Rakesh Jhunjhunwala
-
మరో భారీ కొనుగోలుకు శ్రీకారం చుట్టిన ఆకాశ ఎయిర్!
ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఆకాశ ఎయిర్ మరో భారీ కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. కొద్ది రోజుల క్రితం అమెరికన్ విమాన తయారీదారు బోయింగ్ నుంచి 150 బోయింగ్ 737 మ్యాక్స్ 150 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. అయితే, తాజాగా ఆ విమానాల కోసం సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ నుండి 300 ఇంజిన్లను కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. లీప్-1బి ఇంజన్లు, విడిభాగాలు, ఇతర సేవల కోసం సీఎఫ్ఎం ఇంటర్నేషనల్తో కుదుర్చుకున్న ఈ డీల్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లని అంచనా. కాగా..దేశీయ, అంతర్జాతీయంగా కొత్త మార్గాల్లో సర్వీసులను ప్రారంభించేందుకు ఆకాశ ఎయిర్ ‘మ్యాక్స్ 10, ‘మ్యాక్స్ 8-200’ శ్రేణి విమానాల కోసం ఈ ఏడాడి ప్రారంభంలో విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. 2021లో ఆకాశ ఎయిర్ 72 బోయింగ్ 737 మ్యాక్స్లను బుక్ చేసుకుంది. గతేడాది మరో నాలుగింటికి ఆర్డర్ ఇచ్చింది. ఈ మొత్తంలో ఇప్పటికే 22 విమానాలను బోయింగ్ డెలివరీ చేసింది. ఇప్పుడు అదనంగా మరో 150 బోయిల్ విమానాలకు ఆర్డర్ పెట్టింది. విమానాల కొనుగోలు ఆర్డర్ పెట్టే సమయంలో చారిత్రాత్మకమైన విమానాల కొనుగోలుతో ప్రపంచంలోని టాప్ 30 ప్రముఖ ఎయిర్లైన్స్లో ఆకాశ ఎయిర్ ఒటిగా అవతరించేలా చేస్తుంది. అంతేకాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా సేవల్ని అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగడపుతుందని అకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు, సీఈఓ వినయ్ దూబే అన్నారు. -
సంక్షోభంలో ఆకాశ ఎయిర్, మూసివేత? సీఈవో స్పందన ఇదీ
Akasa Air Crisis మరో బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సంక్షోభంలో చిక్కుకుంది. దివంగత రాకేష్ ఝన్ఝన్వాలా ప్రధాన వాటాదారుగా గత ఏడాది సేవలను ప్రారంభించిన అకాశ ఎయిర్కు పైలట్ల సెగ తగిలింది. ఆకస్మాత్తుగా సంస్థకు గుడ్ బై చెప్పడంతో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఆకాశ ఎయిర్ కూడా మూత పడనుందనే వదంతులు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. పైలట్ రాజీనామా ఆందోళనల మధ్య ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. విశ్వసనీయతను నిర్ధారించడానికే విమానాలను తాత్కాలికంగా తగ్గిస్తుంది తప్ప మరేమీ కాదంటూ మూసివేత రూమరన్లు ఖండించారు. కొద్ది మంది పైలట్లు ఉన్నట్టుండి రిజైన్ చేయడంతో కొన్ని తమ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు. పైలట్లు చట్టవిరుద్ధంగా తప్పనిసరి ఒప్పంద నోటీసు వ్యవధిని అందించకుండానే వెళ్లిపోయారంటూ దూబే తెలిపారు. దీనికి పైలట్లపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఉద్యోగులకు అందించిన ఇమెయిల్లో వెల్లడించారు. సంస్థ దీర్ఘకాల కార్యకలాపాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, ఇడ్లీ బండి నడుపుకుంటున్నా!) దాదాపు 43 మంది పైలట్ల ఆకస్మిక నిష్క్రమణ కారణంగా స్వల్పకాలంలో తమ సేవలకు అంతరామమని దూబే ఉద్యోగులకు అందించిన ఇమెయిల్ సమాచారం తెలిపారు. కొంతమంది పైలట్ల నిర్ణయం కారణంగా జూలై, సెప్టెంబర్ మధ్య విమానాలకు అంతరాయం ఏర్పడిందనీ, చివరి నిమిషంలో రద్దు చేయవలసి ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు కస్టమర్ల కోసం అత్యుత్తమ విమానయాన సంస్థను నిర్మించామనీ, తమ ప్లాన్ ప్రకారం ప్రతి మైలురాయిని అధిగమించాని చెప్పారు. దీర్ఘకాలం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ దూబే వివరణ ఇచ్చారు. (మరో భారీ బ్యాంకు స్కాం: ఏకంగా రూ.3847 కోట్లకు ముంచేశారు) కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజా డేటా ప్రకారం, Akasa మార్కెట్ వాటా ఆగస్టులో 5.2 శాతం నుండి 4.2 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఆగస్టులో దేశీయంగా తొలి విమానాన్ని నడిపిన ఆకాశ ఎయిర్ ఆ తరువాత అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అర్హత సాధించింది. ఆగస్టు 1న బోయింగ్ 20వ B737 మ్యాక్స్ విమానాన్ని అందుకుంది. (జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) -
రాకేష్ ఝున్ఝున్ వాలా.. ‘ఆకాశ ఎయిర్’లో ఏం జరుగుతోంది?
స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలాకు చెందిన బడ్జెట్ ఎయిర్లైన్స్గా భావిస్తున్న ‘ఆకాశ ఎయిర్’ సంచలన నిర్ణయం తీసుకుంది. నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుండా సంస్థ నుంచి వైదొలగిన 43 మంది పైలెట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పైలెట్లు తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయా ప్రాంతాలకు సర్వీసులు అందించే ఆకాశ ఎయిర విమానయాన సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అధిక సంఖ్యలో విమానాల సేవల్ని రద్దు చేసింది. పైలెట్ల కొరతే విమానయాన సేవలపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బాంబే హైకోర్టుకు ఈ నేపథ్యంలో సంస్థకు రాజీనామా చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా 6 నెలల పాటు నోటీస్ పిరియడ్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా మరో సంస్థలో చేరిన పైలెట్లపై మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకునేలా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తమ సంస్థతో పైలెట్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. మరో సంస్థలో చేరే ముందు పైలెట్లు నోటీస్ సర్వ్ చేయాలి. కానీ అలా చేయకుండా నిబంధనల్ని ఉల్లంఘించారని కోర్టుకు విన్నవించింది. కాబట్టి సిబ్బంది తీసుకున్న నిర్ణయం వల్ల తామెంతో నష్టపోతున్నామని, న్యాయం చేయాలని కోరింది. పైలెట్లది అనైతిక, స్వార్థపూరిత చర్య ఈ సందర్భంగా విమానయాన చట్టం ప్రకారం.. ఉద్యోగులు తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా దేశ పౌర విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించారని ఆకాశ ఎయిర్ ప్రతినిధి తెలిపారు.‘ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాదు. పైలెట్ల అనైతిక, స్వార్థపూరిత చర్య కారణంగా ఈ ఆగస్టులో విమానాల సేవలకు అంతరాయం కలిగింది. పైలెట్ల కొరత కారణంగా చివరి నిమిషంలో విమానాల్ని రద్దు చేయాల్సి వచ్చింది. వేలాది మంది ప్రయాణికులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని అన్నారు. కాగా, ప్రస్తుతం 20 విమానాల సేవల్ని అందిస్తున్న ఆకాశా ఎయిర్ గత ఏడాది ఆగస్టు నెలలో కార్యకలాపాల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి👉 భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ వేతనాలు.. కెప్టెన్ నెల శాలరీ ఎంతంటే? -
దివంగత రాకేష్ ఝన్ఝన్వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?
దివంగత పెట్టుబడిదారుడు, బిలియనీర్ రాకేష్ ఝన్ ఝన్వాలా తన డ్రీమ్ హౌస్ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రత్యేకంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దు కునేందుకు కలలు కన్నారు. ఒక ప్యాషన్ ప్రాజెక్ట్లా ముంబైలోని ఖరీదైన ప్రాంతం, మలబార్ హిల్స్ ప్రాంతంలో 14-అంతస్తుల విశాలమైన బంగ్లా నిర్మాణం పూర్తి చేయకముందే కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో 2022 ఆగస్టులో కన్నుమూశారు. 2016-2017 మధ్య కాలంలో రిడ్జ్వే అపార్ట్మెంట్స్ అనే మొత్తం భవనాన్ని కొనుగోలు చేయడానికి రూ. 371 కోట్లు వెచ్చించిన బిగ్ బుల్ ఝున్ఝన్వాలా. 2013 సంవత్సరంలో 6 ఫ్లాట్లను స్టాండర్డ్ చార్టర్డ్ నుండి రూ. 176 కోట్లకు కొనుగోలు చేశారు. మిగిలిన 6 ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు వేచి చూసి మరీ నాలుగేళ్ల తర్వాత, రూ. 195 కోట్లకు అత్యధికంగా బిడ్ చేసి మరీ సొంతం చేసుకున్నారు. (యాపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ డిస్కౌంట్: దాదాపు సగం ధరకే! ) ఇటీవల ట్విటర్ యూజర్ ఝన్ఝన్వాలా ఇంటికి చెందిన సీఫేస్టెర్రస్ వీడియోనొకదాన్ని పోస్ట్ చేశారు. దీంతో వైరల్గా మారింది. ఆర్జే అని స్నేహితులు ప్రేమగా పిలుచుకునే ఝన్ఝన్ వాలా అభిరుచిని గుర్తు చేసుకున్నారు. అబ్బురపరిచే ఈ బంగ్లా జీవితం పట్ల ఆర్జేకు ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. మీడియా నివేదికల ప్రకారం ఈ బంగ్లా 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. టెర్రేస్లో ఆరు-సీట్ల డైనింగ్ టేబుల్, బార్, అవుట్డోర్ సీటింగ్ ఏరియాలు, పచ్చటి గడ్డి కార్పెట్, పచ్చదనంతో చక్కగా ఉండది. అలాగే నాలుగో అంతస్తులో పార్టీల కోసం బాంకెట్ హాల్, ఎనిమిదో అంతస్తులో జిమ్, స్టీమ్ రూమ్, స్పా , ప్రైవేట్ థియేటర్ తదితర సౌకర్యాలున్నాయి. బాంక్వెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, 5వ అంతస్తులో భారీ హోమ్ థియేటర్ కూడా ఉన్నాయి. పై అంతస్తు 70.24 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కన్జర్వేటరీ ఏరియా, రీ-హీటింగ్ కిచెన్, పిజ్జా కౌంటర్, అవుట్డోర్ సీటింగ్ స్పేస్, వెజిటబుల్ గార్డెన్గా రూపొందించారు. మిగిలినదాన్ని కుటుంబంకోసం ప్రత్యేకంగా కేటాయించారు. 10వ అంతస్తులో 4 పెద్ద గెస్ట్ బెడ్రూమ్ లున్నాయి. ఇక్కడ పిల్లలు కుమార్తె నిషిత, కవల కుమారులు ఆర్యమాన్ , ఆర్యవీర్ కోసం 11వ అంతస్తులో లగ్జరీ బెడ్ రూంలు ఉండేలా ప్లాన్ చేశారు. Rakesh Jhunjhunwala’s Terrace #RJ #Investing pic.twitter.com/PPfWbTVdHB — Rajiv Mehta (@rajivmehta19) May 11, 2023 తన కోసం పెద్ద బెడ్రూం స్టాక్ మార్కెట్ లెజెండ్ ఝున్ఝన్వాలాతన భార్య రేఖతో కలిసి 12వ అంతస్తులో విశాలమైన గదులు, విలాసవంతమైన సౌకర్యాలతో మాస్టర్ బెడ్రూమ్ తయారు చేయించుకున్నారు. ఇది సగటు 2BHK కంటే 20 శాతం పెద్దది. అలాగే బాత్రూమ్ ముంబైలో విక్రయించే సగటు 1 BHK అంత పెద్దది. ఇక భోజనాల గది 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్ కంటే పెద్దది. అంతేకాదు చిన్నప్పటినుంచి బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, అమెరికా బడా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్లను తన ఇంట్లో విందుకు ఆహ్వానించాలనే కోరిక ఉండేదిట. వీటితోపాటు, తన కలల ప్రాజెక్టు పూర్తి కాగానే ఆయన కన్నుమూయడం విషాదం. -
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ఝన్వాలా: హాట్ టాపిక్గా ఆ చెక్
బిలియనీర్ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా'గా పాపులర్ అయిన బిలియనీర్ రాకేష్ ఝన్ఝన్వాలా కన్నుమూసి నేటితో సంవత్సరం. ఇప్పటికీ ఇప్పటికీ, దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు ఆయనంటే ఎనలేని ప్రేమ, అభిమానం. అంతేకాదు మార్కెట్ నిపుణులు అతని పెట్టుబడి సూత్రాలను, సక్సెస్మంత్రాను కథలు కథలుగా గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసిన సమయంలో కూడా ఆయన బుల్లిష్గా ఉన్నారు. స్టాక్మార్కెట్లో షేర్ల కొనడం, అమ్మడం అనేది తెలివికి సంబంధించిన చర్యలు కాదు జ్ఞానానికి సంబంధించి అంటారాయన. తాజాగా ఆయనకు సంబంధించి ఒక విషయం విశేషంగా మారింది. రాకేశ్ ఝన్ఝన్ వాలా రాసిచ్చిన అతిపెద్ద చెక్ ఇపుడు హాట్టాపిక్గా మారింది. రేర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ ఉత్పల్ షేత్ ప్రకారం, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కోకి రూ.1,500 కోట్ల చెక్కును రాసిచ్చారట.. అయితే ఇది పోర్ట్ఫోలియోలో 10శాతం కూడా కాదు ఆయన పెట్టుబడులను వివిధ షేర్లలో పెట్టేవారని కూడా ఆయన చెప్పారు. చార్టర్డ్ అకౌంటెంట్, రాకేష్ ఝన్ఝన్వాలా తన స్టాక్ మార్కెట్ పెట్టుబడులను 1980ల ప్రారంభించారు. కేవలం రూ. 5,000తో ప్రారంభించి, అద్భుతమైన విశ్లేషణతో పోర్ట్ఫోలియోను విస్తరించుకుని భారీ లాభాలను ఆర్జించారు. 2002 తర్వాత దశాబ్దం తర్వాత, ఆయన సంపాదన బిలియన్ల డాలర్లకు చేరింది.బిగ్ బుల్ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎలా ఎంపిక చేసుకుంటారనే విషయంపై 'ది బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్: హౌ రాకేష్ జున్జున్వాలా మేడ్ హిస్ ఫార్చ్యూన్' పుస్తకంలో కొన్ని కీలక అంశాలను చర్చించారు. తన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ రేర్ (రాకేష్, భార్య రేఖా పేర్లలోని లోని తొలి అక్షరాలను కలిపి) ఎంటర్ప్రైజెస్ ద్వారా ఆగస్ట్ 14, 2022 నాటికి ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సుమారు రూ. 46,000 కోట్లు పెరిగింది.ఐదు పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థలతో పాటు రేర్ ఈక్విటీ ప్రైవేట్ లిమిటెడ్, రేర్ ఫ్యామిలీ ఫౌండేషన్ మరియు హోప్ ఫిల్మ్ మేకర్స్ అనే మూడు సంస్థలలో డైరెక్టర్గా ఉన్నారు.ఫోర్బ్స్ జాబితా 2022లో 438వ బిలియనీర్గా ర్యాంక్ను సాధించారు. 2021 జాబితా ప్రకారం అతను భారతదేశంలో 36వ అత్యంత సంపన్నుడు. కాగా 1960 జులై 5న పుట్టిన రాకేష్ ఝన్ఝన్వాలా 62 ఏళ్ల వయసులో గత ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసారు. మరణానంతరం ఆయనకు వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చేసిన కృషికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ లభించింది. ఈ అవార్డును రేఖా ఝన్ఝన్ వాలా అందుకున్నారు -
ర్యాలీస్లో రేఖా ఝున్ఝున్వాలా వాటాల విక్రయం
ముంబై: దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా తాజాగా ర్యాలీస్ ఇండియాలో మరో 6.2586 శాతం వాటాలను విక్రయించారు. దీంతో ఇకపై తన దగ్గర 2.278 వాటాలు (సుమారు 44.30 లక్షల షేర్లు) ఉన్నట్లవుతుందని ఆమె స్టాక్ ఎక్సేచంజీలకు తెలియజేశారు. 2013 మార్చి 11 నాటికి తమ వద్ద 2.03 కోట్ల షేర్లు (10.4581 శాతం వాటాలు) ఉన్నట్లు.. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 17 మధ్య తాము 37 లక్షల షేర్లు (1.9446 శాతం) విక్రయించామని పేర్కొన్నారు. జూలై 18 – జూలై 20 మధ్యలో మరో 1.21 కోట్ల షేర్లను (6.2586 శాతం) విక్రయించినట్లు వివరించారు. శుక్రవారం ర్యాలీస్ ఇండియా షేర్లు 1.31 శాతం క్షీణించి సుమారు రూ. 218 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,237 కోట్ల ప్రకారం రేఖ వద్ద ప్రస్తుతమున్న వాటాల విలువ సుమారు రూ. 96 కోట్లుగా ఉంటుంది. -
నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!
సాక్షి,ముంబై: టైటన్ లాభాల పంటతో ప్రముఖ ఇన్వెస్టర్ రేఖా ఝున్ఝన్వాలా సంపద భారీగా ఎగిసింది. శుక్రవారం నాటి నష్టాల మార్కెట్లోటైటన్ షేరు భారీగా లాభపడింది. టాటా గ్రూప్నకు చెందిన టైటన్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పబ్లిక్ షేర్హోల్డర్, దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝన్వాలా భార్య రేఖా ఝున్ఝన్వాలా నెట్వర్త్లో దాదాపు రూ. 500 కోట్ల మేర అదనంగా చేరింది. టైటన్లో ఝున్ఝున్ వాలాకు 5.29 శాతం ఉంది. రాకేష్ అమితంగా ఇష్టపడే, మల్టీబ్యాగర్ టాటా గ్రూప్ స్టాక్ టైటాన్ ఈ స్టాక్ శుక్రవారం ఇంట్రాడేలో కొత్త 52 వారాల గరిష్ఠ ఈ స్టాక్ ధర రూ.105.40 మేర పెరిగింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత, జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం టైటాన్ కంపెనీ షేర్లు ట్రేడింగ్లోకి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే 3.39 శాతం పెరిగి రికార్డు గరిష్ట స్థాయి రూ.3,211చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ టైమ్ హై లెవెల్ రూ. 2,85,077 కోట్లకు చేరింది. గత సెషన్లో రూ. 275,720 కోట్ల నుంచి రూ.9,357 కోట్లు పెరిగింది. (వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) టైటన్ షేరు ఏడాది కాలంలో ఏకంగా 50 శాతానికి పైగా పెరిగింది. జూలై 7, 2022 నాటికి బీఎస్సీలో రూ.2128 గా ఉన్న షేర్లు. శుక్రవారం కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.3211.10ని తాకింది. అంటే 2023లో టైటన్ షేర్లు 25 శాతం మేర లాభపడ్డాయన్నమాట. ఫలితంగా 5.29 శాతం వాటా ఉన్న ఝన్ ఝన్ వాలా రూ.494 కోట్ల విలువైన నోషనల్ లాభాలు ఆర్జించారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) టైటన్ కీలక వ్యాపారాలు రెండంకెల వృద్ధిని సాధించి క్యూ1లో ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. టైటన్ ప్రధాన ఆభరణాల వ్యాపారం సంవత్సరానికి 21 శాతం వృద్ధితో ఆకట్టుకుంది. టైటాన్ వాచీలు & వేరబుల్స్ విభాగం 13 శాతం వార్షిక వృద్ధిని, అనలాగ్ వాచీల విభాగంలో 8 శాతం వృద్ధిని, ఇతరాల్లో 84 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ విస్తరణలో భాగంగా గత త్రైమాసికంలో మొత్తం 18 స్టోర్లతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 559 చేరింది. -
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ వేతనాలు.. కెప్టెన్ నెల శాలరీ ఎంతంటే?
స్టాక్ మార్కెట్ మాంత్రికుడు, దివంగత రాకేష్ ఝున్ఝున్వాలా స్థాపించిన ఆకాశ ఎయిర్..సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు భారీగా పెరిగాయి. మిగిలిన విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగోలు పోటీ పడుతూ వందల సంఖ్యలో కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆకాశా ఎయిర్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆకాశా ఎయిర్లో పెంచిన 40 శాతం శాలరీలు జులై నుంచి అమల్లోకి రానున్నాయి. సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ (ఫ్లైట్ నడిపేవారు) ఉద్యోగుల జీతం నెలకు రూ.2.75లక్షల నుంచి రూ.3.40 లక్షలకు, సీనియర్ కెప్టెన్స్ల వేతనం రూ.5.75లక్షల నుంచి రూ.6.25లక్షలకు చేరింది. ఇక, పైలెట్ల జీతాలు అనుభవంతో పాటు ఎన్ని గంటల పాటు పైలెట్ విధులు నిర్వహించారనే ఆధారంగా శాలరీలు చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. కెప్టెన్లు నెలకు 60 గంటల ప్రయాణానికి గతంలో రూ.7.28లక్షలు ఉండగా.. తాజాగా నిర్ణయంతో రూ.7.75లక్షలు చేరింది. ప్రస్తుతం, ఉన్న పిక్స్డ్ పే అవర్స్ను 40 గంటల నుంచి 45 గంటలకు పెంచింది. వేతనాల సవరింపుతో ప్రతి అదనపు గంటకు కెప్టెన్ రూ. 7,500, ఫస్ట్ ఆఫీసర్ రూ. 3,045 పొందనున్నారు. అంచనా ప్రకారం.. ఆకాశ ఎయిర్ 19 విమానాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, పనిగంటల తక్కువగా ఉండడంతో ఆ ప్రభావం ఉద్యోగుల నెలవారీ జీతాలపై పడుతుంది. దీంతో పైలట్లు ఆశించిన సమయాల్లో విమానాలను నడిపించలేకపోతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ ఆకాశయిర్ వేతనాల్ని 40 శాతంతో జీతాలు భారీగా పెంచింది. చదవండి👉 మోదీ ‘హై - టెక్ హ్యాండ్ షేక్’.. భారత్కు పెట్టుబడుల వరద! -
15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్ఝున్వాలా
సాక్షి, ముంబై: ప్రముఖ మహిళా వ్యాపారవేత్త రేఖా ఝున్ఝున్వాలా మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలంలో 15 నిమిషాల్లో కోట్లాది రూపాయలను ఆర్జించారు. తన పోర్ట్ఫోలియోలోని టాటాగ్రూపునకు చెందిన టైటన్, టాటా మోటార్స్ షేర్ల లాభాలతో ఆమె మరింత ధనవంతురాలిగా మారిపోయారు. ఏకంగా 400కోట్ల రూపాయలను తన నెట్వర్త్కు జోడించుకున్నారు. ఈ ఆర్థికసంవత్సరంలో వ్యాపార వృద్ది, ఇతర వ్యాపార అప్డేట్స్తో సోమవారంనాటి మార్కెట్లో టైటన్, టాటా మోటార్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. రేఖా పోర్ట్ ఫోలియోలోని షేర్ల మార్నింగ్ డీల్స్తో ఆమె నికర విలువ ఆకాశానికి ఎగిసింది. ట్రేడింగ్ ఆరంభం 15 నిమిషాల్లోనే, టైటన్ షేరు ధర రూ. 2,598.70 గరిష్టాన్ని తాకింది. మునుపటి ముగింపుతో పోలిస్తే రూ. 50కు పైనే ఎగిసింది. అదేవిధంగా, టాటా మోటార్స్ షేరు ధర రూ. 32.75 పెరిగింది. రేఖా ఝున్ఝున్వాలా నెట్వర్త్ జూమ్ 2022 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికానికి టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, రేఖాకు 4,58,95,970 టైటాన్ షేర్ల ఉన్నాయి. ఇది కంపెనీ మొత్తం చెల్లించిన మూలధనంలో 5.17 శాతం. కాబట్టి, సోమవారం సెషన్లో మొదటి 15 నిమిషాల్లో టైటాన్ షేరు ధర పెరిగిన తర్వాత రేఖా నికర విలువ దాదాపు రూ.230 కోట్లు (రూ50.25 x 4,58,95,970) పెరిగింది. అలాగే టాటా మోటార్స్ షేర్లు 5,22,56,000 షేర్లు లేదా కంపెనీలో 1.57 శాతం వాటా. కాబట్టి, రేఖా నికర విలువలో మొత్తం పెరుగుదల దాదాపు రూ.170 కోట్లు (రూ.32.75 x 5,22,56,000). కాగా ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేశ్ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా. -
7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!
సాక్షి ముంబై: ప్రముఖ స్టాక్మార్కెట్ పెట్టుబడిదారుడు, దివంగత రాకేష్ ఝన్ఝన్వాలా ఆవిష్కరించిన ఆకాశ ఎయిర్ విస్తరణలో దూసుకుపోతోంది. బడ్జెట్ధరల్లో విమాన టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలనే ఆశయంతో బిగ్ బుల్ లాంచ్ చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆకాశ ఎయిర్ ఇపుడు విస్తరణలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. భారత విమానయాన రంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోపే .ఏడు నెలల్లోనే సంస్థ తనదైన ఘనతను సాదించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన ఫిబ్రవరి నెలవారీ గణాంకాల ప్రకారం.. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 3 శాతానికి చేరుకుంది. మార్చి చివరి నాటికి 18 ఎయిర్క్రాఫ్ట్లను చేర్చాలని భావించిన ఎయిర్లైన్ సంస్థ ప్రస్తుతం 19 విమానాలను కలిగి ఉంది. ప్రస్తుతం దేశీయ విమానయానంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో ఆగస్టు 4, 2006లో సేవలను ప్రారంభించగా, ఆగస్టు 7, 2022లో ఆకాశ ఎయిర్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మరోవైపు అప్పట్లో ఇండిగోలో స్టార్టప్ టీమ్లో భాగమై ఆదిత్య ఘోష్ ఇప్పుడు ఆకాశ ఎయిర్లో ఉండటం గమనార్హం. ఇండిగో మార్కెట్ వాటా కేవలం 2.6 శాతం. అలాగే ప్రస్తుతం 75కుపైగా దేశీయ గమ్యస్థానలకు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 గమ్యస్థానాలకు తన విమానాలను నడుపుతోంది. 2016 నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ (ఎన్సిఎపి) అమలులోకి వచ్చే వరకు, విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా ప్రయాణించడానికి ఐదేళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే కనీసం 20 విమానాలను కలిగి ఉండాలి. మారిన నిబంధన ప్రకారం కార్యకలాపాల వ్యవధిపై ఎలాంటి ఎటువంటి పరిమితులు లేవు. దీని ప్రకారం మార్చి 2023 చివరి నాటికి ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ విమానాలను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. 2024 చివరి నాటికి మొత్తం శ్రామికశక్తిని 3వేలకు చేరుకోనుంని సంస్థ దాదాపు 1,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుందని ఇటీవలి ఆకాశ ఎయిర్ వినయ్ దూబే ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి ‘మూడు అంకెల ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్’ చేయనున్నట్లు దూబే వెల్లడించారు. ఇప్పటికే ఆపరేషన్లో ఉన్న 19 బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్లతో పాటు, అకాశ ఎయిర్ మరో 72 విమానాలతొ విస్తరిస్తోందని, ఏప్రిల్లో ప్రారంభించిన తర్వాత 20వ బోయింగ్ 737 మ్యాక్స్ విదేశీ ఫంక్షన్లకు సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎయిర్లైన్ మరో తొమ్మిది విమానాలతో మొత్తం సంఖ్య 28కి చేరనుంది. అలాగే వేసవి చివరి నాటికి ప్రస్తుత 110 (17 దేశీయ మార్గాలలో) నుండి 150చేరనుందన. ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు లక్నోనుంచి గోవా, అహ్మదాబాద్లకు డైరెక్ట్ విమానాలను ప్రారంభించింది ఆకాశ ఎయిర్. నిరంతరాయమైన కనెక్టివిటీని అందించే లక్ష్యంతో, చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ఈ రెండు డైరెక్ట్ విమానాలు ఆదివారం లాంచ్ చేసింది. -
హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్ఝున్వాలా ఎంట్రీ!సూపర్!
