Russian
-
రష్యాలో 9/11 తరహా దాడి!
కజాన్: అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ జంట ఆకాశహర్మ్యాలను విమానాలు ఢీకొట్టిన దాడి ఘటన వీడియో విశ్వవ్యాప్తంగా నాడు వైరల్ అయింది. ఇప్పుడు అలాంటి దాడి వీడియో ఒకటి వైరల్గా మారింది. తమ భూభాగాల దురాక్రమణకు దిగిన రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ ప్రతికార దాడులతో ప్రతిఘటిస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగా శనివారం రష్యాలోని టటారస్థాన్ పరిధిలోని కజాన్ నగరంలో జనావాస ప్రాంతాల్లో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు తెగబడింది.అందులో చూడ్డానికి అచ్చం చిన్నపాటి విమానంలా ఉన్న ఒక డ్రోన్ బహుళ అంతస్తుల బిల్డింగ్లో చివరి అంతస్తును ఢీకొనడం ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఆ వీడియోలోఉంది. ఆరు డ్రోన్లు జనావాసాలపై, రెండు పారిశ్రామికవాడలపై పడ్డాయని టటారస్తాన్ గవర్నర్ రుస్తమ్ మిన్నీకన్నోవ్ ప్రకటించారు. అయితే ఈ దాడిలో ఎలాంటి పౌర ప్రాణనష్టం జరగలేదని రష్యా చెబుతోంది. అయితే దాడుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కజాన్ విమానాశ్రయాన్ని మూసేశారు.ఈ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. ఆదివారం సైతం కజాన్ నగర ప్రజలు ఒకే చోట గుమికూడి ఉండొద్దని, జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లొద్దని గవర్నర్ రుస్తమ్ జాగ్రత్తలు చెప్పారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్పైకి రష్యా 113 డ్రోన్ల దాడులు చేసింది. అయితే వీటిల్లో 57 డ్రోన్లను నేలమట్టంచేశామని ఉక్రెయిన్ తెలిపింది. 56 డ్రోన్లను నిరీ్వర్యం చేశామని తెలిపింది. -
ఎంజాయ్ చేయడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నటి
చావు అనేది ఎప్పుడు ఎలా ఎందుకు వస్తుందో చెప్పడం కష్టం, ఊహించడం అంతకంటే అసాధ్యం. ఓ నటి కూడా సరదాగా ఎంజాయ్ చేద్దామని తనకు బాగా అచొచ్చిన ఓ టూరిస్ట్ ప్లేసుకి వెళ్లింది. కానీ విధిని మార్చలేక ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ విషయం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)రష్యన్ నటి కమిల్లా బెల్యట్సకయా.. రీసెంట్గా థాయ్లాండ్లోని కోహ్ సముయి అనే టూరిస్ట్ ప్రాంతానికి ప్రియుడితో కలిసి వెళ్లింది. ఎప్పటికప్పుడు ఇక్కడికి వెళ్లడం ఈమెకు అలవాటు. కాకపోతే ఈసారి అలా యోగా చేస్తుండగా.. భారీ రాకాసి అలలు వచ్చాయి. అవి ఈమెని సముద్రంలోకి లాక్కుపోయాయి. 15 నిమిషాల్లో రెస్క్యూ టీమ్ వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఫలితం లేకుండా పోయింది. చాలా కిలోమీటర్ల దూరంలో నటి మృతదేహం లభ్యమైంది.గతంలో ఇదే ప్రాంతాన్ని తన ఇల్లు, భూమ్మీదే బెస్ట్ ప్లేస్ అని సదరు నటి కమిల్లా చెప్పుకొచ్చింది. ఇప్పుడే అదే చోటులో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?) View this post on Instagram A post shared by Daily Mail (@dailymail) -
అతి పలుచని వాచీ
ప్రపంచంలోనే అతి పలుచని చేతి గడియారాన్ని తయారు చేయడానికి యూరోపియన్ హోరాలజీ దిగ్గజాలన్నీ తెగ పోటీ పడుతుంటేం రష్యాకు చెందిన ఓ స్వతంత్ర వాచ్ మేకర్ ఆ అద్భుతాన్ని సాధించేశాడు. ప్రతిష్ఠాత్మక అకాడెమీ హోర్లోగెర్ డెస్ క్రిటెపెండెంట్స్ ఇండిపెండెంట్స్లో ఏకైక రష్యన్ సభ్యుడైన కాన్స్టాంటిన్ చైకిన్ అనే వ్యక్తి అత్యంత పలుచనైన చేతి గడియారాన్ని రూపొందించారు. దీని మందం కేవలం 1.65 మిల్లీమీటర్లు. బరువైతే 13.3 గ్రాములే! ఆ లెక్కన ప్రపంచంలోనే అతి తేలికైన గడియారమూ ఇదే. గత వారం స్విట్జర్లాండ్లో జరిగిన ‘జెనీవా వాచ్ డేస్ ఫెయిర్’లో ఈ వాచీని ప్రదర్శించారు. స్టెయిన్లెస్ స్టీల్, టంగ్స్టన్ కార్బైడ్ వాడటంతో ఇది తేలిగ్గా ఉన్నా చాలా దృఢంగా ఉంటుంది.కాగితం ముక్కంత పలుచన.. విశ్వసనీయమైన, ఖచి్చతమైన, ధరించేంత మన్నికైన అ్రల్టా–స్లిమ్ గడియారాలను ఉత్పత్తి చేయడం ప్రపంచంలోని గడియారాల తయారీదారులకు ఓ సవాలుగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో పలుచని గడియారాల తయారీ పోటీ ఊపందుకుంది. స్విస్ బ్రాండ్ పియాజెట్ 2018లో 2 మిల్లీమీటర్ల మందం కలిగిన గడియారాన్ని తయారు చేసింది. ఇది రెండేళ్ల తరువాత ఉత్పత్తిలోకి వచి్చంది. లగ్జరీ దిగ్గజం బుల్గారి కేవలం 1.8 మిల్లీమీటర్ల మందంతో వాచీని తెచ్చింది. వీటిని తలదన్నుతూ వాచ్ మేకర్ రిచర్డ్ మిల్లే 2022లో కాగితం ముక్కంత పలుచనైన గడియారాన్ని తయారు చేసింది. దాని ఖరీదు 500,000 డాలర్లకు పై చిలుకే! పాకెట్ వాచ్ ప్రేరణతో... 2003లో తన పేరుతోనే వాచ్ మేకింగ్ బ్రాండ్ స్థాపించిన చైకిన్ 20 ఏళ్ల క్రితం 19వ శతాబ్దానికి చెందిన బాగ్నోలెట్ పాకెట్ వాచ్ను చూసి పలుచని వాచీలపై ఆసక్తి పెంచుకున్నాడట. సొంతంగా అల్ట్రాథిన్ వాచ్ డిజైన్ చేయాలని ఒక క్లయింట్ సవాలు చేయడంతో రంగంలోకి దిగాడు. ఇప్పుడు తయారు చేసిన బుల్లి వాచీకి మున్ముందు నీలమణి లేదా వజ్రాలను పొదిగే ఆలోచన ఉందట! అనేక పేటెంట్లకు దరఖాస్తులు చేసినా ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏప్రిల్లో జెనీవాలో జరిగే వాచ్స్ అండ్ వండర్స్ ట్రేడ్ షోలో తన డిజైన్ తుది వెర్షన్ను సమరి్పస్తానని చెబుతున్నాడు. అప్పటికల్లా తన డిజైన్ మరింత కచ్చితత్వం, పవర్ సంతరించుకుంటుందని చెప్పాడు. ఈ వాచీకి ఇంకా ధర నిర్ణయించలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాలోకి ఉక్రెయిన్ సేన.. ఇరుపక్షాల భీకర యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్నేళ్లుగా యుద్ధం నడుస్తోంది. అయితే ఇప్పుడు తొలిసారిగా ఉక్రేనియన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించింది. దీంతో రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్లో కలకలం చెలరేగింది. గత 36 గంటలుగా సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.దేశంలోని నైరుతి కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చొరబాటును కవ్వింపు చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. సరిహద్దుల్లో జరుగుతున్న దాడులపై రష్యా స్పందిస్తోందని క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఉక్రెయిన్ అధికారులు మౌనంగా ఉన్నారు. ఈ చొరబాటు తర్వాత ఉక్రెయిన్ సైన్యం వివిధ ఆయుధాలతో రష్యన్ పౌర భవనాలు, నివాస భవనాలు, అంబులెన్స్లపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా తెలిపారు.ఉక్రెయిన్ దాడి నేపధ్యంలో పుతిన్ అత్యున్నత రక్షణ, భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయంలో తగిన సమాధానం ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యాన్ని కోరారు. కుర్స్క్ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రివర్గాన్ని ఆదేశించారు. మాస్కోకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధం జరుగుతోంది.రష్యా ఆర్మీ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్తో పుతిన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ యుద్ధంలో సుమారు 100 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారని,200 మందికి పైగా గాయపడ్డారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. దీనికిముందు కుర్స్క్ తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ మాట్లాడుతూ యుద్ధంలో గాయపడినవారి కోసం స్థానికులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. తమ భూభాగంలోకి చొరబడి గత 36 గంటలుగా దాడులకు తెగబడుతున్న ఉక్రేనియన్ సైన్యాన్ని రష్యా ఆర్మీ ధైర్యంగా తిప్పికొడుతున్నదన్నారు. Ukraine has launched a major attack with Ukrainian troops into Russia in what appears to be its biggest and most serious incursion into the country since Moscow's full-scale invasion began in February 2022. https://t.co/2o5E3RAcIM— ABC News (@ABC) August 7, 2024 -
ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల దాడి.. 17 మంది మృతి!
ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా ప్రయోగించిన మూడు క్షిపణులు ఉత్తర ఉక్రెయిన్లోని చెర్నిహివ్లోని ఎనిమిది అంతస్తుల భవనంపై పడ్డాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 61 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. చెర్నిహివ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో రష్యా - బెలారస్ సరిహద్దులకు సమీపంలో ఉంది. యుక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం మూడవ సంవత్సరంలోకి ప్రవేశించించింది. ఈ యుద్ధంలో రష్యా తన సత్తా చాటుతోంది. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు అదనపు సైనిక సామగ్రిని అందించకపోవడంతో అది రష్యాతో తలపడలేకపోతోంది. ఇంతలో చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా తాము ఉక్రెయిన్కు ఐదు లక్షల ఫిరంగి షెల్స్ను పంపిణీ చేయనున్నమని ప్రకటించారు. పాశ్చాత్య దేశాలు తమ దేశానికి వాయు రక్షణ వ్యవస్థలను అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అభ్యర్థించారు. తమకు తగిన వాయు రక్షణ పరికరాలు ఇప్పటికే అందివుంటే, రష్యా దాడులకు తిప్పికొట్టేవారమని అన్నారు. క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు తమ దగ్గరున్న వాయు రక్షణ క్షిపణులు అయిపోయాయని జెలెన్స్కీ తెలిపారు. కాగా ఇటీవల రష్యా .. ఉక్రెయిన్లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లలో ఒకదానిని ధ్వంసం చేసింది. -
మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!
మంచుతో రకరకాల కట్టడాల నమూనాలను, శిల్పాలను రూపొందించడం తెలిసిందే! ఇవాన్ కార్పిత్స్కీ అనే బెలారష్యన్ కళాకారుడు ఏకంగా మంచుపడవనే రూపొందించాడు. ఇది పడవ ఆకారంలో రూపొందించిన కళాఖండం కాదు, నీళ్లల్లో ప్రయాణించగలదు. హిమశిల్పాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఇవాన్, ఏళ్ల తరబడి కఠోర సాధన చేసి రకరకాల హిమశిల్పాలను రూపొందిస్తుంటాడు. అవి కేవలం శిల్పాల్లాగానే కాదు, అచ్చంగా అసలు వాటిలా పనిచేసేలా రూపొందించడమే ఇవాన్ ప్రత్యేకత! తొలిసారిగా 2020లో అతడు మంచుతో వయోలిన్ తయారు చేసి, వార్తలకెక్కాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శీతకాలంలో మంచుగడ్డ కట్టే ప్రదేశాలకు వెళ్లి, అక్కడ మంచు శిల్పాలను తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈసారి శీతకాలంలో ఈ మంచుపడవను తయారు చేశాడు. బెలారష్యా రాజధాని మిన్స్క్ నగరానికి చేరువలో ఉండే స్న్యాన్స్కో రిజర్వాయర్ ఒడ్డున కూర్చుని ఇవాన్ ఈ పడవను తయారు చేశాడు. తయారీ పూర్తయ్యాక మంచుపడవలో కూర్చుని రిజర్వాయర్ నీటిలో చక్కర్లు కొట్టాడు. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
దశకుంచెల చిత్రకారుడు! ఏకాకాలంలో ఎడాపెడా..
ఎంతటి చేయితిరిగిన చిత్రకారుడైనా ఒకసారి ఒకే కుంచెను చేత్తో పట్టుకుని బొమ్మలు చిత్రించగలడు. అతి అరుదుగా కొందరు రెండు చేతులతోనూ చెరో కుంచె పట్టుకుని బొమ్మలు గీయడానికి ప్రయత్నించవచ్చు. అయితే, ఈ బెలారష్యన్ కళాకారుడు మాత్రం రెండు చేతులతోనూ పదికుంచెలు పట్టుకుని, వాటితో ఏకకాలంలో ఎడాపెడా కళ్లుచెదిరే బొమ్మలు చిత్రిస్తూ, చూసేవాళ్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు. ఈ కళాకారుడి పేరు సర్జీ ఫీలింగర్. మొదట్లో అందరిలాగానే పద్ధతిగా ఒకసారి ఒక కుంచె పట్టుకునే బొమ్మలు వేసేవాడు. ఇలా బొమ్మలు వేసేటప్పుడు ఒక్కోసారి ఒక్కో కుంచెను మార్చాల్సి వచ్చేది. బొమ్మ గీసే ప్రక్రియ ఆలస్యమయ్యేది. ఇదంతా చిరాకనిపించడంతో కాస్త వెరైటీగా ప్రయత్నిద్దామనుకున్నాడు. రెండు చేతుల వేళ్లకూ పది కుంచెలను తగిలించుకుని, వాటిని రంగుల్లో ముంచి ఏకకాలంలో పది కుంచెలతోనూ బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నట్లుగా సర్జీ బొమ్మలు అద్భుతంగా రావడం మొదలైంది. అతడు బొమ్మలు గీసే ప్రక్రియ మాత్రమే కాదు, అతడి బొమ్మలు కూడా సందర్శకులను ఆకట్టుకోవడంతో అనతి కాలంలోనే సెలబ్రిటీ పెయింటర్గా మారాడు. గడచిన రెండేళ్లలో సర్జీ తన బొమ్మలతో జర్మనీ, పోలండ్, ఇటలీల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ ప్రదర్శనల్లో అతడి పెయింటింగ్స్ కళ్లుచెదిరే ధరలకు అమ్ముడయ్యాయి. (చదవండి: ముక్కుతో 'ఈల' పాట విన్నారా? ఈ విలక్షణమే ఆమెను..) -
కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది మృతి
మాస్కో: రష్యా యుద్ధ విమానం కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖను వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు ఇంకా సమాచారం లేదు. Video | Russian Military Plane Carrying 65 Ukrainian Prisoners Of War Crashes Read More: https://t.co/87kc55f1PP pic.twitter.com/8gFgajhX5C — NDTV (@ndtv) January 24, 2024 రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక రవాణా విమానంగా అధికారులు గుర్తించారు. బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన సంభవించిందని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడారు. తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నానని చెప్పారు. అత్యవసర సహాయ సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి -
ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి: పుతిన్
మాస్కో: రష్యా జనాభాను పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మహిళలు ఎనిమిది మంది అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కనాలని, పెద్ద కుటుంబాలను ఏర్పరచాలని కోరారు. మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్లో ప్రసంగించారు. "మన పూర్వికులు చాలా మంది పిల్లలను కలిగి ఉండేవారు. మన అమ్మమ్మలు, ముత్తాతలలో చాలా మంది ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. వారంతా సాంప్రదాయక వారసత్వాన్ని కాపాడుకున్నారు. పెద్ద కుటుంబాలను ఏర్పరచడం మనకు ప్రస్తుతం తప్పనిసరి అవసరం. మన జాతి పునాదులకే గాక ఆద్యాత్మిక వారసత్వానికి ఇది ఎంతో ముఖ్యం" అని పుతిన్ అన్నారు. రష్యాలో గత కొన్ని ఏళ్లుగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధంలోనూ భారీ సంఖ్యలోనే మృతి చెందారు. ఈ వివరాలను పుతిన్ ప్రస్తావించలేదు కానీ ప్రస్తుతం జనాభా ఆవశ్యకతకు ఇది కూడా ముడిపడి ఉంది. రష్యా జననాల రేటు 1990ల నుండి గణనీయంగా పడిపోతోంది. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 3,00,000 వరకు ఉండవచ్చని నిపుణుల అంచానా. రష్యా విధానాలు నచ్చక 8,20,000-9,20,000 మంది ప్రజలు రష్యాను వీడి పారిపోయారని సమాచారం. ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్' -
రష్యా, హమాస్ ఒక్కటే: బైడెన్
న్యూయార్క్: హమాస్, రష్యా ఒకటేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను అంతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి అమెరికా ముందుంటుందని చెప్పారు. హమాస్, పుతిన్ వేరువేరు బెదిరింపులకు పాల్పడుతారు.. కానీ వారిరువురి లక్ష్యం ఒకటేనని దుయ్యబట్టారు. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 'ప్రపంచ పెద్దగా విచ్చిన్నకర రాజకీయాలకు స్థానం ఇవ్వబోము. హమాస్, పుతిన్ వంటి ఉగ్రవాద సంబంధ శక్తులను గెలవనీయబోము. వారి లక్ష్యాలను ఎప్పటికీ నేను అంగీకరించను. ప్రపంచాన్ని అమెరికా ఐక్యంగా ఉంచుతుంది. మన భాగస్వాములే అమెరికాను సురక్షితంగా ఉంచుతారు. మన విలువలు ఇతర దేశాలతో కలిసి పనిచేసేలా ఉంటాయి.' అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి నిధులను మంజూరు చేయాలని అమెరికా కాంగ్రెస్ను అభ్యర్థించారు. ప్రపంచ నాయకునిగా ఉండటానికి ఈ నిధులే పెట్టుబడులని అన్నారు. ప్రపంచానికి అమెరికానే దీపపు స్తంభం అని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పశ్చిమాసియాలో పర్యటించి వచ్చారు. కల్లోల పరిస్థితులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రపంచ అగ్రనేతగా తన ప్రాబల్యాన్ని చూపుతూ అమెరికా ఎన్నికల్లో ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నంలో బైడెన్ ఉన్నారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్లకు రూ.83,1,720 కోట్లు సహాయంగా ఇవ్వడానికి అమెరికా కాంగ్రెస్ను ఇప్పటికే అభ్యర్థించారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇజ్రాయెల్లో నోవా పండుగ వేళ హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు జరిపారు. ఇజ్రాయెల్ తిరగబడి ధీటుగా బదులిస్తోంది. గాజాను ఖాలీ చేయించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో ఇప్పటికే దాదాపు 5000 వేలకు పైగా మంది మరణించారు. యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతునిస్తోంది. అటు.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిక్రితం నుంచి కొనసాగుతోంది. ఇదీ చదవండి: Israel-Hamas conflict: ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛ -
సెంట్రో గ్రూప్ చేతికి రష్యా బ్యాంక్ - 50 శాతం వాటా కొనుగోలు
ముంబై: ఒక రష్యన్ బ్యాంకులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ సంస్థ సెంట్రో గ్రూప్ తాజాగా పేర్కొంది. సోవియట్ శకం ముగిసిన తదుపరి ఏర్పాటైన బ్యాంక్లో 50.001 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. 29ఏళ్ల బ్యాంకును దక్కించుకోవడం ద్వారా రుపీ–రూబుల్ వాణిజ్యానికి తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. భారత్తో వాణిజ్యం, లావాదేవీలు పుంజుకుంటున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య లావాదేవీలను సులభతరం చేసే లక్ష్యంతో ఉన్నట్లు సెంట్రో గ్రూప్ పేర్కొంది. రష్యాకు ప్రాధాన్యతగల భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తున్నట్లు తెలియజేసింది. పరస్పర నోస్ట్రో, వోస్త్రో ఖాతాలకు వీలుగా భారత బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలతో జత కట్టే యోచనలో ఉన్నట్లు సెంట్రో గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నవీన్ రావు వివరించారు. బ్రోకర్ లైసెన్స్, రష్యన్ రిటైల్ ఇన్వెస్టర్ లక్ష్యంగా ఎఫ్పీఐ లైసెన్స్ ద్వారా భారత్లో పెట్టుబడులకు వీలు కల్పించడం తదితర చట్టబద్ధ విధానాల ద్వారా బ్యాంకు సర్వీసులను విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. రూబుల్, రూపాయి చెల్లింపులకు మద్దతివ్వడం ద్వారా రెండు దేశాల వ్యక్తులు పరస్పర సందర్శనకు సహకరించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా యూపీఐ, రూపే కార్డ్ తదితర చెల్లింపుల విధానాలకు వీలు కల్పించనున్నట్లు వివరించారు. -
22 ఏళ్లుగా ఖైదీ.. విడుదల రోజే పరారీ!
