samaikya andhra movement
-
రెబెల్స్ గెలిస్తేనే సమైక్యాంధ్ర ఉన్నట్టు: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ బరిలో ఉన్న కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు గెలిస్తేనే సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నట్టని బీజేపీ నేతలు కిషన్రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. రెబెల్స్కు మద్దతు ఉపసంహరించుకోవాలని వారి నామినేషన్లపై సంతకాలు చేసిన వారిని కాంగ్రెస్ నేతలు కోరడాన్ని తప్పుబట్టారు. సంతకాలు వెనక్కి తీసుకోండని ఒత్తిడి చేయడం, గదుల్లో బంధించడం అప్రజాస్వామికమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతిస్తే తాము ఇవ్వబోమన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పార్టీపరంగా ప్రజలకు ఇచ్చే హామీలు, ప్రణాళికలను రూపొందించేందుకుగాను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆమోదించిన ఈ కమిటీకి ప్రొఫెసర్ శేషగిరిరావు కన్వీనర్గా వ్యవహరిస్తారు. -
హైదరాబాద్లో ప్రెస్మీట్కు అనుమతి ఇవ్వరా?: ఏవీ పటేల్
విశాఖపట్నం: హైదరాబాద్లో ప్రెస్కాన్ఫరెన్స్కు అనుమతి లేదనడంపై సమైక్యాంధ్ర గెజిటెడ్ ఫోరం అధ్యక్షుడు ఏవీ పటేల్ మండిపడ్డారు. హైదరాబాద్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. విభజనకు వ్యతిరేకంగా తాము 15రోజుల్లో సమైక్యాంధ్ర ఉద్యమంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు. అందులో భాగాంగానే త్వరలో ఉద్యమ కార్యాచారణ సిద్ధం చేస్తున్నామని ఏవీ పటేల్ తెలిపారు. హైదరాబాద్లో ప్రెస్కాన్ఫరెన్స్కు అనుమతి లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్కు తెలియకుండానే .. రాష్ట్ర విభజనకు సిద్దమవ్వడం దారుణమని ఏవీ పటేల్ పేర్కొన్నారు. -
10 నుంచి ఉవ్వెత్తున ఉద్యమం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం 10న విద్యార్థి, యువకుల ర్యాలీలు.. 11న రైతులతో ట్రాక్టర్ల ర్యాలీలు 12న హైవేల దిగ్బంధం- వంటా వార్పు 14న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, సభలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ మేరకు శనివారం తదుపరి కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయే ప్రాంతాల్లో డిసెంబర్ 10న విద్యార్థులు, యువకులతో ర్యాలీలు, 11న రైతులతో ట్రాక్టర్ల ర్యాలీలు, 12న రహదారులతో పాటు హైవేల దిగ్బంధం, అదే రోజు వంటా వార్పు, 14నజిల్లాల్లోని ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు చొప్పున భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది విద్యార్థులు, యువకులు, రైతులే కనుక వారు ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్య లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు అన్ని వృత్తి వర్గాల వారు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఏకమై ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. విభజన బిల్లు ముసాయిదా కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొంది రాష్ట్రపతికి చేరుకున్నది కనుక ఈ తరుణంలో గ్రామస్థాయి నుంచి ఉద్యమం ఉధృతం చేయాలని, ఈ తరుణంలో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించే విధంగా విభజన వల్ల నష్టపోతున్న ప్రాంతాల ప్రజలు ఆందోళనల్లో పాల్గొనాలని జగన్ కోరారు. 75 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నా రాష్ట్రాన్ని చీల్చాలని చూడ్డం నిరంకుశత్వం అని ఆయన అన్నారు. పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు శోభా నాగిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్యమ కార్యాచరణ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీల నేతలను జగన్ కలుసుకుని విభజనకు వ్యతిరేకంగా వారి అభిప్రాయాన్ని కూడగడుతున్నారని, విభజన బిల్లును పార్లమెంట్లో అన్ని పక్షాలతో కలిసి అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. -
అదే జోరు.. జనోద్యమం @ 122
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 122వ రోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలను హోరెత్తించారు. సైమైక్యాంధ్ర మ్యాప్ ఆకారంలో కూర్చుని రాష్ట్రాన్ని విభజించవద్దని నినదించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులతో మంత్రి కాసు కృష్ణారెడ్డి సమైక్యాంధ్ర జిందాబాద్, విభజన వద్దు... సమైక్యాంధ్ర ముద్దు... అని నినాదాలు చేయించారు. ఇక్కడ నినాదాలు ఢిల్లీ పెద్దలకు వినిపించాలంటూ గట్టిగా నినాదాలు చేయించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా, తెలుగు వారి ఆశయాలకు అనుగుణంగా తొలిసారిగా రూపుదిద్దుకున్న భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విభజిస్తుంటే చూస్తు ఊరుకోబోమని కృష్ణా జిల్లా కలిదిండి జేఏసీ నాయకులు హెచ్చరించారు. విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారంటూ కేంద్ర మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగాయలంకలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేసి రోడ్డుపై బైఠాయించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద విద్యార్థి సమరభేరి నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల పాదయాత్ర గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్యనాదం పేరిట పార్టీ నేతలు పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర పరిరక్షణకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిర్విరామకృషిని వివరిస్తున్నారు. తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, కడపలో పాదయాత్రలు జరిగాయి. చిత్తూరులో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేశా రు. ఇక కృష్ణా, విజయనగరం, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లాల్లో దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. -
సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన.. సమైక్య భేరి
సాక్షి నెట్వర్క్: అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర విభజనకు అనుకూల ప్రకటన వచ్చిన దరిమిలా సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 118వ రోజూ సోమవారం కోస్తా, రాయలసీమ ప్రజ సమైక్య స్ఫూర్తిని కొనసాగిస్తూ వివిధ రూపాల్లో ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న కేంద్రమంత్రి జైపాల్రెడ్డి దిష్టిబొమ్మను కృష్ణాజిల్లా కలిదిండి సెంటరులో జేఏసీ నాయకులు దహనం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నాగాయలంకలో ధర్నా చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. విభజనకు అనుకూల ప్రకటనలు చేస్తున్న కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మను నెల్లూరులో దహనం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ‘రాష్ట్ర విభజన- విద్యార్థుల భవిష్యత్తు’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకట శివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై ఇప్పుడు మౌనం వహిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని, సమైక్యాంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి శైలజానాథ్కు ‘సమైక్య’ సెగ మంత్రి డాక్టర్ శైలజానాథ్కు అనంతపురం జిల్లా మండల కేంద్రమైన బత్తలపల్లిలో సోమవారం ‘సమైక్య’ సెగ తగిలింది. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘రచ్చబండ’కు హాజరైన మంత్రిని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు నిర్విరామపోరు సాగిస్తున్న పార్టీ శ్రేణులు సోమవారం నాడూ వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించాయి. చిత్తూరు, నెల్లూరు , తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలుచోట్ల ప్రారంభించిన దీక్షలు కొనసాగుతున్నాయి. -
విధులు నిర్వర్తిస్తూ.. జనోద్యమం @ 115
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 115వ రోజైన శుక్రవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. పలు జిల్లాల్లో జోరున వర్షం కురుస్తున్నా ఉద్యమం మాత్రం సడలలేదు. ఎన్జీవోలు ఓవైపు కార్యాలయాల్లో విధులకు హాజరవుతూ మరోవైపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. చిత్తూరులో న్యాయవాదులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతిలో సాప్స్ ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో చేశారు. పుంగనూరులో బీసీ సంఘం, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. సమైక్య ఉద్యమాన్ని తక్కువచేస్తూ మాట్లాడిన పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ దిష్టిబొమ్మను కృష్ణాజిల్లా కలిదిండిలో జేఏసీ నాయకులు దహనం చేశారు. అవనిగడ్డలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం భారీవర్షంలోనూ కొనసాగాయి. తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం తదితర జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగాయి. అనేకచోట్ల గడపగడపకూ వైఎస్సార్పీపీ పేరిట పాదయాత్రలు కూడా నిర్వహించారు. మంత్రి కాసుకు సమైక్య సెగ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డికి సమైక్య సెగ తగిలింది. రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన కాన్వాయ్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కాసు కారు దిగి ఆందోళనకారుల వద్దకు రాగా, మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా నినాదాలు చేశారు. విభజనను అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని ఆయన చెప్పడంతో ఆందోళన విరమించారు. -
కార్పొరేషన్లో కిరికిరి
= కమిషనర్ తీరుకు నిరసనగా ఉద్యోగుల మూకుమ్మడి సెలవు = అన్ని రకాల ప్రజా సేవలు బంద్ = విజయలక్ష్మి తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు ఒంగోలు టౌన్, న్యూస్లైన్ : ఒంగోలు నగర కమిషనర్ విజయలక్ష్మి తీరుపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో నగర పాలన స్తంభించింది. గతంలో రెండు నెలల పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రజా సేవలు బంద్కాగా ఇప్పుడు ఉద్యోగుల ఆధిపత్య పోరుతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నిత్యం వివిధ పనులపై కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వయంగా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్న కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం గమనార్హం. రచ్చకెక్కిన విభేదాలు కమిషనర్ విజయలక్ష్మి, ఉద్యోగుల మధ్య కొంతకాలంగా అంతర్గతపోరు సాగుతోంది. చివరకు ఉద్యోగులు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో విషయం రచ్చకెక్కింది. కమిషనర్ తీరు నిరసిస్తూ ఉద్యోగులంతా ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. బుధవారం మూకుమ్మడి సెలవులు పెట్టి విధులకు గైర్హాజరయ్యారు. అందరి సంతకాలతో కూడిన సెలవు చీటీని కమిషనర్కు అందించి ఒకరోజు సెలవు పెడుతున్నట్లు ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా అందరూ ఒకేసారి ఎలా సెలవు పెడతారని ఉద్యోగులను కమిషనర్ ప్రశ్నించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆమె హెచ్చరించారు. ఉద్యోగుల మూకుమ్మడి సెలవుతో కార్యాలయంలోని అన్ని విభాగాల్లో సేవలు నిలిచిపోయాయి. కమిషనర్ మాత్రమే విధులు నిర్వహించారు. ఉద్యోగుల్లేకపోవడంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వివిధ పనులపై వచ్చిన ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. కమిషనర్ వ్యవహార శైలిపై కార్పొరేషన్ ఉద్యోగులంతా కలెక్టర్ విజయ్కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె వేధింపులు భరించలేకపోతున్నామని వినతి పత్రం అందించారు. ఎక్కడి ఫైళ్లు అక్కడే కార్పొరేషన్ కార్యాలయంలో అంతర్గతపోరుతో అన్ని విభాగాల్లోనూ ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడం లేదు. దీంతో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కుంటుపడిపోతుండగా కాంట్రాక్టర్లకు చె ల్లించాల్సిన బిల్లులు నిలిచిపోయాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరుకాక ప్రజలు కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇక నిత్యం ఎదురయ్యే పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. చెప్పినా పరిష్కరిస్తారనే నమ్మకం ప్రజల్లో లేకుండా పోయింది. దీనికంతటికీ కారణం కమిషనర్ వ్యవహార శైలి అని ఉద్యోగులు ఆరోపిస్తుంటే, ఉద్యోగులే సక్రమంగా పనిచేయడం లేదని కమిషనర్ మండిపడుతున్నారు. కమిషనర్ వ్యవహారం పూర్తిగా తమను అవమానపరిచే విధంగా ఉందంటూ ఉద్యోగులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఒక్క ఫైల్ను కూడా ఉద్యోగులు సక్రమంగా రూపొందించడం లేదని కమిషనర్ చెబుతున్నారు. సక్రమంగా పనిచేయమనడం తప్పా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వీరి అంతర్గతపోరుతో చివరికి ఇబ్బంది పడుతోంది సామాన్యులే. చాలాకాలం నుంచి కార్యాలయంలో జరుగుతున్న అంతర్గతపోరును ప్రత్యేకాధికారిగా కలెక్టర్ విజయ్కుమార్తో పాటు మున్సిపల్శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్లు కమిషనర్, ఉద్యోగుల మధ్య వివాదానికి కాంట్రాక్టర్లే కారణమన్న ప్రచారం కూడా జరుగుతోంది. పనులకు సంబంధించి బిల్లులు భారీగా పెండింగ్లో ఉండటం, ఆ ఫైళ్లపై కమిషనర్ సంతకాలు చేయకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఉద్యోగులను నడిపిస్తున్నారనే విమర్శలు కాంట్రాక్టర్లపై వ్యక్తమవుతున్నాయి. దాదాపు కోటి రూపాయల వరకు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. కార్పొరేషన్ వివాదంపై ఆర్ డీ విచారణ నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ విజయలక్ష్మికి, ఉద్యోగులకు మధ్య సాగుతున్న వివాదంపై మున్సిపల్ ఆర్డీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న వివాదంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం సాయంత్రం కార్యాలయానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ బుధవారం ఉద్యోగులంతా మూకుమ్మడి సెలవు పెడుతున్నారనే సమాచారం అందిందని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ అధికారిగా పంపారని చెప్పారు. ఈ వివాదంపై అటు ఉద్యోగులతో, ఇటు కమిషనర్తో ఇద్దరితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానన్నారు. కమిషనర్, ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయన్నారు. కార్యాలయంలో అంతర్యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వీటన్నింటిపై పూర్తి సమాచారం సేకరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా పారిశుధ్య విభాగానికి చెందిన ఉద్యోగులను ఆయన ప్రశ్నించారు. కమిషనర్తో ఏమైనా ఇబ్బందులుంటే లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కోరారు. అయితే సదరు ఉద్యోగులు మాత్రం కమిషనర్తో తమకు ఎటువంటి ఇబ్బందీ లేదని, కేవలం అసోసియేషన్పరంగా సమావేశం నిర్వహిస్తున్నామంటేనే మంగళవారం సమావేశానికి వచ్చామని సమాధానమిచ్చారు. అయితే బుధవారం ఉద్యోగుల మూకుమ్మడి సెలవులో వీరూ విధులకు గైర్హాజరవడం గమనార్హం. మొత్తం ఎంతమంది సెలవు పెట్టారనే విషయాన్ని పరిశీలిస్తామని ఆర్డీ శ్రీనివాస్ తెలిపారు. కార్యాలయ విభేదాలపై ఇరుపక్షాలతో మాట్లాడి పూర్తి నివేదికను ఉన్నతాధికారులు అందజేస్తానని వివరించారు. అనంతరం ఆయన ఉద్యోగులు, కమిషనర్ విజయలక్ష్మితో చర్చలు జరిపారు. -
సీఎం సమైక్యాంధ్ర మోసగాడు : రాఘవులు
బాబు తెలంగాణలో ఓ మాట... సీమాంధ్రలో మరోమాట ఒంగోలు, న్యూస్లైన్ : ‘సమైక్యాంధ్ర ఉద్యమ మోసగాడు సీఎం కిరణ్కుమార్రెడ్డి. సొంత వర్గాన్ని కూడగట్టుకుని రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారు. సమైక్య సింహం అనే పుస్తకాన్ని వేయించుకుని రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు..’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు తెలంగాణలో ఓ మాట, సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్నారు. ఆయన వాదనలో నిజాయితీ లేదు..’ అని దుయ్యబట్టారు. ‘వర్తమాన రాజకీయ, ఆర్థిక పరిణామాలు’ అనే అంశంపై ఒంగోలులో బుధవారం నిర్వహించిన సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ వార్ రూంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఈ సమైక్య సింహం ఏం చేస్తోందని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంతా హైదరాబాద్లో కేంద్రీకరించి చంద్రబాబు తప్పు చేశారన్నారు. -
అలుపెరగని జనోద్యమం
సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం అలుపెరగకుండా సాగుతోంది. వరుసగా 98వ రోజూ మంగళవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా ఎగసింది. విశాఖ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ను ఎన్జీవోలు ముట్టడించారు. భీమవరంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు రోడ్డుపై బైఠారుుంచారు. దువ్వలో రైతు జేఏసీ నాయకులు, ఆకివీడులో వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు, భీమడోలులో వికలాంగులు నిరశన దీక్షలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సమైక్యవాదులు ధర్నా చేశారు. కాకినాడలో న్యాయవాదుల బంద్ పిలుపుతో జనజీవనం స్తంభించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్సార్ కూడలిలో విద్యార్థులు భారీ మానవహారం నిర్వహించారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ శపథం చేశారు. కృష్ణాజిల్లా చల్లపల్లి, కలిదిండిలో డ్వాక్రా మహిళలు దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్న కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేశారు. మైలవరంలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు ప్రదర్శన చేపట్టారు. విజయవాడలో న్యాయవాదులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో విద్యార్థులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. కుప్పంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, చిత్తూరులో న్యాయవాదులు రాస్తారోకో చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ర్యాలీ చేశారు. రాయదుర్గంలోని విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కోటిరెడ్డి కూడలిలో వందలాదిమంది విద్యార్థులు భారీ మానవహారం నిర్మించారు. ప్రొద్దుటూరు, బద్వేలు, రైల్వేకోడూరు పట్టణాల్లో విద్యార్థులు మానవహారాలుగా నిలబడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణుల నిర్విరామపోరు జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమిస్తున్న పార్టీ శ్రేణులు మంగళవారం నాడూ ఆందోళనలు చేపట్టాయి. సమైక్య ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిల దిష్టిబొమ్మలను పార్టీ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలో దహనం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఐస్లు అమ్మి వినూత్న నిరసన తెలిపారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుం టూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. -
చిరంజీవిపై రాళ్లువిసిరిన సమైక్యవాదులు
శ్రీకాకుళం: కేంద్ర మంత్రి చిరంజీవి ఏమంటా వరద ముంపు ప్రాంతాలలో పర్యటన మొదలు పెట్టారో అడుగడుగునా ఆందోళనలు, అటంకాలే ఎదురవుతున్నాయి. విశాఖ జిల్లా యలమంచిలిలో నిన్న వరద బాధితులు చిరంజీవి తమ వద్దకు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురంలో నాటుపడవ ఎక్కబోతూ కాలుజారి నీటిలో పడ్డారు. ఈరోజు రాజాంలో సమైక్యవాదులు అతనిపై రాళ్లు విసిరారు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటనకు వచ్చిన చిరంజీవి కాన్వాయ్పై విద్యార్థులు రాళ్లు రువ్వారు. వారితోపాటు సమైక్యవాదులు కూడా రాళ్లు విసిరారు. పదవి వదులుకున్న తరువాతే పర్యటనకు రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. నిన్న ఉదయం చిరంజీవి విశాఖపట్నం జిల్లా యలమంచిలి మీదగా వెళ్లారు. ఇక్కడ వరదకు గురైన ప్రాంతాలను చూడలేదు. బాధితులనూ పలకరించలేదు. కేంద్ర మంత్రి చిరంజీవి యలమంచిలి వస్తున్నట్లు చెప్పడంతో బాధితులు ఆయన కోసం ఎదురు చూశారు. దాదాపు మూడు గంటలపాటు ఆయన కోసం వేచి ఉన్నారు. కానీ ఆయన యలమంచిలి పట్టణంలోకి రాకుండా, బైపాస్ రోడ్డున వెళ్లిపోయారు. దాంతో స్థానిక వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాలు పడుతున్న తమను పట్టించుకోవడంలేదని వాపోయారు. ఆ తరువాత కాకినాడ సమీపంలోని తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించే సమయంలో పడవ ఎక్కబోయి కాలుజారి నీటిలో పడ్డారు. అయితే సిబ్బంది వెంటనే ఆయనను పట్టుకొని లేపారు. ఈ విధంగా ఆయన వెళ్లిన ప్రతిచోట ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది. -
ఉద్యమంలోకి చొరబాటెలా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కమిటీ గురువారం తొలిభేటీ నిర్వహించనుంది. సీమాంధ్రలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం తీరు తెన్నులు, పార్టీ శ్రేణులు అందులో భాగస్వాములు కావడం అనే అంశాలపై చర్చించనున్నారు. అంతిమంగా ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అధిష్టానం అభీష్టానికి అనుగుణంగా దాని దశదిశలను మార్చడమెలా అన్నదానిపై కార్యాచరణను రూపొందించే పనిలో పడ్డారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసప్రాంగణం క్లబ్హౌస్లో గురువారం ఈ భేటీ జరగనుంది. సమైక్య ఉద్యమం నేపథ్యంలో గత రెండు నెలలుగా కాంగ్రెస్ నేతలెవరూ సొంత నియోజకవర్గాల్లో అడుగుపెట్టలేకపోయారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన నియోజకవర్గానికి రెండునెలలుగా ముఖం చాటేయాల్సి వచ్చింది. ఒకటిరెండుసార్లు ఆ ప్రాంతానికి వెళ్లినా ఎవరి కంటా పడకుండా రాత్రికి రాత్రి వెళ్లిరావడంపై పార్టీవర్గాల్లోనే చర్చ సాగింది. ఇటీవలి పై-లీన్ తుపాను పుణ్యమా అని ఏపీ ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెనుంచి ఒకింత వెనక్కు తగ్గడంతో ఇదే అదనుగా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. సమైక్య ఉద్యమంలోకి తాము, తమ అనుచరులు చొరబడేలా కార్యాచరణ రూపొందించడమే ప్రధాన ఎజెండాగా గురువారం భేటీ కొనసాగనుంది. అధిష్టానం ఆలోచనల మేరకే..: అధిష్టానం ఆలోచనల మేరకే ఈ కమిటీ ఏర్పాటు జరిగింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స అధికారికంగా ఈ కమిటీ జాబితాపై సంతకం కూడా చేశారు. ఇపుడీ భేటీ కూడా అధిష్టానం సూచనల మేరకే నిర్వహిస్తున్నట్లు సమాచారం. కమిటీలో తమ అభీష్టానికి అనుగుణంగా నడచుకొనే సీనియర్ మంత్రులతో పాటు ఇతర నేతలకు పెద్దపీట వేశారు. సమైక్యవాదాన్ని వినిపించే సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి వంటి వారిని, పార్టీ వైఖరిని విమర్శించే వారిని దూరంగా ఉంచారు. అధిష్టానం మాటను జవదాటని మంత్రులు, నేతలను ఇందులో నియమించడం ద్వారానే కమిటీ వైఖరి స్పష్టమవుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. సమైక్యం అని కాకుండా సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు రక్షించుకోవాల్సి ఉందని ప్రకటిస్తూ వస్తున్న మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, పార్థసారథి వంటి వారికి కమిటీలో పెద్దపీట వేశారు. ఇక టీజీ వెంకటేశ్, తోటనరసింహం, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీ, బాలరాజు, అహ్మదుల్లా వంటి వారు అధిష్టానం ఎలా చెబితే అలా నడచుకుంటామని చెబుతుండడంతో గురువారం నాటి భేటీలో చర్చ సమైక్యం అని కాకుండా ప్రజలను విభజన దిశగా ఎలా ఒప్పించాలనే దిశగానే సాగే అవకాశముందని పార్టీనేతలే పేర్కొంటున్నారు. -
పార్టీలతో కేంద్రం చర్చలు జరపాలి
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలతో విడివిడిగా లేదా సంయుక్తంగానైనా చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల అవసరాల కోసం అవకాశవాదానికి పాల్పడవద్దని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందానికి స్పష్టమైన సూచనలు చేయాలని కోరింది. రెండు రోజుల పాటు జరిగే సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితిపై ఆమోదించిన తీర్మానాన్ని మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు చెబుతున్న ధర్మం, న్యాయం ఏమిటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే విభజన బిల్లు పెట్టాలంటున్న వెంకయ్య నాయుడు ఇప్పటి దాకా ఆ మాట ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీమాంధ్రకు ఏం కావాలో వెంకయ్య చెప్పాలని నిలదీశారు. అవకాశవాదాన్ని విడనాడాలని, అస్పష్టంగా మాట్లాడవద్దని హితవుపలికారు. సీమాంధ్ర ఉద్యమకారుల సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. తనకు చేతకానప్పుడు ఉద్యమకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రప్రభుత్వం ముందుంచాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సంక్షోభానికి తమ పార్టీ సూచిస్తున్న పరిష్కారం.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమేనని చెప్పారు. తాము ఇప్పటికీ భాషాప్రాతిపదిక రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రపతి పాలనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పారు. విజయనగరంలో దాడులు, ఉద్రిక్త పరిస్థితులకు బొత్స, ఆయన కుటుంబ సభ్యుల అరాచకాలే కారణమని పార్టీ అభిప్రాయపడినట్టు వివరించారు. కర్ఫ్యూ అనంతరం అమాయకులు.. బొత్స అంటే గిట్టనివాళ్లపై కేసులు పెట్టి వేధించనున్నారని తెలిపారు. ఢిల్లీలో వైఎస్ విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నేతలు తమ పార్టీ నాయకుల్ని కలవడంలో ప్రత్యేకత ఏమీ లేదని, అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించినట్టే తమనూ కలిశారని రాఘవులు చెప్పారు. -
కదం తొక్కిన సీమాంధ్ర రైతులు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రం విడిపోతే మొట్టమొదటగా నష్టపోయేది సీమాంధ్ర రైతన్న. సాగునీరు సక్రమంగా అందక భూములు బీడులుగా మారే ప్రమాదం ఉంది. నీటికోసం యుద్ధాలూ జరగవచ్చని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర రైతు కదం తొక్కారు. పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి అనంతరం పెద్దఎత్తున దీక్షలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో దీక్షకు ముందు వందలాది మంది రైతులు ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పాలకొల్లు, తణుకు, భీమవరం, నరసాపురంలలో వివిధ రకాల పంటలు ప్రదర్శిస్తూ దీక్ష చేపట్టారు. జంగారెడ్డిగూడెం, గోపాలపురంలలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన రైతుదీక్షలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. కాజులూరులో జరిగిన రైతు దీక్షలో పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. కె. గంగవరంలో జేఏసీతో కలిసి పార్టీ ఆధ్వర్యంలో రైతుగర్జన నిర్వహించారు. రాజానగరం, కోరుకొండల్లో దీక్షలు చేపట్టారు. పిఠాపురం, రౌతులపూడిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, కాడెడ్లతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రైతుగర్జన పేరిట రిలే నిరాహార దీక్షలు జరిగాయి. శ్రీకాకుళం మండలంలోని సింగుపురం వద్ద జాతీయ రహదారిపై సమైక్యవాదులు ఎడ్ల బళ్లతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో జరిగిన దీక్షలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, అరుకు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నాలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఆర్కే రోజా పాల్గొన్నారు. మదన పల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. సత్యవేడు, పీలేరులలో దీక్షలు జరుగుతున్నాయి. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి దీక్షలు ప్రారంభించారు. గంగాధర నెల్లూరులో పార్టీ జిల్లా కన్వీనర్ కే. నారాయణస్వామి దీక్షలను ప్రారంభించగా, కొత్తపల్లిమిట్టలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ప్యాపిలి, కొలిమిగుండ్ల, ఆలూరు, ఆళ్లగడ్డ, తుగ్గలిలో ఎడ్లబండ్లతో రైతులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఆదోనిలో వైఎస్సార్సీపీ నాయకుడు వై. సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు మూడువేల మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు వందలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి.. 205 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు కాకాణి గోవర్ధనరెడ్డి, దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్షలుప్రారంభమయ్యాయి. సైదాపురం, రాపూరు, వెంకటగిరిలో జరిగిన దీక్షల్లో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. నాయుడుపేటలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో రైతు దీక్షల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ పాల్గొనగా, మంగళగిరి, ఉండవల్లి, దుగ్గిరాల మండలాల్లో దీక్షలను పార్టీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కనిగిరి, హనుమంతునిపాడు, మార్కాపురంలలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, కందుకూరులో జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ దీక్షలను ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రైతు దీక్షలు జరిగాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం మక్కపేట నుంచి వత్సవాయి వరకు ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. -
సీమాంధ్ర జిల్లాల్లో.. సమైక్య శపథం
సాక్షి నెట్వర్క్: సీమాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు కోట్లాది గొంతుకలు ఒక్కటై మార్మోగిస్తున్న నినాదం సమైక్యాంధ్రప్రదేశ్. రాష్ట్రం ముక్కలు కాకుండా ఒక్కటిగానే ఉంచాలంటూ ప్రతిఒక్కరూ ఆశిస్తూ, స్వాశిస్తూ సమైక్యఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. వరుసగా 63వ రోజైన మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాలు ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లాయి. సమ్మెబాట పట్టిన ఆర్ అండ్ బీ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లు విజయవాడలో వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. ఒంగోలులో ఆటోలతో భారీర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదల కూరులో బ్రాహ్మణులు రాష్ట్ర విభజన జరగకూడదంటూ నడిరోడ్డుపై యజ్ఞయాగాదులు నిర్వహించారు. గుంటూరులో ఇంటర్ బోర్డు ఆర్జేడీ కార్యాలయం ఎదుట అధ్యాపకులు నడిరోడ్డుపై నమూనా న్యాయస్థానం ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విభజన వాదులతో వాద ప్రతివాదాలు చేశారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణంలో రజకులు ఒంటెద్దు బండ్లతో ర్యాలీ చేపట్టి చాకిరేవు నిర్వహించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్యమకారులు జోలెపట్టి భిక్షాటన చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు కాకినాడ-పిఠాపురం రహదారిపై కేసీఆర్, దిగ్విజయ్సింగ్, సోనియా, షిండే మాస్కలను గాడిదలకు కట్టి ఊరేగించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ- ఆంధ్రాకు అడ్డంగా గోడ కట్టి అనంతరం దాన్నిబద్దలు కొట్టి వినూత్న నిరసన తెలిపారు. విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో విద్యార్థులు సోనియా, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లా సుభద్రాపురం జంక్షన్ వరకు రెండు జిల్లాలను కలుపుతూ మహా మానవహారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నీలమణి దుర్గమ్మ అమ్మవారికి వేలాది మంది మహిళలు ముర్రాటలు సమర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పూజలు చేశారు. రాజీనామా చేసి రండి అధికారపార్టీ నేతలు ఎక్కడ కనిపిస్తే అక్కడ సమైక్యవాదులు నిలదీస్తున్నారు. ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాలకు అనంతపురం జిల్లా గుంతకల్లులో సమైక్య సెగ తగిలింది. మునిసిపల్ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వారివురు దీక్షా శిబిరం వద్దకు వెళ్లగా జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముందు రాజీనామాలు చేసిన తరువాతే ఉద్యమంలో పాల్గొనాలని చెప్పారు. కేంద్రమంత్రి పనబాకలకిష్మని కృష్ణాజిల్లా గుడివాడలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. తామంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పినా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పోలీసులు జోక్యంచేసుకుని ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా పంపించివేశారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలోని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. ఆమె కార్యాలయంలో నుంచి బయటికొచ్చి, ప్రసుత తరుణంలో రాజీనామాలు అవసరంలేదని, తెలంగాణ బిల్లును అడ్డుకోవాలంటే పదవిలో ఉండాలని వివరించడంతో సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె తన క్యాంపు కార్యాలయంలోనికి వెళ్లిపోయారు. ఆగ్రహించిన ఆందోళనకారులు అక్కడే బైఠాయించి సుమారు మూడు గంటలసేపు నినాదాలు హోరెత్తించారు. పులికాట్ పొలికేక శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో పులికాట్ పొలికేక పేరుతో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు వేలాదిగా రైతులు తరలివచ్చారు. కోవూరులో చేపట్టిన రైతుగర్జనకు రైతులంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రైతులు ఊక బస్తాలతోర్యాలీ చేసి, అనంతరం ఊకను రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. సర్పవరంలో ఐదువేల మందికి పైగా గ్రామస్తులు సకలజన ఘోష పేరిట సమైక్య నినాదం వినిపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో రైతు రణభేరిపేరిట నిరసన తెలిపారు. నర్సాపురంలో భవన నిర్మాణ కార్మికులు సమైక్య గర్జన సభ నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన సమైక్య ‘రణభేరి’కి సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. సభలో గజల్ శ్రీనివాస్ పాడిన గేయాలు సభికులకు ఉత్తేజాన్నిచ్చాయి. కార్మికులతో ఆర్టీసీ ఎండీ చర్చలు విఫలం బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు నడపబోమన్న నేతలు తిరుపతి, న్యూస్లైన్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం ఆర్ఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలతో ఆయన చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణం గా సీమాంధ్రలో ఇప్పటికే సంస్థ రూ.630 కోట్లు నష్టపోయిందని ఖాన్ నతెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రానున్నారని, ప్రస్తుతం నడుస్తున్న 107 ఆర్టీసీ బస్సులకు అదనంగా 150 బస్సులు నƒ డపాలని సూచించారు. జీతాలకన్నా జీవితాలు ముఖ్యమని, సమ్మెలో సడలింపు ఉండదని కార్మిక నాయకులు తేల్చి చెప్పారు. ఈ నెల 5 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, సమయం ఉంది కాబట్టి పునరాలోచించాలని చివరిగా ఖాన్ సూచించారు. దసరా అడ్వాన్సగా మూడు వేల రూపాయలు ఇప్పించాలని కార్మిక నేతలు కోరగా పరిశీలిస్తానన్నారు. అనంతరం ఆయన టీటీడీ ఈవోతో చర్చలు జరిపారు. కార్మిక నేతలతో మరోమారు చర్చలు జరుపుతామని తెలిపారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రానున్న 120 కొత్త బస్సులను ఉపయోగించే అవకాశముందని పేర్కొన్నారు. -
