reduce
-
World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు
గుండె జబ్బు.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారినీ చుట్టుముడుతోంది. ఇటీవలికాలంలో యువతలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఒక వైద్య అధ్యయనంలోని వివరాల ప్రకారం కుటుంబ చరిత్ర, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మొదలైనవన్నీ హృదయ ఆరోగ్య సమస్యలకు కారణంగా నిలుస్తుంటాయి. అయితే హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.మద్యం, ధూమపానానికి దూరంగుండె ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం అనేది ధమనుల పనితీరును దెబ్బతీసుస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం రక్తపోటును పెంచుతుంది. గుండె పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. దీర్ఘకాలిక గుండె జబ్బుల ముప్పును గణనీయంగా పెంచుతుంది.అలసటపై నిర్లక్ష్యం వద్దుగుండెకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలైనవి తీవ్రమైన గుండె సమస్యలకు సూచన కావచ్చు. ఇటువంటి సమయంలో వెంటనే చికిత్స తీసుకోవాలి. హృదయ స్పందన రేటు పెరగడం, విపరీతంగా అలసిపోయినట్లు అనిపించడం హృదయ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.నిద్రలేమిని విస్మరించొద్దునిద్రలేమి సమస్య ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన దినచర్యలో నిద్ర ఒక ముఖ్యమైన భాగం. ప్రతి రోజూ రాత్రి కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, హృదయ సంబంధ సమస్యలను నివారించవచ్చు. చక్కని నిద్ర పలు వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.ఒత్తిడిని జయించండి అధిక ఒత్తిడి ఆరోగ్యానికి ప్రమాదకరం. దీర్ఘకాలిక ఒత్తిడి గుండెను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్ను మరింతగా పెంచుతుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.వ్యాయామం తప్పనిసరిఫిట్నెస్పై శ్రద్ధ చూపడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం ప్రతీ రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. నడక, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వ్యాయామం చేసే అలవాటు శరీర బరువును తగ్గించడంలో, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. -
అల్లు శిరీష్ బడ్డీ మూవీ.. గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్!
అల్లు శిరీష్ హీరోగా, గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రానికి శామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బడ్డీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో బడ్డీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్లో రూ.99, మల్టీప్లెక్సుల్లో కేవలం రూ.125 గా నిర్ణయించినట్లు అల్లు శిరీష్ ట్వీట్ చేశారు. కుటుంబమంతా బడ్డీని చూసేందుకు మీకు అవకాశం కల్పిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. దీంతో సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే బడ్డీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. బడ్డీ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. Our team wants you & your whole family to enjoy #Buddy🧸in cinemas. So we've made the prices of ticket accessible. So, buddy.. Are you ready? #BuddyonAug2nd @StudioGreen2 pic.twitter.com/9yV1A3ZqSc— Allu Sirish (@AlluSirish) July 29, 2024 -
బడ్జెట్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు
యూనియన్ బడ్జెట్ 2024-25లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొబైల్ ఫోన్ల మీద బేసిక్ కష్టం డ్యూటీస్ 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో మొబైల్ ఫోన్ ధరలు క్రమంగా తగ్గనున్నాయి. ఈ తరుణంలో యాపిల్ తన మొత్తం పోర్ట్ఫోలియోలో ఐఫోన్ ధరలను 3 నుంచి 4 శాతం తగ్గించింది.ధరలను తగ్గించిన తరువాత ప్రో లేదా ప్రో మాక్స్ మోడల్ను కొనుగోలు చేస్తే రూ. 5100 నుంచి రూ. 6000 మధ్య తగ్గింపు లభిస్తుంది. మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 13, 14, 15 మోడల్స్ మీద రూ. 3000 తగ్గుతుంది. ఇదే సమయంలో ఐఫోన్ ఎస్ఈ మీద రూ. 2300 తగ్గుతుంది.యాపిల్ కంపెనీ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. నిజానికి కొత్త ప్రో మోడల్స్ లాంచ్ అయిన తరువాత పాత మోడల్స్ ఉత్పత్తి నిలిపివేస్తుంది. అప్పటికే ఉన్న మోడల్లను డీలర్ల ద్వారా స్వల్ప డిస్కౌంట్స్ ద్వారా క్లియర్ చేస్తారు. కాబట్టి ఇప్పటి వరకు కొత్త ప్రో మోడల్స్ ధరలు తగ్గించలేదు. -
తగ్గిన ఇంధన ధరలు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
మహారాష్ట్ర ప్రభుత్వం.. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇంధనంపై పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ ధరలను తగ్గించే వ్యాల్యువ్ యాడెడ్ ట్యాక్స్ (VAT)ని ప్రభుత్వం సవరించింది. లీటరు పెట్రోల్ ధరలను 65 పైసలు తగ్గించింది. డీజిల్ ధరలను రూ.2.60 పైసలు తగ్గిస్తూ ప్రకటించింది. ఈ ధరలు బృహన్ ముంబై, థానే, నవీ ముంబై మునిసిపల్ ప్రాంతాల్లో ధర తగ్గింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు.వ్యాట్ తగ్గింపు నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.200 కోట్ల భారం పడుతుందని మంత్రి స్పష్టం చేశారు. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో ఇంధన ధరలను పెంచిన తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ధరల పెరుగుల తరువాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 వద్ద ఉంది. కర్ణాటకలో ఇంధన ధరలను పెంచుతూ ప్రకటనలు జారీ చేసిన తరువాత గోవా ప్రభుత్వం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే కర్ణాటక పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ ఇటీవలే కీలక ప్రకటన వెల్లడించింది. -
కీళ్ల నొప్పులను తొలగించే చిట్కాలు మీకోసం...
నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ పండ్లేమిటంటే... నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేకరకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్షపండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కీళ్లనొప్పులని తగ్గిస్తాయి. ఇవి చదవండి: మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..! -
హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నెల రోజుల పూర్తయ్యాక కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ఆడియన్స్కు మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్స్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలోని థియేటర్స్లో హను-మాన్ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్ ధర రూ.175లుగా ఉంది. ఈ టికెట్స్ ఇకపై రూ.100 కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్లలో రూ.295గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. అయితే ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. The #HanuManRAMpage is not over yet❤️🔥 Celebrate the #HanuMania at the most affordable & Lowest prices in the Nizam Area since the release💥 Book your tickets now! - https://t.co/nM6rXb7n54#HanuMan 🔥 Nizam Release by @MythriOfficial A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/wV0cWFvAA6 — Prasanth Varma (@PrasanthVarma) February 16, 2024 -
షుగర్ని ఎంతలా స్వాహా చేసేస్తున్నామో తెలుసా?
షుగర్ లెస్గా తినడం దాదాసే అసాధ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులైన ఒక్కోసారి నోరు కట్టడి చేయడం కష్టంగా ఉంటుంది. స్వీట్ తినలేకపోతున్నామనే బాధను భర్తీ చేసేలా వాటి స్థానంలో ప్రాసెప్ చేసినవి కూడా వచ్చాయి. నిపుణులు అభిప్రాయం ప్రకారం వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండి, విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏదీ బెటర్? పూర్తిగా షుగర్ వాడకాన్ని నియంత్రించొచచ్చా? ప్రపంచవ్యాప్తంగా గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 176 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర వినియోగం అవుతుంది. ఈ ఏడాది కల్లా అది కాస్త ఏకంగా 180 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందనేది అంచనా. ప్రతీ వ్యక్తి రోజుకి 17 టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెర తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. నిజానికి పురుషులు తొమ్మిది టీస్పూన్లు, స్త్రీలు ఆరు టీస్పూన్ల చక్కెర వాడాలని సిపార్సు చేయగా, ప్రజలు మాత్రం దాన్ని మించే వినియోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారికి ప్రాసెస్ చేసిన షుగర్ వాడోచ్చా అంటే?. నిపుణులు దానికంటే సహజ చక్కెర్లు ఉన్న పండ్లు పాలు తీసుకోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. తేనె వంటి కొన్ని రకాల సిరప్లు మంచివే గానీ వాటిలో అదనపు చక్కెర్లు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వైద్యులు మాత్రం ఫ్రక్టోజ్, తేనె, బెల్లం వంటి వాటిల్లో తక్కువ గ్లైసెమిక్ ఉండి, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. అయినప్పటికీ వీటిని కూడా అతిగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడమే గాక రక్తపోటు వంటి వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అలాగే తేనెలో యాంటీమైక్రోబయల్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వీటన్నింటికంటే ఉత్తమమైన స్వీటెనర్ కేవలం సహజసిద్ధమైన పండ్లేనని, అవి తీసుకోవడమే మేలని చెబుతున్నారు. చక్కెరను పూర్తిగా తొలగించాలనుకోవడం కంటే ఇలా సహజసిద్ధమైన పండ్ల రూపంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా నారింజ, ఆపిల్, పైనాపిల్, కివి వంటి పండ్లు మంచివని చెబుతున్నారు. అలాగే వీటి తోపాటు తృణధాన్యాలు కూడా ఆరోగ్యానికి మంచివి. ఇవి శరీరానికి కావాల్సిన మంచి చక్కెర్లను అందిస్తాయి. ఎలాంటి చక్కెర్లకు దూరంగా ఉండాలి సోడాలు, కూల్ డ్రింక్స్ వంటి జోలికి పోవకపోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో అధికంగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది కాలేయం ప్రభావం చూపించి ఇన్సులిన్ని ప్రభావితం చేస్తుంది. తగినంతగా నిద్రపోకపోతే ఆకలి అనే హార్మోన్పై ఎలాంటి ప్రభావం ఏర్పడదు లేదంటే తెలియకుండానే ఎక్కువ తినాలనే కోరిక కలుగుతుంది. దీంతో చక్కెర కలిగిన ఆ హరం తీసుకుంటారని చెబుతున్నారు నిపుణులు. నిద్రలేమి లెప్టిన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో తినే సంతృప్తికి సంబంధించిన హార్మోన్, ఆకలితో సంబంధం ఉన్న గ్రెలిన్, అడిపోనెక్టిన్ల సాంద్రతను పెంచేస్తుంది. తత్ఫలితంగా స్వీట్ కంటెంట్కి సంబంధించినవి తినాలనిపిస్తుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన వాటికంటే కొద్ది ఆలివ్ నూనెతో ఓవెన్లో వేయించినవి తీసుకుంటే మేలని చెబుతన్నారు. ఇలా తీసుకుంటే సహజ చక్కెరలతో కూడిన పోషకాహారం శరీరానికి అందడమే గాక తినేందుకు కూడా రుచికరంగానూ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: బాదం పప్పులు మంచివని తినేస్తున్నారా? అధికంగా తీసుకుంటే డేంజరే!) -
షిప్పింగ్ కంపెనీల ఆదాయాలు తగ్గొచ్చు
ముంబై: దేశీ షిప్పింగ్ కంపెనీల ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 5–7 శాతం మధ్య క్షీణించొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) షిప్పింగ్ కంపెనీల ఆదాయం 35 శాతం వృద్ధిని చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 23–25 శాతం మధ్య తగ్గుతుందని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. పలు దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చార్టర్ రేట్లు పెరగడం, కరోనా ఆంక్షల అనంతరం చైనా నుంచి పెరిగిన డిమాండ్ గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో వృద్ధికి దారితీసినట్టు క్రిసిల్ తెలిపింది. వివిధ విభాగాల్లో పనిచేసే షిప్పింగ్ కంపెనీల నిర్వహణ మార్జిన్ వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. చార్టర్ రేట్లలో దిద్దుబాటు ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో షిప్పింగ్ కంపెనీల సగటు నిర్వహణ మార్జిన్ 33–35 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా ముందున్న 25–30 శాతానికంటే ఎక్కువేనని గుర్తు చేసింది. మోస్తరు మూలధన వ్యయ ప్రణాళికల నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీల రుణ పరపతి ప్రస్తుతం మాదిరే మెరుగ్గా కొనసాగుతుందని అంచనా వేసింది. దేశంలోని మొత్తం 20 మిలియన్ మెట్రిక్ టన్నుల డెడ్వెయిట్ టన్నేజీ సామర్థ్యంలో సగం వాటా కలిగిన ఐదు షిప్పింగ్ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్ ఈ వివరాలు అందించింది. తగ్గిన రేట్లు.. చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు వీలుగా దేశీ షిప్పింగ్ కంపెనీలు ఎక్కువగా ట్యాంకర్లను (70 శాతం) కలిగి ఉన్న విషయాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. ఆ తర్వాత బొగ్గు, ముడి ఇనుము, ధాన్యాల రవాణాకు 20 శాతం మేర సామర్థ్యం ఉండగా.. మిగిలిన 10 శాతం కంటెయినర్ షిప్లు, గ్యాస్ క్యారీయర్లు ఉన్నట్టు పేర్కొంది. చార్టర్ రేట్లు అంతర్జాతీయ డిమాండ్–సరఫరాకు అనుగుణంగా మారుతూ ఉంటాయని క్రిసిల్ తెలిపింది. ‘‘చమురు ట్యాంకర్ల చార్టర్ రేట్లు గత ఆర్థిక సంవత్సరంలో ఒక రోజుకు 50వేల డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20–25 శాత మేర తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గడమే ఇందుకు కారణం’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ప్రస్తుత పరిస్థితే అంతర్జాతీయ వాణిజ్యంలో కొనసాగుతుందని, వచ్చే ఏడాది చార్టర్ రేట్లు మరికొంత దిగి వస్తాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కరోనా ముందు నాటి కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. చైనా, భారత్ నుంచి పెరిగే డిమాండ్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల చార్టర్ రేట్లకు మద్దతుగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. మరోవైపు ట్యాంకర్ల సరఫరా పరిమితంగా ఉంటుందని, ఫలితమే చార్టర్ రేట్లు కరోనా ముందున్న నాటితో పోలిస్తే ఎగువ స్థాయిలోనే ఉండొచ్చని వవరించింది. డ్రై బల్క్ క్యారియర్ల చార్టర్ రేట్లు అదే స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. -
బ్యాంక్లపైనే ఆధారపడొద్దు
ముంబై: నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలని, బ్యాంక్లపై ఆధారపడడాన్ని పరిమితం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలకు) ఆర్బీఐ సూచించింది. బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ విధానాల ద్వారా బ్యాలన్స్ షీట్లు పటిష్టం చేసుకుని, మోసాలు, డేటా చోరీల నుంచి రక్షణ కలి్పంచుకోవాలని కోరింది. దేశ బ్యాంకింగ్ రంగం, ఎన్బీఎఫ్సీలు బలంగా ఉన్నాయంటూ.. అధిక నగదు నిష్పత్తి, మెరుగుపడిన ఆస్తుల నాణ్యత, లాభాల్లో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. ఈ మేరకు బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య పరస్పర అనుసంధానత పెరిగిన నేపథ్యంలో.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలి. బ్యాంక్లపై అధికంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. కస్టమర్లకు సేవల విషయంలో మరింత కృషి చేయాలి’’అని ఆర్బీఐ కోరింది. సైబర్ దాడుల రిస్క్ నూతన టెక్నాలజీల అమలు నేపథ్యంలో సైబర్ దాడులు, డేటా చోరీ, నిర్వహణ వైఫల్యాలు పెరిగినట్టు పేర్కొంది. మెరుగైన పాలన, రిస్క్ నిర్వహణ విధానాల ద్వారా బ్యాలన్స్ షీట్లను పటిష్టం చేసుకుని, పెరుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఆకాంక్షలను చేరుకునే విధంగా ఉండాలని కోరింది. ‘‘ఈ విధమైన సాంకేతిక, సైబర్ భద్రతా రిస్క్లను గుర్తించి, వాటి ముప్పును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. బలమైన గవర్నెన్స్, రిస్క్ నిర్వహణ విధానాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి’’అని సూచించింది. -
'బిగ్ విన్'! ఒక్క వీడియో..ప్రముఖ ఫుడ్ కంపెనీని షేక్ చేసింది!
ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న ప్యాకేజింగ్ ఆహారా పదార్థాలు ఆయా కంపెనీలు లేబుల్ చేసినట్లు ఆరోగ్యకరమైనవి కావడం లేదు. మొదట్లో అడ్వర్టైస్మెంట్లతో ఊదరగొట్టి చివరికీ.. అవే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు పెదవివిరవడం చూస్తూనే ఉన్నాం. అయినా అవేమీ వాటి తీరు మార్చుకోవు. మనం కూడా గత్యంతర లేకనో అలవాటు పడో గానీ అవే కొనేస్తున్నాం. కానీ ఇక్కడొక ఇన్స్టాగ్రాం వినియోగదారుడు ఒక్క వీడియోతో ప్రముఖ కంపెనీని షేక్ చేశాడు. దెబ్బకు దిగొచ్చి తీరు మార్చుకునేలా చేశాడు. వివరాల్లోకెల్తే..ఓ ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ రేవంత్ హిమంత్ సింకా అకా ప్రముఖ క్యాడ్బరీ సంస్థకి చెందిన బోర్న్విటా చాక్లెట్స్, హెల్త్ డ్రింగ్లో చక్కెర కంటెంట్ అధికంగా ఉందని ప్రూవ్ చేశాడు. బోర్న్విటా ప్రతి వందగ్రాముల పొడిలో సుమారు 37.4 గ్రాముల చక్కెర ఉందని వాదించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఇది నిజంగా ఆరోగ్యానికి హానికరమైనదని డయాబెటిస్ పేషెంట్లుగా మారుస్తుందని విమర్శలు చేశారు. పైగా ఆ కంపెనీ లెబుల్పై చెబుతున్నవన్నీ అబద్ధాలే అని ప్రజలను మాయం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఇందులో వాడే షుగర్ వల్ల డయాబెటిస్, ఉపయోగిస్తున్న ఫుడ్ కలర్స్ క్యాన్సర్కి దారితీస్తుందని చెప్పారు. తాను పోషకాహార నిపుణుడనని, ఆరోగ్య నిపుణుడిగా దీన్ని బల్లగుద్ది చెప్పగలనని అన్నారు. ఆ బ్రాండ్ టాగ్లైన్పై కూడా హిమంత్ సింకా విమర్శలు కురిపించారు. అయితే కంపెనీ తొలుత అవన్నీ అశాస్త్రీయమైనవంటూ కొట్టిపారేసింది. పైగా హిమంత్ సింకాకి లీగల్ నోటీసులు కూడా పంపించింది సదరు బోర్న్విటా కంపెనీ. అయితే హిమంత్ విడుదల చేసిన వీడియో అప్పటికీ నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యింది. Bournvita.. is it... I'm Shocked 😳😳😳😳 I am a victim from childhood #bournvita #childhood #victim #young #india pic.twitter.com/gmiI3tci4e — Prof Dr Shibu A (@shibu_prof) April 5, 2023 అదీగాక ఈ వీడియోని రాజకీయవేత్త పరేష్ రావల్, మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ కూడా షేర్ చేశారు. దీంతో ఎనిమిది మంది వైద్యులు, పోషకాహార నిపుణులతో కూడిన ప్రముఖ భారతీయ పోషకాహార సంస్థ హిమత్సింకా వీడియోలో చెప్పింది కచ్చితమైనదని ధృవీకరించింది. దెబ్బకు బోర్న్ విటా కంపెనీ దిగొచ్చి చక్కెర పరిమాణాన్ని సుమారు 14.4% మేర దిగొచ్చింది. చరిత్రలో తొలిసారి ఇలా విమర్శలు అందుకున్న వెంటనే ఓ కంపెనీ మార్పుకి నాంది పలికి షుగర్ కంటెంట్ని తగ్గించింది. దీంతో ఏ కంపెనీ తప్పుగా లేబుల్ చేస్తూ మార్కెట్ చేసే సాహసం చేయదని అన్నారు హిమంత్ సింకా. ఆరోగ్యకరమైన ఆహారం కోసం చేసిన పోరాటం ఇది, కేవలం బోర్న్ విటాకు వ్యతిరేకం కాదని అన్నారు. జంక్పుడ్ విక్రయించే ఏ కంపెనీకి అయినా తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తా, ముఖ్యంగా దాని లేబుల్పై తప్పుడు ప్రచారం చేస్తే అస్సలు ఉపేక్షించనని అన్నారు. ఈ ఘటనతో ప్రతి కంపెనీ ప్యాకేజింగ్ ఫుడ్ విషయంలో తప్పక జాగ్రత్త పడుతుంది. ఇది మాములు విజయం కాదు 'బిగ్ విన్'. ఎందుకంటే? ఒక్క వీడియోతో కంపెనీ మూలాలే కదిలిపోయాలా చేశాడు హిమంత్ సింకా. View this post on Instagram A post shared by Revant Himatsingka (@foodpharmer) (చదవండి: పార్కిన్సన్స్ డిసీజ్ ప్రాణాంతక వ్యాధా? ఎలా నివారించాలి?) -
‘సామాజిక’ దూరంతో మానసిక ఆరోగ్యం, ఉద్యోగ తృప్తి
న్యూఢిల్లీ: అస్తమానం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మునిగిపోయేకంటే కాస్తంత సేపు వాటిని పక్కనబెడితే మానసిక ఆరోగ్యంతోపాటు ఉద్యోగంలో సంతృప్తి పెరుగుతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. జర్మనీలోని ప్రఖ్యాత రూహర్–యూనివర్సిటీ బూచమ్, జర్మనీ మానసిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ► సామాజిక మాధ్యమాల్లో గడిపేవారు తమ ఉద్యోగంపై దృష్టిపెట్టలేకపోతున్నారు. వీరు ఒక 30 నిమిషాలు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆర్యోగం మెరుగవడంతోపాటు వృత్తిజీవితం పట్ల సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు ► సోషల్మీడియాలో ఆన్లైన్లో లేనపుడు ఏదో మిస్ అవుతున్నామే అనే భావన ఈ 30 నిమిషాల దూరం తర్వాత తగ్గిందట ► ఇంతకాలం సోషల్ మీడియాలో గడుపుతూనే పని చేసిన వాళ్లు అతిగా పనిచేశామని భావించేవారట. 30 నిమిషాలు సోషల్మీడియా పక్కనబెడితే ‘అతిపని’ భావన కొంచెం తగ్గిందట ► పని మధ్యలో వదిలేసి వాట్సాప్, ఫేస్బుక్ చూసేవాళ్లు తిరిగి పని మీద పూర్తి ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో పనిలో చక్కని ఫలితాలు అందుకోలేకపోతున్నారు ► రోజుకు కనీసం 35 నిమిషాలు సోషల్మీడియాలో గడిపేవారిపై అధ్యయనం చేశారు ► అధ్యయనంలో భాగంగా సగం మంది పాత అలవాట్లనే కొనసాగించగా, మిగతా వారిని పూర్తిగా మీడియాకు దూరంపెట్టారు ► ఒక ఏడు రోజుల తర్వాత వారి పనిభారం, ఉద్యోగంలో సంతృప్తి, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి స్థాయిలు, పని పట్ల అంకితభావం, మీడియాకు ఎందుకు అతుక్కుపోవాల్సి వస్తోంది? వంటి ప్రశ్నలడిగి విశ్లేíÙంచారు. ► దైనందిన జీవితంలో కోల్పోయిన భావోద్వే గాలను ‘సోషల్ మీడియా’ ద్వారానైనా పొందేందుకు కొందరు వాటికి అతుక్కుపోయారని అధ్యయనం అభిప్రాయపడింది ► కొందరు మెరుగైన ఉద్యోగం కోసం లింక్డ్ఇన్ వంటి వేదికను ఆశ్రయించారు. ► వాస్తవిక ప్రపంచం నుంచి తప్పించుకునేందుకు కొందరు సోషల్ నెట్వర్క్ను ఆశ్రయిస్తున్నారు. ఇవిలాగే కొనసాగితే ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనం హెచ్చరించింది. -
'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..