ఒక నేరస్తుడు విడుదలకు కొద్దిసేపటి ముందు పరారైన ఉదంతం ఆసక్తికరంగా మారింది. నేరం, అరెస్టు, జైలు.. ఇదే దశాబ్దాలుగా నేరస్తులకు ఎదురవుతున్న క్రమం. అయితే కాలం గడిచేకొద్దీ దీనిలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు కోర్టులు నేరస్తులను నిర్ణీత కాలం తర్వాత విడుదల చేస్తున్నాయి. తద్వారా వారు వారికి నచ్చినట్టు మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది. అయితే ఒక నేరస్తుడు విడుదల కావడానికి కొన్ని గంటల ముందు పరారీ అయితే.. ఏం జరుగుతున్నదనేది ఊహించడం కష్టం. రష్యాలోని ఇర్కుట్స్క్ సమీపంలో ఉన్న మార్కోవా జైలులో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. కమోల్జోన్ కలోనోవ్ అనే ఖైదీ విడుదల కావాల్సిన రోజే జైలు నుండి తప్పించుకున్నాడు. కమోల్జోన్ కలోనోవ్ డబుల్ మర్డర్, దొంగతనం, అక్రమ ఆయుధాల సరఫరా, మందుగుండు సామగ్రిని కలిగి ఉండటం లాంటి క్రిమినల్ కేసులలో గత 22 సంవత్సరాలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆయన విడుదల కావాల్సిన రోజు రానే వచ్చింది. అయితే ఆ ఖైదీ అదే రోజున తెల్లవారుజామున 4 గంటలకు జైలు నుండి అదృశ్యమయ్యాడు. దీంతో జైలు అధికారులు సదరు ఖైదీ పరారైనట్లు ప్రకటించడంతో పాటుఅతనిపై మరొక కేసు నమోదు చేశారు. రష్యాలోని ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ప్రాంతీయ విభాగం అధికారులు ఈ ఉదంతం గురించి తెలియజేస్తూ ఖైదీ కమోల్జోన్ కలోనోవ్.. ఇర్కుట్స్క్ ప్రాంతంలోని జిమా నగరవాసి అని, పలు నేరాలలో ప్రమేయం ఉండటంతో జైలుకు తరలించారని తెలిపారు. 1997లో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే 2001లో అతను డబుల్ మర్డర్లో దోషిగా తేలడంతో అతనికి 22 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. తాజాగా అతను విడుదల కావాల్సిన రోజు రాగానే జైలు నుండి పరారయ్యాడు. ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ఆఫ్ రష్యా ప్రకారం కమోల్జోన్ కలోనోవ్ కఠినమైన శిక్షను అనుభవిస్తున్నాడు. విడుదలైన అనంతరం కమోల్జోన్ కలోనోవ్ను కూలీ పనులకు పంపనున్నారు. బహుశా ఈ పనులు చేయడం ఇష్టంలేకనే కమోల్జోన్ కలోనోవ్ పరారయ్యాడని జైలు అధికారులు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఇలా దాటేస్తున్నారు.. అందుకే మస్క్ బాధ పడుతున్నాడు! -
పూర్తిగా శాఖాహారిగా మారితే ప్రమాదమా? చనిపోతారా!
ఇటీవల "వేగన్" అంటూ పెద్ద ఎత్తున్న ప్రచారం అవుతోంది. శాఖాహారమే తిందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలు వెల్లువెత్తున్నాయి కూడా. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. గానీ ఏదైనా మనం మోతాదుకు మించి ఉపయోగించటమే సముచితం. ఎందుకంటే శాకాహారి అయినా, మాంసహారి అయిన దేన్నైనా లిమిట్గా తీసకుంటూ శరీర తత్వాన్న బట్టి వారికి అనువైన రీతిలో డైట్ ఫాలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. శృతి మించితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ఈ రష్యన్ మహిళే ఉదహారణ. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసింది అంటే.. అసలేం జరిగిందంటే..39 ఏళ్ల శానా శామ్సోనోవా అనే రష్యన్ మహిళ గత కొన్నేళ్లు వేగన్ రాఫుడ్ కోసం ప్రచారం చేస్తోంది. ఎప్పటి కప్పుడూ తాను ఏవిధంగా పూర్తి స్థాయిలో రా శాకాహారం తింటుందో సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతుంది. ఒక దశాబ్దంపాటు ఆ డైటే ఫాలో అయ్యింది. ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి వేగన్గా మారడం అంటే వాళ్లు కనీసం ఆవు లేదా గెదే పాలు తాగారు, సోయాబీన్స్ వంటి వాటికి సంబంధించిన పాలే తాగుతారు. ఐతే శానా శామ్సోనోవా శాకాహారం అంటే మరీ ఘోరంగా ఆయిల్ లేనివి, కేవలం పచ్చి కూరగాయాలు, వాటితో చేసిన వంటకాలు అంతే తీసుకునేది. అది ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎంతలా అంటే అస్థిపంజరం మాదిరిగా అయ్యేంత దారుణ స్థితికి తీసుకొచ్చింది. పోనీ అప్పుడైన కాస్త డైట్ మార్చి కొవ్వులతో కూడిన ఫుడ్ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం ఆరోగ్యం కుదుటపడేంత వరకు ప్రోటీన్లతో కూడిన అన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నా బావుండేది. అలా చేయకపోవడంతో కాళ్లు వాపుకి గురై లేచి నడవలేనంత స్థితికి వెళ్లిపోయింది. చివరికి ఆస్పత్రి పాలై ప్రాణాల కోసం పోరాడుతూ చనిపోయింది. పాపం ఆమె తల్లి కూడా తన కూతురు పూర్తి స్థాయిలో శాకాహారం తీసుకుని చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. చివరి స్టేజ్లో ఆకలివేసినా.. తినలేని దయనీయ స్థితికి చేరుకుని చనిపోయినట్లు వెల్లడించింది. ఏ డైట్ అయినా ఆరోగ్యకరమైన రీతిలో మన శరీరీం యాక్స్ప్ట్ చేసేంత మోతాదులో తీసుకోవాలి. తీసుకుంటుంది శాఖాహార అయినప్పుడూ కొవ్వులు లభించే నట్స్ వంటివి తీసుకోవాలి. అలాగే కాస్త శరీరానికి బలం చేకూర్చేలా కూరల్లో ఆయిల్ చేర్చాలి. అంతేగాని 'వేగన్' పేరుతో ఇలా పూర్తిగా కూరగాయాలు అంటూ పిచ్చిపిచ్చిగా ఫాలో అయితే ఇలానే చెయిచేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నవారవుతారు. దయచేసి శాకాహారం లేదా మాంసహారి అయినా సరైన రీతిలో డైట్ ఫాలో అవ్వండి లావు అవుతామనో లేదా ఫిగర్ మెయింటైన్ చేయడం కోసం అనో మరింతగా నోరు కట్టేసుకునేలా డైట్లు చేసి ప్రాణాలను కోల్పోవద్దు. (చదవండి: పీచే కదా అని తీసిపడేయకండి!) -
మహిళలూ.. ఇది సరైన పద్ధతి కాదు.. రష్యా మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహిళలు పిల్లలను కనడం కంటే విద్య, భవిష్యత్తుపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇది సరైన పద్దతి కాదంటూ రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలో మృతుల సంఖ్య కంటే జననాల సంఖ్య తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఆ దేశ దిగువ సభలోని ప్లీనరీ సమావేశంలో మురాష్కో మాట్లాడారు. మహిళలు చదువుకోవాలి, ఉన్నతోద్యోగం సాధించాలి, ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాతే పెళ్లి చేసుకోవాలనే మనస్తత్వం సమాజంలో బాగా నాటుకుపోయిందన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మహిళలు పిల్లల్ని కనడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆలస్యంగా పిల్లలను కనడం అనేక అనర్థాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. చదవండి: పుతిన్ను అరెస్టు చేస్తే.. రష్యాతో యుద్దం తప్పదు: సౌతాఫ్రికా అధ్యక్షుడు లేటుగా సంతానం కోసం ప్రయత్నించడం వల్ల అనేక సమస్యలు వస్తాయన్న మంత్రి.. ఈ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గర్భస్రావాల కోసం వాడే ఔషధాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, వాటిని నియంత్రించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. -
అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?
మోదీ అమెరికా పర్యటన వేళ.. రష్యాతో భారత్కు ఉన్న బంధంపై సర్వత్రా చర్చ నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యాతో భారత్కు ఉన్న బంధంపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ పెదవి విప్పారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. 'ఇండియాను తటస్థం అంటారు.. కానీ మా స్థితి అది కాదు.. మేము శాంతి పక్షాన నిలబడతామని' ప్రధాని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరి సరిగాలేదనే వాదనలను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ప్రతీ దేశం గౌరవించాలని సూచించారు. ప్రతీ దేశ సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు గౌరవించాలని పేర్కొన్నారు. దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి భారత్ తగిన ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు. అయితే.. ఇటీవలి కాలంలో అమెరికాతో భారత్ బంధం మరింత బలోపేతమైంది. 2022 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డ్ స్థాయిలో 191 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియాకు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అమెరికా మూడో స్థానంలో ఉంది. అటు.. రష్యాతోనూ భారత్ మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. ఇండియా రక్షణ దిగుమతుల్లో 50 శాతం రష్యా నుంచి వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు బయల్దేరారు. మూడురోజులపాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. సతీసమేతంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్తున్న సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక ఒప్పందాల బలోపేతం ప్రధానాంశంగా అమెరికా పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇదీ చదవండి: PM Modi US Visit: అమెరికాకు బయల్దేరిన ప్రధాని మోదీ.. బిజీ బిజీ షెడ్యూల్ ఇలా -
ష్..! దేశమంటే ప్రాణం.. ఇది పుతిన్లో మరో కోణం..!
దేశమంటే ప్రాణం.. జాతీయ గీతం అంటే గౌరవం.. ఇదీ పుతిన్ నమ్మిన సిద్ధాంతం. ఓ వైపు పశ్చిమ దేశాలన్నీ కలిసి పగబట్టినా.. పట్టు వీడని మనస్థత్వం ఆయనది. ప్రపంచంలో రష్యా దేశ స్వాభిమానాన్ని నిలపడంలో అలిసిపోకుండా పోరాడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ చిన్న విషయంలోనూ దేశ ప్రేమను వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ చిన్న సంఘటనతో దేశానికి ఆయన ఇచ్చే గౌరవం ఎంతటిదో అర్ధమవుతుంది. సెయింట్ పీటర్బర్గ్లో నిర్వహించిన ఓ జాతీయ వేడుకలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలియం రిఫైనరీ కంపెనీ గాజ్ప్రోమ్ నెఫ్ట్కు చెందిన అధికారి ఎలెనా ఇల్యుఖినాతో కలిసి పడవపై నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ గీతం ఆలాపన ప్రారంభమైంది. అదే సమయంలో పుతిన్తో ఎలెనా చర్చను ప్రారంభించారు. జాతీయ గీతానికి గౌరవంగా నిలబడిన పుతిన్..మాట్లాడొద్దంటూ మూతిపై వేలు చూపించారు. తప్పు చేసినదానిలా భావించిన ఎలెనా.. నిశ్శబ్దంగా పుతిన్ పక్కన నిలబడ్డారు. 22 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Vladimir Putin 😎 reminds his talkative host not to speak during the Russian National Anthem pic.twitter.com/xMf7W8FeVH — Megh Updates 🚨™ (@MeghUpdates) June 18, 2023 అధ్యక్షుల వారి ఆంతర్యమేంటో..! మరో వేడుకలో పుతిన్ ఆ దేశ రక్షణ మంత్రికి వీపు చూపించిన వీడియో కూడా ఇటీవల బాగా వైరల్ అయింది. సైనికులకు బహుమతులు ఇవ్వడానికి మిలిటరీ ఆస్పత్రికి వెళ్లిన పుతిన్.. సైనికులతో మాట్లాడతారు. ఈ క్రమంలో పక్కనే నిల్చున్న రక్షణ మంత్రి సెర్జీ షోయిగు వైపు చూసి వెంటనే ముఖం తిప్పుకున్నారు. అంతటితో ఆగకుండా షోయిగుకు వీపు చూపించారు. వెనకనే ఉన్న మంత్రి ఎలా స్పందించాలో తెలియక తికమకపడ్డారు. దేశమే ప్రధానం.. ఆ తర్వాతే పుతిన్కు ఎవరైనా అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతుంది. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అధ్యక్షుల వారీ ఆంతర్యమేంటో అని కామెంట్లు పెట్టారు. రక్షణ మంత్రి ఉద్యోగం ఊడినట్టేనని ఫన్నీగా స్పందించారు. అయితే.. ఉక్రెయిన్తో యుద్ధంలో సరైనా విజయాలు సాధించట్లేదనే మంత్రిపై ఆ విధంగా పుతిన్ ప్రవర్తించారని మరికొందరు కామెంట్ చేశారు. You don't have to be a body language expert to understand what Putin currently thinks about his Defence Minister Sergei Shoigu... 😅 pic.twitter.com/ZRfJaJDE1X — Jimmy Rushton (@JimmySecUK) June 12, 2023 ఇదీ చదవండి:రష్యా అధ్యక్షుడికి తిక్క రేగింది.. భారీ క్షిపణులతో దాడి.. -
ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంతగడ్డ మీద రష్యా మిసైళ్ళ దాడి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: సోమవారం అర్ధరాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంత ఊరు క్రైవీ రిహ్ పట్టణం మీద రష్యా మిసైళ్ళతో దాడి చేసింది. డెనిప్రో పెట్రోవ్స్క్ పరిసర ప్రాంతాల్లో జనావాసాలపై జరిగిన ఈ దాడిలో ఆరుగురు మరణించగా కనీసం 25మంది తీవ్ర గాయాలు పాలై ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. మృతులు పెరగొచ్చు.. రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలను తిరిగి సాధించుకునే పనిలో ఉన్న ఉక్రెయిన్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది రష్యా. సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ సొంత పట్టణమైన క్రైవీ రిహ్ లో మిసైళ్ళతో జనావాసాలపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో ప్రధానంగా ఒక ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగి నేలకూలింది. ఇదే భవనంలో ఆరుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా జరుగుతున్నాయని శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని తెలిపారు స్థానిక మేయర్ ఒలెగ్జాండర్ విల్కుల్. దారుణమైన దృష్యాలు.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంఘటన తాలూకు ఫోటోలను కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేశారు. రష్యా తీవ్రవాదులు జనావాసాలపైన, సామాన్య నగరాల పైన దాడులకు తెగబడ్డారని రాసి ఫోటోలు జతచేశారు. శిధిలమైన ఐదంతస్తుల భవనం, ఛిద్రమైన వాహనాలతో కూడిన ఈ ఫోటోలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: అలర్ట్: ప్రపంచంలో టాప్-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్లోనే.. -
టూరిస్టును సొర మింగేసింది.. కన్న తండ్రి కళ్లముందే.. క్షణాల్లోనే..
ఈజిప్టు: ఈజిప్టులోని హుర్ఘదా రీసార్ట్ సమీపంలో ఓ భయానక ఘటన జరిగింది. ఎర్రసముద్రం ఒడ్డున ఈతకొడుతున్న రష్యా పర్యాటకున్ని షార్క్ చేప మింగేసింది. దీంతో స్థానిక పర్యాటకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వ్లాదిమిర్ పొపోవ్(23) తన కుటుంబంతో సహా విహారానికి హుర్ఘదాలో బీచ్కు వచ్చారు. ఈ క్రమంలో వ్లాదిమిర్ తన గర్ల్ఫ్రెండ్తో కలిసి సముద్ర ఒడ్డున ఈత కొడుతున్నారు. ఇంతలోనే ఆ ప్రాంతంలో ఓ సొరచేప ప్రత్యక్షమయింది. భయంతో వారు వేగంగా ఈదినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వ్లాదిమిర్ను సొర మింగేసింది. అయితే.. అతని గర్ల్ఫ్రెండ్ మాత్రం తప్పించుకోగలిగింది. రెస్క్యూ సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే అంతా అయిపోయిందని స్థానికులు చెబుతున్నారు. Tourists stunned watching a Tiger Shark chomping a Russian tourist who was out on a swim at an Egypt beach resort 23YO Vladimir Popov died in the attack, girlfriend escaped alive. Shark has been captured & killed pic.twitter.com/xUsitoCN5X — Nabila Jamal (@nabilajamal_) June 9, 2023 బాధితుడు సొర నుంచి తప్పించుకునే క్రమంలో రక్షించమని తన తండ్రి కోసం ఆర్తనాదాలు చేశాడు. ఒడ్డున ఉన్న అతని తండ్రి చూస్తుండగానే ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. నిస్సహాయ స్థితిలో బాధితుని తండ్రి విలపించారు. రక్షించమని స్థానికులను వేడుకున్నారు. కానీ నిమిషాల్లోనే అతని కుమారున్ని సొర మింగేసింది. దీంతో అంతా షాక్కు గురయ్యామని స్థానిక పర్యాటకులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇదీ చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా! -
20 వేలమందిని బఖ్ముత్లో కోల్పోయాం
కీవ్: తూర్పు ఉక్రెయిన్లోని బఖ్ముత్ నగరంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రైవేట్ సైన్యమైన ‘వాగ్నర్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ సేనలతో జరిగిన పోరాటంలో 20,000 మందికిపైగా సైనికులను కోల్పోయామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా ప్రభుత్వం ఖైదీలకు, వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నవారికి కొంత శిక్షణ ఇచ్చి, ప్రైవేట్ సైన్యంగా మార్చి, ఉక్రెయిన్లో యుద్ధ రంగానికి పంపిస్తున్న సంగతి తెలిసిందే. బఖ్ముత్లో గత తొమ్మిది నెలలుగా సాగుతున్న హోరాహోరీ యుద్ధంలో ఉక్రెయిన్ జవాన్లు ఎంతమంది మరణించారన్నది తెలియరాలేదు. దీనిపై ఉక్రెయిన్ సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పది వేల మందికిపైగానే ఉక్రెయిన్ సైనికులు మరణించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్ల వర్షం
-
విషాదం.. ప్రమాదంలో ప్రముఖ పాప్ సింగర్ మృతి
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. రష్యా పాప్ సింగర్ సింగర్ దిమా నోవా(34) ప్రమాదంలో మృతి చెందారు. తన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించిన దిమా నోవా రష్యా-ఉక్రెయిన్ యుద్ద సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై విమర్శలు చేస్తూ పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తన గాత్రంతో ఎంతో ఆదరణ పొందిన దిమా నోవా ఆకస్మిక మరణంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొనుగోలు.. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. దిమా నోవా అసలు పేరు దిమిత్రి విర్గినోవ్. చిన్ననాటి నుంచే తన గానంతో అలరిస్తున్న దిమా నోవా ‘క్రీమ్ సోడా’ అనే మ్యూజిక్ సంస్థను నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 19న తన సోదరుడు, స్నేహితులతో ఫ్రోజన్ వోల్గా నది దాడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దిమా నోవా, అతడి స్నేహితులు, సోదరుడు మంచు కురుకుపోయారు. చదవండి: అమ్మ ప్రెగ్నెంట్ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి ఈ క్రమంలో ఊపరి ఆడక ఆయన చనిపోయినట్లు రష్యన్ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంగా గాయపడిన తన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మిగిలిన వారు ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కాగా దిమా నోవా ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ తన సంగీతం, పాటలతో పుతిన్ను విమర్శించేవాడు. ఈ క్రమంలోనే అక్వా డిస్కో అనే పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అప్పట్లో ఈ పాట పెద్ద వివాదం కూడా అయ్యింది. రష్యాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవారు ఈ పాట పాడుతూ నిరసనలు తెలిపేవారు. -
రష్యా క్రూడాయిల్పై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముడి చమురు ఎక్కడ చౌకగా లభిస్తే అక్కడే కొనుగోలు చేసేందుకు ఒక సార్వభౌమ దేశంగా భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. అందుకే రష్యా నుంచి చౌక క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. అదే గల్ఫ్ దేశాల నుంచి మరింతగా కొనుగోలు చేసి ఉంటే ధరలు భారీగా పెరిగిపోయి ఉండేవని మంత్రి చెప్పారు. రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురును కొనుగోలు చేయడంపై పాశ్చాత్య దేశాల్లో ’అసంతృప్తి’ ఏమీ లేదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. (ఇదీ చదవండి: Techlayoffs: దేశీయ ఐటీ నిపుణులకు భారడిమాండ్) పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లను పక్కనపెట్టి రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘భారీ వినియోగదారుగా భారత్ అన్ని అవకాశాలనూ వినియోగించు కుంటోంది. సమీప భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగిస్తుంది. మనం రష్యా చమురును కొనుగోలు చేస్తుండటం వల్ల పాశ్చాత్య దేశాలేమీ అసంతృప్తిగా లేవు. ఎందుకంటే మనం రష్యా ఆయిల్ను కొనకపోతే గల్ఫ్ దేశాల నుంచి మరింతగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడు క్రూడాయిల్ రేట్లు మరింతగా పెరిగిపోయేవి‘ అని ఆయన తెలిపారు. గతంలో 27 దేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయగా, ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో 39 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. (ఫ్లాగ్స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు ) గతేడాది మార్చి వరకూ భారత్కు రష్యా నుంచి చమురు దిగుమతులు 0.2 శాతంగానే ఉండేవి. పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాలతో పోలిస్తే రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. అయితే, ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో పరిస్థితులు మారి పోయాయి. రష్యా తమ క్రూడాయిల్ను మార్కెట్ రేటుకన్నా తక్కువకే భారత్కు విక్రయిస్తోంది. దీంతో ఇతర దేశాల ఒత్తిళ్లను పక్కన పెట్టి భారత్.. రష్యన్ ముడిచమురు వైపు మొగ్గు చూపుతోంది. -
India Buying Russian Oil: భారత్ని నిందించలేం! అది మా పని కాదు!
రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తున్న భారత్ గురించి జర్మన్ రాయబారి ఫిలప్ అకెర్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం గురించి భారత్ని నిందించలేనని స్పష్టం చేశారు. రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీ అనుసరిస్తున్న విధానం సౌకర్యవంతంగా ఉందని యూఎస్ చెప్పిన కొద్ది వారాల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం విషయమై భారత్ని విమర్శించలేను, అది మాకు అనవసరమైన విషయం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయం దీనిలో తాము జోక్యం చేసుకోమని తెగేసి చెప్పారు. అంతేగాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగే తగిన అభ్యర్థి భారతేనని, దానికి ఆ నైపుణ్యం, దౌత్యం ఉన్నాయని జర్మన్ రాయబారి అకెర్ మాన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన తర్వాత నుంచి పాశ్చాత్య దేశాలు రష్యా చమురు కొనుగోలును తగ్గించాయి. కానీ చైనా, యూఎస్ తర్వాత ప్రపంచంలో మూడవ అతి పెద్ద ముడి చమురు దిగుమతి దారు అయిన భారత్ మాత్రం రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నా.. మంచి డీల్ లభించిన చోట చమురు కొనుగోలు చేస్తూనే ఉంటామని కరాఖండీగా చెప్పింది. ఐతే రష్యా చమురుపై పరిమితి విధించిన జీ7 దేశాలకు మద్దతివ్వకుండా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. భారత్లో రష్యన్ చమురు దిగుమతులు జనవరిలో రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల బారెళ్లకు చేరాయి. మాస్కో ఇప్పటికి న్యూఢిల్లీకి చమురు అమ్మకందారుగా ఉంది. దీంతో భారత్లో రిఫైనర్లు రష్యా కీలక చమురు క్లయింట్గా ఉద్భవించాయి. అంతేగాదు భారత్ ఐరోపా, యూఎస్ కోసం ఇంధనాన్ని శుద్ధి చేస్తోంది కూడా. ఐతే శుద్ధి చేసిన ఇంధనం రష్యన్కి చెందినదిగా పరిగణించబడదు. అదీగాక ముడి చమురును సాధ్యమైనంత వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయడం కోసం రష్యాతో భారత్ కఠినమైన భేరాన్నే కుదుర్చుకుంది. దీంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని..ఇంధన భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో వాషింగ్టన్ న్యూఢిల్లీతో సౌకర్యవంతంగా ఉందని బైడెన్ పరిపాలనాధికారి తెలిపారు. (చదవండి: బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్లో పరిణామాలపై బ్రిటన్ స్పందన) -
అర్జెంటీనాకి తరలిపోతున్న రష్యన్ మహిళలు..వెలుగులోకి కీలక నిజాలు..
రష్యాలో గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వెళ్లిపోతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చాలా మంది గర్భిణీ మహిళలు తరలి వెళ్లిపోతున్నట్లు సమాచారం. వారంతా అర్జెంటీనా పౌరసత్వం కోసం అక్కడికి వెళ్లి ప్రసవించాలని భావిస్తున్నారట. అదీకూడా ఈ యుద్ధ సమయంలోనే సుమారు 5 వేల మంది దాక రష్యన్ గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వచ్చారని, వారంతా అర్జెంటీనా పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అర్జెంటీనాకు వస్తున్న రష్యా మహిళల సంఖ్య పెరిగిందని కూడా చెప్పారు. కేవలం ఒక్క గురువారం సుమారు 33 మంది మహిళలు అర్జెంటీనాకు వచ్చినట్లు తెలిపారు. ఐతే వారిలో ముగ్గురు వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. తొలుత రష్యన్ మహిళలు తాము పర్యాటకులుగా అర్జెంటీనాకి వస్తున్నాం అని చెబుతున్నట్లు సమాచారం. అర్జెంటీనా రష్యా కంటే ఎక్కువ స్వేచ్ఛగా ఉండటంతో మాస్కో మహిళలంతా తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం ఉండాలిని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే అర్జెంటీనా వీసా హోల్డర్స్ 171 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు, కానీ రష్యా వీసా కలిగి ఉంటే కేవలం 87 దేశాలు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అర్జెంటీనా పోలీసులు అరెస్టు చేసిన ఆ ముగ్గురు మహిళల తరుఫు న్యాయవాది తప్పుడు పర్యాటకులు అన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అదీగాక ఒక రష్యాన్ వెబ్సైట్ దక్షిణ అమెరికా దేశంలో ప్రసవించాలనుకుంటే తల్లులకు వివిధ ప్యాకేజీలు అందిస్తున్నట్లు అర్జెంటీనా అధికారులు పేర్కొన్నారు. ఇదోక మిలియన్ డాలర్ల అక్రమ వ్యాపారమని అధికారులు వెల్లడించారు. ఈ వెబ్సైట్ రష్యన్ మహిళలకు, వారి భాగస్వామ్యులకు అర్జెంటీనాలో స్థిరపడేలా నకిలీ పత్రాలను జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఐతే ఇప్పటి వరకు ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. (చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం) -
నో డౌట్! రష్యా గెలుపు పక్కా!: పుతిన్
ఉక్రెయిన్పై రష్యా దాడి చేసి సరిగ్గా ఏడాది అవుతున్న తరుణంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పుతిన్ తాము కచ్చితంగా ఉక్రెయిన్పై విజయం సాధిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమాగా చెప్పారు. అనేక పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ రష్యా దళాలు కచ్చితంగా విజయం సాధిస్తాయని చెప్పారు. లెనిన్గ్రాడ్ ముట్టడిని సోవియట్ దళాలు ఛేదించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరాన్ని పుతిన్ సందర్శించారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ అక్కడ ఒక కర్మాగంలో కార్మికులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రజల ఐక్యత, సంఘీభావం, యోధుల ధైర్యం, వీరత్వం, సైనిక పరిశ్రమ తదితరాల రీత్యా కచ్చితంగా తమకు గెలుపును తెచ్చిపడతాయని విశ్వాసంగా చెప్పారు. అంతేగాదు పుతిన్ క్షిపణి తయారుదారు అల్మాజ్ ఆంటెలో భాగమైన ప్లాంట్లో ప్రసంగిస్తూ రష్యా రక్షణ పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవలే ఉక్రెయిన్లో రష్యా టాప్ కమాండర్ని నియమించిన కొద్దిరోజుల్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదీగాక రష్యా ప్రత్యేక 'సైనిక ఆపరేషన్' పేరుతో ఉక్రెయిన్పై దురాక్రమణ దాడికి దిగి సరిగ్గా ఏడాది కావస్తున్న తరుణంలో రష్యాలో ఒకింత భయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సమర్థింపు చర్యగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఉక్రెయిన్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. మంత్రితో సహా 16 మంది దుర్మరణం) -
ఉక్రెయిన్లో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం
ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెలుపల ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ తోసహా సుమారు 16 మంది మృతి చెందారని ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారుల ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటన కీవ్కి ఈశాన్యంగా సుమారు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న బ్రోవరీ పట్టణంలోని కిండర్గార్డెన్ సమీపంలో జరిగింది. వాస్తవానికి రష్యా దళాలు ఉపసంహరించుకునే వరకు ప్రారంభ దశల్లో రష్యా, ఉక్రెనియన్ దళాలు ఈ బ్రోవరీ పట్టణంపై నియంత్రణ కోసం తీవ్రంగా పోరు సలపడం గమనార్హం. ప్రస్తుతం ఘటనాస్థలంలో వైద్యులు, పోలీసులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో సంఘటనా స్థలంలో బాధితుల కేకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. 🇺🇦🚁🔥A kindergarten destroyed as a result of a helicopter crash pic.twitter.com/WZx2Bk5ArN — AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) January 18, 2023 (చదవండి: ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!) -
రష్యాలో ఒకరి తర్వాత ఒకరు.. అపర కుబేరులు ఎందుకు చనిపోతున్నారు?
రష్యాలో అపర కుబేరులు హఠాత్తుగా చనిపోతున్నారు. అంత్యంత అనుమానస్పదంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. కోట్లకు పడగలెత్తిన వారేఎందుకిలా చనిపోతున్నారో అంతు చిక్కడం లేదు. ఒక్క రష్యాలోనే కాదు ఇతర దేశాల్లోనూ రష్యన్ కుబేరులు మిస్టీరియస్గా తలలు వాల్చేస్తున్నారు. ఇవన్నీ ఆత్మహత్యలేనని పుతిన్ ప్రభుత్వం అంటోంది. అయితే మరణాలు జరిగిన తీరు చూస్తే మాత్రం ఇవి హత్యలేమో! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? లేక సహజ మరణాలా? హత్యలైతే వీటి వెనుక ఉన్న కుట్రదారు ఎవరు? సూత్రధారి ఎవరు? హంతకులు ఎవరు? ఏంటీ డెత్ మిస్టరీ? డిసెంబరు 24న మన పొరుగునే ఉన్న ఒడిషాలోని రాయగడలోని ఓ హోటల్ కిటికీ నుంచి పడి రష్యాకు చెందిన ఎంపీ, మల్టీ బిలియనీర్ పావెల్ ఆంటోవ్ అనుమానస్పద స్థితిలో మరణించారు. దీనికి రెండు రోజుల ముందే అంటే డిసెంబరు 22న ఇదే హోటల్లో ఆంటోవ్ సన్నిహితుడు అయిన మరో రష్యన్ వ్లదిమీర్ బిడెనోవ్ గుండెపోటుతో మరణించారు. ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు రష్యన్లు డిసెంబరు 21న ఈ హోటల్ లో దిగారు. ఆంటోవ్ 66వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోడానికి ప్రశాంతంగా ఉండే రాయగడ ప్రాంతాన్ని ఎంచుకున్న నలుగురు స్నేహితులు కలిసి ఇక్కడకు వచ్చారు. బిడెనోవ్ మరణంతో షాక్ తిన్న ఆంటోవ్ డిప్రెషన్లో పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండచ్చన్నది పోలీసుల అనుమానం. అయితే ఈ రెండూ కూడా సహజ మరణాలో ఆత్మహత్యలో కావని ఇవి కచ్చితంగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్లేనని మరి కొందరు అంటున్నారు. ఇంకో చిత్రం ఏంటంటే ఆంటోవ్ చనిపోయిన రోజే సెయింట్ పీటర్స్ బర్గ్ లోఅడ్మిరల్లీ షిప్ యార్డ్స్ డైరెక్టర్ జనరల్ అలెక్జాండర్ బుజకోవ్ హఠాత్తుగా మరణించారు. ఆయన మరణానికి కారణాలేంటన్నది కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు. వెనకున్నదెవరు? ఏంటీ మరణాలు? వీటి వెనుక ఏమన్నా కుట్ర ఉందా? కిరాయి హంతకులు ఉన్నారా? ఉంటే ఆ హంతకుల వెనుక ఉన్నదెవరు? ఎందుకంటే చనిపోయిన ఈ ముగ్గురూ కూడా మామూలు మనుషులు కారు. ఆంటోవ్ అయితే రష్యాలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడు. వ్యాపారాల్లోనూ దిట్ట. మిగతా వారూ మల్టీ బిలియనీర్లే. ఒక వేళ వీరివి హత్యలే అయితే.. వీరిని హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కోట్లకు పడగలెత్తిన వీరిని హతమార్చడానికి కిరాయి హంతకులను కుదుర్చుకోగల సత్తా ఎవరికి ఉంటుంది? కచ్చితంగా ఈ కోటీశ్వరులను తలదన్నే పెద్దలే దీని వెనుక ఉండే అవకాశాలు ఉంటాయి. రష్యాలో ఇలా అనుమానస్పదంగా ప్రాణాలు వదిలేస్తోన్న కుబేరుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? పెద్ద సస్పెన్స్ హర్రర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ను మరిపించే ఈ వరుస మిస్టీరియస్ డెత్స్ వెనుక ఉన్న కథేంటి? ఇదే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఈ ఒక్క నెలలోనే అయిదుగురు రష్యన్ కుబేరులు అనుమానస్పదంగా మరణించారు. మొత్తం మీద ఏడాదికాలంగా 22 మంది రష్యన్ ప్రముఖులు భయానకంగా చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రష్యాలోని ప్రముఖ చమురు , సహజ వాయువు కంపెనీల్లో అత్యున్నత హోదాల్లో ఉన్నవారే కావడం గమనార్హం. గ్రాజ్ పోమ్, నోవాటెక్ వంటి ఆయిల్ కంపెనీలు రష్యాలో వ్యాపారాలను శాసిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలకు చెందిన కుబేరులు అనుమానాస్పదంగా మరణించిన వారిలో ఉండడం విశేషం. చనిపోయిన వారిలో చాలా మంది తాము ఉన్న అపార్ట్మెంట్పై అంతస్థుల కిటికీలనుండి కిందకు పడి చనిపోయారు. కొందరయితే తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. కొద్ది మంది గుండెపోటుతో మరణించినట్లు అధికారులు పేర్కొనగా ఒకళ్లిద్దరి విషయంలో మరణాలకు కారణాలు కూడా తెలీలేదు. కొందరి మరణాలు సంభవించిన తీరు మరీ భయంకరంగా ఉంది. ఇవన్నీ చూస్తే ఇవి నిజంగానే సహజ మరణాలా? ఆత్మహత్యలా? లేక కిరాయి హంతకులతో వీరిని ఎవరైనా తుదముట్టించారా? అన్న అనుమానాలు కలగక మానవు. విగత జీవులుగా భార్య పిల్లలు.. ఆయనేమో ఉరికి నోవాటెక్ కంపెనీ మాజీ డిప్యూటీ ఛైర్మన్ సెర్గీ ప్రోటో సెన్యా ఈ ఏడాది ఏప్రిల్లో కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లారు. అక్కడ ఓ లక్జరీ విల్లాలో బస చేశారు. ఓ రోజు ఉదయాన చూసే సరికి ప్రోటో సెన్యా విల్లా చూరుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. ప్రొటో సెన్యా భార్య, కూతురుల మృతదేహాలు విల్లాలో ఉన్నాయి. ఆ ఇద్దరి శరీరాలపైనా గొడ్డలితో నరికిన ఆనవాళ్లు ఉన్నాయి. అలాగే కత్తితో పొడిచిన గాట్లు కూడా ఉన్నాయి. ప్రొటో సెన్యానే తన భార్యా పిల్లల్ని రాక్షసంగా చంపేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని స్పానిష్ పోలీసులు అన్నారు. ఒకవేళ ప్రొటొ సెన్యా ఆత్మహత్య చేసుకుని ఉంటే ఎందుకు చేసుకుంటున్నాడో ఓ లేఖను పెట్టే వాడు. కానీ ఈ విల్లాలో ఎక్కడా కూడా సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఒక్కరోజు ముందే ప్రొటో సెన్యా విషాద మరణానికి ఒక్కరోజు ముందే ఏప్రిల్ 18న గ్యాజ్ ప్రోమ్ బ్యాంక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వ్లడిశ్లావ్ అవయేవ్ మాస్కోలనో తన అపార్ట్ మెంట్ లో భార్య పిల్లలతో సహా శవమై కనిపించారు. తన భార్య పిల్లల్ని కాల్చి చంపిన తర్వాత అవయేవ్ పిస్తోల్తో తనని తాను కాల్చుకుని చనిపోయి ఉండచ్చని భావిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే కంపెనీకి గతంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఇగోర్ వోలో బుయేవ్ అయితే అవయేవ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని అన్నారు. బహుశా వ్యవస్థలో చాలా పెద్దలకు సంబంధించిన కీలక సమాచారం ఏదో అవయేవ్ కు తెలిసి ఉంటుందని.. అది తమకి ప్రమాదమని భావించే వారి చేతిలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయని ఇగోర్ భావిస్తున్నారు. అనుమానస్పద మృతి అవయేవ్ మరణానికి ఇంచుమించు నెల రోజుల క్రితం మార్చి 23న మెడ్ స్టార్మ్ కంపెనీ అధినేత వాసిలీ మెల్నికోవ్ నోవో గొరోడ్ లోని తన అపార్ట్ మెంట్లో తన భార్య, ఇద్దరు కొడుకులతో సహా అనుమానస్పద స్థితిలో మరణించారు. వైద్య పరికరాల తయారీ కంపెనీ అధినేత అయిన మెల్నికోవ్ తన భార్య, కొడుకులను కత్తితో పొడిచి చంపి అనంతరం తనని తాను పొడుచుకుని చనిపోయారన్నది పోలీసుల కథ. ఉరి తాడుకు వేలాడుతూ గతేడాది జనవరి 30న గ్యాస్ ప్రోమ్ డైరెక్టర్ షుల్మన్ తన ఇంట్లోని బాత్ రూంలో శవమై కనిపించారు. ఆయన పక్కన ఓ సూసైడ్ నోట్ కూడా దొరికినట్లు పోలీసులు చెప్పారు. గ్యాజ్ ప్రోమ్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ ట్యుల్య కోవ్ సెయింట్ పీటర్ బర్గ్ లోని తన ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. ట్యుల్యకోవ్ చనిపోయిన మూడు రోజులకే రష్యాలోనే ప్రముఖ ఆయిల్ కంపెనీ మ్యాగ్నెట్ గా పేరొందిన మిఖైల్ వాట్ ఫోర్డ్ ఇంగ్లాండ్ లోని తన ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఆ తర్వాత స్కై రిసార్ట్ అధినేత ఆండ్రీ క్రుకోవ్ స్కీ ఓ శిఖరంపై నుండి జారి పడి చనిపోయారు. పుతిన్పై అనుమానాలు అన్నీ అనుమానస్పద మరణాలే. ప్రతీ మరణ ఘటన లోనూ ఎన్నో ప్రశ్నలు. ఏ ప్రశ్నకూ సమాధానం లేదు. అన్నీ దారుణ ఘటనలే. వీటన్నింటినీ నిశితంగా గమనిస్తే ఇవన్నీ కూడా రష్యా ప్రభుత్వాధినేత పుతిన్ చేయించినవే కావచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తన ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వారిని కానీ.. తనకు కంట్లో నలుసుగా తయారయ్యే వారిని కానీ తనకి భవిష్యత్తులో తలనొప్పిగా మారతారన్న వారిని కానీ ప్రాణాలతో విడిచి పెట్టడం అంత మంచిది కాదని పుతిన్ భావిస్తారన్నది పుతిన్ వ్యతిరేకుల వాదన. మొదట్నుంచీ కూడా పుతిన్ తన ప్రత్యర్ధులపై హత్యాయత్నాలకు పాల్పడిన చరిత్ర ఉందని వారంటున్నారు. రాజకీయాల్లో పుతిన్కు నిద్ర లేకుండా చేసిన రాజకీయ ప్రత్యర్ధి నావెల్నీపై 2020లో విష ప్రయోగం జరిగింది. ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స అనంతరం నావెల్నీ ప్రాణాలతో బయట పడ్డారు. అంతకు రెండేళ్ల క్రితం 2018లో రష్యా నిఘా విభాగానికి మాజీ అధిపతి అయిన సెర్గీ స్క్రిపాల్ పైనా నావెల్నీ తరహాలోనే విష ప్రయోగం జరిగింది. ఈయన కూడా తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. రష్యా భద్రతాధికారి అలెగ్జాండర్ లిట్వినెంకోపై లండన్లో రేడియో ధార్మిక పదార్ధమైన పొలోనియంను ప్రయోగించారు. అలెగ్జాండర్ మాత్రం ఈ ఘలనలో చనిపోయారు. పుతిన్ పై అనుమానానికి కారణాలు లేకపోలేదు. ఒడిషాలో అనుమానస్పదంగా మరణించిన పావెల్ ఆంటోవ్ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి కాలు దువ్వడాన్ని విమర్శించారు. క్యీవ్ నగరంపై రష్యా వైమానిక దాడులను ఉగ్ర వాద చర్యగా అభివర్ణించారు. అయితే ఆ వెంటనే ఆంటోవ్ పై నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఆ వెంటనే ఆంటోవ్ చేత బలవంతంగా క్షమాపణలు చెప్పించేశారు. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు దురదృష్టకరమైనవని అవగాహనా రాహిత్యంతో సాంకేతిక లోపంతో చేసిన వ్యాఖ్యలని ఆంటోవ్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. అసలు అపర కుబేరులే ఎందుకు చనిపోతున్నారు.? ఈ మిస్టీరియస్ డెత్స్ వెనుక నిజంగానే పుతిన్ ఉన్నారా? ఇంతకీ ఈ అపర కుబేరులు ఎలా అవతరించారో కూడా తెలుసుకోవాలి. 1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కమ్యూనిస్టు దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రష్యా కొత్త నేత బోరిస్ ఎల్సిన్ అధికారంలోకి రావడంతోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించారు. వేలాది సంస్థలను కొందరు ప్రైవేటు వ్యక్తులు చేజిక్కించుకున్నారు. రాత్రికి రాత్రే వారు అపర కుబేరులయ్యే అవకాశం వచ్చింది. ప్రత్యేకించి రష్యాకు ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు సహజ వాయు రంగంలో ప్రైవేటు పెట్టుబడిదారులు అడుగు పెట్టారు. అలా కీలక రంగాలన్నీ దక్కించుకున్న ఈ నయా వ్యాపారులనే ఆలిగాక్స్ అని పిలుస్తున్నారు. వారే రష్యాలో అత్యంత ధనవంతులన్నమాట. పుతిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యాపారుల్లో కొందరు పుతిన్ కు అండగా నిలిచారు. పుతిన్ వ్యవహార శైలి నచ్చక కొందరు దూరంగా ఉన్నారు. ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధానికి కాలుదువ్విన మరుక్షణమే ప్రపంచంలో అందరి కన్నాఎక్కువగా ఆందోళన చెందింది ఈ కుబేరులే. ఎందుకంటే తమ వ్యాపారాలపై యుద్ద ప్రభావం పడుతుందని వీరు భయపడ్డారు. వీరు అనుకున్నట్లే నాటో దేశాల ఆంక్షల తో రష్యన్ బిలియనీర్ల వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. అన్నింటినీ మించి యూకే, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్ లలో రష్యన్ కుబేరులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. విలాసవంతమైన విల్లాలు, ఎస్టేటులు కొన్నారు ప్రైవేటు జెట్ విమానాలు, ఓడలు పోర్టులు కొన్నారు. రష్యా యుద్ధం మొదలు పెట్టగానే నాటో దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధించాయి. రష్యన్లకు ఇతర దేశాల్లో ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఒక పక్క రష్యాలో తమ వ్యాపారాలు పడిపోవడం మరో పక్క విదేశాల్లోని తమ ఆస్తులన్నీ ఫ్రీజ్ అయిపోవడంతో రష్యన్ బిలయనీర్లు ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయారు. ఇది వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేసింది. ఈ ఫ్రస్ట్రేషన్ లోనే యుద్ధానికి కారణమైన పుతిన్ పై వ్యాపారులు మండి పడ్డారు. ఆ కోపంలోనే పుతిన్ పై విమర్శలూ చేశారు. ఆ తర్వాతనే 22 మంది సంపన్నులు అనుమానస్పద స్థితిలో చనిపోతూ వచ్చారు. సస్పెన్స్ సినిమాలో మాదిరిగా ఒకరి తర్వాత ఒకరు ఒకే విధంగా మరణానికి గురి కావడం ఆశ్చర్యచకితులను చేసింది. కొన్ని మరణాలు మరీ బీభత్సంగా క్రూరంగా ఉండడం మిగతా వారిని భయపెట్టింది. ప్రభుత్వం ఏమో ఆత్మహత్యలే అంటుంది. అక్కడి వాతావరణం చనిపోయిన తీరు చూస్తే అవి హత్యలేమో అన్న అనుమానాలు వస్తున్నాయి.ఈ మారణ హోమం ఎప్పటికి అంతం అవుతుందనేది అతి పెద్ద ప్రశ్న. ఉక్రెయిన్ తో యుద్ధం ఆగిన వెంటనే ఈ మరణాలు కూడా ఆగితే మాత్రం ఇవి ముమ్మాటికీ పుతిన్ ప్రభుత్వ హత్యలే అనుకోవలసి వస్తుందని మేథావులు అంటున్నారు. పాలకులను చికాకు పెట్టే వారినీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టేవారినీ మూడోకంటికి తెలీకుండా మాయం చేసేసి శాల్తీలు గల్లంతు చేయడం అనేది రష్యాకు కొత్తకాదంటున్నారు విశ్లేషకులు. సోవియట్ యూనియన్ రోజుల్లోనూ నాటి గూఢచర సంస్థ కేజీబీ ఇదే చేసేదని వారంటున్నారు. ఇపుడు రష్యాలో కమ్యూనిజం లేకపోవచ్చుకానీ ప్రత్యర్ధులను లేపేసే వారసత్వం మాత్రం అలానే కొనసాగుతోందని వారంటున్నారు. పుతిన్ విధానాలను నిలదీసినందుకే రష్యాలో ఆలిగాక్స్ ల ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉండచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సోవియట్ యూనియన్ కాలంలోనే కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశాధినేత పుతిన్ కూడా ఒకనాటి కేజీబీ అధికారి కాబట్టే సోవియట్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లుందని వారు అభిప్రాయ పడుతున్నారు. విషాదం ఏంటంటే రష్యాలో చోటు చేసుకుంటోన్న వరుస మృతి ఘటనల్లో ఏ ఒక్క కేసులోనూ సరియైన సాక్ష్యాలు లేకపోవడం. అయితే దీన్ని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదంటున్నారు మేధావులు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
ఒడిశాలో మరో రష్యా పౌరుడు మృతి.. రెండు వారాల్లో మూడో ఘటన
భువనేశ్వర్: ఒడిశాలో రష్యా పౌరుల మిస్టరీ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతి చెందిన మిస్టరీ వీడకముందే రష్యాకు చెందిన మరో పౌరుడు మృతి చెందాడు. రెండు వారాల వ్యవధిలో ముగ్గురు రష్యన్లు మరణించటంతో ఇంతకి ఒడిశాలో ఏం జరుగుతోందనే ఆందోళన నెలకొంది. జగత్సింఘ్పూర్ జిల్లాలోని పారాదిప్ పోర్టులో ఓ షిప్లో మంగళవారం రష్యా పౌరుడి మృతదేహం లభ్యమైంది. ‘ఎంబీ అల్ద్నాహ్’ షిప్లో చీఫ్ ఇంజినీర్గా పని చేస్తున్న 51 ఏళ్ల మిలియాకోవ్ సెర్గేగా పోలీసులు గుర్తించారు. ఆ నౌక బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టు నుంచి పారాదీప్ పోర్టు మీదుగా ముంబైకి వస్తోంది. నౌకలోని తన ఛాంబర్లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మరణించినట్లు సమాచారం. అయితే, అతడి మృతికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒకే హోటల్లో ఇద్దరు.. గతంలో దక్షిణ ఒడిశాలోని రాయగడ నగరంలో ఓ హోటల్లో ఇద్దరు టూరిస్టులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. అందులో ఒకరు రష్యా చట్ట సభ్యుడు కూడా ఉండటం గమనార్హం. వారు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు వ్యతిరేకంగా గతంలో మాట్లాడటం చర్చకు దారి తీస్తోంది. రష్యా చట్ట సభ్యుడు పావెల్ ఆంటోవ్(65) డిసెంబర్ 24న హోటల్ మూడో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. అంతకు ముందు డిసెంబర్ 22న ఆయన స్నేహితుడు వ్లాదిమిర్ బిదెనోవ్(61)హోటల్ గదిలో మృతి చెందాడు. ఈ రెండు కేసులపై ఒడిశా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ‘పుతిన్’ను వ్యతిరేకిస్తే అంతేనా? ఒడిశాలో మరో రష్యన్ మిస్సింగ్! -
ఒడిశాలో ఏం జరుగుతోంది? మరో రష్యా పౌరుడు మిస్సింగ్!
