస్టుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 11 శాతంగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4 శాతం తగ్గింది. కాగా ప్రమోషన్ల అంశాన్ని విప్రో యాజమాన్యం సైతం ధ్రువీకరించింది. "బలమైన అంతర్గత నాయకులను అభివృద్ధి చేయడంలో కొనసాగుతున్న నిబద్ధత"లో ఇది భాగమని తెలిపింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ తక్కువ మంది సీనియర్ ఉద్యోగులను ప్రమోట్ చేసింది. 2023 జనవరిలో విప్రో రికార్డు స్థాయిలో 73 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. వీరిలో 12 మందిని సీనియర్ వైస్ ప్రెసిడింట్ స్థాయికి, 61 మందిని వైస్ ప్రెసిడెంట్ స్థాయికి పదోన్నతి కల్పించింది. -
గురుకులాల్లో పదోన్నతుల టెన్షన్
సాక్షి, హైదరాబాద్: కొత్త నియామకాలకు ముందే గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఏళ్ల తరబడి వారంతా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల పాఠశా లలు, కళాశాలల్లోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను తెలంగాణరాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ఓ కొలిక్కి తీసుకొచ్చింది. వారంరోజుల్లో ఖాళీ లు భర్తీ చేసి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ నియామకాల కంటే ముందుగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేశాయి. దీనిపై సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతులు కూడా సమర్పించాయి. సీనియారిటీ జాబితాలు సిద్ధం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యి విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 22వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లలో సీని యర్లకు పదోన్నతులు కల్పించాలి. దీనికి సంబంధించి సొసైటీలు ఇప్పటికే సీనియారిటీ జాబితాలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం అనుమతిస్తే రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసే వీలుందని సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే అన్ని కేటగిరీల్లో 3 వేల మందికి పదోన్నతులు దక్కుతాయి. ఆలస్యమైతే.. అంతే టీఆర్ఈఐఆర్బీ ద్వారా గురుకుల విద్యాసంస్థల్లో కొత్తగా 9వేల మంది ఉద్యోగులు చేరనుండగా, ఇప్పటికే గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలతోపాటు పీజీటీ కేటగిరీల్లో 2వేల మంది నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరులోగా నియామక పత్రాలు, ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశముంది. అయితే కొత్తవారికి నియామక పత్రాలు ఇవ్వగానే వారి సర్విసు గణన ప్రారంభమవుతుంది. దీంతో అర్హత ఉండి పదోన్నతులు రాని వారంతా కొత్తగా నియమితులైన వారికంటే జూనియర్లుగా ఉండిపోతారు. ఇలా పీజీటీ, జేఎల్, డీఎల్ కేటగిరీల్లోని సీనియర్ల సీనియారిటీ క్రమం తారుమారు అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు చాలా కేటగిరీల్లోని టీచర్లకు పదోన్నతులు రాలేదు. ఇటీవల సీఎంతోపాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు కల్పిస్తారనే నమ్మకం ఉంది. – మామిడి నారాయణ, గురుకుల ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి సీనియర్లు నష్టపోతారు కొత్త నియామకాల తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపడితే సీనియర్లు తీవ్రంగా నష్టపోతారు. తదుపరి పదోన్నతుల సమయంలో జూనియర్లుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. దాదాపు ఆరేళ్లుగా గురు కులాల్లో పదోన్నతులు నిర్వహించలేదు. పదేళ్ల నుంచి ఒకే స్థానంలో పనిచేస్తున్న టీచర్ల సంఖ్య పెద్దగానే ఉంది. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తే ప్రస్తుతం పనిచేస్తున్నవారికి లాభదాయకం. – సీహెచ్.బాలరాజు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
సలార్ రిలీజ్ పరిస్థితి ఏంటి?
-
ప్రమోషన్స్లో చీరకట్టులోనే కనిపిస్తున్న రష్మిక..అదే కారణమా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకి మించిపోయే ఫాన్ ఫాలోయింగ్తో రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్లోను తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక, రణబీర్ కపూర్ జంటగా నటించారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ టీం. ఇందులో రష్మిక లేటెస్ట్ లుక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నా మధ్య రష్మిక తన ఇన్స్టాలో.. శారీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మీరంతా(అభిమానులను ఉద్దేశించి)నాకు చీరలపై ఉన్న ఇష్టాన్ని పెంచేశారు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రష్మిక ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది. తాజాగా యానిమల్ ప్రమోషన్స్ అన్నింట్లో చీరల్లోనే మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోయింది రష్మిక. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఆర్గాంజా శారీలో అదరహో అనిపించే అందంతో మెరిసిపోయింది. మొన్నటికి మొన్న ఓ షోకు హాజరైన రష్మిక బ్లాక్ శారీలో తళుక్కుమంది. చూడటానికి చాలా సింపుల్గా కనిపించిన ఈ చీర ధర అక్షరాల 80వేల రూపాయలట. ఇక రీసెంట్గా ప్రముఖ డిజైనర్ అర్పితా ఖాన్ డిజైన్ చేసిన పింక్ చీరలోనూ వయ్యారాలు ఒలికించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ముందుండే రష్మిక చీరకట్టులోనూ మరింత అందంగా కనిపిస్తోంది. దీంతో రష్మికకు-చీరలకు ఏందో లింక్ ఉన్నట్లుంది, త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాల్సి ఉంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
అభిమానులకు నాగచైతన్య బిగ్ సర్ప్రైజ్.. ఏం చేశారంటే?
ఈ ఏడాది కస్టడీ సినిమాతో అభిమానులను అలరించిన అక్కినేని హీరో నాగచైతన్య. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించగా.. ప్రియమణి కీలకపాత్రలో కనిపించారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించారు. అయితే ఇప్పటికే చాలామంది హీరోలు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వగా.. చైతూ సైతం సరికొత్త సిరీస్తో అరంగేట్రం చేస్తున్నారు. నాగచైతన్య ప్రధానపాత్రలో నటించిన వెబ్ సిరీస్ దూత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సిరీస్ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇందులో భాగంగానే ప్రమోషన్స్లో బిజీ అయిపోయారు నాగచైతన్య. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సరికొత్త పంథాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈనెల 23న చైతూ బర్త్ డే కావడంతో స్పెషల్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. తన అభిమానుల కోసం సరికొత్తగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. సాధారణంగా తన అభిమాన హీరోను కలవాలంటే మనమే వాళ్ల ఇంటికి వెళ్తాం. కానీ ఇక్కడ నాగచైతన్యనే స్వయంగా అభిమానుల ఇంటికి వెళ్లి వారికి ఆశ్చర్యానికి గురి చేశారు. అంతే కాకుండా వారికి గిఫ్ట్ బాక్సులు కూడా అందజేశారు. దీంతో అభిమాన హీరోనే స్వయంగా తమ ఇంటికి రావడంతో ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. ఫ్యాన్స్ను కలిసిన చైతూ వారితో కాసేపు మాట్లాడారు. ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ..'పర్సనల్గా నాకు సంతృప్తినిచ్చిన వెబ్ సిరీస్ ఇది. ఈ జోనర్ను నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ సిరీస్ ట్రైలర్ను నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారు. కాగా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ రానుంది. శరద్ మరార్ నిర్మించిన ఈ సిరీస్కు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఆయన నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలు చేశారు. ఈ వెబ్ సిరీస్లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
'సినిమా బాగుంటే అడుతది. లేదంటే పీకుతది'.. నాని ఆసక్తికర కామెంట్స్!
దసరాతో హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దసరాలో మాస్ యాక్షన్లో అలరించిన.. ఈసారి మాత్రం హాయ్ నాన్న అంటూ తండ్రి, కూతుళ్ల ఎమోషనల్ స్టోరీతో రానున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. అయితే మూవీ ప్రమోషన్స్తో నాని బిజీ అయిపోయారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి ఉండడంతో విభిన్నమైన రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన నాని.. తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో రాహుల్ మాట్లాడుతూ.. 'మన రాహుల్ వచ్చిండా. నువ్వు చాలా గమ్మత్తుగా ఉన్నావయ్యా. ఇక్కడ నార్త్, సౌత్ సినిమా అని ఉండదు. లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ కాదని నేను అనలే. మన సినిమాను పోస్ట్ పోన్ కానివ్వం. ఏమయ్యా రాహుల్ ప్రీ పోన్కు, పోస్ట్ పోన్కు ఆ మాత్రం తేడా తెల్వదా నీకు. సినిమా బాగుండే అడుతది. లేకుంటే పీకుతది. డిసెంబర్ 7న థియేటర్లో దావత్ చేసుకోవాలే. తమ్ముడు నువ్వు ఏదో కిరి కిరి పెట్టాలని చూస్తున్నావ్. అదే జరగదు. అనుకున్న టైంకే సినిమా రిలీజ్ అయితది.' నవ్వులు పూయించారు. హాయ్ నాన్న పార్టీ ప్రెస్ మీట్ అంటూ తెలంగాణం సీఎం కేసీఆర్ స్టైల్లో స్పీచ్ అదరగొట్టేశారు నాని. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఊరికే Press meet పెట్టా 😬#HiNanna #HiNannaOnDec7th pic.twitter.com/bZIQroHN5P — Nani (@NameisNani) November 20, 2023 -
హైదరాబాద్: ‘దిమార్వెల్స్’ యూనిట్తో కలసి సమంత సందడి (ఫొటోలు)
-
ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజారవాణా విభాగం(ఆర్టీసీ) ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన సానుకూలతను మరోసారి చాటుకుంది. ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కీలక డిమాండ్పై సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు కేటగిరీల ప్రకారం పదోన్నతులు కల్పించేలా కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వంలో విలీనం చేయకముందు అంటే.. 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు గతంలో అమలు చేసిన ఆర్టీసీ సర్వీస్ నిబంధనలనే వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరినవారికి ప్రజా రవాణా విభాగం(పీటీడీ) సర్వీసు నిబంధనలను అమలు చేస్తారు. ఈ మేరకు పీటీడీ సర్వీసు నిబంధనల్లోని సెక్షన్ 5ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఆర్డినెన్స్ ఇచ్చింది. అనంతరం సవరణ బిల్లునూ ఆమోదించింది. దీనిపై త్వరలోనే తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువరించాలని నిర్ణయించింది. రెండు కేటగిరీలుగా పదోన్నతులు 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు మొదలైనవన్నీ ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకే కల్పిస్తారు. ఎందుకంటే గతంలో ఆర్టీసీలో ఉద్యోగులుగా నియమితులైవారికి పదోన్నతులకు సంబంధించి విద్యార్హతల నిబంధనలు ప్రత్యేకంగా ఉండేవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలనే.. ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేశారు. దీంతో గతంలో తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు పొంది.. పదోన్నతులకు అర్హత కలిగిన ఉద్యోగులు తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలతో నష్టపోయే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సరైన విధాన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేనాటికి(2020, జనవరి 1) ఉద్యోగులుగా ఉన్నవారికి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. దాంతో 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉద్యోగులుగా ఉన్న దాదాపు 50 వేల మందికి ఆర్టీసీ సర్వీసు నిబంధనలే వర్తిస్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తారు. ప్రస్తుతం ఆ కేటగిరీలో ఆర్టీసీలో 311 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆ విషయంలో థ్రిల్లింగ్గా ఫీలవుతున్నా: సమంత
స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్లో సందడి చేసింది. ఈ దీపావళికి ఫ్యాన్స్కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తన అభిమానుల కోసం మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తోన్న ‘దిమార్వెల్స్ యూనిట్తో జతకట్టింది. అమెరికన్ సూపర్ హీరోస్కు తానెప్పుడూ అభిమానినని చెప్పే సమంత.. ది మార్వెల్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తాజాగా భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక ప్రోమోను లాంఛ్ చేశారు. తాజాగా మూవీ ప్రమోషన్స్లో సమంత స్పెషల్గా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ది మార్వెల్స్ నవంబర్ 10న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత మాట్లాడుతూ..'కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో. అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్టైనర్ కోసం మరోసారి మార్వెల్ ఇండియా తో జతకట్టడం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నా. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు. మార్వెల్స్ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమా కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.' అని అన్నారు. కాగా.. 2019లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘కెప్టెన్ మార్వెల్’ ప్రమోషన్స్లోనూ సమంత భాగమైన సంగతి తెలిసిందే. Smile, Slay & Pose done ✅ As ever #Samantha stuns us with her stylish looks at an event!!❤️🔥 @Samanthaprabhu2 #TheMarvels #TeluguFilmNagar pic.twitter.com/GU777LnnIU — Telugu FilmNagar (@telugufilmnagar) November 3, 2023 -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల పరంపర
-
పదోన్నతుల పరంపర
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఉద్యానవన అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించగా... తాజాగా వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న 35 మంది గ్రామ పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించారు. వారిని అదే జిల్లా పరిధిలోని వివిధ పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల్లో నియమిస్తూ ఈ నెల 19వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా ఏడీహెచ్వో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యాన 19 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 17 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ 17 కేటగిరీలకు సంబంధించిన శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు పశు వైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అయితే వాటిలో 40శాతం పోస్టులను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి నియమించాలని స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారమే ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 35 మందికి ప్రమోషన్లు కల్పించి పోస్టింగ్లు ఇచ్చారు. మరోవైపు సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు కూడా పదోన్నతులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అపోహలు.. అభూత కల్పనల నుంచి పదోన్నతుల వరకు.. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం... ఎన్నికల ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం... ఆ తర్వాత పట్టించుకోకపోవడం.. కోర్టు కేసులు, ఇతర సమస్యలతో నియామక ప్రక్రియ సంవత్సరాల తరబడి సాగిన చరిత్ర నాలుగేళ్ల క్రితం వరకు ఉంది. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఏకంగా 1.34లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష మందికి పైగా నిరుద్యోగులకు ఒకేసారి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. అయితే, ఈ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఓర్వలేని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. ఇవి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కావని, ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగాలు ఉంటాయో... ఊడుతాయో.. అని భయపెట్టాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో సచివాలయ ఉద్యోగులకు మేలు చేస్తోంది. ప్రొబేషన్ ఖరారు చేసి అందరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేలుతో కూడిన వేతనాలు అందిస్తోంది. తాజాగా సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఆయా శాఖల్లో పోస్టింగ్లు కూడా ఇస్తోంది. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. -
ఇప్పటికీ పురుషులకే ఎక్కువ పదోన్నతులు..!
మహిళలకు పురుషులతో సమానంగా అన్నింటిలోనూ సమాన హక్కులు ఉండాలని పోరాటలు చేశారు. తాము పురుషులకు ఎందులోనూ తీసిపోం అని చాటి చెప్పినప్పటికీ స్త్రీలు ఇంకా పదోన్నోతుల్లో వెనుకబడే ఉన్నారు. మహిళలు కార్యాలయాల్లో అగ్రగామిగా ఉండాలనే కోరికి కలగానే మిగిలిందా? ఎందుకిలా? అంటే..ఔననే చెబుతున్నాయి అమెరికన్ సాంకేతిక అధికారి షెరిల్ శాండ్బర్గ్, లెర్న్ఇన్ డాట్ ఆర్గనైజేషన్, మిక్నిసే అండ్ కో సంయుక్తంగా నిర్వహించిన విమెన్ ఇన్ ది వర్క్ ప్లేస్ నివేదికలు. ఆ సర్వే ప్రకారం 2022లో పదోన్నతులు పొందిన ప్రతి వంద మంది పురుషుల్లో 87 మంది మహిళలు మాత్రమే ఆ ప్రోత్సాహాన్ని పొందారు. పురుషులతో సమానంగా ప్రమోషన్లు పొందాలని కోరినప్పటికీ అందులో వారు ఇంకా వెనుకబడే ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఈ గ్యాప్కి కారణం ఏంటంటే పని ప్రదేశాల్లో తమ సామర్థ్యాన్ని పురుషుల, స్త్రీలు ప్రూవ్ చేసుకునేదనే బట్టే ఉంటుంది. పురుషులు, స్త్రీలు తమ పనితీరుని చూపించుకోవాల్సి ఉంటుఒంది. మీకు (స్త్రీలు) మీరుగా మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోనట్లయితే వెనుకబడక తప్పదని శాండ్బర్గ్ సర్వే వెల్లడించింది. దీన్ని నల్లజాతీయుల పరంగా చూస్తే ఆ స్త్రీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రతి వంద మంది పురుషులకు కేవలం 54 మంది నల్లజాతీయులు పదోన్నతులు పొందుతున్నట్లు సర్వే తెలిపింది. 2021లో 96 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య కాస్త 2018, 2019 కనిపించిన 58 దగ్గరకు ఉంది. అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు నల్లజాతీయులకు ఉద్యోగావకాశాలు హామీ ఇచ్చాయి కూడా. కాగా యూఎస్, కెనడాలలో సుమారు 276 కంపెనీలపై సర్వే చేయగా దాదాపు 33 సంస్థలు నుంచి 27 వేలకు పైగా ఉన్న ఉద్యోగుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ ప్రమోషన్లు పొంది లాభపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. పురుషులు ఆన్సైట్లో ఉన్నప్పుడూ మహిళలు కంటే ఎక్కువ మెంటర్షిప్, స్పాన్సర్షిప్ పొందుతారని, వారు కొత్తవి తెలుసుకోవడంలో ఆసక్తి కనబరుస్తారని లెర్ని ఇన్ డాట్ ఆర్గనైజేషన్ సహ వ్యవస్థాపకుడు సీఈవో రేచెల్ థామస్ అన్నారు. అంతేగాదు పని వాతావరణంలో ఉద్యోగుల నైపుణ్యాలు వెలికితీసేలా మంచి శిక్షణ ఇవ్వడంతో పాటు వారి పనితీరును కూడా సమీక్షించాలి, ఎక్కడ తప్పు దొర్లుతుందో గమనించాలని అన్నారు. ఇక మెటా ఫ్లాట్ఫారమ్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శాండ్బర్గ్ మాట్లాడుతూ..మహిళలే పనితీరులో కాస్త నిర్లక్ష్యంగా ఉంటూ అసంతృప్తిగా పనిచేస్తున్నారని చెప్పడం దురదృష్టకరం. అయినా ఇలా ఉంటే మహిళలు వారు ఆశించిన లక్ష్యాన్ని ఎలా చేరుకొనగలరు అని ప్రశ్నిస్తోంది. సామర్థ్యాన్ని పెంచుకోకుండా పురుషులతో సమాన అవకాశాలు ఎక్కడ నుంచి వస్తాయని శాండ్బర్గ్ అన్నారు. మహమ్మారికి ముందు మహిళలు ప్రతిష్టాత్మకంగా ఉన్నారని 2019లో ఏకంగా 80% మంది మహిళలు ప్రమోషన్లు ఆశించినట్లు తెలిపారు. -
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రి య మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయుల సీని యారిటీ వ్యవహారం పీటముడిగా మారడ మే దీనికి కారణం. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పోస్టులకు పదోన్నతి కోసం గురు వారం నుంచి ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయి తే రాత్రి పొద్దుపోయే వరకూ ఈ ప్రక్రియ మొదలుకాలేదు. ఆప్షన్లు ఇచ్చేందుకు టీచర్లు సిద్ధపడ్డా, వెబ్సైట్ ఓపెన్ కాలేదు. రోస్టర్ విధానం, మల్టీజోన్ల వారీగా సీనియారిటీ, నాట్–విల్లింగ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవసర మైన సాఫ్ట్వేర్ ఏర్పాటులో సాంకేతిక సమ స్యలొచ్చినట్టు అధికారులు తెలిపారు. శుక్ర వారం నుంచి ఆప్షన్లు అందుబాటులోకి రావ చ్చని అధికారులు తెలిపారు. మల్టీజోన్–2లోని 14 జిల్లాల్లో కోర్టు ఆదేశాల కార ణంగా హెచ్ఎంల పదోన్నతి ప్రక్రియ ఆగిపోయింది. ఇది ముందుకెళితేనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలపై స్పష్టత వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,974 హెచ్ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. 6,500 మంది ఎస్జీటీలకు పదోన్నతులు లభించాల్సి ఉంటుంది. తొలిదశలోనే సమస్యలు మొదలుకావడంతో మిగతాప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు. షెడ్యూల్ ప్ర కారం అక్టోబర్ 3, 4 తేదీల నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదో న్నతుల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది. అన్నిస్థాయిల్లోనూ ఆర్డర్లు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే హెచ్ఎంల సీనియారిటీ సరిగాలేదనే కారణంగా మల్టీజో న్–2లో ప్రక్రియ ఆగిపోవడంతో బదిలీలు, పదోన్నతులు కిందస్థాయిలోనూ బ్రేక్ పడుతున్నాయి. కోర్టు స్టే తొలగించేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇది కొలిక్కి వచ్చినప్పటికీ అక్టోబర్ నెలాఖరునాటికి అన్నిస్థాయిల్లో బదిలీలు, పదోన్నతులు ముందుకెళ్లే అవకాశం కన్పించడంలేదు. స్టే ఎత్తివేయడంలో ఆలస్యమైతే మరికొంత జాప్యం తప్పదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
సోషల్ మీడియాలో బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తున్నారా? అలా చేస్తే శిక్షార్హులు అవుతారు!
సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూవర్స్ని యాడ్స్ ద్వారా ప్రభావితం చేస్తుంటారు. వీరితో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ద్వారా వెలుగులోకి వస్తున్నవారు కూడా ఇ–కామర్స్ సంస్థల బ్రాండ్స్ను ఎలా ప్రచారం చేయాలో తెలుసుకోవాలి. ప్రకటనదారులు ఇన్ఫ్లుయెన్సర్లకు కానుకల ఆశ చూపి, తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా మార్చుకుంటారు. ఇవి తెలియని ఇన్ఫ్లుయెన్సర్లు ఉత్పత్తులకు, సేవలకు ప్రచారకర్తలుగా మారిపోతారు. వీరు చెప్పే బ్రాండ్స్ను గుడ్డిగా నమ్మి వ్యూవర్స్ వాటిని కొనుగోలు చేసి, మోసపోవచ్చు. అందుకే, భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం –2019 అమలులోకి తీసుకు వచ్చింది. ఉత్పత్తులు, సేవల గురించి తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను మోసం చేస్తే వారు శిక్షార్హులు అవుతారని చెబుతోంది. వ్యూవర్లను, సబ్స్రైబర్లను పొందాలంటే.. సాధారణంగా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్మీడియా ఛానెల్స్లో పోస్ట్ చేసిన వాటి విషయంలో ఈ పరిస్థితి తలెత్తదు. వాటిలో స్వీయప్రచారం లేదా సబ్స్రైబర్స్కి ఏదైనా సూచన ఇవ్వడం కనిపిస్తుంది. లాంగ్టైమ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరిగా సక్సెస్ కావాలంటే ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేసే వ్యక్తిగానే ఉండాలి. ►అర్ధవంతమైన కంటెంట్, సంభాషణను ప్రదర్శించాలి. ► సబ్స్రైబర్లు, ఫాలోవర్లను కట్టిపడేలా మీ కంటెంట్ సమయాన్ని పెంచుకోవచ్చు. వ్యూవర్స్ అన్ని కామెంట్స్కు ప్రత్యుత్తరం ఇవ్వడం మర్చిపోవద్దు. ► సబ్స్క్రైబర్ల దృష్టి కోణం నుండి మీ పోస్ట్ ఉండేలా చూసుకోండి. కృత్రిమమైన డ్రామాను ప్లే చేయకూడదు. ► మీ ఛానెల్ను ఫాలో అవమని వ్యక్తులను అడగడంలో మీరు ఎంత పెద్దవారైనప్పటికీ సిగ్గుపడకూడదు. సబ్స్రైబర్లను కొనుగోలు చేయడం కంటే సోషల్మీడియా ఛానెల్లో ప్రమోషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ► మీ పోటీదారులు ఎవరు, వారు సోషల్ మీడియాలో ఏమేం చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారో చూడండి. వారిని ఫాలో అవడం ద్వారా మీ లోపాలను సులభంగా గుర్తించి, సరి చేసుకోవచ్చు. అంతేకాదు, సబ్స్క్రయిబర్లను పెంచుకునే వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ► ప్రతిరోజూ ఉండాలి కదా అని ఏదో ఒకటి పోస్ట్ చేయకండి. అది మీ వ్యూవర్స్ని పెంచదు. ప్రతి పోస్ట్ మీ లక్ష్యానికి చేరువ చేస్తుందా అని నిర్ధారించుకోండి. క్వాలిటీ కంటెంట్పైనే దృష్టి పెట్టండి. ► సాధారణంగా కొందరు రెచ్చగొట్టే చర్చలను, వివాదాలను సృష్టించడానికి ట్రోల్ చేస్తారు. దీనివల్ల సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లను సంతోషపెట్టలేరు. అలాగని, మీపై ట్రోల్ చేయడంలో వారి పూర్తి పాయింట్ అదే కాబట్టి ట్రోల్లను విస్మరించకూడదు. ► అన్ని సామాజిక ఛానెల్స్ కంటెంట్ను మానిటైజ్ చేస్తున్నందున జాగ్రత్తపడాలి. వార్తలు, వినోదం కోసం ఫేస్బుక్, బ్లాగ్ పోస్ట్లకు ట్విటర్, ఫోటోలు, వీడియోలకు ఇన్స్టాగ్రామ్, ఇండస్ట్రీలకు సంబంధించిన కథనాలకు లింక్డ్ ఇన్.. ఇలా దేనికది ఎంచుకోవాలి. ► మీ ప్రతిస్పందనలోనూ నిజాయితీగా ఉండండి. సోషల్మీడియా ఉనికికి సంబంధించిన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ► హాష్ట్యాగ్ల విషయాలపై సరైన పరిశోధన చేయండి. లేకుంటే, హ్యాష్ట్యాగ్లు మీ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రకటనలు ఎలా చేయాలి? ప్రకటనలు స్పష్టంగా, ప్రముఖంగా, మిస్ చేయడం చాలా కష్టంగా ఉండే విధంగా ఎండార్స్మెంట్ సందేశంలో ఉంచాలి. హ్యాష్ట్యాగ్లు లేదా లింక్ల సమూహంతో యాడ్స్ను బహిర్గతం చేయకూడదు. వ్యూవర్స్ గమనించే విధంగా ప్రకటనల ఎండార్స్ మెంట్ ఇమేజ్పై ఉంచాలి. ప్రకటనలు ఆడియో, వీడియో ఫార్మాట్లో చేయాలి. ప్రకటనలు మొత్తం లైవ్స్ట్రీమ్లో ప్రదర్శించాలి. సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ ఉండాలి. తగిన శ్రద్ధ .. ►సెలబ్రిటీలు/ఇన్ఫ్లుయెన్సర్లు ప్రకటనలో చూపిన విధంగా ఆ ఉత్పత్తులను తాము వాడి, ప్రయోజనం పొందేలా కూడా ఉండాలి. ఉత్పత్తి, సేవ తప్పనిసరిగా ఎండార్సర్ ద్వారా ఉపయోగించబడి ఉండాలని కూడా సిఫార్సు చేయబడింది. ► ఒక ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించి వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తమ బ్రాండ్ దుస్తులను ధరించమని, ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల కోసం కంటెంట్ను రూపొందించమని కోరాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్లో కంటెంట్ను పోస్ట్ చేస్తే ఆ బ్రాండ్స్ను ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయనట్లయితే, వారి అభిప్రాయం పక్షపాతంగా లేదా తప్పుదారి పట్టించేదిగా ఉందనుకోవాలి. ► ఏదైనా మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయడంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఫెయిల్ అయితే వినియోగదారుల రక్షణ చట్టం – 2019 కింద చట్టం ప్రకారం కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఉచిత ఉత్పత్తుల వల్ల.. వ్యూవర్స్ నిర్ణయాలు లేదా అభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న ప్రముఖ వ్యక్తులు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యూవర్స్ అభిప్రాయాలపై బలమైన ప్రభావంతో ఉత్పత్తుల, సేవలను ప్రకటించే సృష్టికర్తలు మాత్రమే. ప్రకటనల కంపెనీలు వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటాయి. ట్రిప్స్ లేదా హోటల్ వసతి, ఉచిత ఉత్పత్తులు, అవార్డులు.. మొదలైనవి జత చేస్తారు. ఇక, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు కంప్యూటర్ సృష్టించిన వ్యక్తులు. వీటి ద్వారా కూడా యాడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాయి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
TS: టీచర్ల పదోన్నతులు, బదిలీలు షురూ
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ రూపొందించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. 6, 7 తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో నేరుగా అందించాల్సి ఉంటుంది. ఈ నెల 12, 13 తేదీల్లో అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్15న ఆన్లైన్లోనే ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడతారు. ఆ తర్వాత వరుసగా అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల బదిలీల ఆదేశాలు జారీ చేస్తారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఏక కాలంలో చేపడతారు. అయితే, ముందుగా హెచ్ఎంలను బదిలీ చేస్తారు. ఈ విధంగా అయిన ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల కల్పించి, బదిలీలు చేస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతుల ద్వారా భర్తీ అయిన స్థానాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించి, వారిని బదిలీలు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 3వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 5 నుంచి 19 వరకూ బదిలీలు, పదోన్నతులపై అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సీనియారిటీ జాబితా రూపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేయాల్సి ఉంది. జనవరి షెడ్యూల్కు స్వల్ప మార్పులు ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన షెడ్యూల్కు స్వల్ప మార్పులు చేశారు. ఒకే స్థానంలో మూడేళ్ళు పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. టీచర్లు గరిష్టంగా 8 ఏళ్ళు, హెచ్ఎంలు 5 ఏళ్ళు ఒకేచోట పనిచేస్తే విధిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ సర్విస్ కటాఫ్ తేదీ గతంలో ఫిబ్రవరి 1గా ఉండేది. ఇప్పుడు దీన్ని సెపె్టంబర్ 1గా నిర్ణయించారు. ఈ కారణంగా మరికొంతమంది బదిలీలకు అర్హులవుతారు. రిటైర్మెంట్కు 3 ఏళ్ళలోపు సర్వీస్ ఉంటే బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. కటాఫ్ తేదీ మారడంతో ఈ విభాగంలోనూ కొత్తగా వచ్చే సర్విస్ను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆన్డ్యూటీ పొందే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సీనియారిటీలో పది పాయింట్లు ఇవ్వడాన్ని కోర్టు వ్యతిరేకించింది. దీంతో ఈ ఆప్షన్ తొలగించి కొత్త సీనియారిటీ జాబితాను రూపొందించాల్సి ఉంది. సీనియారిటీ దగ్గరే తికమక ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికారులు టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. దాదాపు 10 వేల మంది పదోన్నతులకు, 58 వేల మంది బదిలీలకు అర్హులని లెక్కగట్టారు. అయితే, సినియారిటీ జాబితా రూపకల్పన చేయాలని అధికారులు ఆదేశించినా, అందుకు తగిన మార్గదర్శకాలు ఇవ్వలేదని డీఈవోలు అంటున్నారు. ఈ కారణంగా అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీని పదోన్నతి కోసం రూపొందించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎస్ఏల్లో ఫిజిక్స్, మేథ్స్.. ఇలా వివిధ సబ్జెక్టుల బోధకులు ఉంటారు. కేటగిరీ వారీగా సీనియారిటీని తీసినప్పుడు ఒకరి కన్నా ఎక్కువ మంది తేలినప్పుడు ఎవరిని మొదటి స్థానంలో ఉంచాలని, ఎవరికి హెచ్ఎం పదోన్నతి కల్పించాలనేది ఇబ్బందిగా ఉందని డీఈవోలు చెబుతున్నారు. హెచ్ఎం పోస్టులు మల్టీ జోనల్ అయినప్పుడు 14 జిల్లాల ఎస్ఏ సీనియారిటీని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఉద్యోగి చేరిన తేదీ, డీఎస్సీలో వచ్చిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని సీనియారిటీ రూపొందిస్తారు. అప్పటికీ ఒకరికన్నా ఎక్కువ ఉంటే, డీఎస్సీలో ప్రతీ సబ్జెక్టులో వచ్చిన మార్కులు, జాయినింగ్ తేదీ, ఇంకా కావాలంటే పుట్టిన తేదీని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మార్గదర్శకాలు వస్తే తప్ప ఇది సాధ్యం కాదని డీఈవోలు అంటున్నారు. వికలాంగుల విషయంలోనూ ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. 40 శాతం అంగవైకల్యాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కోర్టు తెలిపింది. గత షెడ్యూల్లో 70 శాతం వైకల్యాన్ని అర్హతగా పేర్కొన్నారు. -
పంచాయతీరాజ్లో పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో పనిస్తున్న ఎంపీడీవోలకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీఎల్డీవో) గా, మరో 167 గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఈవోపీఆర్డీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి 2007 గ్రూపు–1 నోటిఫికేషన్ ద్వారా ఎంపీడీవోలుగా ఉద్యోగాలు పొందిన మొత్తం 66 మంది సీనియారిటీ జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదం తెలిపినట్టు పంచాయతీరాజ్ శాఖ ఇన్చార్జి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం వెల్లడించారు. కాగా.. 66 మంది ఎంపీడీవోల సీనియారిటీ జాబితాల్లో 14 మందిపై వివిధ శాఖాపరమైన అభియోగాలు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. సీనియారిటీ జాబితాలో శాఖాపరమైన అభియోగాలు పెండింగ్ లేని ఎంపీడీవోల పదోన్నతులకు పూర్తి స్థాయిలో అర్హులుగా వివరించారు. కాగా.. పూర్వం మేజర్ గ్రామ పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ అధికారులు(ఈవో)గా, గతంలో విలేజి డెవలప్మెంట్ అధికారులు(వీడీవో)గా పనిచేసి ప్రస్తుతం గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న వారితోపాటు మండల, జిల్లా పరిషత్ కార్యాలయాలు, డీపీవో కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న 167 మందికి ఈవోపీఆర్డీలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి ఆమోదం తెలిపారు. ఈవోపీఆర్డీలుగా పదోన్నతులు కల్పించినందుకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ ఒక ప్రకటనలో సీఎం జగన్మోహన్రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
పదోన్నతులకు ‘సర్దుబాటు’ గండం
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) సర్దుబాటు ప్రక్రియ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం గతేడాది ఆగస్టులో రాష్ట్రంలోని 5,138 మంది వీఆర్వోలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేసింది. జూనియర్ అసిస్టెంట్ కేడర్లో వీరిని నియమించింది. అయితే రెవెన్యూ శాఖలో సుదీర్ఘంగా పనిచేసిన తమ సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని తాము వెళ్లిన కొత్త శాఖల్లో పదోన్నతులు కల్పించాలని, అప్పటివరకు ఆయా శాఖల్లో పదో న్నతులు ఇవ్వద్దని పాత వీఆర్వోలు కోర్టులకు వెళ్లడం, వీరి అభ్యర్థన మేరకు కోర్టులు స్టేలు ఇస్తుండడంతో పలు శాఖల్లో శాఖాపరమైన పదోన్నతులకు బ్రేక్ పడుతోంది. ఈ తరుణంలో పదోన్నతులకు కోర్టుల రూపంలో రెడ్ సిగ్నల్ పడుతుండడంతో ఆయా శాఖల ఉద్యోగులు, ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నత విద్య, వైద్య శాఖల్లో ఆటంకాలు ఉన్నత విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల్లో అర్హత గల జూనియర్ అసిస్టెంట్లకు 10% కోటా ఉంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న సిబ్బందితో ఆ శాఖ అధికారులు జేఎల్ పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితా తయారు చేశారు. అయితే ఇదే శాఖలో సర్దుబాటు అయిన వీఆర్వో ఒకరు తనకు కూడా జేఎల్ ఉద్యోగం చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, రెవెన్యూ శాఖలో పనిచేసిన తన సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ జాబితాలో తన పేరు కూడా చేర్చేలా ఆదేశాలివ్వాలని, అప్పటివరకు ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయన అభ్యర్థన మేరకు జేఎల్ పదోన్నతులపై స్టే విధిస్తూ ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల విషయంలోనూ ఇదే జరిగింది. సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ పలువురు సర్దుబాటు వీఆర్వోలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసింది. -
‘టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు కోర్టు తీర్పుకు లోబడే ఉండాలి’
హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను కోర్టు తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం నడాఉ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ‘పూర్తి పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ తరఫున వ్యక్తిగతంగా మెసేజ్లు పంపాలి. ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. జిల్లాల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారాలను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలి’ అని మంత్రి సబితా ఆదేశించారు. -
టీచర్ల బదిలీలు,పదోన్నతులకు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతోందని ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ నేతలు తెలిపారు. విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డిని సంఘం నేతలు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీఎమ్మెల్సీ పూల రవీందర్ కలిశారు. ప్రభు త్వం బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు గతంలో జారీ చేయగా, ఇందుకు సంబంధించిన జీఓ నంబరు 5కు అసెంబ్లీ చట్టబద్ధత లేదనే కారణంగా కొంతమంది కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలైనా ఆగిపోయా యి. అయితే, జీఓ 5 అమలుకు శాసనసభ ఆ మోదం పొందే ప్రతిపాదనలు విద్యాశాఖ సమర్పించినట్టు మంత్రి సబిత శుక్రవారం పీఆర్టీయూ టీఎస్ నేతలకు తెలిపారు. ఇందుకు మంత్రి సబితకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం జగన్తోనే విద్యాభివృద్ధి
పటమట(విజయవాడతూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాభివృద్ధికి కంకణం కట్టుకుని పేద విద్యార్థుల భవిష్యత్ కోసం అహరి్నశలు శ్రమిస్తున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–1998 వారికి ఉద్యోగాలు, వేలాదిమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు నాడు–నేడు, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి యోధుడిలా కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరింత మేలు కలిగేందుకు ఉపాధ్యాయులందరూ సీఎం వైఎస్ జగన్కు అండగా నిలవాలని కోరారు. టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికను రూపొందిస్తున్నారని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీలను ఉపాధ్యాయులు సన్మానించారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. వైఎస్సార్ టీఎఫ్ ప్రధాన కార్యదర్శి గడ్డెల సుదీర్, గౌరవ అధ్యక్షుడు జాలిరెడ్డి, వ్యవస్థాపకులు ఓబులాపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
AP: ‘కారుణ్య’ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కారుణ్య నియామకం కింద టైపిస్ట్, ఎల్డీ టైపిస్ట్, యూడీ టైపిస్ట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పొందినవారు కంప్యూటర్ పరీక్ష పాసైతే వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినవారు ఇక నుంచి తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనకు స్వస్తి చెబుతూ సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శి పోలా భాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఉద్యోగులు రెండేళ్లలోపు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్లో ఉత్తీర్ణత సాధిస్తే వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు స్పష్టంచేశారు. ఈ మేరకు గత నిబంధనలను సడలించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు ఎంతోకాలంగా ఇబ్బందిపడుతున్న కారుణ్య నియామక ఉద్యోగుల సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం కారుణ్య నియామకం కింద టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు పొందినవారు తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ టెస్ట్ పాస్ అయితేనే వారి సర్వీసు రెగ్యులర్ చేసేవారని, టైపింగ్కు ప్రాధాన్యత తగ్గిపోవడంతో అది నేర్పించేవారు లేక, ఆ పరీక్ష పాస్ కాలేక చాలామంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి రెగ్యులర్ కాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాము సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కారుణ్య నియామకం ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల నుంచి మినహాయింపు ఇచి్చందని వివరించారు. ఇది కూడా చదవండి: ‘అప్పటికీ సునీతమ్మ ఫోన్ చేయలేదు.. ఇప్పుడు బతికున్నోళ్లను బజారుకీడుస్తోంది’ -
LGM Promotions Photos: ఎల్జీఎం ప్రమోషన్లో ధోని భార్య సాక్షి (ఫొటోలు)
-
ముంబయిలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి (ఫొటోలు)
-
వీఆర్వో, వీఆర్ఏలకు గుడ్ న్యూస్!
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో అర్హత కలిగిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరినట్లు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సంఘం ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద రవీంద్రరాజు మాట్లాడారు. ప్రస్తుతం వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉందని, దీంలో చాలా మంది వీఆర్వోలకు సీనియర్ సహాయకుల పోస్టులు రావడం లేదన్నారు. వీఆర్వోల పదోన్నతుల్లో 70 శాతం రేషియో ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో ఎవరైనా వీఆర్వో చనిపోతే అతని కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు ద్వారా ఉద్యోగం ఇవ్వాలని కోరామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ నుంచి వీఆర్వోకు అర్హత కల్గిన 1,500 మందికి అర్హత పరీక్ష నిర్వహించి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తాము లేవనెత్తిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఏపీ గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వీఎస్ దివాకర్, సీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: టీచర్ల వల్లే విద్యార్థులకు మంచి భవిత -
తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారులకు పదోన్నతులు, బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ లైఫ్ వార్డెన్గా లోకేశ్ జైశ్వాల్, హరితహారం పీసీసీఎఫ్గా సువర్ణ, అటవీ ఉత్పత్తుల చీఫ్ కన్జర్వేటర్గా రామలింగం, జూపార్కుల సంచాలకులుగా వీఎస్ఎన్వీ ప్రసాద్ నియామకం అయ్యారు. భద్రాద్రి డీఎఫ్వో లక్ష్మణ్ రంజిత్ నాయక్ అటవీ అభివృద్ధి సంస్థకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్వోగా కిష్ట గౌడ్ నియామకం అయ్యారు. ఇది కూడా చదవండి: బెంచ్ మార్క్ సెట్ చేయాలని ఇలా చేశాను.. కేటీఆర్ కొడుకు హిమాన్షు -
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నష్టపోకుండా పదోన్నతులు
సాక్షి, అమరావతి : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంతోపాటు, ఇప్పటికే వారికి కేటాయించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు పొందిన వారికి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధిక సంఖ్యలో పదోన్నతులు పొందిన వారికి డిమోషన్ ఇవ్వకుండా, సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి.. అదే స్థానాల్లో కొనసాగించే దిశగా కసరత్తు చేస్తోంది. పదోన్నతులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ఉద్యోగులు ఎవరికీ నష్టంలేకుండా అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. అందుకు అనుగుణంగా సలహా మండలిని ఏర్పాటు చేసింది. వాస్తవ లెక్కలు తేల్చడం ద్వారా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నష్టపోకుండా చర్యలు చేపట్టనుంది. ♦ ప్రమోషన్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని విభాగాల్లోని అన్ని కేటగిరీల పోస్టులకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా పదోన్నతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ 2003 ఫిబ్రవరి 14న జీవో నంబర్ 5 జారీ చేసింది. ♦రిజర్వేషన్ ఉపయోగించుకొని ప్రమోషన్ పొందిన తర్వాత నుంచి ప్రమోషన్ పోస్టు సీనియారిటీ గణించి తదుపరి ప్రమోషన్ ఇవ్వడానికి అవకాశం కలి్పంచే ‘కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ’ని అమలు చేస్తూ 2009 ఫిబ్రవరి 20న సాంఘిక సంక్షేమ శాఖ జీవో నంబర్–26 జారీ చేసింది. ♦ కాన్సిక్వెన్సియల్ సీనియారిటీ వల్ల ఎస్సీ, ఎస్టీలకు న్యాయంగా దక్కాల్సిన ప్రాతినిధ్యం (ఎస్సీ–15 శాతం, ఎస్టీ–6శాతం) కంటే ఎక్కువ మంది ప్రమోషన్లు పొందారని, ఫలితంగా మిగతా ఉద్యోగులు నష్టపోతున్నారని సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వేసిన కేసుల్లో వారికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. జీవో–26ను రద్దు చేసి, వాస్తవంగా ఎస్సీ, ఎస్టీలు కేటాయించిన పోస్టులకు మించి ప్రమోషన్లు పొందిన వారి సంఖ్యను గణించి, మిగతా వారికీ న్యాయం చేయాలని తీర్పులు చెప్పాయి. ఈ నేపథ్యంలో సలహా కమిటీ సిఫార్సుల మేరకు అడుగులు ముందుకు వేయనుంది. పోస్టులెన్ని? ఎంత మంది ఉన్నారు? తెలంగాణ రాష్ట్రం కూడా సలహా కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్యానెల్లను సమీక్షించడానికి కసరత్తు చేపట్టింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా.. ఎస్సీ, ఎస్టీలు కేటాయించిన పోస్టుల కంటే ఎక్కువగా ఉన్న వారి కోసం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని నిర్ణయించింది. ఫలితంగా వారిని ఉన్న ఉద్యోగాల్లోనే తెలంగాణ ప్రభుత్వం కొనసాగించింది. అడిషనల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ కేటగిరీలుగా ఐదు సూపర్ న్యూమరీ పోస్టులు, 30 నోషనల్ ప్రమోషన్లను అనుమతించింది. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన పోస్టుల కంటే అధిక సంఖ్యలో ప్రమోషన్లు పొందిన పోస్టుల వివరాలు తీసుకొని నివేదిక సమర్పించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సచివాలయంలోని అన్ని ప్యానెల్లు, ప్రమోషన్లను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి ప్రభుత్వ అదనపు కార్యదర్శి వరకు అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. -
తమన్నా ఫోటోకు నెటిజన్ రిప్లై.. స్పందించిన విజయ్ వర్మ!