విరామమెరుగుని సీమాంధ్ర పోరు
సాక్షి నెట్వర్క్: అరవై ఒక్క రోజులుగా అలుపెరుగని సమైక్య ఉద్యమం సీమాంధ్రలో సెలవురోజైన ఆదివారం కూడా ఉద్ధృతంగా సాగింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ప్రజలు వివిధరూపాల్లో ఆందోళనలు హోరెత్తించారు. కృష్ణాజిల్లా కైకలూరు లో తెలంగాణ విడదీస్తే వలసలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయడానికి తట్టా, బుట్టలతో ప్రదర్శన చేశారు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవు సముద్రతీరంలో మునిసిపల్ ఉద్యోగులు జలదీక్ష చేపట్టారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వంద కార్లతో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు అరటి గెలలు కట్టిన సైకిళ్లతో రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన 2వేలమంది రైతులు ఆచంట వరకు పాదయాత్ర నిర్వహించారు. విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో అగ్నిదీక్ష చేశారు. విజయనగరంలో ఉపాధ్యాయులు చెవిలో పువ్వులు పెట్టుకుని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ఎదుట ఆందోళన చేశారు. బొబ్బిలిలో బొత్స దంపతుల మాస్కులు వేసుకున్న వారు ద్విచక్ర వాహనంపై పరారవుతున్నట్లు నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆర్సీఎం లూర్దుమాత చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కడపలో సహకార సమరం పేరుతో సహకార సంఘాల అధ్యక్షులు, డెరైక్టర్లు, రైతులు డీసీసీ బ్యాంకు ఎదుట సామూహిక దీక్షలు చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీవారిమెట్టు వద్ద 1,553 మంది భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టగా, సీమాంధ్ర జిల్లాలకు చెందిన 723 మంది సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. 7నుంచి సమ్మెలోకి .. ఇరిగేషన్ లాక్ సూపరింటెండెంట్ల సంఘం అక్టోబర్ ఏడో తేదీ నుంచి నీటిపారుదలశాఖ లాక్ సూపరిం టెండెంట్స సమ్మెబాట పట్టనున్నట్లు లాక్ సూపరింటెండెంట్స అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.ఆస్కారరావు, ప్రసాద్లు విజయవాడలో తెలిపారు. ఏపీఎన్జీవోల ఉద్యమానికి మద్దతుగా తాము కూడా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. బెంగళూరులోనూ సమైక్యహోరు బెంగళూరు: సమైక్యాంధ్ర నినాదాలతో బెంగళూరు నగరం దద్దరిల్లింది. ఆదివారం ఉదయం ఇక్కడి ఫ్రీడంపార్కలో జరిగిన జై సమైక్యాంధ్ర మహాగర్జనకు వేలాది మంది తరలివచ్చారు. కర్ణాటక తెలుగు ప్రజా సమతి అధ్యక్షుడు బొందు రామస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. రామస్వామి మాట్లాడుతూ.. రాష్ర్ట విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులోని చిత్తూరుజిల్లా గుమ్మిడిపూండి యూని యన్ పాదిరివేడులో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూ.24కోట్లు నష్టపోయిన కేఎస్ ఆర్టీసీ: విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె కారణంగా కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు తిరిగే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ ఆర్టీసీ) రూ.24కోట్ల ఆదాయం కోల్పోయిందని ఆ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు. నన్నే రాజీనామా చేయమంటారా..? సమైక్యవాదులపై టీడీపీ ఎంపీ ‘శివ’తాండవం సాక్షి నెట్వర్క: చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీకి చెందిన ఎంపీ డాక్టర్ శివప్రసాద్కు ఆదివారం సమైక్య సెగ తగిలింది. పలమనేరులో ఆందోళనకారులు అడ్డుకోగా, ‘‘నన్నే అడ్డుకుంటారా.. నన్నుమించిన సమైక్య మొనగాడు ఎవరైనా ఉన్నారా’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీగా స్పీకర్ ఫార్మెట్లో ఎందుకు రాజీనామా చేయలేదని, మీ అధినేత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన దానిపై ఎందుకు మాట్లాడరంటూ నిరసనకారులు ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎంపీ.. ఇలా చేస్తే తాను పార్లమెంట్లో నోరెత్తనని, అసలు రాజీనామానే చేయనన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సమైక్య ఉద్యమం గురించి అసలు పట్టించుకోనని మీరేం చేస్తారో చేసుకోండంటూ విరుచుకుపడ్డారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సమైక్యసభకు వెళ్లివస్తూ విద్యార్థి మృతి గుండెపోటుతో మరో ఉద్యమకారుడు కన్నుమూత సాక్షి, నెల్లూరు: సమైక్య ఉద్యమంలో చురుకుగా పొల్గొంటున్న ఇద్దరు ఆదివారం అసువులుబాసారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బసిరెడ్డిపాళెంనకు చెందిన ఇంటర్ విద్యార్థి సుధాకర్రెడ్డి (18) వింజమూరులో జరిగిన ‘సమైక్య విజృంభణ’కు హాజరయ్యాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం తన బైక్పై సొంతూరికి బయలుదేరాడు. బొమ్మరాజుచెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న మినీటాక్సీని ఢీకొనడంతో సుధాకర్రెడ్డి మృతిచెందాడు. అలాగే, పొదలకూరు మండలంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ, దళితగర్జన నిర్వహణ సన్నాహాల్లో నిమగ్నమైన పాణ్యం సురేష్(48) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. తోడేరు పంచాయతీ శాంతినగర్కు చెందిన సురేష్ బస్టాండ్ సెంటర్లో 35 రోజులుగా జరుగుతున్న రిలేదీక్షల్లో రోజూ పాల్గొనేవాడు. -
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: ఏపీ ఎన్జీవోలు
సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆలస్యమయ్యే కొద్దీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించారు. సంఘం అధ్యక్షుడు అశోక్బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి బుధవారం ఏపీ ఎన్జీవోల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా రాజీనామాలు చేసి రాజకీయాలకతీతంగా ఉద్యమంలోకి రావాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. తమ ప్రసంగాలపై అభ్యంతరాలుంటే చర్చకు సిద్ధమని ప్రకటించారు. తమ నాలుకలు కోస్తామంటూ తెలంగాణ నాయకులు చేస్తున్న హెచ్చరికలను ఖండించారు. ‘నాలుకలు కోస్తే మూగవాళ్లం అవుతాం. కాళ్లు విరగ్గొడితే వికలాంగులమవుతాం. కళ్లు పీకేస్తే అంధులం అవుతాం. మేం ఏమైనా, మమ్మల్ని ఏం చేసినా సరే సమ్మెను కొనసాగించి తీరతాం. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాష్ట్ర విభజనను అడ్డుకుంటాం’ అని స్పష్టంచేశారు. ‘మా నాలుకలు కోయాలంటే మా దగ్గరకు రావాలి. మా దగ్గరకు వస్తే మేం చేతులు ముడుచుకుని కూర్చోం’ అని అన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తమ ప్రాంత ప్రజల మనోభావాలూ దెబ్బతింటాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. హిందూపురం సభలో తమ మాటలను వక్రీకరించారని ఆరోపించారు. హైదరాబాద్ అందరిదీ అనే అర్థంలోనే తాము మాట్లాడామన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రాంతం అంటే తమకు ప్రేమ ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారని, తెలంగాణ నోట్ వచ్చే సమయంలో తాము కూడా దేశ రాజధానికి తరలివెళ్లి ధర్నా చేయాలనే యోచనలో ఉన్నామన్నారు. రేపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఈ నెల 27న ముట్టడించనున్నట్లు ఏపీఎన్జీవోల నగర అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ వెల్లడించారు. గన్ఫౌంఢ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన చేపడితే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఆ రోజున ముట్టడిని పోలీసులు అడ్డుకుంటే 28న జైల్భరో కార్యక్రమాన్ని చేపడతామన్నారు. -
మరింత ఉధృతంగా ఉద్యమం : వైఎస్ విజయమ్మ
ఆ బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయమ్మ ఉద్బోధ సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ ఎత్తుగడలు చూస్తుంటే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఈ బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది’ అని వారికి ఉద్బోధించారు. సీమాం ధ్ర ఉద్యమం నేపథ్యంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయమ్మ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విభజన విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీల వైఖరిని ఆమె తీవ్రంగా ఎండగట్టారు. సమైక్యాంధ్ర విషయంలో అవి రెండూ నాటకాలాడుతున్నాయంటూ దుయ్యబట్టారు. ‘‘వారి వాలకం చూస్తూంటే హఠాత్తుగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించేలా ఉంది. కనుక అలా జరగకుండా ఉండేందుకు, ‘కాంగ్రెస్, టీడీపీ నేతలు ముందే పదవులకు రాజీనామాలు చే యాలి’ అని వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి’’ అన్నారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే రాజకీయ సంక్షోభం సృష్టించడం తప్పనిసరి. అందుకోసం సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజీనామా చేయాలి. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయనతో పాటు వారి ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ‘ఆంటోనీ కమిటీ వేశాం, సమస్యలు చెప్పుకోండి అని కాంగ్రెస్ పార్టీ ఓ వైపు చెబుతూ.. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతుందంటోంది. కేంద్ర హోంమంత్రి షిండే నోట్ తయారైందంటున్నారు. ఇలాంటి సమయంలో సమైక్యోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది’ అని వైఎస్సార్సీపీ నేతలకు వివరించారు. రాజశేఖరరెడ్డి నినాదమే పార్టీ విధానమన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అదే స్ఫూర్తి, బాధ్యతతో 2014 ఎన్నికల్లో పని చేయాలని కోరారు. వైఎస్ ప్రాంతాలు, మనుషులను వేరుగా చూడలేదు: విజయమ్మ రాష్ట్రంలోని ఏ జిల్లా, ఏ గ్రామమైనా ఓటు అడిగే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని విజయమ్మ అన్నారు. ‘‘రాజశేఖరరెడ్డి తాను చేసిన మంచి పనుల వల్ల అందరి హృదయాల్లో ఉన్నారు. ఆయన తన హయాంలో ఏనాడూ ప్రాంతాలు, మనుషులను వేరుగా చూడలేదు. అందరినీ ప్రేమించారు. సంతృప్త స్థాయిలో అన్ని ప్రాంతాలు, వర్గాల వారికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ప్రజలపై ఒక్క పైసా భారం వేయకుండా దేశ చరిత్రలోనే లేనివిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం మరో ప్రాంతానికి హాని చేసే పనులు వైఎస్ ఏనాడూ చేయలేదు. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ తనవారే అనుకొని మూడున్నర దశాబ్దాల పాటు ప్రజలకు అండగా ఉన్నారు’’ అని గుర్తు చేశారు. సమైక్యమే జగనన్న అభిమతం: షర్మిల సమైక్యాంధ్ర ఉద్యమంలో పార్టీ శ్రేణులు మరింత ఉధృతంగా పాల్గొనాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పిలుపు నిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారని అభినందించారు. ‘‘రాష్ట్ర విభజన జరగరాదనేది, అప్పుడే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నది జగనన్న ప్రగాఢ అభిమతం. అందుకు అనుగుణంగా పార్టీ రూపొందించిన ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లండి. అన్నిచోట్లా ఒకే రోజున ఒక్కసారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని జగనన్న చెప్పమన్నారు. అందుకే నెల రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను పార్టీ ప్రకటిస్తోంది. విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీల నేతలే మళ్లీ ప్రజల్లోకి వచ్చి సమైక్యాంధ్ర అంటున్నారు. వారి ద్వంద్వ వైఖరిని ఎండగట్టండి. భేటీలో పీఏసీ కోఆర్డినేటర్ కొణతాల రామకష్ణ, ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, పీఏసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ముఖ్య నేతలు భూమా శోభానాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జూపూడి ప్రభాకరరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మ, దాడి వీరభద్రరావు తదితరులు మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కన్వీనర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, సీజీసీ, సీఈసీ సభ్యులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ‘సమైక్య’ తీర్మానం శనివారం జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం పలు డిమాండ్లతో కూడిన తీర్మానాలను చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించినట్టు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. అవి... - తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. - విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఏ దశలోనూ అడ్డుకోలేకపోయిన సీఎం కిరణ్, తీరా ప్రకటన వచ్చాక సమైక్యవాదం ఆలపించడం కంటితుడుపే. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేదాకా కేబినెట్ నోట్ రాదంటూ ఇంతకాలం కాలయాపన చేసిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం రాజీనామాలు చేసి విభజనను అడ్డుకోవాలి. - రాష్ట్ర విభజనకు అనుకూలంగా బ్లాంక్ చెక్ మాదిరిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి.ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి రాష్ట్రం విడిపోకుండా చూడాలి. - విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో పెల్లుబికిన ప్రజా ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వివిధ రాజకీయేతర జేఏసీలకు పార్టీ అభినందనలు తెలపాలి. సమైక్యాంధ్రపై స్పష్టత ఇవ్వకుండా డ్రామాలాడుతున్న పార్టీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా వైఖరిని మార్చుకునేలా జేఏసీలు మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఆ పార్టీల ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసేలా ఒత్తిడి చేయాలి. - నిర్బంధంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బయటకు రాలేని పరిస్థితుల్లో 3,112 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఆయన సోదరి షర్మిలకు, ఆమెతో పాటుగా అడుగులో అడుగు వేసి నడిచిన నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ అభినందనలు తెలియజేస్తోంది. -
సమైక్యాంధ్ర సాధనే ఊపిరిగా