భువనేశ్వర్: పది నెలలుగా ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తోన్న రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దేశ పౌరులు ఇటీవల ఒడిశాలోని రాయగడ హోటల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పావెల్ అంటోవ్(65) అనే ఎంపీ, ఆయన స్నేహితుడు ఇరువురు రెండ్రోజుల వ్యవధిలో హోటల్లో రక్తపు మడుగులో పడి కనిపించటం కలకలం రేపింది. ప్రస్తుతం పుతిన్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన మరో రష్యా పౌరుడు కనిపించకుండా పోయాడనే వార్త కలకలం సృష్టిస్తోంది. ఒడిశాలో ఏం జరుగుతోంది? అక్కడి పోలీసులు ఏం చెబుతున్నారు. ఇదీ జరిగింది.. ఒడిశా రాజధాని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం.. రష్యాకు చెందిన ఓ 60ఏళ్ల వ్యక్తి ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. తాను రష్య వసలదారుడినని, తాను యుద్ధానికి, పుతిన్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. తాను నిరాశ్రయుడిగా మారానని, తనకు సాయం చేయాలని కోరాడు. మరోవైపు.. రైల్వే స్టేషన్లో ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి ఆచూకీ గల్లంతైనట్లు వార్తలు చక్కర్లు కొంటాయి. ఆయనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాయి. ఒడిశా రాయగడలోని హోటల్లో ఇద్దరు రష్యన్ వ్యక్తులు మరణించిన క్రమంలో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఆ వార్తలను కొట్టిపారేశారు ఒడిశా పోలీసులు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి అదృశ్యం కేసు నమోదు కాలేదని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ‘నవంబర్లోనూ ఆ వ్యక్తి ప్లకార్డు పట్టుకుని రైల్వే స్టేషన్లో కనిపించాడు. ఆయన పాస్పోర్టును తనిఖీ చేశాం. ప్రయాణికుల నుంచి డబ్బులు అడుక్కుంటున్నాడు. అతడి వివరాలు తనిఖీ చేసి పూరీకి పంపించాం. అప్పటి నుంచి తనవారితో అక్కడే ఉంటున్నాడు. రాయగడ హోటల్ ఘటనలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు’అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో.. -
రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో..
రాయగడ(భువనేశ్వర్): పట్టణంలోని సాయి ఇంటర్నేషనల్ హోటల్లో ఓ విదేశీయుడి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రష్యాకు చెందిన వ్లాదిమర్ బిదానోబ్(61)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్డీపీఓ దేవజ్యోతి దాస్ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే... ఈనెల 21న రష్యాకు చెందిన నలుగురు పర్యాటకులు ఒడిశాలోని దారింగిబడి నుంచి రాయగడలో పర్యటించేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారి వెంట వచ్చిన గైడ్ స్థానిక సాయి ఇంటర్నేషనల్ హోటల్లో వసతి సౌకర్యం కల్పించారు. గురువారం రాత్రి వ్లాదిమర్తో పాటు అతనితో వచ్చిన మరో విదేశీయుడు కలిసి ఒకే గదిలో మద్యం సేవించారు. అయితే తెల్లవారు లేచి చూసేసరికి వ్లాదిమర్ మృతి చెందడంతో హోటల్ మేనేజర్కు విషయాన్ని తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమా? లేదా ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్డీపీఓ దాస్ మీడియాతో మాట్లాడుతూ విదేశీయుడి మృతికి సంబంధించి నియమాల ప్రకారం సమాచారాన్ని రష్యా రాయబార కార్యాలయానికి విషయం చేరవేశామని తెలిపారు. మృతునికి ఒక కుమారుడు ఉన్నట్ల తెలిసిందని, మిగతా సమాచారం అందాల్సి ఉందని వివరించారు. చదవండి: షాకింగ్ ఘటన.. పారిపోయిన అల్లుడు.. అసలేం జరిగింది? -
క్లిష్ట సమయంలోనూ వీడని ఔదార్యం: ఉక్రెయిన్ చేయూత
రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్ ఆఫ్రికన్ దేశాలు ఎదుర్కొంటున్న ఆహార కొరతకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్ స్కీ తీవ్ర కరువును ఎదుర్కొంటున్న దేశాలకు సుమారు 150 మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు గ్రెయిన్ ఫ్రమ్ ఉక్రెయిన్ పథకాన్ని ప్రారంభించారు. ఉక్రెయిన్ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశించే మిలియన్ల మంది ప్రజలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 1923-33 శీతాకాలంలో మిలియన్ల మంది ఉక్రెయిన్లను పొట్టనబెట్టుకున్న రష్యా యుగం నాటి కరువు హోలోడోమోర్ కోసం జరిగిన ఉక్రెయిన్ వార్షిక స్మారక దినం సందర్భంగా ఈ ఫథకాన్ని ప్రారంభించారు. తమతో యుద్ధానికి దిగి ఆఫ్రికాలో ఆహార తీవ్ర ఆహార కొరతకు కారణమైందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయంటూ రష్యా రకరకాల కథనాలను వెలువరిస్తుంది. దీంతో వాటన్నింటిని తిప్పికొట్టేలా తాజాగా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఉక్రెయిన్. ఈ మేరకు ఇథియోఫియా, సూడాన్, సౌత్సూడాన్, సోమాలియా, యెమెన్లతో సహా దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం యూరోపియన్ యూనియన్తో సహా 20కి పైగా దేశాల నుంచి సుమారు రూ.150 మిలయన్ డాలర్లను సేకరించిందని జెలెన్స్కీ చెప్పారు. కరువు ముప్పును ఎదుర్కొంటున్న దేశాలకు ఉక్రెనియన్ ఓడరేవుల నుంచి కనీసం 60 నౌకలను పంపాలని ప్లాన్ చేస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధానిలో లక్షలాది మంది విద్యుత్ కొరతను ఎదుర్కొటున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్లోని 27 ప్రాంతాలలో 14 ప్రాంతాల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. అదీగాక మాస్కో దళాలు ఖేర్సన్ నగరం నుంచి వైదొలగినప్పటికీ షెల్లింగ్ దాడులు కొనసాగిస్తూనే ఉందని, ఈ దాడిలో సుమారు 32 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఏదీఏమైనా రష్యా ఉక్రెయిన్పై పదేపదే ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా యూఎన్ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ నల్ల సముద్రపు ఓడరేవుల నుంచి ఎగుమతి చేసిన ఆహారం అత్యంత తీవ్ర స్థాయిలో ఆహార కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు చేరడం లేదంటూ రష్యా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జెలెన్స్కీ ఈ పథకాన్ని ప్రకటించారు. (చదవండి: ఉక్రెయిన్కి సునాక్ మద్దతు హామీ) -
జేఈఈ పేపర్ లీక్ కేసు: రష్యన్ వ్యక్తి అరెస్టు
న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) పేపర్ లీక్ కేసులో రష్యన్ వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అదుపులోకి తీసుకుంది. సదరు రష్యన్ వ్యక్తిని మిఖాయిల్ షార్గిన్గా అధికారులు గుర్తించారు. నిందితుడు జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉపయోగించే ఐలియన్ సాఫ్ట్వేర్ను హ్యాక్ చేయడంలో సహకరించినట్లు సీబీఐ పేర్కొంది. మిఖాయిల్ కజికిస్తాన్లోని అల్మాటీ నుంచి భారత్కు వచ్చేందుకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడంతో ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాదు జేఈఈ మెయిన్స్తో సహా వివిధ ఆన్లైన్ పరీక్షల్లో కొందరు విదేశీయులు కుమ్మక్కై హ్యాకింగ్లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు సీబీఐ మాట్లాడుతూ... జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షను నిర్వహించే ఐలియన్ సాఫ్ట్వేర్ను మిఖాయిల్ షార్గిన్ హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సాఫ్ట్వేర్ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రూపొందించింది. పరీక్ష సమయంలో అనుమానిత అభ్యర్థుల కంప్యూటర్ సిస్టమ్ను హ్యాక్ చేయండలో ఈ నిందితులు సహకరించినట్లు తేలింది. దీంతో అతనికి నోటీసులు జారి చేసినట్లు పేర్కొంది. (చదవండి: విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్ స్టాప్గా ప్రయాణించిన విమానం) -
పుతిన్ ప్రకటన సృష్టిస్తున్న ప్రకంపనం... గాయపడ్డ కమాండర్: వీడియో వైరల్
Man Decide Jail Is Better Than Deat In Ukraine War: రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ యుద్ధం కోసం పెద్ద ఎత్తున మిలటరీ మొబైలైజేషన్(సైనిక సమీకరణ) కోసం పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అంటే యుద్ధంలో పాల్గొనే వయస్కులందరికి నిర్బంధ సైనిక శిక్షణతో యుద్ధానికి సన్నద్ధం అయ్యేలా చేసి కదన రంగంలోకి దింపుతారు. దీంతో రష్యన్ యువతలో తీవ్ర అలజడి మొదలైంది. ఎలా తప్పించుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వేరే దేశాలకు పారిపోయే యత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక రష్యాన్ యువకుడు డ్రాఫ్ట్ కార్యాలయం(సైనిక శిక్షణ కార్యాలయం)పై దాడులు జరిపాడు. అంతేకాదు ఆ కార్యాలయంలో నిర్బంధ సైనిక శిక్షణకు వచ్చిన వారిని పారిపోమంటూ పిలుపునిస్తూ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో డ్రాఫ్టింగ్ కార్యాలయ కమాండర్ తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడు అధికారిని పాయింట్ బ్లాక్ రేంజ్కి సమీపంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటన రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగడుని రుస్లాన్ జినిన్గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఉక్రెయిన్ యుద్ధం కోసం మొబైలైజేషన్ చేయడంతో ఈ కాల్పులకు తెగబడ్డానని చెప్పాడు. అంతేగాదు ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయే కంటే జైల్లో ఉండటమే మంచిదని ఇలా చేసినట్లు చెప్పాడు. అధికారులు సదరు కమాండర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐతే అతడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. Mobilized man killed a drafting office commander in Ust-Ilimsk, Irkutsk region, Russia. Alexandr Yeliseev, the commander, was shot four times almost point blank. The murderer is Ruslan Zinin, born in 1997, "partially mobilized". He decided jail is better than death in Ukraine. pic.twitter.com/s0IvHJZJBO — Anton Gerashchenko (@Gerashchenko_en) September 26, 2022 (చదవండి: పుతిన్ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం..భయాందోళనతో దేశం బయటకు!) -
రష్యా ఆయిల్పై నియంత్రణకు మా కూటమిలో చేరండి: అమెరికా
న్యూఢిల్లీ: రష్యన్ ముడిచమురు రేటును నియంత్రించడం ద్వారా ఆ దేశ ఆదాయ మార్గాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న కూటమిలో చేరాలంటూ భారత్పై అమెరికా ఒత్తిడి మరింత పెంచుతోంది. భారత్లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి వాలీ అడెయెమో.. ప్రభుత్వ వర్గాలతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలతో పాటు ఈ అంశంపైనా చర్చించారు. రష్యా చమురు రేట్లకు చెక్ పెట్టడమనేది, దేశీయంగా ఇంధన ధరలను తగ్గించుకోవాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని వాలీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్కు తత్సంబంధ వివరాలు అందిస్తున్నామని, దీనిపై చర్చలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా దిగ్బంధం చేసేందుకు .. అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యాకు కీలక ఆదాయ వనరైన చమురు రేట్లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బ్యారెల్కు 100 డాలర్లకు పైగా ఎగిసినప్పటికీ భారత్కు రష్యా డిస్కౌంటు రేటుకే చమురును అందిస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ను తమ వైపు తిప్పుకునేందుకు అమెరికా యత్నిస్తోంది. -
ఉక్రెయిన్ పౌరులందరికీ రష్యా పౌరసత్వం.... వేగవంతం చేయాలన్న పుతిన్!
Russian Citizenship Forall citizens of Ukraine: తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులకు దిగుతున్న రష్యా దాదాపు చాలా ప్రాంతాలను అధీనంలోకి తెచ్చుకుంది. ఆ మేరకు రష్యా అనుకూల వేర్పాటు వాదుల ప్రాబల్యమున్న డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్సుపై పట్టు సాధించాయి రష్యా బలగాలు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పౌరులందరికి రష్యన్ ఫెడరేషన్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే హక్కు ఇచ్చేలా డిక్రీని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఉక్రెయిన్లో రెండు ప్రాంతాల నివాసితులకు పౌరసత్వాన్ని వేగవంతం చేశారు. అంతేకాదు దాదాపు రష్యన్ దళాల నియంత్రణలో ఉన్న ఖేర్సన్, జపోరిజ్జియా వంటి ఆగ్నేయా ప్రాంతాల్లో ఈ విధానాన్ని వేగవంతం చేశారు. ఇలానే 2019లో తూర్పు ఉక్రెయిన్ నుంచి విడిపోయిన మాస్కో అనుకూల వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుగాన్క్స్ వంటి ప్రాంతాల్లోని నివాసితులకు ఇలాంటి డిక్రీని ఆదేశించి తనలోకి కలిపేసుకుంది. వాస్తవానికి ఈ డిక్రీ ద్వారా సరళీకృత విధానంలో రష్యా పౌరసత్వాన్ని పోందేలా దరఖాస్తు చేసుకునే హక్కుని ఉక్రెయిన్ పౌరులకు అందిస్తోంది రష్యా. దీంతో మాస్కో నియంత్రణలో ఉన్న ప్రాంతాలలోని నివాసితులు, అధికారులు రష్యాలో భాగమవుతారు. (చదవండి: రక్త ఆభరణాలు! ఔను! మానవుని రక్తంతో చేసినవి...) -
రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి..
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలుగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ భీకరమైన యుద్ధం కారణంగా వేలాది మంది నిరాశ్రయులవ్వగా, లక్షలాది మంది వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒక ఉక్రెయిన్ రష్యా దాడుల్లో తాను ఎదర్కొన్న భయంకరమైన చేదు అనుభవం గురించి వివరించాడు. ఈ మేరకు 33 ఏళ్ల మైకోలా కులిచెంకో తన భయానక అనుభవాన్ని వివరించాడు... "రష్యా ఉక్రెయిన్ పై దురాక్రమణకు తెగబడతూ దాడులు చేసి సరిగ్గా మూడువారాలైంది. మార్చి 18న అనుహ్యంగా ఒక రోజు రష్యా బలగాలు తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. తమ ఇంటిని చుట్టుముట్టి రష్యన్ దళాలపై బాంబు దాడి చేస్తున్నవారి కోసం గాలించారు. తమ దళాలలపై దాడిచేసే వాళ్లతో సంబంధం ఉందనే అనుమానంతో మా ఇంటిని సోదా చేయడం మొదలు పెట్టారు. ఐతే మా తాతా పారామిలటరీకి సంబంధించినవాడు కావడంతో ఇంట్లో ఉండే మిలటరీ బ్యాగ్, పతకాలను చూసి ఆర్మీకి చెందిన వారిగా భావించి తమ పై కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నన్ను మా అన్నలిద్దరిని కళ్లకు గంతలు కట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి మూడు రోజులపాలు హింసించారు. ఆ తర్వాత మమ్మల్ని వదిలేస్తారు అనుకున్నాం కానీ వారు కర్కసంగా మా తలల పై గన్పెట్టి కాల్పుల జరిపారు. మొదటగా మా పెద్ద అన్న, ఆ తర్వాత రెండో అన్న తదనంతరం నాపై కాల్పుల జరిపారు. ఆ తర్వాత మా ముగ్గుర్ని ఒక గొయ్యిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. ఐతే తానుఎంతసేపు ఆ గోతిలో ఉండిపోయానో గుర్తులేదు కానీ ఆ తర్వాత స్ప్రుహ వచ్చాక ఊపిరాడక పోవడంతో తన అన్నలను తనపైనే ఉండటం వల్ల బరువుగా ఉందని గమనించి నా చేతులు కాళ్ల సాయంతో వారిని పక్కకు తోసి ఏదో విధంగా ఆ గోయ్యి నుంచి బయటప్డడానని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి బుల్లెట్ తన చెంప మీద నుంచి కుడి చెవి వైపుకు రాసుకుంటూ వెళ్లిపోవడం వల్ల తాను లక్కీగా బతకగలిగానని చెప్పాడు. ఆ తర్వాత తాను పొలానికి సమీపంలోని ఇంటికి వెళ్లి ఆశ్రయం పోందినట్లు వివరించాడు. తాను ఆ విషాద ఘటన నుంచి బతికి బట్టగట్టగలుగుతానని కూడా అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి విషాద ఘటనలు ఉక్రెయిన్ అంతటా కోకొల్లలు అంటూ ఆవేదనగా చెబుతున్నాడు. (చదవండి: టిట్ ఫర్ టాట్: పుతిన్పై బ్యాన్ విధించిన కెనడా) -
ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలి!: ఆంటోనియో గుటెరస్
War Must End For the sake of the people: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలు పైగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించడమే కాకుండా ఐక్యరాజ్యసమితి వ్యవహార నిబంధనలను, దాని ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిచడమేనని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నొక్కి చెప్పారు. ఐక్యరాజ్యసమితతోపాటు అనేక దేశాలు ఉక్రెయిన్లో రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ముగించాలని పిలుపునిచ్చాయి. ఐతే ఇరుదేశాల మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలు గురించి మాత్రం ప్రస్తావించ లేదు. ప్రపంచ ప్రజల కోసమైనా ఈ యుద్ధ ముగిసిపోవాలని ఆకాంక్షించారు. ఇటీవలే గుటెరస్ మాస్కో, కీవ్లను పర్యటించారు. దెబ్బతిన్న ఓడరేవు నగరం మారియాపోల్లోని పౌరుల తరలింపు కోసం తన గళం విప్పారు. చైనా, యునైటెడ్ స్టేట్స్, ఐర్లాండ్, ఫ్రాన్స్, మెక్సికోలతో సహా భద్రతా మండలిలోని మెజారిటీ సభ్యుల మధ్య నెలల తరబడి కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. యూఎన్లోని చైనా రాయబారి జాంగ్ జున్ ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరా చేయడాన్ని విమర్శిస్తూ.. దౌత్యం మాత్రమే ఈ పోరాటాన్ని ముగించగలదని నొక్కిచెప్పారు. ఈ యుద్ధాన్ని ముగించేలా కెన్యా దౌత్యవేత్త మర్టిన్ కిమాని, గుటెరస్ మధ్యవర్తిత్వం వహించాలని జాంగ్ జున్ అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని వినయోయగించుకోవాలని ఐక్యరాజ్యసమితిలోని ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిత్స్య అన్నారు. భద్రతామండలిలో నార్వే, మెక్కికోలో శాశ్వత సభ్యులు కానీ సభ్యులు ఆంటోనియో గుటెరస్ పిలుపునకు బలమైన మద్దతు ఇచ్చారు. భద్రత మండలిలో ఐక్యత ప్రతిపాదన పై రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగినప్పటి నుంచి అనిశ్చితంగా ఉంది. మాస్కో భద్రత మండిలి ప్రతిపాదనకు మద్దతు తెలపడానికి రష్యాకు ఇంకాస్తా సమయం పడుతుందని రష్యాన్ డిప్యూటీ రాయబారి డిమిత్రి పోలియన్స్కీ చెప్పడం గమనార్హం. (చదవండి: జో బైడెన్ సంచలన నిర్ణయం) -
జేపీ మోర్గాన్ లాభం 42% డౌన్..