సాక్షి,ముంబై: ప్రముఖ స్టాక్మార్కెట్ పెట్టుబడిదారుడు బిలియనీర్, దివంగత రాకేష్ ఝున్ఝున్వాలా భార్య రేఖా ఝున్ఝున్వాలా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఎంట్రీ ఇచ్చారు. 2023 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో 18 పరిశ్రమలు,99 నగరాల నుండి 176 మంది కొత్త ముఖాలు చోటు సంపాదించు కోగా రేఖా కుటుంబం జాబితాలోకి కొత్తగా ప్రవేశించిన 16 మంది సంపన్నుల జాబితాలో టాప్లో ఉంది. వీరి కంపెనీ రేర్ ఎంటర్ప్రైజెస్ ఈ లిస్ట్లోచేరింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం 69 మంది బిలియనీర్లతో ఈ జాబితాలో కొత్తగా చేరిన వారిలో చైనా అగ్రస్థానంలో ఉండగా, 26 మందితో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 8 శాతం తగ్గినప్పటికీ, ఇండియా 16 మంది కొత్త బిలియనీర్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన రేఖా నెలకు సుమారుగా రూ.650 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ఆమె తన దివంగత భర్త నుండి భారీ సంపదను వారసత్వంగా పొందింది. టాటా గ్రూప్ టైటన్ టాప్లోఉండగా, మెట్రో బ్రాండ్స్ ,స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ , క్రిసిల్ రేఖ టాప్ పిక్స్గా చెప్పుకోవచ్చు. ట్రెండ్లైన్ డేటా ప్రకారం, దివంగత రాకేష్ ఝున్ఝున్వాలా పోర్ట్ఫోలియో ఇప్పుడు రేఖ నిర్వహిస్తున్నారు.మార్చి 22, 2023 నాటికి నికర విలువ రూ.32,059.54 కోట్లతో 29 స్టాక్లు రేఖ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. రేఖ ఝున్ఝున్వాలా ఎవరు? బిగ్బుల్గా పాపులర్ అయిన రాకేష్ ఝున్ఝున్వాలా భార్య రేఖ. రాకేష్ను 1987లో వివాహం చేసుకున్నారు రేఖా. వీరి అసెట్ కంపెనీ రేర్ ఎంటర్ప్రైజెస్ లో రాకేష్ 3.85 శాతం వాటా ఉండగా, రేఖకు 1.69 శాతం వాటా ఉంది. ఉమ్మడి బలం ఇప్పుడు 5 శాతానికి పైగా మాటే. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు: నిష్ఠ, ఆర్యమాన్ ., ఆర్యవీర్. తొలి కుమార్తె 2004లో జన్మించగా వారి కవల కుమారులు 2009లో జన్మించారు. కాగా అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించాలన్న ఆలోచనతో ఆకాశ ఎయిర్ ప్రారంభించిన వారానికే (ఆగస్టు 2022) ఆయన కన్నుమూయడం విషాదాన్ని నింపింది. ఇపుడు పలు సర్వీసులతో విమానయాన రంగంలో స్పెషల్గా నిలుస్తోంది. అలాగే భర్త, 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా' పేరును నిలబెట్టేలా రేఖా కూడా సంపదలో దూసుకు పోతున్నారు. రాకేష్ ఝున్ఝున్వాలాకు పద్మశ్రీ మరోవైపు దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు వాణిజ్యం, పరిశ్రమల రంగంలో చేసిన సేవలకు గాను ఉగాది ( 2023 మార్చి 22) మరణానంతరం పద్మశ్రీని ప్రదానం చేశారు. ఈ వేడుకకు హాజరైన రేఖ కుటుంబం ఆయన తరపున అవార్డును స్వీకరించింది. -
Rekha Jhunjhunwala: నాలుగు గంటల్లో రూ.482 కోట్లు..
నాలుగు గంటల్లో రూ.482 కోట్లు ఆర్జించి రికార్డ్ సృష్టించారు రేఖా ఝున్ఝున్వాలా. ఆమె దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా సతీమణి. దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. ఆమె భర్త కూడా ప్రీ-ఐపీఓ కాలం నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెట్టారు. గతేడాది ఆయన మరణానంతరం స్టార్ హెల్త్తో సహా ఆయనకు సంబంధించిన అన్ని షేర్లు రేఖకు బదిలీ అయ్యాయి. స్టార్ హెల్త్ షేరు ధర సోమవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఇన్ట్రా డే గరిష్ట స్థాయి రూ.556.95ను తాకింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే ఇన్ట్రాడేలో ఒక్కో ఈక్విటీ షేర్ రూ.47.90 పెరిగింది. స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడంతో రేఖా ఝున్ఝున్వాలా దాదాపు రూ. 482 కోట్లు ఆర్జించారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టయిన తర్వాత రాకేష్ జున్జున్వాలా రెండింటిలోనూ 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్లను కలిగి ఉండేవారు. ఇది కంపెనీ మొత్తం చెల్లింపు మూలధనంలో 17.50 శాతం. ఆ షేర్లన్నీ ఇప్పుడు రేఖా ఝున్జున్వాలా సొంతమయ్యాయి. ఒక్కో షేరుకు రూ.47.90 పెరగడం ద్వారా ఆమె రూ.482 కోట్ల భారీ మొత్తం ఆర్జించిన్లయింది. టాటా కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆమె ఇటీవల రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు సంపాదించారు. రేఖా ఝున్జున్వాలా నికర ఆస్తి విలువ రూ. 47,650 కోట్లుగా అంచనా. (ఇదీ చదవండి: తెలిసిన జాక్మా జాడ! ఎక్కడ ఉన్నాడంటే..) -
హైదరాబాద్ నుంచి ఆకాశ ఎయిర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఆకాశ ఎయిర్ హైదరాబాద్ నుంచి సర్వీసులను నేటి (బుధవారం) నుండి ప్రారంభిస్తోంది. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–గోవా మధ్య ఇవి నడువనున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మరో రెండు సర్వీసులను ఫిబ్రవరి 15 నుంచి జోడించనున్నారు. విశాఖపట్నం సహా ప్రస్తుతం ఆకాశ ఎయిర్ దేశంలోని 13 నగరాలకు సేవలను అందిస్తోంది. ఈ ఏడాది మరో నాలుగైదు నగరాలు తోడవనున్నాయని కంపెనీ కో–ఫౌండర్ ప్రవీణ్ అయ్యర్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. సంస్థ వద్ద 14 విమానాలు ఉన్నాయని చెప్పారు. మార్చి నాటికి మరో నాలుగు వచ్చి చేరుతున్నాయని వెల్లడించారు. 2023 రెండవ అర్ధ భాగంలో అంతర్జాతీయ సర్వీసులు నడుపుతామని తెలిపారు. నాలుగేళ్లలో ఆకాశ ఎయిర్ ఖాతాలో 72 ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయని కో–ఫౌండర్ బెల్సన్ కొటినో పేర్కొన్నారు. -
ముహూరత్ ట్రేడింగ్: ‘మిస్యూ రాకేశ్ ఝన్ఝన్ వాలా’
సాక్షి, ముంబై: దీపావళి అంటే పటాసులు, దీపాలు, స్వీట్లు, లక్ష్మీ పూజ మాత్రమే కాదు ఇన్వెస్టర్లకు మరో ప్రత్యేక పండుగ కూడా ఉంది. అదే ముహూరత్ ట్రేడింగ్. ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు వ్యాపారులు ఒక శుభదినంగా భావిస్తారు. అందుకే ఈ రోజు కనీసం ఒక షేర్లో అయినా పెట్టుబడులు పెట్టి లాభాలు గడించాలని ట్రేడర్లు ఆశపడతారు. సాధారణంగా దివాలీ రోజు గంట సేపు నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లోనే ముగుస్తుంది. ఫలితంగా ఏడాదంతా షేర్ మార్కెట్లో లాభాలే లాభాలని ఇన్వెస్టర్లు భావిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 24న జరిగే ముహూరత్ ట్రేడింగ్ ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్, దివంగత రాకేశ్ ఝన్ఝన్వాలా లేకుండానే ముగియనుంది. ప్రతీ ఏడాది అనేక మంది ఇన్వెస్టర్లకు ఆయన ఇచ్చే సలహాలు, పెట్టుబడి సూత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. సాంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆహార్యంతో పలు ఛానెళ్లలో ఆయన మార్కెట్ మంత్రాను వివరించేవారు. మార్కెట్లో తన అనుభవం, టాప్ ప్లేస్కు చేరుకున్న తన ప్రస్థానం గురించి చెబుతూ ప్రేరణగా నిలిచేవారు. గత ఏడాది 101 కోట్ల రూపాయల లాభం గత ఏడాది దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా 5 స్టాక్ల పెట్టుబడిద్వారా రాకేష్ ఝన్ఝున్వాలా 101 కోట్ల రూపాయలు ఆర్జించారు. అంతేకాదు రాకేష్ రికమెండ్ చేసిన స్టాక్లు భారీ లాభాలను గడించాయి. ముఖ్యంగా ఫెడరల్ బ్యాంక్ ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్ను ఆకర్షించాయి. దీంతో షేర్ వరుస లాభాలతో ఆల్ టైం గరిష్టాన్ని తాకడం విశేషం. దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సెషన్లో బిలియనీర్ ఇన్వెస్టర్ లేని లోటు తీరనిదని, మిస్ యూ అంటూ విశ్లేషకులు, ట్రేడర్లు రాకేశ్ ఝన్ఝన్వాలాను గుర్తు చేసుకుంటున్నారు. ట్రేడర్లు ఆయన సూచనలు, సలహాలతోపాటు చమక్కులను కూడా మిస్ అవుతారంటూ నివాళులర్పిస్తున్నారు. కాగా ట్రేడర్గా చార్టెడ్ అకౌంటెంట్గా పేరుగాంచిన రాకేశ్ ఝున్ఝున్ వాలా ఈ ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
రాకేష్ ఝున్ఝున్వాలా ట్రస్ట్ బాధ్యతలు ‘గురువు’ గారికే!
సాక్షి,ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా ఆకస్మిక మరణం తరువాత ఆయన పెట్టుబడుల నిర్వహణ, ట్రస్ట్కు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. అయితే మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం ఝన్ఝన్వాలా విశ్వసనీయ మిత్రుడు, గురువు, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ ఝున్ఝున్వాలా ఎస్టేట్కు ప్రధాన ట్రస్టీగా వహిరిస్తారు. ఝున్ఝున్వాలా ప్రస్తుత పెట్టుబడులపై దమానీనే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇతర విశ్వసనీయలు కల్ప్రజ్ ధరంషి అమల్ పారిఖ్ ఇతర ట్రస్టీలుగా ఉంటారు. ఝున్ఝున్వాలా తన గురువుగా ఆర్కె దమానీని ఎపుడూ ప్రశంసిస్తూ ఉండేవారు. తన తండ్రి, టాటాస్, విన్స్టన్ చర్చిల్, జార్జ్ సోరోస్, రాధాకిషన్ దమానీ ఈ ఐదుగురు తనకు రోల్ మోడల్స్ అనీ, వారినుంచి స్ఫూర్తి పొందానని పలు ఇంటర్వ్యూలలో ఝున్ఝున్వాలా గుర్తుచేసుకునేవారు. అందుకే విభిన్నమైన వ్యక్తిత్వాలతో, దలాల్ స్ట్రీట్లో ఈ రెండు బిగ్బుల్స్ మధ్య ఫ్రెండ్షిప్ని బాలీవుడ్ మూవీ'షోలే'లోని జై-వీరూలతో ఎక్కువగా పోలుస్తారు అభిమానులు. ఝున్ఝున్వాలా సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం,గత ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నందున ప్రతీ విషయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. మరోవైపు ఆయన భార్య, వ్యాపారవేత్త రేఖా కూడా వ్యాపార కుటుంబానికి చెందినవారు, ఫైనాన్స్పై అపారమైన అవగాహన కూడా ఆమె సొంతం. దీంతోపాటు, రేఖా సోదరుడు సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే రేర్ ఎంటర్ప్రైజెస్ని ఉత్పల్ సేథ్ , అమిత్ గోలా ఆధ్యర్యంలోనే నడుస్తుంది. ఝున్ఝున్వాలాకా పెట్టుబడులపై సలహాలందించే ఉత్పల్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి సారించారు.ఇక అమిత్ గోలా ట్రేడింగ్ అంశాలపై ఆయనకు కుడిభుజంలాపనిచేసేవారు. అమిత్ ట్రేడింగ్ బుక్నికూడా నిర్వహిస్తున్నారు. కాగా ఆగస్ట్ 14న మరణించిన రాకేష్ ఝున్ఝున్వాలా లిస్టెడ్ , అన్లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులతో సహా కోట్లాది రూపాయల ఆస్తులను అతని భార్య ముగ్గురు పిల్లలకు వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. సక్సెస్ఫుల్ బిజినెస్మేన్గా రాణిస్తున్న రాధాకిషన్ దమానీ ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు కూడా. రిటైల్ కంపెనీ అవెన్యూ సూపర్మార్ట్ పేరుతో ఎంట్రీ ఇచ్చి డి-మార్ట్ చెయిన్తో పెద్ద సంచలనమే క్రియేట్ చేశారు దమానీ. 2022 జూన్ నాటికి అవెన్యూలో దమానీ నికర విలువ రూ. 1,80,000 కోట్లకు పైమాటే. -
ఇండియాపై పందెం కాసిన సాహసవంతుడు
రాకేశ్ ఝున్ఝున్వాలా నా ఇరుగింటివాడే. ఉత్సాహం ఉరకలెత్తే మనిషి. ఈ మధ్యే కలిశా. కొంచెం నలతపడ్డట్టు కని పించాడు. ఎలా ఉన్నారని అడిగితే, ఠకీమని ‘మై ఠీక్ హూ’ అన్న సమాధానం వచ్చింది. కానీ దశాబ్దాలపాటు ఇరుగు పొరుగుగా ఉన్న మా అపార్ట్మెంట్ భవనంలో ఇకపై ఆ కంచు కంఠం వినిపించదు. రాకేశ్ కుటుంబ నేపథ్యం సాధారణమైందే. తండ్రి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పని చేసేవారు. కొడుకు మంచి ఛార్టెర్డ్ అకౌంటెంట్ అవుతాడని ఆశించాడు. అయితే రాకేశ్ మంచి సీఏ అవడమే కాదు... స్టాక్ మార్కెట్ను శాసించగల స్థాయికి చేరతాడనీ, వందల మంది ఆరాధించే, అనుసరించే షేర్ గురువుగా ఎదుగుతాడనీ ఆ తండ్రి కూడా ఊహించి ఉండడు. అట్లాంటి వ్యక్తి అయిన నా మిత్రుడు దూరమయ్యాడన్న బాధ ఒకవైపు ఉండనే ఉంది. అదే సమయంలో అతడి జ్ఞాపకాలూ నన్నిప్పుడు వెంటాడుతున్నాయి. ఒకరకంగా రాకేశ్ ఓ మాటల మాంత్రికుడని చెప్పాలి. ఆయన పలికే ప్రతి మాటనూ శ్రద్ధగా విని, ఆయన బాగుండాలని కోరుకున్నవాళ్లు ఎందరో. అహ్మదాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గతంలో ఓ సెమినార్ ఏర్పాటు చేసి పాల్గొనాల్సిందిగా రాకేశ్ను ఆహ్వానించింది. అయితే అతడిని కలిసేందుకు వచ్చిన జనాలను నియంత్రించేందుకుగానూ ప్రవేశ రుసుమును ఐదు వేల రూపాయలుగా నిర్వాహ కులు ప్రకటించాల్సి వచ్చిందంటే అతడి జనాదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడో మాట చెప్పుకోవాలి. రాకేశ్ది చాలా ఉదార స్వభావం. స్టాక్ మార్కెట్ సలహాలు బోలెడు ఉచితంగానే ఇచ్చేసేవాడు. అతడి దృష్టిలో పెట్టు బడులు పెట్టేవాళ్లు అప్పుడప్పుడూ తమ జేబులు ఖాళీ చేసుకోవాలి. అలా చేస్తేనే మళ్లీ అవి నిండు తాయని నమ్మేవాడు. ఇలా రిస్క్ తీసుకునే తత్వం అతడి వైఖరిలోనూ స్పష్టంగా కనిపించేది. పెట్టే పెట్టుబడులు ధైర్యంగా పెట్టేవాడు. ఆటుపోట్లు ఎదురైనా ఏమాత్రం తగ్గేవాడు కాదు. రాకేశ్ ఈమధ్యే ‘ఆకాశ’ పేరుతో ఓ విమానయాన సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో అతడితో మాట్లాడుతూ కోటీశ్వరులను లక్షాధిపతులుగా మార్చిన రంగంలో ఎందుకు డబ్బులు పోస్తు న్నావని అడిగా. రాకేశ్ నవ్వుతూ ఇచ్చిన సమాధానమేమిటో తెలుసా? ‘‘నాకు గతంపై నమ్మకం లేదు. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటా. ప్రస్తుత ట్రెండ్ ఏమిటన్నది అంచనా వేస్తా. అందుకు తగ్గట్టుగానే డబ్బులు పెట్టుబడి పెడతా’’ అని! భారత్ వృద్ధి పథంలో ఉందనీ, పర్యాటకంతోపాటు ఇతర రంగాల్లోనూ డిమాండ్ పెరగనుందన్న అంచనా రాకేశ్ది. ఇతరుల వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడమూ రాకేశ్ నైజమని చెప్పాలి. కానీ అతడు భారత్ విజయంపై పందెం కాశాడు. బ్రాండ్ల విషయంలో అందరికంటే ముందు ఎక్కువ సాధికారత సాధించింది కూడా రాకేశ్ మాత్రమే. టైటాన్ గురించి తరచూ చెబుతూండేవాడు. బ్రాండ్ను మాత్రమే చూసి తాను అందులో పెట్టుబడి పెట్టగలనని అనేవాడు. నా స్నేహితుడి కంపెనీ బోర్డులో సభ్యుడిగా చేరాడు రాకేశ్. రావడం రావడంతోనే తన వ్యూహాలతో కంపెనీ విస్తరణను చేపట్టాడు. డిజిటల్ టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చాడు. ఫలితంగా ఒకప్పటి ఆ చిన్న కంపెనీ ఇప్పుడు వందకోట్ల డాలర్ల సంస్థగా (యూనికార్న్) ఎదిగింది. రాకేశ్ ఆలోచనలు సరళంగా, సంప్రదాయా లకు కట్టుబడి ఉండేవి కాదు. గందరగోళ పరిస్థితుల్లోనే వృద్ధి నమోద వుతుందని తరచూ అనేవాడు. ఎంత కష్టపడాలో అంతే ఉల్లాసం గానూ గడపాలన్నది రాకేశ్ సిద్ధాంతం. ‘‘విజయం తాత్కాలి కమైంది. కాలంతోపాటు కరిగి పోయేది’’ అని నమ్మేవాడు. రాకేశ్ గొంతు కొంచెం పెద్దదే. ఎక్కడ ఉన్నా మాటను బట్టే అతడిని గుర్తిం చవచ్చు. అయితే తన ఆరోగ్యం గురించి మాత్రం పెద్దగా పట్టిం చుకునే వాడు కాదు. రోజంతా పడ్డ కష్టాన్ని మరచిపోయేందుకు అతడు చేసే ప్రయత్నాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ మరుగున పడి పోయింది. రాకేశ్ పాల్గొన్న పార్టీలన్నింటిలోనూ సందడి ఎక్కువగా ఉండేది. సందర్భం ఏదైనా ఏమాత్రం శషభిషలు, సంకోచాలు లేకుండా ఎంజాయ్ చేసేవాడు. ఒకసారి తన పుట్టినరోజు జరుపుకొనేందుకు రెండు వందల మంది మిత్రులను తీసుకుని మారిషస్ వెళ్లాడు. ఒకవైపు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూంటే.. రాకేశ్ జూమ్ కాల్స్లో కమెడియన్లను పెట్టుకుని మరీ ఆనందంగా గడిపాడు. అప్పట్లో దీని గురించి పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు నేనున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ పక్కనే రాకేశ్ ఓ భారీ భవంతిని కడుతున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్లాలన్న ఆశ నెరవేరకుండానే పర లోకానికి చేరాడు. రాకేశ్ స్థాపించిన కంపెనీ ‘‘రేర్ ఎంటర్ప్రైజ్’’ పేరులో ఉన్నట్లే దాన్ని ఓ అరుదైన సంస్థగా తీర్చిదిద్దేందుకు తన జీవితకాలం మొత్తం శ్రమించాడు. దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు మొదలుకొని, దేశం మూలమూలల్లోని సాధారణ పెట్టుబడిదారులు కూడా రాకేశ్ను మరువలేరు. ఈ మార్కెట్ గురువును గౌరవాభిమానాలతో గుర్తు చేసుకుంటారు. నారింజ, ఊదా రంగుల్లోని ‘ఆకాశ’ విమానం ఎగిరిన ప్రతిసారీ రాకేశ్ స్ఫూర్తిని స్మరించుకుంటారు. రాకేశ్ మాట ఒకటి నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది: ‘‘చేయాలను కున్నది, కలలు కన్నది ఏదైనాసరే మొదలుపెట్టు. భయం లేకుండా చేసే పనుల్లో ఓ అద్భుతమైన శక్తి ఉంది.’’ మిత్రుడా! శాశ్వత నిద్రలో నీకు సాంత్వన చేకూరుగాక! బతికినంత కాలం ఉత్సాహంతో ఉరకలెత్తావు. నీ తదుపరి ప్రయాణమూ అదే విధంగా సాగిపోనీయ్!! హర్ష్ గోయెంకా వ్యాసకర్త ప్రముఖ పారిశ్రామిక వేత్త -
వారెన్ బఫెట్ పోలికపై రాకేష్ ఝున్ఝున్వాలా స్పందన వైరల్
సాక్షి,ముంబై: స్టాక్మార్కెట్ బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా కన్నుమూసి(ఆగస్టు14)రోజులు గడుస్తున్నా....ఆయనకు సంబంధించిన ఏదో ఒక వార్త విశేషంగా నిలుస్తోంది. ఇండియాలోనే అతిపెద్ద మార్కెట్ పెట్టుబడిదారులలో ఒకరైన రాకేష్ ఝున్ఝున్ వాలా ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు మాత్రమే కాదు, మంచి సరదా మనిషి కూడా. తనకోసం ఏర్పరచుకున్న నిబంధనలతో తనదైన జీవితాన్ని గడిపి, నచ్చిన పనిచేస్తూ, చేస్తున్న పనిని మనసారా ఆస్వాదించిన వ్యక్తిత్వం ఆయనది. అయితే ‘ఇండియాస్ వారెన్ బఫెట్’గా తనను పిలవడంపై గతంలో ఒక సందర్భంలో వెలిబుచ్చిన ఆయన తన అభిప్రాయం ఒకటి ఇపుడు వైరల్గా మారింది. "ఒరాకిల్ ఆఫ్ ఒమాహా" లాగా, రాకేష్ ఝున్జున్వాలా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వేల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. అందుకే ఆయనను ప్రపంచ పెట్టుబడిదారుడు ‘ఇండియాస్ వారెన్ బఫెట్’ తో పోలుస్తారు. 2012లో వార్తా సంస్థ రాయిటర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇది సరైన పోలిక కాదు (వారెన్ బఫెట్తో) అంటూ సున్నితంగా తిరస్కరించారు. తనతో పోలిస్తే సంపదలోగానీ, సాధించిన విజయాల్లోగానీ, పరిపక్వత పరంగా వారెన్ బఫెట్ చాలా ముందున్నారని చెప్పారు. ముఖ్యంగా బెర్క్షైర్ హాత్వే సీఈఓగా, 100 బిలియన్లడాలర్లకు పైగా నికర విలువతో, ప్రపంచంలోని 10 మంది ధనవంతులలో ఒకరుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!) కాగా 5 వేల రూపాయలతో రాకేష్ ఝున్జున్వాలా 1986లో స్టాక్మార్కెట్ అరంగేట్రం చేసిన అద్బుతమైన అంచనాలు, చాతుర్యంతో దేశీయంగా అతిపెద్ద పెట్టుబడి దారుడిగా నిలిచారు. చనిపోయే నాటికి రియల్ ఎస్టేట్, బ్యాంక్స్, ఆటో తదితర 30 కంపెనీల్లో విజయవంతమైన పోర్ట్ఫోలియో నిర్మించుకున్నారు. 5.8 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించారు. ఇటీవలే ఆకాశ ఎయిర్ పేరుతో ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించారు. కానీ అంతలోనే తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 14న రాకేష్ ఝున్ఝున్వాలా చనిపోవడంతో వ్యాపార వర్గాలు, అభిమానులతోపాటు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి లోనైంది. -
రాకేష్ ఝున్ఝున్వాలా సతీమణి వద్ద ఆ 19 స్టాక్స్.. విలువెంతో తెలుసా?
ఐకానిక్ ఫిగర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ రాకేష్ ఝున్ఝున్వాలా ఆగస్టు 14న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆయన లేని లోటు తీర్చలేనిదని స్టాక్ మార్కెట్ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన జీవిత భాగస్వామి అయిన రేఖా ఝున్ఘున్వాలా పోర్ట్ఫోలియోలో వివిధ రంగాలకు చెందిన 19 స్టాక్స్ ఉన్నాయి. వాటి విలువ రూ.9800 కోట్లుగా (సుమారు పదివేల కోట్లు). సమాచారం ప్రకారం మెట్రో బ్రాండ్లు (రూ. 3,310 కోట్లు), టైటాన్ కంపెనీ (రూ. 2,379 కోట్లు), స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ (రూ. 1,264 కోట్లు) ప్రధానంగా ఉన్నాయి. జూన్ 30, 2022 నాటికి ఆమె మెట్రో బ్రాండ్స్లో 14.43 శాతం, టైటాన్ కంపెనీలో 1.07 శాతం, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 3.10 శాతం వాటా ఉంది. ఆ తర్వాత వరుసలో క్రిసిల్ (రూ. 613 కోట్లు), ఎన్సీసీ (రూ. 515 కోట్లు), ది ఇండియన్ హోటల్స్ (రూ. 393 కోట్లు), టాటా కమ్యూనికేషన్స్ (రూ. 333 కోట్లు), ది ఫెడరల్ బ్యాంక్ (రూ. 231 కోట్లు), జూబిలెంట్ ఫార్మోవా (రూ. 173 కోట్లు), వీఏ టెక్ వాబాగ్ (రూ. 125 కోట్లు), రాలిస్ ఇండియా (రూ. 117 కోట్లు) ఉన్నాయి. 1987లో రాకేష్ ఝున్ఝున్వాలాతో రేఖా వివాహం జరిగింది. ఆమె సెప్టెంబర్ 12, 1963న ముంబైలో జన్మించారు. ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. చదవండి: పాపం..చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన రాకేశ్ ఝున్ఝున్వాలా! -
రాకేష్ ఝున్ఝున్వాలా హఠాన్మరణం, కుప్పకూలిపోతున్న షేర్లు!
స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత తొలిసారి ప్రారంభమైన స్టాక్ మార్కెట్లో బిగ్బుల్కు చెందిన అన్నీ షేర్లు కుప్పకూలిపోతున్నాయి. ♦ ముఖ్యంగా యాప్టెక్ లిమిటెడ్,స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ షేర్లు 5శాతం నష్టపోయాయి. ♦ బిగ్ బుల్ టైటాన్ షేర్లు 1.54శాతం నష్టపోయాయి. గతవారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ షేర్ వ్యాల్యూ రూ.2,471.95 ఉండగా.. ఇప్పుడు అదే షేర్ ప్రైస్ రూ.2,433వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ♦ జూన్ నెల త్రైమాసికం(వార్షిక ఫలితాలు)లో టైటాన్ కంపెనీలో రాకేష్ ఝున్ ఝున్ వాలా, ఆయన భార్య రేఖ షేర్లు 5.10శాతంతో రూ.11,086.9కోట్లుగా ఉంది. ♦ తొలి త్రైమాసికంంలో యాప్ టెక్ లిమిటెడ్లో రాకేష్ ఝన్ఝున్వాలా 23.40శాతంతో రూ.225కోట్లను పెట్లుబడులు పెట్టగా.. ఆయన మరణం కారణంగా బీఎస్ఈలో ఆ షేర్ వ్యాల్యూ క్షీణించింది. 3.67శాతం కంటే తక్కువగా రూ.224.20వద్ద ట్రేడ్ అవుతుంది. ♦ బిగ్బుల్కు పెద్దమొత్తంలో పెట్టుబడులున్న స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ షేర్లు భారీ పతనమవుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ కొనసాగే సమయానికి మునుపటి ముగింపు రూ .696.10తో పోలిస్తే 4.79 శాతం క్షీణించి రూ .662.75 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. జూన్ 2022 త్రైమాసికం నాటికి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్లో ఝున్ఝున్ వాలాకు 14.39 శాతంతో 8.28 కోట్ల షేర్లు, ఆయన భార్య రేఖా ఝున్ఝున్వాలాకు 3.10 శాతంతో 1.78 కోట్ల షేర్లు ఉన్నాయి. స్టార్ హెల్త్లో ఝున్ఝున్వాటా విలువ రూ.7,017.5 కోట్లుగా ఉంది. ♦ రాకేష్ ఝున్ఝున్వాలా ఫోర్ట్పోలియోకి చెందిన టాటా మోటార్స్ స్టాక్స్ 0.68 శాతం క్షీణించి రూ .480.75 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. జూన్ త్రైమాసికం చివరి నాటికి టాటా మోటార్స్లో రూ .1731.1 కోట్ల విలువైన షేర్లున్నాయి. ♦ బీఎస్ఈలో ఝున్ఝున్వాలా షేర్లున్న క్రిసిల్ లిమిటెడ్ షేరు మునుపటి ముగింపు రూ.3261.60 తో పోలిస్తే 0.56 శాతం క్షీణించి రూ .3243కు పడిపోయింది. జూన్ త్రైమాసికంలో క్రెడిట్ రేటింగ్ సంస్థలో ఆయనకు రూ .1301.9 కోట్ల విలువైన వాటా ఉంది. ♦ ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు బీఎస్ఈలో 0.20 శాతం తగ్గి రూ .281.30 వద్ద ట్రేడవుతుండగా.. ఇలా బిగ్బుల్ కు చెందిన అన్నీ షేర్లు నష్టాల పాలవ్వడంతో మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాకేశ్ ఝున్ఝున్వాలా భలే సరదా మనిషి!