ఒంగోలు టౌన్, న్యూస్లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు కొనసాగుతోంది. రోజురోజుకూ ప్రజల నుంచి మద్దతు పెరుగుతుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ ఆందోళనలు శుక్రవారంతో 52వ రోజుకు చేరుకున్నాయి. ఎన్జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రెండో రోజు వరుసగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఒంగోలు నగరంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీఓల ఉద్యమంతో నగరంలోని బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులు, ఎల్ఐసీ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్లు రెండవ రోజు తలుపులు తెరుచుకోలేదు. అలాగే గురువారం ఒంగోలు వచ్చిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వ్యవహరించిన తీరుకు, సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు పనబాక లక్ష్మి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. మంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు కింద మంట పెట్టిన పెద్ద పాత్రల్లో కూర్చొని వినూత్న నిరసన తెలిపారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు 500 అడుగుల భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు దీక్షా శిబిరం వద్ద రోడ్డుపై ఆటలు ఆడి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని, అంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెండో రోజూ తెరుచుకోని కార్యాలయాలు, బ్యాంక్లు: ఉద్యోగుల ఉద్యమంలో వరుసగా రెండో రోజు జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్లు మూతపడ్డాయి. అద్దంకిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు మూయించారు. అనంతరం ఆర్టీసీ, ఎన్జీఓ జేఏసీ నాయకులు మూతికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు, మేదరమెట్ల - నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిపై మానవహారం, రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బంగ్లారోడ్లో చేపట్టిన ఉద్యోగుల రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. ఇక రాష్ట్ర విభజనను నిరసిస్తూ అద్దంకిలో ముస్లింలు ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. కొరిశపాడు మండలం రావినూతలలో సమైక్యాంధ్ర కోసం విద్యార్థులతో ర్యాలీ, ఆంధ్రప్రదేశ్ ఆకారంలో మానవహారం నిర్వహించారు. బల్లికురవలో ఉపాధ్యాయుల నిరసన దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇక చీరాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 24వ రోజుకు చేరాయి. మాలమహానాడు ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష చేపట్టారు. వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నాయిబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన దీక్ష చేపట్టారు. పర్చూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. మార్టూరు మండలంలోని కోలలపూడిలో రైతులు సమైక్యాంధ్రకు మద్దతుగా వరినాట్లు వేసి నిరసన తెలిపారు. యద్దనపూడిలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం వద్ద ఉద్యోగులు మానహారం చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో గిద్దలూరు మండలంలోని క్రిస్టియన్ సమైక్యాంధ్ర అసోసియేషన్ సభ్యులు దీక్షలు చేపట్టారు. కంభంలో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు చేశారు. జేఏసీ నాయకులు అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు, టెలిఫోన్ కార్యాలయాలను మూయించారు. కొమరోలులో ఆర్య మరాఠీలు భారీ ర్యాలీ, వంటావార్పు, వివిధ వేషధారణల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు తెలిపారు. కందుకూరులో వరుసగా రెండవ రోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్లు మూతపడ్డాయి. టంగుటూరులో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు 9వ రోజుకు చేరాయి. శింగరాయకొండ మండలంలోని పాకల, ఊళ్లపాలెం గ్రామాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కనిగిరిలో జన చైతన్యయాత్ర: కనిగిరిలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వైద్య ఆరో గ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది రిలే దీక్షలో కూర్చున్నారు. పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరిగి పాఠశాలలు మూయించడం, సమైక్యాంధ్రకు మద్దతుగా పం చాయతీల్లో తీర్మానాలు చేయించడం, ప్రజలను చైతన్యం చేసేందుకు జన చైతన్య యాత్రను చేపట్టారు. గ్రామీణ ఆటో కార్మికులు రాష్ట్ర విభజనకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ రిలే దీక్షలు పదో రోజుకు చేరాయి. టీడీపీ కార్యకర్తల దీక్షలు 12వ రోజు కొనసాగాయి. హనుమంతునిపాడులో సమైక్యాంధ్రకు మద్దతు జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి, బ్యాంక్లు మూయించారు. సీఎస్ పురం మండలం డీజీపేటలో ఉపాధ్యాయులు రోడ్డుపై విద్యార్థులకు విద్యాబోధన చేపట్టారు. పామూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేశారు. పొదిలి చేరిన ఆత్మఘోష పాదయాత్ర: ఆర్యవైశ్యులు చేపట్టిన ఆత్మఘోష పాదయాత్ర పొదిలి పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. యర్రగొండపాలెంలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో మోటార్బైక్ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ దోర్నాలలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. రెడ్డి సామాజిక వర్గం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. దాదాపు 130 ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. -
మళ్లీ కలసి విన్నవిద్దాం: సీమాంధ్ర కాంగ్రెస్ నేతల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయాన్ని కాదని ముందుకు వెళ్లటానికి సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఆ పార్టీ ఎంపీలు సాహసించటంలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగినా అంతా సోనియా దయకే వదిలేయాలని నిర్ణయించారు. సమైక్య ఉద్యమంపై ఇప్పటికే అనేకసార్లు కలసి వివరించినప్పటికీ మరోసారి అదే విషయాన్ని సోనియా ముందు విన్నవిద్దామని తీర్మానించారు. శనివారం మంత్రుల క్వార్టర్లలోని క్లబ్హౌస్లో జరిగిన సీమాంధ్ర కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు సమావేశంలో.. పదవులకు రాజీనామా చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ మెజారిటీ సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. పదవులు వదులుకుంటే అధిష్టానంతో మాట్లాడేందుకు అవకాశం కోల్పోతామని, అందువల్ల రాజీనామాల జోలికి వెళ్లొద్దన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తామంతా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, రాహుల్గాంధీలను కలసి.. ఆంటోనీ కమిటీనీ సీమాంధ్రలో పర్యటింపచేయటం, ఆ తరువాత నివేదిక రూపకల్పన, ఆ నివేదికను పరిశీలించి సాధ్యాసాధ్యాలను చర్చించాకనే తెలంగాణపై ముందుకు వెళ్లాలని కోరటం వంటి అంశాలపై సమాలోచనలు జరిగాయి. సోనియాను కలసిన తర్వాత ఆమె సూచనలేమిటో విన్న తర్వాత ముందుకు వెళ్లాలన్న భావనకు మంత్రులు, ఎంపీలు వచ్చారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో తాజా పరిస్థితులపై రాజకీయ కోణంలోనే సాగినట్లు తెలుస్తోంది. సమావేశానికి కేంద్రమంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, ఎంపీలు కె.వి.పి.రామచంద్రరావు, అనంతవెంకటరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, ఎస్.పి.వై.రెడ్డి, సాయిప్రతాప్, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఉండవల్లి అరుణ్కుమార్, బొత్స ఝాన్సీ హాజరయ్యారు. మంత్రులు కిశోర్చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి గైర్హాజరయ్యారు. ఎంపీలు హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, చింతామోహన్, రత్నాబాయి, సుబ్బరామిరెడ్డి హాజరుకాలేదు. నేదురుమల్లి అనారోగ్యం కారణంగా రాలేకపోగా మరో ఎంపీ సబ్బంహరి కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు తొలినుంచి దూరంగానే ఉంటున్నారు. మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఆ తర్వాత కావూరికి ఫోన్చేసి సమావేశానికి తాను రాలేకపోయినా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తాను కూడా కలసి ఉంటానని చెప్పినట్లు సమాచారం. అది నన్ను ఉద్దేశించే అన్నట్లుంది: చిరు ఈ సమావేశంలో మంత్రి చిరంజీవి, ఎంపీ లగడపాటి రాజగోపాల్కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర విభజనకు కొంతమంది సీమాంధ్ర మంత్రులు సహకరిస్తున్నారని లగడపాటి ఇటీవల చేసిన ప్రకటన, గుంటకాడ నక్కల్లా ముఖ్యమంత్రి పదవికోసం కాచుక్కూర్చున్నారంటూ వస్తున్న విమర్శల గురించి చిరంజీవి సమావేశంలోనే ప్రస్తావించి.. ఇది కేవలం తననుద్దేశించి చేసిన ప్రకటనగానే కనిపిస్తోందంటూ లగడపాటిపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని లగడపాటి బదులిచ్చినట్లు సమాచారం. -
ప్రజాప్రతినిధులకు సమైక్య సెగ
సాక్షి నెట్వర్క్ : లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు సమైక్య దెబ్బ తగిలింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీమాంధ్రలో ‘తెలుగుతేజం’ పేరుతో పర్యటన ప్రారంభించిన జేపీకి తొలిరోజే సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ‘ఆందోళనలు, ధర్నాలతో రాష్ట్రం వెనుకబడిపోతుంది. రాష్ట్రం విభజన జరిగినా, జరగకపోయినా... మన ప్రాంతం, ప్రజల గురించి ఆలోచించకుండా ఆందోళనలు చేయడం వల్ల నష్టం మనకే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమైక్య వాదులను రెచ్చగొట్టాయి. విభజన అనివార్యమైతే రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని చేసిన సూచన కూడా ఆందోళన కారులకు రుచించలేదు. దీంతో దాదాపు రోజంతా ఆయన బస చేసిన రాష్ట్ర అతిథిగృహం వద్ద ఆందోళన నిర్వహించి రాత్రి వరకు ఆయనను దాదాపుగా నిర్బంధించినంత పని చేశారు. ఉదయం 9 గంటలకు కర్నూలుకు వచ్చిన జేపీ ఓ ప్రైవేట్ పాఠశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులపై ఆయన తనదైన శైలిలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ముఖం బాగోలేదని ముక్కు కోసుకుంటామా? రాష్ట్ర విభజన జరిగిందని సమ్మెలు చేస్తూ, విద్యార్థులను రోడ్లపైకి తేవడం, స్కూళ్లు, కళాశాలలు మూసేయడం, విద్యుత్ సమ్మె నిర్వహించడం వల్ల నష్టం మనకే. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీ ఆజ్యం పోస్తే కేంద్రం నిర్ణయం తీసుకుంది. విభజన జరిగితే ప్రత్యేక ప్యాకేజీతో రాయలసీమను కోరతాం.’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన రోడ్షోలో కూడా ఇదే తరహాలో మాట్లాడటంతో సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. మైకులు, సౌండ్బాక్సులు లాగేసి జేపీ డౌన్డౌన్ నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా బంద్లు, సమ్మెలు చేయడం మూర్ఖత్వం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో పాటు కర్నూలు జనం ఆగ్రహానికి గురయ్యారు. ఉద్యోగులు జేపీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఆయన తాను బస చేసిన స్టేట్ గెస్ట్హౌస్కు వెళ్లిపోయారు. ఉద్యమకారులు అక్కడకు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఉద్యమకారులు తమదే నైతిక విజయం అంటూ వెళ్లిపోవడంతో జేపీ అనంతపురానికి బయలుదేరి వెళ్లారు. కాగా, సాయంత్రం 3 గంటల సమయంలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో ‘రాష్ట్ర విభజన- సమస్యల పరిష్కారం’ పేరుతో నిర్వహించదలచిన రౌండ్ టేబుల్ సమావేశం ఉద్యమకారుల ఆందోళనలతో రద్దయింది. ఉదయం నుంచి జరిగిన సంఘటనలతో కశాశాల యాజమాన్యమే సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజకీయ పార్టీల వికృత క్రీడ ఇది: జేపీ తమ పార్టీ నుంచి తనను ఒక్కరినే గెలిపించారని, 30 సీట్లు ఇచ్చి ఉంటే చరిత్ర మార్చేవాడినని జేపీ అన్నారు. 2004 వరకు రాష్ట్రంలో 5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్, టీడీపీలు రెచ్చగొట్టాయని జేపీ ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల కోసం 2004లో కాంగ్రెస్, 2009లో తెలుగుదేశం టీ ఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ వాదాన్ని బలోపేతం చేశాయని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం కూడా ఓట్లు, సీట్ల కోసమే రాక్షస రాజకీయ క్రీడ ఆడుతోందన్నారు. ఎమ్మెల్సీల వాహనాలను అడ్డుకున్న ఉద్యోగ జేఏసీ చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రవుణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డి వాహనాలను ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయుకులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీలు వూట్లాడుతూ తామూ సమైక్యాంధ్ర వుద్దతుదారులమేనని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నావున్నారు. చిరంజీవిని ఘెరావ్ చేసిన ‘విశాలాంధ్ర’ కార్యకర్తలు మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమం చేస్తున్న కోట్లాది మంది సామాన్య తెలుగు ప్రజలతో నడవాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు శనివారం కేంద్ర మంత్రి చిరంజీవిని ఘెరావ్ చేశారు. ఆయన ఇంటిని ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసం వద్ద, బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్ సముదాయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర సమైక్యతను కాపాడాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు చిరంజీవి ఇంటి వద్ద బైఠాయించారు. ఆ సమయంలో ఇంట్లోలేని చిరంజీవి విషయం తెలుసుకుని విశాలాంధ్ర నేతలకు ఫోన్ చేశారు. తాను మినిస్టర్ క్వార్టర్స్కు వస్తున్నానని, అక్కడ కలవాల్సిందిగా సూచించారు. దీంతో కార్యకర్తలంతా అక్కడకు చేరుకున్నారు. మార్గమధ్యంలో కారు ఆపి వారి వద్దకు వచ్చిన చిరంజీవిని ఘెరావ్ చేస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను మాట్లాడతానని చిరంజీవి ఎంత కోరినా వినిపించుకోలేదు. రాజీనామా చేసి తమతో మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. తాను రాజీనామా చేస్తే తెలంగాణ ఆగిపోతుందనుకుంటే ఇక్కడికిక్కడే రాజీనామా చేసి మీ చేతికి ఇస్తానంటూ ఆయన ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. డ్రామాలు కట్టిపెట్టాలంటూ నిలదీశారు. సమైక్య ఉద్యమానికి సానుభూతి అవసరం లేదని, మీ పదవీ త్యాగం కావాలంటూ నినాదాలు చేశారు. చేయని పక్షంలో రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయనకు నిరసన పత్రం అందజేశారు. దీంతో చిరంజీవి అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. మంత్రి శత్రుచర్లకూ... అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో జేఏసీ, ఏపీ ఎన్జీఓ ప్రతినిధులు ఆయన్ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి, ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే ఓడించేందుకు ఓటు ఉండాలని, ఉద్యమకారులు కొంత సమన్వయం పాటించాలన్నారు. సీఎం కిరణ్ సమైక్యానికే కట్టుబడి ఉన్నారని,తాను కూడా అదే నినాదానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అంతకు ముందు బొబ్బిలిలో కూడా సమైక్యవాదులు మంత్రిని అడ్డుకున్నారు. రాయపాటికీ సమైక్య వేడి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ను ప్రారంభించేందుకు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎంపీ రాయపాటి సాంబశివరావు వస్తున్నారని తెలుసుకున్న సమైక్మవాదులు వారిని అడ్డుకునేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే ఎంపీ రాయపాటి ఒక్కరే వచ్చారు. ముందుగానే సమాచారం అందుకున్న రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంఘటనా స్థలానికి వందగజాల దూరంలోనే ఆందోళనకారులను అడ్డుకుని వెనక్కు పంపించగా రాయపాటి రిబ్బన్ కత్తిరించి పోలీస్ బందోబస్తు మధ్యవెళ్లిపోయారు. అటు తరువాత సాయంత్రం ఎవరూలేని సమయంలో వచ్చిన మంత్రి డొక్కా గుట్టుచప్పుడు కాకుండా కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారు. -
జిల్లావ్యాప్తంగా జోరుగా సమైక్య ఉద్యమం