మిల్కీ బ్యూటీ తమన్నా, విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో గోవాలో కనిపించిన జంట.. ఆ తర్వాత చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్లో నటించారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా.. విజయ్తో ఉన్న బంధం గురించి తొలిసారి నోరు విప్పారు. విజయ్తో లవ్లో ఉన్నానని తమన్నా ప్రకటించారు. ఆ తర్వాత విజయ్ వర్మ సైతం తమన్నాతో రిలేషన్ నిజమేనని వెల్లడించారు. (ఇది చదవండి: Video: డెలివరీ డేట్ ఫిక్స్...ఆసుపత్రికి ఉపాసన!) తాజాగా వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఫోటోషూట్ నిర్వహించారు. ఆ ఫొటోలను తమన్నా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరలయ్యాయి. ఇవీ చూసిన ఓ నెటిజన్ ' అన్నీ తమన్నానే.. విజయ్ కేవలం ఓ నటుడు' మాత్రమే అంటూ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన విజయ్ వర్మ.. 'మీ మాటలను అంగీకరిస్తున్నా.. నాకు అన్నీ తమన్నానే' అంటూ రిప్లై ఇచ్చారు. విజయ్ ట్వీట్ చూసిన తమన్నా కూడా రిప్లై ఇస్తూ ఎమోజీలను జత చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్2 జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. దీని ప్రమోషన్స్ కోసం ఈ ప్రేమజంట ప్రత్యేక ఫొటోషూట్ చేసింది. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు) I kinda agree https://t.co/4SsbMUuJEl — Vijay Varma (@MrVijayVarma) June 19, 2023 -
TS: పోలీసు శాఖలో పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు గుడ్న్యూస్ చెప్పింది ప్రభుత్వం. పోలీసు శాఖలో పదోన్నతులకు ప్రభుతవం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 18 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలకు పదోన్నతి కల్పించింది. 37 మంది డీఎస్పీలను అడిషనల్ ఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో వారందరికీ గుడ్న్యూస్.. పెన్షన్ 4వేలకు పెంపు -
త్వరలో భోళా మానియా
‘భోళా శంకర్’ ఆగస్ట్ 11న థియేటర్కి రానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడే సమయానికి ప్రమోషన్స్ ఆరంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ముందుగా మ్యూజికల్ జర్నీప్రా రంభిస్తారు. ఆ విషయాన్ని తెలియజేసి, ‘భోళా మానియా త్వరలోప్రా రంభమవుతుంది’ అంటూ, చిత్రకథానాయకుడు చిరంజీవి రెండు చేతులను వెనక జేబులో పెట్టుకొని ఉన్న డ్యాన్స్ మూమెంట్ లుక్ని రిలీజ్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిపొంస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా, ఆయన సోదరి పాత్రలో కీర్తీ సురేష్ కనిపిస్తారు. ‘‘మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్, భారీ సెట్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. జూన్ నెలాఖరకు షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ప్రొడక్షన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి మంచి పాటలు ఇచ్చారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
‘జరా హట్కే జరా బచ్ కే’ మూవీ ప్రమోషన్స్లో సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ (ఫొటోలు)
-
Naresh - Pavitra: నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెకు అండగా ఉంటా: నరేశ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఈనెల 26న విడుదల చేయనుండగా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నరేశ్, పవిత్రా లోకేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ జంట తమ రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్కు వెళ్లిన ముద్దుగుమ్మ!) నరేశ్ మాట్లాడుతూ.. 'మళ్లీ పెళ్లి అనే సినిమా నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించింది కాదు. సమాజంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించాం. ఒత్తిడి, అనుమానం, అనుబంధాలు లేకపోవడం వంటి వాటివల్లే వివాహ వ్యవస్థ ప్రస్తుతం దెబ్బతింటోంది. వివాహాబంధంపై గౌరవానికి అద్దం పడుతూ దీన్ని రూపొందించాం. సోషల్మీడియాలో మాపై విమర్శలు వచ్చాయి. రివెంజ్ కోసమే సినిమా చేశానన్నారు. ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలంటే యూట్యూబ్లో వీడియోలు షేర్ చేయవచ్చు. రూ.15 కోట్లు పెట్టి రెండు భాషల్లో ఒక సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ప్రమేయంతో ఇవన్నీ వచ్చాయి. కొన్ని పరిస్థితుల తర్వాత నేను విడాకులకు అప్లై చేశా. ఆ తర్వాత మా ఇద్దరి బంధాన్ని బ్రేక్ చేయాలని చూసింది. ఆ వ్యక్తి పేరు చెప్పాలనుకోవడం లేదు. నన్ను నమ్మి పవిత్ర వచ్చింది. కాబట్టి నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటా’ అని అన్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్) పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' ఓ సినిమా షూటింగ్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మేమిద్దరం కలిసి వరుసగా సినిమాలు చేశాం. మా వ్యక్తిత్వం ఒక్కటే. ఏ విషయంలోనైనా పాజిటివ్గానే చూస్తాం. ఒకరిపై రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ట్రోల్స్ వచ్చినప్పుడు నేను ఎంతో బాధపడ్డా. నరేశ్ నాకు అండగా నిలబడ్డారు.' అని అన్నారు. -
నాకు కోపం వచ్చిందటే క్షమించరాని తప్పు చేసారని అర్థం అందుకే...
-
నా కూతురితో అలా ఉంటాను కాబట్టే...భానుమతి గారు నన్ను అలా చేసేసరికి నాకు
-
సంవత్సరానికి నేను 18 సినిమాలు చేస్తే..ఇప్పటి వాళ్లేమో..
-
త్వరలోనే పవిత్రా లోకేశ్ను పెళ్లి చేసుకుంటా: నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే.కొన్నాళ్లుగా ఈ జంట పేర్లు సోషల్మీడియలో తెగ ట్రెండింగ్లో ఉన్నాయి. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాక్ ఇచ్చిన ఈ జంట అదంతా సినిమా కోసమంటూ ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేశ్. ట్రైలర్తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసం మళ్లీ రెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ ఇటీవలె ముద్దులతో స్టేజ్పై రెచ్చిపోయిన నరేష్ తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి అభిప్రాయాలు, మనసు కలవడంతో కలిసి ఉంటున్నామని, అందరి ఆశీస్సులతో త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా అంటూ నరేష్ తెలిపాడు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'నిజానికి పెళ్లి అన్నది కశ్చితంగా అవసరం కాదు. చాలామంది ఇష్టం లేకపోయినా, సోసైటీ కోసం పెళ్లి బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్లందరికోసమే మళ్లీ పెళ్లి సినిమా. ఇది మా బయోపిక్ కాదు. పవిత్రకు నాకు ఇంకా పెళ్లి కాలేదు..కానీ త్వరలోనే చేసుకుంటా' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. -
నా గురించి రానా ఎందుకు అలా చెప్పాడో ఫోన్ చేసి కనుక్కోవాలి
-
చై నా ఫేవరెట్... కృతి శెట్టికి చైతన్య అంటే ఎంత ఇష్టమో చూడండి
-
నాగ చైతన్య, కృతి శెట్టి ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
విరూపాక్ష సక్సెస్ పై నాగచైతన్య ఊహించని కామెంట్స్
-
ఈ సినిమాలో అల్లరి నరేష్ తో చేయడానికి కారణం ఏంటంటే...
-
ఇండస్ట్రీలో ఉండాలా.. వద్దా.. అని తేల్చుకొని సినిమా చేశాను
-
నాగచైతన్య, కృతి శెట్టి ఇంటర్వ్యూ
-
మాళవిక బోల్డ్ కామెంట్స్.. సిగ్గుపడి మెలికలు తిరిగిపోయిన డైరెక్టర్!
‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. యంగ్ హీరో నాగశౌర్యతో ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి సినిమాలో కనిపించింది. ఆ చిత్రంలో బోల్డ్ సీన్స్లో తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం అన్నీ మంచి శకునములే అంటూ మరోసారి టాలీవుడ్ సినీ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. నందిని రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మే 18న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది భామ. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న 'తోడేలు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ప్రమోషన్లలో భాగంగా మాళవిక తన ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తాజాగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్తో కలిసి వీడియోలో కనిపించింది. ఆయనతో మాట్లాడుతూ.. 'నిన్ను ఉంచుకుంటాను అబ్బాయి' అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. దానికి అనుదీప్ సిగ్గుపడుతూ మరీ కళ్లు మూసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే చేసినా.. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంతే కాకుండా 'అలా అనుదీప్ గారిని ఉంచుకోవడం జరిగింది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: స్విమ్ షూట్లో బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్స్ ట్రోలింగ్!) View this post on Instagram A post shared by Malvika Nair (@malvikanairofficial) -
అందుకే విడాకులు తీసుకున్నా, సమంత సంతోషంగా ఉండాలి: చై
టాలీవుడ్ క్యూట్ కపుల్స్గా పేరొందిన నాగచైతన్య-సమంత విడిపోయి దాదాపు రెండేళ్లవుతుంది. కానీ ఇప్పటికీ వీరి విడాకుల అంశంపై సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే తొలిసారిగా నాగచైతన్య సమంతతో విడాకులపై స్పందించాడు. అంతేకాకుండా తాము విడిపోవడానికి గల కారణాలను కూడా బయటపెట్టాడు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి కస్టడీ ప్రమోషన్స్లో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ.. ''మేం విడిపోయి రెండేళ్లు అవుతుంది. చట్టపరంగా మాకు విడాకులు వచ్చి ఏడాది అవుతుంది. ఇద్దరం విడిపోయినా ఆమెతో కలిసి ఉన్న రోజులను చాలా గౌరవిస్తాను. నిజానికి సమంత మంచి అమ్మాయి. అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ వల్లే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి పెద్దవై చివరికి విడిపోవాల్సి వచ్చింది. మొదట్లో నేను కూడా రూమర్స్ గురించి అంతగా పట్టించుకోలేదు..కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. మేం విడిపోయినా ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉంది. కానీ మీడియా, వెబ్సైట్స్.. మాకు ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు చిత్రీకరించడం నా మనసును బాధపెట్టింది. అంతేకాకుండా నా గతంతో ఏమాత్రం సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వాళ్లను అగౌరవపరిచినట్లు వార్తలు రాశారు. అది చాలా చెత్త విషయం. జీవితంలో ప్రతీది ఒక గుణపాఠం లాంటిదే. ప్రతి దశలో ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఏం జరిగినా అంతా నా మంచికే అనుకుంటాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను'' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చై. చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్ -
నా భార్య నా బీభత్సాన్ని ఇంట్లో చాలా సార్లు చూసింది
-
Ponniyin Selvan 2: కొచ్చి లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ టీం ప్రమోషన్స్
-
Ponniyin Selvan 2: కొచ్చి లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ టీం ప్రమోషన్స్
Ponniyin Selvan 2: కొచ్చి లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ టీం ప్రమోషన్స్ -
అఖిల్ వైల్డ్ క్యారెక్టర్.. ఆ ఫీట్ ఏంట్రా బాబూ!
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఏజెంట్'. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రబృందం. ఈ సందర్భంగా విజయవాడలో ట్రైలర్ లాంఛ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అఖిల్ కళ్లు చెదిరిపోయే స్టంట్ ఏజెంట్ మూవీ ప్రమోషన్స్ను మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో ఈసారి చాలా కొత్తగా ట్రై చేశారు. విజయవాడలోని దాదాపు 172 అడుగుల భవనం పైనుంచి దుకుతూ ట్రైలర్ పోస్టర్ను ఆవిష్కరించాడు. ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు కాకినాడలోని ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్స్లో ‘ఏజెంట్’ ట్రైలర్ లాంఛ్ జరగనుందని పేర్కొన్నారు. ఈ వీడియోను మేకర్స్ తమ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే విడుదలైన అఖిల్ వైల్డ్ లుక్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. SAALA nahin! WILD SAALA 😎 That was a Crazy Event at Vijayawada as @AkhilAkkineni8 jumped off from 172 ft High to unveil the WILD POSTER 🔥 WILD MADNESS Loading in Theaters from APRIL 28TH💥#AGENTonApril28th @mammukka @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @Shreyasgroup pic.twitter.com/yJMKmQOTyc — AK Entertainments (@AKentsOfficial) April 16, 2023 -
ఉగ్రం మూవీ టీమ్ తో యాంకర్ సుమ చిట్ చాట్...
-
యాంకర్ సుమ అరెస్ట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మాటల ప్రవాహంతో 15ఏళ్లుగా స్టార్ యాంకర్గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కానీ, యాంకర్ సుమ మాత్రం పర్మినెంట్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టాక్ షోలైనా, గేమ్ షోలైనా సుమ ఉండాల్సిందే. పేరుకు మలయాళీ అయినా తెలుగులో గలగల మాట్లాడుతూ తన కామెడీ, పంచ్ టైమింగ్లతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఆమె లేకుండా స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు దాదాపు ఉండవని చెప్పాలి. అంతటి సామర్థ్యం ఉన్న సుమను తాజాగా అరెస్ట్ చేశారన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె చేతికి బేడీలు వేసి వ్యాన్లో తీసుకెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో సుమకి ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే సుమను నిజంగా అరెస్ట్ చేయలేదట. ఓ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇలా అరెస్ట్ చేశారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అల్లరి నరేస్ నటిస్తున్న సినిమా ఉగ్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సుమతో ఇలా స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేసారన్నమాట. CI Shiva Kumar on duty! Your favourite anchor is in my control. The #Ugram begins. Details at 5.04 PM. https://t.co/5aQDlhlNdN — Allari Naresh (@allarinaresh) April 12, 2023 -
బిత్తిరి సత్తితో సాయి ధరమ్ తేజ్ ముఖాముఖీ
-
శాకుంతలం మూవీ ప్రెస్ మీట్..
-
సమంత నాగచైతన్యను ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసిందా?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో బిజీగా మారిపోయింది సమంత. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా వ్యక్తిగత జీవితంలో జరిగిన అంశాలపై పరోక్షంగా కామెంట్స్ చేసింది. నా జీవితంలో ఇంత వరకు ఏం జరిగిందో అందరికి తెలుసు. నా లైఫ్ తెరిచిన పుస్తకం. ఎత్తుపల్లాల్ని పారదర్శకంగా అందరూ చూడవచ్చు. కానీ కొందరిలో విషయాలను దాచిపెట్టడం, ఫేక్గా ఉండటం నాకు నచ్చవు. నేను అలా ఉండలేను అంటూ సామ్ పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలు నాగచైతన్యను ఉద్దేశించే చేసినవంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడ్డానని, గత రెండేళ్లలో అస్సలు ఊహించని పరిణామాలు, జీవిత పాఠాలు ఎదురయ్యాయని సమంత పేర్కొంది. -
గ్రేడ్–2 వీఆర్వోల ప్రమోషన్కు మార్గం సుగమం
సాక్షి, అమరావతి: గ్రేడ్–2 వీఆర్వోలకు ప్రభుత్వం ప్రమోషన్ చానల్ కల్పించింది. ఈ మేరకు ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ సర్వీస్ రూల్స్ను సవరిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిప్రకారం గ్రేడ్–2 వీఆర్వోలకు ప్రమోషన్లకు అవకాశం ఏర్పడుతుంది. ఈ మేరకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1గా ప్రమోషన్ చానల్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్–166 ప్రతిని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రవీంద్రరాజుకు గురువారం అందజేశారు. ప్రభుత్వం జీవో జారీ చేయడంపై రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్ రెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు దేవరాజు, గోపాలకృష్ణ, ఆరుమళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించినా లెక్కచేయలేదు: సమంత
సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది యశోద చిత్రంతో అభిమానులను పలకరించింది. ఆ సమయంలో సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్లలో బిజీ పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత తన ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలను పంచుకున్నారు. సమంత మాట్లాడుతూ.. 'మయోసైటిస్ నిర్ధారణ కాగానే మొదట్లో చాలా బలహీనంగా అనిపించేది. యశోద చిత్ర సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినా కూడా ప్రమోషన్స్లో పాల్గొన్నా. ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఓపిక ఉండేది కాదు. చాలా మందులు వాడాల్సి వచ్చేది. సినిమాను బాధ్యతగా భావించి కష్టమైన సరే ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. అయితే ప్రస్తుతం ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తోంది. మయోసైటిస్ నుంచి కోలుకుని ధైర్యంగా ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. శాకుంతలం చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గుణశేఖర్ కథ చెప్పగానే మొదట తిరస్కరించినట్లు తెలిపింది. అందుకు కారణం మూడేళ్లుగా తనలో ఉన్న భయమేనని అన్నారు. కానీ గుణశేఖర్ ఒప్పించి మరీ నటించేలా చేశారని వెల్లడించారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ప్రత్యేక వ్యాయామాలు, వర్కవుట్లు, డైట్ కూడా మార్చుకున్నట్లు వివరించారు. ఈ చిత్రాన్ని వదులుకుంటే తన కల సాకారమయ్యేది కాదన్నారు. కాగా.. శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్, సచిన్ ఖేడ్కర్, మోహన్బాబు, అదితి బాలన్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
8 వారాల్లో సమీక్షించండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో పదోన్నతులపై 8 వారాల్లో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2018లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలపై ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావలీ శుక్రవారం విచారణ చేపట్టారు. విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాది ఉమాదేవి వాదనలు వినిపిస్తూ పదోన్నతుల సమీక్షకు ఆరు నెలల సమయాన్ని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది మహమ్మద్ అదనాన్ వాదనలు వినిపిస్తూ.. ఇంకా ఆరు మాసాలు గడువు కోరడం సరికాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, జూనియర్ లైన్మన్ స్థాయి నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు కల్పించిన పదోన్నతులన్నింటినీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించాలన్నారు. నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి ఎనిమిది వారాల్లో హైకోర్టుకు నివేదిక సమర్పించాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోడెపాక కుమారస్వామి, వైస్ చైర్మన్ ఆర్.సుధాకర్ రెడ్డి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, కో–కన్వినర్ సి.భానుప్రకాశ్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. వెంటనే కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ముంబైలో కీర్తి.. ఎత్తిన బాటిల్ దించకుండ తాగి షాకిచ్చిన ‘మహానటి’
‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో నాని హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన దసరా మార్చి 30న ఘనంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం దేశంలోని పలు నగరాలను పర్యటిస్తోంది. ఈ క్రమంలో ముంబైలో నిర్వహించిన ప్రమోషన్స్లో నాని, కీర్తి సురేశ్, ఇతర మూవీ టీం సభ్యులతో పాటు స్పెషల్ గెస్ట్గా రానా దగ్గుబాటి హాజరయ్యాడు. చదవండి: అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్.. ఇదిలా ఉంటే ఈ ముంబైలోని ప్రమోషన్స్ ఈవెంట్స్ హీరోయిన్ కీర్తి కల్లు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చేతితో పట్టుకోకుండా ఎత్తిన బాటిల్ను దించకుండ తాగి అక్కడి వారందరికి షాకిచ్చింది. కీర్తిని అలా చూసి హీరో రానా-నాని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా తెలంగాణ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో నాని ఊరమాస్ లుక్లో కనిపంచనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు సీన్లలో నిజంగానే తాగి నటించినట్లు నాని వెల్లడించాడు. ఏకంగా ఓ సీన్లలో అయితే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండ తాగానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. చదవండి: జూనియర్తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్ ఈ క్రమంలో ముంబై ప్రమోషన్స్లో భాగంగా హీరోలు నాని, రానాలతో పాటు కీర్తికి కూడా కళ్లు తాగే టాస్క్ ఇచ్చారు హోస్ట్. ఇందులో భాగంగా కీర్తి గుటుక్కున కళ్లు బాటిల్ ఎత్తేసింది. కాగా ‘మహానటి’లో సంప్రదాయంగా కనిపించిన కీర్తి ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫుల్ గ్లామర్ షో చేస్తోంది. ఫొటో షూట్స్లో అందాల ప్రదర్శన చేస్తూ తరచూ ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తోంది. కీర్తి ఇలా చూసి ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. కీర్తికి ఏమైంది.. ఇలా రెచ్చిపోతుందంటూ తన పోస్ట్స్పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. #DhoomDhaam storm in Mumbai as the crazy trio @NameisNani, @KeerthyOfficial & @RanaDaggubati recreate the hookstep of the Mass Song ❤️💃🏾#DhoomDhaam video song out today at 5:04 PM 🔥#Dasara #DasaraOnMarch30th@odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/1E7Q1qGJhm — SLV Cinemas (@SLVCinemasOffl) March 22, 2023 -
గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే!
అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్ కంపెనీలు లేఆఫ్లను అమలు చేస్తూ వందలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్ కూడా ఇటీవలి కాలంలో అనేకమంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రమోషన్ల విషయంలోనూ గూగుల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ ప్రమోషన్లు ఉంటాయని ఉద్యోగులకు గూగుల్ సమాచారం అందించినట్లు సీఎన్బీసీ కథనం పేర్కొంది. ప్రమోషన్లు కొందరికే... ప్రమోషన్ల ప్రక్రియ గతంలో మాదిరిగానే మేనేజర్ల నేతృత్వంలో ఉండనుంది. అయితే నియామాలు పెద్దగా చేపట్టకపోవడంతో ఈ ఏడాది ప్రమోషన్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటాయని పేర్కొంది. అది కూడా ఎల్ 6, ఆపై స్థాయిలోనే ప్రమోషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త పనితీరు సమీక్ష వ్యవస్థ ప్రకారం సీనియర్లు, నాయకత్వ స్థాయిలో తగినంతమంది ఉద్యోగులు ఉండాలి. అందుకు అనుగుణంగా ఈ ప్రమోషన్లు ఉంటాయని యాజమాన్యం ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. కంపెనీలో మధ్య స్థాయిలో పనిచేసే ఉద్యోగులే కీలకం.. ప్రమోషన్లపై వారిలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం కంపెనీ గత ఏడాదే ఒక అంతర్గత సర్వేను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల కోసం మార్చి 6 నుంచి 8 తేదీల మధ్య స్వయంగా నామినేట్ చేసుకోవచ్చని గూగుల్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో పేర్కొంది. ఆర్థిక సంక్షోభం కారణంగా గూగుల్ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. అయితే తొలగించిన ఉద్యోగులకు స్థానిక చట్టాలకు అనుగుణంగా పరిహారాలను అందిస్తున్నట్లు అప్పట్లో ఆయన వెల్లడించారు. -
దసరా హిందీ వెర్షన్ ప్రమోషన్లో నాని (ఫోటోలు)
-
హీరోయిన్ రితికా సింగ్కు చేదు అనుభవం
రితికా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది. రియల్ బాక్సర్ అయిన రితికా.. గురు మూవీతో హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేసి.. తొలి చిత్రానికే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ‘నీవెవ్వరో’ సినిమా చేశారు. ఇక తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా ఇన్ కార్ అనే మూవీలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో రితికాకు చేదు అనుభవం ఎదురైంది. చదవండి: తొలిసారి జిమ్లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? ఆమెపై తమిళ మీడియా ప్రతినిధులు ఫైర్ అయిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. చెప్పిన టైం కంటే ఆలస్యంగా వచ్చినందువల్లే రితికాపై మీడియా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రిసెంట్గా చెన్నైలో ఇన్ కార్ ప్రమోషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం జరగాల్సిన ఈ సమావేశానికి రితికా మూడు గంటలు ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో ఆమె కార్యక్రమానికి రాగానే మీడియా ప్రతినిథులు రితికాపై గుర్రుమన్నారు. చెప్పిన టైం కంటే మూడు గంటలు లేటు వచ్చారని, ఇలా వేయిట్ చేయించడం కరెక్ట్ కాదంటూ ఆమెపై మండిపడ్డారు. దీంతో రితికా మీడియాను క్షమాపణలు కోరారు. చదవండి: 47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఇది నేను కావాలని చేయలేదు. మిస్ కమ్యునికేషన్ వల్ల ఆలస్యమైంది. ప్రొగ్రామ్ టైం రాత్రి 9 గంటలకు అని నాకు మెసేజ్ పెట్టారు. కావాలంటే ఆ మెసేజ్ కూడా చూపిస్తా. నేను చెప్పిన టైంకే వచ్చాను. అయినప్పటికీ నన్ను క్షమించండి’ అని ఆమె వివరణ ఇచ్చారు. అయితే ఈ ప్రొగ్రామ్ సాయంత్రం 6, 7 గంటల మధ్యలో జరగాల్సి ఉండగా మిస్ కమ్యుకేషన్ వల్ల ఆలస్యమైందని తెలుస్తోంది. కాగా రితికా తమిళంలో చివరగా ఓ మై కడువలే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో పిచ్చకారై 2(బిచ్చగాడు 2), వనంగ ముడి, కొలై వంటి చిత్రాలు ఉన్నాయి. -
పదోన్నతుల్లో న్యాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల కల్పనలో తమకు న్యాయం చేయాలని 2009 బ్యాచ్ ఎస్సైలు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు విన్నవించారు. ఈ మేరకు సోమవారం 2009 బ్యాచ్కు చెందిన దాదాపు 85 మంది వరకు సబ్ ఇన్స్పెక్టర్లు బీఆర్కేఆర్ భవన్ వద్ద మంత్రి కేటీఆర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. 175 పోస్టులు ఖాళీగా ఉన్నా సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు దక్కకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసు రూల్స్లో స్పష్టత లేని కారణంగా తమకు పదోన్నతులు రావడం లేదని వివరించారు. 2009 బ్యాచ్లో మొత్తం 435 మంది సబ్ ఇన్స్పెక్టర్లలో ఇప్పటికే 220 మంది సీఐలుగా ప్రమోషన్లు పొందారని, మరో 215 మందికి పదోన్నతులు రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రమోషన్లు పొందిన తమ బ్యాచ్మేట్లు సీఐలుగా పనిచేస్తున్న చోటే తాము ఎస్సైలుగా పనిచేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాతజోన్ల విధానంలో లేదంటే నూతన మల్టీ జోన్ విధానంలో అయినా సరే తమకు వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. డీజీపీ అంజనీకుమార్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్టు ఎస్సైలు తెలిపారు. -
50,000 మంది టీచర్లకు బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఈ అంశంపై అధికారులతో చర్చించారు. శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె సమీక్షించారు. మరోవైపు పదోన్నతులకు వీలుగా ఖాళీలను లెక్క తేల్చే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది టీచర్లకు స్థాన చలనం కలగనుంది. ఒకేచోట 8 ఏళ్ల సర్వీసు నిండి అనివార్యంగా బదిలీ అవ్వాల్సిన వాళ్లు 25 వేల మంది ఉంటే..ఐదేళ్లుగా ఒకే స్కూల్లో పనిచేస్తున్న 25 వేల మంది కూడా బదిలీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదిలావుండగా పలు ఉపాద్యాయ సంఘాలు బదిలీలు ప్రహసనంగా మారాయని, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లుకు కోరిన ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధికారులను నిలదీస్తే పైనుంచే పైరవీలు వస్తున్నాయని వారు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని, దీనిపై ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి. సొంత జిల్లాల్లో ఖాళీలన్నీ స్పౌజ్లతోనే భర్తీ! భార్యాభర్తల (స్పౌజ్) బదిలీలకు ప్రభుత్వం అనుమతించడం టీచర్ల పదోన్నతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్పౌజ్ల్లో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వీళ్లంతా స్కూల్ అసిస్టెంట్లు. 317 జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు బదిలీ అయ్యారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో 70 శాతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జీటీలు) పదోన్నతులు ఇవ్వడం ద్వారా, 30 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రస్తుతం దాదాపు 427 మంది స్పౌజ్లను సొంత ప్రాంతాలకు పంపుతున్నారు. ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ స్థానాల్లో ముందుగా వీరిని నియమిస్తారు. ఫలితంగా 13 జిల్లాల్లో ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్స్గా పదోన్నతి పొందేందుకు ఉన్న ఖాళీల సంఖ్య తగ్గే అవకాశం కన్పిస్తోంది. ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టుల్లో పదోన్నతులకు ఎక్కడా అవకాశం లేకుండా పోతోంది. దీనిపై ఎస్జీటీలు మండిపడుతున్నారు. మరోవైపు స్పౌజ్లు తిరిగి తమ జిల్లాలకు రావడంతో, వారు ఇప్పటివరకు పనిచేసిన 19 జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో తక్కువ సీనియారిటీ ఉన్న ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం వస్తోంది. ప్రక్రియ మొదలుకాక ముందే బదిలీలు! బదిలీల ప్రక్రియ మొదలవ్వక ముందే దాదాపు 120 మందిని కోరుకున్న ప్రాంతాలకు పంపుతూ ఉత్తర్వులు వెలువడటం తీవ్ర దుమారం రేపుతోంది. మరో 200 వరకు ఇదే విధమైన సిఫారసులు వచ్చినట్టు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై ఉపాధ్యాయ నేతలు మంత్రి సబిత వద్ద తీవ్ర నిరసన తెలిపారు. మరోవైపు పైరవీల జోరు పెరగడంతో టీచర్లు కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నేతలను, రాజకీయ ప్రముఖులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది మధ్యవర్తులు పుటుకొస్తున్నారు. పైనుంచి బదిలీ ఆదేశాలు తెప్పిస్తామని చెబుతూ రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నేటి నుంచి నిరసనలు: యూటీఎఫ్ బదిలీల్లో పైరవీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి నిరసనలు చేపట్టాలని ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చినట్లు టీఎస్ యూటీఎఫ్ నేత చావా రవి తెలిపారు. ప్రభుత్వమే పైరవీలకు తెరలేపడం టీచర్లలో అంశాంతి కల్గిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లందరికీ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. 29న డైరెక్టరేట్ ముట్టడి: టీఎస్పీటీఏ స్పౌజ్ టీచర్లు 2,200 మంది వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే ఓటు హక్కు ఉండే 625 మంది స్కూల్ అసిస్టెంట్లకే బదిలీకి కల్పించడం అన్యాయమని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ అన్నారు. మిగతా స్పౌజ్ల సంగతి తేల్చకుంటే 29న పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. బారులు తీరిన టీచర్లు ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించి నల్లగొండలో ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలనకు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం (డైట్) వద్ద బారులుదీరారు. – నల్లగొండ -
ఆసక్తిగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ప్రమోషన్స్, వరంగల్లో మూవీ టీం బ్రేకప్ పార్టీ
కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్నఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, చిత్ర టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈమూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్తో బిజీగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ను కాస్తా ఆసక్తికరంగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. గతంలో వీవీఐటీ గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్తో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడిన మూవీ టీం ఇందులో గెలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పోందుకున్న ప్లేయర్తో ఆ సినిమాలోని సెకండ్ సింగిల్ను లాంచ్ చేయించారు. ఇప్పుడు మరో సరికొత్త ఈవెంట్కు ప్లాన్ చేశారు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా వరంగల్లోని కే స్ట్రీట్లో ఈ మూవీ టీం ఒక బ్రేకప్ పార్టీని సెలెబ్రేట్ చేయనుంది. జనవరి 29న నిర్వహించే ఈ బ్రేకప్ పార్టీకి నిర్మాత బన్నీ వాసు, హీరో కిరణ్ అబ్బవరం హాజరు కానున్నారు. ఏదేమైనా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లడానికి విభిన్న తరహాలో ప్రొమోషన్స్ నిర్వహిస్తూ చిత్రం బృందం మూవీ హైప్ క్రియేట్ చేస్తోంది. -
టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల.. లీక్పై డైరెక్టర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ సోమవారం అనధికారికంగా బయటకొచ్చింది. అందుబాటులోకి వచ్చిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచి మొదలయ్యే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మార్చి 4వ తేదీతో ముగియనుంది. షెడ్యూల్ ఇలా... ♦జనవరి 27న అన్ని కేటగిరీల్లో ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్లో ప్రకటిస్తారు. ♦28 నుంచి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు ♦జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 లోపు.. దరఖాస్తుల హార్డ్ కాపీలను హైసూ్కల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈఓకు సమర్పించాలి ♦ఫిబ్రవరి 3–6 తేదీల మధ్య దరఖాస్తుల హార్డ్ కాపీలను ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డీఈఓ కార్యాలయంలో సమరి్పంచడం, పరిశీలన.. ఆన్లైన్లో ఆమోదం. ♦7న డీఈఓ/ఆర్జేడీ వెబ్సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ, పదోన్నతుల సీనియారిటీ జాబితాలు ప్రకటిస్తారు. ♦8 నుంచి 10 వరకు మూడురోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, పరిష్కారం జరుగుతుంది. ♦11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటన, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు. ♦13న మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునఃపరిశీలన చేసుకోవచ్చు. ♦14న ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల. ♦15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన. ►16, 17, 18 తేదీల్లో అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్ జరుగుతుంది. ►19, 20 తేదీల్లో సబ్జెక్ట్ వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన, బదిలీ ఆప్షన్స్ నమోదు. ►21న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం. ►22, 23 తేదీల్లో డీఈఓలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల. ►24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన. ►25, 26, 27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు (కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు) మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు. ►ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్ ఆప్షన్ల నమోదు. ∙3న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలన. ►4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల. ►5 నుండి 19 వరకు డీఈఓలు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీళ్లు/అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్కు పంపవచ్చు. డైరెక్టర్ ఆగ్రహం: టీచర్ల బదిలీల షెడ్యూల్ బయటకు రావడంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన డీఈవోల సమావేశంలో విద్యా శాఖ బదిలీల షెడ్యూల్పై చర్చించారు. సమావేశం జరుగు తుండగానే షెడ్యూల్ లీకయ్యింది. ఈ నేపథ్యంలో డీఈవోల ఫోన్లు స్వా«దీనం చేసుకుని పరిశీలించినట్లు తెలిసింది. -
మాకూ బదిలీలు, పదోన్నతులు.... గురుకుల సిబ్బంది డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఇప్పుడు బదిలీలు, పదోన్నతుల మంత్రాన్ని జపిస్తున్నారు. ప్రభుత్వ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, తమ విషయంలో కూడా ఈ ప్రక్రియ చేపట్టాలని గురుకులాల సిబ్బంది కోరుతున్నారు. చివరగా 2018 సంవత్సరంలో ప్రభుత్వం సాధారణ బదిలీలను నిర్వహించింది. ఈ ప్రక్రియ పూర్తయి ఐదేళ్లు కావస్తోంది. మరోవైపు నూతన జోనల్ విధానానికి అనుగుణంగా చాలామంది గురుకుల టీచర్లకు స్థానచలనం కలిగినప్పటికీ వారింకా పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారు. తాజాగా సాధారణ బదిలీలు నిర్వహిస్తే తమకు పెద్ద ఎత్తున లబ్ధి కలుగుతుందనే భావన వారిలో ఉంది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో తాజాగా బదిలీలు నిర్వహిస్తే కోరిన చోట పోస్టింగ్ వస్తుందని వారు ఆశిస్తున్నారు. 20వేల మందికి అవకాశం...! మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యికి పైగా గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో 30 శాతం గురుకుల విద్యా సంస్థలు గత నాలుగేళ్లలో ఏర్పాటు చేసినవే. కొత్త గురుకులాల్లో మెజార్టీ టీచర్లు డిప్యుటేషన్ పద్ధతిలో కొనసాగుతుండగా, మరికొందరు కాంట్రాక్టు/తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నారు. కాగా శాశ్వత ప్రాతిపదికన నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రారంభించింది. ఈ క్రమంలో గురుకులాల్లో బదిలీలు చేపడితే అర్హత ఉన్న టీచర్లకు ఎక్కువ ఆప్షన్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రులు, గురుకుల సొసైటీల కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులకు గురుకుల ఉద్యోగ సంఘాలు వరుసగా వినతిపత్రాలు సమర్పిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రస్తుతం గురుకులాల్లో బదిలీల ప్రక్రియ చేపడితే దాదాపు 20 వేల మందికి అవకాశం దక్కుతుందని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంత ఉద్యోగులపై పని ఒత్తిడి కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్, సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వ టీచర్ల మాదిరిగా గురుకులాల్లోనూ బదిలీలు నిర్వహించాలి. అర్హులందరికీ పదోన్నతులు ఇవ్వాలి. దీర్ఘకాలంగా పదోన్నతులు లేకుండా పనిచేస్తున్న లైబ్రేరియన్లు, పీఈటీలు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, హెల్త్ సూపర్వైజర్లకు కూడా పదోన్నతులు కల్పించాలి. – సీహెచ్ బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం -
Telangana: టీచర్లకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఈ నెల 27 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. 37 రోజుల్లో దీన్ని పూర్తి చేయనున్నారు. వీలైనంత త్వరగా అధికారిక షెడ్యూల్ విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేర కు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. శుక్రవారం సాయంత్రం మంత్రి సబిత విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. కాగా కొన్ని మార్పుచేర్పులతో శని వా రం షెడ్యూల్ను విడుదల చేస్తామని అధికారులు తెలిపాయి. దీనికి గతంలో బదిలీలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయాల్సి ఉంది. కలెక్టర్ కన్వీనర్గా.. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై కొన్ని రోజులుగా అధికారవర్గాలు తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉపాధ్యాయ సంఘాలతో ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చలు జరిపారు. గతానికి భిన్నంగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ కన్వీనర్గా, జిల్లా పరిషత్ చైర్మన్, సీఈవో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనలో ఉన్నారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో ముఖ్య భూమిక పోషించేవారు. దీనివల్ల అనేక సమస్యలు వచ్చాయని, ఐఏఎస్లకు బాధ్యత అప్పగిస్తే ఎలాంటి తలనొప్పులు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రమోషన్లకు అర్హుల జాబితా సిద్ధం ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా, ఎస్ఏల నుంచి హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు అర్హత గల వారి జాబితాను శుక్రవారం అధికారులు సిద్ధం చేశారు. జిల్లాల వారీగా వీటిని కలెక్టర్ల పరిశీలనకు పంపుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. మార్గదర్శకాలపై ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కోర్టు వివాదాలున్న కారణంగా భాషా పండితుల విషయంలో బదిలీలు, పదోన్నతులు చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. కాగా షెడ్యూల్ విడుదల రోజునే ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. -
టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ నాల్గవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అందించింది. కంపెనీలోని ఉన్నతోద్యోగులకు రికార్డు స్థాయిలో ప్రమోషన్లను ప్రారంభించింది. సీనియర్ల ప్రతిభను, అనుభవాన్ని నిలుపుకునే క్రమంలో ఈచర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీలో 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లను పై స్థాయిలకు ప్రమోట్ చేసింది. ఇంత పెద్ద స్థాయిలో ప్రమోషన్లు ఇంతకుముందెపుడూ ఇవ్వలేదని కంపెనీ తెలిపింది. ఇటీవలి కాలంలో కీలక ఉన్నతస్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్న సమయంలో ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రతిభావంతులైన లీడర్షిప్ ఉద్యోగుల పైప్లైన్ను బలోపేతం చేయడానికి రికార్డు స్థాయిలో సీనియర్ ప్రమోషన్లను ప్రారంభించింది విప్రో. కంపెనీ 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్విపి) పదవికి ఎలివేట్ చేయగా, 61 మంది ఎగ్జిక్యూటివ్లను వైస్ ప్రెసిడెంట్ (వీపీ)గా ప్రమోట్ చేసింది. ఫలితంగా విప్రోలో ఇప్పుడు దాదాపు 200 మంది వీపీలు, 32 ఎస్వీపీలు సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి పనిచేస్తున్నారు. మరోవైపు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 23.3శాతం అట్రిషన్ను నమోదు చేసిన కంపెనీ అక్టోబర్-డిసెంబర్ ఫలితాలను ఈ శుక్రవారం ప్రకటించనుంది. కాగా గత ఏడాది, నాలుగు దేశాల్లో వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్న కనీసంనలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు విప్రో నుంచి నిష్క్రమించారు. బ్రెజిల్లో వ్యాపారాన్ని పర్యవేక్షించిన డగ్లస్ సిల్వా, జపాన్ హెడ్, టోమోకి టేకుచి,ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సారా ఆడమ్-గెడ్జ్; మిడిల్ ఈస్ట్ రీజియన్ బిజినెస్ హెడ్ మొహమ్మద్ అరేఫ్ సంస్థను వీడిని సంగతి తెలిసిందే. -
రవితేజతో వర్క్ చేయడంపై శ్రీలీల ఏమన్నదంటే..?
-
మూకుమ్మడిగా పదోన్నతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్. పలువురు చీఫ్ ఇంజనీర్లు డబుల్ డిమోషన్ పొంది డివిజనల్ ఇంజనీర్/ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా మారిపోయారు. మరికొందరు సూపరింటెండింగ్ ఇంజనీర్లు డబుల్ డిమోషన్తో అదనపు డివిజనల్ ఇంజనీర్ స్థాయికి పడిపోయారు. దాదాపు 250 మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు గతంలో పొందిన ఒకటి లేదా రెండు పదోన్నతులను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ వచ్చాక ఇక్కడి విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన అన్ని రకాల పదోన్నతులను మంగళవారం తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థల యాజమాన్యాలు మూకుమ్మడిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల అమల్లో భాగంగా రాష్ట్ర విభజనకు ముందు 2014 జూన్ 1 నాటి సీనియారిటీ జాబితాల ఆధారంగా మళ్లీ కొత్తగా పదోన్నతులు కల్పి స్తూ ఆ వెంటనే వేరే ఉత్తర్వులూ జారీ చేశారు. తెలంగాణ ఉద్యోగులతోపాటు ఏపీ నుంచి వచ్చిన దాదాపు 700 మందితో రూపొందించిన సీనియారిటీ జాబితాను ఇందుకు వినియోగించారు. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో అధిక మంది సీనియర్లే ఉండటంతోపాటు రిజర్వేషన్లకు సంబంధించిన రోస్టర్ పాయింట్లను అమలు చేయడంతో పదోన్నతుల్లో అధిక శాతం ఉన్నతస్థాయి పోస్టులను వారికే కేటాయించినట్టు తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో కొందరు ఉద్యోగులకు డబుల్ ప్రమోషన్లు రాగా, తెలంగాణ వారికి డబుల్ డిమోషన్లు లభించినట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొత్త పదోన్నతుల్లో దాదాపు 250 మంది తెలంగాణ ఇంజనీర్లు, అకౌంట్స్, పీఅండ్జీ విభాగాల అధికారులు, ఉద్యోగులు గతంలో పొందిన పదోన్నతులను నష్టపోయారు. సీఈలు ఎస్ఈలు/డీఈలుగా, ఎస్ఈలు డీఈలు/ఏడీఈలుగా, డీఈలు ఏడీఈలు/ఏఈలుగా రివర్షన్లు పొందినట్టు విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. నలుగురు సీఈలు, 30 మందికి పైగా ఎస్ఈలు, 120 మంది డీఈల పదోన్నతులు రద్దైనట్టు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. దీంతోపాటు కొత్త సీనియారిటీ జాబితాల్లో చాలామంది తీవ్రంగా వెనకబడిపోవడంతో మళ్లీ పదోన్నతులు పొందకుండా రిటైర్ కావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని సంఘాల నేతలు తెలిపారు. ‘కరెంట్’ రఘుకి డిమోషన్ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్గా తెలంగాణ ఉద్యమ కాలంలో చురుకుగా వ్యవహరించిన ‘కరెంట్’ రఘు సైతం ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ (సివిల్) స్థాయి నుంచి రెండు హోదాలు తగ్గి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కొత్త పోస్టింగ్ పొందినట్టు తెలిసింది. నేటి ముట్టడి రద్దు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల పదోన్నతు ల రద్దును, కేంద్రం తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం విద్యుత్ సౌధను ముట్టడిని ఉపసంహరించుకున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శివాజీ తెలిపారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులకు న్యాయం చేస్తామని మంత్రి జి.జగదీశ్రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళనలను విరమించుకున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. -
జబర్దస్త్ నుంచి అందుకే బయటకు వచ్చాను : సుడిగాలి సుధీర్
-
సుధీర్ టీవీ షోస్ చెయ్యడం మానేస్తున్నాడా ..?
-
ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలి: జీటీఏ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఐఓఎస్, డైట్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని గురువారం కలిసిన సంఘం నేతలు ఈమేరకు వినతి పత్రం అందజేశారు. -
సుడిగాలి సుధీర్, బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ - పార్ట్ 2
-
సుడిగాలి సుధీర్, బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ - పార్ట్ 1
-
రివర్షన్లు.. ప్రమోషన్లు.. విద్యుత్ సంస్థల్లో పదోన్నతుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో సీనియారిటీ జాబితాలు, పదోన్నతుల్లో మార్పులు జరగనున్నాయి. విద్యుత్ సంస్థలు గతంలో ఏపీకి రిలీవ్ చేసిన ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్ర విభజనకు ఒకరోజు ముందు అంటే 2014 జూన్ 1 నాటికి ఉన్న సీనియారిటీ జాబితాల ఆధారంగా పదోన్నతులను సవరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో.. తెలంగాణ ఉద్యోగులు, గతంలో రిలీవ్ చేసి తిరిగి చేర్చుకున్న ఏపీ ఉద్యోగులను కలిపి కొత్త సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. ఈ అంశంపై తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు బుధవారం విద్యుత్ సౌధలో సమీక్షించారు. అయితే ఏపీకి రిలీవ్ చేసి తిరిగి చేర్చుకున్న ఉద్యోగుల్లో చాలా మంది సీని యర్లు ఉన్నారని.. వారు కొత్త జాబితాల్లో పైన ఉంటారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. దీనివల్ల ఇప్పటికే ప్రమోషన్ పొందిన తెలంగాణ ఉద్యోగులు తిరిగి పాత హోదాలకు రివర్షనయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పదోన్నతులు కోల్పోయే వారిలో తెలంగాణ ఇంజనీర్లు, అకౌంట్స్, పీఅండ్జీ తదితర విభాగాలకు చెందినవారు 150 మందికిపైగా ఉంటారని పేర్కొంటున్నా యి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇప్పటికే పొందిన పదోన్నతులకు రక్షణ కల్పించేందుకు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం విద్యుత్ మంతిజి.జగదీశ్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే సూపర్ న్యూమరరీ పోస్టుల సృష్టికి విద్యుత్ సంస్థలు సుముఖంగా లేనట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇదీ చదవండి: జోహార్ నటశేఖరా! హీరో కృష్ణకు అభిమానుల కన్నీటి వీడ్కోలు -
మయోసైటిస్తో ఆ స్టేజ్లో ఉన్నాను.. భావోద్వేగానికి లోనైన సమంత
సమంత నటించిన యశోద సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో పాల్గొన్న సమంత ఈ సినిమా తన రియల్ లైఫ్కు దగ్గరగా ఉంటుందని చెప్పింది. 'యశోదకు చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. దాన్ని ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు నేను కూడా అలాంటి డిఫికల్ట్ పొజిషన్లోనే ఉన్నాను. దీన్నుంచి విజయం సాధిస్తానని అనుకుంటున్నా. నా అనారోగ్యం గురించి కొన్ని ఆర్టికల్స్ చేశాను. ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారు. కానీ అది నిజం కాదు. ప్రస్తుతం నేను ఉన్న స్టేజిలో ప్రాణాపాయం కాదు. ప్రస్తుతానికైతే చావలేదు. అలంటి హెడ్లైన్స్ అనవసరం. అయినా ఈ వ్యాధి తీవ్రత మాత్రం డిఫికల్ట్గా ఉంది. అయినా సరే బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా' అంటూ సమంత ఎమోషనల్ అయ్యింది. ఇక యశోద మూవీక డబ్బింగ్ గురించి మాట్లాడుతూ.. 'కష్టసమయంలోనే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కానీ నాకు మొండితనం ఎక్కువ నేనే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాను కాబట్టి కష్టమైనా సరే డబ్బింగ్ పూర్తి చేశానని చెప్పింది. చివరగా మన నియంత్రణలో ఏదీ ఉండదని, అంతా మన లైఫ్ డిసైడ్ చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చొంది. -
మయోసైటిస్ వల్ల నరకం.. కన్నీళ్లు పెట్టుకున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూనే చేతికి సెలైన్ పెట్టుకొని యశోద డబ్బింగ్ కంప్లీట్ చేసిన సమంత తాజాగా ప్రమోషన్స్లోనూ స్వయంగా పాల్గొంది. ఈనెల 11న ఆమె నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా అభిమానులు కూడా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్వర్యపరుస్తూ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కష్టకాలాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. 'ఒకానొక సమయంలో తాను ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేనని అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడివరకు ఎలా వచ్చానోనని అనిపిస్తుంది' అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. తన అనారోగ్యం కూడా కొందరు తప్పుగా ప్రచారం చేస్తూ తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారని, కానీ తాను ఇప్పటికి ఇంకా చావలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. అంతేకాకుండా తనలాగే ఎంతోమంది కష్టాలతో పోరాడుతున్నారని, తనది పెద్ద సమస్య కాదని, ఈ పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. కష్టకాలంలోనూ సమంత చూపిస్తున్న ధైర్యానికి ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
చికిత్స పొందుతూనే యశోద ప్రమోషన్లలో సమంత...ఫోటోలు వైరల్
-
ఆరోగ్యం బాలేకపోయినా.. యశోద ప్రమోషన్స్లో పాల్గొన్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్లో బిజీగా ఉంది. అయితే సమంత అనారోగ్యం కారణంగా ప్రమోషన్స్కు దూరంగా ఉంటుందని టాక్ వినిపించింది. ప్రస్తుతం మయోసైటిస్తో బాధపడుతున్న సామ్ అందుకు తగిన చికిత్స తీసుకుంటుంది. డాక్లర్ల పర్యవేక్షణలో సెలైన్ పెట్టుకొని మరీ డబ్బింగ్ కంప్లీట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా అభిమానులు కూడా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్వర్యపరుస్తూ సమంత యశోద ప్రమోషన్స్లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా సామ్ షేర్ చేస్తూ.. 'నా స్నేహితుడు రాజ్ అండ్ డీకే చెప్పినట్లుగా.. మన రోజులు ఎంత చెత్తగా ఉన్నా సరే ముందుకు సాగాలి. ఈనెల 11న యశోద ప్రమోషన్స్ కోసం మీ ముందుకు రాబోతున్నాను' అంటూ ఓ పోస్ట్ను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సామ్ వీక్ అయినట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేకపోయినా సినిమా కోసం సామ్ డెడికేషన్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Like my good friend @rajndk Raj says , no matter what the day is like, and how shitty things are, his motto is to Shower Shave Show up !! I borrowed it for a day ♥️ For #yashodathemovie promotions .. see you on the 11th pic.twitter.com/9u6bZK3cd2 — Samantha (@Samanthaprabhu2) November 7, 2022 -
ఏలూరులో ఊర్వశివో రాక్షసివో ప్రమోషన్స్ (ఫొటోలు)
-
జపాన్ వీధుల్లో చరణ్, తారక్ హంగామా
-
జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదుగా..