న్యూయార్క్: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ నికర లాభం 42 శాతం క్షీణించింది. 8.3 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలు, భారీ ద్రవ్యోల్బణ ప్రభావాలతో దాదాపు 1.5 బిలియన్ డాలర్ల రష్యన్ అసెట్స్ను రైటాఫ్ చేయడం ఇందుకు కారణం. గతేడాది తొలి త్రైమాసికంలో జేపీమోర్గాన్ చేజ్ లాభం 14.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కరోనా వైరస్ పరిణామాలతో తలెత్తే మొండి బాకీల ప్రొవిజనింగ్ కోసం ముందుజాగ్రత్తగా పక్కన పెట్టిన నిధులను చేజ్ క్రమంగా బైటికి తీస్తుండటంతో గతేడాది లాభాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుతం, అందుకు భిన్నంగా రష్యన్ అసెట్స్ను రైటాఫ్ చేయాల్సి రావడం, బేస్ ఎఫెక్ట్ వంటి అంశాల కారణంగా బ్యాంక్ లాభాలు తగ్గాయి. రైటాఫ్ చేసిన నిధులు .. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగం, అసెట్ మేనేజ్మెంట్ వ్యాపారాలకు సంబంధించినవని జేపీ మోర్గాన్ చేజ్ వెల్లడించింది. తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన వాల్ స్ట్రీట్ దిగ్గజాల్లో మొదటి సంస్థ జేపీ మోర్గాన్ చేజ్. ఈ సంస్థకు రష్యాలో ఒక మోస్తరు స్థాయిలో వ్యాపారం ఉంది. మరోవైపు, రష్యాలో గణనీయంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కన్జూమర్ బ్యాంకింగ్ కార్యకలాపాలున్న సిటీగ్రూప్... గురువారం ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. -
రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు
న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్కు చెందిన ట్రేడరు విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్ను హెచ్పీసీఎల్ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఉక్రెయిన్ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ క్రూడాయిల్కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డాలర్లలో సెటిల్మెంట్.. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది. 2020 నుంచే ఒప్పందాలు.. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ ఆయిల్ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లో చమురుకు డిమాండ్ 8% అప్ ఈ ఏడాది 5.15 మిలియన్ బీపీడీకి చేరొచ్చని ఒపెక్ అంచనా న్యూఢిల్లీ: మహమ్మారి ప్రభావాల నుండి ఎకానమీ నెమ్మదిగా పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది చమురుకు డిమాండ్ 8.2 శాతం మేర పెరగనుంది. రోజుకు 5.15 మిలియన్ బ్యారెళ్లకు (బీపీడీ) చేరనుంది. ఆయిల్ మార్కెట్ నివేదికలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ ఈ విషయాలు వెల్లడించింది. భారత్లో 2020లో చమురు డిమాండ్ రోజుకు 4.51 మిలియన్ బ్యారెళ్లుగా (బీపీడీ) ఉండగా.. 2021లో 5.61 శాతం పెరిగి 4.76 మిలియన్ బీపీడీకి చేరింది. కరోనా పూర్వం 2018లో ఆయిల్ డిమాండ్ 4.98 మిలియన్ బీపీడీగా, 2019లో 4.99 మిలియన్ బీపీడీగా నమోదైంది. ‘2022లో ఆర్థిక వృద్ధి పటిష్టంగా 7.2 శాతం స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు తోడు సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్ను వేగంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నందున ఆయిల్కు డిమాండ్ మెరుగుపడవచ్చని భావిస్తున్నాం‘ అని ఒపెక్ నివేదిక పేర్కొంది. డీజిల్, నాఫ్తాకు పరిశ్రమల తోడ్పాటు.. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షలను సడలించడంతో దేశీయంగా ప్రయాణాలు, రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం మెరుగుపడుతుండటంతో డీజిల్, ఎల్పీజీ, నాఫ్తాకు డిమాండ్ పెరగగలదని నివేదిక వివరించింది. -
కన్నీటి వ్యథ అంతా చిన్నాభిన్నం
-
రష్యా డిస్కౌంట్! పెట్రోల్ ధరలు అదుపులో ?
ప్రస్తుతం రష్యా– ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వివాదాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా ముడిచమురు, పసిడి తదితర కమోడిటీల ధరలు మండుతున్నాయి. దీంతో ఇప్పటికే ద్రవ్యోల్బణ సెగతో సమస్యలు ఎదుర్కొంటున్న భారత్సహా పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక దళాలను మోహరించడం ప్రారంభించాక ఊపందుకున్న ముడిచమురు ధరలు నిలకడగా పెరుగుతూ వచ్చాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ ముందురోజు 139 డాలర్లను దాటగా.. ప్రస్తుతం 132 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోపక్క ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం చరిత్రలోనే తొలిసారి 77 వద్ద ముగిసింది. దీంతో దేశీ దిగుమతులు బిల్లు తడిసిమోపెడు కానుంది. అయితే రష్యా తాజాగా 25–27 శాతం డిస్కౌంట్ ధరలో భారత్కు ముడిచమురు అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం.. మూడో ర్యాంకులో ప్రపంచ దేశాలలో భారత్ చమురు దిగుమతులకు మూడో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఒమన్, దుబాయ్, బ్రెంట్ చమురును 75:25 నిష్పత్తిలో కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి నామమాత్ర స్థాయిలోనే (మొత్తం దిగుమతుల్లో దాదాపు ఒక శాతం) చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే బ్రెంట్ ధరలు తాజాగా 14ఏళ్ల గరిష్టానికి చేరడంతో రష్యా 25–27 శాతం డిస్కౌంట్ ధరలో చమురు సరఫరాకు ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది డిసెంబర్లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ దేశీ పర్యటనకు వచ్చిన సందర్భంలో పీఎస్యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), రష్యా ప్రభుత్వ ఇంధన దిగ్గజం రాస్నెఫ్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. అత్యంత భారీ స్థాయిలో ఇండియాకు చమురు సరఫరాలు చేయగల రాస్నెఫ్ట్.. 2022 చివరికల్లా 2 మిలియన్ టన్నులమేర సరఫరా చేసేందుకు అంగీకరించింది. స్విఫ్ట్ ఎఫెక్ట్... రష్యా చమురు సరఫరాలకుగాను చెల్లింపుల విషయంలో ఇప్పటికింకా స్పష్టతలేనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్ ఆచితూచి వ్యవహరించవలసి ఉన్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా బ్యారల్కు 11.6 డాలర్ల డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమ దేశాలు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి పలు రష్యన్ బ్యాంకులను నిషేధించిన కారణంగా రిజర్వ్ బ్యాంక్సహా బ్యాంకింగ్ వర్గాలు ప్రత్యామ్నాయ చెల్లింపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రుపీ–రూబుల్ వాణిజ్య ఖాతాను యాక్టివేట్ చేయడం ఒక ఆప్షన్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2020–21లో ఒపెక్ దేశాల నుంచి ఇండియా 196.5 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది చివరికల్లా క్రూడ్ ధరలు బ్యారల్కు 185 డాలర్లకు చేరవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం. -
చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం! రష్యా బలగాలకు అడ్డుగా..
Build Barricades To Stop Russian Invasion: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ నిరవధికంగా సాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అతలాకుతలమై పోయింది. అంతేగాక ప్రధాన నగరాలను ఒక్కొకటిగా రష్యా బలగాలు మోహరించడమే కాక కైవసం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఉక్రెయిన్లోని ఓడరేవు నగరమైన ఒడెస్సాలో రష్యా దాడి చేయనుందంటూ తరుచుగా సైరన్లు మోగుతున్నాయి. దీంతో ఆ నగరంలోని సిటీ సెంటర్ను అడ్డుకునేందుకు స్థానికులు ఇసుకుతో బారికేడ్లను నిర్మించేందుకు ఉపక్రమించారు. ఆ బారికేడ్ నిర్మాణం పనుల్లో పదకొండేళ్ల పిల్లలు కూడా పాల్గొన్నారు. అంతేకాదు అక్కడ చిన్నారులు తమ నగరంలో రష్యా దళాలు ప్రవేశించనివ్వమని, నిర్మాణం సజావుగా సాగుతోందని చెబుతున్నారు. అయితే ఓడరేవు నగరం ఖేర్సన్ను రష్యా బలగాలు గురువారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మైకోలైవ్ నగర కేంద్ర నుంచి రష్యా దళాలు ప్రవేశించకుండా స్థానిక వేటగాళ్లు నిలువరించడమే కాకుండా సఫలమయ్యారు కూడా. ఈ మేరకు ఉక్రెయిన్లో కొన్ని నగరాల్లోని ప్రజలు తమ పోరాటంతో కొంత మేర విజయాన్ని సాధించాయనే చెప్పాలి. రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్లో దాదాపు 750 మందికి పైగా పౌరులు మరణించారని అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు పోరాటం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1.2 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్ను విడిచిపెట్టారు కూడా. (చదవండి: పారిపోలేదు!..నేను ఇక్కడే ఉన్నా! పోరాడుతున్నా: జెలెన్ స్కీ) -
బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం..!
-
అంతరిక్షంలో సినిమా షూటింగ్
మాస్కో: తొలిసారిగా భూకక్ష్యలో సినిమా షూటింగ్ జరగనుంది. ఇందుకోసం రష్యా నటి, సినిమా డైరెక్టర్ మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకున్నారు. కజఖ్స్తాన్లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగిసిన సోయుజ్ అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఈ బృందంలో నటి యులియా పెరెసిల్డ్(37), దర్శకుడు క్లిమ్ షిపెంకో(38)తోపాటు వ్యోమగామి అంటోన్ ష్కాప్లెరోవ్ ఉన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అంటోన్ ఈ ప్రయాణానికి నాయకత్వం వహించారు. ఛాలెంజ్ అనే పేరున్న సినిమాలో నటి యులియా సర్జన్గా నటిస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోని ఒక సభ్యుడికి గుండెపోటు రావడంతో ఆమె అక్కడికి వెళ్లి చికిత్స అందించే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్న నోవిట్స్కీ, పీటర్ డుబ్రోవ్ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నటించనున్నారు. నోవిట్స్కీ గుండెపోటుకు గురైన వ్యోమగామి పాత్ర పోషించనున్నారు. ఈనెల 17వ తేదీన భూమికి చేరుకుని, సినిమాలోని మిగతా సన్నివేశాలను షూట్ చేస్తారు. ఈ ప్రయాణం కోసం నాలుగు నెలల నుంచి కఠిన శిక్షణ పొందారు. ‘ఛాలెంజ్’ను రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ సాయంతో ప్రభుత్వ టీవీ ‘చానెల్ వన్’నిర్మిస్తోంది. సభ్యుల శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే చానెల్ వన్ విస్తృతంగా కవరేజీ అందించింది. ఈ మిషన్ రష్యా శక్తి, సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుందని ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. -
రష్యా ఇంజినీర్ విశాఖలో మృతి
మల్కాపురం (విశాఖ పశ్చిమ): రష్యా నుండి వచ్చిన ఓ ఇంజినీర్ గుండెపోటుతో విశాఖలో మృతిచెందారు. సంఘటనకు సంబంధించి మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రష్యా దేశానికి చెందిన గ్రాచవ్ దిమిత్రి (43) ఈ ఏడాది ఫిబ్రవరి 27న విశాఖ వచ్చారు. ఇండియన్ నేవీకి చెందిన సబ్మెరైన్ నౌకలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వాటిని సరిచేసేందుకు ఆయనను ఇక్కడికి పిలిపించారు. దిమిత్రి యారాడ డాల్ఫిన్ హిల్స్ ప్రాంతంలోని క్వార్టర్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం నౌకలో పనులు చేస్తుండగా మ.1.15 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. అక్కడి సిబ్బంది వెంటనే ఆయనను ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మ.2.45 గంటలకు మృతిచెందారు. నేవల్ అధికారుల ఫిర్యాదు మేరకు మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చంటి బిడ్డను ఇంట్లో వదిలేసి పార్టీలకు.. వచ్చి చూస్తే..) -
‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’
‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’ అనే సీన్మా డైలాగ్ను విజేందర్సింగ్ విషయంలో భేషుగ్గా వాడుకోవచ్చు. 2019 తరువాత ఈ ప్రొఫెషనల్ బాక్సర్ మళ్లీ రింగ్లోకి దిగుతున్నాడు. రష్యన్ బాక్సర్ లొప్సన్తో తలపడబోతున్నాడు. ఈసారి ప్రత్యేకత షిప్. గోవా మాండవి నదిలో మెజిస్టిక్ ప్రైడ్ క్యాసీనో షిప్ పై భాగంలో ఎల్లుండి జరిగే ఈ బౌట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.... ఇప్పుడిప్పుడే రింగ్లో బుడిబుడి అడుగులు వేస్తున్న బాక్సర్లతో పాటు, బాలీవుడ్ సినిమాలలో బాక్సర్ వేషాలు వేయాలనుకునే నటులకు కూడా విజేందర్ రోల్మోడల్. యువ నటుడు అక్షయ్ ఒబెరాయ్కి ఒక సినిమా కోసం బాక్సర్ ఫిజిక్ కావల్సి వచ్చింది. దీని కోసం లోకల్ ట్రైనర్ను సంప్రదిస్తే ‘విజేందర్ సింగ్ డైట్’ సూచించాడు. అక్షరాల ఆ డైట్ను పాటించి అద్భుత ఫలితాన్ని సాధించాడు ఆ నటుడు. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అపురూపమైన విజయాలు సాధించిన ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్సింగ్ బెనివాల్ రకరకాల సందర్భాల్లో వ్యక్తిత్వవికాసం, ఫిట్నెస్కు సంబంధించి చెప్పిన విషయాలు కొన్ని ఆయన మాటల్లోనే... ►నాన్న బస్సు డ్రైవర్(హరియాణాలో) ఆదాయం అంతంత మాత్రమే. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఆయనకు ఉండేది. నాకేమో బాక్సింగ్ అంటే ఇష్టం పెరిగింది. బాక్సింగ్లో నాకు ఓనమాలు దిద్దించిన తొలి గురువు మా అన్న మనోజ్. ‘మనకెందుకు బాక్సింగ్. బాగా చదువుకో’ అని నాన్న అనేవారు. ‘బాక్సింగ్ వద్దు క్రికెట్ నేర్చుకో’ అని కొందరు సలహా ఇచ్చేవారు. అయితే నేనేమీ లెక్కలు వేసుకోలేదు. బాక్సింగ్పై గట్టిగా మనసు పెట్టాను. బాక్సింగ్ సాధన చేస్తున్నప్పుడు గోడలపై కనిపించే ‘నో గట్స్ నో గ్లోరీ’ ‘నో పెయిన్, నో గెయిన్’లాంటి వాక్యాలు ఉత్తేజపరిచేవి. ►కష్టపడేతత్వం, క్రమశిక్షణ...ఇవి ఫిట్నెస్కు కీలకమైనవి. స్ట్రెచెస్, వామప్స్...ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు వర్కవుట్లు చేస్తాను. బాడీ చురుగ్గా లేకపోతే, రోటిన్ బోర్ అనిపిస్తే స్కిప్కింగ్ చేస్తాను. దీన్ని ఎంజాయ్ చేస్తాను. ట్రెడ్మిల్ అనేది నా కోసం కాదు అనుకుంటాను. బహిరంగ ప్రదేశాలలో పరుగెత్తడానిక బాగా ఇష్టపడతాను. బ్రేక్ఫాస్ట్లో ఆమ్లెట్లు, సీజనల్ పండ్లు తీసుకుంటాను. లంచ్, డిన్నర్లలో రొట్టే, సబ్జీ, అన్నం, పప్పు, సాయంత్రం పాలు తీసుకుంటాను. రోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగు తాను. క్యాంప్లో మాత్రం నా డైట్ ప్రత్యేకంగా ఉంటుంది. గుడ్లు, ప్రొటిన్షేక్, చేపలు, చికెన్, బ్రౌన్రైస్...మొదలైనవి తీసుకుంటాను. స్వీట్లు తినడం నా బలహీనత, అయితే క్యాంప్లో ఉన్నప్పుడు వాటి గురించి కనీసం ఆలోచించను. మంచి ఫిట్నెస్కు మంచి నిద్ర కావాలి. ప్రతికూల ఆలోచనలను మనసులో నుంచి తీసేసి ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటే శరీరం మన మాట వింటుంది. పంజాబీ సంగీతం విని రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతాను. ►బాక్సర్ శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. రోజూ 30 నుంచి 50 నిమిషాల పాటు ధ్యానం చేస్తాను. ధ్యానం అనేది మనలోని అహాన్ని చంపేస్తుంది. గెలవగానే గెలుపు మైకంలో ‘నేనే గొప్ప’ అనే భ్రాంతి తప్ప ఏదీ కనిపించదు. నేను గెలిచినప్పుడు ‘గెలిచాను. ఓకే. దీన్ని నా మనసు నుంచి తీసేస్తున్నాను’ అనుకుంటాను. ఓడినప్పుడు ‘ఓడిపోయాను. దీన్ని నా మనసు నుంచి తీసేస్తున్నాను’ అనుకుంటాను. ‘నీ హృదయం యవ్వనమయమైతే వయసు అనేది సంఖ్య మాత్రమే అవుతుంది’ గురుదాస్ మాన్ పాటను తరచుగా గుర్తు చేసుకుంటాను. ►నేను నెంబర్వన్గా ఉండవచ్చు, ఉండక పోవచ్చు. కానీ ఎంత కష్టపడ్డామన్నదే నాకు ముఖ్యం. కలలు కనడం ఎంత మాత్రం తప్పు కాదు. అయితే అవి గాలిమేడలు కాకూడదు. ఎప్పుడూ వాస్తవం అనే పునాది మీదే మన పాదాలు ఉండాలి. ‘రాత్రికే రాత్రి విజయం నా సొంతం కావాలి’ అనుకునేవారు ఫీల్డ్లో నిలవ లేరు. స్టెప్–బై–స్టెప్ మాత్రమే ఏదైనా సాధించగలం. -
భారత్లో ప్రారంభమైన స్పుత్నిక్ ప్రయోగాలు
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ కోవిడ్ వ్యాక్సిన్ 2, 3 దశల క్లినికల్ ప్రయోగాలను భారత్లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలిపింది. వివిధ ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనున్నాయని, దాని భద్రత రోగనిరోధక శక్తి అంశాలపై అధ్యయనం చేస్తామని రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ క్లినికల్ ప్రయోగాలను జేఎస్ఎస్ మెడికల్ రీసెర్చ్ నిర్వహిస్తుందన్నాయి. మొదటిదశ ప్రయోగంలో 28వ రోజున 91.4 శాతం సామర్థ్యంతో, 42 రోజుల అనంతరం 95 శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పనిచేసినట్లు ఆర్డీఐఎఫ్ తెలిపింది. మూడో దశ ప్రయోగాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రయోగంలో 40,000 మంది వలంటీర్లు పాల్గొంటున్నారు. ఈ వ్యాక్సిన్ని దేశ అవసరాలకూ, ఇతర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ తెలిపారు. భారత్లో పది కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీకి ఆర్డీఐఎఫ్తో డాక్టర్ రెడ్డీస్ లాబ్ ఒప్పందం కుదుర్చుకుంది. (మా వ్యాక్సిన్ సేఫ్: సీరం ఇన్స్టిట్యూట్) -
బైడెన్ గెలుపును గుర్తించను: పుతిన్
మాస్కో : ఏ అమెరికా నాయకుడితోనైనా తాను కలిసి పని చేస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం అన్నారు. అయితే, అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని గుర్తించడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం పొందిన నాయకుడే ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పారు. ఆ విజయాన్ని ప్రతిపక్షం కూడా గుర్తించాలన్నారు. ఫలితాన్ని చట్టబద్ధంగా ప్రకటిస్తే గుర్తిస్తామని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్, పుతిన్ సన్నిహిత మిత్రులన్న ప్రచారం ఉంది. జో బైడెన్ అధ్యక్షుడైతే రష్యాపై మరిన్ని ఆంక్షలుంటాయని పుతిన్ అనుమానిస్తున్నట్లు సమాచారం. -
'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్
సాక్షి, ముంబై: రష్యా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ భారీ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ పంపిణీ, క్లినికల్ ట్రయల్స్ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఎఫ్)తో భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పదికోట్ల (100 మిలియన్ల ) మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయనుంది. ట్రయల్స్ విజయవంతమైతే నవంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రేవ్ వెల్లడించారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్ఫాంపై ఆధారపడి ఉంటుందన్నారు. దశాబ్దాలుగా 250 కి పైగా క్లినికల్ అధ్యయనాలలో పరీక్షించబడిందని,ఇందులో దీర్ఘకాలిక ప్రతికూలతలు లేకుండా సురక్షితంగా తేలిందన్నారు. అలాగే ఈ టీకా తయారీ మరో నాలుగు భారతీయ తయారీదారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఒకటి, రెండు దశల ప్రయోగాల్లో సానుకూల ఫలితాల నేపథ్యంలో మూడు దశ ట్రయల్స్ నిర్వహించనున్నామని రెడ్డీస్ సీఈవో జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ సహా రష్యా వ్యాక్సిన్పై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘స్పుత్నిక్ వి’కి మూడో దశ పరీక్షలకు భారత్లో రెడ్డీస్ ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, తయారీకి పుణేకు చెందిన సీరం సంస్థ ఒప్పందాన్ని చేసుకుని ప్రయోగాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. (కరోనా: డా.రెడ్డీస్ కొత్త ఔషధం) -
రష్యాలోనూ ఇరగదీస్తున్న బాహుబలి-2
ఢిల్లీ : తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన బాహుబలి సిరీస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడనవసరం లేదు. భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా బాహుబలి ఫ్రాంచైజీ నిలిచింది. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా ఇండియన్ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. ఇప్పటికీ భారతీయ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించిన బాహుబలి 2 సినిమా రష్యాలోనూ ఇరగదీస్తోంది. అయితే థియోటర్లో అనుకుంటే మాత్రం పొరపాటే.. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా అక్కడి టీవీ చానెల్లో ప్లే అవుతుంది. రష్యన్ వాయిస్ఓవర్తో డబ్బింగ్ చేసి విడుదల చేసిన బాహుబలి 2 సినిమా అక్కడి టీవీల్లో దుమ్ముదులుపుతుంది. (నిరాడంబరంగా నటుడి వివాహం) తాజాగా సినిమాలోని ఒకసన్నివేశాన్ని రష్యన్ వాయిస్ ఓవర్తో ఉన్న డైలాగ్తో రష్యన్ ఎంబసీ తమ ట్విటర్లో షేర్ చేసింది. ఈ సందర్భంగా ' ఒక ఇండియన్ సినిమా రష్యాలో ఇంత పాపులారిటీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. బాహుబలి 2 సినిమా రష్యన్ వాయిస్ ఓవర్లో టీవీల్లో ప్లే అవుతుంది' అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతీయ నెటిజన్లు ఒక భారతీయ సినిమాను రష్యాలో విడుదల చేయడం సంతోషంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. బాహుబలి తర్వాత కేజీఎఫ్ సినిమాను కూడా రష్యన్ వాయిస్ఓవర్తో విడుదల చేయాలంటూ కోరుతున్నారు.(బాలయ్య వ్యాఖ్యలపై సి. కళ్యాణ్ వివరణ) దాదాపు రూ. 250 కోట్లతో తెరకెక్కిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాలం, కన్నడ, హిందీ, చైనీస్, జపనీస్ భాషల్లో రిలీజై దాదాపు రూ. 2600 కోట్లు కొల్లగొట్టింది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు బాగాలుగా తెరకెక్కిన బాహుబలి సిరీస్లో యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్, అనుష్క, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్లు కీలక పాత్రలు పోషించారు. -
బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!