సాక్షి, రాజమండ్రి : ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని నిర్విరామంగా నినదిస్తూనే ఉన్నారు జిల్లావా సులు. రాష్ట్ర విభజన నిర్ణయంతో రగులుకున్న ఆగ్రహం ఆ నిర్ణయం రద్దుతోనే చల్లారుతుం దంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నానాటికీ బలోపేతమవుతోంది. పిల్లలు, పెద్దలు, మహిళలు, ఉద్యోగులు, రైతులు ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. బుధవారం ఏలేశ్వరంలో మహిళా శక్తి సంఘాలకు చెందిన సుమా రు 5000 మంది మహిళలు విభజనవాదులారా ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. తొలుత ర్యాలీ జరిపి, అనంతరం బాలాజీ చౌక్కు చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ ధ్యేయంగా ఉద్యమిస్తామని, విభజనవాదుల కుయుక్తులను తిప్పి కొడతామని ముక్త కంఠంతో నినదించారు. రాజమండ్రిలో వివిధ ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, సిబ్బంది ర్యాలీ చేశారు. కంబాలచెరువు సెంటర్లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. కాకినాడలో సీబీఎం పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేసి, కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. సోనియాకు మంచి బుద్ధి కలగాలని సీబీఎం విద్యాసంస్థ చైర్మన్ ఎం.రత్నకుమార్ ప్రార్థన చేశారు. జగన్నాథపురం వద్ద విద్యార్థినులు సైకిల్ ర్యాలీ చేశారు. కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్వంలో ఉద్యోగులు ర్యాలీ చేశారు. ప్రభుత్వాస్పత్రి ఎదుట వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు వంటావార్పూ చేపట్టారు. డీఈఓ కార్యాలయం వద్ద విద్యాశాఖ ఉద్యోగులు దీక్షలు ప్రారంభించారు. రాజమండ్రిలో ఐసీడీఎస్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. యూటీఎఫ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు రాజమండ్రి మోరంపూడి సెంటర్లో రిలే దీక్షలు ప్రారంభించారు. తొలుత జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ధవళేశ్వరంలో ఎన్జీఓలు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. అమలాపురంలో కోనసీమ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం గడియారస్తంభం సెంటర్లో సమైక్య నినాదాలు చేస్తూ వివిధ ఆటలు ఆడారు. వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పప్పుల శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కోనసీమ సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ వి.ఎస్.దివాకర్, కన్వీనర్లు నక్కా చిట్టిబాబు, బండారు రామ్మోహన్రావు, తాతాజీ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ పాల్గొన్నారు. అల్లవరం మండలం లో అంగన్ వాడీ వర్కర్లు రిలే దీక్షలు ప్రారంభించారు. అమలాపురం గడియారస్తంభం సెంటర్లో కొనసాగుతున్న రిలే దీక్షల్లో చల్లపల్లి పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 13న తలపెట్టిన ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ ముట్టడిపై జేఏసీ నేతలు సమీక్ష చేశారు. డప్పు వాయించిన ఎమ్మెల్యే ముమ్మిడివరం తహశీల్దారు కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు చేపట్టిన 72 గంటల దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లి తిరిగి వస్తూ తెలంగాణ వాదుల దాడులకు గురైన ఉద్యోగులను రావులపాలెంలో జేఏసీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆత్రేయపురంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. టీడీపీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే టి.వి.రామారావు అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఎమ్మార్పీస్ నేతల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విమర్శిస్తున్న వారు ఆ ధోరణి మానుకోక పోతే నాలుక తెగ్గోస్తానని హెచ్చరించారు. ఆయన అదే గ్రామంలో మిఠాయి దుకాణంలో స్వీట్లు తయారు చేసి, డప్పు వాయించి నిరసన తెలిపారు. వెయ్యిమీటర్ల జాతీయ జెండా.. సమైక్యాంధ్రకు మద్దతుగా మలికిపురంలో ఆక్వారైతులు వెయ్యిమీటర్ల సమైక్య జెండాతో ర్యాలీ నిర్వహించారు. రాజోలులో న్యాయవాదులు బంద్కు పిలుపునిచ్చారు. పిఠాపురంలో కొనసాగుతున్న దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు మద్దతు తెలిపా రు. సామర్లకోటలో రజకులు రోడ్డుపై దుస్తులు ఉతికారు. రోడ్డు పైనే బండ్లు పెట్టి, ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్, పట్టణ, రూరల్ మండలాల కు చెందిన 300 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సామర్లకోట తహశీల్దారు కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. పెద్దాపురంలో చాచా విద్యానికేతన్, బ్యాంకు కాలనీ మహిళలు, జేఏసీ ప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడ్డారు. సోనియా భజన మానండి.. ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెపుతున్న కేంద్ర మంత్రులు సోనియా భజనతో కాలం వెళ్లబుచ్చుతున్నారని, ప్రజల గోడు పట్టించుకోవడం లేదని చాటుతూ రామచంద్రపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. కొందరు కేంద్ర మంత్రుల మాస్కులు ధరించి సోనియా మాస్క్ ధరించిన వ్యక్తి చుట్టూ కూర్చుని భజనలు చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో వంటా వార్పూ జరిగింది. కె.గంగవరం మండలం బాలాంతరంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కాజులూరు మండలం గొల్లపాలెంలో విద్యార్థులు ర్యాలీ చేసి ప్రధాన రహదారి వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. విడిపోతే రాష్ట్రం ఎడారే.. పచ్చని చేలతో కళకళలాడే రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారిపోతుందని తాను రూపొందించిన కళాకృతి ద్వారా చాటారు అయినవిల్లి మండలం వెలవలపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కాకర శ్రీనివాస్. విభజనకు ముందు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నట్టుగా ఒక చిత్రం, విభజన తర్వాత సీమాంధ్ర ఎడారిగా మారినట్టు మరో చిత్రం థర్మోకోల్తో రూపొందించి అందరినీ ఆలోచింపజేశారు. కాగా పచ్చగా కళకళలాడే రాష్ట్రంలో సోనియా గాంధీ, కేసీఆర్ కలుపు మొక్కల్లా తయారయ్యారని, వారిని ఏరివేయాలని నినాదాలు చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మామిడికుదురులో పొలాల్లో కలుపుమొక్కలు తొలగించారు. అనంతరం బస్టాండు కూడలిలో జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. పాశర్లపూడి కొండాలమ్మచింత సెంటర్లో ట్రాక్టర్ల నిర్వాహకుల సంఘం ఆధ్వర్వంలో సమైక్య వాదులు వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉంచి అర్ధనగ్నంగా ధర్నా చేశారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో గ్రామస్తులు వంటావార్పూ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. తెలంగాణ అధికారులపై తమకు మమకారం తప్ప ద్వేషం లేదని చాటి చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ 50వ డివిజన్ నాయకుడు గుత్తుల మురళీధర్ ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లశాఖ డీఐజీ నరసింహ, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ న్యూటన్, ఆరుగురు జైలర్లను పూలమాలలతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ‘తెలంగాణ , సీమాంధ్రవాసుల ఐక్యత వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు సోదరభావంతో మెలగాలని విజయలక్ష్మి పిలుపు నిచ్చారు. ఉద్యోగులు, ప్రజలు కలిసి మెలసి ఉండాలని డీఐజీ ఆకాంక్షించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్లో జరుగుతున్న నిరాహార దీక్షల్లో ఏపీ పేపరు మిల్లు వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మామిడికుదురులో 23వ రోజు దీక్షల్లో భాగంగా అప్పనపల్లికి చెందిన మహిళలు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే గ్రామంలో ఆక్వారైతులు నిర్వహించిన ర్యాలీకి పార్టీ కో ఆర్డినేటర్లు చింతపాటి వెంకటరామరాజు, మత్తి జయప్రకాశ్ మద్దతు పలికారు. పెద్దాపురం, సామర్లకోట జేఏసీ దీక్షా శిబిరాలను వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ మండల నాయకుడు అలమండ చలమయ్య ఆధ్వర్యంలో ఏలేశ్వరం ప్రధానరహదారిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. పార్టీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ చేసి బాలాజీ చౌక్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. -
వేర్పాటుపై తిరుగుబాటు
సాక్షి నెట్వర్క్ : తెలుగుజాతి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై సీమాంధ్ర ప్రజానీకం తిరుగుబాటు ఉధృతంగా సాగుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం 38వరోజైన శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉవ్వెత్తున ఎగసింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మహిళలు 101 బోనాలెత్తుకుని రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ పూజలు చేపట్టారు. పట్టణంలోని జేఏసీ శిబిరాన్ని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరులో బ్రాహ్మణులు శాంతి హోమం నిర్వహించారు. దేవనకొండలో సమైక్యంధ్రను కోరుతూ 990 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కళాకారుల ఐక్యవేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ అనంతపురం జిల్లా ధర్మవరంలో ఒక్కరోజు దీక్షలో కూర్చున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వ్యాపారుల సంఘం బంద్ పాటించింది. నెల్లూరులో రైతులు ట్రాక్టర్లతో తడ తహశీల్దార్ కార్యాలయం నుంచి బజారుసెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రధాన బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన, మానవహారం జరిగాయి. పొదలకూరులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. కవితా గర్జన ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా గ్రంథాలయం ఎదుట కవులు, రచయితలు తమ గళం, కలాలతో కవితా గర్జన నిర్వహించి సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించారు. ఉలవపాడు ఎంఈవో శ్రీమన్నారాయణ ఆమరణ దీక్షకు ఎంపీడీవోలు, తహసీల్దార్లు సంఘీభావం పలికారు. అద్దంకిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, పొక్లయిన్లతో భారీ ర్యాలీ జరిగింది. సమైక్యాంధ్ర కోరుతూ గుంటూరు, చిలకలూరిపేటలో ముస్లింలు భారీ శాంతి ప్రదర్శన నిర్వహించారు. బాపట్లలో మున్సిపల్ ఉద్యోగులు అర్ధనగ్నప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా జగయ్యపేటలో సమైక్యవాదులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. విజయవాడలోని కెనాల్ గెస్ట్హౌస్ వద్ద ఉద్యోగ సంఘాలు సర్వమత ప్రార్ధనలు నిర్వహించాయి. పాత బస్టాండ్ వద్ద దేవాదాయశాఖ ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలో వర్తక సంఘం ఆధ్వర్యంలో 10 వేల మంది రోడ్డుపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. కొవ్వూరు మండలం కుమారదేవంలో రోడ్డుపైనే పరీక్షలు రాసి విద్యార్థులు నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు ఆధ్వర్యంలో వందలాది మంది చెవిటి, మూగ, వికలాంగులు అనపర్తి దేవీచౌక్లో ధర్నా చేపట్టారు. రాజమండ్రిలో 190 మంది రక్తదానం చేసి తెలంగాణలోని ఆస్పత్రులకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జగ్గంపేటలో గృహిణులు జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. బొత్స దంపతులపై బొబ్బిలిలో ఫిర్యాదు పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ దంపతులు కనిపించడంలేదంటూ బార్ అసోసియేషన్ సభ్యులు విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్స్టేషన్లో సమైక్యవాదులు ఫిర్యాదు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బ్రాహ్మణులు రోడ్డుపై విశ్వశాంతి యోగం నిర్వహించి 72 గంటల దీక్షను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలపగా, టెక్కలిలో రోడ్లు ఊడ్చారు. విశ్రాంత ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు డీఎంహెచ్వో కార్యాయం ఆవరణలో వంటావార్పు చేపట్టారు. పాలకొండలో ఎన్.కె.రాజపురం గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆఫీసుపై టమాటాలతో దాడి కర్నూలు : రాష్ట్ర విభజనకు ముందుగానే బ్లాంక్ చెక్ ఇచ్చి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు బస్సు యాత్రలు చేస్తున్న చంద్రబాబునాయుడు ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించి టమాటాలతో దాడిచేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పార్టీ తెలుగు ప్రజల కోసమే పుట్టిందని టీడీపీ కార్యకర్తలు చెప్పగా, అది ఎన్టీఆర్ ఉన్నప్పటి మాట అని, చంద్రబాబు వచ్చాక రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ఆయన కేంద్రానికి లేఖ రాశారని ఉపాధ్యాయులు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందన్న ధైర్యంతో కేంద్రం రాష్ట్ర విభజనకు బరితెగించిందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉపాధ్యాయులు వెనుదిరుగుతూ ముందుగానే తెచ్చుకున్న టమాటాలను టీడీపీ కార్యాలయంపైకి విసిరారు. కలిసే ఉందాం.. మార్మోగిన లక్ష గొంతుకల సమైక్య భే రి సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో లక్షలాదిమంది ప్రజ రోడ్లపైకి వచ్చి సమైక్య భేరి మార్మోగిస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన లక్షగళ సమైక్యభేరిలో ఉద్యమకారులు గర్జించారు. వేర్పాటువాదాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కళాకారులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన లక్ష జనగళ ఘోషతో పట్టణమంతా జై సమైక్యాంధ్ర నినాదం పోటెత్తింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలో రెడ్ల సంఘం ఆధ్వర్యంలో 20 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. వంగపండు ఉష ఆటాపాటతో సమైక్య వాదుల్లో ఉత్తేజాన్ని నింపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర పరిధిలోని విద్యాసంస్థల ఆధ్వర్యంలో సుమారు 20 వేల మంది విద్యార్థులు కంబాలచెరువు సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కాజులూరు నుంచి గొల్లపాలెం వరకు ఐదువేల మందికి పైగా సమైక్యవాదులు 20 కిలోమీటర్ల మేరపాదయాత్ర చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో 10 వేల మందికిపైగా ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర గర్జన వినిపించారు. మార్టూరులో వేలాదిమంది విద్యార్థులు జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నిర్వహించిన ‘సింహగర్జన’ బహిరంగసభలో వేలాదిమంది విద్యార్ధులు పాల్గొని సమైక్యనినాదాలు హోరెత్తించారు. రోజా దీక్ష చిత్తూరు : నగరి టవర్క్లాక్ కూడలిలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్కే రోజా శుక్రవారం ఒకరోజు దీక్ష చేపట్టారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో వికలాంగులు, మదనపల్లెలో బుద్ధిమాంద్యం విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు. పెనుమూరులో క్రైస్తవులు వంటావార్పు, కుప్పంలో వన్నెకుల క్షత్రీయులు హోమం నిర్వహించారు. పుంగనూరులో ఉపాధ్యాయులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. -
సమైక్యహారం.. అపూర్వ మానవహారం
చేతులు కలిశాయి.. సత్తా చూపాయి.. కలిసికట్టుగా సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటాయి. శ్రీకాకుళం జిల్లా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సమైక్యభావం వెల్లివిరిసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కోల్కతా-చెన్నై జాతీయ రహదారి(ఎన్హెచ్-16)పై శ్రీకాకుళం జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం నుంచి చివరన ఉన్న ఇచ్ఛాపురం వరకు సుమారు 176 కిలోమీటర్ల పొడవునా అపూర్వ మానవహారం నిర్మించారు. పల్లె, పట్టణం.. ఉద్యోగులు, సామాన్యులు, కర్షకులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉదయం 9 గంటలకే జాతీయ రహదారిపై చేరుకొని 10 నుంచి 11 గంటల వరకు చేతులు కలిపి మానవహారంగా ఏర్పడ్డారు. సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ అలుపెరుగని పోరు సాగుతున్న పోరు శనివారం నాటికి 32రోజులకు చేరింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలు, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మల దహనాలతో ఉద్యమకారులు హోరెత్తించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాలరేవు ఆవరణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం రాష్ట్ర అర్చక సమాఖ్య శాంతి హోమం నిర్వహించింది. కృష్ణా జిల్లా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో విదార్థి జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. తిరువూరులో సమైక్య జనగళం పేరిట వేలాది మంది జనం నదించారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అక్కడే రోడ్డుపై వంటవార్పు నిర్వహించి భోజనాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులోని పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో బల్లకట్టుపై రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాలకొల్లులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో 80 కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో మూడు వేల మంది ఉద్యోగులు సోనియా గాంధీకి ఉత్తరాలు రాశారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు పోలీసు ఐలండ్ సెంటర్లో హోమం చేశారు. గుంటూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు 48గంటల జిల్లా బంద్ రెండోరోజు శనివారం కూడా విజయవంతమైంది. కర్నూలు జిల్లా నంద్యాలలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 లారీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతంగా ముగిసింది. డోన్లో కురువ సంఘం ఆధ్వర్యంలో ఒంటెలతో ర్యాలీ చేపట్టారు. ఏపీఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో నిర్వహించిన సకల జనుల గళం విజయవంతమైంది. విశాఖపట్నంలో ముస్లీం జేఏసీ ఆధ్వర్యంలో ఒంటెలు, గుర్రాలతో ర్యాలీ చేపట్టి జీవీఎంసీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయనగరంలో శనివారం సాయంత్రం ఆరు నుంచి 8 గంటల వరకు జిల్లావ్యాప్తంగా గృహ వినియోగదారులతో పాటు వ్యాపార, వాణిజ్యవర్గాలు స్వచ్ఛందంగా కరెంటు వినియోగం నిలిపివేశాయి. సమైక్య విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణాలు, గ్రామాల్లో ఉన్న వీధి దీపాలను కూడా రెండు గంటల పాటు ఆర్పివేయడంతో జిల్లా మొత్తం అంధకారం అలముకుంది. సీతానగరంలో జేఏసీ ఆధ్వర్యంలో 15కిలోమీటర్ల మేర మానవహారం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటిలో 30 మంది విశ్రాంత ఉద్యోగులు నిరాహారదీక్ష చేపట్టారు. వీరఘట్టంలో 20 వేల మందితో ఉపాధ్యాయ, ఆర్టీసీ ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో సకలజనగళం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రం ముక్కలైతే భవిష్యత్తరాలకు గంజి కూడా దొరగదంటూ అనంతపురం జిల్లా కణేకల్లులో గంజి పంపిణీ చేసి ఎన్జీఓలు నిరసన వ్యక్తం చేశారు. మార్మోగిన కడప కడప, న్యూస్లైన్ : సమైక్య నినాదంతో కడప నగరం మార్మోగింది. సమైక్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభకు వైఎస్సార్ జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో పోలీసులు నగరాన్ని దిగ్బంధించినా సమైక్యవాదులు లెక్కచేయలేదు. ప్రతిఒక్కరూ సమైక్యనినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే వేదిక వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించడంతో జేఏసీ నేతలు ఆగ్రహంతో ఊగి పోయారు. ఓ దశలో కడప డీఎస్పీ రాజేశ్వర్రెడ్డిపై చేయి చేసుకున్నంత పనిచేశారు. పోలీసులు మైదానాన్ని వదలివెళ్లాలని నినాదాలు చేశారు. డీఎస్పీ, ఎస్పీ ఇళ్లకు విద్యుత్, నీరు కట్చేయడంతో పాటు పారిశుద్ధ్ద్యాన్ని కూడా నిలిపి వేస్తామని హెచ్చరిం చారు. పోలీసు అధికారులు చివరికి దిగివచ్చారు తామేమీ ఆటంకం కలిగించబోమని ప్రొద్దుటూరు, మైదుకూరు డీఎస్పీలు శ్రీనివాసులురెడ్డి, చల్లా ప్రవీణ్కుమార్ ఉద్యమకారులకు సర్దిచెప్పారు. సభలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండటం కోసం దేనికేనా సిద్ధమేనని ప్రకటించారు. 