-
నాకు రెండు, మూడు సీరియస్ రిలేషన్స్ ఉన్నాయి: అల్లు శిరీష్
అల్లు హీరో శిరీష్ నటించి లేటెస్ట్ మూవీ ఊర్వశీవో రాక్షసివో. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా శిరీష్ ఓ చానల్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ, బ్రేకప్పై స్పందించాడు. మూవీలో హీరోయిన్తో లవ్ ట్రాక్ గురించి చెబుతుండగా యాంకర్ నిజ జీవితంలో కూడా రిలేషన్స్లో ఉన్నారా? అని ప్రశ్నించారు. చదవండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే.. దీనికి శిరీష్ స్పందిస్తూ.. ఈ కాలంలో రిలేషన్స్ లేకుండా ఎవరుంటారని, తనకు రెండు మూడు సీరియస్ రిలేషన్స్ ఉండేవంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. దీంతో యాంకర్ మీరు ఓ పెద్దింటి అమ్మాయితో సీరియస్ రిలేషన్లో ఉన్నారని, చివరికి మీరే బ్రేకప్ చెప్పారని విన్నాను నిజమెంత అని అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. ‘నాకు గతంలో రెండు మూడు సీరియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అయితే వారందరితో నాకు బ్రేకప్ అయ్యింది. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. ఆ బ్రేకప్స్ వల్ల నేను కూడా బాధపడ్డాను. బ్రేకప్ చెప్పడం వల్ల ఎదుటి వాళ్లకు మాత్రమే పెయిన్ ఉండదు. చెప్పిన వాళ్లకి కూడా ఉంటుంది. అది ఆ నిమిషం మనకు తెలియదు. కానీ, ఏడాది తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది. బ్రేకప్ చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను. అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్ట్ చేస్తున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తుంది. లేదంటే ఇపాటికి నాకు పెళ్లి జరిగి ఉండేది కదా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ఆ రోజు నాకు చాలా బాధేసింది: విజయ్ దేవరకొండ
‘‘మాకు సినిమాయే జీవితం.. ఎంత ప్రేమించి చేస్తామో మాకు తెలుసు. అలాంటిది ఓ రోజు ఓ సినిమా వేదికపై శివ కార్తికేయన్గారు ఏడుస్తూ మాట్లాడటంతో నాకు చాలా బాధేసింది. అప్పటి నుంచి ఆయన నాకు ఓ బ్రదర్ అనే ఫీలింగ్ కలిగింది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘శివ కార్తికేయన్ అన్నని ఈ రోజే తొలిసారి కలిశాను. ఆయన ప్రయాణం నాకు నచ్చింది. ఎప్పుడైనా ఆయనకి నేను తోడుంటే బాగుంటుందనిపించింది.. ఆ అవకాశం ఇంత త్వరగా ‘ప్రిన్స్’ రూపంలో వచ్చింది. సురేశ్ ప్రొడక్షన్స్ (పెళ్లి చూపులు), ఏషియన్ సినిమాస్ (అర్జున్ రెడ్డి) నా కెరీర్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. ‘ప్రిన్స్’ ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. అందర్నీ నవ్వించే అనుదీప్కి ఈ సినిమా బిగ్ బ్లాక్బస్టర్ ఇవ్వాలి’’ అన్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘మధ్యతరగతి జీవితాలను అనుదీప్ క్షుణ్ణంగా చదివాడని ‘జాతిరత్నాలు’ చూసిన తర్వాత నాకు అనిపించింది. ముళ్లపూడి వెంకటరమణ, జంధ్యాల, బాపుగార్లు.. మిడిల్ క్లాస్ లైఫ్లను బాగా అర్థం చేసుకుని వినోదాన్ని పండించారు. అనుదీప్ కూడా సీరియస్గా ఉంటూ నవ్వులు పంచుతాడు. ఈ సినిమా బ్లాక్బస్టర్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ కథ శివ కార్తికేయన్గారి కోసమే రాశా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు అనుదీప్. కెమెరామేన్ మనోజ్ పరమహంస, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. -
తక్షణమే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తక్షణమే చేపట్టాలని ప్రోగ్రెసివ్ రికగనైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూటీఎస్) ప్రభుత్వాన్ని కోరింది. సంఘం నేతలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర మంత్రి కె.తారకరామారావును శుక్రవారం కలిసింది. 2015 నుంచి పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడంతో పాఠశాలల్లో గుణాత్మక విద్యా బోధనకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపింది. రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. -
గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్.. మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్
-
ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు చిన్నపిల్లాడిని అయిపోయా : ప్రభాస్
-
ఒత్తిడైనా.. ఒప్పించడమైనా.. ఇప్పుడే!
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతుల సాధనకు ఇదే సరైన సమయమని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సంసిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే నేపథ్యం, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే నిర్ణయం తమకు కలిసి వస్తుందని టీచర్లు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది ఉపాధ్యాయులు, 4 లక్షల మంది కుటుంబసభ్యులున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వీరి పాత్ర లేకున్నా, ఎంతోకొంత ప్రభావం ఉంటుందనేది వాస్తవం. దీంతో ప్రభుత్వం ముందున్న తమ డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయ సంఘాలు పావులు కదుపుతున్నాయి. విద్యాశాఖలో దాదాపు 20 వేల ఖాళీలుండగా, 10 వేల మందికి తక్షణ పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. దీంతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నియామకం అవసరం ఉంటుంది. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులు ఏడేళ్లుగా బదిలీలు కోరుకుంటున్నారు. ఎవరి వ్యూహం వారిదే ప్రభుత్వంతో సత్సంబంధాలతో ముందుకెళ్లే సంఘాలు ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. వారం రోజుల్లో ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు యత్నిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులు ఇస్తే ఉపాధ్యాయులు ప్రభుత్వం పట్ల మరింత సానుకూల ధోరణితో ఉండే వీలుందని సంఘాల వారు నచ్చజెప్పాలనుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే వీలైనంత త్వరగా షెడ్యూల్ విడుదల చేయొచ్చని, దీంతో లక్షల మంది ఉపాధ్యాయ కుటుంబాల్లో నమ్మకం పెరుగుతుందని వివరించాలనే యోచనలో ఉన్నారు. కొన్ని సంఘాలు విపక్షాలతో కలిసి దీన్నో రాజకీయ అంశంగా మలిచే అవకాశం ఇవ్వకూడదనే ధోరణిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాయి. ఇదిలాఉంటే, బదిలీలు, పదోన్నతులపై ఇంతకాలం ఆందోళనలు చేసిన సంఘాలు, వీటిని మరింత తీవ్రతరం చేసే యోచనలో ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఇలాంటి సమయంలో ఆందోళనల తీవ్రత పెరగకూడదనే ఆలోచనలో ఉంటుందని, కాబట్టి తమ పోరాటాలకు తలొగ్గే అవకాశముంటుందని భావిస్తున్నారు. వివరిస్తాం.. సాధిస్తాం బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. మొదట్నుంచీ మా సంఘం ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. వచ్చే వారం మరోసారి ఈ వ్యవహారంపై సర్కార్ పెద్దలను కలిసి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తాం. ఉపాధ్యాయ కుటుంబాలకు సర్కార్ సానుకూలంగా ఉందనే సంకేతాలు అందిస్తాం. – బీరెల్లి కమలాకర్రావు, పీఆర్టీయూటీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరాటంతోనే సాధన బదిలీలు, పదోన్నతులు సాధించేందుకు ఇప్పటివరకు ఎన్నో పోరాటాలు చేశాం. ఇప్పుడు దీన్ని మరింత ఉధృతం చేస్తాం. త్వరలోనే ఉపాధ్యాయ ఐక్య పోరాట వేదిక సమావేశమవుతుంది. కలిసి వచ్చే సంఘాల అభిప్రాయాలు తీసుకుంటాం. ఉపాధ్యాయ సమస్యల సాధనలో కొత్త తరహా ఆందోళనలు చేపడతాం. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. – చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
గాడ్ ఫాదర్ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
" స్వాతి ముత్యం " టీం చిట్ చాట్
-
అందుకే గాడ్ఫాదర్ ప్రమోషన్స్కి దూరంగా ఉన్నా: అనసూయ
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. దసరా బరిలో దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను వసూళు చేస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే ఆమె నటనను ప్రశంసిస్తూ ఓ నెటిజన్.. గాడ్ఫాదర్ మూవీలో మీ రోల్ నాకెంతో నచ్చింది. ఇంత మంచి రోల్ చేసినప్పటికీ మీరెందుకు ప్రమోషన్స్లో ఎక్కడా కనిపించలేదు అని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన అనసూయ.. మీరు ఇది నమ్మాలి. ఒకే సమయంలో చాలా షూటింగుల్లో పాల్గొంటున్నాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే నేనెంతో కష్టపడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. కాగా అనసూయ రియాక్షన్పై సోషల్ మీడియాలో పలు రకాలుగా స్పందిస్తున్నారు. నిజంగానే షూటింగ్స్లో బిజీగా ఉందేమో అని కొందరంటే, కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆమెకు టైం లేదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. Thank you andi! Meeru nammali.. chala shoots okesari jarugutunnai.. I am working hard to entertain y’all 😛🫣 https://t.co/uev9WrKQQX — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 5, 2022 -
రక్షన్తో కోలీవుడ్కు నాగార్జున
టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మారర్ నిర్మించారు. నటి సోనాల్ చౌహాన్ కథానాయకిగా నటించిన ఇందులో శ్రీకాంత్ అయ్యర్, మనీశ్ చౌదరి, విక్రమాదిత్య, రవివర్మ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విజయదశమి సందర్భంగా బుధవారం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రం యూనిట్ చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రం గురించి మాట్లాడే ముందు పొన్నియిన్ సెల్వన్ చిత్ర దర్శకుడు, తన మంచి మిత్రుడు మణిరత్నం అద్భుతమైన చిత్రా న్ని తెరకెక్కించినందుకు గానూ కంగ్రాట్స్ చెబుతున్నానన్నారు. మణిరత్నం దర్శకత్వంలో తాను ఇంతకు ముందు ఇదయతై తిరుడాదే (తెలుగులో గీతాంజలి) చిత్రం చేశానని గుర్తు చేశారు. ఆయన చాలా గొప్ప దర్శకుడని ప్రశంసించారు. అదేవిధంగా తాను నటించిన ఉదయం, రక్షన్, పయనం, ఇటీవల కార్తీతో కలిసి నటించిన తోళా చిత్రాలను ఇక్కడి ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఇకపోతే తాను చెన్నై, గిండీలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివినట్లు చెప్పారు. ఆ తరువాత హైదరాబాద్కు వెళ్లినా, చెన్నైకి వచ్చినప్పుడల్లా ఇక్కడ తిరిగిన ప్రాంతాలు గుర్తుకొస్తాయన్నారు. రక్షకన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయిందన్నారు. కోవిడ్ తరువాత చిత్రాలకు భాషాబేధం చెరిగిపోయిందని తెలిపారు. మంచి కంటెంట్ ఉండే చిత్రాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రేక్షకులు ఇప్పుడు చిత్రాలను చూడటానికి థియేటర్లకు వస్తున్నారన్నారు. రక్షన్ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేయాలని ముందు అనుకోలేదన్నారు. ఇది యూనివర్శల్ చిత్రం అనే నమ్మకం కలగడంతో తమిళంలోనూ విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. చిత్రం కోసం రిహార్సల్స్ చేసి నటించినట్లు తెలిపారు. తమిళ వెర్షన్కు తానే డబ్బింగ్ చెప్పినట్లు చెప్పారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా వచ్చాయన్నారు. నటి సోనాల్ చౌహాన్ పోరాట సన్నివేశాల్లోనూ చక్కగా నటించారని ప్రశంసించారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటి సోనాల్ సౌహాన్ పేర్కొన్నారు. నాగార్జున్ ఎంతగానో సహకరించారని కొనియాడింది. -
టాలీవుడ్ కింగ్ నాగార్జునతో సాక్షి " ఎక్స్ క్లూజివ్ చిట్ చాట్ "
-
అప్పుడు పాన్ వరల్డ్ సినిమా అవుతుంది: నాగశౌర్య
‘‘పాన్ ఇండియా సినిమా చేయాలంటే మంచి కథ కుదరాలి.. అంతేకానీ మనం పాన్ ఇండియాకి ప్లాన్ చేయకూడదు. మంచి కంటెంట్తో సినిమా తీస్తే పాన్ వరల్డ్ చూస్తారు. అప్పుడు అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు డామినేటింగ్గా ఉన్న సమయంలో మేము ఉండటం లక్గా భావిస్తున్నా’’ అన్నారు నాగశౌర్య. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య పంచుకున్న విశేషాలు. ⇔ ‘కృష్ణ వ్రింద విహారి’ కథ చాలా ఎగ్జయిటింగ్గా అనిపించడంతో అనీష్కి ఓకే చెప్పాను. మంచి ఫన్, ఫ్యామిలీ, మాస్.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. సినిమా చూసినవారు తమ ఫ్యామిలీతో రిలేట్ చేసుకుంటారు. కుటుంబం ఉన్నంతవరకూ మా ‘కృష్ణ వ్రింద విహారి’లాంటి కథలకు తిరుగులేదు. ఈ సినిమాలో రాధికగారి పాత్ర మినహా మిగతా పాత్రలన్నీ హిలేరియస్గా ఉంటాయి. ⇔ ‘అదుర్స్, డీజే, అంటే సుందరానికీ’.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ పాత్రలు ఉన్నప్పటికీ దేనికదే భిన్నమైనది. ‘కృష్ణ వ్రింద విహారి’ కూడా భిన్నమైన కథ. కమల్హాసన్, ఎనీ్టఆర్, అల్లు అర్జున్గార్లు.. వంటి వారు బ్రహ్మణ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు స్వతహాగా బ్రాహ్మణుడైన అవసరాల శ్రీనివాస్ వద్ద కొన్ని విషయాలు నేర్చుకున్నాను. రొమాంటిక్ సీన్స్లో నేను చాలా వీక్ (నవ్వుతూ).. మా దర్శకుడు కష్టపడి చేయించారు. ⇔ ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చేసిన పాద యాత్రలో ప్రేక్షకుల అభిమానం ఒక వరం అనిపించింది. ఇక నేను నటించిన ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ షూటింగ్ పూర్తయింది.. త్వరలో విడుదల చేస్తాం. -
అందరి ఇంట్లో జరిగే కథే ఈ సినిమా: కిరణ్ అబ్బవరం
రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తాజాగా నటిస్తున్న ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిద్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్కర్, సోను ఠాగూర్, భరత్ రొంగలి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘యస్.ఆర్ కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ను పవర్స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇందులో హీరోయిన్ తండ్రిగా దర్శక, నిర్మాత ఎస్. వి కృష్ణారెడ్డి నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 16న దేశవ్యాప్తంగా దాదాపు 550 పైచిలుకు థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మూవీ హీరో కిరణ్ అబ్బవరం బుధవారం మీడియాతో ముచ్చటించారు. ⇔ దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను .ఆయనతో పనిచేసే అవకాశం దొరకపోయినా తన కూతురు కోడి దివ్య దీప్తి గారితో పని చేయడం ఆనందంగా ఉంది.అలాగే నేను నటించిన ఈ సినిమా ట్రైలర్ ను పవన్ అన్న లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ పవన్ సార్ ⇔ మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో తెరకెక్కిన ఈ సినిమాలో అండర్ కరెంట్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ని డిస్కస్ చేశాం. ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది . ఇందులోని తండ్రి కూతుళ్లు ఎమోషన్స్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ⇔ హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరియర్కు చాలా బూస్టప్ ఇస్తుంది. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఇదే అవుతుంది. ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. హీరోయిన్కి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దొరికింది.. ⇔ దర్శకుడు శ్రీధర్ నా కాంబినేషన్లో సినిమా చేయడానికి కొంతమంది ప్రయత్నించినప్పటికీ కోడి దివ్య గారి బ్యానర్ ఫైనల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా కథ డిమాండ్ మేరకు డైలాగ్ వెర్షన్ నేనే రాశాను. ఇందులో నాది బాబా భాస్కర్ల ట్రాక్ చాలా బాగుంటుంది. ⇔ నిర్మాత కోడి దివ్య దీప్తి సహకారం వల్లే ఈ సినిమా అనుకున్న దాని కంటే బాగా వచ్చింది. మణిశర్మ గారితో కలిసి పని చేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. అయన ఇచ్చిన పాటలు అద్భుతంగా వచ్చాయి. అలాగే ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ⇔ ఇక తన తదుపరి చిత్రాలతో గురించి ప్రస్తావిస్తూ.. గీతా ఆర్ట్స్ ‘వినరో విష్ణు భాగ్యం’, మైత్రి మూవీ మేకర్స్లో ‘మీటర్’ ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఏ యం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40 శాతం షూటింగ్ అయ్యింది. ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది అని ముగించారు. -
‘పంచాయతీరాజ్’లో భారీగా పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో ప్రస్తుతం ఈవోపీఆర్డీలుగా పనిచేస్తున్న వారితోపాటు జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఏవో)గా పనిచేస్తున్న వారికి ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాతికేళ్ల తర్వాత 237 మంది ఎంపీడీవోలకు ఇటీవల ఒకేసారి పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఎంపీడీవోల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉండడంతో కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇక సాధారణ నిబంధనల ప్రకారం మండలాల్లో ఎంపీడీవో పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు మూడు మార్గాల్లో వాటిని భర్తీచేస్తుంటారు. మొత్తం ఖాళీల్లో 30 శాతం పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేస్తారు. మిగిలిన పోస్టులను ఈవోపీఆర్డీలు.. జెడ్పీలు, ఎంపీడీవో ఆఫీసుల్లో ఏవోలుగా పనిచేసే వారికి పదోన్నతుల ద్వారా భర్తీచేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, 20 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తీర్ణులైన 45 మందిని నేరుగా ఎంపీడీవోలుగా నియమించింది. మిగిలిన వాటిలో సుమారు 220 ఎంపీడీవో పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు ఇప్పుడు అధికారులు చర్యలు చేపట్టారు. నెలాఖరుకల్లా సీనియారిటీ జాబితాలు.. ఇక సెప్టెంబరు మొదటి వారానికల్లా ఈ పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసేందుకు పంచాయతీరాజ్ శాఖాధికారులు కార్యాచరణను సిద్ధంచేసుకున్నారు. ఇందులో భాగంగా.. జోన్ల వారీగా ఈఓపీఆర్డీలు, ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది. సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తయితే, అక్టోబరులో డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీ ద్వారా పదోన్నతులు పొందే వారి తుది జాబితాలను అధికారులు రూపొందిస్తారు. నవంబరు ఐదో తేదీ కల్లా పదోన్నతులు పొందిన అధికారులకు కొత్త పోస్టింగ్లు కూడా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. -
Telangana Revenue Department: రెవెన్యూలో పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్రక్రియకు తెరలేవనుంది. ముందుగా 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించనుంది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితాను పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)ను రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఈ జాబితాను ఈ నెల 6లోగా సీసీఎల్ఏ ప్రభుత్వానికి సమర్పించనుండగా ఈ నెల 7 నుంచి వారి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తూ పదోన్నతులకు అర్హులైన వారందరికీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ) హోదా కల్పించనున్నారు. జిల్లాల విభజన అనంతరం ఏర్పాటైన తర్వాత కూడా భర్తీ కాకుండా మిగిలిపోయిన జిల్లా రెవెన్యూ అధికారుల (డీఆర్వో)తోపాటు నాలుగు జిల్లాల అదనపు కలెక్టర్లుగా వారికి పోస్టింగులు ఇచ్చేందుకు సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. వాటితోపాటు భూసేకరణ, భూముల రక్షణ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగాలు, న్యాయాధికారులుగా కూడా ఎస్జీడీసీలను నియమించే అవకాశం ఉంది. ఈ పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్లను కూడా నియమించనున్నారు. రెండేళ్ల కిందటే ఆదేశాలు వాస్తవానికి రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్ర క్రియ చాలా కాలంగా నిలిచిపోయింది. వివిధ హోదాల్లో ఉన్న 88 మంది రెవెన్యూ సిబ్బందికి 2016లో పదోన్నతులు ఇచ్చాక ఇంతవరకు ప్రమోషన్లు ఇవ్వలేదు. 2020 ఫిబ్రవరిలో 193 మంది నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పించినా మిగిలిన స్థాయిలో ఫైళ్లు కదల్లేదు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు ఇవ్వడం ప్రారంభమైనందున అర్హులైన తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా, సీనియర్ అసిస్టెంట్లకు నాయబ్ తహసీల్దార్లుగా, జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించనున్నాయి. ఖాళీ అయ్యే జూనియర్ అసిస్టెంట్, తత్సమాన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఏర్పడనుంది. రెవెన్యూ శాఖలో ని అన్ని స్థాయిల్లో పదోన్నతులు చేపట్టాలని రెండేళ్ల క్రితమే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి 2020 సెప్టెంబర్ 12న ప్రగతిభవన్లో జరిగిన సమావేశంలో భాగంగా రెవెన్యూ సిబ్బందికి పదోన్నతులు ఇవ్వాలంటూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ అనివార్య కారణాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎదురుచూపులకు మోక్షం తాజాగా డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తమ ప్రమోషన్ల కోసం ఇతర హోదాల్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది ఎదురుచూపులకు కూడా త్వరలోనే మోక్షం కలగనుంది. 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు లభిస్తే వారి స్థానంలో 120 మంది వరకు తహశీల్దార్లకు, 350 మంది వరకు నాయబ్తహశీల్దార్లకు పదోన్నతులు రానున్నాయి. వారి స్థానంలో ఆ మేరకు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు కూడా పదోన్నతులు పొందనున్నారు. నాయబ్ తహసీల్దార్ల విషయానికి వస్తే 2015–16, 2016–17 ప్యానెల్ సంవత్సరాల్లోనే 375 మంది నాయబ్ తహసీల్దార్లు తహసీల్దార్లుగా పదోన్నతులు పొందేందుకు ఎంపికయ్యారు. 2017–18 సంవత్సరంలో మరో 200 మంది వరకు అర్హత పొందనున్నారు. గతంలో 193 మందికి తహసీల్దార్లుగా ప్రమోషన్లు వచ్చిన నేపథ్యంలో ఇంకా 350 మంది వరకు నాయబ్ తహసీల్దార్లు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. పదోన్నతి సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు ప్రభుత్వం ఇటీవల కుదించిన నేపథ్యంలో వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అన్ని స్థాయిలో ఈ సంఖ్య పెరుగుతుందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణ కోసం 20 మంది ఆర్డీవో (డిప్యూటీ కలెక్టర్లు)లు ఇంచార్జులుగా పనిచేస్తున్నారు. కొత్తగా తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు వస్తే వారి స్థానంలో రెగ్యులర్ ఆర్డీవోలను నియమించే అవకాశం ఉంది. వీటితో పాటు పలు దేవాలయాలకు ఈవోలుగా, ఇతర సంస్థల్లో, ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ అధికారులుగా కూడా వీరిని నియమించే అవకాశాలున్నాయి. పదోన్నతులిస్తే ఉత్సాహంగా పనిచేస్తాం రెవెన్యూ శాఖలో పనిభారం చాలా ఎక్కు వగా ఉంటుంది. అన్ని శాఖల్లో పదోన్నతు లు లభించినా రెవెన్యూలో కొంత ఆలస్యమైంది. ఇప్పటికి ఈ ప్రక్రియ ప్రారంభం కావడం సంతోషకరం. అన్ని స్థాయిల్లోని సిబ్బందికి వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మా వంతు ఇప్పటికే పనిచేస్తున్నాం. పదోన్నతులు కల్పిస్తే పనిభారం ఎక్కువైనా ఉత్సాహంగా పనిచేస్తాం. – కె. గౌతమ్కుమార్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
బ్రహ్మస్త్ర ప్రమోషన్లో ఆలియా ధరించిన డ్రెస్ ధరెంతో తెలుసా?