టెక్ మిలినియర్ బ్రయాన్ జాన్సన్ బయోలాజికల్ ఏజ్ రివర్స్లో భాగంగా తనే ఏజ్ని తగ్గించడం కోసం ఎంతలా డబ్బును వెచ్చించాడో తెలిసిందే. ఇప్పుడూ ఏకంగా తన రక్తంతో వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి ఏజ్ని తగ్గించే ప్రక్రియకు పూనుకున్నాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇంతకీ ఏంటా కథకమామీషు అంటే.. 45 ఏళ్ల సాఫ్ట్వేర్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఏజ్ తగ్గించుకునే ప్రయోగాలు తనకే పరిమితం చేయలేదు కాబోలు. అందుకోసం 71 ఏళ్ల తండ్రిని కూడా వదిలిపెట్టలేదు . జాన్సన్ తన తండ్రి కోసం సుమారు 1 లీటర్ ప్లాస్మా దానం చేసినట్లు తెలిపాడు. అతనికి తన శరీరంలో ఉన్న ప్లాస్మాను తీసివేసి కొడుకు రక్తంలోని ప్లాస్మాను ఎక్కించారు. దీంతో అతడి వృద్ధాప్య వయసు 25 ఏళ్లకు తగ్గింది. ఎంత పెద్దవారైతే అంత తొందరగా వృద్ధాప్యం వస్తుంది. అయితే ఎప్పుడైతే అతనికి కొడుకు జాన్సన్ ప్లాస్మా ఎక్కించారో అప్పుడే అతను 46 ఏళ్ల టైంలో వచ్చే వృద్ధాప్య వేగం వచ్చింది. ఈ చికిత్స జరిగిన నెలలు తర్వాత కూడా అతడిలో అదే తరహా వృద్ధాప్య లక్షణాలు కనిపించాయని జాన్సన్ ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. తాను ఇప్పుడు మా నాన్న "బ్లడ్ బాయ్"ని అంటూ అసలు విషయం అంతా రాసుకొచ్చాడు. ఈ ప్రక్రియలో తన తండ్రి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నాడు. అలాగే తన నుంచి పొందిన లీటరు రక్తం కంటే ఎక్కువగానే తన తండ్రిలోని సొంత ప్లాస్మాను తీసేసి ఉండొచ్చు అందువల్లే తన తండ్రిలో ఇంతలా మార్పులు వచ్చాయని అంటున్నాడు. కాగా, జాన్సన్ గత ఫిబ్రవరి ప్రాజెక్ట్ బ్లూప్రింట్లో భాగంగా తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు రోజు వందకు పైగా మందులు వేసుకుంటున్నాని, దాదాపు 30 మంది వైద్యులచే నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా అందుకోసం ఏడాదికి రూ. 16 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ రివర్స్ ఏజింగ్ ప్రయోగం సఫలం అవుతుందో లేదో తెలియదు గానీ అందుకోసం వారు తీసుకుంటున్న చికిత్సలు, పడుతున్న అవస్థలు వింటుంటే వామ్మో!.. అనిపిస్తుంది కదూ. My super blood reduced my Dad’s age by 25 years My father's (70 yo) speed of aging slowed by the equivalent of 25 years after receiving 1 liter of my plasma, and has remained at that level even six months after the therapy. What does that mean? The older we get, the faster we… pic.twitter.com/s4mBMDSP8Z — Zero (@bryan_johnson) November 14, 2023 (చదవండి: వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
ఇప్పుడు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందంటావా..!
ఇప్పుడు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందంటావా..! -
2040కల్లా కర్బనరహితం
న్యూఢిల్లీ: పూర్తికర్బనరహిత కంపెనీగా ఆవిర్భవించేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు చమురు రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ ఇండియా తాజాగా పేర్కొంది. 2040కల్లా కర్బన ఉద్గారాల నెట్జీరో కంపెనీగా నిలిచేందుకు రూ. 25,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా గ్యాస్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక విద్యుదుత్పాదనకు తెరతీడం, గ్రీన్ హైడ్రోజన్, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ రంజిత్ రథ్ వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సామ్కు సహజవాయు సరఫరాకుగాను 80 కిలోమీటర్ల పైప్లైన్ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. తద్వారా లిక్విడ్ ఇంధనాల రవాణా కాలుష్యానికి చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ముడిచమురు రవాణాకు ఏర్పాటు చేసిన కొన్ని పైప్లైన్లను గ్యాస్ పంపిణీకి అనువుగా మార్పు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడులు ఇలా నెట్జీరో పెట్టుబడుల్లో రూ. 9,000 కోట్లను 1,800 మెగావాట్ల సోలార్, ఆన్షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించనుండగా.. మరో రూ. 3,000 కోట్లు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుపై వెచి్చంచనున్నట్లు రంజిత్ తెలియజేశారు. ఈ బాటలో రూ. 1,000 కోట్లు కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్, స్టోరేజీ(సీసీయూఎస్) ప్రాజెక్టులకు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కంపెనీ అస్సామ్లో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్లో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ప్రణాళికలు వేసింది. వెరసి నెట్జీరో లక్ష్యాన్ని ముందుగానే అంటే 2038కల్లా సాధించాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. -
షినవత్రకు థాయ్లాండ్ రాజు క్షమాభిక్ష
బ్యాంకాక్: థాయ్లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్ర(74)కు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అవినీతి ఆరోపణలపై ఆయనకు కోర్టు విధించిన ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఒక్క ఏడాదికి తగ్గించారు. ఇందుకు సంబంధించి రాజు మహా వజ్రాలొంగ్కర్న్ నిర్ణయాన్ని రాయల్ గజెట్ శుక్రవారం ప్రచురించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అంతిమ అధికారం రాజుదే. 2001, 2005ల్లో జరిగిన ఎన్నికల్లో షినవత్ర ప్రధాని అయ్యారు. 2006లో జరిగిన సైనిక కుట్రలో ప్రధాని పదవి నుంచి షినవత్రను గద్దె దించారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2008లో ఆయన దేశం విడిచి వెళ్లిపోయి, అజ్ఞాతంలో గడిపారు. వారం క్రితం దేశంలోకి ప్రవేశించిన వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున క్షమాభిక్ష కోరుతూ రాజుకు విజ్ఞాపన పంపారు. షినవత్ర రాకతో దేశంలో మూడు నెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత సమసిపోయే పరిణామాలు సంభవించాయి. షినవత్ర స్థాపించిన ఫ్యూథాయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంట్లో మద్దతు పెరగడం విశేషం. -
దేశ ప్రజలకు శుభవార్త.. రూ. 200 తగ్గిన గ్యాస్ ధరలు
రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి 'అనురాగ్ ఠాకూర్' గ్యాస్ ధర తగ్గింపుపై మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎల్పిజి సిలిండర్ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్పై రూ. 200 తగ్గనుంది. అంతే కాకుండా పీఎంయూవై వినియోగదారులకు ఈ తగ్గింపు వర్తించనుంది. ఫలితంగా పీఎంయూవై వినియోగదారులు ప్రస్తుతం ఉన్న సబ్బిడీతో కొత్త తగ్గింపు పొందుతారు. కావున వీరికి రూ. 400 తగ్గింపు లభిస్తుంది’ అని తెలిపారు. ఎల్పిజి సిలిండర్లపై అదనపు సబ్సిడీ 33 కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనకారిగా ఉంటుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2023-24 సంవత్సరానికి ఎల్పిజి సిలిండర్పై రూ. 200 తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 7,680 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అంతే కాకుండా ఉజ్వల పథకం కింద 7.5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిలో పావర్టీ లైన్) కుటుంబాల మహిళల కోసం 50 మిలియన్ల ఎల్పీజీ కనెక్షన్లను పంపిణీ చేయడానికి ప్రారంభించారు. #WATCH | "PM Modi has decided Rs 200 reduction in the price of domestic LPG cylinders, for all users...this is a gift from PM Narendra Modi, to the women of the country, during the occasion of Raksha Bandhan", says Union Minister Anurag Thakur pic.twitter.com/QTy6YB0x4u— ANI (@ANI) August 29, 2023 -
టాక్స్ రిఫండ్స్: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
Income tax refund: ఆదాయపు పన్ను రిటర్న్లు (ITRలు) దాఖలు చేసిన తర్వాత టాక్స్ రిఫండ్స్ విషయంలో ఆదాయపన్ను కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన యావరేజ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నుంచి 10 రోజులకు తగ్గింపుపై పన్ను శాఖ ఆలోచిస్తోంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త టైమ్లైన్ను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువుజూలై 31, 2023తో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం చాలామంది ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు టాక్స్ రిఫండ్స్ దాదాపు అందుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం టాక్స్ రిఫండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.వార్షిక ITRను ఫైల్ చేసేటప్పుడు అసెస్సీ ఉపయోగించే ఎంపికపై ఆధారపడి, రీఫండ్ ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఖాతాకు నేరుగా క్రెడిట్ లేదా రీఫండ్ చెక్ ద్వారా గానీ చెల్లిస్తారు. ఈ రీఫండ్ ప్రాసెస్ను సంబంధిత పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి? ప్రతిస్పందన కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నుండి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చిందా లేదా అని ఈమెయిల్లో చెక్ చేసుకోవాలి ఒక వేళా అలాంటి ఇమెయిల్ ఎదైనా వస్తే వీలైనంత త్వరగా ప్రతిస్పందించడం చాలా ముఖ్యం. ఒకవేళ ITR స్టేటస్ రీఫండ్ గడువు ముగిసినట్లు చూపితే, 90 రోజుల చెల్లుబాటు వ్యవధిలోపు చెల్లింపు కోసం వాపసు సమర్పించబడలేదని అర్థం.ఈ సందర్బంగా టాక్స్పేయర్ రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్ పంపవచ్చు. రీఫండ్ స్టేటస్పై చాలా క్వెరీలువస్తున్నాయని, ఇ-ఫైలింగ్ తర్వాత తిరిగి చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారులకు చెల్లింపును వేగవంతం లోకి ఇది మంచి చర్య అని క్లియర్ ఫౌండర్సీఈవో అర్చిత్ గుప్తా అన్నారు. ఈఏడాది పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు సకాలంలో దాఖలు చేశారని (31 జూలై 2023 వరకు 6.77 కోట్ల ఐటీఆర్లు) అందువల్ల వాపసులను త్వరగా ప్రాసెస్ చేస్తారనే అంచనా ఉందన్నారు. -
షావోమి కూడా రంగంలోకి: ఆందోళనలో ఉద్యోగులు
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి కూడా ఉద్యోగాల తీసివేత దిశలో మరింతగా అడుగులు వేస్తోంది. ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వ ఏజెన్సీల నుంచి పెరిగిన ఒత్తిడి, మార్కెట్ వాటా క్షీణత తదితర కారణాల నేపథ్యంలో ఉద్యోగులను, తద్వారా తగ్గించుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే షావోమి ఇండియా మరికొంత మందికి ఉద్వాసన పలకనుంది. తద్వారా మొత్తం సిబ్బంది సంఖ్యను దాదాపు వెయ్యికి తగ్గించుకోవాలని చూస్తోందట. దీంతో ఎపుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని ఆందోళనలో ఉద్యోగులున్నారు. అయితే ఎంతమందిని, ఏయే విభాగాల్లో తొలగింనుందని అనేది స్పష్టత లేదు. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు) ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం షావోమి ఇండియా 2023 ప్రారంభంలో సుమారు 1400-1,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ ఇటీవల దాదాపు 30 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే నెలల్లో మరింత మందిని తొలగించాలని భావిస్తోంది. సంస్థాగత నిర్మాణాన్ని క్రమబద్ధీకరణ, వనరుల కేటాయింపును ఆప్టిమైజ్ చేసే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) ఇదీ చదవండి: తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్గా కోట్లు, ఎలా? -
ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం..
తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త తెలిపింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయమున్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలు ఈ మేరకు తగ్గనున్నాయి. ఎక్స్ ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్ల లోపు రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా ఛార్జీని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ.30 వసూలు చేయనుంది. "టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్కు మంచి స్పందన ఉంది. ప్రతి రోజు సగటున 15 వేల వరకు తమ టికెట్లను ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తగ్గించడం జరిగింది. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలి." అని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఇదీ చదవండి: ఉన్నత విద్యామండలి చైర్మన్గా లింబాద్రి నియామకం -
ఆర్బీఐ రుణరేటు తగ్గే అవకాశం! అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ దిగ్గజం అంచనా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) చివరి త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) కీలక రుణ రేటు– రెపోను (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 6.5 శాతం) తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ దిగ్గజం– ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘‘రుణ రేటు తగ్గింపునకు తగిన వాతావరణం కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని ఆర్థిక వ్యవస్థలో సరళతర పరిస్థితిని తీసుకురావడానికి ఆర్బీఐ ఉపయోగించుకునే వీలుంది’’ అని విశ్లేషించింది. 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న– రెండంకెల పైనే కొనసాగింది. ఈ నేపథ్యంలో గత ఏడాది మే వరకూ 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 2.5 శాతం పెంచింది. అంటే ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. అయితే ఇటీవల కాలంలో తిరిగి రిటైల్ ద్రవ్యోల్బణం తగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆర్బీఐ అనూహ్య నిర్ణయంపై ఆసక్తి... ఈ నేపథ్యంలో గత నెల మొదటి వారంలో జరిగిన 2023–24 తొలి ద్వైమాసిక సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అందరి అంచనాలకు భిన్నంగా యథాతథ రెపో రేటును కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంపై విశ్లేషకులు ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 11 నెలల వరుస రేటు పెంపు అనంతరం ఆర్బీఐ ఎంపీసీ తీసుకున్న నిర్ణయం విశ్లేషకుల అంచనాలకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. నిజానికి ఈ దఫా రేటు పావుశాతం వరకూ ఉంటుందని మార్కెట్, ఆర్థిక విశ్లేషకులు అంచనావేశారు. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరిలో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. ఆర్బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24లో 5.3 శాతం ఉంటుందని ఫిబ్రవరిలో అంచనా వేస్తే, ఏప్రిల్ మొదటి వారం సమీక్షలో ఈ అంచనాలను 5.2 శాతానికి తగ్గించడం వృద్ధికి దారితీసే మరో హర్షణీయ పరిణామం. అయితే ద్రవ్యోల్బణంపై పోరు ముగిసిపోలేదని ఆర్బీఐ స్పష్టం చేయడం మరో విశేషం. ‘‘ఇది కేవలం విరామం మాత్రమే.ఈ నిర్ణయం –కేవలం ఈ సమావేశానికి మాత్రమే– అవసరమైతే మళ్లీ రేటు పెంపు ఉంటుంది. అంతర్జాతీయ అంశాలను, ద్రవ్యోల్బణం కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్నాం. వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యతపై ప్రస్తుతానికి దృష్టి సారించడం జరుగుతోంది. ఆర్బీఐ అంచనాలకు ఊతం ఇస్తూ, 18 నెలల పాటు రెండంకెల్లో పయనించిన టోకు ద్రవ్యోల్బణం ప్రస్తుతం పూర్తిగా అదుపులోనికి వచ్చింది. ఏప్రిల్లో 33 నెలల కనిష్ట స్థాయిలో –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక నవంబర్, డిసెంబర్ మినహా 2022 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కట్టడి పైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చింది. ముడి పదార్థాల తగ్గుదలను ఇది సూచిస్తోంది. ఖరీఫ్ దిగుబడుల భారీ అంచనాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ రేటు తగ్గింపునకు దారితీసే అంశాలని నిపుణులు భావిస్తున్నారు. హెచ్ఎస్బీసీ, నోమురా... ఇదే వైఖరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంపు చర్య ఈ సంవత్సరం విరామంతో కొనసాగుతుందని మరికొందరు నిపుణులూ భావిస్తున్నారు. 2024 ప్రారంభంలో రేట్లు తగ్గించే అవకాశం ఉందని వారు అంచనావేస్తున్నారు. ‘‘ఆర్బీఐ 2023 మిగిలిన సంవత్సరంలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని అలాగే మార్చి 2024తో ముగిసే త్రైమాసికంలో పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గింస్తుందని మేము భావిస్తున్నా ము‘ అని విదేశీ బ్రోకరేజ్ హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్తలు ఒక నోట్లో తెలిపారు. 4 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సమీప భవిష్యత్తులో కనుచూపు మేరలో లేదని వారు పేర్కొంటూ, ద్రవ్యోల్బణం 4 శాతానికి తీసుకురావాలన్న ధ్యేయంతో వృద్ధి రేటును త్యాగం చేయాలని ఆర్బీఐ భావించబోదన్నది తమ అభిప్రాయమని కూడా వారు విశ్లే షించారు. జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా కూ డా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అక్టోబర్ నుంచి 0.75 శాతం మేర రేటు తగ్గింపు అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్ ప్రైవేటీకరణ ఆగదు.. ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
Funday Cover Story: ఆర్.. ఆర్.. ఆర్
చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు కానీ ఇది కలియుగం! భూమికి మనమందరం కలిసి చేస్తున్న ద్రోహం ఎంత చెప్పుకున్నా తీరేది కానేకాదు. గాలి, నీరు.. భూమి.. ఖనిజాలు.. ఇలా భూమ్మీది వనరులన్నింటినీ... విచ్చలవిడిగా వాడేసిన ఫలితంగా ముంచుకొస్తున్న.... భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవాలంటే... ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాల్సిందే! మానవాళి మొత్తం... మన మనుగడ కోసమే చేస్తున్న ఈ యుద్ధంలో.. అందరి తారక మంత్రం ఒకటే కావాలి. అదేమిటంటారా.... వాతావరణ మార్పుల గురించి కానీ... పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతల గురించి కానీ ఈ రోజు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీలేదు. కనీసం రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి నియమించిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ తరచూ అధ్యయన పూర్వకంగా విడుదల చేసిన నివేదికల్లో హెచ్చరిస్తూనే ఉంది. భూమి సగటు ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దం అంతానికి 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే పెనుముప్పు తప్పదని, సముద్ర తీర నగరాలన్నీ మునిగిపోవడం మొదలుకొని అకాల, తీవ్ర ప్రకృతి వైపరీత్యాలతో భూమిపై మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఇప్పటివరకూ వెలువడిన ఆరు ఐపీసీసీ నివేదికలు స్పష్టం చేశాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విపత్తు ముంచుకొస్తోందని తెలిసినా.. జంతుజాతి వినాశనం అంచున కొట్టుమిట్టాడుతోందన్నా ప్రపంచదేశాలు ఇప్పటికీ వీటిని ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడం!! బాధ్యులెవరు? ఖర్చులు ఎవరు భరించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు నెపం ఇంకొకరిపైకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇది మరెంతో కాలం కొనసాగే సూచనలు లేవు. నిరుడు యూరప్ మొత్తం కరవు చుట్టుముట్టింది. అలాగే ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలు పాకిస్థాన్ను పలకరించాయి. ఈ ఏడాది మొదట్లోనూ వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా మంచులో కూరుకుపోయింది. ఈ వైపరీత్యాలన్నీ వాతావరణ మార్పుల ప్రభావమేనని స్పష్టమైతేనైనా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రపంచదేశాలు ముందుకు కదులుతాయి. ఈ అంశం అలా పక్కనుంచితే... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చిరకాలంగా సూచిస్తున్న తారక మంత్రం రెడ్యూస్.. రీసైకిల్.. రీ యూజ్! క్లుప్తంగా ఆర్ఆర్ఆర్ అని పిలుచుకుందాం. వ్యక్తుల స్థాయిలో... ప్రభుత్వాలూ చేపట్టగల ఈ మూడు పద్ధతులను అమలు చేయగలిగితే.. ఒకవైపు వనరుల సమర్థ వినియోగం సాధ్యమవడమే కాకుండా... భూమి పది కాలాల పాటు పచ్చగా ఉండేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది. ఎలా మొదలైంది? ఆర్ ఆర్ ఆర్ గురించి దశాబ్దాలుగా మనం వింటున్నాం. కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తమదైన ప్రయత్నాలు చేస్తున్నాయి. చెత్తను తగ్గించుకునేందుకు, వనరులను ఆదా చేసుకునేందుకు, ఒక వస్తువు లేదా పదార్థాన్ని ఇంకో రూపంలోకి మార్చి మళ్లీ మళ్లీ వాడేందుకు తమదైన రీతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, పరికరాల రూపకల్పన సరేసరే. అంతా బాగుంది కానీ.. ప్రపంచమంతా ఒక ఉద్యమంలా సాగుతున్న ఈ ఆర్ ఆర్ ఆర్ ఎలా మొదలైంది? ఊహూ.. స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే ఏటా ఏప్రిల్ 22న నిర్వహించే ఎర్త్ డేకు ఈ ఆర్ ఆర్ ఆర్కూ కొంత సంబంధం ఉందని చాలామంది అంగీకరిస్తారు. 1970లో అమెరికాలోని విస్కాన్సిన్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఈ ఎర్త్ డేను ప్రారంభించినప్పుడు ఆ దేశంలో సుమారు రెండు కోట్ల మంది వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు. జాతరలు, ప్రదర్శనలు, ఊరేగింపుల్లాంటివి నిర్వహించారు. తద్వారా పర్యావరణ పరంగా భూమికి జరుగుతున్న నష్టాన్ని, ప్రమాద నివారణకు వ్యక్తిగత స్థాయిలో చేయగల పనులను ఈ సందర్భంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయానికి అమెరికా మొత్తమ్మీద వాడి పారేసే వస్తువులతో పెద్ద సమస్యగా ఉండేదట. 1950లలో ఆర్థికంగా బాగా వృద్ధి చెందడంతో మొదలైన ఈ సమస్య 1970ల నాటికి పతాక స్థాయికి చేరుకుందన్నమాట. కుప్పల్లోనూ చెత్త పేరుకుపోయి ఉండేది. ఎర్త్ డే సందర్భంగా చెత్త సమస్యపై ప్రజల దృష్టి పడటంతో ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ను సిద్ధం చేసింది. ఈ చట్టం కారణంగా వస్తువులను రీసైకిల్ చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పే రిసోర్స్ రికవరీ యాక్ట్ కూడా సిద్ధమైంది. ఈ సందర్భంలోనే అమెరికాలో ఈ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే పదం ప్రజల నోళ్లల్లో నానడం మొదలైంది. క్రమేపీ ఒక ఉద్యమంలా మారిందని అంటారు. ఆర్ ఆర్ ఆర్...ఇంతకీ వీటి పరమార్థం? ఆర్ ఆర్ ఆర్ పరమార్థం ఒక్క ముక్కలో చెప్పాలంటే దేన్నైనా అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకోమ్మని. పిసినారిగా ఉండమని చెప్పినా తప్పేమీ కాదు. దీనివల్ల ఆర్థికంగా మనకు కొంచెం లాభం చేకూరడమే కాకుండా... భూమి మొత్తాన్ని కాపాడేందుకు మన వంతు సాయం చేసినట్టూ ఉంటుంది. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. భూమ్మీద ఉన్న వారందరూ చేయిచేయి కలిపినా రాగల ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేము. తీవ్రత కొంచెం తగ్గవచ్చు అంతే. ప్రజలతోపాటు ప్రభుత్వాలు తగు విధానాలు సిద్ధం చేసి, తగినన్ని నిధులు, టెక్నాలజీలను సమకూర్చి కార్యాచరణకు దిగితేనే ప్రయోజనం. ఈ దిశగా ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్లలో మొదటిదైన రెడ్యూస్ విషయాన్ని పరిశీలిద్దాం. చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా చెత్త తగ్గాలంటే మనం వాడే వనరులను కూడా మితంగా అవసరమైనంత మేరకే వాడుకోవాలి. అది కరెంటు కావచ్చు.. నీళ్లు కావచ్చు. ఇంకేదైనా వనరు, పదార్థం కావచ్చు. మితంలోనే పరమార్థమన్నమాట. వ్యక్తులుగా దీన్ని సాధించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. మీలో కొందరు ఇప్పటికే వీటిని పాటిస్తూండవచ్చు కూడా. అవేమిటంటే... ఇంటికి కావాల్సిన వస్తువులను చిన్న చిన్న మొత్తాల్లో కాకుండా... నెలకు లేదా కొన్ని నెలలకు సరిపడా ఒకేసారి కొనేయడం. దీనివల్ల ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్ గణనీయంగా తగ్గుతుంది. ఎక్కువ మోతాదుల్లో కొంటే ఖర్చులూ కలిసివస్తాయి. మళ్లీమళ్లీ వాడుకోగల సంచులను దగ్గరుంచుకుంటే మరికొంత ప్లాస్టిక్ను చెత్తకుప్పలోకి చేరకుండా నిలువరించవచ్చు. వాడి పారేసే వస్తువుల కంటే మళ్లీమళ్లీ వాడుకోగలవాటికే ప్రాధాన్యమివ్వండి. ఇంట్లో అవసరమైనప్పుడు.. అవసరమైన చోట మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వాడటం ద్వారా విద్యుత్తును తక్కువగా వాడవచ్చు. కుళాయిల్లో, బాత్రూమ్ సింక్లలో లీకేజీలు లేకుంటే బోలెడంత నీళ్లు మిగుల్చుకోవచ్చు. వారంలో ఒక్క రోజు మాంసాహారం మానేసినా పాడి పశువుల పెంపకానికయ్యే వనరులు తగ్గి భూమికి మేలు జరుగుతుందంటారు నిపుణులు. విమాన ప్రయాణాలను తగ్గించుకోవడం, వీలైనప్పుడల్లా కాళ్లకు పనిచెప్పడం లేదా సైకిళ్లను ఉపయోగించడమూ రెడ్యూస్ కిందకే వస్తుంది. కర్బన ఉద్గారాలు మరింత ఎక్కువ కాకుండా ముందుగానే అడ్డుకోవడం అన్నమాట. ► 98 %: వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో (క్యారీబ్యాగుల్లాంటివి) చమురులాంటి శిలాజ ఇంధనాలతో తయారయ్యేవి. ► 7.5 – 19.9 కోట్ల టన్నులు: సముద్రాల్లోకి చేరి కాలుష్యం సృష్టిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల పరిమాణం. ► 450 ఏళ్లు: ప్లాస్టిక్ బాటిళ్లు నశించేందుకు పట్టే సమయం. ► 2800 కోట్లు: ఏటా చెత్తకుప్పల్లోకి చేరుతున్న గాజు బాటిళ్ల సంఖ్య. వీటిల్లో మూడొంతులు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. ► 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల టన్నుల కాగితాన్ని రీసైకిల్ చేశారు. చెత్తకుప్పల్లోకి చేరిన కాగితాల్లో ఇది 68 శాతం మాత్రమే. ఈ ఏడాది తయారైన కార్డ్బోర్డులో 91.4 శాతం రీసైకిల్ చేసిన కాగితం. ఒకే ఒక్క శాతం చెత్తకుప్పల్లోకి చేరే చెత్తలో అల్యూమినియం మోతాదు ఇది. అలసిపోయేంతవరకూ రీసైకిల్ చేసుకోగలగడం ఈ లోహపు ప్రత్యేకత కూడా. కానీ.. ఏటా దాదాపు 70 లక్షల టన్నుల అల్యూమినియం రీసైకిల్ కావడం లేదు. వాడి వాడి.. మళ్లీ వాడి... పర్యావరణ పరిరక్షణ తారక మంత్రం ఆర్ ఆర్ ఆర్లో రెండోది రీ యూజ్. పేరులో ఉన్న మాదిరిగానే వస్తువులను వీలైనంత ఎక్కువగా వాడటమే ఇది. నిజానికి ఈ విషయం భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. చిరిగిన చీరలిక్కడే బొంతలవుతాయి.. అలాగే వాడేసిన తువ్వాలు తుండుగుడ్డ అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బాలు... పచారీ సామాను నిల్వకు వాడేదీ ఇక్కడే మరి!! మోజు తీరిన దుస్తులు అనా«థ శరణాలయాలకు చేరడమూ మనం చూస్తూంటాం. రీ యూజ్ వల్ల కలిగే అతిపెద్ద లాభం వాడదగ్గ వస్తువులు చెత్తగా కుప్పల్లోకి చేరకుండా నిలువరించడం. ఉన్నవాటినే ఎక్కువ కాలం వాడటం వల్ల కొత్తవి కొనే అవసరం తప్పుతుంది. తద్వారా డబ్బు ఆదాతోపాటు భూమికీ మేలు జరుగుతుంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ వస్తువులు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటున్నాయి. అవసరానికి తగ్గట్టు కొత్త ఉత్పత్తులను కాకుండా.. సెకెండ్ హ్యాండ్వి కొనగలిగితే వనరులను మిగుల్చుకోగలం. ప్రపంచమంతా.... ఆర్ ఆర్ ఆర్లలో ఇది చాలా పాపులర్. తరచూ అందరికీ వినిపించే రీసైక్లింగ్. వాడేసిన వస్తువుల రూపం, తీరుతెన్నులు మార్చి ఇంకో అవసరానికి వాడుకోవడాన్ని రీసైక్లింగ్ అనవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యర్థానికి కొత్త అర్థం చెప్పడమన్నమాట. ఈ రీసైక్లింగ్ జాబితాలోకి రాని వస్తువు అంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేనైన్నా రీసైకిల్ చేసి వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. ప్లాస్టిక్ లాంటి పదార్థాలను రీసైకిల్ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలు నశించిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్ విభాగంలోకి ఇటీవలే వచ్చి చేరిన కొత్త రకం వ్యర్థం ఈ–వేస్ట్. యూఎస్బీ డ్రైవ్లు మొదలుకొని, ఎయిర్పాడ్స్, స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తమ జీవితకాలం తరువాత వృథా అయిపోతూండటం వల్ల ప్లాటినమ్ వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇక సేంద్రీయ వ్యర్థాల విషయానికి వస్తే... పొలాల్లోని వ్యవసాయ వ్యర్థాలు మొదలుకొని ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం వరకూ చాలావాటిని కుళ్లబెట్టి సహజసిద్ధమైన ఎరువులు లేదా వంటగ్యాస్లను తయారు చేసుకోవచ్చు. గ్యారీ ఆండర్సన్ సృష్టి.. ఈ లోగో! ఆర్ ఆర్ ఆర్లు మూడు వేర్వేరు అంశాలు కావచ్చు కానీ.. వీటిని సూచించేందుకు వాడే గుర్తు లేదా సింబల్ మాత్రం ఒక్కటే. మూడు ఆరో గుర్తులతో ఒక వృత్తంలా ఉండే ఈ గుర్తును దాదాపు ప్రతి ప్యాకేజ్పైనా చూడవచ్చు. ఆసక్తికరమైన అంశం ఈ లోగోను రూపొందించింది ఎవరన్న విషయం. ఒక ప్రైవేట్ సంస్థ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా పెట్టిన డిజైన్ పోటీల్లో పాల్గొన్న యూఎస్సీ గ్రాడ్యుయేట్ విద్యార్థి గ్యారీ అండర్సన్ దీన్ని డిజైన్ చేశారు. అప్పట్లో సీసీఏ రీసైక్లింగ్ పనిలోనూ ఉండటం వల్ల దాన్ని సూచించేందుకు లోగోను రూపొందించాలని పోటీ పెట్టారు. పోటీలో నెగ్గిన తరువాత ఆ లోగోతోపాటు గ్యారీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఎందరో మహానుభావులు... ఎనెన్నో ప్రయత్నాలు! భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థల స్థాయిల్లో పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషతుల్యమైన కాలుష్యాలను వాతావరణం నుంచి తొలగించేందుకు, వాడకాన్ని తగ్గించేందుకు కొత్త టెక్నాలజీలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్నింటి గురించి స్థూలంగా చూస్తే... ఓషన్ క్లీనప్ ప్రాజెక్టు... చెత్తకుప్పల్లోంచి నదుల్లోకి.. అటు నుంచి సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి కొత్త రూపంలో ఆ వ్యర్థాలను వాడుకునేందుకు బోయన్ స్లాట్ అనే యువ ఔత్సాహిక శాస్త్రవేత్త చేపట్టిన ప్రాజెక్టు ఇది. సముద్రాల్లోని ప్లాస్టిక్లో అధికభాగం జల ప్రవాహాల ఫలితంగా పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున పోగుపడ్డాయి. ‘ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్’ అని పిలిచే ఈ చెత్తకుప్ప సైజు ఎంత ఉందో తెలుసా? ఫ్రాన్స్ దేశ వైశాల్యానికి మూడు రెట్లు... లేదా టెక్సస్ వైశాల్యానికి రెండు రెట్లు ఎక్కువ. అంకెల్లో చెప్పాలంటే కొంచెం అటు ఇటుగా 16 లక్షల చదరపు కిలోమీటర్లు! 2017 నాటి లెక్కల ప్రకారమే ఇక్కడ పోగుపడ్డ ప్లాస్టిక్ బరువు సుమారు 29.7 కోట్ల టన్నులని అంచనా. ఈ నేపథ్యంలో సముద్ర జీవులకు పెను ప్రమాదంగా పరిణమించిన ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ను తొలగించేందుకు 2013లో బోయన్ స్లాట్ అనే నెదర్లాండ్ కుర్రాడు ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టాడు. సముద్రపు అలల సాయంతోనే చెత్తను పోగుచేసి బయటకు తరలించేందుకు అవసరమైన టెక్నాలజీలను సిద్ధం చేశాడు. బోయన్స్లాట్ స్థాపించిన ఓషన్ క్లీనప్ సంస్థ ఐదేళ్ల కాలంలో ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్లో సగాన్నైనా ఖాళీ చేయాలని సంకల్పిస్తోంది. గత 30 రోజుల్లో ఓషన్ క్లీనప్ సంస్థ ఎనిమిది ఇంటర్సెప్టర్ల సాయంతో 1,11,804 కిలోల ప్లాస్టిక్ చెత్తను తొలగించింది. ఇప్పటివరకూ తొలగించిన చెత్త 20,68,237 కిలోలు. సముద్రాల్లో మాత్రమే కాకుండా... నదుల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ను కూడా అక్కడికక్కడే ఒడిసిపట్టేందుకు బోయన్ స్లాట్ ప్రయత్నిస్తున్నాడు. డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్... భూతాపోన్నతికి ప్రధాన కారణం? గాల్లో కార్బన్డైయాక్సైడ్ వంటి విష వాయువుల మోతాదు ఎక్కువ కావడం. అందుకేనేమో కొందరు ఈ సమస్యను నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే... గాల్లోని కార్బన్ డైయాక్సైడ్ను నేరుగా తొలగించేందుకు డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్ పేరుతో పలు ప్రాజెక్టులు చేపట్టారు. పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి గాలిని పోగు చేయడం.. అందులోని కార్బన్ డైయాక్సైడ్ను రసాయనాల సాయంతో తొలగించి వేరు చేయడం స్వచ్ఛమైన గాలిని మళ్లీ వాతావరణంలోకి వదిలేయడం ఈ ప్రాజెక్టుల పరమోద్దేశం. వేరు చేసిన కార్బన్ డైయాక్సైడ్ను భూమి అట్టడుగు పొరల్లో భద్రపరచడం లేదా కొన్ని ఇతర టెక్నాలజీ సాయంతో విలువైన ఇంధనం, ఇతర పదార్థాలుగా మార్చి వాడుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. చిన్నా చితక కంపెనీలను వదిలేస్తే డైరెక్ట్ క్యాప్చర్ టెక్నాలజీలో చెప్పుకోవాల్సిన కంపెనీలు క్లైమ్వర్క్స్ ఒకటి. దీంతోపాటు కార్బన్ ఇంజినీరింగ్, గ్లోబల్ థెర్మోస్టాట్లు అనే రెండు కంపెనీలు కలిపి మొత్తం 18 చోట్ల ఫ్యాక్టరీలను స్థాపించి గాల్లోని కార్బన్ డైయాక్సైడ్ను వేరు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో ఏడాది ఒక టన్ను నుంచి నాలుగు వేల టన్నుల సామర్థ్యమున్నవి ఉన్నాయి. అత్యధిక సామర్థ్యమున్న కంపెనీ ఏడాదికి ఎనిమిది వేల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ను వాతావరణం నుంచి తొలగిస్తోంది. అమెరికాలో ఇప్పుడు ఏడాదికి పది లక్షల టన్నుల సామర్థ్యమున్న ఫ్యాక్టరీ ఒకటి వచ్చే ఏడాదికల్లా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా... మరికొన్ని సంస్థలు కూడా గాల్లోని కార్బన్ డైయారక్సైడ్ను సమర్థంగా పునర్వినియోగించుకునేందుకు కొన్ని టెక్నాలజీలను సిద్ధం చేశాయి. వీటిల్లో రెండు మన దేశంలోనే ఉండటం విశేషం. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న చక్ర ఇన్నొవేషన్స్ సంస్థ డీజిల్ జనరేటర్లు, బస్సుల పొగ గొట్టాల నుంచి వెలువడే కాలుష్యం నుంచి కర్బనాన్ని వేరు చేసి ప్రింటింగ్ ఇంక్గా మారుస్తూంటే... పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఇంకో కంపెనీ కార్బన్ క్రాఫ్టస్ డిజైన్ వాటితో భవన నిర్మాణాల్లో వాడే టైల్స్గా మారుస్తోంది. రీసైకిల్కు బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. కానీ.. రీయూజ్, రెడ్యూస్లకు సంబంధించినవి తక్కువే. అలాగని ప్రయత్నాలు జరగడం లేదని కాదు. ముంబైలో ఓ యువకుడు చెత్తకుప్పల్లోకి చేరిన తెల్లటి క్యారీబ్యాగులను సేకరించి వాటితో సరికొత్త కాలిజోళ్లు సిద్ధం చేస్తూండటం రీయూజ్కు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే.. టెట్రాప్యాకులను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో కుర్చీలు, బల్లలు తయారు చేసి ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తోంది ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ. ఇలా ప్రతి దేశంలో, ప్రతి సమాజంలోనూ వ్యక్తులు, సంస్థలు కూడా ఉడతాభక్తి చందంగా ఈ భూమిని రక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి!! -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
National Cinema Day: మల్టీఫ్లెక్సుల్లో రూ.75కే టికెట్!
ముంబై: ఓటీటీల కాలంలో.. కరోనా తర్వాత సాధారణ థియేటర్లతో పోలిస్తే మల్టీఫ్లెక్స్లకే ప్రేక్షకుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా మల్టీ ఫ్లెక్స్ అసోసియేషన్ ఆసక్తికర నిర్ణయం ఒకటి తీసుకుంది. వంద రూపాయలలోపు టికెట్ రేటుతో ప్రేక్షకుడికి సినిమా అనుభూతిని అందించాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడో విషయం ఉందండోయ్. సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డే. ఈ సందర్భంగా.. ప్రేక్షకులకి ఈ బంపరాఫర్ ప్రకటించింది మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI). కరోనా లాక్డౌన్ తర్వాత ఆదరిస్తున్న ప్రేక్షకుల గౌరవార్థం ఆ ఒక్కరోజు ఈ పని చేస్తున్నట్లు ప్రకటించింది ఎంఏఐ. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, కార్నివాల్, మిరాజ్, ఏషియన్.. ఇలా పలు మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీల్లో ఆరోజున కేవలం రూ.75కే సినిమా చూడొచ్చు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 4000 స్క్రీన్స్లో సినిమా చూడొచ్చని మల్టీఫ్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ డిస్కౌంట్ ద్వారా అయిన ఆడియొన్స్ను ఆ ఒక్కరోజు రప్పించ వచ్చనే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పటికే బాయ్కాట్ట్రెండ్ మోజులో ఉన్న ఆడియెన్స్.. ఈ బంపరాఫర్ను స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. మల్టీఫ్లెక్స్ ఫ్రాంచైజీలు మాత్రం ఫ్యామిలీ ఆడియొన్స్ రావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. Cinemas come together to celebrate ‘National Cinema Day’ on 16th Sep, to offer movies for just Rs.75. #NationalCinemaDay2022 #16thSep — Multiplex Association Of India (@MAofIndia) September 2, 2022 ఇదీ చదవండి: బీజేపీలో ఉంటూనే ‘ఆప్’ కోసం పని చేయండి -
Queen Elizabeth II: మహారాణి రాయల్ డ్యూటీస్ కుదింపు
లండన్: ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ అనుభవించనంత వైభవాన్ని బ్రిటీష్ సామ్రాజ్యపు మహారాణి క్వీన్ ఎలిజబెత్. ఎంతలా అంటే.. బ్రిటన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ(Democracy) వచ్చినా.. ఆమె కుటుంబం రాయల్ డ్యూటీస్ అనుభవిస్తోంది. అయితే తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ ను తగ్గించేశారు. రాజకుటుంబ వార్షిక నివేదికలో రాణి రాయల్ డ్యూటీస్ ను తగ్గించిన విషయాన్ని పేర్కొన్నారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. రాజకుటుంబం తరపున తప్పనిసరిగా ఆమె హాజరు కావాల్సిన కార్యక్రమాలకు ఇక నుంచి ఆమె దూరంగా ఉండనున్నారు. ఎలిజబెత్ రాణి విధులను సర్దుబాటు చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. క్వీన్ ఎలిజబెత్ వయసు 96 సంవత్సరాలు. గత ఫిబ్రవరిలో ఆమె కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆమె కోసం నిర్వహించిన ప్లాటినం జుబిలీ వేడుకులకు కూడా... వయసు ఇబ్బందుల కారణంగా ఆమె హాజరు కాలేకపోయారు. సెయింట్ పాల్ కేథడ్రల్ లో జరిగిన థ్యాంక్స్ గివింగ్ సర్వీసుకు కూడా ఆమె హాజరు కాలేదు. వయసు పెరిగిన నేపథ్యంలో, రాణికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆమె విధులను కుదించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రతి ఈవెంట్ కు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనప్పటికీ... తన హృదయం ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటుందని ఎలిజబెత్ రాణి ఇటీవల తెలిపారు. తన కుటుంబ సహకారంతో తన శక్తి మేరకు మీకు సేవ చేస్తానని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. -
అప్పుడే పట్టణాలు శుభ్రపడతాయి!