ఆత్మీయులకు ‘భాయ్’... మార్కెట్కు ‘రాకీ’... ప్రపంచానికి ‘బిగ్ బుల్’... స్టాక్ మార్కెట్కు పర్యాయపదంగా ఇన్వెస్టర్లకు చిరపరిచితమైన మన భారతీయ ‘వారెన్ బఫెట్’ అర్ధాంతరంగా అల్విదా చెప్పేశారు!! ఒక సాధారణ ఇన్వెస్టర్గా మార్కెట్లోకి అడుగుపెట్టిన రాకేశ్ ఝున్ఝున్వాలా... అట్టడుగు స్థాయి నుంచి ‘ఆకాశ’మే హద్దుగా దూసుకెళ్లారు. ఆయన మాటే ఒక ఇన్వెస్ట్మెంట్ పాఠం... నడిచొచ్చే స్టాక్ ఎక్సే్ఛంజ్... ఇలా ఎన్ని చెప్పినా తక్కువేనేమో ఆయన గురించి! పట్టిందల్లా బంగారమే అనేంతలా, ఆయన పెట్టుబడులు కనక వర్షం కురిపించాయి. ఇప్పటికీ ‘రంకె’లేస్తూనే ఉన్నాయి. ‘ఇన్వెస్ట్మెంట్ గురు’గా పేరొందడమే కాదు... నవతరం ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ వైపు చూసేలా చేసిన ‘జూమ్ జూమ్’వాలా.. భారతీయ ఇన్వెస్ట్మెంట్ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతారు!! అలాంటి ఇన్వెస్టింగ్ మాంత్రికుడి హఠాన్మరణంపై పలువురు సంతాపం తెలిపారు. ఆర్థిక ప్రపంచంలో రాకేశ్ ఝున్ఝున్వాలా చెరగని ముద్ర వేశారు. భారతదేశ పురోగతిపై ఆయనకు ఎంతో ఆశావహంగా ఉండేవారు. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి ‘ఇన్వెస్టరు, రిస్కులు తీసుకునే సాహసి, స్టాక్ మార్కెట్లపై అపారమైన పట్టు గల రాకేశ్ ఝున్ఝున్వాలా ఇక లేరు. ఆయనకు భారత సామర్థ్యాలు, సత్తాపై అపార విశ్వాసం ఉండేది.‘ – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలపై రాకేశ్కు గల అవగాహన అపారం. సరదా వ్యక్తిత్వం, దయాగుణం, దూరదృష్టికి గాను ఆయన గుర్తుండిపోతారు. ఆయన కుటుంబానికి నా సానుభూతి. – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్ భారతదేశ వృద్ధి అవకాశాలపై గట్టి నమ్మకంతో రాకేశ్ సాహసోపేత నిర్ణయాలు తీసుకునేవారు. టాటా గ్రూప్ అంటే రాకేశ్కు ఎంతో గౌరవం. ఆయన లేని లోటు తీర్చలేనిది. – ఎన్ చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ నా స్నేహితుడి మరణం ఎంతో బాధ కలిగించింది. స్టాక్ మార్కెట్లపై అవగాహన కల్పించిన వ్యక్తిగా ఆయన అందరికీ గుర్తుండిపోతారు. – అనిల్ అగర్వాల్, చైర్మన్, వేదాంత రిసోర్సెస్ రాకేశ్ నా స్కూల్, కాలేజీ స్నేహితుడు. తను నాకన్నా ఒక ఏడాది జూనియర్. భారత్ విలువ మరెంతో ఎక్కువగా ఉంటుందని గట్టిగా నమ్మినవాడు. ఆర్థిక మార్కెట్లను అర్థం చేసుకోవడంలో నిష్ణాతుడు. కోవిడ్ సమయంలో మేము తరచూ మాట్లాడుకునేవాళ్లం. – ఉదయ్ కొటక్, ఎండీ, కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రఖ్యాత ఇన్వెస్టరు ఝున్ఝున్వాలా అకాల మరణం ఎంతగానో బాధ కలిగించింది. తన అద్భుతమైన విశ్లేషణలతో మన ఈక్విటీ మార్కెట్ల సత్తాపై ప్రజల్లో నమ్మకం కలిగేలా ఆయన స్ఫూర్తినిచ్చారు. ఆయన్ను ఎన్నటికీ మర్చిపోలేము. – గౌతమ్ అదానీ, చైర్మన్, అదానీ గ్రూప్ చదవండి👉రాకేష్ ఝున్ఝున్ వాలా విజయ రహస్యం అదే! -
పాపం..చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన రాకేశ్ ఝున్ఝున్వాలా!
వివాహమైన 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాకేశ్ దంపతులకు 2004లో సంతానం (కుమార్తె) కలిగింది. రాకేశ్ ఝున్ఝున్వాలా భార్య రేఖా ఝున్ఝున్వాలా కాగా, కుమార్తె పేరు నిష్ఠ. 2009లో ఇద్దరు కుమారులు ఆర్యమాన్.. ఆర్యవీర్ (కవలలు) పుట్టారు. తన కుమారులిద్దరూ పాతికేళ్ల వారయ్యాకా చూడాలని కోరుకుంటున్నానని 2010లో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రాకేశ్ చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం కుమారులిద్దరికీ దాదాపు పదమూడేళ్లు. మరోవైపు, 2021లో 13 అంతస్తుల భవంతి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. చదవండి👉 '1992 స్కాం' వెబ్ సిరీస్లో రాకేష్ ఝున్ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా? -
రాకేష్ ఝున్ఝున్వాలా: 5 వేలతో మొదలై.. 50 వేల కోట్లకు!
రాజస్తానీ మార్వాడీల కుటుంబానికి చెందిన రాకేశ్ ఝున్ఝున్వాలా.. ముంబైలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి ముంబైలో ఆదాయపు పన్ను శాఖ కమిషనర్గా పనిచేసేవారు. స్టాక్మార్కెట్లలో తండ్రి ఇన్వెస్ట్ చేస్తుండటం, వాటి గురించి స్నేహితులతో చర్చిస్తుండటం వంటి వాతావరణంలో పెరగడంతో తనకు చిన్నతనం నుంచే పెట్టుబడులపై ఆసక్తి ఏర్పడినట్లు రాకేశ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వార్తల్లో ఉన్న తీరును బట్టి కంపెనీలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయని తండ్రి వివరించడంతో 15 ఏళ్ల ప్రాయం నుంచే మార్కెట్ వార్తల్ని, షేర్లను పరిశీలించడం ప్రారంభించారు. డిగ్రీ తర్వాత స్టాక్ మార్కెట్ల వైపు వెళ్తానంటూ తండ్రికి చెప్పారు. కానీ సీఏ చేసి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాతే ఆ విషయాన్ని ఆలోచించాలని తండ్రి సూచించారు. ఆయన మాట ప్రకారమే సీఏ చదివిన తర్వాత మార్కెట్లోకి అడుగుపెట్టారు. తొలి పెట్టుబడి బంపర్ హిట్..! 1985లో సోదరుడు రాజేశ్ దగ్గర రూ. 5,000 తీసుకుని రాకేశ్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 5,000తో కొన్న టాటా టీ షేర్లు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. రూ. 43కి కొన్న షేరు మూడు నెలల్లోనే రూ. 143కి ఎగిశాయి. మూడు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నుంచి సెసా గోవా, టైటాన్ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ముందుకెళ్లారు. మార్కెట్లోకి రాకేశ్ అడుగుపెట్టినప్పుడు సెన్సెక్స్ 150 పాయింట్లుగా ఉండేది. ప్రస్తుతం అది 60,000 పాయింట్ల వద్ద ఉంది. ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో రాకేశ్ సంపద కూడా రాకెట్లా దూసుకెళ్లి సుమారు రూ. 46,000 కోట్ల స్థాయికి చేరింది. 2017లో టైటాన్ షేరు జోరు మీద ఉన్నప్పుడు 1 రోజులోనే ఏకంగా రూ. 900 కోట్లు ఆర్జించారు. రాకేశ్ కొన్న కంపెనీ షేరు పెరుగుతుంది.. అమ్మితే పడిపోతుంది అనే సెంటిమెంటుతో అసంఖ్యాకంగా ఇన్వెస్టర్లు ఆయన్ను ఫాలో అవుతున్నారు. వైఫల్యాలూ ఉన్నాయి.. రాకేశ్కు నష్టాలు తెచ్చిపెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ప్రధానంగా ఇన్ఫ్రా విభాగంలో పెట్టుబడులు ఆయనకు కలిసిరాలేదు. రియల్టీ భవిష్యత్ బాగుంటుందనే అంచనాలతో 2013లో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్లో రూ. 34 కోట్లు పెట్టి 25 లక్షల షేర్లు కొన్నారు. 2018లో కంపెనీ దెబ్బతిన్నప్పటికీ మరికాస్త కొన్నారు. కానీ చివరికి ఆ కంపెనీ దివాలా తీసింది. మంధన రిటైల్లోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. 2016లో సంస్థ షేరు రూ. 247గా ఉన్నప్పుడు 12.7% వాటా కొన్నారు. 2021లో రూ. 16కి అమ్మేశారు. అలాగే డీబీ రియల్టీలోనూ, ప్రైవేట్ ఈక్విటీ కింద చేసిన పెట్టుబడుల్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్లూ నష్టాలు తెచ్చిపెట్టాయి. వివాదాలూ ఉన్నాయి.. బిగ్ బుల్గా పేరొందినప్పటికీ ఆయన బేర్ పాత్ర పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1992 హర్షద్ మెహతా స్కామ్ సందర్భంలో షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా లాభాలు గడించారు. సాధారణంగా షేర్లంటేనే స్కాములనే దురభిప్రాయం కొంత ఉండే మార్కెట్లో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ లాంటి వారికి భిన్నంగా రాకేశ్కి కాస్త క్లీన్ ఇమేజే ఉంది. అయినప్పటికీ ఆయనపైనా ఆరోపణలు ఉన్నాయి. ఆప్టెక్లో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును 2021లో ఆయనతో పాటు మరికొందరు రూ. 37 కోట్లతో సెటిల్ చేసుకున్నారు. అలాగే సోనీ పిక్చర్స్లో విలీనం కావాలని జీ ఎంటర్ప్రైజెస్ నిర్ణయం తీసుకోవడానికి కొద్ది రోజుల ముందే.. జీ ఎంటర్ప్రైజెస్లో రాకేశ్ ఇన్వెస్ట్ చేయడం, స్వల్ప వ్యవధిలోనే రూ. 70 కోట్లు లాభాలు పొందడం, ఆయన వ్యవహారాలపై సందేహాలు రేకెత్తించాయి. కంపెనీల పోర్ట్ఫోలియో.. రాకేశ్కు 40 పైచిలుకు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. టాటా గ్రూప్లో భాగమైన టైటాన్ వీటన్నింటిలోకెల్లా ప్రత్యేకమైనది. వేల కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. టైటాన్లో ఆయనకున్న 5.05% వాటాల విలువే రూ. 11,000 కోట్ల మేర ఉంటుంది. స్టార్ హెల్త్, ర్యాలీస్, ఎస్కార్ట్స్, కెనరా బ్యాంక్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, టాటా మోటర్స్ మొదలైన సంస్థలలోనూ ఆయన ఇన్వెస్ట్ చేశారు. హంగామా మీడియా, ఆప్టెక్ సంస్థలకు చైర్మన్గా వ్యవహరించారు. వైస్రాయ్ హోటల్స్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, కాంకర్డ్ బయోటెక్, ప్రొవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొదలైన వాటిల్లో డైరెక్టరుగా ఉన్నారు. భార్య రేఖ, తన పేరు కలిసి వచ్చేలా రేర్ (RARE) ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసి, కార్యకలాపాలు సాగించేవారు. ఇటీవలే ప్రారంభమైన ఆకాశ ఎయిర్లైన్స్లో రాకేశ్, ఆయన భార్య రేఖకు 40% వాటాలు ఉన్నాయి. -
రాకేష్ ఝున్ఝున్వాలా మాటే పెట్టు'బడి'..!
కంపెనీల ఎంపిక... ఝున్ఝున్వాలా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టారంటే స్టాక్ మార్కెట్లో ఎంతో మంది ఇన్వెస్టర్లకు అది అనుసరణీయంగా మారుతుందనడంలో అతిశయోక్తి కాదు. మరో ఆలోచన లేకుండా అవే కంపెనీల్లో పెట్టుబడి పెట్టి గుడ్డిగా అనుసరించే వారూ ఉన్నారు. కానీ, ఎవరైనా స్వీయ అధ్యయనంతో పెట్టుబడి పెట్టినప్పుడే దాన్ని కొనసాగించగలరు. పెట్టుబడికి ముందు ఒక కంపెనీకి సంబంధించి ఎన్నింటినో ఝున్ఝున్వాలా చూస్తారు. ఎదుగూ, బొదుగూ లేని వ్యాపారంతో కూడిన క్రిసిల్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? అన్నది అప్పట్లో చాలా మంది నిపుణులు, ఇన్వెస్టర్లకు అర్థం కాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా వృద్ధి సాధిస్తుంటే, విశ్వసనీయమైన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల సేవలకు డిమాండ్ భారీగా పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. అదే నిజమైంది. రేటింగ్ ఏజెన్సీ మార్కెట్లో ఇప్పటికీ క్రిసిల్ లీడర్. 2002లో రూ.200 పెట్టి ఒక్కో క్రిసిల్ షేరు కొంటే, దాని విలువ ఇప్పుడు రూ.3,250. అన్ని సందర్భాల్లో ‘రైట్’ కానక్కర్లేదు విజయవంతమైన ఇన్వెస్టర్లు ఆచితూచి, సరైన స్టాక్స్ ఎంపిక చేసుకుంటారని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ, ఎంతో తలపండిన వారెన్ బఫెట్ దగ్గర్నుంచి ఝున్ఝున్వాలా వరకు స్టాక్స్ పెట్టుబడుల్లో ఎదురుదెబ్బలు సహజం. కనుక వైఫల్యాలను ఆమోదించి, పాఠాన్ని నేర్వడమే ఇన్వెస్టర్ చేయాల్సింది. ఝున్ఝున్వాలా ట్రాక్ రికార్డును పరిశీలిస్తే డిష్ టీవీ, డీహెచ్ఎఫ్ఎల్, మంధన రిటైల్ వెంచర్స్ ఇవన్నీ పెట్టుబడులను హరించివేసినవి. ఆయన పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న జియోజిత్ ఫైనాన్షియల్, బిల్కేర్, ఆటోలైన్ ఇండస్ట్రీస్ ఇలా చాలా కంపెనీలు విజయాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, అదే సమయంలో ఝున్ఝున్వాలా పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న కంపెనీల్లో మిగిలినవి గొప్ప రాబడులను ఇచ్చాయి. అందుకే ఆయన నష్టపోయిదానికంటే కూడబెట్టుకున్నది ఎక్కువ. టైటాన్ ఒక్కో షేరును రూ.5 కొనుగోలు చేశారు. నేడు అదే షేరు ధర రూ.2,472. ఈ ఒక్క పెట్టుబడి రాకేశ్ ఝున్ఝున్వాలా మొత్తం స్టాక్ మార్కెట్ జర్నీలో నష్టాలను పూడ్చేసి, అదనపు సంపదను తెచ్చిపెట్టింది. కనుక తప్పిదాలను గుర్తించి, అవసరమైతే ఆ కంపెనీల నుంచి తప్పుకోవడం, రానున్న రోజుల్లో సంపద సృష్టికి అవకాశం ఉన్న వాటిని గుర్తించి పెట్టుబడులు పెట్టడం కీలకం. ట్రేడింగ్/ఇన్వెస్టింగ్... చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ వేర్వేరు అని భావించరు. నిజానికి ఈ రెండూ విరుద్ధమైనవి. వీటికి అనుసరించే సూత్రాలూ భిన్నమైనవే. రాకేశ్ రూ.5,000తోనే ఇంతటి సంపద సాధించగలిగారా..? కాదు. పెట్టుబడికి నిధి కావాలి. ఆ విషయం ఝున్ఝున్వాలా త్వరగానే గుర్తించారు. మంచి పెట్టుబడి నిధి కోసం ఆయన ఆరంభంలో దశాబ్దం పాటు ట్రేడింగ్ను వృత్తిగా మలుచుకున్నారు.ఎదురుదెబ్బలు తగిలినా, కిటుకులు పట్టుకున్నారు. భారీ నిధితో పాటు, మార్కెట్ గురించి మంచి విజ్ఞానాన్నీ సంపాదించారు. ట్రేడింగ్ స్వల్పకాల రాబడిని ఇస్తుందని.. స్టాక్స్లో పెట్టుబడి పెడితే, దీర్ఘకాల సంపదగా మారుతుందని ఆయన చెప్పేవారు. అధ్యయనం/ప్యాషన్... జీవితం అంటే పశ్చాత్తాపాలు కాదు.. ప్రతి తప్పిదం నుంచి నేర్చుకునే మజిలీ అని ఝున్ఝున్వాలా చెబుతారు. తప్పులే తనను మెరుగైన ఇన్వెస్టర్గా మార్చాయని ఆయన స్వయంగా చెప్పారు. వేరే వారిని గుడ్డిగా అనుసరించి ఇన్వెస్ట్ చేయడం విజయాన్ని ఇవ్వదు. ఎవరికి వారు మార్కెట్ను అధ్యయనం చేయాలి. ప్రముఖ ఇన్వెస్టర్లు చేసిన తప్పులు, వారి విజయానికి దోహదం చేసిన అంశాలను నేర్చుకోవాలి. దీనివల్ల మరింత పరిణతితో లాభాలు పెంచుకోవడం సాధ్యం. రాకేశ్కు స్టాక్స్లో పెట్టుబడి అంటే ఓ ప్యాషన్. ఆయన సంపదలో 99 శాతం స్టాక్స్లోనే ఉందంటే ఈక్విటీల పట్ల ఆయనకున్న విశ్వాసం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘మార్కెట్లో సంపద కూడబెట్టుకోవాలంటే సొంతంగా పరిశోధన చేయాలి. నేర్చుకోవడాన్ని అభిరుచిగా మార్చుకోవాలి’ అని ఆయన సూచిస్తారు. నమ్మకం ఉంచాలి.. సరైన అవకాశం అని భావించినప్పుడు భారీగా పెట్టుబడి పెట్టడం ఝున్ఝున్వాలా విధానం. 1980ల్లో సెసాగోవా (ఇప్పుడు వేదాంతలో భాగం) అనే ఐరన్ఓర్ కంపెనీ షేరు రూ.24–25లో ఉన్న సందర్భంలో రాకేశ్ ఝున్ఝున్వాలా రూ.కోటి ఇన్వెస్ట్ చేశారు. ఐరన్ఓర్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉన్న రోజులవి. కానీ, ఆ కంపెనీలో ఎంతో విలువ దాగుందని ఆయన భావించి పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత నష్టాలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ, అదే షేరు తర్వాతి కాలంలో ఎన్నో రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. టైటాన్లోనూ అంతే. కంపెనీ అంతర్గత విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంటే అలాంటి కంపెనీలను ఝున్ఝున్వాలా విస్మరించరు. 2020 మార్కెట్ పతనంలో టాటా మోటార్స్ షేరు రూ.65కు పడిపోయింది. మార్కెట్ విలువ రూ.24,000 కోట్లకు దిగొచ్చింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి అంతర్జాతీయ బ్రాండ్తోపాటు, రూ.2,00,000 కోట్ల అమ్మకాలు కలిగిన కంపెనీ ఇంత తక్కువలో ట్రేడ్ అవ్వడం చాలా చౌక అని భావించి ఎక్స్పోజర్ తీసుకున్నారు. అక్కడి నుంచి టాటా మోటార్స్ ఏడు రెట్లకు పైగా పెరిగింది. సహనం ఓర్పు అన్నది ఈక్విటీ మార్కెట్లో రెండువైపులా పదునైన కత్తి వంటిది. మంచి యాజమాన్యం, ఆర్థిక బలం, కంపెనీ ఉత్పత్తి లేదా సేవల పట్ల ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఇలాంటి ఎన్నో బలాలున్న కంపెనీని ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టామంటే.. మంచి లాభాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ, అంచనాలు నిజమై మంచి రాబడినిచ్చే వరకు ఆగే ఓపిక కూడా ఉండాలి. ‘స్టాక్ మార్కెట్ ఓపిక లేని వాడి పెట్టుబడిని తీసుకెళ్లి ఓపిక వహించిన వాడికి రాబడిగా ఇస్తుంది’అన్నది వారెన్ బఫెట్ చెప్పేమాట. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొద్ది రాబడికే విక్రయించడం, బాగా నష్టం వచ్చిందని వెంటనే విక్రయించి బయటపడడం సక్సెస్ను ఇవ్వదు. రాకేశ్ ఝున్ఝున్వాలా పెట్టుబడుల ప్రయాణాన్ని గమనిస్తే చాలా స్టాక్స్లో ఆయన దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించినట్టు తెలుస్తుంది. తాను కొనుగోలు చేసింది వ్యాపారాన్నే కానీ, స్టాక్ను కాదని ఆయన నమ్ముతారు. కంపెనీ పనితీరు బాగుండి, ఆర్థిక మూలాలు బలంగా ఉన్నంత కాలం.. భవిష్యత్తు బాగుంటుందన్న విశ్వాసం ఉన్నంత కాలం ఆ పెట్టుబడులను ఓపిగ్గా కొనసాగిస్తారు. అదే రూ.5లో కొన్న టైటాన్ స్టాక్ రూ.2,500 అయినా అమ్మకుండా ఆయన్ను కొనసాగించేలా చేసింది. చదవండి👉 ఈ టిప్స్ పాటిస్తే స్టాక్ మార్కెట్లో మీరే మెగాస్టార్లు : రాకేశ్ ఝున్ఝున్వాలా -
ఝున్ఝున్వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా ఆకస్మిక మరణంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నివాళులు అర్పించారు. లెజండ్ ఎప్పటికీ జీవించే ఉంటారంటూ వరుస ట్వీట్లలో ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గుండెపోటు కారణంగా ఝున్ఝున్వాలా ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. (రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) "ఈ రోజు నేను నా సోదరుడిని కోల్పోయాను.. చాలామందికి తెలియని బంధం మాది. అందరూ అతణ్ని బిలియనీర్ ఇన్వెస్టర్ అని, బీఎస్ఈ బాద్షా అని పిలుస్తారు. కానీ ఆయన ఇప్పటికీ.. ఎప్పటికీ ఒక డ్రీమర్’’ అని ఆమె ట్వీట్ చేశారు. అందం..పట్టుదల, సున్నితత్వం ఆయన సొంతం. మై జెంటిల్ జెయింట్ అని ఆమె పేర్కొన్నారు. మనం మనంగా జీవించాలి అని భయ్యా (రాకేష్ ఝున్ఝున్వాలా) ఎపుడూ చెబుతూ ఉండేవారు. ది లెజెండ్, లెగసీ నిలిచే ఉంటుందంటూ స్మృతి వరుస ట్విట్లలో సానుభూతి ప్రకటించారు. ఇది చదవండి:Rakesh Jhunjhunwala: అల్విదా బిగ్బుల్ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం -
'1992 స్కాం' వెబ్ సిరీస్లో రాకేష్ ఝున్ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా?
1988 నుంచి 1991వరకు దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఇయర్స్. అప్పటికే 100ఏళ్ల చరిత్ర ఉన్న బాంబే స్టాక్ ఎక్ఛేంజీలో ఎప్పుడూ చూడని కొత్త పోకడ మొదలైంది. ఏరోజుకారోజు ఇన్వెస్ట్ చేయడం. లాభాలు గడించింది. ఇన్వెస్ట్ చేయడం మళ్లీ లాభాల కోసం వెయిట్ చేయడం. ఇలా బుల్ రన్తో సెన్సెక్స్ రోజుకో రికార్డ్ సృష్టించింది. కానీ 1992 ఏప్రిల్ 23 బాంబే స్టాక్ మార్కెట్లో భారీ స్కాం జరిగిందంటూ ఇన్వేస్టిగేటీవ్ జర్నలిస్ట్ సుచేతా దలాల్ బాంబు వేసింది. ఆమె రాసిన ఆర్టికల్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. (రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) ఇక సుచేతా దలాల్ ఎవరు? ఆమె హర్షద్ మెహతాను ఎందుకు టార్గెట్ చేసింది. ఆ స్కాం ఎలా చేశారు? బేర్ కార్టెల్ ఎవరు? ఇవన్నీ అటుంచితే. ఆ స్కాం గురించి 'స్కాం 1992' పేరుతో ఓ వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది. అందులో హర్షద్ మెహతా హవా జరిగే సమయంలో ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్ఝున్ వాలా ఎలాంటి ఒడిదుడుకు లోనయ్యారనే అంశం బాగా హైలెట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమాలోని రియల్ లైఫ్ క్యారక్టర్స్ ఎవరివో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదీ చదవండి: రాకేష్ ఝున్ఝున్వాలా 2021 నాటి వీడియో వైరల్ ♦ ప్రతిక్ గాంధీ - హర్షద్ మెహతా ♦ హర్షద్ మెహతా తమ్ముడు అశ్విన్ మెహత కేరక్టర్లో హేమంత్ కేర్ యాక్ట్ చేశారు ♦ హర్షద్ మెహతా భార్య జ్యోతి మెహతా పాత్రలో అంజలీ బారోత్ యాక్ట్ చేశారు ♦ సుచేతా దలాల్ పాత్రలో శ్రేయ దన్వంతరీ యాక్ట్ చేశారు ♦ డెబాషిస్ పాత్రలో ఫైసల్ రషీద్ యాక్ట్ చేశారు. ♦ మనుముంద్రా కేరక్టర్లో సతీష్ కౌషిక్ యాక్ట్ చేశారు ♦ రాధా కిషన్ దమానీ పాత్రలో పరేష్ గంట్రా యాక్ట్ చేశారు ♦ రాకేష్ ఝున్ ఝున్ వాలా పాత్రలో కెవిన్ డేవ్ నటించారు ♦ రాం జఠ్మలానీ పాత్రలో మిథులేష్ చతుర్వేదీ యాక్ట్ చేశారు. -
రాకేష్ ఝున్ఝున్వాలా 2021 నాటి వీడియో వైరల్
సాక్షి,ముంబై: ఐకానిక్ ఫిగర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ రాకేష్ ఝున్ఝున్వాలా హఠాన్మరణంపై ప్రధానమంత్రి, ఇతర మంత్రులు సహా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, బిజినెస్ వర్గాలు సంతాపం వ్యకం చేస్తున్నారు. ఈ సందర్భంగా లెజెండ్రీ ఇన్వస్టర్తో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. పలు వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు RIP Rakesh Jhunjhunwala ట్రెండింగ్లో నిలిచింది. బాలీవుడ్ పాపులర్ సాంగ్ కజరారే పాటకు వీల్ చైర్లో ఉండి కూడా ఉత్సాంగా డ్యాన్స్ చేసిన తీరు వైరల్గా మారింది. చదవండి : రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా? ముఖ్యంగా రాకేష్ ఝున్ఝున్వాలా 2021లో ‘కజరారే’ పాట బీట్కు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్గా మారింది. వీల్చైర్లో ఉన్న రాకేష్ తన స్నేహితులు , కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపిన వీడియోను కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ షేర్ చేశారు. రాకేష్ రెండు కిడ్నీలు పాడై పోయాయి, డయాలసిస్లో ఉన్నారు.. అయినా కానీ జీవితాన్ని జీవించాలనే బలమైన సంకల్పం ఆయనది అంటూ నిరుపమ్ ట్వీట్ చేశారు. కేశవ్ అరోరా తదితరులు ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ విషాదకరమైన రోజును గుర్తుంచుకోవాలని లేదు. ఆర్జే కన్నుమూసినా, ఆయన ఉత్సాహం, స్ఫూర్తి తనతోనే ఉంటుందని పేర్కొన్నారు. Rakesh Jhunjhunwala: అల్విదా బిగ్బుల్ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం राकेश झुनझुनवाला की दोनों किडनियाँ खराब हो गईं थीं। वे डायलिसिस पर थे। उनका यह वीडियो मौत को बौना बता रहा है। बस, जिंदगी जीने की जिद्द होनी चाहिए।#Rakeshjhunjhunwala pic.twitter.com/9tDIn9wr9G — Sanjay Nirupam (@sanjaynirupam) August 14, 2022 -
అల్విదా బిగ్బుల్: రాకేష్ ఝున్ఝున్వాలా జీవిత విశేషాలు, ఫోటోలు
-
అల్విదా బిగ్బుల్ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం
సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్ రాకేష్ ఝున్ఝున్వాలా(62) ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి గురిచేసింది. నేడు(ఆగస్టు 14న) ముంబైలో గుండెపోటుతో కన్నుమూయడంపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇంకా కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే బిలియనీర్ హఠాన్మరణంపై ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి : రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా? ఒక శకం ముగిసిందంటూ పలువురు పారిశశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, ఆయన అభిమానులు నివాళులర్పించారు. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్, బిలియనీర్ గౌతమ్ అదానీ, హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు అండ్ ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా తదితరులు ట్విటర్ ద్వారా సంతాపం వెలిబుచ్చారు. ఝున్ఝున్వాలా సలహాలు, సూచనలతో మార్కెట్లో విజయం సాధించిన పలువురు అభిమానులు ఆయన ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుని కంట తడి పెట్టు కుంటున్నారు. పెట్టుబడిదారులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తన గుమిగూడడంతో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్కెట్లో ఆయన లేని లోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం భారతదేశానికి చెందిన వారెన్ బఫెట్ అని పిలుచుకునే నికర విలువ 5.8 బిలియన్ డాలర్లు (ఆగస్టు 2022 నాటికి) ఇండియాలో 36వ సంపన్నుడు. ప్రపంచంలోని 438వ బిలియనీర్గా ఉన్నారు. Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7 — Narendra Modi (@narendramodi) August 14, 2022 Shri Rakesh Jhunjhunwala is no more. Investor, bold risk taker, masterly understanding of the stock market, clear in communication- a leader in his own right. Fondly remember several conversations we’ve had. Had strong belief in India’s strength and capabilities. Condolences — Nirmala Sitharaman (@nsitharaman) August 14, 2022 Shri Rakesh Jhunjhunwala is no more. Investor, bold risk taker, masterly understanding of the stock market, clear in communication- a leader in his own right. Fondly remember several conversations we’ve had. Had strong belief in India’s strength and capabilities. Condolences — Nirmala Sitharaman (@nsitharaman) August 14, 2022 Very saddened to know about the passing of the veteran investor Shree Rakesh JhunJhunwala. India has lost a gem, who made a mark not just on the stock market but on the minds of almost every investor in india.#RakeshJhunjhunwala pic.twitter.com/QX4uvBx7hA — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) August 14, 2022 -
రాకేష్ ఝున్ఝున్ వాలా విజయ రహస్యం అదే!