12 నుంచి అంధకారమే ఉద్యమాన్ని తీవ్రం చేయాలని విద్యుత్ ఉద్యోగుల నిర్ణయం ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్ : సమైకాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు 12 నుంచి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ఏ కాలనీలో శనివారం సమైకాంధ్ర విద్యుత్ ఉద్యోగుల (జేఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 13 జిల్లాలకు చెందిన జెన్కో, డిస్కం, ట్రాన్స్కో, ఏపీఎస్పీడీసీఎల్లకు చెందిన ఉద్యోగులు హాజరయ్యారు. సమైకాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబా మాట్లాడుతూ సీమాంధ్రలో ఇంత పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం వల్లే 12 నుంచి సమ్మెలో దిగుతున్నట్లు తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి 4 వరకు వర్క్టూరూల్, 5న మూకుమ్మడి సెలవులు, 6న పెన్డౌన్, టూల్డౌన్, 7న ఛలో హైదరాబాద్ విద్యుత్ సౌధ, 8, 9, 10 తేదీలలో సహాయ నిరాకరణ చేపడతామన్నారు. 11న సిమ్కార్డులను యాజమాన్యాలకు అప్పగించి 12 నుంచి సమ్మెలోకి దిగుతామన్నారు. తాము ఉద్యమంలో పాల్గొంటే రాష్ర్టంతోపాటు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అంధకారం నెలకొంటుందన్నారు. 2 నుంచి ప్రజాప్రతినిధుల ఇళ్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
3 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ షురూ సర్టిఫికెట్ల తనిఖీకి మరో నాలుగు రోజుల గడువు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కొత్త షెడ్యూలు అప్పటికి కూడా హాజరుకాకపోతే 12 వరకు అవకాశం నేటి నుంచి సీమాంధ్రలో పనిచేయనున్న 36 కేంద్రాలు సెప్టెంబర్ 17న సీట్ల కేటాయింపు 23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి ఉన్నత విద్యామండలి ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి వచ్చేనెల 3 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17న సీట్ల కేటాయింపు జాబితా వెల్లడి కానుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం శుక్రవారంతో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా.. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో కొన్ని సహాయక కేంద్రాలు పనిచేయలేదు. దీంతో శనివారం నుంచి వచ్చేనెల 3 వరకు నాలుగు రోజులు ప్రత్యేకంగా షెడ్యూలు పొడిగించారు. ఈ కొత్త షెడ్యూలు ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పటివరకు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన వారు ఇప్పుడు హాజరుకావొచ్చు. ఒకవేళ మూడో తేదీలోగా కూడా హాజరుకాలేకపోయిన వారు 12వ తేదీ వరకు కూడా సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించారు. ఈమేరకు ఉన్నత విద్యామండలి శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు సీమాంధ్రలో 37 సహాయక కేంద్రాలు ఉండగా కొన్ని కేంద్రాలు పనిచేయలేదు. శుక్రవారం నుంచి 36 కేంద్రాలు పనిచేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్రావు వెల్లడించారు. అనంతపురం జిల్లా ఎస్కేయూలోని సహాయక కేంద్రం మినహా అన్ని కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. సాంకేతిక విద్య కమిషనర్ అజయ్జైన్ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సహాయక కేంద్రాలు తెరిచేందుకు అధ్యాపకులు అంగీకరించారని వివరించారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియపై శుక్రవారం రాత్రి మండలిలో చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్ జైన్, మండలి కార్యదర్శి డాక్టర్ సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ పాల్గొన్నారు. మరో 15 వేల మంది హాజరయ్యే అవకాశం.. ఆగస్టు 19 నుంచి శుక్రవారం వరకు జరిగిన సర్టిఫికెట్ల తనిఖీకి మొత్తం 2.17 లక్షలకు గాను 1.22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని, గ తేడాది 1.38 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని చైర్మన్ తెలిపారు. శుక్రవారం సీమాంధ్రలో 35 కేంద్రాలకు గాను 27 కేంద్రాల్లో 5,034 మంది, తెలంగాణలో 22 కేంద్రాల్లో 5,552 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తనిఖీకి హాజరుకావాలని ఇప్పటికే ఒకసారి మొబైల్ ద్వారా సంక్షిప్త సందేశాన్ని పంపించామని, శుక్రవారం రాత్రి మరోసారి పంపించనున్నామని తెలిపారు. మరో 15 వేల మంది విద్యార్థులు హాజరుకావొచ్చని అంచ నా వేస్తున్నట్టు పేర్కొన్నారు. హాజరుకాలేకపోయిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో శనివారం 1 నుంచి 50 వేల వరకు, సెప్టెంబర్ 1న 50 వేల నుంచి లక్ష వరకు, 2వ తేదీన లక్ష నుంచి 1.5 లక్షల వరకు, 3వ తేదీన 1.5 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావొచ్చని వివరించారు. 3వ తేదీ నాటికి కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకాలేకపోయిన వారు 4 నుంచి 12లోగా సహాయక కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరై, స్క్రాచ్ కార్డు పొంది అక్కడే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఇక ప్రత్యేక కేటగిరీ కింద రిజర్వేషన్ పొందాలనుకునే అభ్యర్థులు (ఎన్సీసీ, సైనికోద్యోగుల పిల్లలు, క్రీడాకారులు, వికలాంగులు తదితర కేటగిరీలవారు) మాత్రం హైదరాబాద్ మాసబ్ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్లో మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. 9న సహాయక కేంద్రాలకు సెలవు విద్యార్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుంచి గానీ, ఎంసెట్ సహాయక కేంద్రం నుంచి గానీ వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 9న మాత్రం వినాయక చవితి పండుగ నేపథ్యంలో సహాయక కేంద్రాలు పనిచేయవు. ఇంటర్నెట్ సెంటర్ నుంచి నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకోవాలనుకుంటే సెప్టెంబర్ 13, 14ల్లో మార్చుకోవచ్చు. 13న 1 నుంచి 1 లక్ష వరకు, 14వ తేదీన 1,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను మార్చుకునే వెసులుబాటును కల్పించారు. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెల్లడిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేరోజు తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడించారు. బీ-కేటగిరీపై నేడు కాలేజీలతో భేటీ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ సమయంలో ఒకే విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సీట్లు పొందినప్పుడు ఎదుర య్యే సమస్యకు పరిష్కారం వెతికేందుకు ఉన్నత విద్యామండలి శనివారం దాదాపు 30 కళాశాలలతో సమావేశం కానుంది. బీ- కేటగిరీ సీట్ల భర్తీని జీవో 66, 67 ఆధారంగా సింగిల్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా భర్తీ చేయాలన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు ప్రకారం ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొత్త నోటిఫికేషన్కు మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పుడు ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కాలేజీల్లో సీట్లు పొందితే సీట్లు బ్లాక్ అయిపోయే పరిస్థితి నెలకొంటుందని, ఈ సమస్యపై పిటిషన్దారులైన కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పరిష్కారం కనుగొనాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో 30 కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు విద్యామండలి భేటీ కానుంది. కళాశాలల సూచనలు పరిగణనలోకి తీసుకుని తగిన మార్గదర్శకాలు రూపొందిస్తామని మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్రావు పేర్కొన్నారు. -
31రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సమైక్యోద్యమం
సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగుతోంది. శుక్రవారం నాటికి 31వ రోజుకు చేరింది. రాష్ర్ట విభజన కోరుతూ ప్రజలు వివిధ రూపాల్లో నిరసనలతో హోరెత్తించారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో 20వేల మందికిపైగా సమైక్యవాదులు ప్రజాగర్జన పేరుతో విజయనగరం-సాలూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎస్ కోటలో రహదారిపై, అలాగే తూర్పుగోదావరి జిల్లా రమణయ్యపేట వద్ద జాతీయ రహదారిపై మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయం ఆవరణలో పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఆర్యవైశ్య సింహగర్జన పేరుతో భారీ ర్యాలీని నిర్వహించి పట్టణంలో బంద్ చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఏపీ ట్రాన్స్కో కార్యాలయానికి విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతపురంలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు కాగడాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా పీలేరులో 10వేల మందికిపైగా మహిళలు క్రాస్ రోడ్డు వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రగిరి మండలం రంగంపేట వద్ద విద్యార్థులు రహదారిని దిగ్బంధించారు. విజయవాడ రామవరప్పాడు రింగ్సెంటర్లో సమైక్యవాదులు భారీ మానవహారం చేపట్టారు. గుంటూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు జిల్లా బంద్ విజయవంతమైంది. బాపట్లలో కూరగాయల మార్కెట్ వ్యాపారులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 30వేల మంది ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు శతసహస్ర సమైక్యస్వరాగం పేరిట గర్జించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోటలో విద్యార్థులు విభజన వద్దు అంటూ అక్షర రూపంలో కూర్చోగా.. పాలకొండలో విద్యార్థులు సమైక్యాంధ్రప్రదేశ్ చిత్రపటం రూపంలో కూర్చొని ఆకట్టుకున్నారు. సమైక్యాంధ్ర సమరభేరి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సమైక్యవాదులతో పట్టణ రహదారులు కిక్కిరిసిపోయాయి. ఐదు నిమిషాలపాటు ముక్తకంఠంతో జైసమైక్యాంధ్ర అంటూ గర్జించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో రజక వృత్తి సంఘం ఆధ్వర్యంలో కర్నూలు-గుంటూరు రహదారిపై దుస్తులు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో విద్యార్థులు లాంగ్మార్చ్ నిర్వహించారు. ఉద్యమంలో తామూ పాల్గొంటున్నామని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రెవిన్యూ అధికారి, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి ప్రకటించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో కొనసాగుతున్న ఉద్యోగుల రిలే దీక్షల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ రజని పాల్గొన్నారు. దీంతో సహఉద్యోగులు ఆమెను ఘనంగా సన్మానించారు. చానళ్ల ప్రసారాలు నిలిపివేయాలి సమైక్యాంధ్ర కోసం పెద్దఎత్తున జరుగుతున్న ఉద్యమాన్ని చూపించని జాతీయ న్యూస్ ఛానళ్ల ప్రసారాలను సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఏపీ ఎన్జీవోల నేత ఎ. విద్యాసాగర్ విజయవాడలో ప్రకటించారు. దీనిపై ఆయా చానళ్ల ప్రతినిధులు, కేబుల్ ఆపరేటర్లతో కూడా మాట్లాడుతున్నామన్నారు. కాంగ్రెస్ నేతలూ.. గోబ్యాక్ సాక్షి నెట్వర్క్ : అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై సమైక్యవాదుల ఆగ్రహం కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లింగారెడ్డిని అడ్డుకుని రాజీనామా ఆమోదింపజేసుకుని రావాలంటూ నినదించారు. బద్వేలులో జరిగిన ఆర్యవైశ్య సింహగర్జనలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కమలమ్మ రాగా, సమైక్యవాదులు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానంటూ రాజీనామా చేస్తున్నట్లు సంతకం పెట్టి చూపించినప్పటికీ సమైక్యవాదులు శాంతించలేదు. దీంతో పోలీసుల సహకారంతో ఆమె అక్కడనుంచి వెనుతిరిగారు. శ్రీకాకుళంలో సభలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడేందుకు సిద్ధంకాగానే సమైక్యవాదులు అడ్డుకుని ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద సమైక్యవాదులు ధర్నా చేపట్టగా, సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాండ్రు కమలను రాజీనామా చేయాలని ఓ ఉద్యోగి నిలదీశారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద రిలేదీక్షలో పాల్గొంటున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ సుధాకర్బాబును సమైక్యవాదులు గోబ్యాక్ అంటూ అడ్డుకున్నారు. కదం తొక్కిన టీటీడీ ఉద్యోగులు వేలాది మంది టీటీడీ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టి ఉద్యమంలో గర్జించారు. తిరుపతిలో శుక్రవారం సద్భావన శాంతి ర్యాలీ చేపట్టారు. గోవిందనామ స్మరణ, న ృత్యాలు, డప్పు వాయిద్యాలు, విద్యార్థుల సమైక్య నినాదాలతో నగరవీధులు దద్దరిల్లాయి. అన్ని స్థాయిల వారూ ర్యాలీలో పాల్గొన్నారు. తొలిసారిగా టీటీడీ వేదపండితులు ఉద్యమంలో పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకుంది. డాలర్ శేషాద్రి మాట్లాడుతూ తెలుగోడిపై ఢిల్లీ లొల్లి ఏంటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తిరుమల ఆలయంలో శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారి పూజా కైంకర్యాలు యథావిధిగా కొనసాగాయని జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. -
తిరుపతి ఆర్టీవో, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదం
సాక్షి, తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రెండు ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం రాత్రి రెండు అగ్నిప్రమాదాలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలో ఈ సంఘటనలు చోటుచేసుకోవడం సంచలనం సృష్టించింది. వివరాలు... తిరుపతి ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) గురువారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. 8.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు ఏర్పడటంతో పరిసర ప్రాంతాలవారు అప్రమత్తమయ్యారు. మంటలు దాదాపు అరగంట పాటు మండుతూనే ఉన్నాయి. కార్యాలయంలోని నాలుగు కంప్యూటర్లు, డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 9.40 గంటలకు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే స్థానికులు మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. కాగా, విద్యానగర్ బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆవరణలోని డీజిల్ జనరేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈలోపు సుమారు 10 వేల రూపాయల డీజిల్ కాలిపోయినట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. కాగా, సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదాలు జరగడం చర్చనీయాంశమైంది. అయితే అధికారులు మాత్రం రెండు సంఘటనలు ప్రమాదవశాత్తు జరిగాయని తెలిపారు. -