బుర్ర తక్కువ మనిషి అని మీరెవరినైనా తిట్టారనుకోండి. అవతలి వాళ్లు.. వెంటనే ఇంతెత్తున ఎగురుతారు. నన్ను అంతమాట అంటావా? అని కయ్యానికి దిగుతారు! కానీ.. రష్యాలోని ఓ 60 ఏళ్ల వ్యక్తిని ఈ మాట అంటే మాత్రం పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు! ఎందుకంటారా? తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఇతనికి మెదడులో సగం లేదు కాబట్టి! ఆశ్చర్యంగా ఉందా? అసలు ఎలా బతికాడన్న అనుమానం వస్తోందా? చదివేయండి. మరి.. మాస్కోలోని బుర్నాసియాన్ ఫెడరల్ మెడికల్, బయో ఫిజికల్ సెంటర్లో కొన్ని రోజుల క్రితం 60 ఏళ్ల వృద్ధుడు చేరాడు. ఒక కాలు, చేయి కదపలేకపోతున్నా అని అంటే.. డాక్టర్లు స్కాన్ చేయించారు. తీరా ఆ మెదడు స్కాన్ను చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు. ఎడమ వైపు భాగం అసలు లేనే లేదు. నల్లటి ఖాళీ మాత్రమే కనిపిస్తోంది. ఇలా సగం మెదడు మాత్రమే ఉంటే.. ఏదో ఒక సమస్య ఉండి తీరాలనుకున్న డాక్టర్లు.. అతడి గురించి వాకబు చేస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఆ వ్యక్తి ఇంజనీరింగ్ చదవడమే కాకుండా.. రెడ్ ఆర్మీలో కూడా పనిచేశాడు. ఏరకమైన ఇబ్బందులూ లేకుండా ఎంచక్కా కుటుంబాన్ని కూడా నడుపుకొచ్చారు. పిండంలో ఉన్న సమయంలోనే అతడి మెదడు సగమే పెరిగి ఉంటుందని.. స్కాన్ల వంటి టెక్నాలజీ అప్పట్లో అందుబాటులో లేని కారణంగా అతడు భూమ్మీదకు రాగలిగాడని న్యూరాలజిస్ట్ మరీనా అనికినా చెప్పారు. చెడిపోయిన మెదడు భాగాలను అతి అరుదైన శస్త్రచికిత్స ద్వారా తొలగించే అవకాశమున్నా దుష్పరిణామాలకు దారితీయొచ్చని.. ఈ వ్యక్తి విషయంలో సగం మెదడు లేకపోయినా ఏరకమైన ఇబ్బంది లేకపోవడం అద్భుతమనే చెప్పాలని అంటున్నారు అనికినా. సాధారణంగా మెదడు కుడివైపు భాగం సృజనాత్మకమైన అంశాలకు ఉపయోగపడితే.. ఎడమవైపు భాగం సైన్స్, మ్యాథమెటిక్స్, లాజిక్స్ వంటి అంశాలకు పనికొస్తుంది. కానీ ఈ వ్యక్తిలో ఎడమ భాగం లేకున్నా సమస్యలు లేకపోవడం గమనార్హం. -
సైరా సినిమాలో సైడ్ ఆర్టిస్టు మృతి
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రతకు ఓ రష్యన్ వ్యక్తి మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్ (38) టూరిస్ట్ వీసాపై మార్చి నెలలో హైదరాబాద్కు వచ్చాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ గేట్ నెంబర్–1 వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటంతో పోలీసులు వెంటనే కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అలెగ్జాండర్ చికిత్సపొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి చెందిన కెమెరాలోని ఫొటోల ఆధారంగా ఈ నెల 4, 5వ తేదీల్లో సైరా సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించినట్లు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్లో నివాసం ఉంటున్న అలెగ్జాండర్, ఈ నెల 10 హోటల్ నుంచి ఖాళీ చేశాడు. తర్వాత రోడ్లపైనే తిరుగుతూ కనిపించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్ మృతి చెందాడని, గోవాలో ఉండే అతని స్నేహితుడు బోరెజ్కు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. బోరెజ్ వచ్చిన తరువాతే పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాంచన నటికి లైంగిక వేధింపులు
చెన్నై, పెరంబూరు: రష్యన్ నటిని వేధింపులకు గురి చేసిన నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. రష్యాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్త పిల్లలతో కలిసి 10 ఏళ్ల క్రితం చెన్నైకి వచ్చింది. స్థానిక ఎంఆర్సీ నగర్లో నివసిస్తూ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇటీవల లారెన్స్ నటించి, తెరకెక్కించిన కాంచన 3 చిత్రంలో నటించారు. బుధవారం ఆమె తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆమెతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన రుబేశ్కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు తనకు పరిచయం అయ్యాడని పేర్కొంది. అతను తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పలు భంగి మల్లో ఫొటోలు తీశాడని తెలిపింది. అనంతరం ఆ ఫొటోలను తన వాట్సాప్కు పంపాడనీ, ఆ తరువాత తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, లేని పక్షంలో ఆ ఫొటోలను ఇంటర్నెట్లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో తెలిపింది. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ దురై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రుబేశ్కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు మాధవరం, పొన్నియమ్మన్మేడు ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. అవకాశాల పేరుతో ఫొటోలు తీస్తానని వచ్చే వారితో జాగరూకత వహించాలని పోలీసులు హితవు పలికారు. -
హైస్కూల్ చదువు.. మెంటల్ డాక్టర్ కొలువు..!!
మాస్కో : మానవత్వం కనుమరుగై స్నేహితుని గొంతు కోసి చంపడమే కాకుండా అతని రక్తం తాగిన ఓ రాక్షసుడు డాక్టర్ అవతారం ఎత్తాడు. హోమిసైడల్ స్క్రీజోఫీనియా అనే మానసిక వ్యాధితో.. ఉన్మాదిగా మారిన ఆ వ్యక్తి ఏకంగా సైకియాట్రిక్ డాక్టర్గా చలామణి అయ్యాడు. వివరాలు.. ఉరల్స్ పట్టణంలోని ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో బోరిస్ కొంద్రషీన్ (36) డాక్టర్గా పనిచేస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నట్టు గత నవంబర్లో గుర్తించారు. రాక్షసుడిగా అవతారం 1998లో కొంద్రషీన్ 16 ఏళ్ల తన హైస్కూల్ స్నేహితున్ని మత్తుమందు ఇచ్చి హత్య చేశాడు. అనంతరం తనను తాను రాక్షసుడిగా ఊహించుకుని అతని రక్తం తాగాడు. కొంద్రషీన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నందున కోర్టు అతనికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పించాలని అతని కుటుంబాన్ని 2000 సంవత్సరంలో ఆదేశించింది. పదేళ్లపాటు ట్రీట్మెంట్ పొందిన కొంద్రషీన్ ఫేక్ సర్టిఫికెట్లు సంపాదించి నగరంలోని‘ సిటీ హాస్పిటల్’లోఉద్యోగంలో చేరాడు. మద్యం సేవించడం.. పొగ త్రాగడం వల్ల వచ్చే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయడమే అక్కడ కొంద్రషీన్ పని. ఎవరికీ అనుమానం రాకుండా డాక్టర్గా నటిస్తూ అందర్నీ నమ్మించాడు. అయితే ఇంటర్ఫ్యాక్స్ అధికారులు సదరు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించడంతో ఈ నరహంతక ‘సైకియాట్రిక్’బండారం బయటపడింది. ఇంద్రషీన్ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ‘నాకు గానీ, మా అమ్మకు గానీ కొంద్రషీన్ జాబ్ చేస్తున్నాడని తెలియదు. అతను హైస్కూల్ వరకే చదువుకున్నాడు’ అని కొంద్రషీన్ సోదరి చెప్పారు. అయితే, ట్రీట్మెంట్ అనతరం తన సోదరుడు పూర్తిగా మారిపోయాడని, ఎవరికీ హాని తలపెట్టడం లేదని తెలిపారు. అతను ఇంకొన్నాళ్లు వైద్యుల పర్యవేక్షలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. -
ట్యాటూల కోసం ఏం చేశాడో తెలుసా..!
సాక్షి, న్యూఢిల్లీ: ఊహించని పనులు చేసే వ్యక్తులను అరుదైన వారిగా ఈ ప్రపంచం గుర్తిస్తుంది. ట్యాటూల కోసం ఓ రష్యన్ చేసిన పని ఇప్పుడు వైరల్గా మారింది. విషయం.. నేటి ఆధునిక కాలంలో ఒంటిపై పచ్చబొట్టు వేయించుకోవడం ఫ్యాషన్ అయింది. కానీ, వాటితోనే ఒళ్లంతా నింపేసుకునే ఘటనలు చాలా అరుదు. కానీ, ట్యాటూల కోసం తన సున్నిత అవయవాలు సైతం పణంగా పెట్టడం మాత్రం అరుదైన వాటిలో అరుదు. రష్యాకు చెందిన 32 ఏళ్ల ఆడం కర్లీకేల్ ట్యాటూల కోసం ఏకంగా తన గుప్త భాగాలనే తీసేయించుకున్నాడు. ఒళ్లంతా ట్యాటూలతో నింపేసుకుని సరికొత్త వర్ణంలోకి మారిపోయాడు. ఎందుకంటే తనకి చర్మ క్యాన్సర్. ఎంతకాలం జీవిస్తాడో తెలియని తనకి క్యాన్సర్తో పాటు ఆల్బునిజం (శరీరం రంగు మారే వ్యాధి) సోకడంతో ఒళ్లంతా అందవిహీనంగా మారిపోయిందట. అందుకే బతికే కొన్నాళ్లయినా తన జబ్బు ప్రతిక్షణం గుర్తుకు రావొద్దని శరీరం మొత్తం ట్యాటూలకు అప్పగించేశాడు. 100 శాతం ట్యాటూలతో రికార్డు సృష్టించాడు. తనకు బూడిద రంగు అంటే ఇష్టమనీ, అందుకే జబ్బు పడినప్పుడు ఒళ్లంతా ఇలా నింపేశానని ఆడం చెప్పుకొచ్చాడు. కొసమెరుపు.. దేవుడి దయ వల్ల ఆడం క్యాన్సర్ను జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. My new JEEP. 🛴 #nullo #nullyfication #new #car #adamcurlykale A post shared by Adam (Oreo) Curlykale (@adam.curlykale) on Jul 17, 2018 at 5:36am PDT -
అలెగ్జాండర్ పుష్కిన్
సంక్లిష్టమైన పుష్కిన్ కవిత్వాన్ని అనువదించడం చాలా కష్టమని చెబుతారు. అందువల్ల ఆయన అసలైన రచనా ప్రజ్ఞను రష్యనేతరులు అంచనా కట్టడం కష్టమైపోయింది. అయినప్పటికీ అందిన ఆ కొద్దిపాటి వెలుగే ఆయన్ని ప్రపంచ గొప్ప రచయితల్లో ఒకడిగా నిలబెట్టడానికి సరిపోయింది. కవి, నవలాకారుడు, నాటక రచయిత, కథకుడు అయిన అలెగ్జాండర్ పుష్కిన్(1799–1837) రష్యా కులీన వంశంలో జన్మించాడు. పదిహేనేళ్లకే మొదటి కవిత రాశాడు. పట్టభద్రుడయ్యే నాటికే రష్యా సాహిత్య ప్రపంచం ఆయన్ని అబ్బురంగా చూడటం మొదలుపెట్టింది. రష్యా ఆధునిక సాహిత్యానికి మార్గదర్శిగా నిలవబోయే పుష్కిన్ తన ‘ఓడ్ టు లిబెర్టీ’ కవిత చదివినందుకుగానూ మొదటి జార్ అలెగ్జాండర్ చేతిలో దేశ బహిష్కరణకు గురయ్యాడు. గ్రీసులో ఆటోమాన్ పాలనను అంతం చేయడానికి స్థాపించబడిన రహస్య సంఘంలో పనిచేశాడు. దేశ బహిష్కరణ ఎత్తివేశాక కూడా ఆయన తన రాజవ్యతిరేక స్వభావాన్ని వీడలేదు. జార్ గూఢచారులు నిరంతరం ఆయన మీద ఓ కన్నేసి ఉండేవాళ్లు. ‘ద బ్రాంజ్ హార్స్మన్’ కవిత, ‘ద స్టోన్ గెస్ట్’ నాటకం, ‘బోరిస్ గొదునోవ్’ నాటకం, ‘యుజీన్ అనేగిన్’ నవల ఆయన ప్రసిద్ధ రచనల్లో కొన్ని. ఆ కాలపు అందగత్తెల్లో ఒకరిగా పేరొందిన నటాలియా గొంచరోవాను పెళ్లాడాడు పుష్కిన్. నలుగురు పిల్లలు కలిగారు. ఆమె మీద కన్నేసిన తోడల్లుడితో ద్వంద్వయుద్ధానికి సవాల్ విసిరిన పుష్కిన్ ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, రెండ్రోజుల తర్వాత తన 37వ యేట అర్ధంతరంగా కన్నుమూశాడు. -
భాష అర్థంకాక చితక్కొట్టేశారు
సాక్షి, కామారెడ్డి: భాష అర్థం కాకపోవటంతో ఓ విదేశీయుడిపై కొందరు రైతులు దాడి చేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రష్యాకు చెందిన వీ వోలెజ్ (44) సైకిల్పై ప్రపంచయాత్రకు బయలుదేరాడు. దానిలో భాగంగా నిజామాబాద్ నుంచి షిర్డీకి వెళ్తున్నారు. శుక్రవారం సాయంత్రం బికనూర్కు చేరుకోగానే గాలివాన మొదలవడంతో వోలెజ్ తన ప్రయాణానికి విరామమిచ్చి సమీపంలోని పంటపొలాల్లో గుడారం ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలో పొలం యాజమాని మహేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని.. అప్పటికే అతని పొలంలో టెంట్ వేసుకుని సేద తీరుతున్న వోలెజ్ని ప్రశ్నించాడు. అతను తన భాషలో సమాధానం చెప్పటం.. రైతుకు విదేశీయుడి మాటలు అర్థం కాకపోవటంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు భాష అర్థంకాని మహేందర్రెడ్డి.. వోలెజ్ని దొంగ అనుకొని అతనిపై దాడి చేశాడు. ఇంతలో మరికొందరు రైతులు కూడా మహేందర్రెడ్డికి తోడు కావటంతో వోలెజ్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వోలెజ్ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మహేందర్ రెడ్డితో వాగ్వాదం జరుగుతున్న సమయంలో వోలెజ్ గూగుల్ ట్రాన్స్లేటర్ సాయం తీసుకుందామని ప్రయత్నించాడనీ.. కానీ, అంతలోనే మహేందర్ రెడ్డి అతనిపై దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితుడి తల, దవడ, కుడి చేతికి గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. -
శ్రియ పెళ్లి ఎప్పుడో తెలుసా.?
సాక్షి, సినిమా : నటి శ్రియకు పెళ్లి కళ వచ్చేసింది. శ్రియ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది నటీమణుల్లానే శ్రియాకు చాలా కాలంగా మీడియా నుంచి ఎదురవుతున్న ప్రశ్న పెళ్లి ఎప్పుడు? అని. అలాంటి వాటినన్నిటిని ఎదుర్కొంటూ వస్తున్న ఆమెకు వివాహ గడియలు తోసుకొచ్చాయట. అవీ ఎంతో దూరంలో లేవు. మరో రెండు వారాల్లోనే అనే ప్రచారం వైరల్ అవుతోంది. అవును శ్రియ రష్యన్కు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కోస్చీవ్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని, మార్చిలో ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారని సమాచారం. శ్రియ పెళ్లి వేడుక ఉదయపూర్లో మార్చి 17,18,19 తేదీల్లో జరగనుందని సమాచారం. అయితే ఈ విషయమై అధికారికపూర్వక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. కాగా కొద్ది రోజుల క్రితం కూడా శ్రియ పెళ్లిపీటలెక్కుతున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రియ స్పందిస్తూ ... పెళ్లి తనది కాదని, తన స్నేహితురాలిదని తెలిపింది. అయితే మరోసారి శ్రియ వివాహం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అవి వాస్తవమా కాదా అని తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఇష్టం అనే తెలుగు చిత్రంతో ఇష్టపడి మరీ ఈ రంగంలోకి వచ్చిన ఉత్తరాది భామ శ్రియ. అలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ నటిగా మంచి గుర్తింపు పొందింది. శ్రియ కోలీవుడ్లో శివాజీ చిత్రంలో సూపర్స్టార్ రజనీకాంత్తో నటించే అవకాశం తలుపు తట్టింది. అంతే ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అదే విధంగా టాలీవుడ్లోనూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్స్తో నటించి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రంలో నటిస్తున్నారు. -
అంబులెన్స్లో మద్యం.. డాక్టర్ల చిందులు
సాక్షి, మీరట్: అంబులెన్స్.. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడే వరప్రదాయిని. రోడ్లపై అంబులెన్స్ శబ్దం వినిపిస్తే.. ప్రధానులు సైతం తప్పుకుని దారిస్తారు. ఇటువంటి అంబులెన్స్ను ఉత్తర్ ప్రదేశ్లోని ఒక ఆసుపత్రి పూర్వ విద్యార్థులు మద్యాన్ని తరలించడం కోసం వినియోగించడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉత్తర్ ప్రదేశ్ మీరట్లోరి లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో.. మద్యాన్ని తరలించడం కోసం అంబులెన్స్ను ఉపయోగించుకున్నారు. అంతేకాక సరదా కోసం రష్యా నుంచి బెల్లీ డ్యాన్సర్లను పిలిపించుకుని.. హడావుడి చేశారు. లాలాలజపతి రాయ్ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యను అభ్యసించిన 1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులు.. సోమవారం నాడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో పూర్వ విద్యార్థులు.. సెలబ్రేషన్స్ను అట్టహాసంగా నిర్వహించేందుకు మద్యం, మగువలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మద్యాన్ని తరలించేందుకు అంబులెన్స్ వాహనాన్ని వినియోగించారు. రష్యాను పిలిపించిన బెల్లీ డ్యాన్సర్లతో కలిసి వైద్యులు కూడా చిందులు వేశారు. ఈ విషయంపై మెడికల్ కాలేజ్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ వినయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి తనకు అప్పుడే తెలిసిందని చెప్పారు. . ఆ కార్యక్రమ నిర్వాహకుల నుంచి సమాధానం రావాల్సి ఉందని, మద్యం సరఫరాకు వినియోగించిన అంబులెన్సు మెడికల్ కాలేజీకి సంబంధించినదేనా లేదంటే ప్రైవేటు ఆస్పత్రికి చెందినదా అన్న విషయంపై క్లారిటీ లేదని, ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం తీవ్రంగా ఖండించింది. ఈ పార్టీలో పాల్గొన్న వైద్యులపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. -
ఒబామా కూతురు పేరు నటాషా అని తెలిసి....