స్టాక్ మార్కెట్ . కోరికలకు రెక్కలు తొడిగే లెక్కల ప్రపంచం. చేతులు కాల్చుకోవాలన్నా. రాతలు మార్చుకోవాలన్నా. అన్నీ అక్కడే సాధ్యం. కోట్లాది మంది తలరాతలు మార్చే ఇన్వెస్టర్ల ప్రపంచం. అలాంటి కేపిటల్ మార్కెట్కు మెగస్టార్ అయ్యారు. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల కలల్ని నిజం చేసి హీరో అనిపించుకున్నారు. ఆయన మరెవరో కాదు ఇండియన్ వారెన్ బఫెట్.. రాకేష్ ఝున్ ఝున్ వాలా. కేవలం రూ.5వేల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి ప్రస్తుతం రూ.45వేల కోట్లను సంపాదించారు. అలాంటి దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్ గురించి ప్రత్యేక కథనం. స్టాక్ మార్కెట్లో అతను పట్టిందల్లా బంగారమే. నిమిషాల్లో పెట్టుబడులు పెట్టి వందల కోట్లు సంపాదించిన ఘనాపాఠీ. డబ్బును డబ్బుతో సంపాదించిన రాకేష్ ఝున్ఝున్ వాలా జులై 5, 1960లో హైదరాబాద్లో జన్మించారు. తండ్రి రాధేశ్యామ్ ఝున్ఝున్ వాలా ఇన్ కం ట్యాక్స్ అధికారి. విధుల నిమిత్తం రాకేష్ ఝున్ ఝున్ వాలా కుటుంబం ముంబైలో స్థిరపడింది. తండ్రి ఒప్పుకోలేదు లెక్కల్లో ఆరితేరిన రాకేష్ ఝున్ఝున్ వాలా.. కాలేజీ రోజుల్లో ఆయన తండ్రి రాధేశ్యామ్ తన స్నేహితులతో స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువగా చర్చించే వారు. దీంతో రాకేష్కు స్టాక్ మార్కెట్ పై మక్కువ పెరిగింది.ఆ రంగంలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆయన తండ్రి అందుకు ఒప్పుకోలేదు. తండ్రి మాట విన్నారు అయినా పట్టువదలకుండా స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు ఝున్ ఝున్ వాలా సిద్ధమయ్యారు. అదే సమయంలో తన తండ్రి ఝున్ ఝున్ వాలాకు ఓ సలహా ఇచ్చారు. ప్రతి రోజూ న్యూస్ పేపర్ చదవాలని, ఎందుకంటే స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులకు ఆ వార్తలే కారణమని సూచించారు. తండ్రి చెప్పిన ఆ మాటే రూ.5వేల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి ప్రస్తుతం రూ.45వేల కోట్లు సంపాదించేలా చేసిందని, ఇదే తనన విజయ రహస్యమని పలు మార్లు మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పారు.అంతేకాదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాడు. అందుకు ఓ షరతు విధించారు. తనని వద్ద నుంచి (తండ్రి) కానీ, తన స్నేహితులు దగ్గర డబ్బులు అడగకూడదని షరతు విధించారు. రాకేష్ అందుకు ఒప్పుకున్నారు. తమ్ముడి స్నేహితురాలే ఆసర తండ్రి మాట జవదాటని రాకేష్ ఝున్ ఝున్ వాలా వద్ద కేవలం 5వేలు మాత్రమే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువ మొత్తంలో కావాల్సి వచ్చింది. అందుకే రాకేష్ తన తమ్ముడి స్నేహితురాలి వద్ద డబ్బులు ఉన్నాయని, ఇంట్రస్ట్ ఎక్కువ ఇస్తే ఆ డబ్బులు ఇచ్చేస్తుందని తెలుసుకున్నాడు. బ్యాంకులు ఏడాదికి 10శాతం ఇంట్రస్ట్ ఇస్తే ఝున్ ఝున్వాలా ఆమెకు 18శాతం వడ్డీ ఇచ్చేలా రూ.5లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. తొలి ఫ్రాఫిట్ అదే రాకేష్ ఝున్ఝున్ వాలా 1986లో రూ.43పెట్టి 5వేల టాటా టీ షేర్లను కొనుగోలు చేశారు. కేవలం మూడు నెలల్లో ఆ స్టాక్స్ రూ.43 నుంచి రూ.143కి పెరగడంతో మూడు రెట్లు ఎక్కువ లాభం పొందారు. ఆ తర్వాత మూడేళ్లలో రూ.20లక్షల నుంచి 25 లక్షలు సంపాదించారు. అలా స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టిన ఝున్ఝున్ వాలా అప్రతిహాతంగా ఎదిగారు. మెగాస్టార్ అయ్యారు. 37స్టాక్స్ ఖరీదు రూ.20వేల కోట్లు 2021,మార్చి 31 నాటికి రాకేష్ ఝున్ ఝున్ వాలా టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, క్రిసిల్,లుపిన్,ఫోర్టిస్ హెల్త్ కేర్,నజారా టెక్నాలజీస్,ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్పొరేషన్, డీబీ రియాలిటీ, టాటా కమ్యూనికేషన్లో 37స్టాక్స్ను కొనుగోలు చేశారు. వాటి విలువ అక్షరాల 19695.3కోట్లుగా ఉంది. -
రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా ఇక లేరన్న వార్త అటు స్టాక్మార్కెట్ నిపుణుల్ని, ఇటు ఆయన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కేవలం 5 వేల రూపాయలతో స్టాక్మార్కెట్లో పెట్టుబడిదారుడిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించిన ఝున్ఝున్వాలా ప్రస్తుత నికర విలువ 5 బిలియన్ల డాలర్లకుపై మాటే అంటే ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిమార్కెట్ నిపుణిగా రాకేష్ సక్సెస్ఫుల్ జర్నీ చాలామందికి స్ఫూర్తిదాయకం. ఏ స్టాక్పై ఇన్వెస్ట్ చేయాలో, దాని ఫండమెండల్స్ ఏంటో అలవోకగా చెప్పగల సామర్థ్యం అతని సొంతం. స్నేహితుల ద్వారా స్టాక్ మార్కెట్పై పెంచుకోవడమే కాదు, లాభాలను అంచనా వేయడంలో పెట్టుబడిలో, రిస్క్ తీసుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా. కేవలం సంపదను ఆర్జించడమే కాదు, సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వానికి వినియోగించిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఇంగ్లీష్ వింగ్లీష్ రాకేష్ ఝున్ఝున్వాలా బాలీవుడ్ సినిమాల పట్ల చాలా అభిమానం. ఈ నేపథ్యంలో మూడు బాలీవుడ్ సినిమాలను నిర్మించారు. ఇంగ్లీష్ వింగ్లీష్, షమితాబ్,కి అండ్ కా అలాగే 1999లో మరో నలుగురు భాగస్వాములతో కలిసి హంగామా డిజిటల్ మీడియాను కూడా ప్రారంభించారు. ఇదే తరువాత హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.గా మారింది. ప్రస్తుతం దీనికి ఆయన కంపెనీ ఛైర్మన్గా ఉన్నారు. ముఖ్యంగా 'ఇంగ్లీష్ వింగ్లీష్' తో భారీ విజయం సాధించారు. గౌరీ షిండే దర్శకత్వంలో 2012లో దివంగత అందాల తార శ్రీదేవి ప్రధాన పాత్రగా ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీని నిర్మించారు.10 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 102 కోట్లను వసూళ్లతో భారీ ఆర్థిక విజయాన్ని సాధించింది. అంతేకాదు 2012 గౌరీ షిండే ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును గెలుచు కున్నారు. అంతేనా ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అకాడమీ అవార్డు కోసం ఇండియానుంచి అధికారిక ఎంట్రీగా షార్ట్లిస్ట్ అయింది. అనేక అంతర్జాతీయ ఉత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. శ్రీదేవి "మెరిల్ స్ట్రీప్ ఆఫ్ ఇండియా", "భారత మహిళా రజనీకాంత్"గా ప్రశంసలు దక్కించుకోవడం మరో విశేషం. అతను చైనీస్ వంటకాలను ఎక్కువగా ఆస్వాదించే పెద్ద ఆహారప్రియుడు కూడా. కుకింగ్ షోలను చూసి ఎక్కువ ఆనందించే వారట. సామాన్యుడికి విమాన సేవల్ని అందించాలన్న లక్క్ష్యంతో ఆకాశ విమానయాన సంస్థను స్థాపించారు. ఆగస్ట్ 7న తన సేవలను కూడా ప్రారంభించింది. సీఎన్బీసీ టీవీతో చివరిగా మాట్లాడిన ఆయన "భారతదేశం ఒక స్వర్ణకాలంలోకి అడుగుపెట్టబోతోంది,10 శాతం వృద్ధిని సాధిస్తుంది’’ అని రాకేష్ అంచనా వేశారు. కానీ ఇంతలోనే కిడ్నీ వ్యాధి, ఇస్కీమిక్ గుండె జబ్బుతో అనారోగ్యానికి గురైన ఆయన 62 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. -
ప్రముఖ వ్యాపారవేత్త, బిగ్బుల్.. రాకేష్ ఝున్ఝున్వాలా కన్నుమూత
ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్ఝున్ వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్ హాస్పిటల్లో చేరారు. వారం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఝున్ ఝన్ వాలా మరో సారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కాండీ బ్రీచ్ హాస్పిటల్కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. జూలై 5,1960లో హైదరాబాద్లో జన్మించిన రాకేష్ ఝున్ఝున్ వాలాకు చిన్న తనం నుంచి వ్యాపారం అంటే మక్కువ. అందుకే కాలేజీ విద్యార్ధిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.ఓ వైపు సీఏ(చార్టర్డ్ అకౌంటెంట్) చదువు కుంటూనే స్టాక్ మార్కెట్లో మెళుకువలు నేర్చుకున్నారు. అలా 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్ మార్కెటర్గా వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 2018 నాటికి అతని ఆస్తి రూ.11వేల కోట్లకు పెరిగింది. స్టాక్ మార్కెటర్,ఛార్టర్డ్ అకౌంటెంట్, హంగామా మీడియా,ఆప్టెక్లకు ఛైర్మన్గా, అలాగే వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లకు డైరెక్టర్గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఝున్ ఝున్ వాలా 'ఆకాశ ఎయిర్' ను ప్రారంభించారు. (చదవండి: పేటీఎం బాస్గా శర్మ నియామకాన్ని ఆమోదించొద్దు) -
'జొమాటో షేర్లలో అల్లకల్లోలం' రాకేష్ ఝున్ఝున్ వాలా మాటే నిజమైందే!
వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా రాకేష్ ఝున్ఝున్ వాలా చేసిన ప్రిడిక్షన్ నిజమైంది. ఏడాది క్రితమే జొమాటో షేర్ల పతనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో మదుపర్లను జొమాటో షేర్లను కొనవద్దని చెబితే వారు నన్ను ఫూల్ అంటారని వ్యాఖ్యానించారు. దేశీయ స్టాక్ మార్కెట్లన్నీ మంచి జోరుమీదున్న సమయంలో హఠాత్తుగా ‘జొమాటో’ షేర్లు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం ట్రేడింగ్ జరిగే 3గంటల సమయానికి జొమాటో షేర్ ధర రూ.45.90గా ఉండగా.. జులై 23,2021 నుంచి ఆ సంస్థ షేర్లు 61.33శాతం పతనమయ్యాయి. అదే సమయంలో గతేడాది స్టాక్ మార్కెట్లో ఐపీవో లిస్టింగ్కు వెళ్లిన ఇతర సంస్థల షేర్లు జోరుమీద ఉండడం..పేటీఎం, నైకా షేర్లు, జొమాటో షేర్లు భారీగా పతనం కావడంతో మదపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ తరుణంలో గతేడాది జరిగిన 'ఇండియా టుడే కన్లక్లేవ్'లో పాల్గొన్న ఝున్ఝున్ వాలా చేసిన వ్యాఖ్యల్ని మదుపర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇండియా టుడే కార్యక్రమంలో..జొమాటోతో సహా కొత్తగా లిస్టైన ఇతర కంపెనీల వాల్యుయేషన్పై ఝున్ఝున్ వాలా ఆందోళన వ్యక్తం చేశారు. జొమాటో స్టాక్స్ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో వివరించారు. ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశారు.హెచ్చరించారు. "ఈ రోజు నేను జొమాటో షేర్ని కొనవద్దు అని చెబితే, ప్రజలు నన్ను ఫూల్ అంటారు" అని వ్యాఖ్యానించారు. కారణం అదేనా గత ఏడాది జూలై 23న ఐపీవోకి వెళ్లిన జొమాటో ప్రమోటర్లు, ఉద్యోగులు, ఇతర పెట్టుబడిదారులకు ఈ ఏడాది జులై 23కి లాక్ ఇన్ పిరియడ్ ముగిసింది. జూలై 25 ,జూలై 26 ఈ రెండు రోజుల్లో స్టాక్ 20 శాతం భారీగా పడిపోయింది. నాటి నుంచి ఎన్ఎస్ఈలో జొమాటో షేర్ల పతనం కొనసాగుతుంది. దీంతో మదుపర్లు తమ పెట్టుబడులపై ఆందోళన చెందుతుండగా..నాడు జొమాటో స్టాక్స్ విషయంలో రాకేష్ ఝున్ఝున్ వాలా మాట విని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆకాశ ఎయిర్: రడీ టూ టేకాఫ్, టికెట్ ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: దేశీయ విమానయాన రంగంలో సేవలందించేందుకు ఆకాశ ఎయిర్ సర్వం సిద్ధం చేసుకుంది. బిలియనీర్, ప్రముఖ పెట్టుబడి దారుడు రాకేష్ ఝున్ఝన్వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్ తొలి వాణిజ్య బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ఆగస్టు 7న ముంబై-అహ్మదాబాద్ మార్గంలో గాల్లోకి ఎగరనుంది. దీనికి టికెట్ల విక్రయాలను నేటి(జులై 22) నుంచే ప్రారంభించింది. తొలిదశలో అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి నెట్వర్క్లకు కంపెనీ టిక్కెట్ల విక్రయిస్తోంది. ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్లో వారానికోసారి నడిచే 28 విమానాలతోపాటు ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి రూట్లో 28 విమానాల టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు ఆకాశ ఎయిర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే తొలి బోయింగ్ విమానం డెలివరీ అయిందని, రెండో విమానం ఈ నెలాఖరులోపు అందే అవకాశం ఉందన్నారు. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో విమాన కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు. దీంతో ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాల బుకింగ్లు మొబైల్ యాప్, మొబైల్ వెబ్, డెస్క్టాప్ వెబ్సైట్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. ఆకాశ ఎయిర్ ముంబై-అహ్మదాబాద్ మధ్య రోజువారీ విమానాన్ని కూడా నడుపుతుంది. ముంబై విమాన టిక్కెట్లు రూ. 4,314 నుండి ప్రారంభం. కాగా, అహ్మదాబాద్ నుండి ప్రారంభ ధర రూ. 3,906గా ఉంటాయి. బెంగళూరు నుండి కొచ్చికి రెండు రోజువారీ విమానాలను నడుపుతుంది. టికెట్ల ధర రూ. 3,483 నుండి ప్రారంభం.కొచ్చి నుండి తిరిగి వచ్చే విమానం టిక్కెట్ ధరలు రూ. 3,282 నుండి ప్రారంభం. కేఫ్ ఆకాశ అకాశ ఎయిర్ విమానాల్లో ‘కేఫ్ అకాశ’ బై-ఆన్-బోర్డ్ మీల్ సర్వీస్ను అందిస్తుంది. ఇందులో పాస్తా, వియత్నామీ రైస్ రోల్స్, హాట్ చాక్లెట్ అందిస్తుంది. అలాగే సంవత్సరం పొడవునా భారతీయ వంటకాలతో కూడిన పండుగ మెనూ కూడా ఉంటుందని తెలిపింది. -
గాల్లో తేలినట్టుందే! రాకేశ్ ఝున్ఝున్వాలాకు గుడ్న్యూస్
సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, స్టాక్మార్కెట్ గురు రాకేశ్ ఝున్ఝున్వాలాకు చెందిన ఆకాశ ఎయిర్కు డీజీసీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. లైసెన్స్ పొందిన ఆకాశ ఎయిర్ త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీంతో ఆకాశ ఎయిర్ ఎనిమిదో దేశీయ విమానయాన సంస్థగా అవతరించింది. అలాగే జెట్ ఎయిర్వేస్ కొత్త యాజమాన్యం తిరిగి సేవలను ప్రారంభించేందుకు అనుమతి పొందిన తరవాత ఫైయింగ్ లైసెన్స్ పొందిన రెండో ప్రయాణీకుల విమానయాన సంస్థగా నిలిచింది. ఈ మేరకు సంస్థ గురువారం ట్వీట్ చేసింది. ముఖ్యమైన మైలు రాయిని సాధించాం అంటూ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ) రావడంపై సంతో షాన్ని ప్రకటించింది. విమాన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయంటూ ట్వీట్ చేసింది. ఝున్ఝున్వాలా ‘ఆకాశ ఎయిర్’ పేరుతో దేశీయంగా విమానయాన రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 18 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ఎయిర్ క్రాఫ్ట్ లను ఆకాశ ఎయిర్ కొనుగోలు చేసింది. మొత్తం 72 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాల ద్వారా సేవలను అందించనుంది. We are pleased to announce the receipt of our Air Operator Certificate (AOC). This is a significant milestone, enabling us to open our flights for sale and leading to the start of commercial operations. — Akasa Air (@AkasaAir) July 7, 2022 -
రాకేశ్ఝున్ఝున్వాలా.. ఆకాశ.. మ్యాక్స్ 737
న్యూఢిల్లీ: మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాల నుంచి వస్తోన్న ఆకాశ ఎయిర్లైన్స్ కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఆకాశ ఎయిర్ ఖాతాలో బోయింగ్ 737 మ్యాక్స్ వచ్చి చేరింది. 2021 నవంబర్లో ఆకాశ ఎయిర్, బోయింగ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బోయింగ్ నుంచి మ్యాక్స్ రకం 72 విమానాలను ఆకాశ కొనుగోలు చేయనుంది. తొలి విమానం గురువారం డెలివరీ అందుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2023 మార్చి నాటికి 18 విమానాలు సంస్థకు చేరనున్నాయి. మిగిలినవి తదుపరి నాలుగేళ్లలో అడుగుపెడతాయి. చదవండి: విమాన చార్జీలను 15% పెంచాలి -
ఆకాశ ఎయిర్.. బేబీస్ డే అవుట్..
మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా నుంచి వస్తోన్న ఆకాశ ఎయిర్కి సంబంధించి తొలి విమానం విశేషాలను నెటిజన్లతో పంచుకున్నారు. హ్యాంగర్ నుంచి బయటకు వచ్చిన విమానం ఫోటోను ట్వీట్ చేస్తూ.. మేము మొదలు పెట్టబోతున్నాం.. మా బేబీ బయటకు వచ్చింది. మీరు కూడా ఓ క్యాప్షన్ పెట్టండి అంటూ ఆకాశ ఎయిర్ కోరింది. ఆకాశ ఎయిర్ ట్వీట్పై మరో ఎయిర్లైన్స్ సర్వీస్ ప్రొవైడర్ ఇండిగో స్పందించింది. హాలివుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ బేబీస్ డే అవుట్ను గుర్తుకు తెచ్చేలా బేబీస్ డే అవుట్ అంటూ నవ్వుతున్న రెండు ఎమెజీలు క్యాప్షన్గా పెట్టింది. దీనికి అదనంగా ప్లేన్ లేడీ క్రూ చేతిలో ఉన్న చంటి పిల్లాడి ఫోటోను జత చేసింది. మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా గత ఏడాది కాలంగా ఎయిర్లైన్ సర్వీసెస్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు సాధించారు. తొలి విడత విమానాలు కూడా కొనుగోలు చేశారు. జులై - ఆగస్టు త్రైమాసికంలో ఆకాశ ఎయిర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. Caption this! ✍️ We’ll start – Our baby’s day out! ☺️#ItsYourSky#AvGeek pic.twitter.com/xqRQSxKcXv — Akasa Air (@AkasaAir) June 2, 2022 చదవండి: టాటా సంచలన నిర్ణయం! ఎయిరిండియా ఉద్యోగులు ఇక ఇంటికే! -
ఏవియేషన్కు కొలువుల కళ!
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగా తగ్గిపోవడం, ప్రయాణాలపై అన్ని ఆంక్షలు తొలగిపోవడం ఏవియేషన్ పరిశ్రమకు కలసి వస్తోంది. దీంతో గత రెండేళ్ల నుంచి విహార యాత్రలకు దూరమైన వారు.. ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుని విమానం ఎక్కేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎయిర్లైన్స్ సంస్థలకు డిమాండ్ను పెంచుతున్నాయి. మరోవైపు రాకేశ్ ఝున్ఝున్వాలా నుంచి ఆకాశ ఎయిర్లైన్స్ కొత్తగా సేవలు ఆరంభిస్తుండడం, మరోవైపు చాలా కాలంగా నిలిచిన జెట్ ఎయిర్వేస్ సేవల పునరుద్ధరణతో ఈ రంగంలో ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వచ్చే రెండు త్రైమాసికాల్లో ఎయిర్లైన్స్ సంస్థలు సుమారు 30 శాతం మేర అదనంగా ఉద్యోగులను నియమించుకోవచ్చని పరిశ్రమ నిపుణుల అంచనా. ఆటోమేషన్ చుట్టూ చర్చ నడుస్తున్నప్పటికీ.. ఏవియేషన్ పరిశ్రమ ఎక్కువగా మానవవనరులపైనే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని టీమ్లీజ్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ (రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్) జోయ్ థామస్ తెలిపారు. ఏవియేషన్ పరిశ్రమలో నెలకొన్న ధోరణులను పరిశీలిస్తే వచ్చే రెండు క్వార్టర్లలో నియామకాలు 30 శాతం పెరగొచ్చని చెప్పారు. మాన్స్టర్ డాట్ కామ్ డేటాను పరిశీలిస్తే.. 2022 ఏప్రిల్ నెలలో ఏవియేషన్ రంగంలో నియామకాలు రెండంకెల స్థాయిలో పెరిగాయని తెలుస్తోంది. మారిన పరిస్థితులు.. కరోనా కారణంగా ప్రయాణాలపై విధించిన ఆంక్షల వల్ల ఏవియేషన్ రంగం గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను చూసిన మాట వాస్తవం. ఏవియేషన్, దీని అనుబంధ రంగాలు ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్రయిట్ ఫార్వార్డర్స్, కార్గో ఎయిర్లైన్స్ ఒక్కటే ఇందుకు భిన్నం. దీంతో ఏవియేషన్ రంగంలో భారీగా ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. వేతనాల్లో కోత పడింది. ఎయిర్లైన్స్ సంస్థలు 2020 ఏప్రిల్, మే నెలల్లో అసలు సర్వీసులే నడపలేని పరిస్థితి. ఆ తర్వాత నుంచి రెండేళ్లపాటు దేశీయ సర్వీసులకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో నష్టాలను తట్టుకోలేక ఉద్యోగుల వేతనాలకు కోతలు పెట్టిన పరిస్థితులు చూశాం. కరోనా రెండేళ్ల కాలంలో ఈ పరిశ్రమలో సుమారు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని పార్లమెంటరీ డేటానే చెబుతోంది. రూ.25,000 కోట్లకు పైగా పరిశ్రమ నష్టాలను ఎదుర్కొన్నది. ఇండిగో అయితే తన మొత్తం సిబ్బందిలో 10 మందిని తగ్గించింది. విస్తారా సైతం తన సిబ్బంది వేతనాలకు కోత పెట్టింది. స్పైస్జెట్, గోఫస్ట్ వేరియబుల్ పేను ఆఫర్ చేశాయి. కొత్త సంస్థలు.. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఆకాశ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు మొదలవన్నాయి. ఎయిర్ ఇండియా యాజమాన్యం మారిపోవడం, టాటా గ్రూపులో ఎయిర్లైన్స్ సంస్థల స్థిరీకరణ, కరోనా కేసులు తగ్గిపోవడం, విదేశీ సర్వీసులకు ద్వారాలు తెరవడం డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కమర్షియల్ పైలట్ల నియామకాలు వచ్చే కొన్నేళ్లపాటు వృద్ధి దశలోనే ఉంటాయని క్వెస్కార్ప్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ జోషి చెప్పారు. కొత్త సంస్థల రాక, ఉన్న సంస్థలు అదనపు సర్వీసులను ప్రారంభించడం వల్ల నిర్వహణ సిబ్బందికి డిమాండ్ పెంచుతుందని జోషి వివరించారు. -
రాకేష్ ఝున్ఝున్వాలా టార్గెట్ ఇదే: 'ఆకాశ'..ఫస్ట్ లుక్!
సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్ వాలా ఆకాశ ఎయిర్ పేరుతో విమాన సంస్థను ప్రారంభించారు. తాజాగా ఆ సంస్థకు చెందిన విమానాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాకేష్ ఝున్ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ విమాన సేవలు ఈ ఏడాది జులై నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పుటి వరకు ఆకాశ ఎయిర్ విమానాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి కోడ్ ఏంటనే విషయాలో వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్ తన సంస్థకు చెందిన విమాన రూపు రేఖల్ని ప్రజలకు పరిచయం చేసింది. విమానం ఆకారం, కలర్స్తో పాటు కోడ్లను వివరిస్తూ కొన్ని ఫోటోల్ని ట్వీట్ చేసింది. విమానాలకు కోడ్ ఏంటీ! దేశాన్ని బట్టి ఆయా సంస్థలకు చెందిన విమానాలకు కొన్ని కోడ్లు ఉంటాయి. ఉదాహరణకు..ఎయిర్లైన్కు 'క్యూపీ', ఇండిగో కోడ్ '6ఈ',గో ఫస్ట్ 'జీ8',ఎయిర్ ఇండియాకు 'ఏఐ' అని ఉంది. ఆకాశ ఎయిర్ సైతం తమ విమానాల కోడ్ ఏంటనేదీ రివిల్ చేసింది. కాంట్ కీప్ క్లైమ్! సే టూ హాయ్ అంటూ ఆకాశ ఎయిర్ విమానం కోడ్ 'క్యూపీ- పీఐఈ'! ట్వీట్లో పేర్కొంది. Coming soon to Your Sky! ✈️#AvGeek pic.twitter.com/nPpR3FMpvg — Akasa Air (@AkasaAir) May 23, 2022 ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తాము ముందుగా ప్రకటించిన సమయానికే ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. జున్ 2022కంటే ముందుగా ఫస్ట్ ఎయిర్ క్రాప్ట్ డెలివరీ అవుతుంది. జులై 2022 నాటికి ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఆపరేషన్ను ప్రారంభింస్తామని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తెలిపారు. బోయింగ్తో ఒప్పందం రాకేష్ ఝున్ఝున్ వాలా ఆకాశ ఎయిర్ విమానాల్ని తయారు చేసేందుకు అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఝున్ఝున్ వాలా గతేడాది నవంబర్ 26,2021న బోయింగ్ సంస్థతో 72 మ్యాక్స్ విమానాల్ని కొనుగోలు చేశారు. వీటితో పాటు 72బోయింగ్ 737మ్యాక్స్ ఎయిర్ క్రాప్ట్లు కూడా ఉన్నాయి. ఆ సంస్థ మొత్తం విమానాల్ని తయారు చేసి ఆకాశ ఎయిర్కు అప్పగించనుంది. ఇందులో భాగంగా బోయింగ్ కంపెనీ తొలి ఎయిర్ క్రాప్ట్ ను ఏ ఏడాది జున్ నాటికి ఆకాశ ఎయిర్కు అందించనుంది. Can’t keep calm! Say hi to our QP-pie! 😍#AvGeek pic.twitter.com/sT8YkxcDCV — Akasa Air (@AkasaAir) May 23, 2022 సాధ్యమేనా! కాంపిటీషన్, ఫ్లైట్ల నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాల వల్ల గడిచిన 10ఏళ్లలో పెద్ద సంఖ్యలో ఆయా విమాన సంస్థలు తమ సర్వీసుల్ని పూర్తిగా రద్దు చేశాయి. పదుల సంఖ్యలో విమానాలు ప్రభుత్వం ఆధీనంలో సేవలందిస్తున్న ఎయిర్ ఇండియా సైతం నష్టాలకు తట్టుకోలేక టాటా కంపెనీకి అమ్మేసింది. రతన్ టాటా ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడంతో కష్టాల నుంచి గట్టెక్కితే మిగిలిన సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కార్యకాలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో వాయిదూత్ ఎయిర్ లైన్స్, సహార ఎయిర్ లైన్స్, ఎండీఎల్ ఆర్ ఎయిర్లైన్స్, డక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్, దర్బంగా ఏవియేషన్, దమానియా ఎయిర్ వేస్, గుజరాత్ ఎయిర్ వేస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ మంత్రా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్లు ఉన్నాయి. సుమారు రూ.66వేల కోట్లు ఈ క్రమంలో రాకేష్ ఝున్ఝున్వాలా 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉంది. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకొని అప్పుల్లో కూరుకుపోవడంతో పెద్ద సంఖ్యలో ఏవియేషన్ సంస్థలు సర్వీసుల్ని నిలిపివేస్తే..ఇప్పుడు ఆకాశ ఎయిర్తో కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించడం కత్తి మీద సామేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉రాకేష్ ఝున్ఝున్వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..! -
బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా ప్లాన్స్లో మార్పులు.. కారణం ఇదే
ముంబై: సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా ఇన్వెస్ట్ చేస్తున్న ఆకాశ ఎయిర్ సర్వీసులు మరింత ఆలస్యంకానున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి తొలి విమానం(ఎయిర్క్రాఫ్ట్) ఈ ఏడాది జూన్ లేదా జులైలో అందే వీలున్నట్లు డీజీసీఏ సీనియర్ అధి కారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఎస్ఎన్వీ ఏవియేషన్ పేరుతో రిజిస్టరైన ఈ ముంబై సంస్థ గతేడాది అక్టోబర్లో పౌర విమానయాన శాఖ నుంచి నోఅబ్జక్షన్ సర్టిఫికెట్ను పొందిన సంగతి తెలిసిందే. తొలి విమానం వచ్చేది అప్పుడే తాజాగా చోటు చేసుకున్న మార్పుల ప్రకారం ఎయిర్లైన్స్ సర్వీసులు జులైలో ప్రారంభించే యోచనలో ఆకాశ ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి ఎయిర్క్రాఫ్ట్ను అందుకున్నాక తొలుత పరీశీలన ప్రాతిపదికన విజయవంతంగా సర్వీసులను నిర్వహించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. 2022 జూన్ మధ్యకల్లా తొలి విమానాన్ని పొందే వీలున్నట్లు ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు, ఎండీ వినయ్ దూబే అంచనా వేశారు. విమానయాన సర్వీసుల సంస్థ(ఏవోపీ)గా అనుమతులు పొందేందుకు ముందుగా పరిశీలనా సర్వీసులు చేపట్టవలసి ఉన్నట్లు తెలియజేశారు. వెరసి 2022 జులైకల్లా వాణిజ్య ప్రాతిపదికన సర్వీసులను ప్రారంభించగలమని భావిస్తున్నట్లు చెప్పారు. 2023 మార్చికల్లా 18 విమానాలను సమకూర్చుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చదవండి: రాకేష్ ఝున్ఝున్వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..! -
రాకేష్ ఝున్ఝున్వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..!
ఇండియన్ బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా జూన్ నుంచి విమాన సర్వీసుల్ని ప్రారంభించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఝున్ఝున్వాలాకు చెందిన 'ఆకాశ ఎయిర్' కార్యకలాపాలు జూన్ నుంచి ప్రారంభం కానున్నాయని ఆ సంస్థ సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు దుబాయ్ వేదికగా జరిగిన సైడ్లైన్స్ ఆఫ్ వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినయ్ దూబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే 5ఏళ్లలో 72 ఆకాశ ఎయిర్ విమాన కార్యకలాపాలు నిర్వహిస్తాయని తెలిపారు. ఇప్పటికే మినిస్టరీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) లైసెన్స్ పొందామని, జూన్ నెలలో ఆకాశ ఎయిర్ తొలి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాదు తమ వద్ద ప్రస్తుతం 18 విమానాలు ఉండగా.. ఏడాదికి 12 నుంచి 14 విమాన సేవల్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు దుబే చెప్పారు. ఇలా 5 ఏళ్లలో మొత్తం 72 విమానాల్ని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఎక్కడి నుంచి ప్రారంభం ఆకాశ ఎయిర్ లైన్ సేవల్ని మెట్రో నగరాల నుంచి టైర్-2, టైర్-3 నగరాల్లో, మెట్రో సిటీస్ నుంచి మరో మెట్రో సిటీలకు సర్వీసులు ఉంటాయని ఆకాశ ఎయిర్ లైన్ సీఈఓ తెలిపారు. ఇలా క్యాలండర్ ఇయర్-2023లో మొత్తం 20 విమాన సర్వీసుల్ని ప్రారంభించేలా టార్గెట్ పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. సుమారు రూ.66వేల కోట్లు రాకేష్ ఝున్ఝున్వాలా 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్ఝున్వాలా -
ఒక్కరోజులో రూ.861 కోట్లు సంపాధించిన ఇండియన్ వారెన్ బఫెట్..!
ఒక్కరోజులో ఎవరైన ఎంత సంపాదిస్తాం.. మహా అయితే 1000, 10వేలు రూపాయలు ఇంకా గట్టిగా మాట్లాడితే రూ.10 లక్షలు. కానీ, ఇండియన్ వారెన్ బఫెట్ రాకేశ్ ఝున్ఝున్వాలా మాత్రం ఏకంగా రూ.861 కోట్లు సంపాదించి, తన సత్తా ఏంటో మరోమారు మార్కెట్కు చూపారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్ టైటాన్ కంపెనీ, స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ మార్చి 17 ట్రేడింగ్లో ధగధగా మెరిసాయి. టైటాన్ షేర్లు మార్చి 17న రూ.2,587.30 నుంచి రూ.2,706కు పెరిగాయి, అంటే, ప్రతి షేరు విలువ రూ.118.70 పెరిగింది. అదేవిధంగా స్టార్ హెల్త్ షేరు ధర రూ.608.80 నుంచి రూ.641కు పెరిగింది, అంటే ఈ షేర్ ధర కూడా రూ.32.20 పెరిగింది. అక్టోబర్-డిసెంబర్ 2021 త్రైమాసీకంలో టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం.. రాకేశ్ ఝున్ఝున్వాలాకు, ఆయన భార్య రేఖా ఝున్ఝున్వాలాకు కంపెనీలో వాటా ఉంది. రాకేష్ ఝున్ఝున్వాలా 3,57,10,395 షేర్లు లేదా 4.02 శాతం వాటా కలిగి ఉంటే, రేఖా ఝున్ఝున్వాలా సంస్థలో 95,40,575 షేర్లు లేదా 1.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే రాకేష్ ఝున్ఝున్వాలా, రేఖా ఝున్ఝున్వాలా కలిసి కంపెనీలో 4,52,50,970 షేర్లు లేదా 5.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. తాజా ఎక్స్ఛేంజ్ కమ్యూనికేషన్ ప్రకారం.. బిగ్ బుల్ స్టార్ హెల్త్ 10,07,53,935 షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ మొత్తం వాటాలో 17.50 శాతం. ఝున్ఝున్వాలా 4,52,50,970 టైటాన్ షేర్లను కలిగి ఉన్నందున, అతని నికర విలువలో నికర పెరుగుదల సుమారు రూ.537 కోట్లు. అదేవిధంగా, అతను 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్లను కలిగి ఉన్నారు. గురువారం ప్రతి షేరు రూ.32.20 పెరిగింది, అంటే స్టార్ హెల్త్ షేర్ పెరగడం వల్ల అతని నికర సంపద సుమారు రూ.324 కోట్లు. అందువల్ల, టైటాన్ షేర్ ధర + స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడం వల్ల ఝున్ఝున్వాలా నికర విలువ మొత్తం పెరుగుదల సుమారు రూ.861 కోట్లు. (చదవండి: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎన్ని సార్లు మార్చవచ్చో తెలుసా?) -
ఈ కోర్స్లకు భారీ డిమాండ్, 50 లక్షల ఉద్యోగాలు.. హాట్ హాట్గా!
ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్ఝున్ వాలా ఐటీ ఉద్యోగాలపై ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఐటీ ఉద్యోగాలతో పాటు ఇతర అంశాలపై మాట్లాడారు. ఇటీవల ట్యాగ్డ్ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సంస్థ ఆ సర్వే ఆధారంగా.. మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలు రానున్న ఐదేళ్లలో 50లక్షల మంది ఉద్యోగుల నియామాల్ని చేపడతాయని రాకేష్ ఝన్ఝన్వాలా అన్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత గాడినపడుతున్న ఎకానమీ తీరుతో నియామకాలు భారీ ఎత్తున జరుగుతాయని జోస్యం చెప్పారు. సర్వే ఏం చెబుతోంది కొద్దిరోజుల క్రితం ట్యాగ్డ్ జరిపిన ఒక సర్వేలో మహమ్మారి తర్వాత ఎకానమీ పుంజుకోవడంతో 31 శాతం నియామాకాలు పెరుగుతాయని తేలింది. ఇక ఈ ఏడాది జరిగే ఉద్యోగాలు నియామకంలో 56 శాతం కంటే ఎక్కువ శాతం 0-5 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగుల ఎంపిక అధికంగా ఉండనుంది. టాప్ స్కిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ వంటి విభాగాలకు చెందిన ఉద్యోగాలకు హాట్ కేకుల్లా నియమకాలు జరుగుతాయని ట్యాగ్డ్ చేసిన సర్వేలో తేలింది. ఫ్రెషర్స్ కు బంపరాఫర్ రానున్న రెండేళ్లలోపు ఐటీ విభాగంగా ఫ్రెషర్స్, రెండేండ్ల లోపు అనుభవం ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని విప్రో చీఫ్ హ్యూమన్ రిలేషన్స్ అధికారి సౌరవ్ గొహిల్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మేము మా వర్క్-ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నాన్-ఇంజనీర్ ఫ్రెషర్లను కూడా రెట్టింపు చేసాము. వర్క్ఫోర్స్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఇందుకోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించామని గోవిల్ చెప్పారు. -
ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్ఝున్వాలా
ముంబై: బ్లూచిప్ స్టాక్స్తో పోలిస్తే రియల్టీ డెవలపర్లు తక్కువ రిటర్నులతోనే నెట్టుకొస్తున్నట్లు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా పేర్కొన్నారు. అందుబాటు ధరల హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టే సంస్థలు మాత్రమే స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టింగ్కు వెళ్లగలవని అభిప్రాయపడ్డారు. ఆశించిన స్థాయిలో అమ్మకాల పరిమాణాన్ని సాధించగలగడం దీనికి కారణమని తెలియజేశారు. డీఎల్ఎఫ్, మాక్రో డెవలపర్స్ తదితర కొద్ది సంస్థలు మాత్రమే లిస్టింగ్ను చేపట్టినట్లు పేర్కొన్నారు. డీఎల్ఎఫ్ షేరును తీసుకుంటే ఒకప్పుడు రూ.1,300 ధర నుంచి రూ.80కు పడిపోవడాన్ని ప్రస్తావించారు. ఇది రియల్టీ విభాగంలోని రిస్కులను వెల్లడిస్తున్నట్లు తెలియజేశారు. ఆకాశ పేరుతో ఇటీవల విమానయాన కంపెనీ ఏర్పాటుకు తెరతీసిన ఝున్ఝున్వాలా.. రేర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా స్టాక్ మార్కెట్, తదితర బిజినెస్లలో ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. ఆధారపడలేం తాను రియల్టీ డెవలపర్ను అయి ఉంటే కంపెనీని లిస్టింగ్ చేయబోనంటూ రాకేష్ వ్యాఖ్యానించారు. అనిశ్చితులతో కూడిన బిజినెస్ కావడమే దీనికి కారణమని తెలియజేశారు. రియల్ఎస్టేట్ రంగంపై సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో రాకేష్ ప్రసంగించారు. బ్లూచిప్ స్టాక్స్ 18–25 శాతం లాభాలను అందిస్తున్న సమయంలో 6–7 శాతం రిటర్నులకు పరిమితమయ్యే రియల్టీని లిస్టింగ్ చేయడంలోని ఔచిత్యాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)లు, కమర్షియల్ రియల్టీ పట్ల ఇన్వెస్టర్లు ఆశావహం(బుల్లిష్)గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐటీ సర్వీసులు, ఫార్మా తదితర రంగాలు వీటికి దన్నునివ్వవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో పెట్టుబడులు గతంలో ఐదు రియల్టీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసినట్లు రాకేష్ వెల్లడించారు. తద్వారా లాభాలు ఆర్జించినట్లు తెలియజేశారు. ఇల్లు కొనుగోలుకి ఆసక్తి పెరుగుతున్నదని, ఇకపై రియల్టీ రంగానికి ఆశావహ పరిస్థితులు ఏర్పడనున్నట్లు అంచనా వేశారు. తాను కూడా 2006లో ఇంటి కొనుగోలు కోసం క్రిసిల్ షేర్ల విక్రయం ద్వారా రూ.20 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు. అయితే ఈ వాటాను విక్రయించకుంటే ఈరోజు మరో రూ.1,000 కోట్ల సంపదను ఆర్జించేవాడినని తెలియజేశారు. కాగా.. ఆకాశ పేరుతో కొత్త విమానయాన సంస్థ ఏర్పాటుపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కంపెనీలో రూ. 275 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేశారు. పలు యూరోపియన్ ఎయిర్లైన్స్ సంస్థలు దెబ్బతిన్న సమయంలో ప్రారంభమైన ర్యాన్ ఎయిర్ తొలి రోజునుంచే లాభాలు ఆర్జించిన విషయాన్ని ఈ సందర్భంగా రాకేష్ ప్రస్తావించారు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించినట్లే ఆకాశ సంస్థను విజయవంతం చేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
10 నిమిషాల్లో రూ.186 కోట్లు సంపాదించిన బిగ్ బుల్
ముంబై: 10 నిమిషాల్లో ఎవరైన ఎంత సంపాదిస్తాం.. మహా అయితే వంద, వెయ్యి, పదివేలు రూపాయలు ఇంకా గట్టిగా మాట్లాడితే పది లక్షలు. కానీ, ఇండియన్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా మాత్రం ఏకంగా రూ.186 కోట్ల రూపాయలు సంపాదించి, తన సత్తా ఏంటో మరోమారు మార్కెట్కు చూపారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్ టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ నేటి(ఫిబ్రవరి 15) ట్రేడింగ్లో ధగధగా మెరిసాయి. దాదాపు టైటాన్ కంపెనీ 4 శాతం, టాటా మోటార్స్ 5 శాతం ర్యాలీ చేసింది. టైటాన్ షేర్ ధర సోమవారం ఎన్ఎస్ఈలో ₹2398 వద్ద ముగిసింది. అయితే ఇది ఈ రోజు ఉదయం 9:25 గంటలకు ప్రతి షేరు ధర స్థాయిలకు ₹2435 వరకు పెరిగింది. ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే 10 నిమిషాల్లో ప్రతి షేరు పెరుగుదలకు ₹37 పెరిగింది. అదేవిధంగా, మరో రాకేష్ ఝున్ఝున్వాలా హోల్డింగ్ కంపెనీ స్టాక్ టాటా మోటార్స్ షేర్లు ఈ రోజు ప్రారంభ గంటలో తలక్రిందులుగా తెరుచుకున్నాయి. టాటా మోటార్స్ షేర్ ధర ఈ రోజు +27.55(5.84%) పెరిగి రూ.499.00కు చేరుకుంది. అక్టోబర్ - డిసెంబర్ 2021 త్రైమాసీకంలో టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం.. రాకేశ్ ఝున్ఝున్వాలాకు, ఆయన భార్య రేఖా ఝున్ఝున్వాలాకు కంపెనీలో వాటా ఉంది. రాకేష్ ఝుంఝున్ వాలా 3,57,10,395 షేర్లు లేదా 4.02 శాతం వాటా కలిగి ఉంటే, రేఖా ఝున్ఝున్వాలా సంస్థలో 95,40,575 షేర్లు లేదా 1.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే రాకేష్ ఝుంఝున్ వాలా, రేఖా ఝుంఝున్ వాలా కలిసి కంపెనీలో 4,52,50,970 షేర్లు లేదా 5.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. (చదవండి: ఇండియన్ ఇంజనీర్ల అద్భుతం! జేమ్స్బాండ్ ఇక్కడ ఫైట్ చేయాల్సిందే) -
రాకేష్ ఝున్ఝున్వాలా కన్నుపడింది!!వందల కోట్ల పెట్టుబడులు షురూ!
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా రియల్టీ రంగ కంపెనీ డీబీ రియల్టీలో ఇన్వెస్ట్ చేయనున్నారు. భార్య రేఖా ఝున్ఝున్వాలాకు చెందిన రేర్ ఇన్వెస్ట్మెంట్స్ సైతం కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నారు. రుణరహిత కంపెనీగా ఆవిర్భవించేందుకు వీలుగా వారంట్ల జారీ ద్వారా రూ.1,575 కోట్లు సమీకరించనున్నట్లు డీబీ రియల్టీ వెల్లడించింది. ప్రమోటర్ గ్రూప్సహా ఇతర ఇన్వెస్టర్లకు దశలవారీగా ఈక్విటీ షేర్లుగా మార్పిడయ్యే 12.7 కోట్ల వారంట్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. రియల్టీ రంగ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇటీవలే డీబీ రియల్టీలో రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనకు స్వస్తి నేపథ్యంలో రాకేష్ కుటుంబ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. -
జెట్ ఎయిర్వేస్ 2.0లో కీలక పరిణామం
ముంబై: కొత్త ఏడాదిలో జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధీర్ గౌర్ షాక్ ఇచ్చారు. తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదివికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీనామా చేయడానికి గల కారణాలను మాత్రం గౌర్ వెల్లడించలేదు. అయితే రాకేశ్ ఝున్ఝున్వాలా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ వల్లే.. గౌర్ నిష్క్రమణ జరిగిందా? అనే కోణంలో ప్రత్యేక చర్చ మొదలైంది ఇప్పుడు. నరేష్ గోయల్ స్థాపించిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభం కారణంగా రెండు సంవత్సరాల పాటు సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరిగి 2022లో జెట్ ఎయిర్వేస్ 2.0 పేరుతో సర్వీసుల్ని పున:ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయాన్ని జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం అధికారికంగా వెల్లడించింది కూడా. మరోవైపు 2022 మొదటి త్రైమాసికంలో(వేసవిలోపే) విమానయాన సంస్థను పునఃప్రారంభించడానికి గత ఏడాది ఎన్సిఎల్టి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇన్వెస్ట్మెంట్ గురు, బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా ‘ఆకాశ ఎయిర్’ను కూడా తొలి త్రైమాసికంలోనే తెచ్చే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు. ఇదివరకే 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఈ మధ్యే లోగోను లాంఛ్ చేయగా.. బోయిగ్ సంస్థతో విమానాల కోసం ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జెట్ ఎయిర్వేస్ నుంచి తాతాల్కిక సీఈవో వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. సుధీర్ గౌర్ ఆకాశ ఎయిర్లో చేరతారా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇక నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ 2021 జూన్లో ఆమోదం తెలిపింది. 2022 నుంచి తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని జలాన్ కల్రాక్ కన్సార్షియం భావించింది. (చదవండి: అమెరికాలో అమెరికన్ కంపెనీకి దిమ్మదిరిగే షాక్..!) -
ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే కాసుల వర్షమే..ఎందుకంటే?!
ఇండియన్ బిగ్ బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా పరిచయం అక్కర్లేని పేరు. దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గురూగా పేరు తెచ్చుకున్న రాకేష్ ఆయన చేయి పెడితే చాలు.. ఎందుకు పనికి రావనుకునే పెన్నీ స్టాక్స్ సైతం బంగారం మయం అవుతాయి. ముదుపర్లకు కాసుల వర్షం కురిపిస్తాయి. అలాంటి మార్కెట్లో రాకేష్ ఝున్ఝున్వాలా గతేదాది ఓ ఐదు షేర్లమీద ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ షేర్ వ్యాల్యూ ఏడాది తిరిగేసరికల్లా.. డబులు త్రిబుల్ ఆయ్యింది. రాకేష్ ఆస్తి మరో రూ.1500కోట్లు పెరిగింది. దలాల్ స్ట్రీట్ మెగస్టార్ ఇన్వెస్ట్ చేసిన టైటాన్ స్టాక్స్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్నో ఏళ్ల క్రితం రాకేష్ ఝున్ఝున్వాలా టైటాన్ స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేశాడు. కానీ ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలల నుంచి ఆ స్టాక్ వ్యాల్యూ విపరీతంగా పెరిగింది. గత 3 నెలల్లో స్టాక్ రూ. 2161.85 (30 సెప్టెంబర్ 2021న నేషనల్స్టాక్ ఎక్చేంజ్ ముగింపు ధర) నుండి రూ. 2517.55 (31 డిసెంబర్ 2021న ఎన్ఎస్ఈలో ముగింపు ధర)కి పెరిగింది. స్టాక్ ధరలో భారీ పెరుగుదలతో, రాకేష్ జున్జున్వాలా నికర విలువ రూ. 1540 కోట్లు పెరిగింది. రాకేష్ ఝున్జున్వాలా షేర్హోల్డింగ్ ప్యాటర్న్ సెప్టెంబరు త్రైమాసికపు షేర్హోల్డింగ్ సరళి ప్రకారం, బిగ్ బుల్ రాకేష్ జున్జున్వాలా, అతని భార్య రేఖా జున్జున్వాలా టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటాన్లో దాదాపు 4.87 శాతం లేదా 4,33,00,970 ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. 30 సెప్టెంబర్ 2021 నాటికి, ఎన్ఎస్ఈలో స్టాక్ రూ. 2161.85 వద్ద ముగిసింది. కాగా, ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ.2517.55 వద్ద ముగిసింది. అంటే 3 నెలల్లో ఒక్కో షేరు దాదాపు రూ.355.70 లాభపడింది. ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే కాసుల వర్షమేనా ఇక స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన ప్రతీ ఒక్కరూ రాకేష్ ఝున్ఝున్వాలా షేర్లమీద వేలకోట్లు పెట్టుబడులు పెట్టడం, భారీ ఎత్తున లాభాల్ని అర్జించడం షరామామూలే. అందుకే ఇన్వెస్టర్లు ఝున్ఝున్వాలా ఏ చిన్న న్యూస్ వచ్చినా ఆసక్తిని కనబరుస్తారు. ముఖ్యంగా స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని నమ్ముతారు. అదే సమయంలో స్టాక్ మార్కెట్పై అనుభవం ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలని, లేదంటే వద్దని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? సోషల్ మీడియాతో జాగ్రత్త!! -
‘ఇది మీ ఆకాశం’.. బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా కొత్త మంత్రం
న్యూఢిల్లీ: ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్ఝున్వాలాకు చెందిన కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ .. తమ ట్యాగ్లైన్, ఎయిర్క్రాఫ్ట్ లివెరీ (రంగులు, గ్రాఫిక్లు మొదలైనవి)ని బుధవారం ఆవిష్కరించింది. నారింజ, ఊదా రంగులు, ’ఉదయించే అ’ చిహ్నంతో వీటిని రూపొందించింది. ఉదయించే సూర్యుడి స్నేహపూర్వక అనుభూతిని, సునాయాసంగా ఎగరగలిగే పక్షి సామర్థ్యాలను, విమాన రెక్కల విశ్వసనీయతను చిహ్నం ప్రతిబింబిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ’ఇది మీ ఆకాశం’ పేరిట రూపొందించిన ట్యాగ్లైన్.. సామాజిక–ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుం డా అందరికీ విమానయానాన్ని అందుబాటులోకి తేవాలన్న తమ బ్రాండ్ ఆకాంక్షకు స్ఫూర్తిగా ఉంటుందని పేర్కొంది. Unveiling ‘The Rising A’ of Akasa Air Inspired by elements of the sky, The Rising A symbolises the warmth of the sun, the effortless flight of a bird, and the dependability of an aircraft wing. Always moving upwards. Always inspiring to rise. pic.twitter.com/vzMDT9gEmv — Akasa Air (@AkasaAir) December 22, 2021 -
10 నిమిషాల్లో రూ. 230 కోట్లు మాయం..! బొక్కబోర్ల పడిన ఇండియన్ వారెన్ బఫెట్..!
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు..! ఓడలు బండ్లు..బండ్లు ఓడలవ్వడానికి ఎంత సమయం పట్టకపోవచ్చు. స్టాక్ మార్కెట్లలో మరీను..! ఎప్పుడూ భారీ లాభాలను తెచ్చి పెట్టే కంపెనీల షేర్లు.. అప్పుడప్పుడు భారీ నష్టాలను కూడా తెచ్చి పెడతాయి. ఇలాంటి సంఘటనే ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్ఝున్వాలాకు కూడా ఎదురైంది. అప్పుడు లాభాలు..ఇప్పుడు నష్టాలు..! బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా పోర్ట్ఫోలియోలో టాటా కంపెనీ షేర్లు అత్యంత ముఖ్యమైనవి. ఒకానొక సమయంలో టాటా కంపెనీ షేర్లు బిగ్బుల్కు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. గత కొద్ది రోజల నుంచి దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. బలహీనమైన గ్లోబల్ మార్కెట్ల సూచనలు, ఒమిక్రాన్ భయాలు, ఫెడ్ నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ రోజు నిఫ్టీ 381 పాయింట్లు పతనమై 16,604 స్థాయిలను తాకగా, బీఎస్ఈ సెన్సెక్స్ 1250 పాయింట్లు నష్టపోయి 55,761 స్థాయిలను తాకింది. స్టాక్ మార్కెట్స్ నష్టాల బ్లడ్ బాత్లో బిగ్ బుల్ రాకేష్ తడిసిపోయారు. సూచీలు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఏకంగా రెండు టాటా స్టాక్స్లో సుమారు రూ. 230 కోట్లను కోల్పోయాడు బిగ్బుల్. టైటాన్ కంపెనీ ద్వారా రూ. 170 కోట్లను, టాటా మోటార్స్తో రూ. 60 కోట్ల నష్టాలను రాకేష్ మూటకట్టుకున్నారు. టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం... ఈ కంపెనీలో రాకేష్ ఝున్ఝున్వాలా , అతని భార్య రేఖా ఝున్జున్వాలా భారీ వాటాలను కలిగి ఉన్నారు. టైటాన్ కంపెనీలో రాకేష్ ఝున్ఝున్వాలా 3,37,60,395 షేర్లను, రేఖా ఝున్ఝున్వాలా 95,40,575 షేర్లను కలిగి ఉన్నారు. అదేవిధంగా టాటా మోటార్స్ షేర్హోల్డింగ్లో రాకేష్ ఝున్ఝున్వాలా 3,67,50,000 షేర్లను కల్గి ఉన్నారు. భారీగా పతనమైన షేర్లు..! ఈరోజు ఎన్ఎస్ఈలో టైటాన్ కంపెనీ ధర శుక్రవారంతో పోల్చితే రూ. 39.30 తగ్గి రూ. 2238. 15 కు తగ్గింది. అదేవిధంగా టాటా మోటార్స్ షేరు ధర శుక్రవారంతో పోల్చితే రూ. 15.90 తగ్గి రూ. 454.30 కు చేరింది. చదవండి: వేల కోట్ల పన్ను కడుతున్నాడు? ఈ కుబేరుడి దగ్గర ఉన్న సంపద ఎంత? -
బ్రహ్మండం.. వెయ్యికి ఆరున్నర వేలు! నిజంగా ఈయన లక్కున్నోడే..