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇటీవల విడుదలైన గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్ సినిమాల విజయంతో హుషారు మీద ఉన్న ఈ భామ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమా చేస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య పాత్రలో నటించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్కు దగ్గర పడుతున్నవేళ ఆలియా తన భర్తతో కలిసి ప్రమోషన్లో పాల్గొంది. ఇప్పుడు ఆలియా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. అయినా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషన్లో పాల్గొంటుంది. తాజాగా.. ఈ నటి బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్లో భాగంగా తన బేబీ బంప్తో దర్శనమిచ్చింది. గూచీ బ్రాండ్కు చెందిన పింక్ కలర్ డ్రెస్, మ్యాచింగ్ బ్లాక్ ప్యాంట్ కోట్తో స్టైలిష్గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చదవండి: Samantha: సమంత ఎక్కడ? ఎందుకు సైలెంట్గా ఉంది? కారణం ఇదేనా! అయితే ఆలియా ధరించిన ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా? దీని గురించి ఏకంగా నెట్టింట్లో చర్చే జరుగుతోంది. పింక్ కలర్ చిఫాన్ రఫుల్ టాప్ ధర గూచీ అధికారిక వెబ్సైట్లో 4,100 డాలర్లుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 3,27,883 రూపాయలన్న మాట. ఒక్క డ్రెస్కు ఆలియా అంత ఖర్చు పెట్టడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. -
లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్
సౌత్, నార్త్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా లైగర్. మూవీ రిలీజ్ అయ్యేందుకు ఇంకా రెండు రోజుల మాత్రమే ఉంది. ఇక ఈ మూవీని ప్రమోషన్లో భాగంగా లైగర్ టీం కొద్ది రోజులుగా దేశమంత చూట్టుముడుతున్న సంగతి తెలిసిందే. నార్త్ నుంచి సౌత్ వరకు దాదాపు అన్ని పెద్ద నగరాల్లో పర్యటిస్తూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లైగర్ టీం ముంబై మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ విలేకరి నుంచి విజయ్కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒకవేళ లైగర్ ఫ్లాప్ అయితే? అని ఆయన అడిగారు. చదవండి: నగరానికి దూరంగా చిరు బర్త్డే వేడుకలు, ఫొటోలు వైరల్ దీంతో విజయ్ అతడి ప్రశ్నకు షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ‘ఇలాంటి చిన్న విషయాలకు కోపంతో ఊగిపోనవసరం లేదు. ఇదే ప్రశ్న నన్ను కొన్నేళ్ల కిందట అడిగి ఉంటే కోపంతో ఊగిపోయేవాడిని. ఇలా అడిగినందుకు మీపై విరుచుకుపడేవాడినేమో. అప్పుడు నాకు కోపం చాలా ఎక్కువ. కానీ గత కొన్ని రోజులుగా నాకసలు కోపమే రావడం లేదు. ఎందుకంటే అభిమానులు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని వారిని నేను అగౌరవ పరచలేను’ అని వ్యాఖ్యానించాడు. చదవండి: ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా-సిద్దార్థ్, క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో అనంతరం ‘లైగర్ ప్రమోషన్స్ చేస్తూ దేశమంత పర్యటిస్తున్నాం. ఎక్కడికి వెళ్లిన ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నాకు ఆడియన్సే ముఖ్యం. వారి కోసమే మేం పని చేస్తున్నాం. వారి కలిసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకే నగరాలన్ని చూట్టుముడుతున్నాం’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక అతడి రియాక్షన్ చూసి అంతా షాకయ్యారు. పాన్ ఇండియా చిత్రమైన ఆ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఫ్లాప్ అంటూ ప్రస్తావిస్తే ఎవరైనా వారిపై కోపంతో ఊగిపోవాల్సిందే. కానీ విజయ్ సదరు విలేకరితో వ్యవహరించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అతడిపై మరింత అభిమానం పెరిగిపోయిందంటూ విజయ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
CM YS Jagan: థాంక్యూ సీఎం సార్ !
గుంటూరు మెడికల్ : కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో) హోదా కల్పించినందుకు కృతజ్ఞతగా శనివారం గుంటూరు కన్నావారితోటలో పలువురు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్హెచ్పీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు తమనంపల్లి ప్రవల్లిక, జిల్లా కార్యదర్శి పులి ప్రేమ్కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమను నియమించిందని తెలిపారు. 14 రకాల వైద్య పరీక్షలు చేసి 67 రకాల మందుల్ని ప్రజలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో తమకు కీలకమైన బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో తమను నియమించి మెరుగైన వైద్య సేవల్ని గ్రామీణ ప్రజలకు అందిస్తోందని వివరించారు. తమకు సీహెచ్ఓ హోదా కల్పించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని, బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సహ కార్యదర్శి నరేష్బాబు, ఉపాధ్యక్షులు అనుపమ, షైనీ మేఘన, శ్రీవాణి, కోశాధికారి మౌనిక, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ఎంఎల్హెచ్పీలు పాల్గొన్నారు. (చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..? ) -
సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల
సాక్షి, అమరావతి: ఉద్యోగంలో చేరిన దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎంపీడీవోలకు పదోన్నతులు లభించాయి. 12 మంది జెడ్పీ డిప్యూటీ సీఈవోలుగా, మరో 225 మంది డీఎల్డీవో స్థాయి హోదాలో ఒకేసారి 237 మంది ఎంపీడీవోలు గురువారం పదోన్నతుల పత్రాలను స్వీకరించారు. పదోన్నతులు పొందిన ఎంపీడీవోలలో నలుగురు జడ్పీ సీఈవో హోదాలో, మరో నలుగురు డీపీవోలుగా, 13 మంది డిప్యూటీ సీఈవోలుగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో 11 మంది, మరో ఆరుగురు డీఆర్డీఏలలో నియమితులయ్యారు. చదవండి: అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా! రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారులుగా (డీఎల్డీవో) 44 మంది నియమితులు కాగా 118 మందిని జిల్లాల్లోని డ్వామా కార్యాలయ పరిధిలో వివిధ హోదాల్లో నియమించారు. ఇతర శాఖలో 37 మందిని నియమించారు. రాష్ట్రంలో మొత్తం ఎంపీడీవోలలో మూడో వంతు మంది ఒకే విడతలో పదోన్నతులు పొందడంతో కిందిస్థాయిలో దాదాపు 1,000 మందికి పదోన్నతులు దక్కుతాయని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులలో హర్షం వ్యక్తమవుతోంది. దీర్ఘకాల సమస్యకు పరిష్కారం పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీవోలు 312 మంది దాకా ఉండగా అందుకు అవకాశం ఉన్న పోస్టులు 13 మాత్రమే ఉండడంతో పాటు సీనియారిటీ జాబితా తయారీలో వివాదాల కారణంగా పాతికేళ్లుగా ఎంపీడీవోలకు పదోన్నతుల అంశం అపరిష్కృతంగా మిగిలింది. మండలాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఎంపీడీవోల నియామకం, సర్వీసు రూల్స్పై విధివిధానాలు ఖరారు కాకపోవడంతో ఒకేసారి పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వాలు దీనిపై చొరవ చూపకపోవడంతో సమస్య మరుగున పడింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనిపై దృష్టి సారించి తొలుత ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. అయితే ఇక్కడ కొలిక్కిరాకపోవడంతో సీఎం జగన్ ఈ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఈక్రమంలో వీలైనంత మంది ఎంపీడీవోలకు ఒకేసారి పదన్నోతులు కల్పించేందుకు ప్రత్యేకంగా 200 పోస్టులను గుర్తించారు. ఎంపీడీవోల పదోన్నతుల కోసమే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 51 డీఎల్డీవో పోస్టులు కొత్తగా మంజూరు చేస్తూ 2020లో ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి తోడు 149 పోస్టుల్లో ఆన్డ్యూటీ లేదా డిప్యుటేషన్ రూపంలో ప్రత్యేకంగా ఎంపీడీవోలకు మాత్రమే పదోన్నతులకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం 2022 జనవరి 17వ తేదీన మరో ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్కు ధన్యవాదాలు ‘గత 25 ఏళ్లుగా ఎంపీడీవోలు ఒక్క పదోన్నతికి కూడా నోచుకోని కారణంగా పంచాయతీరాజ్ శాఖలోని 12 క్యాడర్లకు చెందిన వేలాది మంది ఉద్యోగులపై ఆ ప్రభావం పడింది. ఉద్యోగుల మనోవేదనను అర్ధం చేసుకొని రికార్డు సంఖ్యలో 237 మందికి ఒకేసారి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సీఎం జగన్కు ఎంపీడీవోల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ –వై.బ్రహ్మయ్య (ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు), జీవీ నారాయణరెడ్డి (ప్రధాన కార్యదర్శి), కె.శ్రీనివాసరెడ్డి (ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్), డి.వెంకట్రావు (గౌరవాధ్యక్షుడు), కెఎన్వీ ప్రసాదరావు( కన్వీనర్), జీవీ సూర్యనారాయణ,ప్రతాప్రెడ్డి (ఉపాధ్యక్షుడు) -
అందుకే ప్రమోషన్స్కి చెప్పులేసుకొని వెళ్తున్నా: విజయ్ దేవరకొండ
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'లైగర్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ దూకుడు పెంచింది. అయితే ట్రైలర్ రిలీజ్ నుంచి ఇప్పటివరకు ప్రతీచోటవిజయ్ చెప్పులు(స్లిప్పర్స్)ధరిస్తూ తన సింప్లిసిటీ చూపిస్తున్నాడు. మరికొంతమంది మాత్రం అటెన్షన్ కోసమే విజయ్ ఇలా చేస్తున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై విజయ్ క్లారిటీ ఇచ్చాడు. 'నాకు ఆ టైమ్లో ఏది నచ్చితే అదే ధరిస్తాను. బ్రాండ్తో సంబంధం లేకుండా అన్నిరకాల వస్తువులను ఇష్టపడతాను. అంతేకాకుండా సినిమా రిలీజ్కి ఎక్కువ టైం కూడా లేదు. ప్రతిరోజూ ఒక డ్రెస్, దానికి నప్పే షూల కోసం వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ చెప్పులు కొనుగోలు చేశా. దీనివల్ల నా డ్రెస్సింగ్కి ఎక్కువ సమయం పట్టడం లేదు. అయినా ప్రమోషన్స్కి ఇలా చెప్పులేసుకొని వెళ్లడం వల్ల ఎవరేమనుకుంటారో అని పట్టించుకోను. నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా' అంటూ విజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
సమంతను కలిస్తే ఏం చేస్తారు? నాగ చైతన్య షాకింగ్ ఆన్సర్
సమంత-నాగచైతన్య విడిపోయి 10నెలలు కావొస్తున్నా వీరి విడాకులపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.ఇక లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. అయితే ఇందులో సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా పర్సనల్ లైఫ్పై కూడా చై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇప్పటికే సమంతతో భవిష్యత్తులో నటించే అవకాశం ఉందా అని అడగ్గా అలా జరిగితే క్రేజీగా ఉంటుందని బదులిచ్చిన చై తాజాగా మరోసారి సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: సమంతను గుర్తుచేసే ఆ టాటూని నాగ చైతన్య తొలగిస్తాడా? తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా సమంత మీకు ఎదురు పడితే ఏం చేస్తారు అని అడగ్గా.. ఆమెకు హాయ్ చెప్పి హగ్ ఇస్తానంటూ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో చై చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే ప్రశ్న సమంతకు కూడా ఎదురైన సంగతి తెలిసిందే. అందుకు బదులుగా సమాధానమిస్తూ.. మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే అక్కడ పదునైన వస్తులేవీ లేకుండా చూసుకోవాలి అంటూ సామ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ చై మాత్రం హాయ్ చెప్పడమే కాకుండా హగ్ ఇస్తానంటూ షాకింగ్ ఆన్సర్ ఇవ్వడంతో వీరిద్దరి ఆలోచనలకు ఎంత తేడా ఉంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: 'ఇన్స్టాలో బ్లాక్ చేసుకున్నాం.. కలిసుండటం ఇక జరగదు' -
చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు
Ramya Krishnan Gets Irritated With Saree Video Goes Viral: ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, నటన, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీలాంబరిగా.. శివగామిగా.. ఇలా ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్కే కొత్త అర్థం తీసుకొస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. బాహుబలిలో శివగామిగా అలరించిన రమ్య కృష్ణ 'బంగార్రాజు', 'రొమాంటిక్' సినిమాల్లో కీలక పాత్రల్లో సందడి చేసింది. తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగ్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' మూవీలో మరో పవర్ఫుల్ పాత్రతో ముందుకు రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడీగా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ను భారీగా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగానే ముంబైలో పలు ఇంటర్వ్యూలూ నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్లో రమ్యకృష్ణ పాల్గొంది. ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ కనువిందు చేసింది. స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ సందడి చేసింది. సన్నని గాలి తాకుతుంటే పలుచని చీరలో రమ్యకృష్ణ అందం మతిపోగెట్టాల ఉంది. గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించికుంటూ కొంచెం ఘాటుగానే దర్శనమిచ్చింది శివగామి. అయితే అలా గాలికి చీర జరగడంతో రమ్యకృష్ణ కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. చదవండి: నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నీలాంబరికి ఇంకా వయసు అవ్వలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'లైగర్'లో విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ఈ పాత్రతో రమ్యకృష్ణ ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
శృంగార జీవితంపై హీరోయిన్ తాప్సీ బోల్డ్ కామెంట్స్
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. పింక్, తప్పడ్ , రష్మీ రాకెట్ వంటి సినిమాలతో అలరించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం దోబారా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొంటున్న ఈ బ్యూటీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే ఇటీవలి కాలంలోహీరో, హీరోయిన్స్ ఎక్కువగా తమ మూవీ ప్రమోషన్స్ కోసం కాఫీ విత్ కరణ్ సీజన్-7లో పాల్గొంటున్నారు. చదవండి: మీడియాకు క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్.. ఎందుకంటే అయితే తాప్సీ మాత్రం ఆ షోకి వెళ్లకపోవడంపై మీడియా నుంచి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. కరణ్ షోకు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని అడగ్గా.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం కరణ్ షోపై తాప్సీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా ఇప్పటివరకు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు కరణ్ శృంగార జీవితం(సెక్స్ లైఫ్)పై అనేక ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. చదవండి: ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆలియా భట్ ఎంత సంపాదిస్తుందో తెలుసా? -
తొలిసారిగా బేబీ బంప్ను చూపించిన ఆలియా భట్
బాలీవుడ్ లవ్బర్డ్స్ ఆలియా భట్- రణ్బీర్ కపూర్ ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గానే ఆలియా తన ప్రెగ్నెన్సీ న్యూస్ను షేర్ చేసుకుంది. అయితే గర్బం దాల్చినా షూటింగ్స్కి ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా సినిమాలు, ప్రమోషన్స్లో పాల్గొంటుందీ బ్యూటీ. తాజాగా రణ్బీర్-ఆలియా జంటగా బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఓ సాంగ్ ప్రివ్యూ లాంచ్ కోసం ఈ ఇద్దరూ సందడి చేశారు. అయితే భర్తతో కనిపించిన ఆలియా భట్ తొలిసారిగా తన బేబీ బంప్ కనిపించేలా డ్రెస్ చేసుకుంది. ఇంతకుముందు డార్లింగ్ ప్రమోషన్స్లో పాల్గొన్న ఆలియా బేబీ బంప్ కనపడకుండా ఉండేందుకు వదులుగా ఉండే దుస్తులు వేసుకునేది. కానీ ఈసారి మాత్రం బేబీ బంప్ను హైలైట్ చేస్తూ దుస్తులు ధరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలోనే పేరెంట్స్గా ప్రమోట్ అవుతున్న ఈ జంటకి నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా బ్రహ్మస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయిన విజయ్, అనన్య
సౌత్లో ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యూత్లో అతడికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తనదైన స్టైల్, మ్యానరిజంతో యువతను బాగా ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఈ రౌడీకి అమ్మయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇదిలా ఉంటే లైగర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విజయ్ అక్కడ సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. ప్రస్తుతం విజయ్ లైగర్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. చదవండి: సెట్లో నోరుపారేసుకున్న హీరో, చెంప చెల్లుమనిపించిన సిబ్బంది ఈ క్రమంలో హీరోయిన్ అనన్య పాండేతో కలిసి ముంబైలోని ఓ మాల్లో సందడి చేశాడు విజయ్. అక్కడ విజయ్, అనన్యలను చూసిన ఫ్యాన్స్ ప్రచార వేదిక వద్దకు గుంపులుగా దూసుకువచ్చారు. అంతేకాదు విజయ్.. విజయ్.. లైగర్.. లైగర్ అంటూ ప్యాన్స్ కేకలతో మాల్ దద్దరిల్లింది. భారీగా సంఖ్యలో ఫ్యాన్స్ రావడం, వారి అత్యుత్సాహంతో అక్కడ తోపులాట జరిగింది. దీంతో విజయ్ వారిని ప్రశాంతంగా ఉండాలని అభ్యర్తించాడు. తాను ఇక్కడే ఉన్నానని, దయచేసి మీరంత తొక్కిసలాట లేకుండా కామ్ అవ్వాలని ఫ్యాన్స్ని కోరాడు. అయినా వారంత అభిమానాన్ని ఆపుకోలేకపోయారు. దీంతో సిబ్బంది సైతం వారిని అదుపు చేయలేకపోయింది. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించడంతో విజయ్, అనన్యలు మధ్యలోనే వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక విజయ్ అక్కడ నుంచి వెళ్లిపోయిన అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘మీ ప్రేమ నా హృదయాన్ని టచ్ చేసింది. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నారని ఆశిస్తున్నాను. మీ అందరితో చాలా కాలం పాటు కలసి ఉండాలని అనుకుంటున్నాను. మీ అందరి గురించే ఆలోచిస్తూ బెడ్ మీదకు వెళుతున్నాను. గుడ్ నైట్ ముంబై, లైగర్’ అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. Your love has touched me ❤️ Hope you all are safe and back home. Wish I could have been there with you all so much longer. Thinking about you all as I go to bed. Goodnight Mumbai 🤗❤️#Liger — Vijay Deverakonda (@TheDeverakonda) July 31, 2022 (2/2) The massive turnout just resinstates the love you have showered on us and we would like to send the same love manifold to all our amazing fans! Hope everyone is safe. #LigerManiaBegins @TheDeverakonda @ananyapandayy @DharmaMovies @PuriConnects #WaatLagaDenge — Charmme Kaur (@Charmmeofficial) July 31, 2022 -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. జులై1న 8వేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన కేంద్రం.. తాజాగా మరికొంత మందిని సైతం ప్రమోట్ చేయనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలకు చెందిన కార్యాలయాల్లో పనిచేసే 4వేల మంది ఉద్యోగులకు కేంద్రం చివరిసారిగా 2019లో ప్రమోషన్లు ఇచ్చింది. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్లు లేకుండా రిటైర్ అయ్యారు. ఆ విషయంలో ఉద్యోగులు నిరాసక్తితో ఉన్నారు. అందుకే ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చే విషయంలో కేంద్రం సీరియస్గా ఆలోచిస్తుంది. మరో రెండు,మూడు వారాల్లో అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని జితేంద్ర సింగ్ అన్నారు. మరికొంత మంది ఉద్యోగులకు ప్రమోషన్ల ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భరోసా ఇచ్చారు. -
వెరైటీగా.. స్కర్టులో స్టార్ హీరో.. ఫోటోలు వైరల్
సినిమా ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్స్ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. సినిమాను ఆడియెన్స్కు దగ్గర చేసేందుకు ఢిపరెంట్ కాన్సెప్ట్స్తో ప్రమోషన్స్ చేస్తుంటారు. హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసేందుకు వెరైటీ గెటప్లో దర్శనమిచ్చాడు. తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'బుల్లెట్ ట్రైన్' త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్తో మాంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్లో భాగంగా బెర్లిన్ ప్రీమియర్కు వచ్చిన బ్రాడ్ పిట్ లినెన్ స్కర్ట్తో కనిపించి అందరికి షాకిచ్చాడు. మ్యాచింగ్ బ్రౌన్ జాకెట్, పింక్ షర్ట్తో స్టైలిష్ గెటప్లో సందడి చేశాడు. అంతేకాకుండా ఈ గెటప్లో తన కాలిపై ఉన్న టాటూలతో మరింత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. ఒక కాలికి ఖడ్గమృగం, మరో కాలికి పుర్రె టూటూలతో బ్రాడ్ పిట్ స్పెషల్ లుక్లో కనిపించారు. ఇక ఈ ప్రీమియర్ షోకి జోయి కింగ్, ఆరోన్ టేలర్-జాన్సన్, బ్రియాన్ టైరీ హెన్రీతో సహా మిగిలిన తారాగణం సందడి చేసింది. -
ఆ పోలీసోళ్ల ఆశలపై ‘బాసర’ నీళ్లు!