30న హైదరాబాద్కు దిగ్విజయ్సింగ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్సింగ్ ఈ నెల 30న హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణపై పార్టీ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం, దానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున కొనసాగుతున్న సమైక్య ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆయన సమీక్షించనున్నారు. ఇరుప్రాంతాల నేతలతోనూ ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు. ఇరు ప్రాంతాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏం చేయాలి? ప్రస్తుత పరిస్థితుల నుంచి పార్టీని ఏ విధంగా గట్టెక్కించాలన్న అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. 30వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకునే దిగ్విజయ్ 31న హైదరాబాద్ కేంద్రంగా వెలువడనున్న ‘మెట్రో ఇండియా’ అనే ఆంగ్ల దినపత్రిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నా రు. ఈ ప్రైవేటు కార్యక్రమంతో పాటు పార్టీ వ్యవహారాలపైనా ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఉద్యమానికి భయపడే బాబు యాత్ర వాయిదా: శోభా నాగిరెడ్డి
నయవంచనకు మారుపేరైన చంద్రబాబుకు ఎవరినైనా తాకట్టు పెట్టే అలవాటు ఉందని, ఇప్పుడు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. దీక్షా ప్రాంగణం వద్ద శోభా నాగిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం చూసి భయపడే చంద్రబాబు తన ఆత్మ గౌరవ యాత్ర వాయిదా వేసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పేరు వింటేనే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుందని చెప్పారు. రాష్ట్రం ఎడారిగా మారుతుంటే నోరు మెదపకుండా ఇంట్లో కూర్చున్న చంద్రబాబు తెలుగు జాతికి చేస్తున్న ద్రోహంతో చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. జగన్ను నిత్యం తిట్టడమే పనిగా పెట్టుకున్న బాబు, అతని బృందం చంచల్గూడ జైలు వద్ద కాపలా కాస్తే మంచిదని సూచించారు. నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న జగన్పై విమర్శలు చేయడం సూర్యుడిపై ఉమ్మేయడమేనన్నారు. సోనియా డైరక్షన్లోనే సీఎం కిరణ్, చంద్రబాబు యాక్షన్ చేస్తున్నారని, అందులో భాగంగానే అప్పుడప్పుడు తమ పాత్రలు కూడా మార్చుకుంటున్నారని దుయ్యబట్టారు. -
చిచ్చు పెట్టి.. ఆత్మగౌరవ యాత్రలా?: బీవీ రాఘవులు
అనంతపురం, న్యూస్లైన్: రాష్ర్ట విభజనకు అనుకూలమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ ఇస్తే.. సీమాంధ్రలో ఆ పార్టీ నాయకులు సమైక్య ఉద్యమాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు మండిపడ్డారు. అనంతపురంలోని లలిత కళాపరిషత్లో ‘భాషా ప్రయుక్త రాష్ట్రాలు-సీపీఎం వైఖరి’ అనే అంశంపై గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇరు ప్రాంత ప్రజలను విడగొట్టాలని లేఖ ఇచ్చి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళతారో చెప్పాలన్నారు. ఆత్మగౌరవం కాదు తెలుగు ప్రజల వైరుధ్య యాత్ర చేపట్టాలని సూచించారు. తెలంగాణ ఉద్యమాలను ఏమంటారు? సీమాంధ్రలో జరుగుతున్నవి రాజకీయ ఉద్యమాలైతే తెలంగాణలో జరిగిన ఉద్యమాలను ఏమంటారో చెప్పాలని తెలంగాణ నాయకులను బీవీ రాఘవులు ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రలో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్నారని.. అయితే కొందరు తెలంగాణ ప్రాంత నాయకులు వాటిని రాజకీయ నాయకులు ఉసిగొల్పి చేయిస్తున్నారని విమర్శించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో చేపట్టిన ఉద్యమాలు కూడా అదే కోవకు చెందినవా అని ప్రశ్నించారు. విభజన పాపం కాంగ్రెస్దేనని చెప్పారు. తెలంగాణ ప్రాంత ఓట్లు, ఎంపీ సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు విచ్ఛిన్నమైతే ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. -
సీమాంధ్రలో .. సమర దీక్షా బంధన్
పండగల్లేవ్.. పర్వదినాల్లేవ్... ఒకటే లక్ష్యం సమైక్యాంధ్ర పరిరక్షణ. సీమాంధ్రలో మూడువారాలకు పైగా విరామం లేకుండా హోరెత్తుతున్న సమైక్య ఉద్యమం శ్రావణపౌర్ణమి రక్షాబంధన్ నాడు బుధవారం వినూత్నరీతిలో ముందుకు సాగింది. సీమాంధ్రలో నివసిస్తున్న , ఉద్యోగరీత్యా పనిచేస్తున్న తెలంగాణ వారికి సమైక్యవాదులు రాఖీలు కట్టి రాష్ట్రం ముక్కలు కాకుండా కలిసుండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని వారికీ రక్షాబంధన్లు కట్టి విభజన వద్దని అందరూ కలిసుందామని కోరారు. - సాక్షి నెట్వర్క్ సీమాంధ్ర జిల్లాల్లో బుధవారం సమైక్య గర్జన మార్మోగింది. యధావిధిగానే ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, సోనియా, చంద్రబాబు, బొత్స, చిరంజీవి, కేసీఆర్ల దిష్టిబొమ్మల దహనాలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అడుగడుగునా కనిపించాయి. పోటెత్తిన గోదావరి తీరం అఖండ గోదావరితీరం సమైక్య నినాదంతో మార్మోగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అన్ని జేఏసీలూ కలిసి ‘గోదావరి సమైక్య నాదం’ పేరుతో చేపట్టిన ప్రదర్శనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. గజల్ శ్రీనివాస్ హాజరై రాష్ట్ర సమైక్యతను చాటి చెప్పే గీతాలు ఆలపించారు. సమైక్యవాదులు లాలాచెరువు వద్ద జాతీయ రహదారిని ముట్టడించారు. కౌన్సెలింగ్ వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నినాదాలు కాకినాడ జేఎన్టీయూకేలో ఎంసెట్ కౌన్సెలింగ్ను అడ్డుకునేందుకు సమైక్యవాదులు ప్రయత్నించగా పోలీసులు చుట్టుముట్టారు. కౌన్సెలింగ్కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కౌన్సెలింగ్ నిలుపు చేయాలని నినాదాలు చేశారు. కడియంలో రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. రాష్ట్ర సమైక్యత ఆవశ్యకతను చాటుతూ వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం అమలాపురం పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని కొత్తపేట, కాకినాడ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో జరిగింది. నెల్లూరులో అధికారుల పెన్డౌన్ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా అధికారులు పెన్డౌన్ చేపట్టి సమైక్యఉద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కావలిలో జరిగిన ఆందోళనల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఉదయగిరి వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన వంటావార్పులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. విజయ‘వాడ’వాడలా మానవహారాలు ఎన్జీవోల నేతృత్వంలో బుధవారం మధ్యాహ్నం విజయవాడ నగరవ్యాప్తంగా మానవహారాలు నిర్మించారు. నగరంలో రాత్రి కాగడాల ప్రదర్శన జరిపారు. రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విద్యుత్ దీపాలు ఆర్పివేసి నిరసన తెలిపారు. జగ్గయ్యపేటలో మానవహారం నిర్వహించగా వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఉదయభాను, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వత్సవాయిలో జిల్లా సరిహద్దు వద్ద తెలంగాణవాదులకు రాఖీలు కట్టి కలిసి ఉండాలని కోరారు. రోడ్డుపై మాక్ కోర్టు విజయనగరం జిల్లా గజపతినగరంలో న్యాయవాదులు రోడ్డుపై మాక్ కోర్టు నిర్వహించారు. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో న్యాయవాదులు మాక్ కోర్టు నిర్వహించి సోనియా గాంధీకి దేశ బహిష్కరణ, ఆమెకు సహకరించిన సీమాంధ్ర మంత్రులకు రాజకీయ బహిష్కరణ విధిస్తూ తీర్పునిచ్చారు. ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉద్యోగులు విజయనగరం ఎత్తుబ్రిడ్జిపై భారీ మానవహారం నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎస్కోటలో సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు పురందేశ్వరి, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్సల దిష్టిబొమ్మలకు పిండ ప్రదానం చేశారు. మూడురోజులు గూడెం బంద్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం నుంచి 72 గంటల బంద్కు నాన్ పొలిటికల్, ఎన్జీవో జేఏసీలు పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్గేట్, ఆశ్రం ఆసుపత్రుల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్ బుధవారం నుంచి నిరవధిక దీక్షకు కూర్చున్నారు. రైతుల ర్యాలీ అనంతపురంలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల అధికారులు, ఉద్యోగులు.. రైతులతో కలసి పరికరాలతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. నగరంలో రిలే దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం వాహనాలకు జై సమైక్యాంధ్ర స్టిక్కర్లు అతికించారు. ఎస్కేయూలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 30న విశాఖలో సమైక్యమార్చ్ ఈనెల 30న వేలాది మందితో విశాఖలో సమైక్య మార్చ్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రాయూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం పోస్టర్ రిలీజ్ చేశారు. విశాఖనగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం నేత గవిరెడ్డి రామానాయుడు చేపట్టిన ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. జోరు వర్షంలోనూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వేలాది మంది విద్యార్థులు వర్షంలోనే జాతీయ జెండాలు చేతబూని సమైక్య నినాదాలతో భారీప్రదర్శన చేపట్టారు. జమ్మలమడుగు, రాయచోటిలలో న్యాయవాదులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని సత్యాగ్రహం చేపట్టారు. ఒంగోలు నగరంలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టర్ అడ్డగింత శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏలో బుధవారం జరుగుతున్న అధికారిక సమావేశానికి వెళుతున్న కలెక్టర్ సౌరభ్గౌర్ను సమైక్యవాదులు పాలకొండ ఏలాం సెంటర్లో అడ్డుకున్నారు. దాదాపు అరగంటసేపు ఆయన వాహనాన్ని నిలిపివేసి కలెక్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు వందలాది మందితో బుధవారం చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి తిరుమలకు మహాపాదయాత్రను ప్రారంభించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వరదయ్యపాళెంలో వైఎస్సార్సీపీ నాయకుడు చిన్న, అడ్వొకేట్ దశరథయ్యయ ఆమరణ నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరింది. సమైక్యవాదుల రక్తదానం విభజన పరులకు సమైక్యరక్తాన్ని ఎక్కించాలని కోరుతూ చంద్రగిరిలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో తెలంగాణ ఉద్యోగులకు రాఖీలు కట్టారు. సీమాంధ్రలో జాతీయ వార్తా చానె ళ్ల నిషేధానికి తీర్మానం సమైక్య ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వని జాతీయ వార్తా చానెళ్ల ప్రసారాలను ఆపివేయాలని తిరుపతి కేబుల్ ఆపరేటర్లు బుధవారం తీర్మానించారు. ఈ మేరకు సీమాంధ్రలోని 13 జిల్లాల ఎంఎస్వోలకు తీర్మానం పంపి సహకరించాలని కోరనున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఆర్టీసీ కార్మికులు వెనక్కు నడిచి నిరసన ప్రదర్శన చేశారు. తెనాలి, వినుకొండల్లో సమైక్యవాదులు ప్రైవేటు ట్రాన్స్పోర్టు వాహనాల్ని అడ్డగించారు. కర్నూలులో టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తిని సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. రెండు కళ్ల సిద్ధాంతం కలిగిన చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాలిన మరో ఎనిమిది ప్రాణాలు రాయదుర్గంలో నిరశన దీక్షా శిబిరంలోనే గుండెపోటుతో ఒకరి మృత్యువాత సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభ‘జనా’ందోళన బుధవారం ఒక్కరోజే మరో ఏడుగురిని బలిగొంది. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాపు భారతి చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరంలో ఉన్న తిమ్మప్ప(55) గుండెపోటుతో మృతి చెందాడు. దీక్ష శిబిరంలో సమైక్యనినాదాలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన తిమ్మప్పను పార్టీ కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటివరకు తమతోపాటు శిబిరంలో ఉన్న వ్యక్తి హఠాన్మరణం చెందడంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. ఇక విభజన వార్తలపై కలత చెంది ఓడీ చెరువుకు చెందిన బీడీ కార్మికుడు బాబ్జాన్(65), నార్పలలోని ఉయ్యాలకుంట కాలనీకి చెందిన రైతు మర్తాడు శివయ్య(46) గుండెపోటుతో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామానికి చెందిన సొసైటీ మాజీ ప్రెసిడెంట్ వీరవల్లి సత్తయ్య(65) గుండెఆగి మరణించారు. హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరి పిల్లల భవితవ్యంపై ఆయన తీవ్రఆందోళనకు లోనై మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం సంగం డెయిరీ పాలకేంద్రం అధ్యక్షుడు బత్తుల కృష్ణ(42) టీవీలో విభజన నేపథ్యంపై వార్తలు చూస్తూ గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడని బంధువులు తెలిపారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన మారేపల్లి నాగభూషణం (60), కర్నూలు జిల్లా కల్లూరు మండలం గోకులపాడుకు చెందిన కుమ్మరి రామదాసు(54) విభజన వార్తలతో కలతచెంది మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి భవానీపేటకు చెందిన వెలగంటి రామకృష్ణ (39) రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో గుండెపోటుతో మృతి చెందాడు. కొరముట్ల దీక్ష భగ్నం రైల్వేకోడూరు, న్యూస్లైన్: సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ ఏడు రోజులుగా వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరులో ఆమరణ నిరశన చేస్తున్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు దీక్షను బుధవారం పోలీసులు భగ్నం చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బలవంతంగా దీక్షను భగ్నం చేసి 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఎమ్మెల్యేతో పాటు మిగిలిన నలుగురికి సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి కొరముట్ల శ్రీనివాసులుకు కొబ్బరినీళ్లు తాగించి దీక్షను విరమింపజేశారు. కాగా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి దీక్షను మంగళవారం రాత్రే పోలీసులు భగ్నం చేసినప్పటికీ ఆయన బుధవారం ఉదయం వరకు ఆస్పత్రిలో దీక్ష కొనసాగించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్బాబు మధ్యాహ్నం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. -
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ నినాదాలు, ఉద్రిక్తత
హైదరాబాద్, న్యూస్లైన్: ఏపీఎన్జీవో, టీఎన్జీవోల నినాదాలతో రాజధాని హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలు మారుమోగుతున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న నిరసనలు, ధర్నాలను అక్కడక్కడా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరుప్రాంతాల ఉద్యోగులు పోటాపోటీగా నిరసనలు తెలుపుతుండడంతో కార్యాలయాల్లో పాలన పూర్తిగా స్తంభించిపోతోంది. ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేం దుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన సీమాంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా తెలంగాణ ఉద్యోగులు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘అన్నదమ్ముల్లా ఉంటున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేందుకు వచ్చావా’ అంటూ ఆయన్నుఘెరావ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు వారిని తోసేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి తులసిరెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు. ఏపీఎన్జీవో నేతల అరెస్టు సమైక్యాంధ్రను కోరుతూ విద్యుత్సౌధలో మంగళవారం భోజన విరామ సమయంలో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఏపీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఇరిగేషన్ అసోసియేషన్ నగర అధ్యక్షుడు బి.మల్లికార్జున్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. బీమా భవన్లో ధర్నా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మంగళవారం అబిడ్స్ తిలక్రోడ్డులోని బీమాభవన్లో ఏపీ ఎన్జీవోలు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. కోఠి డీఎంహెచ్ఎస్లోని కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, వైద్యవిధానపరిషత్, ఏపీసాక్, డీహెచ్ తదితర శాఖల సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి మౌనప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో టీఎన్జీఓలు ఒక్కసారిగా కార్యాల యాల నుంచి బయటకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
విజయమ్మ దీక్ష కీలక ఘట్టం