Rakesh Jhunjhunwala Made Rs 6,000 Cr Profit Via Star Health's IPO Listing: ఫ్లాప్ టాక్తో మొదలైన స్టార్ హెల్త్ ఐపీవో లిస్టింగ్ గాడిన పడుతోంది. బిగ్ బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా ప్రమోటర్గా ఉన్న స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు బలహీన లిస్టింగ్ నుంచి రికవరీ అయ్యాయి. దీంతో ఆయన తన పెట్టుబడికి ప్రతిగా 6వేల కోట్ల రూపాయలకు పైనే లాభం అందుకున్నారు. శుక్రవారం(డిసెంబర్ 10, 2021) మార్కెట్లో స్టార్ హెల్త్ సానుకూల ఫలితం అందుకుంది. షేర్ ధర 900రూ.గా 6 శాతం డిస్కౌంట్తో ముగింపు చవిచూసింది. ఈ పరిణామం రాకేశ్ ఝున్ఝున్వాలాకు సైతం భారీ లాభాన్ని అందించింది. స్టార్ హెల్త్లో ఉన్న సుమారు 1,287 కోట్ల రూ. పెట్టుబడిని 7,516 కోట్ల రూ.కి పెంచుకున్నారాయన. అంటే లాభం 6,229 కోట్ల రూపాయలన్నమాట. ఇక స్టార్ హెల్త్లో 14.98 వాటా (82,882,958 షేర్లు) రాకేశ్ పేరిట ఉండగా.. ఈయన భార్య రేఖా ఝున్ఝున్వాలా పేరిట 3.23 శాతం వాటా(17,870,977 షేర్లు ఉన్నాయి) అంటే ఇద్దరికీ కలిపి 10.08 కోట్ల షేర్లు ఉన్నాయన్నమాట. శుక్రవారం నాటి క్లోజింగ్ ధర రూ.906.85తో వీళ్లిద్దరి షేర్ల విలువను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం.. రూ.9,137 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ఇక ఈ జంట మార్చి 2019 నుంచి నవంబర్ 2021 మధ్య తొమ్మిది ట్రాన్జాక్షన్స్లో (సగటున 155.25రూ. చొప్పున ఈ షేర్లను కొనుగోలు చేశారు. లిస్టింగ్ పేలవం.. ఫ్లాట్గా ముగింపు ఇదిలా ఉంటే స్టార్ హెల్త్ ఐపీవీ ఇష్యూ ధర (రూ.900)తో పోలిస్తే బీఎస్ఈలో 6% నష్టం తో రూ.847 వద్ద లిస్టయ్యాయి. ఒక దశలో 8% నష్టపోయి రూ.827 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని దిగివచ్చింది. అయితే ద్వితియార్ధంలో మార్కెట్తో భాగంగా ఈ షేర్లు కూడా రికవరీ అయ్యాయి. మార్కెట్ ముగిసే సరికి 0.11 స్వల్ప లాభంతో రూ.901 వద్ద స్థిరపడింది. భారతదేశంలో రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇదిలా ఉంటే దాదాపు 31% మార్కెట్ వాటాతో స్టార్ హెల్త్ సెక్టార్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. స్టార్ హెల్త్ ఐపీవో వివరాలు స్టార్ హెల్త్ తన మూడు రోజుల ప్రారంభ వాటా విక్రయాన్ని నవంబర్ 30, మంగళవారం ప్రారంభించింది మరియు తరువాత డిసెంబర్ 2, గురువారం నాడు ముగించింది. కంపెనీ ప్రకటించిన ప్రకారం, స్టార్ హెల్త్ IPO యొక్క ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 870-900గా నిర్ణయించబడింది, అయితే ప్రారంభ వాటా విక్రయం ప్రైస్ బ్యాండ్ ఎగువ ముగింపులో రూ. 7,249 కోట్లు పొందవచ్చని అంచనా వేశారు. అయితే, ఎనిమిదో అతిపెద్ద IPOగా భావించిన స్టార్ హెల్త్ ఐపీవో 79% సబ్స్క్రిప్షన్ను మాత్రమే పొంది.. 6,400 కోట్ల రూ. ఐపీవోకి చేరింది. చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. 5 నెలల్లో లక్షకు రూ.34 లక్షలు లాభం! -
హ్హ..హ్హ..హ్హ!..హీరో అక్షయ్ కుమార్ నవ్వుతుంటే, బిగ్బుల్ హాయిగా నిద్రపోతున్నాడే
సౌతాఫ్రికా కరోనా కొత్త వేరియంట్ దెబ్బ ప్రపంచ దేశాల ఇన్వెస్టర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చిన్న సెంటిమెంట్కే బయపడిపోయే ఇన్వెస్టర్లకు శుక్రవారం భారీ ఎత్తున నష్టాల్ని చవి చూశారు.అందుకు కారణం కరోనా వేరియంటేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వేరియంట్ వార్తతో ఈరోజు ఉదయం మార్కెట్లో షేర్ల ధరలు పడిపోయాయి.సెన్సెక్స్ భారీగా పతనమైంది.ఇన్వెస్టర్ల ఊపిరి ఆగినంతపనైంది. లక్షకోట్ల రూపాయాల సొమ్ము గాల్లో ఆవిరైంది. మీమర్స్కు ఓ వెపన్ దొరకినట్లైంది. Indian Stock Market today:Like if you know what I mean 😜#StockMarket#India #Nifty#Niftybank #memecoin #MEMES pic.twitter.com/QpfFNTF2Vm— Poonam Soni (@CodeByPoonam) November 22, 2021 దక్షిణాఫ్రికాను కబళించేస్తున్న కరోనా కొత్త వేరియంట్ జర్మనీతో పాటు ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెను విధ్వంసం సృష్టిస్తుంది. శుక్రవారం మార్కెట్లో కరోనా ఎఫెక్ట్తో దేశీయ సూచీలు 8% క్షీణించి దాదాపు రూ.14 లక్షల కోట్లను బూడిదపాలు చేశాయి. Mean while stock market is not gender biased unlike this meme 😜#StockMarket #investments pic.twitter.com/0AcxVTs2IV— Swapnil Kommawar (@KommawarSwapnil) November 20, 2021 అయితే కొద్దిరోజుల క్రితం వరకు బుల్ రంకెలేయడంతో ఇన్వెస్టర్లతో పాటు కాస్తో కూస్తో అవగాహన ఉన్న వారికి సైతం అదో మాయలా అనిపించింది. ఇన్వెస్టర్లంతా ఏదో మేనియాలో ఉన్నట్లు, అదే ప్రపంచం అన్న దశకు చేరుకున్నారు. కానీ తాజాగా కోవిడ్ దెబ్బతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు, బిగినర్లు సైతం ఏమాత్రం అవగానలేకుండా పెట్టుబడి పెడితే ఎంత నష్టపోతామో గుర్తించారు. ITC when it realises that PayTM is the new meme stock in the market 😂 pic.twitter.com/MjsB4r8Ir8— Finance Memes (@Qid_Memez) November 20, 2021 ఇక ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి అభిప్రాయం అలా ఉంటే మీమ్ క్రియేటర్స్కు ఓ వెపన్ దొరికినట్లైంది. అందుకే ఎప్పుడు చేసిన మీమ్స్నే తాజాగా ట్రెడింగ్ చేస్తున్నారు. ముదుపర్లు ముద్దుగా ఇండియన్ బిగ్బుల్ అని పిలుచుకునే రాకేష్ ఝున్ ఝున్ వాలా, అక్షయ్ కుమార్, పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మతో పాటు పలు సినిమాల్లోని వీడియోలతో ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ పై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. అక్షయ్ కుమార్ నవ్వుతుంటే, బిగ్బుల్ హాయిగా నిద్రపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. చదవండి : బెంబేలెత్తిస్తున్న కరోనా, అక్షరాల రూ.14 లక్షల కోట్లు బూడిద పాలు -
Akasa Air: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..
భారత బిలియనీర్ స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్ఝున్వాలా స్టార్టప్ ఎయిర్లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. ఝున్ఝున్వాలా వాలా నేతృత్వంలో 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఇప్పుడు ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేస్తున్నట్లు నేడు(నవంబర్ 16) ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) అని ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది. ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దుబే మాట్లాడుతూ కంపెనీ తన మొదటి విమానాల ఆర్డర్ కోసం బోయింగ్ సంస్థతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. "ఈ కొత్త 737 మ్యాక్స్ విమానం కేవలం విమానయాన ఖర్చులను మాత్రమే తగ్గించకుండా తక్కువ ధరకు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తూ పర్యావరణ హితమైన సంస్థగా నడపాలనే మా లక్ష్యానికి మద్దతు ఇస్తుందని మేము నమ్ముతున్నాము" అని అన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి అని దుబే అన్నారు. ఆకాశ ఎయిర్ ప్రధాన ఉద్దేశ్యం భారతదేశం ఎదుగుదలకు శక్తిని అందించడంతో పాటు సామాజిక-ఆర్థిక లేదా సాంస్కృతిక నేపథ్యాలతో సంబంధం లేకుండా భారతీయులందరికీ సమ్మిళిత వాతావరణంలో ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందించడం అని దుబే తెలిపారు. అకాసా ఎయిర్ ఆర్డర్ చేసిన వాటిలో రెండు వేరియెంట్లు ఉన్నాయి. అవి ఒకటి 737-8, రెండవది అధిక సామర్ధ్యం గల 737-8-200. బోయింగ్ కమర్షియల్ ఎయిర్ ప్లేన్స్ అధ్యక్షుడు, సీఈఓ స్టాన్ డీల్ మాట్లాడుతూ.. వినియోగదారులకు అద్భుతమైన సేవలు అందించడంతో పాటు పర్యావరణ సుస్థిరతపై దృష్టి సారించే సృజనాత్మక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన ప్రాంతాలలో తక్కువ ధరకు సేవలను అందించడానికి బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై నమ్మకాన్ని ఉంచిందుకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: పబ్జీ మొనగాళ్లకు షాక్..! అలా చేస్తే మీ అకౌంట్లు బ్లాక్ అవుతుయ్..!) -
Rakesh Jhunjhunwala: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..
Rakesh Jhunjhunwala Akasa Air Ties Up With Boeing: భారత బిలియనీర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్ఝున్వాలా స్టార్టప్ ఎయిర్లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. కిందటి నెలలో సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు పొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆకాశ నుంచి బోయింగ్కు రూ.75,000 కోట్ల ఆర్డరు వెళ్లిందని సమాచారం. అతిత్వరలోనే 70 నుంచి 80 దాకా 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఈ కంపెనీ కుదుర్చుకోనుందని వార్తాసంస్థ బ్లూమ్బర్గ్ పేర్కొంది. ఈనెల 14న మొదలయ్యే ‘దుబాయ్ ఎయిర్షో’లో అమెరికాకు(చికాగో) చెందిన బోయింగ్తో కుదుర్చుకునే ఒప్పందం గురించి ఆకాశ ప్రకటించే అవకాశం ఉందని ఆ వార్తా సంస్థ చెబుతోంది. అయితే ఆకాశ మాత్రం ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. ప్రస్తుత ధరల ప్రకారం.. ఈ ఒప్పంద విలువ 10 బిలియన్ డాలర్ల (రూ.75,000 కోట్ల) వరకు ఉండొచ్చని అంచనా. తక్కువ ధరతో సామాన్యుడికి విమాన ప్రయాణం అందించాలన్న బిగ్బుల్(ఝున్ఝున్వాలా) ప్రయత్నం ఏమేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి. అయితే ఒక వేళ బోయింగ్ ఈ ఆర్డరును పొందితే కనుక భారత్లో ఎయిర్బస్ సంస్థకు ఉన్న ఆధిపత్యాన్ని గండి పడినట్లే అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికల్లా కార్యకలాపాలను మొదలుపెట్టాలని ఆకాశ ఎయిర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. కానీ బిలియనీర్ అయ్యాడు -
9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..!
గత కొద్ది రోజుల నుంచి ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్ఝున్వాలా స్టాక్మార్కెట్లో భారీ లాభాలను గడిస్తున్నారు. స్టాక్మార్కెట్ల నుంచి రాకేష్ 9 రోజుల్లో 16 వందల కోట్లను సంపాదించారు. నజారా టెక్నాలజీస్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ షేర్లు భారీగా లాభాలను గడించాయి. గత కొన్ని సెషన్లలో టాటా గ్రూప్ షేర్ల భారీ ర్యాలీ నేపథ్యంలో షేర్ హోల్డర్స్కు అద్భుతమైన ప్రతిఫలాన్ని అందిచాయి. చదవండి: ఇక ఫేస్బుక్లో గోలగోలే...! యూజర్లకు గుడ్న్యూస్...! టాటా మోటార్స్ షేర్ ధర 52 వారాల గరిష్టానికి చేరుకుంది. దాంతో పాటుగా టైటాన్ కంపెనీ షేర్లు జీవితకాల గరిష్ట స్థాయిని అధిగమించింది. వాస్తవానికి, టైటాన్ కంపెనీ షేర్లు 2021 ప్రారంభం నుండి ఆకాశాన్నంటుతున్నాయి.ఈ నెల నుంచి టైటాన్ కంపెనీ షేర్లు మరింత వేగం పుంజుకుంది. 9 ట్రేడ్ సెషన్లలో, టైటాన్ షేర్ ధర దాదాపు 17.50 శాతం పెరగడంతో రాకేశ్ ఝున్ఝున్వాలా దాదాపు 1600 కోట్లు సంపాదించడంలో సహాయపడింది. రాకేష్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా టాటాగ్రూప్లో భారీగా పెట్టుబడులను పెట్టారు. రాకేష్ టాటా గ్రూప్లో 3 కోట్లకుపైగా షేర్లను కల్గి ఉన్నారు. అతని సతీమణి 96 లక్షలకు పైగా షేర్లను కల్గి ఉన్నారు. టైటాన్ షేర్లు రయ్ రయ్...! టైటాన్ షేర్లు కొన్ని రోజుల నుంచి భారీ లాభాలను గడిస్తున్నాయి. ఈ నెలలో గత తొమ్మిది ట్రేడ్ సెషన్లలో, టైటాన్ షేర్ ధర రూ. 2161.85 నుంచి రూ. 2540 పెరిగింది. తొమ్మిది రోజుల్లో టైటాన్ షేర్ ధర సుమారు రూ.378.15 మేర పెరిగాయి. ప్రస్తుతం టైటాన్ షేర్లు 2547.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చదవండి: ఆకాశమే హద్దు! 61 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్ -
టాటా రయ్.. ఝున్ఝున్వాలా ఖాతాలో 375 కోట్లు
Rakesh Jhunjhunwala Stocks: ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్ఝున్వాలా మరోసారి స్టాక్ మార్కెట్తో లాభపడ్డారు. నాలుగు సెషన్ల వ్యవధిలో 375 కోట్ల రూపాయల్ని సంపాదించారు. ఆయన పెట్టుబడులు పెట్టిన నజారా టెక్నాలజీస్, టైటాన్ కంపెనీ, టాటా మోటర్స్ స్టాకులు ఒక్కసారిగా పెరగడంతో.. ఆయన సంపాదనా పెరిగింది. చివరి నాలుగు సెషన్స్లో ఒక్క టాటా మోటర్స్ షేర్సే 30 శాతం పెరగడం విశేషం. మోర్గాన్ స్టాన్లే వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం.. 298రూ.గా ఉన్న టాటా షేర్ల ధరలు.. 448రూ. చేరుకున్నాయి. ఈ బలమైన పెరుగుదలతో ఆయన ఆదాయం వందల కోట్లను దాటేసింది. మూడు సెషన్స్లోనే 310 కోట్ల రూపాయల్ని(24 శాతం షేర్ల పెరుగుదల) సంపాదించారాయాన. ఇదిలా ఉంటే కరోనా టైంలోనే టాటా మోటర్స్ షేర్లపై ఝున్ఝున్వాలా దృష్టిసారించారు. సుమారు 4 కోట్ల షేర్లను సెప్టెంబర్ 2020లో కొనుగోలు చేశారాయన. ఈ ఏడాది జూన్ చివరినాటికి ఝున్ఝున్వాలా టాటా మోటర్స్లో 1.14 శాతం వాటాను(1,643 కోట్ల విలువ), 3కోట్ల77లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. మార్కెట్ ర్యాలీలో నాలుగు రోజుల్లో 375 కోట్ల రూపాయల్ని సంపాదించారాయన. పండుగ సీజన్, పైగా ఈవీ కార్ల రంగంలోకి ప్రయత్నాలు మొదలయిన తరుణంలో టాటా షేర్లు విపరీతంగా పెరగడానికి కారణం అయ్యాయని మోర్గాన్ స్టాన్లే వెల్లడించింది. చదవండి: Akasa Air: ఝున్ఝున్వాలాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
Akasa Air: ఝున్ఝున్వాలాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Akasa Airlines Rakesh Jhunjhunwala: కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్ఝున్వాలా మద్దతు ఉన్న ఈ సంస్థకు.. పౌర విమానయాన శాఖ ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)’ జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. దీనితో 2022 వేసవి నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ఆకాశ ఎయిర్ హోల్డింగ్ సంస్థ ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. ‘ఎన్వోసీ జారీ చేసినందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలు‘ అని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే తెలిపారు. రాకేశ్ ఝున్ఝున్వాలా ఇన్వెస్ట్ చేస్తున్న ఆకాశ ఎయిర్ బోర్డులో ప్రైవేట్ రంగ ఎయిర్లైన్స్ దిగ్గజం ఇండిగో మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ కూడా ఉన్నారు. సీఈవోగా నియమితులైన దూబే గతంలో జెట్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఎయిర్బస్, బోయింగ్తో చర్చలు జరుపుతోందని సమాచారం. వచ్చే నాలుగేళ్లలో సుమారు 70 విమానాలను ఆపరేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. చదవండి: బిగ్బుల్ను కలిశా.. సంతోషం: ప్రధాని మోదీ ఇదీ చదవండి: ఝున్ఝున్వాలా ఏం చేయబోతున్నాడు? సర్వత్రా ఆసక్తి -
10 నిమిషాల్లో 850 కోట్లు సంపాదించిన ఇండియన్ బిగ్ బుల్
ముంబై: 10 నిమిషాల్లో ఎవరైన ఎంత సంపాదిస్తాం.. మహా అయితే వంద, వెయ్యి, పదివేలు రూపాయలు ఇంకా గట్టిగా మాట్లాడితే పది లక్షలు. కానీ, ఇండియన్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా మాత్రం ఏకంగా 850 కోట్ల రూపాయలు సంపాదించి, తన సత్తా ఏంటో మరోమారు మార్కెట్కు చాటారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్ టైటాన్, నేటి(అక్టోబర్ 7) ట్రేడింగ్లో ధగధగా మెరిసింది. దాదాపు 10 శాతం ర్యాలీ చేసింది. కేవలం 10 నిమిషాల్లోనే మార్కెట్ క్యాపిటల్కు మరో రూ.17,770 కోట్లను ఈ కంపెనీ జోడించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే టైటాన్ షేర్లు 9.32% పెరిగి, రూ.2,347 రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ టాటా గ్రూపు కంపెనీలో ఝున్ఝున్వాలాకు, ఆయన భార్యకు కలిపి 4.81% వాటా ఉంది. దీంతో ఇప్పుడు వారి వాటా విలువ రూ.854 కోట్ల మేర పెరిగింది. ఇంట్రాడేలో రూ.2,08,350 కోట్ల మార్కెట్ క్యాపిటల్కు టైటాన్ చేరుకుంటే.. ఈ సమయంలో టైటాన్ గ్రూప్ కంపెనీలో రాకేశ్ ఝున్ఝున్వాలా వాటా విలువ రూ.10,000 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆభరణాల తయారీదారు వ్యాపార లావాదేవీలు ప్రీ-కోవిడ్ స్థాయిలకు తిరిగి చేరుకున్నాయి. అలాగే, రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని మదుపరుల భారీగా పెట్టుబడులు పెట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే 78 శాతం వృద్ధిని టైటాన్ సాధించింది. టాటా గ్రూప్ కంపెనీ ఈ త్రైమాసికంలో కొత్తగా మరో 13 దుకాణాలను ప్రారంభించినట్లు టైటాన్ తెలిపింది.(చదవండి: టార్గెట్ మిత్రా.. ప్లేస్ కొట్టుడు పక్కా) -
బిగ్బుల్ ఝున్ఝున్వాలా ఏం చేయబోతున్నాడు? సర్వత్రా ఆసక్తి
Rakesh Jhunjhunwala : ఇండియన్ బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్ వాలా నెక్ట్స్ స్టెప్ ఏంటీ అనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయింది. సాధారణంగా రాకేశ్ ఝున్ఝున్వాలా మార్కెట్ స్ట్రాటజీలపై దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తుంటారు. కానీ గత రెండు రోజులుగా ప్రధాని, ఆర్థిక మంత్రులను ఆయన కలుసుకోవడం చర్చకు దారి తీసింది. మార్కెట్ వ్యవహరాలు తప్పితే పెద్దగా ఇతర విషయాల్లో నేరుగా తల దూర్చని రాకేశ్ ఝున్ఝున్ వాలా తన శైలికి భిన్నంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ వెంటనే బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. వరుసగా రెండు రోజుల పాటు హై ప్రొఫైల్ సమావేశాల్లో ఆయన పాల్గొనడం వెనుక ఆంతర్యం ఏంటనే కూపి లాగుతున్నాయి వ్యాపార వర్గాలు. మరోవైపు ఝున్ఝున్వాలాతో భేటీ విషయాలను ప్రధానిమోదీ, మంత్రి నిర్మలా సీతారామన్లు నేరుగా సోషల్ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్ చేశారు. కానీ భేటీలో ప్రస్తావించిన అంశాలను తెలపడం లేదు. స్టాక్మార్కెట్లో దేశీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్టైం హై దగ్గర ట్రేడవుతున్నాయి. ఏషియా మార్కెట్లు నష్టాలు చవి చూస్తున్నా.. దేశీ మార్కెట్లు నిలకడగా ఉంటూ బుల్ జోరుని కొనసాగిస్తున్నాయి. మరోవైపు జీ షేర్ల విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు రాకేశ్ చుట్టూ ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్బుల్ ప్రధాని, ఆర్థిక మంత్రితో జరిపిన సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. రాకేశ్ ఝున్ఝున్వాలా త్వరలో ఆకాశ పేరుతో ఎయిర్లైన్స్ సేవలు ప్రారంభించే యోచనలో ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సహాకారం కోరేందుకు వచ్చి ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక బిగ్బుల్ ఇచ్చే మార్కెట్ సూచనల కోసం దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. విదేశీ మార్కెట్ల కంటే స్వదేశీ మార్కెట్ల ద్వారానే ఎక్కువ లాభపడవచ్చంటూ ఆయన తరచుగా ఔత్సాహిక ఇన్వెస్టర్లకు సలహా ఇస్తుంటారు. Delegation led by Shri Rakesh Jhunjhunwala calls on Smt @nsitharaman pic.twitter.com/58HOHJkcnP — NSitharamanOffice (@nsitharamanoffc) October 6, 2021 చదవండి: నలిగిన చొక్కాతో ఝున్ఝున్వాలా.. గౌరవంగా మోదీ -
బిగ్బుల్ను కలిశా.. సంతోషం: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ దిల్ఖుష్గా తన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘అంతర్దృష్టి ఉన్న వ్యక్తిని, అత్యంత చురుకైన వ్యక్తిని కలిశానంటూ’ మంగళవారం ట్విటర్లో ఆయన ఓ ఫొటో పోస్ట్ చేశారు. సింప్లిసిటీకి, స్టాక్ మార్కెట్లో సంచలనాలకు కేరాఫ్ అయిన రాకేష్ ఝున్ఝున్వాలా గురించే ఇదంతా. దేశ ప్రధాని మోదీ, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాను మంగళవారం కలిశారు. భారత ఆర్థిక వ్యవస్థలో అగ్రపథాన దూసుకుపోతున్న ఈయన్ని కలవడం సంతోషంగా ఉందని చెప్పారు మోదీ. రాకేష్తో పాటు ఆయన సతీమణి రేఖా ఝున్ఝున్వాలా సైతం ఆ ఫొటోలో ఉండడం విశేషం. నలిగిన చొక్కాతో చాలా సాదాసీదాగా ఝున్ఝున్వాలా కనిపించిన ఫొటో ఒకటి, మరో ఫొటోలో ఝున్ఝున్వాలా కుర్చీలో కూర్చోగా.. తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ ఎదురుగా వినయంగా మోదీ చేతులు కట్టుకుని ఉన్న ఫొటో ట్విటర్లో షేర్ అయ్యి ట్రెండింగ్లోకి వచ్చాయి. Delighted to meet the one and only Rakesh Jhunjhunwala...lively, insightful and very bullish on India. pic.twitter.com/7XIINcT2Re — Narendra Modi (@narendramodi) October 5, 2021 Look who is standing …Power of stock-market! #RakeshJhunjhunwala 🔥 pic.twitter.com/kGsiDGnpOY — Mr. Singh (@MrSingh20201) October 5, 2021 ఇక లాభాల కోసం ఎక్కడో అమెరికా కంటే సొంత దేశంలో(భారత్) పెట్టుబడులు పెట్టాలంటూ ఇన్వెస్టర్లకు ఝున్ఝున్వాలా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయన్ని అభినందించినట్లు సమాచారం. పనిలో పనిగా కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలతోనూ మోదీ సమావేశమైనట్లు తెలుస్తోంది. ‘‘ఇంట్లో తిండి దొరుకుతుంటే బయట తినడం ఎందుకు? భారత్ను నమ్మండి. పెట్టుబడులు పెట్టండి’’ అంటూ ఝున్ఝున్వాలా జూన్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఇండియా రిచ్ జాబితాలో రాకేష్ ఝున్ఝున్వాలా అండ్ ఫ్యామిలీ ఆస్తుల విలువ 22,300 కోట్ల రూపాయలుగా ఉంది. పెట్టుబడి ఐదు వేలు.. సంపాదన 34 వేల కోట్లు! -
ఒక్క నెలలో రూ.900 కోట్లు సంపాదించిన బిగ్ బుల్!