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అతి వేగంగా పెరుగుతోంది. భారతదేశంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో పట్టణాలలో చెత్త, వ్యర్థాలు ప్రతి రోజూ కుప్పలు కుప్పలుగా పెరిగిపోవటం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందువల్ల ప్రజారోగ్యానికీ, పర్యావరణానికీ ఎంతో హాని కలుగుతోంది. స్థానిక సంస్థలకు ఈ చెత్తను తొలగించడం సవాలుగా మారింది. గత రెండు దశాబ్దాలలో వేగవంతమైన పట్టణాభివృద్ధి, జనాభా పెరుగుదల, మారుతున్న జీవన ప్రమాణాలు పట్టణాల్లో వ్యర్థాల పెరుగుదలకు హేతువులుగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బహుముఖ వ్యూహంతో వ్యర్థాల నిర్వహణను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకూ చేపడుతున్న కార్యక్రమాలలో ఆర్ఆర్ఆర్ఆర్ (రెఫ్యూజ్: తిరస్కరణ, రెడ్యూస్: తగ్గించడం, రీయూజ్: తిరిగి వాడటం, రీసైకిల్: వేరుచేసిన చెత్తను ఇతర వస్తువులను తయారు చేయడానికి లేదా పునర్వినియోగానికి సిద్ధం చేయడం) వంటి వ్యూహాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఇండోర్ నగరంలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. వ్యర్థాల నిర్వహణలో ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ గత 5 సంవత్సరాలుగా దేశంలోనే మొదటి ర్యాంకు సాధిస్తోంది. ఇండోర్ నగంలోని ప్రజలలో వచ్చిన అవగాహన, ప్రవర్తనలోని మార్పులు, మునిసిపల్ సిబ్బంది అకుంఠిత దీక్ష వల్లనే ఇది సాధ్యమయింది. ఇండోర్ నగరంలోని వివిధ ప్రాంతాలలో పది ట్రాన్స్ఫర్ కలెక్షన్ సెంటర్లను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుండి వేరు వేరుగా సేకరించిన చెత్తను భారీ వాహనాల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్కు తరలిస్తారు. అక్కడ పొడి చెత్తను ఆరు రకాలుగా విభజించి ఆ తదుపరి మిగిలిన కొద్దిపాటి ఉపయోగం లేని చెత్తను శాస్త్రీయ పద్ధతి ద్వారా లాండ్ ఫిల్లింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ యూనిట్ నుండి తరలించిన చెత్తతో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో ‘ఇంక్వాష్’ సంస్థ నిర్వహించిన సదస్సులో చెత్త రీసైక్లింగ్ చేయడం ద్వారా అత్యధికంగా లాభాలు పొందే ఉపాధి అవకాశాలపై చర్చ జరిగింది. చెత్తతో వస్తువులను తయారు చేయడానికి ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. జనాభా పెరుగుతున్న నగరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలను రచించి పకడ్బందీగా ‘చెత్త’ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యవంతులను చేయాలి. కాలనీ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను సమకూర్చుకోవాలి. అప్పుడే ప్రతి నగరం, పట్టణం పరిశుభ్రతతో అలరారుతుంది. - ప్రొఫెసర్ కుమార్ మొలుగరం భారత ప్రభుత్వ ప్రాంతీయ పట్టణ అధ్యయన కేంద్రం డైరెక్టర్, ఓయూ -
గుడ్న్యూస్: పెట్రో ధరలపై భారీ ఊరట.. భారీగా తగ్గించిన కేంద్రం
-
విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకోండి: ప్రధాని మోదీ
పుణె: విదేశీ వస్తువుల పట్ల మోజు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ బిజినెస్ మీట్నుద్దేశించి ఆయన శుక్రవారం వర్చువల్గా మాట్లాడారు. స్థానిక వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్వావలంబన దిశగా మనం సాగిపోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిభావంతులను, వాణిజ్యాన్ని, సాంకేతికతను సాధ్యమైనంత మేర ప్రోత్సహిస్తోందన్నారు. -
ఇలా చేస్తే.. ముఖంపై ఎలాంటి మచ్చలైనా మటుమాయం
ఎత్తుకు తగిన బరువుతో ఆకర్షణీయమైన పర్సనాలిటీతో నలుగురిన్నీ ఆకట్టుకుంటూ ఉండాలని అందరమూ కోరుకుంటాం. కానీ అన్నీ బావున్నా.. తీరా ముఖం దగ్గరికొచ్చేసరికి మచ్చలు కొంతమందిని వేధిస్తూ ఉంటాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే ఈ నల్లటి మచ్చలనే మంగు మచ్చలంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుంచి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో కూడా ఏర్పడే అవకాశం ఉంది. శరీరతత్వాన్ని బట్టి ముఖంపై మొటిమలు, పులిపిర్లు, పెద్ద పరిమాణంలో ఉండే పుట్టుమచ్చలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు మొదలైనవి ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని వంశ పారంపర్యంగా వస్తే, మరికొన్ని హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు. వంశ పారంపర్యంగా వచ్చే మచ్చలను నివారించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ముఖంపై మంగు మచ్చలు లేదా, నల్లటి మచ్చలు వ్యాధి కాదు కానీ, వీటితో ఆత్మన్యూనతతో పదిమందిలోకీ వెళ్లడానికి ఇబ్బంది పడతారు. అసలు ఇలాంటి మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వాటిని నివారించ వచ్చు. తొలిదశలోనే ఉన్న వాటిని చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం. తాజా వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే క్రమేణా పలచబడి కొంతకాలానికి చర్మం రంగులో కలిసిపోతాయి. పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి పాలల్లో కలిపి రాస్తుంటే మంగు మచ్చలు, చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. జాజికాయను పాలలో అరగదీసి రాయడం వల్ల గుణం కనిపిస్తుంది. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది. పావు టీ స్పూన్నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టొమాటోను రెండు ముక్కలుగా తరిగి, వాటితో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే నల్ల మచ్చలు తగ్గడంతోపాటు ముఖవర్చస్సు పెరుగుతుంది. అలోవెరా పేస్టును మచ్చలపై పూయాలి. ఆ మచ్చతడి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. టీ స్పూన్టొమాటో రసం, టీ స్పూన్గంధం పొడి, రెండు టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజ్వాటర్, కీరా రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెల రోజులు గడిచేసరికి మంచి మార్పు వస్తుంది. బంగాళదుంప చెక్కు తీసి, సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి, రసం తీయాలి. దానిలో దూది ఉండలని ముంచి, వాటితో మచ్చలపై అద్దాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం. ఆత్మన్యూనతతో ఉంటే మరింత కృంగిపోతాం. పదే పదే అందవిహీనంగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసుకుంటే డిప్రెషన్కు లోనవుతాం. సో అలాంటివన్నీ పక్కన పెట్టి, సహజ పద్ధతుల్లో పరిష్కారానికి ప్రయత్నించడం, లేదంటే నిపుణులైన డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఆత్మవిశ్వాసంతో ఉండి చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే ఏ మచ్చలూ మన అందాన్ని మసక బార్చలేవు. -
Covovax Vaccine: కోవోవాక్స్ వ్యాక్సిన్ ధర తగ్గింపు
న్యూఢిల్లీ: కోవోవాక్స్ వ్యాక్సిన్ టీకా ఒక్కోడోసు ధరను రూ. 900 నుంచి రూ. 225కు తగ్గిస్తున్నట్లు సీరమ్ సంస్థ ప్రకటించింది. 12–17ఏళ్ల పిల్లలకు ప్రైవేట్ సెంటర్లలో ఇచ్చేందుకు సోమవారం కోవిన్ పోర్టల్లో ఈ టీకాను చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే డోసు ధరను రూ. 225 ప్లస్ జీఎస్టీగా నిర్ధారించినట్లు కేంద్రానికి కంపెనీ తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రులు రూ. 150 వరకు సర్వీస్చార్జి వసూలు చేయవచ్చు. కోవిన్ పోర్టల్లో కూడా టీకా ధరను సవరించి పొందుపరిచారు. ప్రస్తుతం 12ఏళ్ల పైబడిన పిల్లలకు ఇండియాలో కోర్బెవాక్స్, కోవాగ్జిన్, కోవోవాక్స్ అందుబాటులో ఉన్నాయి. -
అస్సాం సీఎం కీలక నిర్ణయం.. ఇక నుంచి కాన్వాయ్లో వాహనాల శ్రేణిని
దిస్పూర్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సీఎం పర్యటనలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అస్సాంలో సీఎం, మంత్రులు ఆధ్వర్యంలో గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. బిశ్వ శర్మ తన కాన్వాయ్ ఉండే వాహనాల శ్రేణిని ఆరుకు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు సీఎం కాన్వాయ్లో 22 వాహనాలు ఉండేవి. రోడ్డుపై సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలకు, పలు అంబులెన్స్ వాహనాలకు ఇబ్బందులు తలెత్తినట్లు సీఎం దృష్టికి వచ్చింది. దీంతో గౌహతిలో ప్రయాణిస్తున్నప్పుడు వాహనాలు శ్రేణిని ఆరుకి కుదిస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా, ఇతర ప్రాంతాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఎస్కార్ట్,పైలేట్ వాహనాల మినహ జిల్లాలలో 12 వాహనాలకు పరిమితం చేస్తు నిర్ణయం తీసుకుంది. అధికారిక సమావేశాలలో భాగంగా, ఇతర రాష్ట్రమంత్రులను సన్మానించడాన్ని కూడా నిషేధిస్తూ మంత్రి వర్గం నిర్ణయం వెలువరించింది. సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర సమయంలో 2 నిముషాలు ఆపవచ్చని తెలిపింది. అంబులెన్స్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. వీటితో పాటు పలు విధాన పర నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
కందిరీగ నడుము కావాలా.. ఫ్యాటీ బెల్లీకి చెక్ చెప్పండిలా
సాక్షి, హైదరాబాద్: ఓవర్ వెయిట్, ఫ్యాటీ బెల్లీ ఇపుడివే చాలామందిని వేధిస్తున్నపెద్ద తలనొప్పి. మారుతున్న జీవన శైలి, కనీస వ్యాయామం లేకపోవడం, కంప్యూటర్కు అతుక్కుపోయే ఉద్యోగాలతో ఊబకాయానికి తోడు పొట్ట, నడుం చుట్టూ కొవ్వు పేరకుపోయి పెద్ద సమస్యగా మారిపోతోంది. దీంతో వయసుతో నిమిత్తంలేకుండా కుండలాగాపెరిగిన పొట్ట ముందుకొచ్చి మరీ వెక్కిరిస్తోంది. అంతేనా నచ్చిన డ్రెస్ వేసుకోవడానికి లేదు. బాడీషేప్ మారిపోయి అందవికారంగా ఉన్నామనే ఇన్ఫీరియారిటి. మరి ఈ సమస్యల్నింటికి పరిష్కారం ఏమిటో తెలియాలంటే.. స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. -
Twitter: కొత్త ప్రయోగం.. ట్విటర్ కూల్
సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఆ చర్చలు వాడీవేడి పరిణామాలకు.. అటుపై విపరీతాలకూ దారితీస్తుంటాయి. అయితే ఆ హీట్ డిబేట్లను తగ్గించే ప్రయత్నాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చేయలేవా?.. ఇందుకోసమే ట్విటర్ ఇప్పుడు రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్ త్వరలో ఓ కూల్ ఫీచర్ను తీసుకురాబోతోంది. చర్చ అటుఇటు తిరిగి వాదులాటకు దారితీసే క్రమంలో ట్విటర్.. సదరు ట్వీపుల్స్(ట్విటర్ పీపుల్స్)ను అప్రమత్తం చేస్తుందట. ఇందుకోసం యూజర్ల సంభాషణ మధ్యలో కింద ఆఫ్షన్స్తో ఓ ఫీచర్ను డిస్ప్లే చేయబోతోంది. అప్పుడు యూజర్లు విచక్షణతో స్పందిస్తే.. ఆ ట్వీట్-రీట్వీట్ల సంభాషణపర్వం వేడెక్కకుండా అక్కడితోనే చల్లబడే ఛాన్స్ ఉంటుంది. అయితే సంభాషణకు సంబంధించి ఏ సందర్భంలో అలర్ట్ చేస్తుంది, అసలు ఎలా అంచనా వేయగలుగుతందనేది, ఎలా పని చేస్తుందనే విషయాల్ని ట్విటర్ ఇప్పుడే చెప్పట్లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందట. ఇది పూర్తయ్యాక ఆండ్రాయిడ్, ఐవోఎస్.. రెండింటిలోనూ ఈ కూల్ ఫీచర్ను అప్డేట్ ద్వారా తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉంటే ట్విటర్లో ఈమధ్య సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ట్విటర్ టైం లైన్లో వాటికవే రిఫ్రెష్ అయ్యి.. ట్వీట్లు కనిపించకుండా పోతున్నాయి. దీనిపై స్పందించిన ట్విటర్ ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఓ ఫీచర్ను తెస్తామని హామీ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్కి దెబ్బ.. వీళ్లేమో పండగ చేస్కున్నరు -
పెట్రో, గ్యాస్ ధరలను తగ్గించండి: సునీతారావు
సాక్షి, హైదరాబాద్: పెంచిన పెట్రో, గ్యాస్ ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ధరలను తగ్గించాలని టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టడి డిసాజో పిలుపు మేరకు గురువారం గాంధీభవన్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడారు. పెట్రో ధరల పెంపు ప్రభావంతో అనేక నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో, డీజిల్ ధరల పెంపుపై సునీతారావు రిక్షా తొక్కి నిరసన తెలిపారు. అదేవిధంగా గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసి స్తూ గాంధీభవన్ ఎదుట కట్టెల పొయ్యి మీద వంటావార్పు చేశారు. -
పల్లెవెలుగుకు చీకట్లు!
సాక్షి, హైదరాబాద్: ఇటు సిటీ, అటు ఊళ్లకు జీవనాడిగా ఉన్న ఆర్డినరీ బస్సులను భారీగా తగ్గించుకునేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. వాటి స్థానంలో దూరప్రాంతాలకు తిప్పే బస్సులను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. సిటీ, పల్లె వెలుగు బస్సులే ప్రస్తుతం ఆర్టీసీ నష్టాలను భారీగా పెంచుతున్నాయి. దూరప్రాంతాలకు తిరిగే బస్సుల ద్వారా ఆదాయం ఎక్కువగా ఉండటంతో వాటిపైనే ఎక్కువగా దృష్టి సారించే దిశగా అడుగులేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ.. అప్పులు తెస్తే తప్ప ఎలాంటి పనులు చేయలేని దుస్థితికి చేరుకుంది. ప్రతినెలా ప్రభుత్వం నిధులు ఇస్తేగానీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే నష్టాలు భారీగా పెరిగి సంస్థను నిర్వహించే పరిస్థితి ఉండదన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. నష్టాలను తెచ్చిపెడుతున్న బస్సులను తగ్గించుకుంటూ రావాలనే నిర్ణయానికి వచ్చింది. సిటీలో ట్రాఫిక్తో నష్టం ప్రస్తుతం నగరంలో దాదాపు 3,600 సిటీ బస్సులున్నాయి. కోవిడ్ కంటే ముందు దాదాపు 35 లక్షల మంది ప్రయాణికులు నిత్యం వాటిల్లో రాకపోకలు సాగించేవారు. కొత్త కాలనీలు శరవేగంగా విస్తరిస్తున్నందున రోజురోజుకు బస్సుల సంఖ్య పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ముంబైలో లోకల్ రైళ్లలాగా హైదరాబాద్లో సిటీ బస్సులు లైఫ్లైన్గా మారాయి. కానీ ట్రాఫిక్ వల్ల ఈ బస్సులతో నష్టం వస్తోంది. ఇటీవలి కాలంలో డీజిల్ ధరలు, సిబ్బంది జీతాలు భారీగా పెరగటంతో ఖర్చు బాగా పెరిగి నష్టాలు కూడా మరింత పెరిగాయి. దీనికితోడు నగరంలో మెట్రో రైలు సేవలను విస్తరిస్తుండటంతో సిటీ బస్సుల అవసరం కొంత తగ్గుతుందన్నది కూడా ఆర్టీసీ యోచన. జీపులు, ఆటోలతో ముప్పు.. అటు పల్లె వెలుగు బస్సులకు ఆటోలు, జీపులతో పెద్ద ము ప్పు ఏర్పడింది. ఇది వరకు ఊరి ప్రయాణికులు బస్సు వచ్చే వరకు ఎదురు చూసేవారు. కొన్నేళ్లుగా స్వయం ఉపాధి పేరు తో ఊళ్లలో ఆటోలు, జీపులు బాగా పెరిగిపోయాయి. ఫలి తంగా జనం బస్సుల కోసం చూడకుండా ఆటోనో, జీపో ఎక్కి వెళ్లిపోతున్నారు. ఇవి కూడా ఆర్టీసీకి నష్టాలను పెంచా యి. ప్రతి కిలోమీటరుకు సగటున రూ.28 నుంచి రూ.30 వరకు ఆదాయం వస్తుంటే ఖర్చు రూ.50 వరకు ఉంటోంది. కి.మీ.కి రూ.20 నష్టం వస్తోంది. అడ్డూఅదుపూ లేని డీజిల్ ధరలతో భవిష్యత్తులో ఇంధన భారం సంస్థకు శరాఘా తంగా పరిణమిస్తుందని ఆర్టీసీ భావిస్తోంది. కోవిడ్ రాక ముందు వార్షిక నష్టాలు రూ.వేయి కోట్లను మించగా, ప్రస్తు త ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రూ.900 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంకు అప్పులు రూ.3 వేల కోట్ల వరకు ఉండగా, బకాయిలు రూ.2,500 కోట్లకు చేరుకున్నాయి. మరింత పెరగనున్న ఆటోలు, క్యాబ్లు కొంతకాలంగా రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్లు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆటోలు 4.42 లక్షలు, మోటార్ క్యాబ్లు 1.14 లక్షలుండగా, మ్యాక్సీ క్యాబ్లు 31 వేలు దాటాయి. ఇప్పటికీ అధికారులు యువతకు ఉపాధి పేరుతో ఆటోలు, క్యాబ్లను మంజూరు చేస్తున్నారు. కొత్తగా వస్తున్న పథకాలతో వీటి సంఖ్య మరింత పెరగనుంది. అప్పుడు కష్టాలు మరింత పెరుగుతాయన్న ఆందోళన ఆర్టీసీని వెంటాడుతోంది. ఈనేపథ్యంలో దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు తిరిగే గరుడ, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులను పెంచుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది జరగాలంటే ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు కొనాల్సిందే. కానీ అంత ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ప్రభుత్వం గ్రాంటు ఇవ్వడమో, పూచీకత్తుతో మరిన్ని రుణాలను మంజూరు చేయడమో జరగాలి. ఇది ప్రభుత్వానికి కూడా భారమే. దీంతో అవసరమైతే దూరప్రాంత సర్వీసులను కూడా అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. -
టెస్లా ఈవీ బండ్లకు భారత్ రైట్.. రైట్!