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామా చిన్న కూతురు సాశా ఒబామా శనివారం నాడు తన 16వ పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నారు. ఇది పెద్ద వార్త కాలేదుగానీ సాశా ఫస్ట్ నేమ్ నటాషా అని తెలిసి తాను ఏడాది క్రితం అమితాశ్చర్యానికి గురయ్యానని ఆశ్లే సీ ఫోర్డ్ ట్వీట్ చేయడం పెద్ద దుమారమే లేపింది. వేలాది మంది నటాషా పేరును షేర్ చేసుకున్నారు. వారంతా తమదైన శైలిలో స్పందించారు. ‘సాశా పేరు నటాషా అని తెలియని ఓ అబద్ధాల ప్రపంచంలో మనం ఇంతకాలం బతుకుతున్నామైతే’ అని కొందరు స్పందించగా, అమెరికా అధ్యక్షుల వెనక రష్యా కుట్ర ఉందడానికి నటాషా పేరే సాక్ష్యమని కొందరు వ్యాఖ్యానించారు. నటాషా అనే పేరు రష్యన్లు ఎక్కువ మంది పెట్టుకుంటారని, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం వెనక రష్యా కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. సాశా అసలు పేరు నటాషా అయితే ఒబామా పెద్ద కూతురు మాలియా అసలు పేరు చెల్సియానా? అంటు కొందరు ట్విట్టర్లో ప్రశ్నించారు. మరికొందరు మారియా అసలు పేరు బోరిస్ అంటూ ఖాయం చేశారు. సాశా పూర్తి పేరు సాశా అకా నటాషా ఒబామా. ఆమె పూర్తి పేరు ఎప్పుడూ ప్రస్తావనకు రాకపోవడంతో అందరికి నటాషా పేరు తెలిసి ఉండకపోవచ్చు. కానీ మార్తాస్ వైన్యార్డ్ దీవిలోని ఓ రిస్టారెంట్లో గత వేసవిలో సాశా పనిచేసినప్పుడు ఆమె పూర్తిపేరును మొదటిసారి పేర్కొన్నారు. -
ఎలక్షన్ డేపై అమెరికా ఆందోళన
జాక్సన్విల్లే : రష్యా సైబర్ దాడులతో ఇప్పటికే వణికిపోతున్న అమెరికా, వచ్చే వారంలో జరుగబోయే ఎన్నికల రోజు మరోసారి ఆ దేశం సైబర్ ఎటాక్స్ చేస్తుందోమోనని భయపడుతోంది. అమెరికా సెక్యురిటీ, ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ఈ భయాందోళలను వ్యక్తపరుస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే వివిధ మీడియా సంస్థలు అమెరికాను హెచ్చరించాయి. ఈ ఎటాక్స్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనప్పటికీ, రిజల్ట్స్ చట్టబద్ధతపై సందేహం వ్యక్తమయ్యే అవకాశముందుని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రష్యా సైబర్ ఎటాక్స్ అంచనాలు అమెరికా గూఢచార్య ఏజెన్సీలలో మరింత భయాందోళనలను నెలకొల్పుతున్నాయి. దాడులు జరిగితే అవి రాజకీయ సంక్షోభానికి దారితీస్తాయని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. అయితే అమెరికా ఎన్నికల ఫలితాలనేమీ రష్యా ఖరారు చేయదని హోస్ ఇంటెలిజెన్స్ కమిటీలో టాప్ డెమోక్రాట్ అడమ్ బి స్కిఫ్ మండిపడుతున్నారు. రష్యన్ లేదా ఇతర వ్యక్తులు మంగళవారం జరుగబోయే అధ్యక్ష ఎన్నికలను అణగదొక్కాలని చూస్తున్నారని, ఈ క్రమంలోనే వారు హ్యాకింగ్కు ప్లాన్ చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు సైతం అనుమానిస్తున్నట్టు ఎన్బీసీ న్యూస్ రిపోర్టు చేసింది. అసలైన ఓటింగ్లో లేదా ఓట్ కౌంటింగ్లో ఏమైనా తప్పుదోవలు జరిగినట్టు తెలిస్తే, అది సీరియస్ ఉల్లంఘనగా పరిగణిస్తామని ముందుగానే రష్యాకు వార్నింగ్లు వెళ్లాయి. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కేవలం టెక్నికల్గానే కాక, మెసేజింగ్ వంటి పలువిషయాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో సైబర్ దాడులకు అవకాశం ఇవ్వమని అధికారులు పేర్కొంటున్నారు. స్టేట్స్లో ఓటింగ్ మిషన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంచడం లేదని, వివిధ స్థాయిల్లో విస్తృతమైన పర్యవేక్షణను ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. -
బేస్ జంప్లో నయా వరల్డ్ రికార్డ్
బీజింగ్: చైనాలో మంచుతో కూడిన పర్వతప్రాంతం చొ వోయు. 25,262 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకోవడానికే పర్వతారోహకులు నానా అవస్థలు పడతారు. అలాంటిది ఓ వ్యక్తి ఆ పర్వతం అంచునుంచి బేస్ జంప్ చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. రష్యాకు చెందిన అథ్లెట్ వలెరి రొజోవ్ బేస్ జంప్లో తన పేరిట ఉన్న వరల్డ్ రికార్డును మరోసారి బ్రేక్ చేశాడు. గతంలో హిమాలయ పర్వతశ్రేణుల్లో 23,688 అడుగుల ఎత్తునుంచి బేస్ జంప్ చేసి రొజోవ్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అయితే చైనాలోని చొ వోయు పర్వతాల్లో 25, 263 అడుగుల ఎత్తు నుంచి బేస్ జంప్ చేయాలనేది అతడి స్వప్నం. దీని కోసం తీవ్రంగా సాధన చేసిన అతడు ఎట్టకేలకు సాధించాడు. చొ వోయు పర్వత అంచుకు చేరుకోవడానికే రొజోవ్కు 21 రోజులు పట్టింది. వింగ్ సూట్తో బేస్ జంప్ చేసిన రొజోవ్ చివర్లో పారాచూట్ సహాయంతో 90 సెకన్లలో క్షేమంగా మంచుపై దిగాడు. రొజోవ్ సాహసకృత్యానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అందరిచే ఔరా అనిపిస్తున్నాయి. -
బేస్ జంప్లో నయా వరల్డ్ రికార్డ్
-
ఇది మరో రష్యా కోడలి ప్రేమకథ
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యంతో ఓ రష్యన్ యువతి కాపురం చక్కబడగా తాజాగా మరో రష్యా యువతి కథనం బయటకు వచ్చింది. అయితే, ఇందులో విషాదం లేదు.. అంతా సంతోషమే. భారత సంప్రదాయం చాలా గొప్పదని ఇక్కడ తనకు ప్రశాంతత దొరకడంతోపాటు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే భర్త కూడా దొరికాడని ఆమె చెప్పుకొచ్చింది. రష్యాలో డెంటిస్టుగా పనిచేస్తున్న తాతియానా జురిలోవా అనే రష్యన్ యువతికి యోగా అంటే చాలా ఇష్టం. ఆమె రష్యాలో బేసిక్స్ నేర్చుకుంది. మరింత నేర్చుకునేందుకు ఇండియా వెళ్లాలని ఆమె గురువు సలహా ఇవ్వడంతో డిసెంబర్ 2014లో ఢిల్లీకి వచ్చింది. అనంతరం రిషికేశ్ కు వెళ్లిన ఆమె ప్రాణయామ, ఆసనాలు, మెడిటేషన్ వంటివి నేర్చుకుంది. అయితే, మరింత లోతుగా నేర్చుకునేందుకు వారణాసిలో ఓ టీచర్ ఉన్నాడని తెలుసుకొని ఆమె అక్కడికి బయల్దేరింది. అయితే, అప్పుడే జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఓ సెమినార్ కార్యక్రమానికి వెళ్లొస్తున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతడు వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిశ్వవిద్యాలయం(బీహెచ్యూ)లో స్కాలర్ కావడంతో ఇద్దరు కలిసి వారణాసి వెళ్లారు. అలా వారి పరిచయం మొదలైంది. కొద్ది రోజులపాటు యోగా నేర్చుకున్న ఆమె తిరిగి రష్యా వెళ్లిపోయింది. అనంతరం వారిద్దరు ప్రతి రోజు ఫేస్ బుక్ లో చాట్ చేసుకున్నారు. తొలుత చంద్రశేఖర్ ప్రపోజ్ చేయగా ఆమె నిరాకరించింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఓకే చెప్పింది. దీంతో వారిద్దరు 2015 జూలైలో పెళ్లి చేసుకున్నారు. ఇలా యోగా తనకు ఎలా జీవితాన్ని ఇచ్చిందో ఆమె మీడియాకు చెప్పింది. -
విస్మయ పరుస్తున్న 'విండో సన్ బాత్'
రష్యాః సన్ బాత్ చేయాలంటే బీచ్ లకు, తీర ప్రాంతాలకు వెడుతుంటారు. అవకాశం లేనివారు కొందరు.. బాల్కనీల్లోనూ, అపార్ట్ మెంట్లు, భవనాల టెర్రస్ లను సన్ బాత్ కు వినియోగించుకుంటారు. అయితే అసలు బయటకు వెళ్ళే పనే లేదంటోంది ఓ రష్యన్ మహిళ. బికిని ధరించి, ప్రతిరోజూ కిటికీ నుంచీ వచ్చే ఎండనే సన్ బాత్ కు వినియోగించుకుంటూ చుట్టుపక్కల వారిని విస్మయపరుస్తోంది. రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్యాపట్టణం నోవోసిబిర్స్క్ క్రోపోట్కిన్ వీధిలోని ఓ ఇంటి కిటికీనుంచీ ప్రతిరోజూ కనిపించే సన్ బాత్ దృశ్యం ఇరుగు పొరుగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో నివసించే మహిళ.. బికినీ ధరించి, తలభాగం మాత్రం లోపల, మిగిలిన శరీరభాగం కిటికీనుంచి బయటకు కనిపించేలా సన్ బాత్ చేస్తూ చూపరులను అకట్టుకోవడమేకాదు.. ఒకింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. సన్ బాత్ చేయాలంటే బీచ్ లకు, పార్క్ లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా చేయాలో అందరికీ తెలిసేట్లు చేస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతం వరకూ విండో సన్ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆమె.. ఇప్పుడు అక్కడి వార్తల్లో వ్యక్తిగా మారింది. అయితే కొందరు కాలనీవాసులు మాత్రం ఆమె సన్ బాత్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అక్కడే చిన్న పిలలు అడుకుంటుంటారని, సదరు మహిళ ఎక్స్ పోజింగ్ ను తట్టుకోలేకపోతున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆమె విండో సన్ బాత్ ను ఆపించాలంటూ ఇరుగుపొరుగువారంతా సంతకాలు చేసిన ఓ పిటిషన్ ను స్థానిక బిల్డింగ్ అడ్మినిస్ట్రేటర్ కు, పోలీసులకు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే ఎవరేం అనుకుంటే నాకేంటీ అన్నట్లు సదరు సన్ బాతర్ మాత్రం తనకు ఇష్టం వచ్చినంత సమయం విండో సన్ బాత్ చేస్తూనే ఉంది. దీంతో కొందరు అటుగా వెళ్ళేవారు ఆమె ఫోటోలు తీసి పోస్ట్ చేయడంతో ఇప్పుడు రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేలమంది షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. ఆమె సన్ బాత్ విషయం స్థానికులను ఇబ్బంది పెట్టడమేకాక.. ఎప్పుడోప్పుడు విండోనుంచి పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ఆమె ఇలా కాళ్ళు, నడుమువరకూ బయటకు పెట్టి ఎక్స్ పోజ్ చేయడం మొదటిసారి కాదని, బాడీ మొత్తం సమాంతరంగా ట్యాన్ అయ్యేందుకు, శరీర పై భాగాన్ని కూడ ఎండలో బయటకు పెట్టేదని చెప్తున్నారు. కానీ అటువంటప్పుడు పూర్తి శాతం బికినీతో ఉండేదని మరి కొందరు ఇంటర్నెట్ వినియోగదారులు అంటున్నారు. ఎవరేమనుకున్నా ఆ సన్ బాత్ సుందరి మాత్రం.. తన రోజువారీ కార్యక్రమాన్ని ఆపేట్టు కనిపించడం లేదు. -
క్రిమినల్స్ పనిపడుతున్న 'బ్యాట్ మ్యాన్'!
మాస్కోః సమాజంలో చీడపురుగుల్ని ఏరి పారేయాలంటే ఏదో అద్భుత శక్తి ఉద్భవించాల్సిందే.. అలాగే చట్టాన్నీ, పోలీసుల్నీ తప్పించుకుని తిరిగే అక్రమార్కులను అంతం చేయాలన్నా అటువంటి వారివల్లే కావాలి. అందుకే మన దర్శకులు అలాంటి పాత్రలను సృష్టించి వారిని హీరోలుగా చూపిస్తుంటారు. కానీ మాస్కోలో దుష్టశక్తులను చీల్చి చెండాడేందుకు నిజంగానే ఓ వ్యక్తి రంగంలోకి దిగాడు. చీకటి పనులకు పాల్పడే క్రిమినల్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. రష్యాలోని మాస్కో శివారు ప్రాంతమైన కిమ్కీలో మారువేషం ధరించి వచ్చే మనిషి.. స్థానిక నేరస్థుల పనిపడుతున్నాడు. సమాజానికి చెడు తలపెట్టే ప్రతి వ్యక్తిపై దృష్టి సారిస్తున్న 'బ్యాట్ మ్యాన్' వివరాలను తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ వివరించాడు. ఎక్కడ అన్యాయం, హింస, అవినీతి ఉంటుందో అక్కడ తాను ప్రత్యక్షమౌతానంటూ ఛాలెంజ్ చేస్తున్న ఆ అపరిచితుడు.. బ్యాట్ మ్యాన్ దుస్తులతో ముసుగు ధరించి వచ్చి.. నేరస్థులను చితకబాది వదిలిపెడుతున్నట్లు చెప్పాడు. గతనెల్లో జరిగిన ఇటువంటి ఘటనపై వివరాలు వెల్లడించిన ట్యాక్సీ డ్రైవర్.. ఘటనతర్వాత అక్కడకు వచ్చిన పోలీసులు.. సదరు క్రిమినల్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాడు. హీరోలా వచ్చి విలన్ల లాంటి క్రిమినల్స్ పనిపడుతున్న ఆ ముసుగు వ్యక్తిని ఇప్పుడు కిమ్కీ వాసులు 'కిమ్కీ బ్యాట్ మ్యాన్' అని పిలుస్తున్నారు. గత నెల్లో జరిగిన ఘటనలో సదరు ముసుగు వీరుడు.. అర్థరాత్రి సమయంలో ఓ భవనంలోకి ప్రవేశించి, అక్కడివారిని చితకబాది వదిలి పెట్టాడని, తర్వాత ఆ భవనం డ్రగ్ డెన్ గా తెలిసిందని ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు తెలిపిన వివరాలను బట్టి తెలుస్తోంది. దీంతో ఇప్పడా బ్యాట్ మ్యాన్ వివరాలు తెలుసుకునేందుకు ఓ రష్యా పత్రిక పరిశోధనలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సదరు వ్యక్తి పోలీసులకు ట్వీట్ చేసిన లేఖను సంపాదించింది. నేరస్థులపై వన్ మ్యాన్ ఆర్మీలా యుద్ధం చేస్తానని, మానవత్వానికి మొదటి హీరో తానేనంటూ తనను తాను అభివర్ణించుకున్న అతడు.. తన పేరు రీపర్ అంటూ ఆ లేఖలో తెలిపాడు. తన ప్రయత్నానికి పోలీసుల అండదండలు కావాలని లేఖద్వారా విన్నవించాడు. తాను చట్టానికి వ్యతిరేకం కాదని, పోలీసులు వెళ్ళలేని ప్రాంతాలకు సైతం తాను వెళ్ళి, అక్కడి నేరగాళ్ళు, డ్రగ్ మాఫియా, రేపిస్టులవంటి వారి పని పడతానని అందుకు సమాచారం ఇచ్చి సహకరించాలని పోలీసులను లేఖలో కోరాడు. తన ట్విట్టర్ పేజీ (Twitter page, @JnecReaper) ద్వారా నేరస్థుల సమాచారాన్ని తనకు కిమ్కీ వాసులెవ్వరైనా అందించవచ్చని కూడ తెలిపాడు. ఇప్పటికే నేరస్థుల విషయంలో పోలీసులకు సహకరించానని, ఎన్నో డ్రగ్ ల్యాబ్స్ ను నాశనం చేశానని లేఖలో వివరించిన అతడి ట్విట్టర్ అకౌంట్ తెరిస్తే మాత్రం 'ఇది ఆరంభం మాత్రమే' అని ఉందట. -
అంతరిక్షంలోకి మొదటిసారి బ్రిటిష్ మహిళ
లండన్ః అంతరిక్షంలోకి మొట్ట మొదటిసారి బ్రిటిష్ మహిళ పయనమైంది. తన రష్యన్ క్రూ మేట్స్ తో కలసి శుక్రవారం స్పేస్ ఫ్లైట్ ఎక్కిన హెలెన్ షర్మాన్.. ఇప్పటిదాకా అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళా వ్యోమగాముల్లో 12వ మహిళగా చరిత్ర సృష్టించారు. సోయూజ్ టిఎమ్12 వ్యోమ నౌకలో.. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నతన రష్యన్ క్రూమేట్స్ తో కలసి హెలెన్ అంతరిక్షంలోకి వెళ్ళారు. 1991 మే 20న మిర్ స్పేస్ స్టేషన్ నుంచి మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన తన ఇద్దరు క్రూ మేట్స్ అయిన రష్యన్ వ్యోమగాములు అనటోలి అర్ట్సెబర్స్ కీ, సెర్జీ క్రికలెవ్ ల తో కలసి హెలెన్ స్పేస్ ప్రయాణం ప్రారంభించారు. ఆరు రోజుల పాటు అంతరిక్షంలో గడపనున్న హెలెన్ బృందం అనేక శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు. అంతరిక్ష నౌకను ఎక్కేందుకు ధరఖాస్తు చేసిన మొత్తం 13,000 మంది అభ్యర్థుల్లో హెలెన్ షర్మాన్ స్పేస్ ప్రయాణానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం హెలెన్... ప్రముఖ లండన్ సైన్స్ యూనివర్శిటీకి చెందిన ఇంపీరియల్ కాలేజ్ లో రసాయన శాస్త్ర విభాగానికి ఆపరేషన్స్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెలెన్ తో పాటు స్పేస్ లోకి ప్రయాణమైన క్రికలేవ్ ఇప్పటికే ఎన్నోసార్లు అంతరిక్షంలోకి వెళ్ళి, వ్యోమగామిగా ఎంతో అనుభవాన్ని పొందారు. ఆయన మొత్తం 803 రోజుల అంతరిక్షంలో గడిపారు. అంతేకాక అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన రెండవ ప్రముఖ వ్యోమగామిగా ఆయన పేరొందారు. -
రేప్ చేసి స్వేచ్ఛగా..
పనాజీ: గోవాలో 25ఏళ్ల రష్యా పర్యాటకురాలిపై లైంగిక దాడి కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. రేప్ చేసిన వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు అతడిని పోలీసులు అరెస్టు చేయడంగానీ, కనీసం రష్యన్ కాన్సులేట్కు ఆ సమాచారం అందించడంగానీ చేయలేదు. బాధితురాలిపై లైంగిక దాడి జరిగి ఐదురోజులు పూర్తి కావస్తున్నా కేసు ముందడుగు వేయకపోవడంతో మొత్తం దేశ న్యాయవ్యవస్థకే కలంకం తెచ్చేలాగా ఉంది. బాధితురాలి పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం గత నెల 28న గోవాలోని మోర్జిమ్ అనే బీచ్ కు రష్యా పర్యాటకురాలు వచ్చింది. అక్కడే ఉన్న బీచ్ రిసార్ట్ లో అద్దెకు దిగింది. ఆరోజు రాత్రి ఆ రిసార్ట్ ఓనర్ తన మాస్టర్ కీని ఉపయోగించి ఆమె గదిలోకి ప్రవేశించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాధితురాలు పోలీసులకు చెప్తుండగానే మీడియాకు కూడా తెలిసిందే. అయితే, దీనిపై అప్పుడే రాద్ధాంతం చేయొద్దని పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు సూచించారు. అయితే, వారు కనీసం ఈ విషయాన్ని గోవాలోని రష్యాకు చెందిన అధికారులకు గానీ, ముంబయిలోని కాన్సులేట్కు గానీ తెలియజేయలేదు. ఈ విషయం స్వయంగా ఆ కాన్సులేట్ అధికారులే తెలిపారు. 'మా దేశ యువతిపై రేప్ జరిగిందని మాకు ఏ పోలీసులు అసలు చెప్పలేదు. కేవలం మీడియా ద్వారానే ఈ విషయం తెలిసింది. ఇది చాలా దురదృష్టకరం. బాధితురాలి నుంచి గానీ, గోవా పోలీసుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అందలేదు. తమకు ఆ సమాచారం అందితే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాము' అని రష్యా కాన్సులేట్ అధికారులు చెప్పారు. -
ఏడువేల కోట్ల ఖర్చుతో ఖరీదైన పెళ్ళి..!