ఖలీల్వాడి (నిజామాబాద్): ఏళ్ల నుంచి కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్న తమకు త్వరలో ప్రమోషన్లు వస్తాయనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కొత్త జోనల్ వ్యవస్థతో జిల్లాకు చెందిన పలువురు కానిస్టేబుళ్లు పదోన్నతులకు దూరం అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లకు పదోన్నతుల్లో బాసర జోన్ అడ్డంకిగా మారింది. బాసర జోన్ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జిల్లాల వారిగా కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుల్ పదోన్నతులు కల్పించేది. 317 ఉత్తర్వుల మేరకు జిల్లా పోస్టులు జోనల్ పరిధిలోకి మారాయి. దీంతో ఇతర జిల్లాలకు చెందిన కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు లభించాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడంతో కానిస్టేబుళ్ల భర్తీలో నిజామాబాద్ జిల్లా కంటే ఎక్కువ మందిని పోస్టుల్లోకి తీసుకుంటున్నారు. జిల్లాల విభజన సందర్భంగా సీనియార్టీ ప్రకారం విభజన జరిగిన జిల్లాలకు కేటాయించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకే జిల్లాలో అత్యధికంగా కానిస్టేబుళ్లు ఉండటంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లకు పదోన్నతులు రాకుండా పోయాయి. ఐదేళ్ల నుంచి నిరీక్షణ జిల్లాలో 1999 బ్యాచ్కు చెందిన 80 మంది కానిస్టేబుళ్లుకు బాసర జోన్తో ప్రమోషన్ రాకుండా పోయింది. ఐదేళ్ల క్రితమే పదోన్నతి రావాల్సి ఉండేది. గతంలో ఏఆర్ కానిస్టేబుళ్లు, సివిల్ కానిస్టేబుళ్ల పదోన్నతుల విషయంలో ఐదేళ్లు కోర్టులో కేసు నడిచింది. దీంతో ఏఆర్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు ఇచ్చారు. సివిల్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు రాలే దు. అప్పుడే రావాల్సిన ప్రమోషన్ హైకోర్టుతో కేసు తో నిలిచిపోగా ఇప్పుడు బాసర జోన్తో పదోన్నతికి గండి పడింది. దీంతో ఈ బ్యాచ్కు చెందిన కానిస్టేబుళ్లు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. న్యాయం చేయాలని వేడుకోలు హెడ్కానిస్టేబుళ్ల పదోన్నతిలో తమకు జరిగిన అన్యాయంపై 1999 బాŠయ్చ్ కానిస్టేబుళ్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి న్యాయం చేయా లని కోరుతున్నారు. అడిషనల్ డీజీపీ(అడ్మిన్) శివ« దర్రెడ్డిని కలిసి ఈ సారి జిల్లాల వారిగా హెడ్కానిస్టేబుళ్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని విన్నవించారు. పదోన్నతిపై వచ్చి డిప్యుటేషన్పై వెళ్లారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుమారు 80 మంది కానిస్టేబుళ్లు పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. అనంతరం డిప్యుటేషన్పై సొంత జిల్లాకు వెళ్లిపోయా రు. దీంతో జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వారు వెళ్లిపోవడంతో ఇక్కడ ఉన్న కానిస్టేబుళ్లకు పనిభారం అవుతోంది. బందోబస్తులు, కేసులతో పాటు హెడ్కానిస్టేబుల్ పనులు భారంగా మారినట్లు తెలుస్తోంది. బాసర జోన్ నుంచి పదోన్నతులపై కానిస్టేబుల్స్ రావడంతో జిల్లాలో కానిస్టేబుళ్లలకు పదోన్నతలు లభించవు. అలాగే వారి స్థానంలో జిల్లా వారు పదోన్నతి పొంది ఉంటే కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ అయ్యేవి. కానీ ప్రస్తుతం ఖాళీలు కాకపోవడంతో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. -
విశాఖలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్ (ఫొటోలు)
-
సినిమా టికెట్ల కోసం క్యూలో మహేశ్ బాబు.. వీడియో వైరల్
Mahesh Babu Waits For Major Tickets In Queue With Adivi Sesh Niharika NM: యంగ్ హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24 నుంచి రోజులో సెంటర్లో మేజర్ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ను డిఫరెంట్గా నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా మేజర్ సినిమా టికెట్స్ కోసం మహేశ్ బాబు క్యూలో నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాకు నిర్మాత అయిన మహేశ్ బాబు, ప్రముఖ యూట్యూబర్ నిహారిక ఎన్ఎమ్తో కలిసి వినూత్నంగా ఓ వీడియోను రూపొందించారు. ఇందులో అడవి శేష్ కూడా పాల్గొన్నాడు. ఈ వీడియోలో ''ఇది మేజర్ సినిమా లైనేనా అని టికెట్ కౌంటర్ వద్ద నిలబడి ఉన్న వ్యక్తిని అడుగుతుంది నిహారిక. అతను అవును అనేసరికి క్యూలో నిలుచుంటుంది. తర్వాత వచ్చిన వారంతా ఆమె కుంటే ముందు నిలబడుతుంటారు. అలా అడవి శేష్ కూడా వచ్చి తన ముందు నిలుచుండేసరికి అతనితో గొడవపడుతుంది. తర్వాత క్యూ లైన్లోకి వచ్చిన మహేశ్ బాబును చూసి ఆశ్చర్యపోతుంది. అనంతరం మహేశ్ బాబు వెనక్కి తిరిగి తన ఫ్రెండ్స్ను కూడా పిలవచ్చా అని నిహారికను అడుగుతాడు. ఆమె ఓకే అంటుంది. అప్పుడే మహేశ్ బాబు ఫోన్ నెంబర్ అడుగుతుంది. అంతలోనే మహేశ్ బాబు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.'' ఫన్నీగా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చదవండి:👇 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. ఆంటీ అవసరమా.. కూతురు పెళ్లయ్యేదాకా ఇవి తగ్గించుకో.. సురేఖ వాణిపై ట్రోలింగ్ Queues are so much fun with @AdiviSesh and @urstrulyMahesh 🙂#MajorTheFilm #MajorOnJune3rd #Adivisesh #MaheshBabu𓃵 pic.twitter.com/lsUk0tRs9F — Niharika Nm (@JustNiharikaNm) May 29, 2022 -
ప్రమోషన్లు, బదిలీలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఆశలపై విద్యాశాఖ ఈ ఏడాది కూడా నీళ్లు చల్లినట్టే కన్పిస్తోంది. పదోన్నతులు, బదిలీలపై ఇంతకాలం హడావుడి∙చేసిన అధికారులు మళ్లీ చల్లబడ్డారు. జిల్లాస్థాయిలో సీనియారిటీ జాబితాలతో ముసాయిదాలు సిద్ధం చేసినా, షెడ్యూల్ విడుదలకు విద్యాశాఖ సుముఖంగా కన్పించడం లేదు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద సోమవారం జరిగిన సమావేశంలో పలువురు అధికారులు పదోన్నతులు, బదిలీలపై అనేక సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ తేనెతుట్టెను ఇప్పుడు కదిలించకపోవడమే మంచిదని ఓ అధికారి చెప్పినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా 317 జీవో అమలుకావడంతో ఈ అంశం వెనక్కివెళ్లింది. తాజాగా జూన్ చివరి నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగించాలని విద్యాశాఖ నిర్ణయించి, ముందుకు కదిలింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) వరకూ ప్రమోషన్లకు ఎలాంటి సమస్యలూ లేవని భావించి, ముందుగా దీన్ని చేపట్టాలనుకున్నారు. హెచ్ఎంలు, ఎంఈవో, డీఈవోల భర్తీ, పదోన్నతుల ప్రక్రియలో అనేక సమస్యలు విద్యాశాఖను భయపెడుతున్నాయి. ఇవన్నీ పరిష్కరించకుండా ముందుకెళ్లడం కష్టమని ఉన్నతాధికారులు మంత్రికి సూచించినట్టు సమాచారం. దీంతో మంత్రి కూడా వెనక్కితగ్గారని తెలిసింది. ఇచ్చేదుంటే షెడ్యూల్ ఏది? ప్రమోషన్లు ఇచ్చే విషయంలో పురోగతి ఉంటే, ఏప్రిల్ చివరి నాటికే షెడ్యూల్ విడుదల కావాలి. ఆ తర్వాత మే రెండో వారం నుంచి ప్రక్రియ మొదలవ్వాలి. జూన్లో కౌన్సెలింగ్ చేపట్టి బదిలీలు చేయాలి. కానీ ఇప్పటివరకు షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పోస్టుల విషయంలో కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకూ ఈ పోస్టులు ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది. కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు (నేరుగా నియమించబడ్డవారు) దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరిని దారికి తెచ్చేందుకు విద్యాశాఖ మంత్రి అనేక దఫాలు చర్చలు జరిపినా, పెద్దగా ప్రయోజనం లేదు. అసలీ కేసులకు సంబంధించి కోర్టులోనూ విద్యాశాఖ అవసరమైన కౌంటర్ పత్రాలు దాఖలు చేయలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. అదీగాక, జూన్ 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఆ తర్వాత బదిలీలు చేయడం, పదోన్నతుల ద్వారా కొత్త టీచర్లు స్కూళ్లకు వస్తే విద్యార్థులకు సాంకేతికంగా ఇబ్బందిగా ఉండే వీలుంది. దీంతో ప్రమోషన్లు, బదిలీలు ఈ ఏడాది ఉండకపోవచ్చనే వాదన విద్యాశాఖ నుంచి బలంగా విన్పిస్తోంది. ఉద్యమమే శరణ్యం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ బుధవారం జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది. కమిటీ సోమవారం సమావేశమై ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేసినట్టు యూటీఎఫ్ నేత చావా రవి చెప్పారు. ఏడేళ్లుగా పదోన్నతులు లేక టీచర్లు నష్టపోతున్నారని, సర్కార్ స్పందించకపోవడంతోనే ఉద్యమించాల్సి వస్తోందన్నారు. తక్షణమే షెడ్యూల్ ఇవ్వాలి టీఎంఎస్టీఏ పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల సంఘం (టీఎంఎస్టీఏ) డిమాండ్ చేసింది. దీనిపై మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్తో కలిసి, సంఘం అధ్యక్షుడు భూతం యాకమల్లు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. మే నెల సగం గడిచినా షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
Ram Gopal Varma Reacts To Vishwak Sen TV Anchor Video: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ చేసిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియోతో విమర్శల పాలైంది. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్, చిత్ర పరిశ్రమకు చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది ప్రముఖ టీవీ ఛానెల్. అయితే ఈ డిబెట్లో యాంకర్కు విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వక్ సేన్ను స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియోపై తాజాగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఒక పురుషుడి కన్నా పవర్ఫుల్గా ఒక మహిళ కనిపించడం నేను ఇంతవరకు చూల్లేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదు' అంటూ ఆ యాంకర్ను ట్యాగ్ చేశాడు ఆర్జీవీ. కాగా ప్రాంక్ వీడియో కారణంగా ఇప్పటికే హీరో విశ్వక్ సేన్పై అరుణ్ కుమార్ అనే లాయర్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్లో (హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్పై టీవీ యాంకర్ ఫైర్ హీరో విశ్వక్ సేన్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు I never saw a woman looking so much more powerful than a man 💪😍💪 @Devi_Nagavalli is no less than SARKAR 🙏🙏🙏 pic.twitter.com/QbJIMTbR0K — Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022 -
ఆ ఉద్యోగులకు శుభవార్త.. పాతికేళ్లకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: ఎంపీడీవోల పాతికేళ్ల కల ఫలించింది. 1996 నుంచి పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు ఒకేసారి 236 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12 మందిని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోలుగా నియమించగా ఇటీవలే కొత్తగా సృష్టించిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారులుగా (డీఎల్డీవో) మరో 51 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో 173 మందికి డీఎల్డీవో హోదాలో పదోన్నతి కల్పించి కొంత మందిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ పోస్టుల్లో నియమించింది. ఇప్పటికే డిప్యుటేషన్పై వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారిలో అర్హత ఉన్న వారిని డీఎల్డీవో హోదాలోనే తిరిగి ఆయా పోస్టుల్లో కొనసాగేలా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 224 మంది డీఎల్డీవోలుగా పదోన్నతులు పొందారు. రాష్ట్రంలో 660 ఎంపీడీవో పోస్టులు ఉండగా మూడో వంతు మందికిపైగా ఇప్పుడు ఒకేసారి పదోన్నతులు దక్కాయి. 312 మంది.. 13 పోస్టులు 1986లో మండలాల వ్యవస్థ ఏర్పాటు కాగా దీర్ఘకాలం పాటు ఎంపీడీవో పోస్టులకు సర్వీసు రూల్స్ రూపొందించలేదు. 2001లో తొలిసారి ఎంపీడీవో పోస్టులకు సర్వీసు రూల్స్ ఏర్పడాయి. అప్పటివరకు వేర్వేరు శాఖల్లో పనిచేసిన అధికారులను ఇన్చార్జి హోదాలో ఎంపీడీవోలుగా నియమించారు. 1999లో తొలిసారి ఎంపీడీవోలను ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా నియమించారు. అయితే సర్వీసు రూల్స్కు ముందే 1996– 99 మధ్య పదోన్నతులపై ఎంపీడీవోలుగా నియమితులైన వారికి, డైరెక్ట్గా రిక్రూట్ అయిన ఎంపీడీవోల మధ్య సీనియారిటీ విషయంలో వివాదం నెలకొంది. తాజా వివరాల ప్రకారం వీరు 312 మంది వరకు ఉన్నారు. అయితే పదోన్నతులకు ఉన్న పోస్టులు 13 కాగా పోటీపడే ఎంపీడీవోల సంఖ్య 300కిపైగా ఉండటంతో ఇన్నాళ్లూ సమస్య పరిష్కారం కాలేదు. సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. తొలుత కమిటీతో ప్రయత్నం.. ఎంపీడీవోలుగా ఉద్యోగంలో చేరిన వారు ఎలాంటి పదోన్నతులకు నోచుకోకుండా పాతికేళ్లుగా కొనసాగుతుండటంపై ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే దృష్టి సారించారు. సమస్య పరిష్కారానికి తొలుత అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు నేతృత్వంలో ఐఏఎస్ అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. అయితే కమిటీ పలు సమావేశాలు నిర్వహించినా మూడు కేటగిరీలకు సంబంధించిన ఎంపీడీవో ఉద్యోగ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదోన్నతుల కోసమే 200 కొత్త పోస్టులు.. ఐఏఎస్ అధికారుల కమిటీ ఏర్పాటు తర్వాత కూడా ఎంపీడీవోల పదోన్నతుల సమస్య తేలకపోవడంతో దీన్ని పరిష్కరించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. ఈ నేపథ్యంలో మూడు కేటగిరీల సంఘాల మధ్య ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తూనే వీలైనంత మంది ఎంపీడీవోలకు ఒకేసారి పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా 200 పోస్టులను గుర్తించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక్కో డీఎల్డీవో చొప్పున 51 డీఎల్డీవో పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి తోడు కొత్తగా గ్రామీణాభివృద్ధి శాఖలో 149 పోస్టుల్లో ఆన్డ్యూటీ లేదా డిప్యుటేషన్ రూపంలో ప్రత్యేకంగా ఎంపీడీవోలకు మాత్రమే పదోన్నతులకు వీలు కల్పిస్తూ 2022 జనవరి 17వ తేదీన మరో ఉత్తర్వు జారీ చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్ పథకం విభాగాల్లో 9 కేటగిరీలకు సంబంధించి 15 పోస్టులలోనూ, జిల్లాలోని డ్వామా పీడీ కార్యాలయాల్లో 9 కేటగిరీలకు సంబంధించి మరో 134 కలిపి మొత్తం 149 పోస్టులను ఆన్డ్యూటీ లేదా డిప్యుటేషన్ విధానంలో ప్రత్యేకంగా ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతి ద్వారా భర్తీ చేసేలా ఆదేశాలిచ్చింది. -
పొలిటికల్ ఎంట్రీపై విజయ్పై హాట్ కామెంట్స్..
సాక్షి, చెన్నై: సినిమాల్లో దళపతిగా ఉన్న తాను తలైవా (నాయకుడి)గా అవతరించడం అనేది కాలం చేతుల్లోనే ఉందని సినీ నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తున్నానని, ఈ పయనాన్ని కాలంతో పాటుగా అభిమానులే నిర్ణయించాలని స్పష్టం చేశారు. సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై చర్చ తరచూ తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి బీస్ట్ చిత్రం విడుదల వేళ విజయ్ తన స్వరాన్ని మార్చారు. రాజకీయంగా చర్చకు తగ్గ వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్లో నెల్సన్ దర్శకత్వం వహించిన బీస్ట్ చిత్రం ఈనెల 13న తెర మీదకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా ఓ ఛానల్లో ఆదివారం రాత్రి చిట్చాట్ కార్యక్రమం జరిగింది. బీస్ట్ చిత్ర దర్శకుడు నెల్సన్ సంధించిన ప్రశ్నలకు విజయ్ ఇచ్చిన సమాధానాలు రాజకీయంగానే కాకుండా, సినీ రంగంలోనూ చర్చకు దారి తీశాయి. తనదైన శైలిలో.. నెల్సన్ ప్రశ్నలకు తన దైన స్టైల్లో విజయ్ సమాధానాలు ఇచ్చారు. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, ఆలయాలు, దర్గాలు, దేవాలయాలకు వెళ్తూనే ఉంటానని విజయ్ వివరించారు. అలాగే తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్తో ఉన్న విభేదాలను ప్రస్తావిస్తూ, చెట్టుకు వేర్లు ఎలాగో.. ఓ తండ్రి కుటుంబానికి అలాంటి వాడు అని, దేవుడు కనిపించడు.. తండ్రి కనిపిస్తాడు అని సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక తన కుమారుడు సంజయ్ సినీరంగ ప్రవేశం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. సంజయ్ తెర మీద కనిపిస్తాడా...? లేదా కెమెరా వెనుక ఉంటాడా..? అనేది తెలియదని, తాను అందరిలాగే ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే, అవకాశాలు వస్తున్న మాట మాత్రం వాస్తవమేనని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైకిల్ పయనం గురించి గుర్తు చేస్తూ, ఇది యాధృచ్ఛికంగా జరిగిందని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇటీవలి నగర పాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమానుల గెలుపును గుర్తు చేస్తూ విల్సన్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇందుకు విజయ్ సమాధానం ఇస్తూ, రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నానని వెల్లడించారు. అలాగే, దళపతిగా ఉన్న తాను నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో ఉందని, అభిమానులే నిర్ణయిస్తారని ముగించడం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
ఎక్సైజ్ అధికారులకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో ఎస్సై స్థాయి నుంచి అదనపు కమిషనర్ వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు పదోన్నతులు లభించాయి. శనివారం ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పదోన్నతుల పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ పదోన్నతులు సాధించిన ఉద్యోగులను అభినందించారు. రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే గంజాయి, గుడుంబాలను నిర్మూలించగలిగామని చెప్పారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అజయ్రావు, హరికిషన్, అంజన్రావు, డేవిడ్ రవికాంత్, శాస్త్రి, ఖురేషి, సురేశ్రాథోడ్, చంద్రయ్యగౌడ్, దత్తురాజుగౌడ్, సత్యనారాయణ, రవీందర్రావు, గణేశ్గౌడ్, కిషన్నాయక్, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోష్.. దేశవ్యాప్తంగా రాజమౌళి రచ్చ రచ్చ
-
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్కి దూరంగా విజయేంద్ర ప్రసాద్.. అందుకేనా?