Tesla EV In India: భారత్లో తమ బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్ చేయాలన్న టెస్లా ప్రయత్నాలకు లైన్ క్లియర్ అవుతోందా?. దిగుమతి సుంకాలపై తగ్గే ప్రసక్తే లేదన్న కేంద్ర ప్రభుత్వం.. నెమ్మదిగా దిగొస్తోందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. తమ ఈవీలను భారత్లోకి తక్కువ దిగుమతి సుంకాలతో అనుమతిస్తే.. ఆపై తయారీ యూనిట్లపై దృష్టిపెడతామని అమెరికన్ వెహికిల్స్ కంపెనీ టెస్లా భారత ప్రభుత్వానికి చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించబోమని భారత్ కరాకండిగా చెప్పేసింది. అయినప్పటికీ ఆగష్టు మొదటి వారంలో టెస్లా.. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కొంచెం తగ్గినట్లు సమాచారం. టెస్లాకు సంబంధించి స్థానిక యూనిట్ల సేకరణ, తయారీ యూనిట్ల ప్రణాళికను పూర్తిస్థాయి వివరాలను తమకు అందిస్తే దిగుమతి సుంకం తగ్గింపుపై ఆలోచన చేస్తామని టెస్లాకు కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ టెస్లాతో జరిపిన సంప్రదింపులు.. కీలక ప్రతిపాదన గురించి ఓ ప్రముఖ బిజినెస్ బ్లాగ్ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే భారత్లో ఈవీ అమ్మకాల ప్రయత్నంలో భాగంగా.. టెస్లా కంపెనీ ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో రీజినల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. కానీ, అధిక దిగుమతి సుంకాలు తమ ప్రవేశానికి ఆటంకంగా పరిణమించాయని ఎలన్ మస్క్ ఆమధ్య ఓ ట్వీట్ చేశాడు. ఆపై జులై చివర్లో కేంద్రానికి ఒక విజ్ఞప్తి లేఖ కూడా రాశాడు. కానీ, కేంద్రం తగ్గలేదు. చదవండి: ఎలన్ మస్క్.. ఈసారి ఆకాశమే హద్దు! కానీ, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు భారత్లో టెస్లా భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి పూర్థి స్థాయి వివరాలు అందిస్తేనే.. కంప్లీట్ బిల్డ్ యూనిట్ కార్ మోడల్స్పై దిగుమతి సుంకంపై పునరాలోచన చేస్తామని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుమారు 30 లక్షల విలువ కంటే వాహనాలపై 60 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే వంద శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోంది భారత ప్రభుత్వం. దీంతో రీజనబుల్ ధరలతో టెస్లా భారత్లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టెస్లా మెయిన్ పోర్టల్ ప్రకారం మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ మోడల్ ధర 40000 డాలర్ల కంటే తక్కువగా ఉంది. -
‘అత్యాచారం జరిగింది 11 నిమిషాలే.. అందుకే శిక్ష తగ్గిస్తున్నాం’
స్విట్జర్లాండ్/బెర్న్: అత్యాచారం.. ఓ బాలిక, యువతి, మహిళ జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఇలాంటి దారుణ నేరాల్లో న్యాయం జరగడం అటుంచి.. సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని చిత్రవధ చేస్తుంది. వారి పట్ల ఏమాత్రం జాలి, సానుభూతి చూపరు. పైగా నేరం చేసినవాడిని వదిలేసి.. బాధితురాలి ప్రవర్తననే తప్పు పడతారు. వీటన్నింటిని తట్టుకుని కోర్టు వరకు వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగకపోతే.. ఇక చట్టాలు, రాజ్యాంగాలు ఎందుకున్నట్లు. సరిగా ఇలానే ప్రశ్నిస్తున్నారు స్విట్జర్లాండ్ వాసులు. అత్యాచారం వంటి దారుణమైన నేరానికి సంబంధించి మీరు ఇలాంటి మతి లేని తీర్పు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిరసన తెలుపుతున్నారు. ఆ వివరాలు.. ఓ అత్యాచారం కేసులో స్విట్జర్లాండ్ బాసెల్ కోర్టు వివాదాస్పద తీర్పు వెల్లడించింది. ‘‘నిందితుడు కేవలం 11 నిమిషాల పాటే అత్యాచారం చేశాడు.. బాధితురాలిని పెద్దగా గాయపర్చలేదు. కనుక అతడికి విధించిన శిక్షను తగ్గిస్తున్నాం’’ అని తెలిపింది. ఈ తీర్పు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసెల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో దుమ్మెత్తి పోస్తున్నారు. కేసేంటంటే.. స్విట్జర్లాండ్ వాయువ్య ప్రాంతంలోని ఓ నగరానికి చెందిన బాధితురాలిపై గతేడాది ఫిబ్రవరిలో పోర్చుగల్కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఆమె ప్లాట్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంలో మరో 17 ఏళ్ల మైనర్ అతడికి సహకరించాడు. ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరపరిచారు. ఈ నేరానికి సంబంధించి కోర్టు ఆగస్టు, 2020లో శిక్ష విధించింది. 31 ఏళ్ల వ్యక్తికి 4 సంవత్సరాల 3నెలల శిక్ష విధించింది. మైనర్ని జువైనల్ హోంకి తరలించింది. వివాదాస్పద నిర్ణయం.. తాజాగా కోర్టు గతంలో నిందితుడికి తాను విధించిన శిక్షను తగ్గించింది. 51 నెలల జైలు శిక్షను 36 నెలలకు తగ్గించింది. బాసెల్ కోర్టు ప్రెసిడెంట్ కోర్ట్ ప్రెసిడెంట్ జస్టిస్ లిసెలెట్ హెంజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్విస్ న్యూస్ వెబ్సైట్ 20 మినిట్స్ ప్రకారం నిందితుడిని ఆగస్టు 11 న విడుదల చేయవచ్చని తెలిపింది. ఇక శిక్ష కాలాన్ని తగ్గిస్తూ జస్టిస్ హెంజ్ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘బాధితురాలు కొన్ని తప్పుడు సంకేతాలు పంపి.. నిప్పు రాజేసింది.. పైగా అత్యాచారం జరిగిన రోజున ఆమె మరో వ్యక్తితో కలిసి నైట్క్లబ్క్ వెళ్లి ఎంజాయ్ చేసింది.. ఇవన్ని నిందితుడిపై ప్రభావం చూపాయి’’ అన్నారు జస్టిస్ హెంజ్. ఈ కేసులో నిందితుడిది మధ్యస్థమైన నేరంగా పేర్కొన్నారు. పైగా అత్యాచారం కూడా 11 నిమిషాలపాటే సాగిందని.. ఈ ఘటనలో బాధితురాలికి ఎక్కువ గాయాలు కాలేదని.. అందుకే అతడికి శిక్షను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా బాసెల్ నగరవ్యాప్తంగా నిరసన తెలపుతున్నారు జనాలు. ఈ సదర్భంగా పలువురు నెటిజనులు జస్టిస్ హెంజ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘11 నిమిషాల దారుణ చర్య కొన్ని జనరేషన్ల వరకు వెంటాడుతూనే ఉంటుంది.. ఈ దారుణ అనుభవం నుంచి బయటపడటానికి ఆమెకు ఓ జీవితకాలం పడుతుంది. అంటే 11 నిమిషాల వ్యవధి ఆమె జీవితకాలంతో సమానం. కోర్టుకు ఈ విషయం ఎందుకు అర్థం కాలేదు. నైట్క్లబ్కు వెళ్లడం అనేది ఆమె వ్యక్తిగత అంశం.. దాన్ని కూడా తప్పంటే... అసలు ఆడవారు ఈ భూమి మీద పుట్టడం కూడా నేరమే అవుతుంది కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "Rape ONLY lasted for 11 minutes” 11 minutes of rape feels like 16hrs and the effects/trauma last for generations. https://t.co/DRKgjTTqfA — daktari Linnie🇸🇪 🇰🇪 (@ElenaNjeru) August 9, 2021 -
15 శాతం ఫీజు తగ్గించండి
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో 2021–22 విద్యా సంవత్సరానికి 15 శాతం ఫీజు తగ్గించాలని విద్యాశాఖ మంత్రి వర్షాగైక్వాడ్ ఆదేశించారు. ఫీజు తగ్గించని పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ మేరకు ఫీజుల తగ్గింపు విషయంపై మంత్రిమండలిలో సైతం ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం త్వరలో జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులతో. గత సంవత్సరం మార్చిలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. అప్పటి నుంచి అనేక మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలు మందగించాయి. అనేక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో కుటుంబాన్ని పోషించడమే కష్టంగా మారింది. ఇలాంటి సందర్బంలో పేదలతోపాటు మధ్య తరగతి కుటుంబాలు కూడా తమ పిల్లల స్కూలు ఫీజులు చెల్లించడం సాధ్యం కాలేదు. దీంతో విద్యార్థుల ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అనేక పాఠశాలలు ఫీజులు వసూలు చేయడం కొనసాగిస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు కొద్ది నెలల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చింది. అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూడసాగారు. ఆ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో 15 శాతం ఫీజు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు వర్షా గైక్వాడ్ తెలిపారు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కొంత ఊరట లభించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేసే పాఠశాలల యాజమాన్యాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా కొన్ని పాఠశాలలు ఫీజు చెల్లించని విద్యార్థుల ఫలితాలు (రిజల్ట్), ప్రొగ్రెస్ కార్డు ఇవ్వలేదు. ఇలాంటి యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు. చెల్లించిన ఫీజులపై రాని స్పష్టత.. లాక్డౌన్ కారణంగా పాఠశాలలన్ని మూసే ఉన్నాయి. కొందరు ఉపాధ్యాయులు మినహా మిగతా బోధన, బోధనేతర సిబ్బంది అందరు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. విద్యార్థులకు కూడా ఆన్లైన్లోనే బోధన తరగతులు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పాఠశాలల్లో విద్యుత్ వినియోగం, స్పోర్ట్స్, లైబ్రరీ, ల్యాబ్ ఇతర అనేక మౌలిక సదుపాయాల వినియోగం కాలేదు. దీంతో ఫీజులు తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో పేదలు, మధ్యతరగతి కుటుంబాల్లో కొంత ఆశలు చిగురించాయి. కానీ, ఇప్పటికే అనేక పాఠశాలలు అన్లైన్లో తరగతులు ప్రారంభించాయి. విద్యార్థులు ఆ తరగతులకు హాజరు అవుతున్నారు. దీంతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇదివరకే ఫీజులు చెల్లించారు. మరి వీరి సంగతేంటనేది ఇంకా స్పష్టం చేయలేదు. -
ఫోన్లు కట్టేయండి
సాక్షి, ముంబై: పనివేళల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం తమ ఉద్యోగులు, అధికారులకు ఆంక్షలు విధించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. వీటిని ఉల్లంఘించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరికి మొబైల్ ఫోన్ జీవితంలో ఒక భాగమైన సంగతి తెలిసిందే. పనులు పక్కన పెట్టి వీడియో గేమ్లు ఆడటం, చాటింగ్ చేయడం, బంధువులు, మిత్రులతో గంటల తరబడి మాట్లాడటం లాంటివి విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అతీతం కాదు. మంత్రాలయతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు మొబైల్ ఫోన్ వినియోగిస్తూ పనిపై అంత దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వానికి ఇప్పటికే అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఉద్యోగులు కూడా గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుతున్నారు. కొందరు సీట్లలో కూర్చొని మాట్లాడలేక బయటకు వెళ్లి మరీ ఫోన్ కబుర్లలో మునిగి తేలుతున్నారు. మరికొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియో గేమ్లు ఆడుతూ కాలయాపన చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఉన్నతాధికారులు మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరి ప్రవర్తన దాదాపు ఇలాగే ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. ఫలితంగా పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొందరి నిర్వాకం వల్ల క్రమశిక్షణతో పనిచేసే ఉద్యోగులకు కూడా చెడ్డ పేరు వస్తోంది. కొందరు ఉద్యోగుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోంది. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై ఇప్పటికే అనేక రంగాల నుంచి సైతం విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రస్తుతం మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, దీనిపై అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ అమలుచేద్దామని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే పురుష ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై అప్పట్లో మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఆ ప్రకారమే దుస్తులు ధరించి కార్యాలయానికి రావాలని సూచించింది. దీనిపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ మార్గదర్శకాలు అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మొబైల్ ఫోన్ వినియోగంపై తాజాగా విధించిన ఆంక్షలపై ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాలు ►విధి నిర్వహణలో ఉండగా సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ వినియోగించరాదు. ►అత్యవసరమైతే తప్ప ఫోన్ వాడరాదు. ఒకవేళ బయట నుంచి కాల్ వస్తే తొందరగా మాట్లాడి ముగించాలి. ►అధికారిక కాల్స్ కోసం ల్యాండ్లైన్ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ►ఫోన్లో వివాదాస్పద సంభాషణలు చేయకూడదు. కుటుంబ కలహాల గురించి అసభ్యకరంగా, బిగ్గరగా మాట్లాడకూడదు. ►సంక్షిప్త సందేశాలకే (ఎస్ఎంఎస్) ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ►విధులు పూర్తయ్యేంత వరకు ఫోన్ను సైలెంట్ మోడ్లో పెట్టాలి. ►మంత్రుల చాంబర్లలో సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికారులు, ఉద్యోగులు రహస్యంగా చాటింగ్ చేయడం, సందేశాలు పంపుకోవడం, వాట్సాప్ వాడటం వంటివి పూర్తిగా మానేయాలి. -
ఈ–వాహనాలకు ఆకర్షణీయమైన సబ్సిడీలు
ముంబై సెంట్రల్: రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈ–వాహనాలు) ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు నూతన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీని అమలు చేయడం ప్రారంభించింది. ఈ కొత్త విధానంలో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి సబ్సిడీలు ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి రూ. 15 వేలు, నాలుగు చక్రాల వాహనాలు(ఫోర్ వీలర్స్)కొనేవారికి ఒక లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2021 డిసెంబర్ 31వ తేదీ లోపు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసినట్లయితే కొనుగోలుదారులకు అదనంగా మరో రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు అదనపు సబ్సిడీ లభిస్తుందని దీనిపై అవగాహన ఉన్న కొందరు అధికారులు తెలిపారు. ఏ కంపెనీకి చెందిన వాహనాలను కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ అందించనుంది. రాబోయే నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో పది శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా నూతన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ నూతన విధానం ప్రకారం ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్, అమరావతి, నాసిక్ లాంటి నగరాల్లో నడిచే మొత్తం పబ్లిక్ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను 25 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 2025 వరకు రాష్ట్రంలోని ఏడు నగరాల్లో 2,500 ఛార్జింగ్ సెంటర్లను నెలకొల్పాలని అనుకుంటోంది. అంతేగాక, వచ్చే ఏప్రిల్ నుంచి కేవలం విద్యుత్ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్, పెట్రోల్ ధరలతో పోల్చితే విద్యుత్ ధర చాలా తక్కువ. అంతేగాక ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించవు. దీంతో అనేక మంది వినియోగదారులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే ప్రోత్సాహాకాల్లో భాగంగా రాబోయే ఆరు నెలల్లో కొనుగోలు చేసే లక్ష వాహనాలకు 25 వేల వరకు సబ్సిడీ లభించనుంది. మొదటి పది వేల నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుపై రూ. 2 నుంచి రూ. 2.5 లక్షల వరకు సబ్సిడీ దక్కనుంది. రిక్షా, గూడ్స్ వాహనాలు, టెంపో లాంటి వాహనాల కొనుగోలుపై కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించింది. స్లో చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్ విభాగాల్లో రూ. 10 వేల నుంచి రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ఉండనుంది. స్లో చార్జింగ్లో వాహనాలు 6 నుంచి 8 గంటల్లో, ఫాస్ట్ చార్జింగ్లో 2 నుంచి 3 గంటల్లో చార్జింగ్ పూర్తి చేసుకుంటాయి. కాగా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నూతన ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని మహారాష్ట్ర ఫిక్కీ, ఈ–వాహనాల విభాగ టాస్క్ఫోర్స్ సభ్యురాలు సులజ్జ ఫిరోదియా–మోట్వాణీ, మరాఠా చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ విభాగ ఉపాధ్యక్షుడు దీపక్ కరండీకర్ స్వాగతించారు. -
పేరెంట్స్కు గుడ్న్యూస్: ప్రైవేటు ఫీజులు 15 శాతం రద్దు
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను 15 శాతం రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించి విద్యార్థుల తల్లిదండ్రులపై స్వల్పంగా భారం తగ్గించింది. ఫీజుల వసూలు ఒప్పందం సంతకం చేసిన వారు ఆ ప్రకారం ఫీజులు వసూలు చేస్తారు. ఇతరులు 15 శాతం ఫీజు రద్దు చేయాలని రాష్ట్ర పాఠశాలలు- సామూహిక విద్యా విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంవత్సరం పొడవునా తరగతుల నిర్వహణపై కోవిడ్–19 ఆంక్షలు ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లో ఫీజులు వసూలు చేయడం పట్ల తల్లిదండ్రుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శాంతియుత సంప్రదింపులు విజయవంతం కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. తల్లిదండ్రుల సంఘం అభ్యర్థనపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేని, నిస్సహాయ స్థితిని తల్లిదండ్రుల సంఘం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ విచారకర పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు మూడు వర్గాలతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, తల్లిదండ్రుల సంఘం, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రతినిధులతో రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటైంది. కరోనా తాండవిస్తున్న పరిస్థితుల్లో పాఠశాలలు వసూలు చేస్తున్న వార్షిక ఫీజును పరిమితి మేరకు పలు అంచెలుగా ఖరారు చేసి అంచెల వారీగా ఫీజుల్లో మినహాయింపు కల్పించాలని హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలులో అసంతృప్తి తలెత్తితే తల్లిదండ్రుల సంఘం మరోసారి న్యాయం కోసం ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు కేసు విచారణకు తెరదించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పలు ప్రైవేట్ పాఠశాలలు అంచెల వారీగా ఫీజులు మినహాయించే ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాయి. ఈ వివాదం మరోసారి బిగుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఒప్పందం నిరాకరించిన యాజమాన్యాలు 15 శాతం ఫీజులు రద్దు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టాటా మోటార్స్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 7,585 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2019–20) ఇదే కాలంలో రూ. 9,864 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 63,057 కోట్ల నుంచి రూ. 89,319 కోట్లకు ఎగసింది. ఇదే కాలంలో యూకే అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్రోవర్(జేఎల్ఆర్) 95.2 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు నష్టం(రూ. 9,600 కోట్లు) ప్రకటించింది. ఇందుకు 1.5 బిలియన్ పౌండ్ల(రూ. 14,994 కోట్లు) అనూహ్య చార్జీలు కారణమయ్యాయి. వీటిలో పెట్టుబడులపై నగదేతర రైటాఫ్లు, పునర్వ్యవస్థీకరణ చార్జీలు కలసి ఉన్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. తద్వారా జేఎల్ఆర్కు సంబంధించి కొత్త గ్లోబల్ వ్యూహాలను అమలు చేయనున్నట్లు వివరించింది. ఆధునిక లగ్జరీ డిజైన్లు, డెలివరీ తదితరాల రీఇమేజిన్కు తెరతీసినట్లు తెలియజేసింది. దీంతో 2025–26కల్లా రెండంకెల ఇబిట్ మార్జిన్లు సాధించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. స్టాండెలోన్ ఇలా క్యూ4లో జేఎల్ఆర్ ఆదాయం 20 శాతంపైగా ఎగసి 6.5 బిలియన్ పౌండ్లను తాకింది. రిటైల్ అమ్మకాలు 12 శాతం పుంజుకుని 1,23,483 యూనిట్లకు చేరాయి. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ క్యూ4లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. దాదాపు రూ. 1,646 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ4లో రూ. 4,871 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 10,002 కోట్ల నుంచి రూ. 20,306 కోట్లకు జంప్చేసింది. ఎగుమతులుసహా మొత్తం వాహన విక్రయాలు 90 శాతం దూసుకెళ్లి 1,95,859 యూనిట్లకు చేరాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జేఎల్ఆర్ మొత్తం ఆదాయం 19.7 బిలియన్ పౌండ్లను తాకింది. వాహన అమ్మకాలు దాదాపు 14 శాతం క్షీణించి 4,39,588 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక గతేడాదిలో టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,395 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2019–20లో రూ. 11,975 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,64,041 కోట్ల నుంచి రూ. 2,52,438 కోట్లకు వెనకడుగు వేసింది. క్యూ1 వీక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో పటిష్ట డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరాల సమస్యకానున్నాయి. కోవిడ్–19 సెకండ్వేవ్ లాక్డౌన్, కమోడిటీల పెరుగుదలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఆటో పరిశ్రమను దెబ్బతీసే వీలున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అయితే 2021–22 రెండో త్రైమాసికం నుంచీ పటిష్ట రికవరీ కనిపించగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. రానున్న ఐదేళ్లలో జేఎల్ఆర్ బిజినెస్పై 2.53 బిలియన్ పౌండ్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు సీఎఫ్వో పీబీ బాలాజీ తెలియజేశారు. దేశీయంగా రూ. 3,000–3,500 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.4% జంప్చేసి రూ. 332 వద్ద ముగిసింది.ఇంట్రాడేలో రూ. 337 వరకూ బలపడింది. సవాళ్లు ఎదురైనప్పటికీ నిలదొక్కుకున్నాం.. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ గతేడాది కంపెనీ నిలదొక్కుకోవడంతోపాటు పటిష్ట రికవరీని సాధించింది. మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. బ్రిటిష్ ఐకానిక్ బ్రాండ్లతో కూడిన భవిష్యత్ లగ్జరీ డిజైన్ల ద్వారా అమలు చేస్తున్న రీఇమేజిన్ వ్యూహాలు ఇందుకు దోహదపడుతున్నాయి. – థియరీ బోలోర్, జేఎల్ఆర్ సీఈవో సరఫరాల సమస్యను అధిగమిస్తున్నాం.. కోవిడ్–19 కారణంగా గతేడాది ఆటో పరిశ్రమ భారీగా ప్రభావితమైంది. అయినప్పటికీ వాహనాలకు నిలకడైన వృద్ధి కనిపించింది. లాక్డౌన్లు తొలగిపోవడం, డిమాండ్ పుంజుకోవడం, ఆర్థిక రికవరీ వంటి అంశాలు ఇందుకు సహకరించాయి. సరఫరా సమస్యలను అధిగమిస్తూ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. ఇదే సమయంలో ఉద్యోగులు, సహచర సిబ్బంది ఆరోగ్యం, రక్షణ తదితరాలకు ప్రాధాన్యమిచ్చాం. – గాంటర్ బుషక్, టాటా మోటార్స్ సీఈవో -
సమయాన్ని తగ్గించిన బేగంబజార్ లోని దుకాణాలు
-
గుడ్న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, హైదరాబాద్: నిరాటంకంగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా మొత్తం సబ్సిడీ ఎత్తివేస్తోంది. దీంతో సామాన్యుడు వంట చేసుకోలేని విధంగా మారింది. అయితే ఇప్పుడు కొద్దిగా ఉపశమనం కలిగే వార్త వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాస్ బండపై రూ.10 తగ్గనుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. గురువారం నుంచి పది రూపాయలకు తక్కువగా గ్యాస్ సిలిండర్ లభించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ గ్యాస్ ధర రూ.819గా ఉంది. కలకత్తాలో రూ.845, ముంబై రూ.819, చెన్నై రూ.835 ధరలు ఉన్నాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే మూడుసార్లు భారీగా గ్యాస్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండడంతో ధరలు తగ్గుతాయని ఓ అధికారి తెలిపారు. -
ఇంటర్లో 30 శాతం సిలబస్ తగ్గుదల..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్ను తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్(ప్రథమ), సెకండ్ ఈయర్(ద్వితీయ సంవత్సరం)లో 30 శాతం సెలబస్ తగ్గించింది. సీబీఎస్ఈ సూచనల ప్రకారం ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు సబ్జెక్ట్లో 30 శాతం సెలబస్ను ఇంటర్ బోర్డు తగ్గించింది. మరోవైపు ఇంటర్ సెకండ్ ఈయర్లో హిస్టరీ, ఏకనామిక్స్, పొలిటికల్ సైన్స్ (సివిక్స్), జియోగ్రఫ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీలో సెలబస్ను ఇంటర్ బోర్డు తగ్గించింది. అయితే తగ్గించిన సిలబస్ 2020-21 సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని, తగ్గించిన సెలబస్ను ఇంటర్ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. కాగా కరోనాను నివారించేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కారణంగా, దేశ వ్యాప్తంగా నాలుగు నెలల తరగతులు నిర్వహించలేకపోయారు. అయితే ఆలస్యం కావడం వల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం (సీబీఎస్ఈ) ఈ విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్(సంవత్సరం పాటు క్లాసులు నిర్వహించకపోవడం) నుంచి కాపాడటానికి కొన్ని సూచనలు చేసింది. తగ్గించిన సిలబస్ వివరాలను టీఎస్బీఐఈ అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లో సందర్శించవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. -
శానిటైజర్ కొంటలేరు...