ది ఇండియన్ వారెన్ బఫెట్గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టె విషయం అందరికీ తెలిసిందే. అయితే, స్టాక్ మార్కెట్ అందరికీ కనక వర్షం కురిపించదు. స్టాక్ మార్కెట్పై పట్టు ఉన్న వారిని మాత్రమే లక్ష్మీ దేవి కరుణిస్తుంది. ఇండియన్ వారెన్ బఫెట్గా పిలిచే "బిగ్ బుల్ రాకేష్ జున్జున్వాలా" కొనుగోలు చేసిన టాటా మోటార్స్ షేరు ధర సుమారు 13 శాతం పెరగగా, టైటాన్ కంపెనీ షేర్లు 11.40 శాతం పెరిగాయి. ఈ రెండు కంపెనీల షేరు భారీగా పెరగడంతో రాకేష్ జున్జున్వాలా నికర విలువ ఒక నెలలోనే ₹893 కోట్లు పెరిగింది.(చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు బజాజ్ షాక్!) టాటా మోటార్స్ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం బిగ్ బుల్ 3,77,50,000 షేర్లను కలిగి ఉన్నారు. సెప్టెంబర్ 2021లో టాటా మోటార్స్ షేర్ ధర ఎన్ఎస్ఈలో ప్రతి ఈక్విటీ షేర్ల ధర ₹287.30 నుంచి ₹331కు పెరిగింది. ప్రతి షేరు విలువ ₹43.70 పెరిగింది. దీంతో, రాకేష్ జున్జున్వాలా సెప్టెంబర్ 2021లో టాటా మోటార్స్ వాటా హోల్డింగ్ నుంచి ₹164.9675 కోట్లు సంపాదించారు. అలాగే, టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం.. 'బిగ్ బుల్' 3,30,10,395 షేర్లను కలిగి ఉండగా, రేఖా జున్జున్వాలా(రాకేష్ జున్జున్వాలా భార్య) 96,40,575 వాటాలను కలిగి ఉన్నారు. కాబట్టి, ఇద్దరి పేరు మీద కలిసి టైటాన్ లో 4,26,50,970 షేర్లు ఉన్నాయి. 2021 సెప్టెంబర్ నెలలో టైటాన్ షేర్లు ₹1921.60 నుంచి ₹2092.50కు పెరిగింది. ఈ కాలంలో టైటాన్ కంపెనీ షేరు విలువ ₹170.90కి పెరిగింది. ఈ కంపెనీ షేర్ల విలువ ప్రకారం.. రాకేష్ జున్జున్వాలా ₹728.90 కోట్లు సంపాదించారు. కాబట్టి, ఈ రెండు టాటా గ్రూప్ స్టాక్స్ లో బిగ్ బుల్ నికర విలువ సెప్టెంబర్ 2021లో 893.87 కోట్లు పెరిగింది. జున్జున్వాలా తన స్వంత పేరు, అతని భార్య రేఖా పేరుతో రెండింటిలోనూ భారీగా పెట్టుబడి పెట్టారు.(చదవండి: బంగారాన్ని బట్టి ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా?) -
ఈ కంపెనీ షేర్లు కొన్నవారి జాతకం మారిపోయింది
భవిష్యత్తు బాగుండాలంటే మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను పెట్టుబడిగా పెట్టడం ఉత్తమం అని పెద్దలు చెబుతుంటారు. ఈ పెట్టుబడి అనేది స్థిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు ఫథకాలు, బంగారం మొదలగు వాటిలో పెట్టవచ్చు. అయితే పెట్టుబడి వెనుక ప్రధాన ఉద్దేశం సంపద సృష్టించడం. పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే డబ్బుతో పిల్లల కళాశాల ఫీజులు, పెళ్ళిల్లు, సెలవులలో సరదాగా గడపడం, రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరిగిపోతుంది. అయితే, ఈ పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపద ఎంత జాగ్రత్తగా సంపాదిస్తున్నామో అదేవిధంగా ఎందులో మనం పెట్టుబడి పెడుతున్నాం అనేది కూడా ముఖ్యం. అలాగే, డబ్బును కాపాడటం, అభివృద్ధి చేయడం అనేది ఒక ప్రత్యేక కళగా చెప్పుకోవాలి.(చదవండి: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో బంపర్ ఆఫర్లు) ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో వాటిలో వేగంగా రాబడి ఇచ్చేదీ ఏమైనా ఉంది అంటే? అది షేర్ మార్కెట్/ స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవాలి. అయితే, స్టాక్ మార్కెట్ మీద పూర్తి జ్ఞానం ఉన్న వాళ్లు అధిక లాభాలు గడిస్తారు. అందుకే, రాకేశ్ జున్జున్వాలా వంటి వారు కోట్లలో సంపదిస్తారు. స్టాక్ మార్కెట్ మీద పూర్తి అవగాహన వచ్చాక మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెబుతుంటారు. స్టాక్ మార్కెట్ ఎంత లాభమో ఒక కంపెనీ షేర్ విలువ చూస్తే మీకే తెలుస్తుంది. కాంటినెంటల్ కెమికల్స్ అనే కంపెనీ స్టాక్ ధర కేవలం మూడు నెలల్లో దాదాపు 1,500% రాబడిని అందించింది. (చదవండి: ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్ అద్దాలు వేరయా!) ఈ ఏడాది జూన్ 24, 2021న రూ.21.49గా ఉన్న షేర్ విలువ నేడు రూ.343.5కు పెరిగింది. అంటే, గత మూడు నెలల్లో 1,497.25% రిటర్న్లు ఇచ్చింది. మీకు ఉదాహరణగా చెప్పాలంటే మీరు గనుక జూన్ 24 రూ.1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే అది నేడు రూ.15.98 లక్షలగా మారేది. అందుకే అంటారు చాలా మంది నిపుణులు ఒక్క రోజులో కోటీశ్వరుడు కావాలంటే షేర్ మార్కెట్ మాత్రమే అని. కానీ ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. అర కొర జ్ఞానంతో పెట్టుబడులు పెడితే ఎక్కువ శాతం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు మార్కెట్ మీద పూర్తి జ్ఞానం సంపాదించకే చిన్న చిన్న అడుగులతో మీ ప్రస్థానాన్ని ప్రారంభించండి. -
జీ -సోనీ డీల్..! వారం రోజుల్లో సుమారు రూ. 50 కోట్ల లాభం..!
భారత మీడియా రంగంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య విలీనం ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్కు 47.07 శాతం, సోనీ పిక్చర్స్ కు 52.93 శాతం మేర వాటాలు దక్కనున్నాయి. విలీనం తర్వాత సోనీ పిక్చర్స్ 1.575 బిలియన్ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. చదవండి: సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం ! కాసుల వర్షం కురిపించిన ఒప్పందం...! జీ, సోనీ నెట్వర్క్స్ మధ్య జరిగిన ఒప్పందం...స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ జున్జున్వాలాకు కాసుల వర్షం కురిపించింది. జీ, సోనీ నెట్వర్క్స్ల విలీన వార్తలతో బుధవారం మార్కెట్లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) షేర్లు 30% పైగా పెరిగాయి. దీంతో బిగ్బుల్కు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. గతవారం రాకేశ్ జున్జున్వాలా సుమారు 50లక్షల జీల్ షేర్లను కొనుగోలు చేశారు. జీల్ ఒక్కో షేర్ను రూ. 220.4 కు కొనుగోలు చేయగా ప్రస్తుతం వాటి విలువ ఏకంగా రూ. 337 పెరిగింది. దీంతో రాకేశ్ 50 శాతం మేర లాభాలను గడించారు. జీ మీడియా చీఫ్ పునీత్ గోయెంకా బోర్డు నుంచి తప్పుకున్న రోజునే రాకేశ్తోపాటుగా , యూరప్కు చెందిన బోఫా సెక్యూరిటీస్ సుమారు 50 లక్షల షేర్లను కొన్నారు. కాగా పలువురు ఈ డీల్ గురించి ముందే తెలిసి జీల్ భారీగా షేర్లను కొన్నట్లు సోషల్మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కచ్చితంగా ఇన్సైడర్ ట్రేండింగ్ జరిగి ఉండవచ్చునని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జీ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించడం గమనార్హం. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ వాటాదార్లకూ ఇది లాభదాయకమని జీ మీడియా వెల్లడించింది. చదవండి: చైనాకు కేంద్రం మరో షాక్ ఇవ్వనుందా..? -
Rakesh JhunJhunWala : గంటల వ్యవధిలోనే రూ.21 కోట్ల ఆర్జన !
రాకేశ్ ఝున్ఝున్వాలా ది బిగ్బుల్ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడు. షేర్ మార్కెట్ పండితుడిగా పేరుమోసిన ఈ ఏస్ ఇన్వెస్టర్ మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. స్టాక్మార్కెట్ వ్యాపారంలోనే వేల కోట్లు సంపాదించిన కుబేరుడి ఖాతాలో మరికొన్ని కోట్లు వచ్చి చేరాయి, అది కూడా 24 గంటల వ్యవధిలోనే కావడం విశేషం. బిగ్బుల్ తరీఖా ఇటీవల జీ మీడియా గ్రూపు షేర్లు మార్కెట్లో ఒడిదుడుకులకు లోనయ్యాయి. జీ గ్రూప్ ఎండీ పదవి నుంచి పునీత్ గోయెంకాను తొలగించాలంటూ పెట్టుబడిదారులు పట్టుబట్టారు. దీంతో సెప్టెంబరు 14న మంగళవారం ఆ కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవి చూశాయి. ఆ కంపెనీ షేర్ల ధర పడిపోతూ రూ.220.44 దగ్గర ఉన్నప్పుడు వాటిపై బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలాకు చెందిన రారే కంపెనీ కన్నేసింది. అదే ధర దగ్గర ఒకేసారి 50 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఒక్కరోజులోనే ఒక షేరు ధర 220.44 దగ్గర ఉండగా రాకేశ్ ఝున్ఝున్ వాలా భారీగా షేర్లు కొన్నాడంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా షేర్ ధర పుంజుకుంది.అదే రోజు సాయంత్రానిని కోలుకుని ఒక షేరు ధర రూ, 261.50 దగ్గర క్లోజయ్యింది. దీంతో సరాసరి రూ. 20 కోట్ల మేర ఆదాయం ఝున్ఝున్వాలా ఖాతాలో పడింది. గురువారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి జీ షేరు ధర 52 వారాల గరిష్ట స్థాయిలను తాకుతూ ఇంట్రాడేలో రూ. 295.15 దగ్గర ట్రేడవుతూ ఆయన ఖాతాలోకి మరింత సొమ్మును జత చేస్తోంది. చదవండి: ఆకాశ వీధిలో ఝున్ఝున్వాలా -
‘ఆకాశ’ .. మాస్టర్ మైండ్స్ వీరే
ముంబై: ఇండియాలో విమానయానం సామాన్యులకు ఎప్పుడు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. గతంలో తక్కువ ధరలకే ఎయిర్ డెక్కన్ వచ్చినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోయింది. తాజాగా తక్కువ ధరకే విమాన సర్వీసులు అందిస్తామంటూ ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా ఆకాశ విమానయాన సంస్థ నెలకొల్పారు. ఆకాశ ఆకాశ పేరుతో రాబోయే కొద్ది రోజుల్లోనే ఎయిర్ సర్వీసులు ప్రారంభించేందుకు రాకేశ్ ఝున్ఝున్వాలా రెడీ అయ్యారు. మార్కెట్ నిపుణుడైన రాకేశ్ ఝున్ఝున్వాలాకు ఎయిర్లైన్స్లో ఉన్న అనుభవం ఎంత ? అయన ఈ రంగంలోకి అడుగు పెట్టేందుకు అండగా నిలబడింది ఎవరు? తనకు అందుబాటులో ఉండే ధరలతోనే కామన్ మ్యాన్ ఆకాశయనం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. అయితే ఆకాశ స్థాపన వెనుక మార్కెట్ బిగ్బుల్ రాకేశ్తో ఎయిల్లైన్స్లో అపాన అనుభవం ఉన్న మాస్టర్ మైండ్స్ ఉన్నాయి. వీరిద్దరే స్టాక్మార్కెట్ ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు సంపాదించి మార్కెట్ బిగ్బుల్గా పేరుపడిన రాకేశ్ఝున్ఝున్వాలాకి ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో పట్టులేదు. కానీ ఆ రంగంలో అపార అనుభవం ఉన్న వినయ్ దుబే, ఆదిత్యాఘోష్లు రాకేశ్కు కుడిఎడమలుగా నిలబడ్డారు. వారిద్దరే రెక్కలుగా మారి రాకేశ్ చేత ఆకాశయానం చేయిస్తున్నారు. వినయ్దుబే ఆకాశ ఎయిర్వేస్ ఆలోచన పురుడుపోసుకోవడానికి ప్రధాన కారణం జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దుబే. ఎయిర్ ఇండియాకు పోటీగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ సీఈవోగా వినయ్ దుబే పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి.. రాకేశ్ ఝున్ఝున్వాలాతో కలిసి ఆకాశకు బీజం వేశారు. ఆకాశలో వినయ్ దుబేకి 15 శాతం వాటా ఉంది. ఆదిత్యా ఘోష్ చౌక విమాన సర్రీసులు అందించిన గో ఎయిర్లో 2008లో ఆదిత్య ఘోష్ చేరారు. అప్పటి నుంచి 2018లో కంపెనీని వీడేవరకు వివిధ హోదాల్లో రకరకాల స్కీమ్లు అమలు చేస్తూ గో ఎయిర్ అభివృద్దికి తోడ్పడ్డారు. ఇప్పుడు 160 విమానాలతో దేశంలోనే ప్రముఖ ఎయిర్లైన్స్ కంపెనీగా గో ఎయిర్ కొనసాగుతోంది. ఈయన ఆకాశ ఎయిర్లైన్స్లో 10 శాతం వాటాను కలిగి ఉన్నారు. ర్యాన్ఎయిర్ తరహాలో ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలకే విమానయానం అందిస్తామని ఆకాశ హామీ ఇస్తోంది. ఆగష్టు చివరి నాటికి ప్రభుత్వం నుంచి అనుమతలు వచ్చే అవకాశం ఉంది. యూరప్కి చెందిన ‘ర్యాన్ఎయిర్’ తరహాలో ఆకాశ ఎయిర్లైన్స్ సర్వీసెస్ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉదాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. చిన్న నగరాల్లో ఎయిర్పోర్టులు నిర్మిస్తోంది, కొత్తగా అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో ఎయిర్లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి,. ఈ నేపథ్యంలో 70 ఫ్లైట్లలతో ఆకాశ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. -
ఆకాశ వీధిలో ఝున్ఝున్వాలా
న్యూఢిల్లీ: దేశీ ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్ఝున్వాలా తాజాగా విమానయాన రంగంపై దృష్టి సారించారు. ఆకాశ ఎయిర్ పేరిట విమానయాన సంస్థను ప్రారంభిస్తున్నారు. పౌర విమానయాన శాఖ నుంచి దీనికి 15 రోజుల్లో అనుమతులు రావచ్చని ఝున్ఝున్వాలా వెల్లడించారు. కొత్త ఎయిర్లైన్ కోసం నాలుగేళ్లలో దాదాపు 70 విమానాలను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు ఝున్ఝున్వాలా వివరించారు. 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్క్రాఫ్ట్లను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకాశ ఎయిర్లో ఝున్ఝున్వాలా సుమారు 35 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. ఆయనకు ఇందులో 40 శాతం వాటాలు ఉండనున్నాయి. అత్యంత చౌక చార్జీల విమానయాన సంస్థగా ఉండబోయే ఆకాశ ఎయిర్ టీమ్లో డెల్టా ఎయిర్లైన్స్ సంస్థకి చెందిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారు. కరోనా వైరస్ కట్టడిపరమైన చర్యల కారణంగా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విమానయాన సంస్థలు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఝున్ఝున్వాలా ఈ రంగంలోకి ప్రవేశించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2012లో మూతబడగా, జెట్ ఎయిర్వేస్ 2019లో దివాలా తీసింది. కొత్త యజమానుల సారథ్యంలో ప్రస్తుతం మళ్లీ ఎగిరే ప్రయత్నాల్లో ఉంది. థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉండటంతో దేశీ విమానయాన సంస్థల రికవరీకి మరింత సమయం పట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్త విమానాల డెలివరీని కూడా వాయిదా వేసుకునేందుకు విమానయాన సంస్థ విస్తార.. ఎయిర్క్రాఫ్ట్ల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్బస్లతో చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విమానయాన రంగంలోకి ఝున్ఝున్వాలా ఆరంగేట్రం చర్చనీయాంశంగా మారింది. అయితే, ‘దేశీ విమానయాన రంగంలో డిమాండ్ విషయంలో నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను‘ అని ఝున్ఝున్వాలా తెలిపారు. ఫోర్బ్స్ మేగజీన్ తాజా గణాంకాల ప్రకారం రాకేశ్ ఝున్ఝున్వాలా సంపద విలువ సుమారు 4.6 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. -
అత్యంత చౌక ధరలకే విమాన ప్రయాణాలు..! త్వరలోనే..!
ముంబై: ది ఇండియన్ వారెన్ బఫెట్గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా పలు రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. తాజాగా విమానయాన రంగంలో పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో సుమారు 70 ఎయిర్క్రాఫ్ట్లతో కొత్త ఎయిర్లైన్ను మొదలుపెట్టాడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు రాకేష్ జున్జున్వాలా ప్రకటించారు. భారత్లో తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్న విమానయాన రంగంలో సుమారు 35 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నారు. ఎయిర్లైన్ కంపెనీలో సుమారు 40 శాతం మేర వాటాను రాకేష్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే పదిహేను రోజుల్లో భారత విమానయాన శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ ఓ సీ ) రానుందని బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ జున్జున్వాలా పేర్కొన్నారు. కాగా రాకేష్ మొదలుపెడుతున్న సొంత ఎయిర్లైన్ ‘ఆకాశ ఎయిర్’ అని తెలుస్తోంది. గతంలో డెల్టా ఎయిర్ లైన్స్లో పనిచేసిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, పలు సభ్యులు కూడా కంపెనీలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కొనబోయే ఎయిర్క్రాఫ్ట్స్ సామర్ధ్యం 180 ప్యాసింజర్ల వరకూ ఉండబోతోంది. అత్యంత చౌక ధరలకే విమాన సర్వీసులను అందించే లక్ష్యంతో మార్కెట్లోకి రానుంది. కోవిడ్ మహమ్మారి రాకతో విమానయాన రంగం పూర్తిగా కుదేలయ్యింది. అయితే రాబోయే రోజుల్లో భారత్లో విమానయాన రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని రాకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారికి ముందే, భారతదేశంలోని విమానయాన సంస్థలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఒకప్పుడు దేశంలో రెండవ అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2012 లోనే తన కార్యకలాపాలను ముగించింది. దాంతో పాటుగా ఇటీవల జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్ విమాన ప్రయాణాలను ఆమోదం వచ్చిన కొన్ని రోజులకే 2019లో తన ఆపరేషన్లను నిలిపివేసింది. -
దేవుడా.! ఓ మంచి దేవుడా అడగకుండానే వేల కోట్లు ఇచ్చావ్
దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్. వేలకోట్ల ఆస్తి ఇచ్చావ్. వారెన్ బఫ్ఫెట్ ఆఫ్ ఇండియాను చేశావ్. ఇప్పుడు నేను అడగకుండా ఇచ్చే ధనం వద్దు.. నేను దానం చేసే గుణం ఇవ్వు' అని కోరుకుంటున్నారు. రాకేశ్ జున్జున్వాలా పరిచయం అక్కర్లేని పేరు. దలాల్ స్ట్రీట్ లో ఆయన పట్టిందల్లా బంగారమే. తండ్రి దగ్గర అరువుగా తీసుకున్న రూ. 5000లతో బాంబే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి 36 ఏళ్లలోనే 34 వేల కోట్లు సంపాదించాడు. అయితే ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తిలో కొద్ది మొత్తాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..నేను ఇప్పుడు దేవుడిని సంపదను ఇవ్వమని కోరుకోవడం లేదు. కానీ సంపాదించిన ఆస్తిని దానం చేసే గుణాన్ని ఇవ్వమని వేడుకుంటున్నా. అన్ని సహకరిస్తే త్వరలో రూ.400 నుంచి రూ.500కోట్ల క్యాపిటల్ ఫండ్ తో ఎన్జీఓని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు కరోనా కారణంగా దేశంలో తలెత్తిన ఆర్ధిక మాద్యంపై స్పందించారు. గతంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కంటే .. కరోనా సృష్టించిన ఆర్ధిక సంక్షోభం పెద్దది కాదని, రాబోయే రోజుల్లో దేశ ఆర్ధిక వ్యవస్థ 10శాతం పుంజుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఓకి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ రాకేశ్ జున్జున్వాలా స్టార్ హెల్త్లో వాటాదారులుగా ఉన్నారు. చెన్నైకి చెందిన వి.జగన్నాథన్ యూనైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే 2006లో వి.జగన్నాథన్ చెన్నైలో స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ను ప్రారంభించి మెడిక్లయిమ్,యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్తో అనతికాలంలో ప్రజాదారణ పొందారు. దీంతో బిగ్ బుల్ రాకేశ్ 2018 ఆగస్ట్ నెలలో వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, మాడిసన్ క్యాపిటల్ తో కలిసి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ 90 శాతం వాటాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం దరఖాస్తు దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.2,000 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: హింట్ ఇచ్చేసిందిగా, ఇండియన్ రోడ్లపై టెస్లా చక్కర్లు -
పెట్టుబడి ఐదు వేలు.. సంపాదన 34 వేల కోట్లు!
అమెజాన్తో వ్యాపారం చేసి జెఫ్ బేజోస్ ప్రపంచలోనే కుబేరుడయ్యాడు, రిలయన్స్తో ముఖేశ్ అంబానీ ఆసియాలోనే ధనవంతుడయ్యాడు. అయితే వీరిలా ఏ కంపెనీ స్థాపించలేదు, ఏ కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురాలేదు. కానీ మార్కెట్తోనే ఆడుకున్నాడు. లాభాలు తెచ్చే కంపెనీల వాటాలను వేటాడాడు... వేల కోట్ల రూపాయలకు కూడబెట్టాడు. అతనే రాకేశ్ ఝున్ఝున్వాలా. ఈ రోజు రాకేశ్ 61వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం. వెబ్డెస్క్: రాకేశ్ ఝున్ఝున్వాలా స్టాక్ మార్కెట్ గురించి కాసింత అవగాహన ఉన్నవారికైనా పరిచయం అక్కర్లేని పేరు. సొంత కంపెనీ అంటూ లేకుండా కేవలం వాటాదారుడిగా ఉంటూ వేల కోట్ల రూపాయలు సంపద పోగేసిన ఘనాపాఠీ. అది కూడా కేవలం 36 ఏళ్లలోనే 34 వేల కోట్లు సంపాదించాడు. అంటే ఏడాదికి సుమారు 9,00 కోట్లకు పైగానే ఆర్జించాడు. అయితే ఆ ఆర్జన వెనుక అతని శ్రమ ఉంది. మేథస్సు ఉంది. భవిష్యత్తును అంచనా వేయగలిగే నేర్పు ఉంది. అవన్ని కలిపితేనే వేల కోట్ల ఆస్తులు. పుట్టింది హైదరాబాద్లోనే ఇండియన్ బిగ బుల్ , వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా రాకేశ్ ఝున్ఝున్వాలా జన్మించింది మన హైదరాబాద్లోనే. అయితే తండ్రి ట్యాక్స్ ఆఫీసర్ కావడంతో ఆ కుటుంబం ముంబైకి వెళ్లిపోయింది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా ఆయన చిన్నప్పటి నుంచి లెక్కలు ఒంటబట్టిచ్చుకున్నాడు. అందుకే చదువు పూర్తి కాకుండానే డిగ్రీలో ఉండగానే స్టాక్మార్కెట్పై కన్నేశాడు. 1986లో.. ఇప్పుడంటే బీఎస్ఈ సెన్సెక్స్ 50 వేల పాయింట్లు దాటింది. ఆరోజుల్లో అంటే 1985లో 150 పాయింట్ల దగ్గరే ఉండేది. అప్పటికి దేశంలో లైసెన్స్రాజ్ నడుస్తుండేది. ఏ పని చేయాలన్నా రెడ్ టేపిజం అడ్డొచ్చేది. అయినా సరే ఆ రోజుల్లోనే స్టాక్మార్కెట్ ట్రేడింగ్కి ఇండియాలో ఉన్న భవిష్యత్తును ఝున్ఝున్వాలా అంచనా వేయగలిగాడు. ఐదు వేల పెట్టుబడితో తండ్రి దగ్గర అరువుగా తీసుకున్న రూ. 5000లతో బాంబే స్టాక్ మార్కెట్లోకి ఎంటరయ్యాడు. ఏడాది పాటు ఇబ్బందులు పడ్డాడు. అయితే మార్కెట్పై ఒక అంచనా వచ్చింది. ఏ కంపెనీ షేర్లు ఎలా వర్కటవుతాయో తెలిసింది. ఈసారి గురి చూసి టాటా టీ షేర్లు ఒక్కొక్కటి రూ. 43 వంతున 5,000 షేర్లు 1986లో కొనేశాడు. మూడు నెలలు తిరిగే సరికి షేర్ వాల్యు అమాంతం రూ. 143కి పెరిగింది. అంటే మూడు నెలల్లలో ఐదు లక్షల రూపాయల లాభం. ఇక అక్కడి నుంచి రాకేశ్ స్టాక్మార్కెట్ బుల్గా మారాడు. 1986 నుంచి 89 మధ్య ఏకంగా రూ. 25 లక్షలు సంపాదించాడు. హర్షద్ మెహతా షాక్తో ఆర్థిక సంస్కరణలు అమలవుతున్న కాలంలోనే ఇండియన్ స్టాక్ మార్కెట్కి హర్షద్ మెహతా రూపంలో భారీ షాక్ తగిలింది. హర్షద్ మెహెతా ఎఫెక్ట్ని షేర్ మార్కెట్పై వెంటనే అంచనా వేసిన రాకేశ్ తన దగ్గరున్న షేర్లు సకాలంలో అమ్మి నష్టాలు తప్పించుకోగా... ఈ పరిణామం ముందుగా అంచనా వేయలేకపోయిన వారి సంపద ఆవిరైపోయింది. ఎంతో నేర్పుతో హర్షద్ ఎఫెక్ట్ నుంచి రాకేశ్ తప్పించుకోగలిగాడు. టైటాన్దే! రాకేశ్ ఝున్ఝున్వాలా సంపదనలో అత్యధికం వాచీలు, వజ్రాలు తయారు చేసే టైటాన్ కంపెనీ నుంచే వచ్చింది. రాకేశ్ ఝున్ఝున్ వాటా సంపాదనలో ఒక్క టైటాన్ వాటాయే రూ.7,879 కోట్లు ఉండగా ఆ తర్వాత స్థానంలో టాటా మోటార్స్ రూ. 1,474, క్రిసిల్ రూ. 1,063 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికీ రాకేశ్ పోర్ట్పోలియోలో మొత్తం 37 కంపెనీలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవిగా లుపిన్, ఫోర్టిస్ హెల్త్కేర్, నజరా టెక్నాలజీస్, ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్, డీబీ రియల్టీ, టాటా టెలి కమ్యూనికేషన్స్ తదితర కంపెనీలు ఉన్నాయి. రారే తోడుగా బాంబే స్టాక్ ఎక్సేంజీలో 1987 నాటికి రాకేశ్ రాధేశ్యామ్ ఝున్ఝున్ వాలా నిలదొక్కకున్నాడు. ముంబైలో అంధేరీకి చెందిన మరో స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్ రేఖాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా రారే పేరుతో 2003లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కంపెనీని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ విజయవంతంగా రన్ అవుతోంది. అయితే 2016 ఫిబ్రవరి నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై రాకేశ్ను సెబీ ప్రశ్నించింది. మరోసారి 2020 జనవరిలో జరిగిన ట్రేడింగ్పైనా సెబీ విచారణ చేపట్టింది. సినిమాల్లోనూ.. ఎంటర్టైన్మెంట్ రంగంలోకి వచ్చిన రాకేశ్ హంగామా డిజిటల్ మీడియా సంస్థను స్థాపించారు. ఇంగ్లీష్ వింగ్లీ్ష్, షమితాబ్ వంటి చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు. రాకేశ్ ఝున్ఝున్ వాలాపై సీక్రెట్ జర్నీ ఆఫ్ రాకేశ్ఝున్ఝున్వాలా అనే పుస్తకం వచ్చింది. అతని అభిమానులు వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా పిలచుకుంటారు. ఫ్యూచర్ ఉంది కోవిడ్ ప్రభావంతో అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ రంగంపై కోవిడ్ ప్రభావం పెద్దగా ఉండబోదనేది రాకేశ్ అభిప్రాయం. పెద్ద విపత్తులను తట్టుకునేలా ఇండియన్ ఎకానమీ ఉందనేది రాకేశ్ నమ్మకం. -
మ్యూచువల్ ఫండ్ విక్రయాల్లో టాప్ ఇన్వెస్టర్
సాక్షి,ముంబై: సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఏర్పాటు బాట పట్టారు. ఇందుకు అనుమతించ మంటూ రాకేష్ సంస్థ ఆల్కెమీ క్యాపిటల్ మేనేజ్మెంట్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ఆల్కెమీ క్యాపిటల్కు రాకేష్ సహవ్యవస్థాపకుడుకాగా.. సమీర్ అరోరా ఏర్పాటు చేసిన హీలియోస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సైతం ఎంఎఫ్ లైసెన్స్ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ల కోసం హీలియోస్ క్యాపిటల్ గత నెల 25న, ఆల్కెమీ క్యాపిటల్ జనవరి 1న సెబీకి దరఖాస్తు చేశాయి. పీఎంఎస్ సేవలు అటు సింగపూర్, ఇటు దేశీ నియంత్రణ సంస్థల వద్ద రిజిస్టర్ అయిన హీలియోస్ క్యాపిటల్.. ఇండియా ఫోకస్డ్ లాంగ్– షార్ట్, లాంగ్ ఓన్లీ ఫండ్ను నిర్వహిస్తోంది. గ్లోబల్ లాంగ్–ఓన్లీ ఈక్విటీ ఫండ్ను సైతం ఏర్పాటు చేసింది. ఇక హీరేన్ వేద్, అశ్విన్ కేడియా, లసిత్ సంఘ్వీ సైతం వ్యవస్థాపకులుగా కలిగిన ఆల్కెమీ క్యాపిటల్.. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు,ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్టులను నిర్వహిస్తోంది. కాగా బజాజ్ ఫిన్సర్వ్, క్యాపిటల్మైండ్ (వైజ్మార్కెట్స్ అనలిటిక్స్), ఫ్రంట్లైన్ క్యాపిటల్ సర్వీసెస్, యూనిఫై క్యాపిటల్, జిరోధా బ్రోకింగ్ తదితర కంపెనీలు సైతం ఎంఎఫ్ లైసెన్స్ను పొందేందుకు వేచిచూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే సెబీ వద్ద పలు కంపెనీల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాది జులై మొదలు ఇటీవలివరకూ మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ఈక్విటీ మార్కెట్ల రికార్డు గరిష్టాల నేపథ్యంలోనూ పలు ఫండ్స్లో అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపడం, పోర్ట్ఫోలియోలను పునర్నిర్మించు కోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. -