మాస్కోః ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీటవేసి అంటూ అంగరంగ వైభవంగా జరిగే పెళ్ళిళ్ళను వర్ణిస్తారు. అదే కోవకు చెందేట్టుగా ఉంది ఓ రష్యన్ బిలియనీర్ కుమారుడి వివాహ వైభోగం. జెన్నీఫర్ లోపేజ్ అద్భుత ప్రదర్శనతోపాటు... సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే వధువు వెడ్డింగ్ డ్రెస్ ఆ సంపన్న వివాహ కార్యక్రమంలో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. రష్యన్ చమురు దిగ్గజం మిఖాయిల్ గుట్సరీవ్ తన 28 ఏళ్ళ కుమారుడు సెయిడ్ పెళ్ళి విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా 6,800 కోట్ల రూపాయల ఖర్చుతో లావిష్ గా పెళ్ళి జరిపించాడు. 20 ఏళ్ళ మెడికల్ విద్యార్థిని ఖదీజా ఉదకోవ్, సెయిడ్ లు నాలుగేళ్ళ సహజీవనం తర్వాత సంప్రదాయ బద్ధంగా మాస్కోలో జరిగిన వివాహంతో దంపతులయ్యారు. సువాసనలు వెదజల్లే సుమాలతో అందంగా తీర్చి దిద్దిన కల్యాణ మండపం, ఖరీదైన కార్లతో మాస్కోలోని లగ్జరీ రెస్టారెంట్ లోని సఫియా బ్యాంకెట్ హాల్ అతిథులను అమితంగా ఆకట్టుకుంది. సుమారు మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు, మంచి ముత్యాలు పొదిగిన 11.5. కేజీల బరువైన ఎలీసాబ్ గౌనును వధువు ఖాదిజాకోసం పారిస్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. జెన్నీఫర్ లోపేజ్ స్టేజ్ షో అంటే ఆషామాషీ కాదు. ఆమె ప్రదర్శనకు ఆరు కోట్ల రూపాయల వరకూ చెల్లించినట్లు 2013 లో టర్క్మెనిస్టియన్ ప్రెసిడెంట్ వెల్లడించారు. గుట్సరీవ్ వివాహ కార్యక్రమంలో అటువంటి ప్రదర్శన అతిథుల మనసును దోచుకుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సుమారు 600 మంది దాకా పెళ్ళి వేడుకకు హాజరయ్యారు. అత్యుత్తమ యూరోపియన్ వంటకాలు, ఎనిమిది అంతస్తుల భారీ కేక్ తో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. తెల్లని ఐసింగ్, గులాబీ పూలతో అందంగా అలంకరించిన కేక్ పై కనిపించిన నెలవంక, స్టార్ గుర్తులు ఆ నవ దంపతుల మత విశ్వాసానికి నిదర్శనంగా నిలిచాయి. అమావాస్యనాడు వెన్నెల కురిసినట్లుగా వినీలాకాశంలో వెలుగులు నింపిన బాణసంచా సందడి మధ్య గుట్పరీవ్, ఖదీజా ఉదకోవ్ ల ఖరీదైన వివాహం ప్రత్యేకతను సంతరించుకుంది. -
మా పూర్తి మద్దతు ఉంటుంది
-
మేయర్గా పిల్లి!
కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఎన్నిక.. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రష్యా.. బార్నౌల్ నగరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో మార్జాలం పోటీచేయడమే వింతనుకుంటే.. ఏకంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ప్రపంచాన్ని ఆకర్షించిన వార్తయింది. అసలు పిల్లేంటి? ఎన్నికల్లో పోటీ చేయడం ఏమిటి? అని ఆరాతీస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిని అరికట్టాలనే ఆలోచనను ప్రాక్టికల్ గా అమలుచేస్తూ స్థానిక ప్రజలు బార్సిక్ అనే పిల్లిని స్థానికులు మేయర్ గా పోటీలోకి దింపారు. సాధారణ ఎన్నికల్లో జంతువులు పోటీచేయకూడదనే నిబంధన ఉంది కాబట్టి ఆన్ లైన్ లో ఎన్నికలు నిర్వహించారు. నిజం ఎన్నికలను మైమరపించేలా ప్రచారకార్యక్రమాన్ని నిర్వహించారు. నిజం ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకంటే మెరుగైన ప్రజాసేవ చేస్తానన్న పిల్లిగారి వాగ్ధానాన్ని ఓటర్లు నమ్మారు. దీంతో తొంభై శాతం ఓట్టను కైవసం చేసుకుని బార్సిక్ ముందువరుసలో నిలిచింది. రష్యన్ సోషల్ మీడియా వెబ్సైట్ (Vkontakte) ద్వారా టికెట్ పొందిన తర్వాత సియమీస్ పిల్లి బార్సిక్.. మేయర్ ఎన్నికల్లో అనేకమంది ఓటర్ల హృదయాలను దోచేసింది. కొత్త మేయర్ ను ఎన్నుకునే సందర్భంలో.. ఆన్లైన్లో జరిగిన పోలింగ్ లో అరుగురు అభ్యర్థులపై పోటీ చేసిన పిల్లి విజయపథంలో దూసుకుపోయింది. స్థానిక ఇంటర్నెట్ గ్రూప్ ద్వారా పోస్ట్ చేసిన పిల్లి.. అభ్యర్థుల జాబితాలో స్థానం సంపాదించింది. అంతేకాదు జనం కూడ ఆ నాలుగుకాళ్ళ అభ్యర్థిని ఆనందంగా ఓట్లేసి గెలిపించేయడం అక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. ఓపక్క ఆన్లైన్లో 'గో బార్సిక్'... 'బార్సిక్ రూల్స్' అన్న నినాదాలతో ఓటర్లంతా పలికిన మద్దతుకు రష్యన్ సోషల్ మీడియా నిండిపోయింది. "పోటీ చేసిన అభ్యర్థులకంటే పిల్లే బాగా నిజాయితీగా పనిచేస్తుందని ఓటర్లు నమ్మారు అందుకే దాన్ని గెలిపించారు" అంటూ అలెగ్జాండర్ రెషెత్నికోవ్ పేరున ఓ యూజర్ కూడ ఈ సందర్భాన్ని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించారు. అయితే ఇంతకు ముందు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఇగోర్ సావింట్నేవ్ ను తొలగించిన తర్వాత... ప్రస్తుతం పీటర్ ఫ్రైసన్ ఈ నగర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై పిల్లి స్థానంలో మేయర్ బాధ్యతలను ఎవరు స్వీకరిస్తారు అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. పిల్లిని సపోర్ట్ చేసిన ఓటర్లే ఆ విషయం నిర్ణయిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. -
రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన టర్కీ
♦ టర్కీపై మండిపడ్డ పుతిన్ ♦ త్వరలో నాటో ప్రత్యేక సమావేశం అంకారా: తమ గగనతలంలోకి ప్రవేశించిందన్న కారణంతో రష్యా సుఖోయ్ యుద్ధ విమానం ఎస్యూ 24ను టర్కీ సైన్యం ఎఫ్ 16 యుద్ధ విమానంతో కూల్చివేసింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనను టర్కీ సైన్యంతోపాటు, రష్యా అధికార వర్గాలు ధ్రువీకరించాయి. తమ గగనతలంలోకి ప్రవేశించడంతోపాటు పలుమార్లు చేసిన హెచ్చరికలను లెక్కచేయనందునే రష్యా విమానాన్ని కూల్చేసినట్లు టర్కీ పేర్కొంది. రష్యా విమానం టర్కీ సరిహద్దు కొండల్లో పేలిపోగా.. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో బయటపడ్డారని. వీరిలో ఒకరు సిరియా ఉగ్రవాదులకు చిక్కారని టర్కీ మీడియా చెప్తుండగా, అయితే ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించారని, మరొకరు గల్లంతయ్యారని సిరియా వర్గాలు చెబుతున్నాయి. టర్కీ గగనతలంలోకి తమ విమానం ప్రవేశించిందనడాన్ని రష్యా ఖండించింది. తమ విమానం సిరియా గగనతలంలోనే ఉన్నట్లు నిరూపిస్తామని సవాల్ విసురుతోంది. కానీ, సిరియాలోని ఉగ్రవాదులపై దాడుల పేరుతో తమ సరి హద్దు గ్రామాలపై ర ష్యా దాడులు చేస్తోం దని టర్కీ పేర్కొం ది. టర్కీకి రక్షణగా యూఎస్ యూరోపియన్ కమాండ్ ఆరు యుద్ధ విమానాలను అక్కడ మోహరించింది. టర్కీ గగనతలంలోకి రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించడాన్ని నాటో తప్పుబట్టింది. టర్కీ అభ్యర్థనమేరకు ఈ ఘటనపై చర్చించేందుకు నాటో వర్గాలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నాయి. విమానాన్ని కూల్చడం వెన్నుపోటే: పుతిన్ సిరియా టర్కీ సరిహద్దులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన తమ యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చివేయడాన్ని రష్యా జీర్ణించుకోలేక పోతోంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడ్డారు. తమ యుద్ధ విమానాన్ని కూల్చడం వెన్నుపోటని వ్యాఖ్యానించారు. తమ విమానం సిరియా సరిహద్దులో పడిపోయిందని.. అది టర్కీ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. తాజా ఘటన రష్యా, టర్కీ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కాగా తమ గగనతల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలైనా తీసుకునే హక్కు తమకుందని అందరికీ తెలుసని టర్కిష్ ప్రధాని అహ్మెత్ డవుటోగ్లు వ్యాఖ్యానించారు. -
రష్యా డోపింగ్ ఏజెన్సీపై నిషేధం
కొలరాడో స్ప్రింగ్స్: ఇప్పటికే రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతుండగా ఈసారి రష్యా డోపింగ్ నిరోధక ఏజెన్సీ (ఆర్యూఎస్ఏడీఏ)పై వేటు పడింది. నిబంధనలకు అనుగుణంగా ఈ ఏజెన్సీ పనిచేయకపోవడంతో సస్పెండ్ చేయాలని వాడా ఫౌండేషన్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. వాడా కోరిన ఆటగాళ్ల శాంపిల్స్ను నాశనం చేయడంలో ఆర్యూఎస్ఏడీఏ కీలక పాత్ర పోషించింది. ఈ వేటుతో రష్యాకు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. వాడా, ఐఓసీ నిబంధనలను అంగీకరించే దేశాలే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంటుంది. ‘డోపింగ్ ఏజెన్సీని పూర్తిగా మారుస్తాం’ మాస్కో: తమ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని రష్యా క్రీడా మంత్రి విటలీ ముట్కో తెలిపారు. ‘వాడా నుంచి ఇలాంటి నిర్ణయం వస్తుందని ఊహించాం. మా డోపింగ్ నిరోధక ఏజెన్సీ వ్యవస్థను పునర్నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో వాడాకు అన్నివిధాలా సహకరిస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు. -
కూలిన రష్యా విమానం దృశ్యాలు విడుదల
-
ఆకాశమే హద్దుగా..
-
రష్యాలో కూలిన ఎయిర్ క్రాప్ట్
-
నెత్తి మీద పిడుగు..!
భూమి వైపు దూసుకొస్తున్న రష్యా వ్యోమనౌక మాస్కో: భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు సరుకులు మోసుకెళ్లిన రష్యా మానవ రహిత వ్యోమనౌక ‘ప్రోగ్రెస్ ఎం-27ఎం’ దారి తప్పింది. నియంత్రణ కోల్పోయి భూమి వైపే దూసుకొస్తోంది! సోయుజ్ రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను రష్యా మంగళవారం ప్రయోగించింది. అయితే, నిర్దేశిత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరడంతో పాటు వ్యోమనౌక భూమితో సంబంధాలు కోల్పోయింది. దీంతో భూమి చుట్టూ తిరుగుతూ క్రమంగా కిందికి దిగుతోందని రష్యా అధికారులు వెల్లడించారు. అయితే, ప్రోగ్రెస్ వ్యోమనౌక బుధవారం 197 కి.మీ. ఎత్తులో తిరుగుతోందని, మే 5-7 తేదీల మధ్య వాతావరణంలోకి ప్రవేశించి అది మండిపోతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వ్యోమనౌక శకలాల్లో చాలావరకూ మండిపోతాయని, కానీ మిగిలిపోయే కొన్ని శకలాలు ఎక్కడ పడతాయో మాత్రం తెలియదన్నారు. -
ఓవర్కోట్ వేసిన దారి.....
కథలెందుకు రాస్తారు? ప్రఖ్యాత రష్యన్ రచయిత గొగోల్ 170 ఏళ్ల క్రితమే ఓవర్కోట్ కథ రాసి రచయితలు ఎందుకు రాయాలో సమాజంలో దేనిని చూడాలో తెలియజేసి వెళ్లాడు.... పో మొదట గుర్తుకు రావాలి. తొలి నమస్కారం అతడికే. పిదప గొగోల్. ఇద్దరూ ఒకే సంవత్సరంలో పుట్టారు- మన తెలుగు కథ పుట్టడానికి సరిగ్గా వందేళ్ల ముందర. 1809లో. ఇద్దరూ ఒకేసారి కథలు రాశారు. కథ మొదలయ్యింది- అంటే ఇవాళ మనం చూస్తున్న వచన కథ మొదలయ్యింది అడ్గార్ ఆలెన్ పో తోనే అనంటారు. పో 1833లో MS.Found in a Bottleఅనే కథ రాసి లోకం దృష్టిలో పడ్డాడు. ఏమిటి వస్తువు? సముద్ర సాహసం. ఆ రోజుల్లో అదే కథావస్తువు అంటే. స్వప్నలోకానికి తీసుకెళ్లి దిగవిడిచే మాయాబెత్తం. అందుకే పో ఆ వస్తువు తీసుకున్నాడు. ఒక ఓడ. ఒక కథకుడు. ఓడ తుఫాన్లో చిక్కుకోవడం. ఎటో కొట్టుకు పోవడం. కథకుడు నానా అగచాట్లు పడి బతికి బట్టకట్టి దీవికి చేరుకోవడం వగైరా వగైరా. ఆ తర్వాత పో అలాంటివి చాలా రాసుకుంటూ పోయాడు. ఒక కొత్త మీడియం వంటబట్టాక దానిని ప్రచారం చేయడమే అతడికి ముఖ్యం తప్ప దానితో సాధించాల్సిన ప్రయోజనం తర్వాతి సంగతి. కాని గొగోల్ అలా కాదు. కథ రాయడం అంటూ తెలిశాక కథతో ఏం చెప్పాలి అనేది అతడు వెంటనే నిర్ణయించేసుకున్నాడు. కథ ఎందుకు పుట్టిందో కలం ఎందుకు పట్టాలో అతడికి తెలుసు. గొగోల్ 1842లో తన విశ్వవిఖ్యాత కథ The Overcoatరాశాడు. ఏం రాశాడు అందులో? ఒక గుమస్తా సుబ్బారావు. గుమస్తా బతుకు తప్ప వేరే ఏమీ తెలియదు. ఏం తింటాడు ఏం తాగుతాడు ఎలా బతుకుతాడు ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా అతడి పాత ఓవర్కోటే. చివికి ఛిద్రమై ఖననానికి సిద్ధంగా ఉన్న ఆ పాత ఓవర్కోటునే సుబ్బారావు ఏళ్ల తరబడి సెయింట్ పీటర్స్బర్గ్ చలి నుంచి కాపాడుకోవడానికి వాడుతూ ఉంటాడు. అందరికీ అతణ్ణి చూసినా ఆ పాత ఓవర్కోట్ను చూసినా హేళన. ఎగతాళి. నవ్వు. కాని సుబ్బారావు ఏం చేయగలడు? అవన్నీ పడటం తప్ప అంతకు మించి ఏం చేయగలడు? కాని సుబ్బారావుకీ అతడి పట్ల సానుభూతి ఉన్న ఒక టైలరుకీ ఉమ్మడిగా ఒకటే కల. సుబ్బారావు ఎప్పటికైనా ఒక కొత్త ఓవర్కోట్ వేసుకోవాలి. వేసుకొని దర్జాగా తిరగాలి. దానిని అందరూ చూడాలి. అంతే కోరిక. చిన్న కోరిక. కాని పైసలెక్కడివి? చాలీచాలని జీతాల భయంకర రోజులు. భయంకరమైన బతుకులు. సరే ఏవో పొదుపులూ బోనస్లూ కలిసి రావడం పైసలు జతపడటం జరిగి సుబ్బారావు- నాసీదేం కాదు- ఉన్నంతలో చాలా మంచి ఓవర్కోటు ఒకటి టైలరు ద్వారా కుట్టించుకుంటాడు. అది తొడిగిన రోజు సుబ్బారావు పేరు సుబ్బారావు కాదు. సంతోషం. ఆనందం. సంబరం. అ సంబరంలో అతడు వెర్రెక్కి పోయాడు. కిందా మీదా అయిపోయాడు. పరుగులు తీశాడు. ఆడపిల్లల వైపు ఏంవోయ్ అన్నట్టుగా ఎగాదిగా చూశాడు. వెన్ను నిటారుగా పెట్టి నడిచాడు. భలే. అంతవరకూ మృతజీవితం గడుపుతున్న సుబ్బారావుకు కొత్త ఓవర్కోటు కొత్తఊపిరి పోసింది. ఉనికినిచ్చింది. సమాజంలో సుబ్బారావు కూడా ఒక మనిషే కావాలంటే అతడికీ ఒక కొత్త ఓవర్కోట్ ఉంది చూడండి అంటూ చూపించింది. కాని- ఆ రాత్రి ఒకటి జరిగింది. ఇంటికెళుతున్న దారిలో భయంకరమైన మంచులో ఎవరో ఇద్దరు దుష్టులు సుబ్బారావును కొట్టి చితకబాది కాళ్లావేళ్లా పడుతున్నా వినకుండా అతని ఓవర్కోట్ లాక్కుని పోయారు. ఎంత దెబ్బ అది. మృత్యువు కంటే భయంకరమైన దెబ్బ. సుబ్బారావు సగమై పోయాడు. మిగిలిన సగంలో ప్రాణం పెట్టుకొని ఇలాంటివి జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అలాంటి ఒక అధికారి దగ్గరకు పోయాడు. కాని అధికారి ఇతణ్ణి మతించడానికి ఇతడేమైనా కలిగినవాడా? పలుకుబడి ఉన్నవాడా? గుమస్తా సుబ్బారావు. పోనీ పోయిందేమైనా మణులా మాణిక్యాలా? ఆఫ్టరాల్ ఒక ఓవర్కోటు. అధికారి ఛీ అన్నాడు. చీదరించుకున్నాడు. అవతలకి పో అన్నాడు. సుబ్బారావు ఆ అవమానానికి పూర్తిగా చచ్చాడు. నిజంగానే రాత్రికి రాత్రి జ్వరం వచ్చి, కలవరింతలు మొదలయ్యి, ఏడుస్తూ, అధికారిని శాపనార్థాలు పెడుతూ ప్రాణాలు విడిచాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు సెయింట్ పీటర్స్బర్గ్లో గగ్గోలు. సుబ్బారావు ప్రేతాత్మై తిరుగుతున్నాడట. ఎవరివిబడితే వాళ్లవి ఓవర్కోట్లు లాక్కుని పోతున్నాడట. పోలీసులకు ఇదంతా ఓ తలనొప్పయ్యింది. ప్రేతాత్మను ఎలా పట్టుకోవడం? మరికొన్నాళ్లకు ఏ అధికారి అయితే సుబ్బారావును చీదరించుకున్నాడో ఆ అధికారి ఓవర్కోట్ను కూడా సుబ్బారావు ప్రేతాత్మ దొంగిలించగలిగింది. అంతటితో దానికి శాంతి కలిగింది. ఆ తర్వాత మరి అది ఆ నగరంలో కనిపించలేదుగాని ఇంకెవరి ప్రేతాత్మో ఇలాంటి పనిలోకే దిగిందని చెప్తూ కథ ముగుస్తుంది. అంటే ఏమిటి? ఈ సమాజం ఉంటుంది. అది కొందరిని కనీస మర్యాదకు నోచుకోని స్థితిలో ఉంచుతుంది. ఆ కనీస మర్యాద పొందాలంటే ఏం చేయాలో చెప్పి ఆ మర్యాద పొందడానికి అవసరమైన జీవన స్థితిగతులు లేకుండా చేస్తుంది. ఇక అలాంటి వాళ్లంతా ఆ మర్యాదను, తాహతును, కనీస గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని అందుకోవడానికి పెనుగులా డుతుంటారు. ఎదురు దెబ్బలు తింటుంటారు. కొద్దో గొప్పో సాధిస్తే ఆ సాధించినవి అంతకంటే అధముల చేత పోగొట్టుకొని వీధిన పడుతుంటారు. అధికారుల చేతుల్లో చెప్పుదెబ్బలు తిని, విసిగి, తుదకు తిరగబడి ప్రతీకారంగా దొంగదెబ్బలు తీస్తూ బతుకుతుంటారు. లేకుంటే అంతరించి పోతుంటారు. ఏం సాక్షాత్కారం ఇది! కథ చదివాక కలిగే సాక్షాత్కారం. ఒక శక్తివంతమైన మాధ్యమం చేతజిక్కితే ఒక శక్తిమంతమైన రచయిత ఏం చేయగలడో 170 ఏళ్ల క్రితమే చూపించిన కథ ఇది. రచయిత అనేవాడు ఎవరి వైపు, ఎందుకు, ఏం చేయడానికి నిలుచోవాలో ప్రకటన చేసిన కథ. అందుకే అంతటి దోస్తవ్ స్కీ కూడా గోర్కి గట్రా మేమందరం ఓవర్కోట్ నుంచి వచ్చినవాళ్లమే అన్నాడు. అదీ ఓవర్కోట్ పరంపర. మహా రచయితలకు మార్గం చూపిన ఘన పరంపర. ఇవాళ్టికీ నాది గొగోల్ పరంపర అనడంలో ఒక గర్వం ఉంటుందిగాని పో పరంపర అనడంలో మర్యాద లేదు. అందువల్లే, అలా అనిపించుకోవడం కోసమే- గొగోల్ దారిలో నడవడం కోసమే- గొగోల్ అందించిన టార్చ్ను అందుకోవడం కోసమే- గొగోల్ చూపించిన విధంగా పథించడం కోసమే చాలామంది కథలు రాస్తుంటారు. రాసి నిలుస్తూ ఉంటారు. - ఖదీర్