సాక్షి, హైదరాబాద్: శానిటైజర్.. కరోనా మహమ్మారి విజృంభించేంతవరకు ఆసుపత్రుల్లో తప్ప పెద్దగా వాడకం లేని పేరు. కానీ, ఇటీవల అది ఏకంగా నిత్యావసరంగా మారిపోయింది. రేషన్ కోసం క్యూ కట్టిన తరహాలో శానిటైజర్ కోసం జనం దుకాణాలకు ఎగబడ్డారు. ఇళ్లు, కార్యాలయాలు, పనిచేసే చోట, కార్లు.. ఇలా అన్ని చోట్లా శానిటైజర్ సీసాలను అందుబాటులో ఉంచుకున్నారు. చివరకు చిన్న సీసాలను జేబుల్లో పెట్టుకుని తిరిగారు. అయితే అంతలా వినియోగించిన జనం ఒక్కసారిగా దాని వైపు చూడ్డం మానేశారు. ఆగస్టు చివరివారం నుంచి శానిటైజర్ అమ్మకాలు బాగా పడిపోవటం మొదలైంది. ప్రస్తుతం అమ్మకాలు 30 శాతానికి పరిమితమయ్యాయి. జూన్, జూలైలలో విపరీతంగా కొరత ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు, కొనేవారులేక, నిల్వలు పేరుకుపోయి దుకాణదారులు శానిటైజర్ను డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కు పంపే పరిస్థితి ఏర్పడింది. అసలు పని పక్కన పెట్టి .. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో చిన్నచిన్న తయారీ సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తయారీ రంగం పడకేయటంతో సిబ్బంది చెల్లాచెదురయ్యారు. దీంతో చాలా సంస్థలు కరోనానే తిరిగి అవకాశంగా చేసుకున్నాయి. శానిటైజర్ వాడకం విపరీతంగా పెరుగుతుండటాన్ని ఆసరా చేసుకుని అసలు ఉత్పత్తులను పక్కన పెట్టి శానిటైజర్ డిస్ట్రిబ్యూ టర్లుగా మారాయి. పెద్ద ఎత్తున శానిటైజర్ తయారీ సంస్థలు కొత్తగా ఏర్పడ్డాయి. కరోనా వచ్చే వరకు హైదరాబాద్లో రెండుమూడు తప్ప శానిటైజర్కు చెప్పుకోదగ్గ డిస్ట్రిబ్యూటర్ సంస్థలు లేవు. వ్యక్తిగతం మొదలు చిన్న సంస్థల వరకు వెరసి రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది డిస్ట్రిబ్యూటర్ అవతారమెత్తారు. కాగా కొన్ని సంస్థలు శానిటైజర్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమ వద్ద పనిచేసే సిబ్బంది జీతాలకు వినియోగించుకున్నాయి. పడిపోయిన ధరలు.. జూన్ నెలలో ఐదు లీటర్ల క్యాన్ను రూ.2 వేల కు ఈ సంస్థలు దుకాణాలకు సరఫరా చేసేవి. అలా నిత్యం సగటున 8 నుంచి 10 వరకు అలాంటి క్యాన్లు, 100 మిల్లీలీటర్ల చిన్న సీసాలు 300 వరకు, 200 మి.లీ. సీసాలు 100 నుంచి 200 చొప్పున సరఫరా చేసేవి. జూలై వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం వాటి ధరలను నియంత్రించటంతో 5 లీటర్ల క్యాన్ ధర వెయ్యి రూపాయలకు పడిపోయింది. ఆగస్టు చివరికొచ్చేసరికి క్రమంగా విక్రయాలు తగ్గిపోవటంతో అదే క్యాన్ను కేవలం రూ.400 అమ్మడం ప్రారంభించారు. ఇప్పుడు చాలా మెడికల్ షాపుల్లో అలాంటి క్యాన్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దాంతో వాటిని వాపస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భయం వీడడమే కారణం..! కరోనా సోకటం మొదలైన కొత్తలో జనంలో విపరీతమైన భయం పెరిగిపోయింది. మాస్కుతోపాటు శానిటైజర్ వాడకం కూడా అనివార్యమైంది. కానీ ప్రస్తుతం నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నా.. జనంలో మాత్రం భయం బాగా తగ్గిపోయింది. కరోనా వచ్చినా సాధారణ జ్వరం తరహాలో తగ్గిపోతుందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 77 శాతానికి చేరుకుంది. మరణాల రేటు బాగా తక్కువగా ఉండటంతో జనంలో కరోనా భయం బాగా తగ్గిపోయింది. ఫలితంగా శానిటైజర్ వాడకం కూడా పడిపోయింది. దీంతో కొనేవారు లేక దుకాణాల్లో సరుకు పేరుకుపోతోంది. -
ఉమర్ అక్మల్ సస్పెన్షన్ కుదింపు
కరాచీ: పాకిస్తాన్ బ్యాట్స్మన్ ఉమర్ అక్మల్కు కొంత ఊరట లభించింది. అతనిపై విధించిన మూడేళ్ల నిషేధాన్ని 18 నెలలకు కుదిస్తూ స్వతంత్ర న్యాయ నిర్ణేత ఫకీర్ మొహమ్మద్ ఖోఖర్ తీర్పు వెలువరించారు. అతనిపై నిషేధం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు కొనసాగుతుందని ఖోఖర్ తెలిపారు. అయితే ఈ తీర్పుపై అక్మల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోసారి దీనిపై అప్పీల్ చేస్తానని పేర్కొన్నాడు. తనకన్నా తీవ్రమైన నేరాలకు పాల్పడిన క్రికెటర్లకు తేలికపాటి శిక్షలు విధించారన్న అక్మల్ తనకు మాత్రం పెద్ద శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజా తీర్పు పట్ల సంతోషంగా లేనని పేర్కొన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా బుకీల గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు తెలపకపోవడంతో పాటు, పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ అక్మల్పై ఏప్రిల్లో మూడేళ్ల సస్పెన్షన్ విధించారు. తన తప్పును అంగీకరించిన అక్మల్ తనను క్షమించాలంటూ కోర్టుకు అప్పీల్ చేయగా తాజాగా శిక్షను 18 నెలలకు కుదించారు. -
సిలబస్ తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలోనూ జాతీయ స్థాయిలో 30 శాతం సిలబస్ తగ్గింపునకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా విద్యాశాఖ యోచిస్తోంది. జూన్ 12 నుంచి ప్రారంభమై కొనసాగాల్సిన పాఠశాలలు కరోనా కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో వచ్చే నెలలోనూ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ పాఠశాల విద్యలో సిలబస్ను 30 శాతం వరకు తగ్గించే విషయమై విద్యాశాఖ ఆలోచిస్తోంది. దీనిపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించింది. అయితే జాతీయ స్థాయిలో స్పష్టత వచ్చాక ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనా, సిలబస్ కుదింపు అమలు చేయాల్సి వస్తే ఏయే పాఠ్యాంశాలను తొలగించాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలనే భావనకు వచ్చారు. ప్రతి సబ్జెక్టులో 30 శాతం కరోనా కారణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తమ పరిధిలోని స్కూళ్లలో 30 శాతం సిలబస్ కుదింపునకు ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ కుదింపునకు చర్యలు చేపట్టింది. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీఈఆర్టీ) కూడా పాఠశాలల్లో సిలబస్ కుదింపు, అకడమిక్ వ్యవహారాలు ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ తరగతుల వారీగా ఏయే సబ్జెక్టులో ఎంత సిలబస్ను తగ్గించవచ్చనే అంశాలపై ప్రణాళికలు రూపొందిస్తోంది. తరగతుల వారీగా ప్రతి సబ్జెక్టులో 30 శాతం వరకు సిలబస్ను తగ్గించే ప్రణాళికలపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా అనుగుణంగా సిద్ధంగా ఉండేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెలవు రోజుల్లోనూ పాఠశాలలు కరోనా అదుపులోకి వస్తే సెప్టెంబరులో పాఠశాలను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒకవేళ రాకుంటే అక్టోబరు కావచ్చు లేదా ఇంకా ఆలస్యం కావచ్చు. కాబట్టి సిలబస్ తగ్గించినా పని దినాలు సర్దుబాటయ్యే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. సెప్టెంబరు నాటికే దాదాపు 70 రోజులకు పైగా పనిదినాలు కోల్పోయినట్టవుతుంది. స్కూళ్ల ప్రారంభం ఇంకా ఆలస్యమైతే ఇంకా పని దినాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా సెలవు దినాల్లో బడులను కొనసాగించేలా ప్రణాళికలను సిద్ధం చేసేందుకు విద్యాశాఖ నడుంబిగించింది. రెండో శనివారాలు, వీలైతే ఆదివారాలు, ఇతర పనిదినాల్లోనూ స్కూళ్లను కొనసాగించేలా ప్రణాళికలను రూపొందించడంపై దృష్టి సారించింది. -
30% తగ్గనున్న సీబీఎస్ఈ సిలబస్
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా సకాలంలో స్కూళ్లు తెరుచుకోకపోవడంతో నష్టపోయిన విద్యా సంవత్సరాన్ని భర్తీ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2020–21 విద్యా సంవత్సరంలో 9 నుంచి12వ తరగతి వరకు సిలబస్ను 30 శాతం మేర తగ్గించింది. ‘దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులపై భారం తగ్గించి, కరిక్యులమ్ రివైజ్ చేయాలని సీబీఎస్ఈని కోరాం’అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ తెలిపారు. దీనిపై గత వారం సూచనలు కోరగా విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో స్పందించారన్నారు. వీరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, 30 శాతం మేర సిలబస్ను హేతుబద్ధీకరించినట్లు తెలిపారు. ఈమేరకు మార్పులను సీబీఎస్ఈ పరిపాలక మండలి కూడా ఆమోదించిందన్నారు. తగ్గించిన సిలబస్ పాఠ్యాంశాలను కూడా విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందని పాఠశాలలకు, ఉపాధ్యాయులకు సూచించామన్నారు. అయితే, ఇంటర్నల్స్, వార్షిక పరీక్షల్లో తగ్గించిన సిలబస్లోని అంశాలపై ప్రశ్నలుండవని వివరించారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ ఇప్పటికే ప్రత్యామ్నాయ కేలండర్ను రూపొందించి, ప్రకటించిందన్నారు. -
చైనా దిగుమతులు ఇప్పట్లో తగ్గవు!
సాక్షి, న్యూఢిల్లీ: చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడం రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ తెలిపింది. దేశీయంగా అమ్ముడయ్యే వివిధ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్లో 95 శాతం దేశీయంగానే తయారైనవే ఉంటున్నా.. 25–70 శాతం విడిభాగాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. కరోనా వైరస్ పరిణామాలతో చైనా నుంచి సరఫరా దెబ్బతినడంతో అప్పట్నుంచే విడిభాగాల దిగుమతి కోసం దేశీ సంస్థలు ఇతర మార్కెట్లను పరిశీలించడం ప్రారంభించాయని తెలిపింది. చైనా ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలన్న ఉద్యమం ఊపందుకోవడానికి ముందునుంచే కంపెనీలు దీనిపై దృష్టి పెట్టాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నంది పేర్కొన్నారు. థాయ్లాండ్, వియత్నాం, కొరియా తదితర దేశాలను పరిశీలించాయని వివరించారు. ఎయిర్కండీషనర్లకు సంబంధించిన విడిభాగాలను అత్యధికంగా, వాషింగ్ మెషీన్ల విడిభాగాలను అత్యంత తక్కువగా దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు. దేశీయంగా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి.. ‘పరికరాల కోసం సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దాకా చైనాపై ఆధారపడటాన్ని రాత్రికి రాత్రే తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఇందుకు సమయం పడుతుంది. మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలి‘ అని కమల్ పేర్కొన్నారు. దేశీయంగా ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వీటిని అభివృద్ధి చేసుకునేందుకు కనీసం రెండేళ్లయినా పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వం కూడా దశలవారీ తయారీ పథకం (పీఎంపీ) వంటి స్కీములతో తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని కమల్ చెప్పారు. దీనిపై ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. చైనాయేతర సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ .. బాయ్కాట్ చైనా ఉద్యమంతో చైనాయేతర కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ (మొబైల్ కమ్యూనికేషన్స్) అద్వైత్ వైద్య తెలిపారు. ‘గడిచిన కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడింది. రాబోయే కొద్ది రోజుల్లో వివిధ ధరల శ్రేణిలో కొత్తగా ఆరు హ్యాండ్సెట్స్ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. అలాగే భారత్లో మా ఉత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుకుంటున్నాం. మా మేకిన్ ఇండియా ఉత్పత్తుల గురించి భారీ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం‘ అని ఆయన వివరించారు. ఇక వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్ తాము చైనా నుంచి కొనుగోళ్లను నిలిపివేయనున్నట్లు తెలిపింది. ‘డోక్లాం ఉదంతం జరిగినప్పట్నుంచీ గడిచిన కొన్నాళ్లుగా మేం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం‘ అని సంస్థ ఎండీ చంద్రు కల్రో పేర్కొన్నారు. చైనా నుంచి ఫినిష్డ్ గూడ్స్ కొనుగోళ్లు అన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని, దేశీయంగానే విడిభాగాల వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకోవడంపై కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. భారత మార్కెట్ అవసరాల కోసం టీటీకే ప్రెస్టీజ్ దిగుమతి చేసుకునే వాటిల్లో చైనా వాటా సుమారు 10 శాతం ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతులను 5 శాతానికన్నా తక్కువకే పరిమితం చేసుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రు చెప్పారు. -
లాక్డౌన్లో ఎంత డౌన్?
కరోనా కమ్ముకొచ్చినా.. పర్యావరణ ప్రేమికులు మాత్రం ఈ మహమ్మారి వల్ల భూమికి కొద్దోగొప్పో మేలే జరిగిందని చెబుతున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో ఇటలీ నగరం వెనిస్లో నీళ్లు స్వచ్ఛమై డాల్ఫిన్లు మళ్లీ తిరిగొచ్చాయని.. తిరుమల ఘాట్ రోడ్లపై జింకలు యథేచ్ఛగా తిరుగాడాయన్న వార్తలూ మనం చూశాం. అయితే మిగిలిన ప్రాంతాల మాట ఎలా ఉన్నా.. దేశంలోని 22 ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం తగ్గింది పాక్షికంగానే అంటోంది.. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కాలంలో వాయుకాలుష్యం పాక్షికంగానే తగ్గింది. వాయుకాలుష్యంలో కీలకమైన పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5, నైట్రస్ ఆక్సైడ్ (ఎన్ఓ2)లు తగ్గిపోగా, ఇంకో కాలుష్యకారక వాయువు ఓజోన్ మాత్రం పెరిగిపోయిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఓజోన్ కాలుష్యం వేసవిలో ఎక్కువగా ఉండటం సాధారణం. ఏడాదిలో మిగిలిన సమయాల్లో ఈ కాలుష్య కారక వాయువు మోతాదుల్లో హెచ్చుతగ్గులుంటాయి. కానీ తక్కువ కాలం మాత్రమే వాతావరణంలో ఉండే ఓజోన్తో సమస్యలు చాలా ఎక్కువ. కేవలం ఒక్క గంటపాటు ఓజోన్ ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఉంటే ఉబ్బసం, శ్వాస సమస్యలున్నవారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. వాహనాల పొగలోంచి విడుదలయ్యే నైట్రస్ ఆక్సైడ్, ఇతర వాయువులు సూర్యుడి సమక్షంలో రసాయన చర్య జరపడం వల్ల ఓజోన్ పుడుతూ ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే ఓజోన్ మోతాదును నియంత్రించాలంటే కాలుష్య కారక వాయువుల విడుదల పూర్తిగా ఆగిపోవాలన్నమాట. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా వాయు కాలుష్యంపై ఓ సర్వే నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు దాదాపు 15 రాష్ట్రాలోని 22 నగరాల్లో పీఎం 2.5, పీఎం 10, ఎన్ఓ2లతో పాటు ఓజోన్ మోతాదులు ఎంతున్నాయో లెక్కకట్టింది. గతేడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మే 31 వరకున్న సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. నాలుగు మెట్రో నగరాలు సహా హైదరాబాద్, విశాఖపట్నం, అహ్మదాబాద్, ఉజ్జయిని, జైపూర్, జోధ్పూర్, పట్నా, అమృత్సర్, హౌరా, పుణే, గువాహటి, లక్నో, కొచ్చిల్లో ఈ సర్వే నిర్వహించింది. ఓజోన్ ఎక్కువగానే.. ఫిబ్రవరి–ఏప్రిల్ మధ్యకాలంలో ఉత్తర, మధ్య, పశ్చిమభారత్లోని కొన్ని ప్రాంతాల్లో ఓజోన్ సమస్య ఎక్కువగా ఉండగా.. దక్షిణాది, సముద్రతీర నగరాల్లో చలికాలాల్లో ఎక్కువగా ఉంటోంది. లాక్డౌన్ సమయంలో చాలా రోజుల పాటు ఓజోన్ మోతాదు నిర్ణీత పరిధి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీలో లాక్డౌన్ కాలంలో 66 శాతం రోజుల్లో ఓజోన్ ఎక్కువగా ఉంటే అహ్మదాబాద్, ఉజ్జయినిలోనూ నెలకంటే ఎక్కువ రోజులు ఓజోన్ కాలుష్యం పీడించింది. ఇక చెన్నై, ముంబైల్లో మాత్రం ఏ ఒక్క రోజూ ఓజోన్ మోతాదుకు మించి లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా.. దేశంలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్ఓ2 తక్కువగా ప్రాంతాల్లో ఓజోన్ ఎక్కువగా పోగుబడటం సీఎస్ఈ గుర్తించింది. పీఎం 2.5 మోతాదు కంటే తక్కువ ఇక పీఎం 2.5 కాలుష్యం విషయాన్ని తీసుకుంటే.. లాక్డౌన్ సమయంలో ఇది గణనీయంగా తగ్గింది అనేందుకు స్వచ్ఛమైన నీలాకాశమే సాక్ష్యం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లాక్డౌన్ సమయంలో దేశంలోని 22 ప్రధాన నగరాల్లోనూ పీఎం 2.5 మోతాదు బాగా తక్కువగా ఉన్నట్లు సీఎస్ఈ సర్వే ద్వారా తెలిసింది. ప్రాంతాల వారీగానూ ఈ కాలుష్య కారక వాయువు మోతాదులో తగ్గుదల నమోదైందని తెలిపింది. గంగా పరీవాహక ప్రాంతంలో ప్రతి ఘనపు మీటర్కు 7 నుంచి 31 మైక్రోగ్రాముల పీఎం 2.5 నమోదు కాగా, రాజస్తాన్, గుజరాత్లలో ఇది మరింత తక్కువగా 9 నుంచి 20 మైక్రోగ్రాములుగా ఉంది. దక్కన్ పీఠభూమిలో సగటున 12 నుంచి 18 మైక్రో గ్రాములు/ఘనపుమీటర్ పీఎం 2.5 నమోదైనట్లు సీఎస్ఈ తెలిపింది. ఇక లాక్డౌన్ నిబంధనల సడలింపుతో మరోసారి పీఎం 2.5 మోతాదులు పెరగడం మొదలుపెట్టాయని, లాక్డౌన్ సమయంలో నమోదైన సగటు పీఎం 2.5 కంటే ఎత్తివేత తర్వాత చెన్నైలో 118 శాతం పెరుగుదల నమోదైంది. లాక్డౌన్ ఎత్తివేతతో ఎన్ఓ2 సాధారణ స్థితికి.. లాక్డౌన్ సమయంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గువాహటి, హౌరా, జోధ్పూర్, లక్నో, కోల్కతాల్లో ఎన్ఓ2 63 శాతం వరకూ తగ్గిపోగా, దక్కన్ పీఠభూమిలోని నగరాల్లో ఎన్ఓ2 4 నుంచి 13 మైక్రోగ్రాములు/ఘనపుమీటర్ మాత్రమే నమోదైంది. లాక్డౌన్ నిబంధనలు ఎత్తేయడం మొదలుకొని రహదారులపై వాహనాల సంచారం మొదలై సగటు ఎన్ఓ2 మళ్లీ సాధారణ స్థితికి చేరుకుందని సీఎస్ఈ వివరించింది. ఏం చేయాలి? దేశ ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలి అందేలా చేసేం దుకు ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను సీఎస్ఈ ఈ సర్వేలో వివరించింది. బీఎస్–6 కాలుష్య నియంత్రణ వాహనాలను జాప్యం లేకుండా అమల్లోకి తేవాలి. బీఎస్–6 ప్రమాణాలున్న భారీ వాహనాల కొనుగోలుకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ నిధుల ద్వారా ప్రోత్సాహకాలివ్వాలి. ఆటో రిక్షాలు మొదలుకొని అన్ని రకాల వాహనాలకూ ఈ ప్రోత్సాహకాలు అందేలా చూడాలి. పాత వాహనాలు ఇతర నగరాల్లో, ప్రాంతాల్లో ప్రత్యక్షం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, పాదచారులను, సైకిల్ వినియోగదారులను ప్రోత్సహించడం అవసరం. వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంతో పాటు కార్యాలయాలను వేర్వేరు సమయాల్లో పనిచేసేలా చూడాలి. -
రుణ రేట్లను తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు
ముంబై: ఇటీవలి కాలంలో ఆర్బీఐ రేపో రేటును గణనీయంగా తగ్గించడం ఫలితంగా బ్యాంకులు రుణాలపై రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐతోపాటు పీఎన్బీ రుణ రేట్లను తగ్గించగా.. తాజాగా బ్యాంకు ఆఫ్ బరోడా(బీవోబీ), యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం రేట్లను తగ్గిస్తూ ప్రకటనలు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే 0.05 శాతం. సవరణ తర్వాత ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.30 శాతానికి, ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 7.35 శాతానికి, ఏడాది కాల ఎంసీఎల్ఆర్ (రిటైల్ రుణాలకు ఎక్కువగా అమలయ్యేది) 7.65 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.85 శాతానికి దిగొచ్చినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రకటించింది. సవరించిన రేట్లు ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా పేర్కొంది. బీవోబీ సైతం ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు (0.15 శాతం) తగ్గించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.80 శాతం నుంచి 7.65 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.65 శాతం నుంచి 7.50 శాతానికి దిగొచ్చాయి. ఈ రేట్లు ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తాయని బీవోబీ ప్రకటించింది. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.60 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.45 శాతం, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.30 శాతం, ఒక నెల ఎంసీఎల్ఆర్ 7.15 శాతానికి తగ్గాయి. -
పసిడిపై దిగుమతి సుంకాలు తగ్గించాలి..