రోజుకు ఈ కార్పొరేట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: భారీ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ ఝన్ వాలా పెట్టుబడులు గురించి స్టాక్ మార్కెట్లో తెలియని వారుండరు. ఇండియన్ వారెన్ బఫెట్గా పిల్చుకునే రాకేష్ తన భార్య రేఖాతో కలిసి సంయుక్తంగా రోజుకు ఎంత ఆదాయాన్ని సాధిస్తారో తెలిస్తే షాక్ అవ్వకమానరు. తాజా గణాంకాల ప్రకారం స్టాక్ మార్కెట్లో ఈ దంపతులు రోజుకు రూ.18.4కోట్లు సంపాదించారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ షేర్లు భారీగా పుంజుకోవడం ఝన్ ఝన్ వాలా దంపతుల ఆదాయం కూడా అదే రేంజ్లో ఎగిసింది. 11 ట్రేడింగ్ సెషన్లలోఎన్సీసీ 202.49 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. 2020 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో వీరు 7.83 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. నికర ఎన్సిసి షేర్లలో 12.84 శాతం వాటాను ఈ జంట సొంతం. జనవరి 29న రూ .58.95 వద్ద ముగిసిన ఎన్సిసి స్టాక్ ఫిబ్రవరి 15 నాటికి 43.85 శాతం పెరిగి రూ .84.80 వద్ద ముగిసింది. తద్వారా ఈ దంపతుల షేర్ల విలువ 664.26 కోట్ల రూపాయలకు పెరిగింది. 11 రోజుల్లో మొత్తం లాభం రూ.202.49 కోట్లుగా నమోదైంది. అంటే రోజుకు రూ.18.4 కోట్లు రాకేష్, రేఖా ఖాతాల్లో చేరినట్టన్నమాట. మరోవైపు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న బుధవారం (ఫిబ్రవరి 17న) నాటి మార్కెట్లో కూడా ఎన్సీసీ షేరు ధర రూ.89.15 గా ఉండటం విశేషం. -
ఐషర్ మోటార్స్- ఐబీ రియల్టీ.. హైజంప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో అంచనాలకు తగిన ఫలితాలు సాధించడంతోపాటు.. ఆశావహ అంచనాల కారణంగా ఆటో రంగ కంపెనీ ఐషర్ మోటార్స్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోవైపు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఇండియాబుల్స్ రియల్టీ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఐషర్ మోటార్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఐషర్ మోటార్స్ నికర లాభం 40 శాతం క్షీణించి రూ. 343 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 3 శాతం నీరసించి రూ. 2,134 కోట్లను తాకింది. రాయల్ ఎన్ఫీల్డ్ 9 శాతం తక్కువగా 1,49,120 మోటార్ సైకిళ్లను విక్రయించింది. వోల్వో గ్రూప్తో ఏర్పాటు చేసిన జేవీ వీఈ కమర్షియల్ వెహికల్స్ ఆదాయం 13 శాతం వెనకడుగుతో రూ. 1,703 కోట్లకు చేరింది. కాగా.. ఇబిటా మార్జిన్లు 5.4 శాతం నుంచి 6.9 శాతానికి బలపడ్డాయి. ప్రస్తుతం నెలకు 70,000 యూనిట్ల తయారీ స్థాయికి చేరినట్లు ఐషర్ మోటార్స్ యాజమాన్యం తాజాగా పేర్కొంది. బుకింగ్స్ సైతం 1.25 లక్షల యూనిట్లకు చేరినట్లు తెలియజేసింది. దీంతో క్యూ3లో పనితీరు మెరుగుపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతంపైగా జంప్చేసి రూ. 2,498ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా..ఈ షేరు గత వారం 15 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! చదవండి: (అరబిందో- ఐబీ హౌసింగ్- క్యూ2 ఖుషీ) ఐబీ రియల్టీ రాకేష్ జున్జున్వాలకు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ ఓపెన్ మార్కెట్ ద్వారా ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన 5 మిలియన్ షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీ ఈక్విటీలో 1.1 శాతం వాటాకు సమానమైన వీటిని గురువారం షేరుకి రూ. 57.73 ధరలో సొంతం చేసుకుంది. ఇందుకు దాదాపు రూ. 29 కోట్లను వెచ్చించినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. కాగా.. ఇదే సమయంలో మోర్గాన్ స్టాన్లీ 7.58 మిలియన్ షేర్లను రూ. 57.73 సగటు ధరలో విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీ రియల్టీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 16 శాతం దూసుకెళ్లింది. రూ. 64కు చేరింది. ప్రస్తుతం 12 శాతం లాభంతో రూ. 61.50 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 30 శాతంపైగా లాభపడటం విశేషం! -
భవిష్యత్లో గోల్డెన్ ఇయర్స్: రాకేష్
ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. అయితే భవిష్యత్తులో భారత్ ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు రానున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా అభిప్రాయపడ్డారు. రాకేశ్ ఝున్ఝున్వాలా గురువారం ఓ టీవీ చానెల్ ఇంటర్యూలో మాట్లాడుతూ.. దేశంలో లౌకికత్వం, నిర్మాణాత్మక చర్యల వల్ల స్టాక్ మార్కెట్ వేగంగా పుంజుకుంటుందని తెలిపారు. దేశ వృద్ధి రేటు చూసి ప్రజలే ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు. కరోనాతో మార్కెట్లు కుదేలవుతాయనే విశ్లేషణలు అర్థరహితమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ను ప్రజలు దీటుగా ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని రాకేశ్ ఝున్ఝున్వాలా పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల నుంచీ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్గా కొనసాగుతూ బిగ్బుల్గా ప్రసిద్ధి చెందిన రాకేష్ జున్జున్వాలా.. భవిష్యత్తులో పెట్టుబడికి దేశీ స్టాక్ మార్కెట్లు అత్యుత్తం అంటూ ఇటీవల కితాబిచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: వయసు 60- సంపద రూ. 16000 కోట్లు) -
మార్కెట్ల కరెక్షన్- జున్జున్వాలాకు షాక్
గత ఆరు రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు కరెక్షన్ బాటలో సాగుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 700 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 200 పాయింట్లకుపైగా కోల్పొయింది. వెరసి గత ఆరు రోజుల్లో ప్రామాణిక ఇండెక్సులు సగటున 6 శాతం స్థాయిలో నీరసించగా.. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా పోర్ట్ఫోలియోలోని కొన్ని షేర్లు ఇంతకంటే అధికంగా పతనమయ్యాయి. వివరాలు చూద్దాం.. జాబితా ఇలా రాకేష్ ఫేవరెట్లుగా భావించే పలు కంపెనీల షేర్లు ఇటీవల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జాబితాలో ఎడిల్వీజ్, డిష్మన్ కార్బొజెన్, ఎస్కార్ట్స్ తదితరాలున్నాయి. ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో రాకేష్కు 1.19 శాతం వాటా ఉంది. తాజాగా ఈ షేరు 5 శాతం పతనమై రూ. 56ను తాకింది. వెరసి ఈ నెల 16 నుంచి చూస్తే 24 శాతం క్షీణించింది. ఇతర కౌంటర్లలో జున్జున్వాలా పోర్ట్ఫోలియోలోని ఇతర కౌంటర్లలో డిష్మన్ కార్బోజెన్ అమిక్స్ 18 శాతం నష్టపోయింది. ఈ కంపెనీలో 3.18 శాతం వాటాను రాకేష్ కలిగి ఉన్నారు. ఇదే విధంగా 6.48 శాతం వాటా కలిగిన ఆటోలైన్ ఇండస్ట్రీస్ గత ఆరు రోజుల్లో 17 శాతం తిరోగమించింది. ఇక కరూర్ వైశ్యా బ్యాంక్ కౌంటర్ అయితే వరుసగా 8వ రోజూ డీలా పడింది. 14 శాతం క్షీణించింది. ఈ బాటలో ప్రకాష్ ఇండస్ట్రీస్, వీఐపీ ఇండస్ట్రీస్, జీఎంఆర్ ఇన్ఫ్రా, మంధన రిటైల్, అయాన్ ఎక్స్ఛేంజ్, ఇండియన్ హోటల్స్, ఫెడరల్ బ్యాంక్ కౌంటర్లు సైతం 10 శాతంపైగా నష్టపోవడం గమనార్హం! ఫేవరెట్లు వీక్ రాకేష్కు ఇష్టమైన టైటన్ కంపెనీ షేరు గత ఆరు రోజుల్లో 7 శాతం వెనకడుగు వేసింది. ఈ టాటా గ్రూప్ కంపెనీలో రాకేష్కు రూ. 5,000 కోట్లు విలువ చేసే పెట్టుబడులున్నాయి. ఇక రూ. 1,000 కోట్ల విలువైన వాటా కలిగిన ఎస్కార్ట్స్ 5 శాతం నీరసించింది. ఇదేవిధంగా క్రిసిల్, లుపిన్ 3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. -
పసిడి ఎఫెక్ట్ : 1500 కోట్ల ఆదాయం
సాక్షి, ముంబై: ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా మరోసారి తన మార్కెట్ మంత్రాను చాటుకున్నారు. టైటన్ షేర్లలో పెట్టుబడులు ఆయనకు బంగారంలా కలిసి వచ్చాయి. కరోనా సంక్షోభంతో బంగారం ధరలు నింగికెగిసాయి. దీంతో రాకేశ్ కేవలం గత మార్చి నుంచి 1500 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించారు. బంగారం ధర రికార్డు స్థాయిలో పెరగడంతో ఆయన ఫావరెట్ టైటన్ షేర్లుసోమవారం 4.4 శాతం పెరిగి 1,089.10 రూపాయలకు చేరుకుంది. మార్చి 24, 2020న 720 రూపాయల కనిష్టం నుండి 50 శాతానికి పైగా పెరిగింది. 2020లో టైటన్ ఇప్పటివరకు 9 శాతం క్షీణించగా గత నెలలో 8 శాతం ఎగియడం విశేషం. దీనికితోడు ఒక్కో షేరుకు 4 రూపాయల డివిడెండ్ ప్రకటించింది. జూన్ త్రైమాసికం నాటికి రాకేశ్, అతని భార్య రేఖా 4.90 కోట్ల షేర్లు లేదా 5.53 శాతం వాటాను కలిగి ఉన్నారు. టైటన్ షేర్లు మార్చి కనిష్ట స్థాయికి పడిపోయినపుడు, పెట్టుబడుల విలువ 3,528 కోట్ల రూపాయలుగా ఉంది. శుక్రవారం నాటికి 5,112 కోట్లకు పెరిగింది. అంటే మార్చి నుండి 1,584 కోట్ల వృద్ధిని సాధించింది. ఆభరణాల విభాగంలో రికవరీ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉందని జూన్ క్వార్టర్ అప్డేట్లో టైటన్ తెలిపింది. మహమ్మారి వ్యాప్తి తరువాత, బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగిందని టైటన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సీకే వెంకటరమణ తెలిపారు. లాక్ డౌన్ ఆంక్షలతో వివాహ ఖర్చు తగ్గడం, అంతర్జాతీయ ప్రయాణాలు లేకపోవడంతో ఆభరణాల కొనుగోళ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతారని, దీంతో రానున్న కాలంలో మరింత డిమాండ్ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎస్కార్ట్స్లో వాటా తగ్గించుకున్న రాకేష్
ఓపెన్ మార్కెట్ ద్వారా గత బుధవారం(22న) ఎస్కార్ట్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2 లక్షల షేర్లను సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా విక్రయించినట్లు వెల్లడైంది. దీంతో ప్రస్తుతం ఎస్కార్ట్స్లో రాకేష్, భార్య రేఖ, రేర్ ఈక్విటీల వాటా 6.82 శాతానికి పరిమితమైంది. ఈ వాటా విక్రయానికి ముందు 6.97 శాతం వాటాకు సమానమైన 93,97,600 షేర్లను కలిగి ఉన్నట్లు ఎక్స్ఛేంజీల డేటా ద్వారా తెలుస్తోంది. కాగా.. గత బుధవారమే బీఎస్ఈలో ఎస్కార్ట్స్ షేరు ఇంట్రాడేలో రూ. 1210ను అధిగమించడం ద్వారా రికార్డ్ గరిష్టాన్ని తాకడం గమనార్హం. వారాంతాన మాత్రం ఈ షేరు 3.4 శాతం పతనమై రూ. 1,128 వద్ద ముగిసింది. 104 శాతం ర్యాలీ ఈ ఏడాది మార్చిలో నమోదైన కనిష్టం నుంచి ఎస్కార్ట్స్ షేరు 104 శాతం ర్యాలీ చేసింది. లాక్డవున్లోనూ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం, పెరుగుతున్న పంటల విస్తీర్ణం, వర్షపాత అంచనాలు గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ను పెంచనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ బాటలో ఇటీవల ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకోవడం ఎస్కార్ట్స్ కౌంటర్కు జోష్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఎస్కార్ట్స్లో 9 శాతానికిపైగా వాటా కొనుగోలుకి జపనీస్ కంపెనీ క్యుబోటా కార్పొరేషన్కు ఈ నెల మొదట్లో కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించింది. ఇదే విధంగా క్యుబోటా అగ్రికల్చరల్ మెషీనరీ ఇండియాలో 40 శాతం వాటాను ఎస్కార్ట్స్ సొంతం చేసుకునేందుకు సైతం సీసీఐ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వెరసి ఇటీవల ఎస్కార్ట్స్ కౌంటర్కు డిమాండ్ కొనసాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
పతనమైన షేర్లకే అధిక ప్రాధాన్యత
ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా నష్టాలను చవిచూసిన, అంతంత మాత్రంగా ఆదరణ ఉన్న షేర్లను మాత్రమే కొనుగోలు చేయడం ఉత్తమని దిగ్గజ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా తెలిపారు. ఈ వ్యాఖ్యలకు కట్టుబడుతూ ఈ తొలి త్రైమాసికంలో ఈయన పతనమైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ విషయం ఆయన ఫోర్ట్ఫోలియోను పరిశీలిస్తే అర్థమవుతోంది. అలాగే చిన్న మొత్తంలో అధిక షేర్లను తన పోర్ట్ఫోలియోలో చేర్చుకున్నారు. కరోనా కారణంగా మార్చిలో అధికంగా నష్టపోయిన అటోలైన్ ఇండస్ట్రీస్, దిక్సాన్ కార్బోజెన్, ఇండియన్ హోటల్స్ షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను అధిక మొత్తంలో కాకుండా 1శాతానికి మించకుండా కొన్నారు. వీటితో పాటు ఎన్సీసీ, ఫస్ట్సోర్ట్స్ సెల్యూషన్స్, జుబిలెంట్ లైఫ్ సెన్సెన్స్, ర్యాలీస్ ఇండియా, ఎడెల్వీజ్ సర్వీసెస్, ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్ షేర్లను కూడా కొన్నారు. ఈ జూన్ క్వార్టర్ నాటికి అటోలైన్ ఇండస్ట్రీస్లో రాకేశ్ ఝున్ఝున్వాలా దంపతులిద్దరూ 6.4శాతం వాటాను కలిగి ఉన్నారు. మార్చిలో ఉన్న మొత్తం వాటాతో పోలిస్తే ఈ క్యూ1లో కొద్దిగా వాటాలను విక్రయించినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ త్రైమాసికంలో డిష్మెన్ కార్బోజెన్ అమ్సిస్లో వీరిద్దరూ 1.59 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఇదే కాలంలో ఝున్ఝున్వాలా ఇండియన్ హోటల్స్లో 1.05శాతం వాటాను కొనుగోలు చేసి టాటా గ్రూప్లోకి ప్రవేశించారు. దురదృష్టవశాత్తు ఏడాది కాలంలో ఈ రెండు షేర్ల ప్రదర్శన అంతబాగోలేదు. అటోలైన్ ఇండస్టీస్ షేరు నేటి ట్రేడింగ్లో 5శాతం లాభపడినప్పటికీ.., ఏడాది కాలంలో షేరు మొత్తం 52శాతం క్షీణించింది. ఇదే ఏడాది కాలంలో ఇండియా హోటల్స్ షేర్లు 44శాతం, డిష్మెన్ కార్బోజెన్ షేరు 13శాతం నష్టాన్ని చవిచూశాయి. గత వారం ఒక వెబ్నార్లో మాట్లాడుతూ... మార్కెట్లో డౌన్వర్డ్ నష్టాలను, అప్సైడ్ పొటెన్షియల్స్ రెండింటినీ చూస్తున్నట్లు తెలిపారు. జూలై 22, 2020 బుధవారం నాటికి ఝున్ఝున్వాలా మొత్తం స్టాక్ హోల్డింగ్ విలువ రూ.11,261 కోట్లుగా ఉన్నట్లు ట్రెండ్లీన్ డేటా చెబుతోంది. మల్టీబ్యాగర్లను గుర్తించే అంశంపై ఝున్ఝున్వాలా తన వ్యూహాలను పంచుకున్నారు. ‘‘షేరు కొనుగోలు విషయంలో వ్యక్తిగత అభిప్రాయానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. షేరును అధికం కాలం పాటు హోల్డ్ చేసి ఓపిక ఉండాలి. ఇవన్నీ రిస్క్ తీసుకొనేవారి ధైర్యం, నిలకడ, ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. ఇప్పటికీ నేను మార్కెట్లో భారీ పతనాన్ని చవిచూసిన షేర్లను కొనుగోళ్లు చేస్తాను’’ అని ఆయన తెలిపారు. ఝున్ఝున్వాలా అతని సతీమణి ఎన్సీసీలో 1.25శాతం వాటాలను కొనుగోలు చేశారు. ఈ షేరు ఏడాది కాలంలో 60శాతం నష్టాన్ని చవిచూసింది. ఫస్ట్సోర్స్ సెల్యూషన్స్లో 0.82శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ షేరుకూడా గడిచిన ఏడాదిలో 18శాతం పతనాన్ని చవిచూసింది. అలాగే ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో, ర్యాలీస్ ఇండియా ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్లో అరశాతం లోపు వాటాను పెంచుతున్నారు. ఈ మూడింటిలో గడిచిన ఏడాది కాలంలో ర్యాలీస్ ఇండియా 98శాతం లాభపడింది. అయితే డెల్టా పవర్ కార్పోరేట్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు వరుసగా 42శాతం, 38శాతం నష్టాన్ని చవిచూశాయి. -
Q1లో జున్జున్వాలా నెట్వర్త్ జూమ్
ఈ ఆర్థిక సంవత్సరం(2021) తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా నెట్వర్త్ రూ. 10,000 కోట్లను అధిగమించింది. వెరసి స్టాక్ మార్కెట్లలో రాకేష్ పెట్టుబడుల విలువ జూన్ చివరికల్లా రూ. 10,797 కోట్లను తాకింది. ఈ కాలంలో కొన్ని కంపెనీలలో వాటాలు తగ్గించుకోగా.. మరికొన్ని కంపెనీలలో అదనపు పెట్టుబడుల ద్వారా వాటాలను పెంచుకున్నారు. కాగా.. అత్యంత ఫేవరెట్ స్టాక్స్ అయిన టైటన్ కంపెనీ, ఎస్కార్ట్స్లో పెట్టుబడులను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చారు. ఇతర వివరాలు చూద్దాం.. బిగ్బుల్ బిగ్బుల్గా పేరున్న రాకేష్ జున్జున్వాలా కోవిడ్-19 నేపథ్యంలోనూ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో ఈ ఏడాది క్యూ1లో పెట్టుబడుల విలువ రూ. 2514 కోట్లమేర పెరిగింది. సోమవారం ముగింపు ధరల ప్రకారం రాకేష్ , ఆయన కుటుంబ సభ్యుల పెట్టుబడుల విలువ రూ. 10,797 కోట్లకు చేరింది. తద్వారా మార్చి నుంచి చూస్తే 30 శాతం ఎగసింది. మార్చిలో రాకేష్ పెట్టుబడులు రూ. 8284 కోట్లుగా నమోదయ్యాయి. మార్చికల్లా 29 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటాలను కలిగి ఉండటం గమనార్హం! లుపిన్లో .. క్యూ1లో రాకేష్.. ర్యాలీస్ ఇండియా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, ఫెడరల్ బ్యాంక్, ఎన్సీసీ, ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్లో వాటాలు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో మరోపక్క లుపిన్, ఆగ్రో టెక్ ఫుడ్స్లో కొంతమేర వాటాలు విక్రయించారు. ఇక తాజ్ గ్రూప్ హోటళ్ల కంపెనీ ఇండియన్ హోటల్స్లో 1.05 శాతం వాటాకు సమానమైన 12.5 మిలియన్ షేర్లను సొంతం చేసుకున్నారు. కాగా.. ఓరియంట్ సిమెంట్, ఎంసీఎక్స్, ఆయాన్ ఎక్స్ఛేంజీ, క్రిసిల్, ఫోర్టిస్ హెల్త్కేర్ తదితర 11 కంపెనీలలో వాటాలను యథాతథంగా కొనసాగించారు. 4 స్టాక్స్ జోరు ఏప్రిల్ నుంచి ప్రధానంగా ర్యాలీస్ ఇండియా, ఎస్కార్ట్స్, జూబిలెంట్ లైఫ్, లుపిన్ స్టాక్స్లో వచ్చిన ర్యాలీ కారణంగా రాకేష్ సంపద రూ. 1246 కోట్లమేర బలపడింది. క్యూ1లో పెరిగిన రూ. 2514 కోట్ల సంపదలో ఇది సగంకావడం విశేషం! -
అలెంబిక్ ఫార్మా- ర్యాలీస్.. దూకుడు
అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ డయాబెటిక్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి సూత్రప్రాయ అనుమతి లభించినట్లు వెల్లడించడంతో అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.3 శాతం జంప్చేసి రూ. 1029 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1040 వరకూ దూసుకెళ్లింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఎంపగ్లిఫోజిన్, మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్లకు యూఎస్ నుంచి అనుమతి లభించినట్లు అలెంబిక్ తెలియజేసింది. వీటిని 5ఎంజీ/500 ఎంజీ, 5ఎంజీ/1000 ఎంజీ, 12.5ఎంజీ/500 ఎంజీ, 12.5ఎంజీ/1000 ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు వెల్లడించింది. బోరింగర్ ఫార్మా తయారీ సింజార్డీ ట్యాబ్లెట్లకు ఇవి జనరిక్ వెర్షన్కాగా.. గ్లైసమిక్ నియంత్రణకు వినియోగపడుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. వీటికి 17.2 కోట్ల డాలర్ల(రూ. 1300 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు అంచనా. ర్యాలీస్ ఇండియా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా అదనంగా 7.25 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ర్యాలీస్ ఇండియా కౌంటర్ జోరందుకుంది. ఈ టాటా గ్రూప్ కంపెనీలో తాజాగా రాకేష్ వాటా 10.31 శాతానికి ఎగసినట్లు తెలుస్తోంది. వెరసి 2016 మార్చి తదుపరి ర్యాలీస్ ఇండియాలో తిరిగి రాకేష్ వాటా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ర్యాలీస్ ఇండియా షేరు తొలుత ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్చేసి రూ. 301ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం పెరిగి రూ. 295 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 24న నమోదైన కనిష్టం రూ. 127 నుంచి ర్యాలీస్ ఇండియా కౌంటర్ 136 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
స్మాల్, మిడ్క్యాప్ షేర్లను ఇప్పుడు కొనవచ్చా..?
స్టాక్ మార్కెట్లో ఇటీవల స్మాల్, మిడ్క్యాప్ కంపెనీల షేర్ల సందడి కనిపిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి రాకేశ్ ఝున్ఝున్వాలా, రాధాకృష్ణ ధమాని లాంటి ఏస్ ఇన్వెస్టర్ల వరకు మిడ్, స్మాల్క్యాప్ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ జూన్ క్వార్టర్లో కొన్ని స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల్లో పెద్ద ఇన్వెస్టర్లు భారీగా వాటాలను పెంచుకున్నట్లు గుణాంకాలు చెబుతున్నాయి. ఫస్ట్సోర్స్ సెల్యూషన్స్లో ఝున్ఝున్వాలా ఈ క్యూ1లో అదనంగా 57లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. రాధాకృష్ణ ధమాని ఇదే జూన్ క్వార్టర్లో కళ్యాణి గ్రూప్నకు చెందిన బీఎఫ్ యుటిలిటీస్లో 1.3శాతం ఈక్విటీ వాటాను దక్కించుకున్నారు. అలాగే అస్ట్రా మైక్రోవేవ్ ప్రాజెక్ట్స్లో 1.03శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఈ రెండు కంపెనీలు స్మాల్క్యాప్ రంగానికి చెందినవి. అయితే చాలా మిడ్క్యాప్ కంపెనీల్లో వాటాలను పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈఏడాది ప్రారంభం నుంచి ఈ జూలై 14నాటికి బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 11శాతం పతనమైంది. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 8శాతం నష్టాన్ని చవిచూసింది. అయితే బీఎస్ఈ సెన్సెక్స్ మాత్రం 13శాతం క్షీణించింది. ఈ సమయంలో మిడ్, స్మాల్క్యాప్ కొనవచ్చా..? గత కొన్నేళ్లు స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు ఆశించిన స్థాయిలో లాభపడలేదు. ఇప్పుడు ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య, ధీర్ఘకాలిక దృష్ట్యా నాణ్యత కలిగిన మిడ్, స్మాల్క్యాప్ షేర్ల ఎంపిక సరైనదేనని విశ్లేషకులు అంటున్నారు. తక్కువ వాల్యూయేషన్లతో ఆకర్షణీయమైన ధరల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఇటీవల స్మాల్, మిడ్క్యాప్ షేర్లు ర్యాలీ చేస్తున్నాయని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ తెలిపింది. కోటక్ సెక్యూరిటీస్ సిఫార్సులు: డీసీబీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఈక్విటాస్ హోల్డింగ్స్, కల్పతరు పవర్ ట్రాన్స్ మిషన్స్, కాస్ట్రోల్ ఇండియా, సువెన్ ఫార్మాస్యూటికల్స్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ స్మాల్క్యాప్ షేర్లు: హాక్విన్స్ కుకర్, స్వరాజ్ ఇంజన్స్, రాడికో ఖేతన్, అమృతాంజన్ హెల్త్కేర్, కేఈఐ ఇండస్ట్రీస్ -
రాకేష్ జున్జున్వాలా 3 సూత్రాలు...!
సుమారు నాలుగు దశాబ్దాల నుంచీ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్గా కొనసాగుతూ బిగ్బుల్గా ప్రసిద్ధి చెందిన రాకేష్ జున్జున్వాలా.. ప్రస్తుతం ప్రపంచంలోనే పెట్టుబడికి దేశీ స్టాక్ మార్కెట్లు అత్యుత్తమమంటూ కితాబునిచ్చారు. రాకేష్తో ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించిన పలువురు రుమేనియా రియల్ ఎస్టేట్, న్యూయార్క్ కమోడిటీస్ తదితర పెట్టుబడి మార్గాలవైపు దృష్టిసారించిన అంశంపై స్పందిస్తూ.. ఇంటి భోజనం రుచిగా ఉన్నప్పుడు బయటికెళ్లి ఆహారాన్ని తినడమెందుకంటూ సరదాగా ప్రశ్నించారు. పెట్టుబడుల విషయంలో ప్రధానంగా మూడు సూత్రాలను పాటిస్తానంటూ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇలా చెప్పుకొచ్చారు. తొలుత సొంతంగా ఆలోచించాలి. తదుపరి స్థిరంగా ఒక అభిప్రాయానికి రావాలి. దీర్ఘకాలంపాటు పెట్టుబడులను కొనసాగించాలి. ఇవి చేసేందుకు ధైర్యం, రిస్కు తీసుకోగల సంకల్పం, ధృఢ వైఖరి వంటివి ఉండాలి. ఇందువల్లనే ఇప్పుడుకూడా అత్యధికంగా పతనమైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాను. స్టాక్ మార్కెట్లో నష్టపోయే రిస్క్లూ.. భారీగా లాభపడే అవకాశాలనూ పలుమార్లు చూసినట్లు ఈ సందర్భంగా రాకేష్ తెలియజేశారు. గత పెట్టుబడులపై రాకేష్ ఇలా వివరించారు.. ఎస్కార్ట్స్లో.. గతంలో ఎస్కార్ట్స్ యాజమాన్యంపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సమయంలో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధపడ్డాను. కంపెనీ బ్యాలన్స్షీట్ను పరిశీలించాక నష్ట భయంకంటే లాభార్జనకే అధిక అవకాశాలున్నట్లు విశ్వాసం కలిగింది. యాజమాన్య మార్పిడి జరుగుతోంది. అయితే ట్రాక్టర్ల బిజినెస్ మెరుగైన లాభాలు ఆర్జిస్తోంది. ఈ సమయంలో పలువురు ఎస్కార్ట్స్లో పెట్టుబడులకు విముఖత చూపారు. 12.5 మిలియన్ షేర్లను కొనుగోలు చేశాను. ఐదేళ్లలోనే 10 రెట్లు రిటర్నులు లభించాయి. సొంత యోచనతోపాటు.. దీర్ఘకాలంపాటు కొనసాగగల ఓర్పు, కట్టుబాటు వంటివి స్టాక్స్ పెట్టుబడుల్లో కీలకపాత్ర పోషిస్తాయి. పోర్ట్ఫోలియో విలువకంటే ఎప్పుడూ 2-4 రెట్లు మించి రుణాలకు వెళ్లలేదు. దేశీయంగా కుటుంబ ఆదాయాల్లో 3-4 శాతం వాటానే స్టాక్స్లోకి మళ్లుతుంది. యూఎస్లో నమోదయ్యే 33 శాతం పెట్టుబడులతో పోలిస్తే ఇవి బహుతక్కువ.