Where Is Vijayendra Prasad?: రామ్చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా తెరకెక్కుతున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. మార్చి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా జక్కన్న ప్రమోషన్స్ చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రమోషన్స్లో అందరూ కనిపిస్తున్నారు కానీ ఈ సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు. దీంతో విజయేంద్ర ప్రసాద్ ఎక్కడా అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవలె ఆయన కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. ఆరోగ్య సమస్యలు, వయస్సు రీత్యా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్కి దూరంగా ఉన్నట్లు సమాచారం. కాగా రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాహుబలి1అండ్ 2, మణికర్ణిక సహా పలు సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా స్వయంగా ఆయనే కథ అందించారు. -
తారక్కి రెండు చుక్కల విషం కలిపి ఇచ్చెయ్ : రాజమౌళి
ఇండస్ట్రీ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా నటించిన ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ను ఓ రేంజ్లో నిర్వహిస్తుంది. ఇటీవలె ఆర్ఆర్ఆర్ యూనిట్తో అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళి ముగ్గురు కలిసి ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తారక్, చరణ్, జక్కన్న చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ ఇంటర్వ్యూ మాదిరిగా కాకుండా చాలా సరదాగా, ఫన్నీగా సాగింది ఈ ఇంటర్వ్యూ. ఎవరెవరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అన్న దగ్గరి నుంచి ఏఏ ప్రాంతాలకు వెళ్లి ప్రమోషన్స్ చేయాలన్న వివరాలను ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్నారు. వీడియో మొదట్లో 'నాకు నిద్రొస్తుంది కాపీ పెడతాను. మీకు ఏమైనా కావాలా' అని చరణ్ అడగ్గా.. 'నువ్వు పెడితే విషం కూడా తాగుతా' అంటూ తారక్ బదులిచ్చాడు. దీంతో రాజమౌళి ఎంటర్ అయ్యి.. అయితే రెండు చుక్కల విషం కలిపి ఇచ్చెయ్ అంటూ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ప్రమోషన్స్కు హీరో రాకపోవడమేంటి? డైరెక్టర్ సీరియస్
ఎలాంటి విభేదాలు ఉన్నా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో పాల్గొనకపోవడం కరెక్ట్ కాదని దర్శకుడు శీను రామస్వామి పేర్కొన్నారు. ఎక్సట్రా ఎంటర్టైన్మెంట్ మదియళగన్ నిర్మించిన చిత్రం కల్లన్. కరు.పళనియప్పన్ కథానాయకుడిగా పరిచయం చేస్తూ రచయిత్రి పాత్రికేయురాలు చంద్ర తంగరాజ్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ఇది. కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఫస్ట్ కాపీ చూసిన వెంటనే పీకాక్ పిక్చర్స్ అధినేత ఎస్ ఎస్ కుమరన్ విడుదల హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. కాగా శనివారం సాయంత్రం చెన్నైలో జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు శీను రామస్వామి. ఈ వేడుకలో కథానాయకుడు కరు.పళణియప్పన్ పాల్గొనకపోవడం కరెక్ట్ కాదన్నారు. ఎన్ని విభేదాలు ఉన్నా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందన్నారు. దర్శకురాలు అవ్వాలన్న తన 20 ఏళ్ల కల ఈ చిత్రం అని డైరెక్టర్ చంద్ర తంగరాజ్ పేర్కొన్నారు. 100 మంది నిర్మాతలు తిరస్కరించిన ఈ కథను విన్న మదియళగన్ వెంటనే నిర్మించడానికి సమ్మతించారని తెలిపారు. -
టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో పదోన్నతులు, బదిలీలకు రంగం సిద్ధమైంది. వేసవి సెలవుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండుసార్లు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో పాఠశాల విద్య డైరెక్టరేట్ దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తాజాగా ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డులను అప్గ్రేడ్ చేస్తోంది. జోనల్ వ్యవస్థలో భాగంగా ఇటీవల 317 జీవో అమలు చేశారు. కొత్త జిల్లాలకు కేడర్ను కేటాయించారు. ఈ మార్పు తర్వాత అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆందోళనలు తెరమీదకొచ్చాయి. అయితే, కొత్త జిల్లా కేటాయింపుల తర్వాత జిల్లాల వారీగా టీచర్ల సీనియారిటీని రూపొందించాల్సి ఉంటుంది. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ దీని ఆధారంగా చేపట్టాలని భావిస్తున్నారు. కాబట్టి మరింత పకడ్బందీగా దీన్ని పూర్తి చేయాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సాధారణ బదిలీలు, పదోన్నతులు ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులు.. సర్వీస్ రికార్డుల ఆధారంగా టీచర్ల పదోన్నతుల వ్యవహారం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 2009 సర్వీసు నిబంధనలు అమలులో ఉన్నాయి. అప్పట్లో జోనల్ వ్యవస్థ అమలులో లేదు. కాబట్టి సర్వీసు రూల్స్ మార్చుకుని పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో పదోన్నతులు పొందాల్సిన ఉపాధ్యాయులు దాదాపు 10 వేల మంది వరకూ ఉన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. ప్రాథమిక స్కూల్లో పనిచేస్తున్న వారిని ఎస్జీటీ స్థాయికి పెంచనున్నారు. మరోవైపు 5,700 మంది ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలను నియమించాల్సి ఉంది. పాఠశాల స్థాయిలో మొత్తం 13 వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. ఇందులో సింహభాగం ప్రాథమిక, ఎస్జీటీ స్థాయిలోనే ఉండే వీలుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే బదిలీలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. భారీ ఎత్తున మండల విద్యాశాఖాధికారులను కూడా నియమించాల్సి ఉంది. లోకల్ బాడీ, ప్రభుత్వ స్కూళ్లను వేర్వేరుగా చూస్తున్న కారణంగా ఈ నియామక విధానంపై ఓ స్పష్టత కన్పించడం లేదని అధికారులు అంటున్నారు. హేతుబద్ధీకరణకు గ్రీన్సిగ్నల్... ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఎంత మంది ఉన్నారనే డేటాను ఇప్పటికే విద్యాశాఖ తెప్పించింది. దీని ఆధారంగా కొన్ని స్కూళ్లలో తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయనుంది. ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపెడుతున్న కారణంగా దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని భావిస్తున్నారు. తొలుత 18 వేల మంది ఉపాధ్యాయుల కొరత ఉండొచ్చని అంచనా వేశారు. రేషనలైజేషన్ డేటాను బట్టి ఈ సంఖ్య 13 వేల వరకూ ఉండొచ్చని తేల్చారు. దీన్నిబట్టి ప్రాథమిక స్కూళ్లపైనే రేషనలైజేషన్ ప్రభావం ఎక్కువగా ఉండే వీలుంది. కాబట్టి ప్రాథమిక స్కూల్ టీచర్లు సర్వీసును ఆధారంగా ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు పొందే వీలుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. తక్షణమే షెడ్యూల్ ఇవ్వాలి: ఎస్టీయూటీఎస్ టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ అధ్యక్షుడు సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి పర్వత్రెడ్డి డిమాండ్ చేశారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ ప్రక్రియకు ముందే జోనల్ విధానంలో బదిలీ అయిన వారు పెట్టుకున్న అప్పీళ్లను పరిష్కరించాలని కోరారు. ఏడేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేసవి సెలవుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఆ ముగ్గురు హీరోలతో నటించాలనుంది : పూజా హెగ్డే
పూజా హెగ్డే ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాల్లో గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకుంది. పూజ ఉంటే చాలు హిట్టు గ్యారెంటీ అన్నంతగా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుండటంతో ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు వెనకాడటం లేదు. భారీ బడ్జెట్ సినిమాల్లో వరుస ఆఫర్లతో బిజీగా మారిన పూజా నటించిన రాధేశ్యామ్ ఈనెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న పూజా.. ఓ ఇంటర్వ్యూలో.. ఏ హీరోలతో నటించాలనుకుంటున్నారు అని అడగ్గా.. కమల్హాసన్, రణ్బీర్ కపూర్, ధనుష్లతో నటించాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే కోలీవుడ్లో బీస్ట్ మూవీతో ఎంట్రీ ఇస్తుంది. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కానుంది. ఈ పొడుగు కాళ్ల సుందరి లక్ చూస్తుంటే త్వరలోనే ఆమె కోరిక తీరేలా కనిపిస్తుంది. చదవండి: పూజా హెగ్డేతో విబేధాలపై తొలిసారి స్పందించిన ప్రభాస్ -
AP: అంగన్వాడీ’లకు తీపికబురు
సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పదోన్నతుల కోసం ఎనిమిదేళ్ల వీరి నిరీక్షణకు తెరదించి అందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అలాగే, ప్రస్తుతమున్న పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ఫోన్లు సైతం అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వీరికి పదోన్నతులు కల్పించాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 560 విస్తరణాధికారులు (ఈఓ) గ్రేడ్–2 (సూపర్వైజర్లు) పోస్టులు వీరితో భర్తీకానున్నాయి. నిజానికి.. రాష్ట్రంలో మంజూరైన మొత్తం గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులు 976 ఉన్నాయి. వాటిలో 416 పోస్టులను గతంలో భర్తీచేశారు. అంగన్వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా మిగిలిన పోస్టులను భర్తీచేస్తారు. వచ్చే మార్చిలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది. అంగన్వాడీ వర్కర్ల చేతికి ’స్మార్ట్ ఫోన్’ ఇక రాష్ట్రంలోని అంగన్వాడీ సూపర్వైజర్లు, వర్కర్ల చేతికి ప్రభుత్వం కొత్త స్మార్ట్ఫోన్లు ఇవ్వనుంది. 55,607 అంగన్వాడీ వర్కర్లు, 1,377 సూపర్వైజర్లకు కలిపి మొత్తం 56,984 స్మార్ట్ఫోన్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఒక్కో ఫోన్ ఖరీదు రూ.14,998 కాగా, మొత్తం రూ.85.47 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత సర్కారు వీరిని నిర్లక్ష్యం చేసింది రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు విశేష సేవలందిస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం తరఫున తమ వంతు సేవలు చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్ల మేలు కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రేడ్–2 సూపర్వైజర్లకు గ్రేడ్–1 సూపర్వైజర్లుగాను, గ్రేడ్–1 సూపర్వైజర్లకు సీడీపీఓలుగాను, సీడీపీఓలకు ఏపీఓలుగాను పదోన్నతులు కల్పించాం. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లకు గ్రేడ్–2 సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం వీరిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంగన్వాడీ వర్కర్ల పదోన్నతుల విషయంలో వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. – తానేటి వనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పారదర్శకంగా పదోన్నతులు అంగన్వాడీ వర్కర్లకు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. 2013లో వీరికి పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత ఇప్పటిదాకా లేవు. అప్పటి నుంచి ఉన్న ఖాళీలను అర్హులైన అంగన్వాడీ వర్కర్లతో భర్తీ చేయాలనే డిమాండ్ ఉంది. వీరి విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పదోన్నతులకు ఆమోదం తెలిపింది. దీనికి మార్చిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. – కృతికా శుక్లా, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు -
ఆందోళనలో ఆ 22 వేల మంది ఉద్యోగులు.. కేసీఆర్ కనికరిస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా (వీఆర్ఏ) పని చేస్తున్న 22 వేల మంది సిబ్బంది పరిస్థితి డోలాయమానంలో పడింది. ఏళ్ల తరబడి వేతనాలు పెరగకపోవడం, పదోన్నతులు రాకపోవడంతో పాటు వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తమ భవిష్యత్తు ఏంటనే బెంగ వీఆర్ఏలు, వారి కుటుంబ సభ్యులకు పట్టుకుంది. తమను రెవెన్యూలోనే కొనసాగిస్తారా? ఎంతమందిని కొనసాగిస్తారు? ఇతర శాఖలకు పంపుతారా? అసలు ఉద్యోగాలను ఉంచుతారా? తీసేస్తా రా? అనే సందేహాలు వీఆర్ఏ వర్గాల్లో వ్యక్తమ వుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు పేస్కే ల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళన బాట పట్టారు. అన్నీ పెండింగ్లోనే.. క్షేత్రస్థాయిలో జరిగే రెవెన్యూ కార్యకలాపాలకు సహాయకులుగా ఉండేందుకు ప్రభుత్వం వీఆర్ఏలను నియమించింది. వీరిలో కొందరిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయగా, చాలామందిని నేరుగానే నియమించింది. 2007 నుంచి వీరికి నెలకు రూ.10,500 వేతనం ఇస్తున్నారు. టీఏ, డీఏలు కలిపి గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,400, పట్టణ ప్రాంతాల్లో రూ.11,500 చొప్పున వేతనం వస్తోంది. అయితే తమకు ఉద్యోగ భద్రత కోసం పేస్కేల్ వర్తింపజేయాలని వీఆర్ఏలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. పేస్కేల్ అమల్లోకి వస్తే హెల్త్కార్డులు వస్తాయని, టీఏ, డీఏలతో పాటు అన్ని అల వెన్సులు క్రమం తప్పకుండా పెరుగుతాయనే ఆలోచనతో వీఆర్ఏలు ఈ డిమాండ్ చేస్తు న్నారు. వాస్తవానికి వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పదోన్నతులు ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలకు అవకాశమిస్తామని కూడా హామీ ఇచ్చారు. వీటితో పాటు డైరెక్ట్ వీఆర్ఏల సర్వీసులను క్రమబద్ధీకరించే అంశం కూడా పెండింగ్లోనే ఉంది. మూడు రకాలుగా వర్గీకరణ! విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తోన్న వీఆర్ఏలను మూడు రకాలుగా వర్గీకరించాలని ఉన్నతస్థాయిలో ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. అందులో 3,300 మందికి పైగా వీఆర్ఏలను సాగునీటి శాఖలో లష్కర్లుగా పంపాలన్న దానిపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. ఇక మిగిలిన వారిని స్కిల్డ్, అన్స్కిల్డ్ పేరుతో వర్గీకరించారు. స్కిల్డ్ ఉద్యోగులను రెవెన్యూలోనే కొనసాగించాలని, గ్రామానికొకరిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, మిగిలిన 8–9 వేల మందిని అన్స్కిల్డ్ కేటగిరీలో చేర్చగా, వీరిని ఏం చేస్తారన్నదే తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే వీఆర్ఏలు సోమ, మంగళ వారాల్లో ధర్నాలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏ, వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వీఆర్ఏల సంఘం గౌరవాధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ కోరారు. వీఆర్ఏల డిమాండ్లివే.. ♦సీఎం హామీ ఇచ్చిన విధంగా పేస్కేల్ వర్తింపజేయాలి. ♦55 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ♦అర్హులైన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. ♦అందరికీ సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ♦విధుల్లో భాగంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. -
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కేసుపై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత ధర్మాసనం ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేజన్ల కేసుపై శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పనపై తామేలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని తెలిపింది. ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలే లెక్కలు సేకరించాలని తెలిపింది. మొత్తం సర్వీసు ఆధారంగా కాక, రిజర్వేషన్ల ఆధారంగానే డేటాను సేకరించాలని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రమోషన్ల డేటా సమీక్షకు వ్యవధి సహేతుకుంగా ఉండాలని తెలిపింది. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. దామాషా ప్రాతినిధ్యం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలన్నీ రాష్ట్రాలే చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న అయోమయాన్ని దూరం చేయాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: ‘సిద్ధూ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టాడు’ -
Jr NTR: 'ఆ టైంలో డిప్రెషన్కు లోనయ్యా.. రాజమౌళి బయటకు తీసుకొచ్చాడు'
Jr NTR Depression: ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా గడిపేస్తుంది మూవీ టీం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ తన డిప్రెషన్ గురించి బయటపెట్టాడు. 17ఏళ్లకే హీరోగా తెరంగేట్రం చేశాను. రెండవ సినిమాకే స్టార్ స్టేటస్ చూశాను. అయితే కొన్నాళ్ల తర్వాత వరుస డిజాస్టర్లు పలకరించాయి. ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా. ఏం చేస్తున్నానో తెలియని అయోమయంలో పడిపోయాను. అలాంటి గందరగోళ పరిస్థిత్లుల్లో ఉన్నప్పుడు ఆత్మపరిశీలన చేసుకునేందుకు జక్కన్న సాయం చేశాడు. వరుస ఫ్లాపులతో ఉన్న నాతో యమదొంగ లాంటి సూపర్ హిట్ ఇచ్చి మళ్లీ నన్ను సక్సెస్ ట్రాక్లో నిలబెట్టారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు నా స్నేహితుడిగా రాజమౌళి ఎప్పుడూ నాకు అండగా నిలబడ్డారు. అయితే ఆ విజయాలతో నేను పెద్దగా సంతృప్తి చెందలేదు. కానీ ఆర్ఆర్ఆర్లో నటించడం సంతృప్తినిస్తుంది. నటుడిగా ఎంతో నేర్చుకున్నాను అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్ కొమరం భీమ్గా కనిపిస్తే, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. -
అల్లు అర్జున్పై ఫైర్ అయిన రిపోర్టర్.. బన్నీ క్షమాపణలు
Pushpa Bangalore Press Meet: అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన సినిమా పుష్ప. డిసెంబర్17న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లతో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రెస్మీట్ చెప్పిన టైంకి కాకుండా ఆలస్యంగా ఎలా వచ్చారంటూ ఓ కన్నడ రిపోర్టర్ నిలదీశాడు. 11.15కి ప్రెస్మీట్ అనిచెప్పి1.15కి ఎలా వస్తారంటూ బన్నీ, రష్మికలపై ఓ రిపోర్టర్ ఫైర్ అయ్యాడు. దీంతో క్షమాపణలు చెప్పిన బన్నీ.. పొగమంచు కారణంగా ఫ్లైట్ కాస్త ఆలస్యం అయ్యిందని, అంతేకాకుండా ప్రెస్మీట్ టైమింగ్పై కాకుండా తనకు స్పష్టత లేదని చెప్పుకొచ్చాడు. సారీ చెబితే మనిషి పెరుగుతాడు కానీ తగ్గడు అంటూ తనదైన స్టైల్లో బన్నీ చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. -
అందుకే ప్రమోషన్స్కు రావడం లేదట.. అగ్రనటిపై విమర్శలు
చైన్నై సినిమా: ఒక తమిళ అగ్రనటిని నిర్మాత, నటుడు కె.రాజన్ ఘాటుగా విమర్శించారు. జీఎన్ఏ ఫిలిమ్స్ పతాకంపై జయరాజ్ ఆర్. వినాయక సునీల్ కలిసి నిర్మించిన చిత్రం 'గ్రాండ్ మా'. షిజన్ లాల్ ఎస్ఎస్ దర్శకత్వం వహించిన ఇందులో సోనియ అగర్వాల్, విమలారామన్, ఛార్మిళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళం, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైనా కె. రాజన్ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమ మలయాళ చిత్ర పరిశ్రమను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ చిత్ర షూటింగ్ను 23 రోజుల్లో పూర్తి చేసినట్లు, షూటింగ్లో ఒక్క కేరవాన్ కూడా వాడలేదని దర్శకుడు చెప్పారన్నారు. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నటీనటులందరూ విచ్చేశారని, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ఒక నటి మాత్రం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావడం లేదన్నారు. అదేమని అడిగితే తాను వెళ్లి చిత్రం బాగుందని చెప్పి ఆ చిత్రం ఫ్లాప్ అయితే తనకు చెడ్డ పేరు వస్తుందని చెబుతోందన్నారు. రూ.5 కోట్లు తీసుకుంటున్న ఆమెకు చిత్రం ఫ్లాప్ అవుతుందని ముందుగా తెలియదా అంటూ విమర్శించారు. -
ఇక ఓఎస్ ప్రమోషన్లకు చెల్లు
సాక్షి, హైదరాబాద్: పదోన్నతుల్లో సమస్యలు రాకుండా, సీనియారిటీ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కొత్త సర్వీస్ రూల్స్ను పోలీస్ శాఖ తీసుకొస్తోంది. ఔట్ ఆఫ్ సర్వీస్ కింద తాత్కాలిక పద్ధతిలో ఇచ్చే పదోన్నతులను ఆపేయాలని, యాగ్జిలేటరీ ప్రమోషన్లకు ప్రత్యేక రూల్ ఉండాలని ప్రతిపాదన చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రతిపాదనలను హోం శాఖ ద్వారా ప్రభుత్వానికి పంపింది. న్యాయపరమైన సమస్యలు రాకుండా ఆ ప్రతిపాదనలను న్యాయ శాఖకు హోం శాఖ పంపించే ఏర్పాట్లు చేస్తోంది. న్యాయ శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వం ఆమోదించనున్నట్టు తెలిసింది. నాలుగేళ్లు స్టడీ..: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూపొందించిన కఠినమైన పోలీస్ సర్వీసు రూల్స్ను రాష్ట్ర పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సమీక్షించింది. సర్వీస్ రూల్స్లో అనుభవమున్న రిటైర్డ్ అధికారులతో కమిటీ వేసి నాలుగేళ్లు అధ్యయనం చేసింది. పాత సర్వీస్ రూల్స్ను అతిక్రమించి విచక్షణాధికారం పేరుతో గతంలో అధికారులు చేసిన తప్పిదాల వల్ల కోర్టుల్లో కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ప్రతి కోర్టు తీర్పును కమిటీ అధికారులు ముందు పెట్టుకొని కొత్త రూల్స్ను రూపొందించినట్టు ఉన్నతాధికారులు చెప్పారు. సీనియారిటీ విషయంలోనే 2,800 కేసులను కమిటీ అధ్యయనం చేసిందని తెలిసింది. యాగ్జిలేటరీలో ప్రమోషన్లు ఇలా ఇద్దాం..: మావోయిస్టు, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణలో బాగా పనిచేసే పోలీస్ సిబ్బంది, అధికారులకు యాగ్జిలేటరీ పద్ధతిలో పదోన్నతులు కల్పించడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన ఓ జీవో ద్వారానే ఇలా ప్రమోషన్లు ఇస్తున్నారు. ప్రత్యేకంగా రూల్ అంటూ సర్వీస్ రూల్స్లో లేదు. దీంతో సమయం ప్రకారం పదోన్నతి రాని అధికారులు అభ్యంతరం తెలపడం, కోర్టులకు వెళ్లడంతో సమస్యలు వచ్చి బ్యాచ్ల మధ్య సీనియారిటీ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో యాగ్జిలేటరీ పదోన్నతుల్లో కీలకమైన రూల్స్ను కమిటీ ప్రతిపాదించింది. ఇలా ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు అతని కన్నా ముందు బ్యాచ్ చివరి స్థానంలో, అతడి బ్యాచ్ ముందు వరుసలో సీనియారిటీ కల్పిస్తే సమస్యలుండవని వివరించింది. ఓఎస్ పదోన్నతుల్లో సమస్యలు పోలీస్ శాఖలో డ్యూటీలో మెరుగైన సేవలందించే వాళ్లకు ఓఎస్ (ఔట్ ఆఫ్ సర్వీస్)కింద తాత్కాలిక పద్ధతిలో పదోన్నతి కల్పించే వారు. అయితే ఆ హోదాలోకి సీనియారిటీ ప్రకారం వేరే అధికారులు పదోన్నతి పొందితే ఓఎస్ పద్ధతిలో పనిచేస్తున్న అధికారి మళ్లీ పాత హోదాలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ కొంత మంది అధికారులు, సిబ్బంది ఓఎస్పై కోర్టులకు వెళ్లి ఓఎస్ హోదాలోనే ఉండేలా తీర్పులు తెచ్చుకున్నారు. దీంతో సర్వీస్ సమస్యలు ఎక్కువయ్యాయి. పాత సర్వీస్ రూల్స్ను సమీక్షించిన కమిటీ.. ఓఎస్ పద్ధతిలో తాత్కాలిక పదోన్నతులను ఆపాలని ప్రతిపాదించింది. -
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు: నిర్ణయాన్ని తిరిగి సమీక్షించం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలిస్తూ తామిచ్చిన తీర్పును తిరిగి సమీక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు ఎలా చేయాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు నోట్ రూపంలో రెండు వారాల్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. జర్నైల్ సింగ్ వర్సెస్ లచ్మి నరైన్ గుప్తా కేసులో ఇంప్లీడ్ అయిన 133 పిటిషన్లను మంగళవారం జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ గవాయిల ధర్మాసనం మంగళవారం విచారించింది. నాగరాజ్, జర్నైల్ సింగ్ కేసులు తిరిగి ప్రారంభించాలని భావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏ గ్రూపులు వెన కబడి ఉన్నాయో రాష్ట్రాలు ఎలా నిర్ణయిస్తాయని న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘విధానాలు ఎలా అమలు ఎలా చేయాలో రాష్ట్ర ప్రభుత్వాలకు మేం చెప్పడం కాదు.. న్యాయసమీక్షకు లోబడి ఎలా అమలు చేయాలో రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. ‘మూడు హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయి.. అందులో రెండు పదోన్నతులు కొనసాగించాలని చెప్పగా ఒకటి స్టే ఇచ్చింది. కేంద్రం ముందు ఈ సమస్య ఉంద’ని అటార్నీ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్టేటస్ కో ఆదేశాల వల్ల 2,500 సాధారణ పదోన్నతులు ఏళ్ల తరబడి నిలిచిపోయానన్నారు. అడ్హక్ రూపంలో వాటిని చేపట్టాలని కేంద్రం భావిస్తోందని వేణుగోపాల్ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల నిబంధనల్లో ఈ గందరగోళాన్ని పరిష్కరించాలని కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. నిబంధనల్లో గందరగోళం వల్ల పలు రాష్ట్రాల్లో పదోన్నతులు నిలిచిపోయాయని తెలిపాయి. పలువురు సీనియర్ న్యాయవాదుల వాదనల అనంతరం ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు నోట్ రూపంలో రెండు వారాల్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల నిరీక్షణ ఫలించబోతోంది. త్వరలో వారికి పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వెయ్యిమందికి పైగా పదోన్నతులు లభించనున్నాయి. అధికారుల స్థాయిలో తక్కువగా.. ఉద్యోగులు, కార్మికుల స్థాయిలో ఎక్కువ పదోన్నతులు దక్కనున్నాయి. (చదవండి: Facebook: ఫేస్బుక్లో ఇష్టమొచ్చినట్లు డర్టీ పోస్టులు) మెకానిక్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజ్ సూపర్వైజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా పదోన్నతుల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రతి ఒక్కరికీ ఒక ర్యాంకు పెరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించనుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరుకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తుది కసరత్తు ముమ్మరం చేశారు. చదవండి: Andhra Pradesh: కోటి మందికి రెండు డోసులు