భారత్ ఏటా 800–900 టన్నుల పసిడి దిగుమతి చేసుకుంటోంది. 2018–19లో పసిడి దిగుమతులు 22.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారీగా పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటును కట్టడి చేసే దిశగా పసిడిపై విధించిన సుంకాలతో.. దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 7 శాతం క్షీణించి 20.57 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో వజ్రాభరణాల దిగుమతులు కూడా 1.5 శాతం క్షీణించి 20.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో పసిడి, వజ్రాభరణాల వ్యాపార సంస్థలు కేంద్ర ప్రభుత్వం ముందు పలు విజ్ఞప్తులు ఉంచాయి. ►బంగారంపై 12.5 శాతం దిగుమతి సుంకాల (జీఎస్టీ అదనం)తో ఆభరణాల కొనుగోలు భారీ వ్యయాలతో కూడుకున్నదిగా మారిపోయింది. దీన్ని 6 శాతానికి తగ్గించాలి. కట్, పాలిష్డ్ డైమండ్స్పై సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలి. ►కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వినియోగించిన పక్షంలో బ్యాంక్ కమీషన్లు తొలగించాలి. లేదా ప్రస్తుతమున్న 1–1.5 శాతం నుంచి 0.20 శాతానికి తగ్గించాలి. ►ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని కొత్త ఆభరణాల్లో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలి. ►పసిడి పరిశ్రమ మరింత పారదర్శకంగా పనిచేసే విధంగా తగిన ఇన్ఫ్రా, ప్రమాణాలను నెలకొల్పాలి. భారీ స్థాయి గోల్డ్ స్పాట్ ఎక్సే్చంజ్, బులియన్ బ్యాంకింగ్ మొదలైనవి పటిష్టం చేయాలి. -
7 శాతం తగ్గిన పుత్తడి దిగుమతులు
న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలంలో 7 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ కాలానికి 2,473 కోట్ల డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 2,300 కోట్ల డాలర్లకు తగ్గాయని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వాణిజ్య లోటు 14,823 కోట్ల డాలర్ల నుంచి 11,800 కోట్ల డాలర్లకు తగ్గిందని పేర్కొంది. కాగా 2018 , జూలై–సెప్టెంబర్ కాలానికి 2.9 శాతంగా ఉన్న కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గత ఏడాది ఇదే కాలానికి 0.9%కి తగ్గింది. విలువ పరంగా చూస్తే క్యాడ్ 1,900 కోట్ల డాలర్ల నుంచి 630 కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఏడాది జూలై నుంచి పుత్తడి దిగుమతులు తగ్గుతూనే ఉన్నాయి. వార్షిక దిగుమతులు 800–900 టన్నులు ప్రపంచంలోనే పుత్తడిని అత్యధికంగా దిగుమతి చేసుకునేది మన దేశమే. వార్షికంగా దిగుమతులు 800–900 టన్నుల మేర ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో పుత్తడి దిగమతులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10% నుంచి 12.5 శాతానికి పెంచింది. ఈ సుంకం పెంపు కారణంగా పలు కంపెనీలు తమ తయారీ కేంద్రాలను పొరుగు దేశాలకు తరలిస్తున్నాయని పుత్తడి పరిశ్రమ పేర్కొంది. దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని కోరుతోంది. -
రొమ్ము కేన్సర్ ఔషధ ధరలకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ చికిత్స కు ఉపయోగించే ‘ట్రాస్టూజుమాబ్’ ఔషధ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఏకంగా 65 శాతం తగ్గుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గురువారం తెలిపింది. ప్రస్తుతం వీటి ధర ఒక కోర్సుకు రూ.14.20 లక్షలుగా ఉంది. ఇప్పుడు అనేక కంపెనీలకు దాన్ని తయారు చేసే అవకాశం కల్పించడంతో దాని ధర తగ్గనుంది. 65 శాతం ధర తగ్గితే ఆ ఔషధం రూ.4.97 లక్షలకే లభించే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాగా, తెలంగాణలో కార్పొరేట్ ఆస్పత్రులే ఈ ఔషధాన్ని రోగులకు ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో, ఆరోగ్యశ్రీ రోగులకు ఈ ఔషధాన్ని వాడట్లేదు. ధర తగ్గడం వల్ల ఆరోగ్యశ్రీ రోగులకు కూడా దీన్ని ఇచ్చే అవకాశముందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
సంక్రాంతికే ఉల్లి దిగొచ్చేది!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉల్లి ధరలు మరో నెల రోజుల పాటు ఆకాశంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో ఉల్లి డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా లేకపోవడంతో ఇప్పట్లో ధరలు సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఉల్లి ధర, డిమాండ్ నేపథ్యంలో మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుత యాసంగి సీజన్లో సాగు పెరగడం, మరో పదిపదిహేను రోజుల్లో కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రానుండటంతో సంక్రాంతి నాటికి ఉల్లి కిలో ధర వంద రూపాయల దిగువకి వచ్చే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరికే సాధారణ ధర దేశ వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఉల్లికి తీవ్ర కొరత ఏర్పడింది. రోజువారీ ఉల్లి సరఫరా గత ఏడాది 3 లక్షల నుంచి 3.5 లక్షల క్వింటాళ్ల మేర ఉండగా.. ఈ ఏడాది 1.17 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా ధర రూ.180–220కి చేరగా, రాష్ట్రంలోనూ రూ.160–180 పలుకుతోంది. అయితే ఉల్లి ధరలు పెరగడం, యాసంగికి నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో మహారాష్ట్రలో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్లో 2.50 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ సీజన్లో 4 లక్షల హెక్టార్లకు మించి సాగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాగైన ఉల్లి దిగుబడులన్నీ జనవరి మాసాంతం వరకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆలోగానే కేంద్రం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్న 11 వేల మెట్రిక్ టన్నులు, ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటున్న 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డ విదేశాల నుంచి జనవరి రెండో వారంలోగా దేశానికి పూర్తిగా చేరుకుంటుంది. అప్పటివరకు విదేశాల నుంచి విడతలవారీగా ఉల్లి దేశానికి చేరినా ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో ఉల్లి ధర రూ.80–110 వరకు తగ్గే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి ఉల్లి ధర రూ.50–80 మధ్య, ద్వితీయార్ధంలో రూ.35–60 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరిలో మహారాష్ట్ర నుంచి ఉల్లి సరఫరా పెరిగే అవకాశాలు ఉండటం.. నారాయణఖేడ్, వనపర్తి వంటి ప్రాంతాల నుంచి ఉల్లి మార్కెట్కు వచ్చే అవకాశాలు.. కర్నూలు, కర్ణాటక నుంచి దిగుమతులు పెరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో రాష్ట్రంలో ఉల్లి ధర రూ.20–30కి సాధారణ స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ బిర్యానీకి కూడా ఉల్లి సెగ తగిలింది. చాలా హోటళ్లు బిర్యానీలో ఉల్లి వాడకాన్ని బాగా తగ్గించాయి. ప్రముఖ హోటళ్ల బిర్యానీలు సైతం రుచిని కోల్పోయాయని పలువురు ఆహార ప్రియులు పేర్కొంటున్నారు. ఉల్లి లేకుండా బిర్యానీ వండాల్సిన పరిస్థితి రావడం ఇదే తొలిసారి అని హోటళ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని సీఎం చెప్పారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరుకే మాత్రమే బార్లలో మద్యం అమ్మకాలు సాగించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
జొన్న ప్రొటీన్లు మిన్న
జొన్నరొట్టెకు పెరిగిన డిమాండ్ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే జొన్నరొట్టెలను తింటేనే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే కొవ్వును తగ్గించడానికి జొన్నరొట్టెలు ఎంతో ఉపయోగపడతాయని చెబుతుండటంతో వాటిని తినేందుకు పట్టణ ప్రజలు, ఉద్యోగస్తులు ఆసక్తి చూపుతున్నారు. కొత్తకోట పట్టణంలోని కర్నూల్ రోడ్డులో పదుల సంఖ్యలో జొన్నరొట్టె సెంటర్లు వెలిశాయి. చాలామంది మహిళలు వీటినే ఉపాధిగా మలుచుకుని రెండుచేతులా సంపాదిస్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెడుతున్నారు. రుచిని కాకుండా ఆహార ఉపయోగాల విషయాలపై దృష్టి పెడుతున్నారు. వైద్యుల సూచనలతో దురలవాట్లను మార్చుకుని జంక్ఫుడ్తో కలిగే అనర్థాలను తెలుసుకుని జొన్నరొట్టె వైపు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆహారంలో మంచి పోషక విలువలు కలిగి ఉండటంతో జొన్నరొట్టెలకు డిమాండ్ పెరిగింది. ఒక్కరొట్టె రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది.చాలామంది ఇష్టంగా తింటున్నారు నేను ఇంట్లోనే జొన్న రొట్టెలు చేసి అమ్ముతాను. కాలనీలోని వారు, ఉద్యోగస్తులు ఎంతో ఇష్టంగా ఆర్డర్ ఇచ్చి రొట్టెలు చేయించుకుంటారు. ప్రజలకు జొన్నరొట్టెలు తినడం అలవాటు కావడంతో నాకు గిరాకీ బాగా పెరిగింది. ఒక్కోసారి 50 నుంచి 60 రొట్టెలు అమ్ముతాను. – జ్యోతి, కొత్తకోట -
వడ్డీ రేట్లు తగ్గించాలి
న్యూఢిల్లీ: దేశ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కీలకమైన వడ్డీ రేట్లను, నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించాలని దేశ పారిశ్రామిక సంఘాలు ఆర్బీఐని కోరాయి. కీలకమైన మానిటరీ పాలసీ సమీక్షకు ముందు దేశ పారిశ్రామిక ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం ముంబైలో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయ త్నం చేశారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగొచ్చినందున రుణాలపై అధిక వ్యయాలను తగ్గించాలని, కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా కోరారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రస్తుతం సీఆర్ఆర్ 4 శాతం (బ్యాంకు డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిష్పత్తి), రెపో రేటు 6.5 శాతంగా (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై రేటు) ఉన్నాయి. సీఐఐ సూచనలు ఇవీ... ‘‘నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కనీసం అర శాతమయినా తగ్గించాలి. ద్రవ్యోల్బణం స్థిరంగా కనిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నందున రెపో రేటును సైతం అరశాతం తగ్గించడాన్ని పరిశీలించాలి. తద్వారా రుణాలపై అధిక వ్యయ భారాన్ని తగ్గించాలి. ఎంఎస్ఎంఈ, ఇన్ఫ్రా రంగానికి రుణ సదుపాయాన్ని పెంచాలి’’ అని సీఐఐ సూచించింది. ద్రవ్యలభ్యత పెంపునకు ఆర్బీఐ తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు, బ్యాంకులు కోరే అదనపు హామీలను పరిమితం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. సరైన హామీలు ఇచ్చినప్పుడు వ్యక్తిగత హామీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చూడాలని కోరింది. సీఐఐ ప్రెసిడెంట్ డిసిగ్నేట్ ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో ఈ సూచనలు చేశారు. కొనుగోలు దారులకు క్రెడిట్ సదుపాయం కల్పించే లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్లను (ఎల్ఓయూ) ఎంఎస్ఎంఈలకు కూడా జారీ చేసేలా బ్యాంకులను ఆదేశించాలని కోరింది. బలహీన బ్యాంకుల విషయంలో కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణను పునఃసమీక్షించాలని, కనీసం ఆయా బ్యాంకులను నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు రుణాలిచ్చేందుకు అయినా అనుమతించాలని కోరింది. దీనివల్ల హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల లభ్యత పెరుగుతుందని అభిప్రాయపడింది. వృద్ధిని కూడా చూడాలి... రెపో రేటు, సీఆర్ఆర్ను తగ్గించాలని మరో పారిశ్రామిక సంఘం ఫిక్కీ కూడా ఆర్బీఐ గవర్నర్ను కోరింది. దీని వల్ల దేశంలో పెట్టుబడులు పుంజుకుంటాయని, వినియోగాన్ని పెంచి వృద్ధికి తోడ్పడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని పేర్కొన్నారు. ‘‘వృద్ధిపై దృష్టి సారించేలా సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ అవసరం. మానిటరీ పాలసీ ఉద్దేశ్యాలు కేవలం ధరల స్థిరత్వానికే పరిమితం కాకూడదు. వృద్ధి రేటు, కరెన్సీ మారకం స్థిరత్వానికి కూడా అవసరమే’’ అని సందీప్ సోమాని సూచించారు. దేశంలో నగదు లభ్యత పెంచే విధంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉండాలని, ద్రవ్య లభ్యత వృద్ధిని నిలబెట్టగలదని అసోచామ్ సూచించింది. ‘‘ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల నిధుల సమీకరణ సామర్థ్యాలు గణనీయంగా తగ్గాయి. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను వాటికి కల్పించాల్సి ఉంది. కేవలం ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీల ఆరోగ్యం కోసమే కాదు, జీడీపీ స్థిరమైన వృద్ధికి కూడా ఇది తప్పనిసరి అవసరం’’ అని అసోచామ్ తన సూచనల్లో పేర్కొంది. మరింత కరెన్సీ అవసరం: ఆర్బీఐ కోల్కతా: దేశ జీడీపీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ వ్యవస్థలో మరింత నగదు అవసరం ఉంటుందని రిజర్వ్ బ్యాంకు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలో నగదుకు కొరత ఏర్పడిన విషయం విదితమే. -
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి
ములుగు : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ములుగు మండల కేంద్రంలో ఆదివారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టాటా ఏస్ వాహనాన్ని తాళ్లతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్కుమార్, మాజీ ఎంపీపీ నలెల్ల కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్యులకు బాసటగా నిలిచామని చెప్పారు. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ రూ.65 ఉన్న పెట్రోల్ ధరను క్రమంగా పెంచుకుంటూ ప్రస్తుతం రూ.82కు చేర్చారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గిస్తామని ప్రగల్బాలు పలికి ప్రస్తుతం సామాన్యడిపై భారం మోపుతుందని అన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోగిల మహేష్, యూత్ మండల అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మండల ప్రధాన కార్యదర్శి హరినాథ్గౌడ్, బండారుపల్లి సర్పంచ్ జంజిరాల దేవయ్య, నాయకులు ముసినపల్లి కుమార్గౌడ్, అశోక్గౌడ్, వంగ రవియాదవ్, రాములు, చాంద్పాషా, బొల్లం రవి, శ్రీను, దేవరాజు, కట్ల రాజు, కోటి, రజినీకాంత్, రంజిత్, శ్రీకాంత్, నవీన్, రాజు, రాజ్కుమార్, సురేష్, వినయ్, యుగేందర్ పాల్గొన్నారు. -
లీటరు పెట్రోల్పై కేంద్రానికి రూ.25 బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: మండుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మరోసారి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న పెట్రో ధరలపై ఆయన ట్విటర్లో స్పందించారు. లీటరుకు ఒకటి లేదా రెండు రూపాయల చొప్పున ఇంధన ధరలను తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు. తమ ఖజానా నింపుకునేందుకు సాధారణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వమే ఆ భారాన్ని వేస్తోందని విమర్శించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి లీటరుపై రూ. 25 బొనాంజా అంటూ బుధవారం ఆయన వరుస ట్వీట్లలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూనుకుంటే లీటరుకు 25 రూపాయల దాకా తగ్గించే అవకాశం ఉందని ట్విట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.77 ఉంది. అయితే ప్రతి లీటరు పెట్రోల్పై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.25 లాభం పొందుతోందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినప్పుడు ప్రతి లీటరు పెట్రోల్పై సుమారు రూ.15 కేంద్ర ప్రభుత్వం ఆదా చేస్తుందని, ప్రతి లీటరు పెట్రోల్పై కేంద్ర ప్రభుత్వం రూ.10 అదనపు ట్యాక్స్ను విధిస్తుందని చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. తద్వారా ప్రతి లీటరుపై రూ.25 కేంద్రానికి ఆదా అవుతుందని ఆయన తెలిపారు. ఆదా అయిన డబ్బు అంతా సగటు వినియోగదారుడికే చెందాలని ఆయన వ్యాఖ్యానించారు. కావాలంటే ప్రభుత్వం ప్రతి లీటరుపై సుమారు రూ.25 తగ్గించవచ్చు అని, కానీ ప్రభుత్వం అలా చేయదు, కేవలం ఒకటి లేదా రెండు రూపాయలు తగ్గిస్తూ ప్రజలను మోసం చేస్తుందని చిదంబరం విమర్శించారు. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018 Bonanza to central government is Rs 25 on every litre of petrol. This money rightfully belongs to the average consumer. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018 -
అభివృద్ధి మంత్ర.. ‘3ఆర్’
న్యూఢిల్లీ: ‘3ఆర్’అనే అభివృద్ధి మంత్రాన్ని అందరూ అనుసరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. తక్కువ వినియోగం (రెడ్యూస్).. పునర్వినియోగం (రీయూజ్).. శుద్ధి చేసి వినియోగం (రీసైకిల్).. ఈ మూడు ఆర్లు వ్యర్థాల నిర్వహణకు, స్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇండోర్లో ప్రారంభం కానున్న ఆసియా, ఫసిపిక్ ఎనిమిదో ప్రాంతీయ 3ఆర్ సదస్సు కోసం ప్రధాని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన 3ఆర్ అనే బంగారు సూత్రం మానవ జాతి స్థిరమైన అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగే ఈ సదస్సు 3ఆర్లు నగరాలకు, దేశాలకు ఎలా ఉపయోగపడతాయో విశ్లే షిస్తుందని పేర్కొంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన నేల, మంచి గాలి అందించాలన్నది ఈ సదస్సు లక్ష్యమని వెల్లడించింది. ఈ నెల 10న ఈ సదస్సును లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభిస్తారు. జపాన్ పర్యావరణ శాఖ మంత్రి తదహికో ఇటోతో పాటు పలు దేశాల నుంచి 40 మంది మేయర్లు, భారత్ నుంచి 100 మంది మేయర్లు ఈ సదస్సుకు హాజరవుతారు. వీరంతా సమగ్ర పట్టణాభివృద్ధిపై చర్చించి ఒప్పందాలు చేసుకుంటారని పేర్కొన్నారు. -
మాతా శిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాలి
విజయవాడ: మాతా శిశు మరణాలు నమోదు లేకుండా, వ్యాధి నిరోధక టీకాలు నూరుశాతం నిర్వహించిన జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని సూర్యారావుపేట ఐవీ ప్యాలెస్లో శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించి జీరోకి తీసుకురావాలన్నారు. ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నూరుశాతం జరగాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిం చాలన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయని వాటిని మెరుగుపచ్చుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లులో కనీస అవసరాలను సమకూర్చుకోవడం, మరమ్మతులు వంటి పనులను ఆస్పత్రి అభివృద్ధి నిధులను ఖర్చుచేసుకోవాలని సూచించారు. నిధుల సమీకరణకై అమెరికా పర్యటన జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి మోడల్గా అభివృద్ధి చేసే నేపథ్యంలో ప్రవాసాంధ్రులు రూ.6కోట్లు విరాళంగా అందించారని, మరిన్ని నిధుల సమీకరణకు తానా ఆహ్వానంపై జూన్లో అమెరికాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటిపన్ను వసూలు లక్ష్యం రూ.50కోట్లు జిల్లాలో 970 గ్రామ పంచాయతీల్లో రూ.50 కోట్లు ఇంటిపన్ను వసూలు మార్చి ఆఖరునాటికి పూర్తిచేయాలన్నారు. మాస్ క్లీనింగ్ డేను స్పెషల్ డ్రైవ్గా నిర్వహించాలన్నారు. శానిటేషన్ మెరుగుపర్చాలని, తాగునీటి పైపులైన్లు మురుగునీటిలో కలువకుండా పరిశీలించాలన్నారు. బ్లీచింగ్, క్లోరినైజేషన్ నిర్వహించాలన్నారు. విజయవంతంగా కుష్ఠువ్యాధిపై అవగాహన జిల్లాలో 15రోజులపాటు నిర్వహించిన కుష్ఠువ్యాధి అవగాహన కార్యక్రమం విజయవంతం చేయడంపై జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అభినందించారు. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వరకు జిల్లావ్యాప్తంగా కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం వివరాలతో కూడిన పుస్తకాన్ని నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో 63 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. 455 మంది వ్యాధిగ్రస్తులకు శారీరక వైఫల్యాలను గుర్తించి మైక్రో సెల్యూలర్ రబ్బర్(యం.సి.ఆర్)తో చేసిన చెప్పులు, సెల్ప్ కేర్ కిట్స్ అందించనున్నామన్నారు. ఆవిష్కరణలో అదనపు వైద్య ఆరోగ్య శా«ఖాధికారి డాక్టర్ టి.వి.ఎస్.ఎన్.శాస్త్రి పాల్గొన్నారు. -
గాలి మళ్లింది.. చలి తగ్గింది!
సాక్షి, విశాఖపట్నం: చలితో వణుకుతున్న రాష్ట్ర ప్రజలకు ఒకింత వెచ్చని వార్త! కొన్నాళ్ల నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో చలి ప్రభావంతో జనం ఒకింత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఆకస్మికంగా మార్పు చోటు చేసుకుంది. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత అధికంగా ఉండడం, అటు నుంచి ఉత్తర గాలులు రాష్ట్రం వైపు వీయడంతో ఇక్కడ చలి ప్రభావం కనిపించింది. కానీ ఇప్పుడు ఉత్తరగాలులు తగ్గుముఖం పట్టాయి. వాటి స్థానంలో ఈశాన్య, తూర్పు గాలులు వీయడం మొదలెట్టాయి. దీంతో నిన్న మొన్నటిదాకా సాధారణంకంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదైన రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలి తగ్గడం మొదలైంది. ఉత్తరాదిలో పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) పశ్చిమ నుంచి తూర్పు దిశగా పయనిస్తుండడం వల్ల గాలులు మారడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సంక్రాంతి నుంచి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించాక ఉత్తరం వైపుకు మళ్లుతాడు. దీంతో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ప్రారంభమవుతుందని రిటైర్డ్ వాతావరణ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఇకపై రానురాను చలి తగ్గుతుందన్నారు. కాగా శుక్రవారం రాష్ట్రంలో అత్యల్పంగా జంగమహేశ్వరపురం, కళింగపట్నంలో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణంకంటే 2-3 డిగ్రీలు అధికంగా రికార్డయ్యాయి. 15న ఈశాన్య పవనాల ఉపసంహరణ మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఈనెల 15తో నిష్క్రమించనున్నాయి. ఏటా అక్టోబర్ 18-22 తేదీల మధ్య ఈశాన్య పవనాలు రాష్ట్రాన్ని తాకుతాయి. కానీ ఈ ఏడాది ఇవి నిర్ణీత సమయంకంటే వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుల్లో ఈశాన్య రుతుపవనాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కానీ ఈసారి దక్షిణ తమిళనాడులో ఒక మోస్తరు వర్షాలు కురిపించాయి తప్ప దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం ఏమంత ప్రభావం చూపలేదు. ఈశాన్య రుతుపవనాల సీజనులో 3-4 వాయుగుండాలు గాని 2-3 తుపాన్లు గాని ఏర్పడుతుంటాయి. కానీ ఈ సీజనులో రెండు వాయుగుండాలు ఏర్పడినా భారీ వర్షాలు కురిపించలేదు. అలాగే అవి బలపడి తుపాన్లుగానూ మారలేదు. ఈనెల 15తో ఈశాన్య రుతుపవనాల ఉపసంహరణ పూర్తవుతుంది. దీంతో ఇక ఇప్పట్లో రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. -
ఎండీఆర్పై శుభవార్త అందించిన ఆర్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. డెబిటక్రెడిట్ కార్డుల మర్చంట్ డిస్కౌంట్ల రేటు(ఎండీఆర్)పై ఆర్బీఐ పలు మార్పులు చేసింది. డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఎండీఆర్ చార్జీలను సవరించినట్టు తెలిపింది. ఈ సవరించిన రేట్లు జనవరి 1, 2018 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. టర్నోవర్ ఆధారంగా వ్యాపారులను వర్గీకరించి ఆ మేరకు చార్జీలను వసూలు చేయనుంది. ప్రధానంగా చిరు వ్యాపారులు, వినియోగదారులకు లాభం కలిగేలా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది. అలాగే క్యూఆర్ ఆధారిత లావాదేవీలకు కేంద్ర బ్యాంకు ఒక విభిన్న ఎండీఆర్ను కూడా రూపొందించింది. చిరు వ్యాపారులు, చిన్న సంస్థలల్లో కూడా డెబిట్ కార్డ్ లావాదేవీలకు ప్రోత్సాహం, ఉనికిలో ఉన్న చిన్నవ్యాపారాలు, సంస్థల స్థిరత్వానికి భరోసా కల్పించడం అనే రెండు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సేవలపై వ్యాపారులకు బ్యాంకులు విధించే చార్జీలను పరిమితం చేస్తామని, వ్యాపారుల కేటగిరీ ఆధారంగా ఈ చార్జీలను విధిస్తామని పేర్కొంది. లావాదేవీ జరిగిన మొత్తం ఆధారంగా ఎండీఆర్ చార్జీలపై పరిమితులు విధిస్తామని వెల్లడించింది. క్యూఆర్ కోడ్ పేమెంట్ పద్ధతుల్లాగే అసెట్ లైట్ యాక్సెప్టెన్స్ వసతులను కల్పిస్తామని తెలిపింది. తాజాగా సవరించిన రేట్ల ప్రకారంరూ. 20 లక్షల వరకూ టర్నోవర్ కలిగిన వ్యాపారుల ఎండీఆర్ రేటు 0.4 శాతంగా నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవి నిర్వహించినట్లయితే ఇది మరింత తగ్గి 0.3 శాతంగా ఉంటుందని తెలిపింది. వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షలకు మించి వ్యాపారులకయితే స్వైప్ మెషీన్ ఆధారిత లావాదేవీలకు 0.9 శాతం, క్యూఆర్ కోడ్ ఆధారిత అమ్మకాలకు 0.8 శాతం చార్జీని వసూలు చేస్తుంది. కాగా గత ఏడాది రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఎండీఆర్ను క్రమంగా తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ తాజాగా మరోసారి చార్జీలను తగ్గించింది. -
వీటి ధర తగ్గే ఛాన్స్..
సాక్షి,న్యూఢిల్లీ: రోజువారీ ఉపయోగించే పలు వస్తువులపై జీఎస్టీ భారాన్నితగ్గించేందుకు కసరత్తు సాగుతోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరగనున్న 23వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశంలో 28 శాతం పన్ను పరిథిలో ఉన్న పలు వస్తువులను ఆ జాబితా నుంచి కుదించడంతో పాటు రోజువారీ ఉపయోగించే షాంపూలు, ఎలక్ట్రిక్ స్విచ్లు, ప్లాస్టిక్ ఉత్పుత్తులు, ఫర్నిచర్ వంటి వాటిపై పన్ను రేటును తగ్గిస్తారని భావిస్తున్నారు. జీఎస్టీ రిటన్స్ దాఖలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న మధ్యతరహా వ్యాపారులకూ ఊరట ఇచ్చేలా పలు నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. కాంపోజిషన్ స్కీమ్ కింద రూ కోటి లోపు టర్నోవర్ కలిగిన వ్యాపారాలపై పన్నును ఒక శాతానికి తగ్గించడం, నాన్ ఏసీ రెస్టారెంట్లపై తక్కువ పన్నురేట్ల వర్తింపు ప్రతిపాదనలపైనా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. -
నేరాల నివారణకే సీసీ కెమెరాల ఏర్పాటు
– ఎస్పీ ప్రకాష్రెడ్డి – శాంతిభద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచన డిండి : నేరాల నివారణకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలు, పోలీస్స్టేషన్లోని కంట్రోల్ రూమును ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో భాగంగా నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. దసరా నుంచి ప్రారంభం కానున్న నూతన జిల్లాలు, మండలాల్లో ఇప్పటికే పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రానున్న బతుకమ్మ, దసరా, మొహర్రం వేడుకల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ ప్రకాష్ డిండి ప్రాజెక్టును సందర్శించారు. చాలా రోజుల తర్వాత డిండి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరడం పట్ల ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఓఎస్డీ వెంకట్రెడ్డి, దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, రూరల్ సీఐ వెంకటేశ్వర్రెడ్డి, దేవరకొండ సీఐ రామకృష్ణ, డిండి ఎస్ఐ శేఖర్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. -
పాడి రైతుల పొట్టకొడితే ఊరుకోం
–హె రిటేజ్ నిర్వాహకులపై మండిపాటు – లీటర్కు రూ. 35 ఇవ్వాలని డిమాండ్ చిత్తూరు(రూరల్) : పాల ధరను హెరిటేజ్ డెయిరీ నిర్వాహకులు దారుణంగా తగ్గించారని, ఇలా చేస్తే తాము ఊరుకునేది లేదని ఆ డెయిరీకి సంబంధించిన పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము హెరిటేజ్ డెయిరీకి పాలు పోస్తున్నామని తెలిపారు. ఆ డెయిరీ నిర్వాహకులు కొన్ని నెలలుగా పాలు లీటర్పై రూపాయి..అర్ధరూపాయి తగ్గించి ఇస్తూ వచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం లీటర్కు రూ. 21 మాత్రమే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. పాడి రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డెయిరీనే ఈ విధంగా చేస్తే మిగతా డెయిరీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా డెయిరీ నిర్వాహకులు స్పందించాలని, పాలు లీటర్కు రూ. 35 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతులు నాగేశ్వర్రెడ్డి, హరిబాబు, బాబునాయుడు, భాస్కరనాయుడు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లిప్ కార్ట్ కు ఏమైంది?
న్యూయార్క్: భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంటోందా.. ఇప్పటికే వివిధ కంపెనీల్లో తన వాటాలను తగ్గించుకుంటూ వస్తున్న కంపెనీ ఇపుడు మరో అడుగు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అమెరికాలో తన ప్రధాన పోటీదారు అమెజాన్ లో రెండింట మూడో వంతు వాటాలను 2016 జనవరి-మార్చి క్వార్టర్ లో తగ్గించుకున్నట్లు యూఎస్ సెక్ తెలిపింది. 618 మిలియన్ డాలర్ల విలువ చేసే 1.04 మిలియన్ల షేర్లను వదులుకున్నట్లు వివరించింది. అమెజాన్ తో పాటు ఆలీబాబా గ్రూప్ లో కూడా ఫ్లిప్ కార్ట్ బాగా వాటాలను తగ్గించినట్లు సెక్ తెలిపింది. చైనీస్ ఈ-టెయిలర్ జేడీ.కామ్ లో 25 శాతం, ఆపిల్ లో 46 శాతం, జిల్లో గ్రూప్ లో 23.6 మిలియన్ల వాటాలను తగ్గించుకున్నట్లు సెక్ వివరించింది. భారతీయ ఈ-కామర్స్ రంగాన్ని శాసించేందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాస్ డీల్ కంపెనీలు పోటీ పడుతుండగా.. గత కొద్దికాలంగా ఫ్లిప్ కార్ట్ మార్కెట్ ఒడిదుడుకులకు గురౌతున్న విషయం తెలిసిందే. -
ఓయూసెట్కు తగ్గిన డిమాండ్!
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల ప్రవేశార్హత పరీక్ష ఓయూసెట్ - 2016కు డిమాండ్ తగ్గింది. గురువారం (12న) దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసేనాటికి 78 వేల మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. గతేడాది లక్షకు పైగా దరఖాస్తులు రాగా ఈ ఏడాది 78 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచని జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. -
సాగు 'పవర్' తగ్గింది!
► కుప్పకూలిన వ్యవసాయ రంగం.. దారుణంగా పడిపోయిన విద్యుత్ డిమాండ్ ► ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ అంచనా.. 170- 180 (మిలియన్ యూనిట్లు) ► వాస్తవ డిమాండ్.. 130- 150 (మిలియన్ యూనిట్లు) ► గతేడాది కంటే ఈ వేసవిలో తగ్గిపోయిన వినియోగం ► సాగుకు 9 గంటల కరెంటిచ్చినా పిసరంతైనా పెరగని డిమాండ్ ► రబీని తుడిచిపెట్టేసిన కరువు.. గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం సాక్షి, హైదరాబాద్: ఎండలు మండుతున్నాయి.. బయట సంగతి దేవుడెరుగు ఇంట్లో ఉన్నా ముచ్చెమటలు కక్కిస్తున్నాయి.. ఈ పరిస్థితుల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు.. తదితరాల వినియోగం అమాంతం పెరుగుతుంది.. విద్యుత్ వినియోగం పతాకస్థాయికి చేరుతుంది.. కానీ ఈసారి అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ గత వేసవి కన్నా బాగా పడిపోయింది..!! ఎందుకు?? రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలడమే ఇందుకు కారణం! కరువు కరాళనృత్యానికి రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయాయి. ఒకప్పుడు కనుచూపు మేర పచ్చని పంటపొలాలతో కనిపించిన ప్రాంతాలన్నీ ఇప్పుడు ఎడారులను తలపిస్తున్నాయి. దీంతో సాగుకు అసలు కరెంటు అవసరమే లేకుండా పోయింది. ఫలితంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గింది. వాస్తవానికి ఈ వేసవిలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 170-180 మిలియన్ యూనిట్లు (ఎం.యు.) ఉంటుందని ట్రాన్స్కో అంచనా వేసింది. ఒక్క మార్చిలోనే 172.78 ఎం.యు.ల డిమాండ్ ఉంటుందని ప్రభుత్వానికి నివేదించింది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు గత నెల 5న నమోదైన 155.1 ఎం.యు. డిమాండే ఈ వేసవిలో అత్యధికం కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్లో విద్యుత్ డిమాండ్ కేవలం 132-155 ఎం.యు.లకే పరిమితమైంది. ఏప్రిల్ 30న అయితే అత్యల్పంగా 132 ఎంయూలకు డిమాండ్ పడిపోయింది. ఇప్పటిదాకా ఈ వేసవిలో 14 రోజులు మాత్రమే విద్యుత్ డిమాండ్ 150 ఎంయూల మార్క్ను చేరుకోవడం గమనార్హం. సాగుకు 9 గంటల విద్యుత్ ఇచ్చినా.. రాష్ట్రంలో మొత్తం విద్యుత్లో 25-30 శాతాన్ని వ్యవసాయ రంగమే వినియోగించుకుంటోంది. ఖరీఫ్, రబీలలో ఇది 40 శాతం వరకు చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో వ్యవసాయానికి రోజూ సుమారు 50-60 ఎంయూల డిమాండ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లుగా తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు పాతానికి దిగజారిపోయాయి. రాష్ట్రంలో ఉన్న 20 లక్షల వ్యవసాయ బోరుబావుల కింద ఏటా రెండు కార్లు పండించే అన్నదాతలు గత రబీలో పంటలు వేసే సాహసం చేయలేదు. అక్కడక్కడ వేసినా ఎండిపోయాయి. దీంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయ విద్యుత్ సరఫరాను 6 గంటల నుంచి 9 గంటలకు పెంచినట్లు ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకున్నా... విద్యుత్ డిమాండ్ పిసరంత కూడా పెరగకపోవడం సాగు సంక్షోభానికి అద్దంపడుతోంది. గత వేసవి కన్నా తక్కువగా.. ఏటా కనీసం 8 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ దీనికి విరుద్ధంగా డిమాండ్ పెరగకపోగా తగ్గిపోయింది. ఈ వేసవిలో అత్యధిక డిమాండ్ 155 ఎంయూలకు పరిమితం కాగా.. 2015 వేసవిలో అత్యధికంగా మార్చి 26న 157.89 ఎంయూ, మార్చి 28న 156.67 ఎంయూల డిమాండ్ నమోదైంది. వ్యవసాయం లేని ‘గ్రేటర్’లోనే డిమాండ్ రాష్ట్రంలో మూడో వంతు విద్యుత్ వినియోగం వ్యవసాయం లేని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే జరుగుతోంది. రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 130-150 ఎంయూలు ఉండగా.. అందులో 48-56 ఎంయూలు ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు వినియోగిస్తున్నారు. మిగిలిన 9 జిల్లాల్లో డిమాండ్ 80-90 ఎంయూ మధ్య ఉంటోంది. రబీపై కరువు పంజా.. కరువు నేపథ్యంలో రాష్ట్రంలో సాగురంగం కోలుకోలేని విధంగా కుప్పకూలిందని వ్యవసాయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. రెండేళ్లుగా రబీ పంటల సాగు విస్తీర్ణం ప్రమాదకర రీతిలో పడిపోవడమే ఇందుకు నిదర్శనం. బోరుబావుల కింద సాగు చేసే వరి పంట విస్తీర్ణం మరింత తగ్గిపోయింది. రబీలో ప్రధానంగా జలాశయాలు, బోర్లు, బావుల కిందే పంటలు వేస్తారు. జలాశయాల్లో నీళ్లు అడుగంటడం, భూగర్భ జలాలు పడిపోవడం, బోర్లు ఎండిపోవడంతో పరిస్థితి తలకిందులైంది. ఇతర పంటల కంటే వరి పరిస్థితి దారుణంగా మారింది. 2014-15 రబీలో సాగు విస్తీర్ణం 77 శాతానికి పడిపోయింది. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 32.72 లక్షల ఎకరాలు కాగా కేవలం 25.15 లక్షల ఎకరాల్లోనే పంటలు (77%) వేశారు. ఇందులో 4.25 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయి. 26.02 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. కేవలం 19.62 లక్షల ఎకరాలకే (75%) పరిమితమైంది. వరి కేవలం 66 శాతమే సాగైంది. ఈసారి మరీ దారుణం.. 2015-16 రబీలో పరిస్థితులు మరింత దిగజారి కేవలం 57 శాతం పంటలే సాగ య్యాయి. సాధారణ సాగు విస్తీర్ణం 31.32 లక్షల ఎకరాలు కాగా... కేవలం 17.87 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. అందులో 5.10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వరి సాధారణ విస్తీర్ణం 16.12 లక్షల ఎకరాలు కాగా.. 6.3 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లో 1.07 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా.. 2014-15 ఖరీఫ్, రబీ సీజన్లో కేవలం 68.63 లక్షల టన్నుల ఆహార ధాన్యాలే ఉత్పత్తి అయ్యాయి. అంతే ఏకంగా 38.37 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు తగ్గాయి. అందులో బియ్యం ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2013-14లో బియ్యం ఉత్పత్తి 66.22 లక్షల టన్నులు కాగా.. 2014-15లో 43.22 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. 2015-16 ఖరీఫ్, రబీల్లో 49.35 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. -
కంప్యూటర్తో మతిమరుపు దూరం!
వాషింగ్టన్: కనీసం వారానికి ఒకసారి కంప్యూటర్ను వాడటం వలన వృద్ధులలో మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కంప్యూటర్ వాడకం, చదవటం, రాయటం లాంటి చర్యల ద్వారా మెదడు ఉత్తేజితమౌతుందని, తద్వారా మెదడు క్రియాశీలకంగా పనిచేస్తూ మానసికపరమైన సమస్యలు తగ్గిపోతున్నాయని అమెరికాకు చెందిన మయో క్లినిక్ వెల్లడించింది. మలి వయసులో ఎదుర్కొనే అనేక మానసిక సమస్యలకు ప్రధాన కారణం మెదడును క్రియాశీలకంగా ఉంచే మానసిక కార్యకలాపాల్లో పాల్గొనకపోవటమే అని పరిశోధనకు నేతృత్వం వహించిన క్రెల్ రోచ్ తెలిపారు. కంప్యూటర్ను వారానికి ఒక సారి వాడటం ద్వారా మానసిక రుగ్మతల భారీన పడే అవకాశం 42 శాతం తగ్గుతోందని, మేగజైన్లు చదవటం, సామాజిక కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించే వారిలో మతిమరుపు అవకాశం 30 శాతం మేర తగ్గుతోందని ఆయన తెలిపారు. -
కాఫీతో ఆ రిస్క్ సగానికి పైగా తగ్గుతోంది!
లండన్: కాఫీ ప్రియులకు శుభవార్త. మీరు రోజు మామూలుగా తాగేదానికన్నా అదనంగా మరో రెండు కప్పుల కాఫీని లాగించమని చెబుతున్నారు పరిశోధకులు. దీని ద్వారా కాలేయానికి సంబంధించిన ప్రాణాంతకమైన వ్యాధులు సగానికి పైగా తగ్గుతాయని చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శరీరంలో ఆల్కహాల్ మోతాదు మించడం, హెపటైటిస్ సీ లాంటి వైరల్ వ్యాధుల భారిన పడటం ద్వారా కాలేయం(లివర్) తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇలా దీర్ఘకాలంగా కాలేయ వ్యాధులు ఉన్నవారిలో అది లివర్ క్యాన్సర్గా మారి ప్రాణాంతకంగా తయారవుతోంది. అయితే ఈ ముప్పును కాఫీ సగానికి పైగా తగ్గిస్తోందని లండన్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృంధం తాజాగా తేల్చింది. సుమారు 5 లక్షల మందిని పరిశీలించి ఈ ఫలితాలను వెల్లడించారు. లివర్ సిర్రోసిస్ వ్యాధికి కాఫీ మంచి విరుగుడులా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. కాఫీతో కలిగే ఈ ప్రయోజనాలను తెలుసుకోవడం ద్వారా లివర్కు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి ఉపయోగాలున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఒలివర్ కెన్నడీ వెల్లడించారు. -
ఆర్టీసీలో ఉద్యోగాలకు ఎసరు?
-
పుష్కరాలకు తగ్గిన రద్దీ
రాజమండ్రి: గోదావరి పుష్కరాలకు బుధవారం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. తొలి రోజుతో పోల్చుకుంటే భక్తులు తగ్గారు. రాజమండ్రిలోని రేవులను పరిశీలిస్తే.. ఒక్క పుష్కర ఘాట్ వద్దే ఎక్కువ మంది జనాభా కనిపిస్తున్నారు. కోటిలింగాల రేవు వద్ద భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మిగతా ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కనిపించడం లేదు. దీంతో పుష్కర స్నానానికి 5 నిమిషాలు పడుతోంది. పుష్కరాల ప్రాంతంలో అనవసరంగా ఉన్న బారికేడ్లను సిబ్బంది తొలగించారు. అక్కడక్కడా ఘాట్ల వద్ద పోలీసులు కనిపిస్తున్నారు. మంగళవారంతో పోలిస్తే భక్తులు మెరుగు పడ్డారు. వీఐపీ ఘాట్లను సాధారణ భక్తులకు అందుబాటులో ఉంచారు. తొలిరోజే ఇలాంటి పని చేసి ఉంటే ప్రమాదం తప్పేదని భక్తులు అంటున్నారు. -
చిన్నారుల్లో క్షీణిస్తున్న ఫిట్నెస్
లండన్: నేటి తరం చిన్నారుల్లో ఫిట్నెస్ స్థాయి నానాటికీ క్షీణిస్తోందని ఓ అధ్యయనంలో తేలింది. ఇది గతంలో అనుకున్నదాని కంటే మరింత ఆందోళనకర స్థాయిలో ఉందని ఎస్సెక్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. 2009లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం గడిచిన పదేళ్లలో చిన్నారుల్లో ఫిట్నెస్ స్థాయి 8 శాతం క్షీణించిందని వెల్లడైంది. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య మరింత అధికంగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో రుజువైంది. మునుపటి కంటే ఈసారి తక్కువ బరువు గల 300 మంది పిల్లల్ని ఎంచుకున్నారు. వీరంతా 10 నుంచి 11 ఏళ్లవారు. వీరిలో దాదాపు అందరూ శరీర ద్రవ్యరాశి సూచీ (బీఎమ్ఐ) తక్కువగా ఉన్నవారే. అయితే ఆశ్చర్యకరంగా వీరు వేగంగా పరుగెత్తలేకపోయారట. దీనికి కారణం వీరిలో గుండె, ఊపిరితిత్తులు ఫిట్గా లేకపోవడమే అంటున్నారు పరిశోధకులు. గత అధ్యయనంలో ఊబకాయులు ఉన్నప్పటికీ వారి ఫిట్నెస్ స్థాయి మెరుగ్గా ఉందని, ప్రస్తుత చిన్నారుల్లో అది లోపించిందనీ.. దీంతో ఊబకాయానికి, ఫిట్నెస్కీ సంబంధం లేదనేది స్పష్టమవుతోందని అధ్యయన కర్త గావిన్ సాండర్కాక్ అన్నారు. -
పెట్రో ధరలను తగ్గించాలి
కాంగ్రెస్, సీపీఐ సహా విపక్షాల డిమాండ్ న్యూఢిల్లీ: పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సామాన్యుడి కష్టాల నుంచి లాభాలు గడించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి పెట్రోల్పై లీటరుకు రూ. 3.31, డీజిల్ ధరను లీటరుకు రూ. 2.71 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. కేవలం 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు భారీగా పెట్రో ధరలను పెంచటం సామాన్యులను, రైతులను దారుణంగా దెబ్బతీస్తోందని కాంగ్రెస్ పార్టీ సమాచార విభాగం ఇన్చార్జ్ రణ్దీప్ సుర్జేవాలా తప్పుపట్టారు. పెట్రోలుపై లీటరుకు అదనంగా రూ. 19.49 చొప్పున, డీజిల్పై లీటరుకు అదనంగా రూ. 15.11 చొప్పున వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది నవంబర్లో పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని, కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. డాలర్తో పోలిస్తే రూపాయి ధర పతనమవటం వల్ల పెట్రో ధరలు పెంచాల్సి వచ్చిందన్న ప్రభుత్వ వాదనలో నిజంలేదన్నారు. తాజా పెట్రో ధరల పెంపు ప్రజా వ్యతిరేకమని.. ఈ పెంపును తక్షణమే ఉపసంహరించాలని సీపీఐ డిమాండ్ చేసింది. -
తెలంగాణలో తగ్గిన విద్యుదుత్పాదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రోజువారీ ఉత్పత్తి దాదాపు 14 మిలియన్ యూనిట్లు పడిపోయింది. ఆదివారం ఉదయం రాష్ట్రంలోని థర్మల్ప్లాంట్ల నుంచి 44.29 మిలియన్ యూనిట్లు, హైడల్ ప్లాంట్ల ద్వారా 48.36 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పాదన జరిగింది. సోమవారం ఉదయం థర్మల్ కేంద్రాల నుంచి 37.86 మిలియన్ యూనిట్లు, హైడల్ ద్వారా కేవలం 41.62 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగినట్లు టీజెన్కో నివేదికలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ ఒకటో తేదీ నుంచిథర్మల్ప్లాంట్ల ద్వారా సగటున 45 మిలియన్ యూనిట్లు, హైడల్ ప్లాంట్ల ద్వారా 51 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఈ నెలలో ఇంత తక్కువ విద్యుత్తు ఉత్పత్తి జరగడం ఇదే మొదటి సారి. మరమ్మతులకోసం కొత్తగూడెంలోని పదో యూనిట్, మూడోయూనిట్లో విద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్కో నిలిపివేసింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశముంది. ఈ నెల 15న ఆయిల్ కంపెనీ ప్రతినిధులు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎంత మేర తగ్గించాలన్నది నిర్ణయించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మేరకు ధరలు తగ్గే అవకాశముంది. -
మోకాలి నొప్పికి ద్రాక్షతో చెక్
న్యూయార్క్: మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? అయితే రోజూ మీరు తీసుకునే ఆహారంలో ద్రాక్ష పళ్లను తీసుకోండి. మోకాలి నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ప్రతి రోజూ ద్రాక్ష తినడం వల్ల నరాలు, కీళ్లలో పటుత్వం పెరిగి మోకాలి నొప్పిని తగ్గడానికి ఉపయోగపడుతుందని ఓ పరిశోధనలో తేలింది. ద్రాక్షలో పోలీపినాల్స్ ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల కీళ్లలో పటుత్వం పెరగడంతో పాటు మోకాలి నొప్పిని తగ్గిస్తుందని అమెరికాలోని టెక్సాస్ ఉమెన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షానిల్ జుమా తెలిపారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న 72 మంది పురుషులు, మహిళలపై పరిశోధనలు నిర్వహించినట్టు వివరించారు. రోజూ ద్రాక్ష తినడం వల్ల వారి సమస్యలు నయమైనట్టు గుర్తించామని చెప్పారు. -
జీఎం కార్ల ధరలూ తగ్గాయ్
చెన్నై: జనరల్ మోటార్స్ కంపెనీ కార్ల ధరలను రూ.49,000 వరకూ తగ్గించింది. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో పలు కంపెనీలు వాహనాల ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా జనరల్ మోటార్స్ కూడా ధరలను తగ్గించింది. తాము విక్రయిస్తున్న ఆన్ని రకాల వాహనాలపై ధర లను రూ.12,000 నుంచి రూ.49,000 రేంజ్లో తగ్గిస్తున్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ గురువారం చెప్పారు. సుంకం తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందిస్తామన్నారు. షెవర్లే బీట్లో కొత్త వెర్షన్ను ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ఈ కొత్త వెర్షన్ ధరలు రూ.3.98-రూ.6.21 లక్షల (ఎక్స్ షోరూమ్, చెన్నై)రేంజ్లో ఉన్నాయి. ఈ కంపెనీ స్పార్క్, సెయిల్, సెడాన్ సెయిల్ యూ-వీఏ, ప్రీమియం సెడాన్ క్రూజ్, మల్టీ యుటిలిటీ వెహికల్స్-తవేరా, ఎంజాయ్, ఎస్యూవీ క్యాప్టివాలను విక్రయిస్తోంది.