సాక్షి, కాకినాడ : సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్ష కీలకఘట్టమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆమె దీక్షతో రాజకీ య పార్టీలకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అందరికీ సమన్యాయం జరగాలని, లేదంటే సమైక్య రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించాలనే విజయమ్మ డిమాండ్తో వీరంతా గొంతు కలిపారు. ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయాన్ని అభినందించారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్యకళా మందిరంలో మంగళవారం ‘ఎవరెటు’ చైతన్యపథం చర్చా వేదిక నిర్వహించారు. వివిధ రంగాల నిపుణులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యావేత్తలు, విద్యార్థులు, గృహిణులు పాల్గొని సమైక్యాంధ్ర కోసం గళమెత్తారు. ‘తెలంగాణ ఉద్యమం కేవలం కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చేసింది, కానీ సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్నది ప్రజాఉద్యమం.. తెలుగువారి ఆత్మగౌరవం.. ఐక్యతల కోసం సాగిస్తున్నది. ఈ పోరు సమైక్యాంధ్రను సాధించుకునేంత వరకు ఎవరెన్ని కుట్రలు..కుతంత్రాలకు పాల్పడినా ఆగే ప్రసక్తే లేదు’ అంటూ వక్తలు తెగేసి చెప్పారు. పెద్ద రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల దుస్థితి ఏవిధంగా ఉందో కళ్లారా చూస్తున్నామన్నారు. తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలన్నదే మా అభిమతం.. అందుకోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడం.. ఎన్నినెలలైనా సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం పేర్కొన్నారు. విజయమ్మ దీక్షను చూసి నేటి రాజకీయవేత్తలు సిగ్గెరిగి వ్యవహరించాలని కాకినాడ జీజీహెచ్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ యు.రాఘవేంద్రరావు కోరారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడగొట్టడం వల్ల దేశ సమైక్యత దెబ్బతింటోందని జేఎన్టీయూకే రెక్టార్ ప్రొఫెసర్ పి.ప్రభాకరరావు అభిప్రాయపడ్డారు. ఎటు ఓటుంటే అటు ఉంటున్నారు రాజకీయ నాయకులు ఎటు ఓటు ఉంటే అటు మాట్లాడుతున్నారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా రాష్ర్ట విభజన చేస్తే చెల్లుబాటుకాదు. ఒకవేళ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినా సుప్రీం కోర్టుకు వెళ్తే అది నిలబడదు. రాష్ర్టం సమైక్యంగా ఉంచడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారమార్గం. - జవహర్ అలీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జల వివాదాలు ఏర్పడ తాయి రాష్ర్ట విభజన జరిగితే ముం దుగా తెలుగువారు సాగు, తాగునీటి కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.ఇప్పటికే జలవివాదాలతో పొరుగు రాష్ట్రాలతో పోరాడుతున్నాం. ఇలాంటి సున్నితమైన అంశాలపై ముందుగా ఏకాభిప్రాయం సాధించిన తర్వాత విభజించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. - వి.సంధ్య, ప్రముఖ విద్యావేత్త -
మిన్నంటిన నిరసనలు
సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ లక్ష్యంగా ఎగసిన ఉద్యమం పతాకస్థాయికి చేరుతోంది. సమైక్యవాదుల పోరాటానికి వారం కిందట తోడైన సకల జనుల సమ్మె సోమవారం కూడా పూర్తిస్థాయిలో సాగింది. ప్రభుత్వకార్యాలయాలు, స్కూళ్ల మూత కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రావడం లేదు. సకలం బంద్తో జీవనం స్తంభిస్తున్నా ప్రజలు మాత్రం లెక్కచేయకుండా సమైక్యమే లక్ష్యంగా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. విశాఖచరిత్రలో మొదటిసారి పోర్ట్ బంద్ జరిగింది. సోమవారం లోడింగ్,అన్లోడింగ్ లావాదేవీలు పూర్తిస్థాయిలో స్తంభించాయి. దీంతో పోర్టు యూజర్స్కు సుమారు రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆంధ్రాయూనివర్సిటీలో విద్యార్థి విభాగాలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, సమైక్యాంధ్ర రాష్ట్ర సమితి సభ్యుడు కర్రి ఆదిబాబు చేపట్టిన దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. కోర్టు ఉద్యోగుల విధుల బహిష్కరణ విశాఖ జిల్లాలోని 61 న్యాయస్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సోమవారం విధులను బహిష్కరించడంతో అన్నికేసులు వాయిదా పడ్డాయి. ఎటువంటి అవాం ఛనీయ సంఘటనలకు చోటు చేసుకోకుండా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.శివప్రసాద్ అభ్యర్థన మేరకు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా ఏజెన్సీ బంద్ విజయమ్మ దీక్షకు మద్దతుగా విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. చింతపల్లిలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కృష్ణా జిల్లాలో విజయమ్మ దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాణిజ్య పన్నులశాఖ సిబ్బంది విధులు బహిష్కరించి గుణదలలో మానవహారం నిర్మించారు. ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ఎక్సైజ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. రామవరప్పాడు రింగ్ సెంటర్లో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, విద్యార్థులతో కలసి మానవ హారం ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో జ్యుడీషియల్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. రోడ్లు ఊడ్చి న్యాయవాదుల నిరసన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో న్యాయవాదులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. దేవరపల్లిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగోరోజుకు చేరుకుంది. కొయ్యలగూడెంలో కుమ్మర్లు రోడ్డుమీద కుండలు తయారుచేసి నిరసన తెలిపారు. భీమవరంలో రోడ్డుపై వరి నాట్లు వేశారు. కేంద్ర ప్రభుత్వానికి, యూపీఏ అధ్యక్షురాలు, భారత ప్రధానికి కనువిప్పు కలిగించాలని కోరుతూ వరద గోదావరిలో స్నానం చేయడానికి యత్నించిన కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావును పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన గోష్పాద క్షేత్రంలోని సుందరేశ్వరస్వామి ఆలయం ఎదుట పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. విజయమ్మ దీక్షకు సంఘీభావంగా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన రాఘవరాజు ఆదివిష్ణు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జోరు వానలోనూ.. విజయనగరం జిల్లాలో జోరువానలోనూ ఆందోళనలు కొనసాగాయి. సమైక్యాంధ్ర జే ఏసీ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో సోమవారం భారీ మానవహారం నిర్వహించారు. గెజిటెడ్ అధికారులు కుటుంబసభ్యులతో మహార్యాలీ నిర్వహిం చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మిగనూరులో అంగన్వాడీ టీచర్లు పట్టణంలో ర్యాలీ తీశారు. రాజ మండ్రి గోకవరం బస్టాండ్ వద్ద పార్టీ యువజన విభాగం నేతలు పోలు కిరణ్మోహన్ రెడ్డి, గుర్రం గౌతం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉపాధికూలీల ర్యాలీ తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో రెండువేలమంది ఉపాధి కూలీలు గ్రామ ప్రధాన వీధుల్లో ర్యాలీ జరిపారు. కోనసీమ ఎర్త్మూవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 జేసీబీలు, 50 ట్రాక్టర్లు, 100 లారీలతో గోపాలపురం నుంచి రావులపాలెం వరకూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్ర సాధన కోసం చేపట్టిన బస్సుయాత్ర రామచంద్రపురంలో కొనసాగింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరరెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. వెనక్కి నడిచి వైద్యుల నిరసన గుంటూరులో ప్రభుత్వ వైద్యులు, నర్సులు వెనక్కు నడిచి.. రాష్ట్రాన్ని విభజిస్తే అభివృద్ధి వెనుకబడుతుందంటూ నిరసన తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక హిందూకళాశాల సెంటర్లో వేదపండితులతో మహాహోమం చేయించారు. డీఆర్వో దీక్ష: అనంతపురం నగరంలో ఏపీఎన్జీవోలు భారీ ప్రదర్శన చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్ఓ హేమసాగర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఒక్క రోజు దీక్ష చేశారు. బంజారాల ప్రదర్శన అనంతపురంలో గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంజారాల ప్రదర్శన సాగింది. ఈ ప్రదర్శనకు నగరంలోని వివిధ కాలనీలకు చెందిన మహిళలు, వృద్ధులు, చిన్నారులు స్వచ్ఛందంగా వచ్చి సమైక్య నినాదాలు హోరెత్తించారు. గుడిబండ, పెనుకొండ, పెద్దపప్పూరులో వైఎస్సార్సీపీ నాయకులు, తాడిపత్రిలో వైఎస్ విజయమ్మ సేవాసమితి సభ్యులు రిలే దీక్షలకు దిగారు. మున్సిపల్, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు తిరుపతిలో భారీ బైక్ర్యాలీ చేపట్టారు. తిరుపతిలో సోమవారం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. పీలేరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సుమారు 3వేల మందితో భారీ ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. శ్రీకాళహస్తిలో సుమారు 10వేల మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మోకాళ్లపై నిలబడి న్యాయవాదుల నిరసన ప్రకాశం జిల్లా ఒంగోలులో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు సోమవారం నుంచి వారంరోజులపాటు బంద్ ప్రకటించాయి. వైఎస్ విజయమ్మ దీక్ష కు మద్దతుగా పాతపట్నం బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. విభజన భయానికి ముగ్గురు బలి రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో సోమవారం ముగ్గురు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణంలోని భవానీనగర్కు చెందిన దామరపాటి తంగవేలు నాయుడు (80) పది రోజులుగా విభజన నేపథ్యంలో టీవీలో వస్తున్న వార్తలను, కథనాలను వీక్షిస్తూ తీవ్ర ఆవేదనకు గురవుతుండేవాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో టీవీ చూస్తున్న ఆయన హఠాత్తుగా కుర్చీనుంచి కూలబడి మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, అనంతపురం జిల్లా రొళ్ల మండలం గుడ్డుగుర్కి గ్రామానికి చెందిన ఆర్.అశ్వర్థప్ప (60), కంబదూరు మండలం కూరాకులపల్లికి చెందిన కావలి నారాయణ స్వామి (57) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కొద్ది రోజులుగా వీరు సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ అడ్డగింత పలుచోట్ల ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం సాక్షి నెట్వర్క్ : ఉద్యమంలో భాగంగా సమైక్యవాదులు సోమవారం సీమాంధ్ర జిల్లాల్లోని వివిధ నగరాల్లో ప్రారంభం కావాల్సిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ను అడ్డుకున్నా రు. ప్రక్రియ కొనసాగకుండా బ్రేక్ వేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున వర్శిటీలోనూ, నగరంలోని పాలిటెక్నిక్, ప్రభుత్వ మహిళా కళాశాలల్లో జరగాల్సినకౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. విజయనగరం, నెల్లూరుల్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగంనేతలు, అనంతపురంజిల్లాలోని జేఎన్టీయూ,ఎస్కేయూల్లో ఆందోళన కారులుఅడ్డుకున్నారు. విశాఖ జిల్లాలో కౌన్సెలింగ్ను ఆర్టీసీ ఎన్ఎంయూ, ఈయూ, ఏపీఎన్జీవో సహా వివిధ సంఘాలు నేతలు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ విధులను ఉపాధ్యాయులే బహిష్కరించారు. ఒంగోలు నగరంలోనూ సమైక్యవాదుల సెగతో కౌన్సెలింగ్కు బ్రేక్ పడంది. ఏలూరులో సెరుుంట్ థెరిస్సా, తణుకులో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన కౌన్సెలింగ్ను ఎన్జీవోలు, జేఏసీ నాయకులు అడ్డుకునే యత్నం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆంధ్రా పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో జరగాల్సిన కౌన్సెలింగ్ను ఉపాధ్యాయులు, సిబ్బంది సమైక్య సమ్మెలో ఉన్న కారణంగా నిలిపివేసినట్లు కన్వీనర్లు సోమవారం ఉదయమే ప్రకటించారు. బాబు ఫొటో లేకుండానే ‘పల్లె’ దీక్ష టీడీపీ అధినేత చంద్రబాబుపై సమైక్యవాదుల్లో తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబుకుతోందనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టారు. దీక్ష శిబిరంలో ఎక్కడా టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటో లేకుండా జాగ్రత్తపడ్డారు. తొలుత బాబు ఫొటోలతో ఫ్లెక్సీలు తయారుచేయించినప్పటికీ, బాబు ఫొటో శిబిరంలో ఉంటే ఒక్కరు కూడా మద్దతివ్వరని స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే చెప్పడంతో చివరకు ‘పల్లె’ టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ ఫొటోను ఫ్లెక్సీపై ముద్రించి దీక్ష చేపట్టారు. -
విభజన కలతతో ఐదుగురి మృత్యువాత
సాక్షి నెట్వర్క్: రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో ప్రాణాలొదిలేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో ఆదివారం ఒక్కరోజే ఐదుగురు గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆదివారం తెల్లవారుజామున ట్రెజరీశాఖ అటెండర్ బాదినేని ఆంజనేయులు(45) గుండెపోటుతో మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వర రాయపురానికి చెందిన కలగత శ్రీరాములు (70), చిత్తూరు జిల్లా గంగవరం వుండలం ఉల్లికుంట గ్రామానికి చెందిన పద్మనాభం(30) టీవీలో సమైక్య ఉద్యమ వార్తలు చూస్తూ భావోద్వేగానికి లోనై గుండెపోటుతో వుృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడిలో గృహిణి సిరపరపు ధనలక్ష్మి (30), నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో వ్యవసాయ కూలీ చింతా గోపి (55) విభజన వార్తలతో కలత చెంది గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
సమైక్య ఉద్యమంతో చార్జీలు ‘విమానం మోత’
శంషాబాద్, న్యూస్లైన్: విమానయాన చార్జీల మోత మోగుతోంది. సమైక్య ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టా రు. దీంతో రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో పాటు రైళ్లు కిటకిటలాడుతుండడంతో ప్రయాణికులు విమానయానం పై దృష్టి సారించారు. ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతి వెళ్లడానికి ప్రయాణికులు ఎక్కువగా విమానాలనే ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిత్యం ఐదు విమానాలు తిరుపతికి రాకపోకలు సాగిస్తుంటాయి. స్పైస్జెట్ ఎయిర్వేస్ ఉదయం 7.20 గంటలకు తిరిగి సా యంత్రం 4.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. దీంతో పాటు జెట్ కనెక్ట్ ఎయిర్లైన్స్కు చెందిన రెండు విమానాలు ప్రతి రోజు మధ్యాహ్నం 12.05 గంటలకు ఇక్కడి నుంచి తిరుపతి టేకాఫ్ తీసుకుంటా యి. దీంతో పాటు ఎయిర్ ఇండియాకు చెంది న ఓ విమానం ప్రతిరోజు మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి వెళ్తుంది. సాధారణంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ చార్జీలు రూ. 2,600 పైగా ఉంటాయి. ట్రాఫిక్ రద్దీతో కేవల ం ఒక్కరోజు మాత్రమే ముందుగా బుక్చేసుకుంటున్న వారికి ప్రస్తుత చార్జీలు రూ.3,600 నుంచి రూ.7వేల వరకు ఉంటున్నాయి. ఆదివారం, సెలవు రోజులు వస్తుండడంతో ముందుగానే ఎయిర్లైన్స్ చార్జీలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లే ప్రయాణికులు కూడా ఎక్కువగా విమానాలనే ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా బెంగళూరు వెళ్లే ప్రయాణికుల రద్దీ కూడా ఇంతకింతకూ పెరుగుతోంది. వైజాగ్కు ఇక్కడి నుంచి ప్రతిరోజు నాలుగు విమానసర్వీసులున్నాయి. ఉదయం 7 గంటలు, సాయంత్రం 6 గంటల సమయం లో స్పైస్జెట్ ఎయిర్వేస్ సర్వీసులున్నాయి. ఎయిర్ ఇండియా విమానం ఉదయం 7గంటలకు, ఇండిగో ఎయిర్వేస్ ఉదయం 11 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా యి. సాధారణ సమయాల్లో యాభైశాతం ఆ క్యుపెన్సీ కూడా ఉండని విమానాల్లో ఇప్పు డు 80 నుంచి వందశాతం ఉంటున్నాయని విమానాశ్రయవర్గాలు వెల్లడిస్తున్నాయి. విశాఖపట్న ం, విజయవాడలకు సాధారణ సమయాల్లో రూ. 2,600 నుంచి రూ.3 వేల వరకు మాత్ర మే చార్జీలు ఉండగా ప్రస్తుతం చార్జీలు రూ. 3,900 నుంచి రూ.7వేల వరకు ఉంటున్నాయి. రాజమండ్రికి రద్దీ ఎక్కువ శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజమండ్రికి ప్రతి రోజు రెండు విమానసర్వీసులు మాత్రమే ఉన్నాయి. ఉదయం 9.45 గంటలకు స్పైస్జెట్, మధ్యాహ్నం 12.45 గంటలకు జెట్కనెక్ట్ ఎయిర్లైన్స్లు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. ప్రస్తుతం వీటి చార్జీలు రూ.4,900 నుంచి రూ. 9,400 వరకు అత్యధికంగా ఉన్నాయి. సాధారణ సమయాల్లో రూ.3 వేల లోపు మాత్రమే ఉండే రాజమండ్రి చార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. అక్కడి నుంచి వచ్చే చార్జీలే ఎక్కువ ఇదిలా ఉంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పట్టణాలకు ఇక్కడి నుంచి వెళ్లే చార్జీలు పెరిగినప్పటికీ అటువైపు నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే చార్జీలు ఇక్కడి వాటితో పోలిస్తే రెండింతలున్నాయి. తిరుపతి నుంచి హైదరాబాద్కు రావడానికి కనిష్టంగా రూ.5 వేల చార్జీతో మొదలై గరిష్టంగా రూ. 9 వేలకుపైగా పెరిగాయి. ఇక రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడలది కూడా ఇదే పరిస్థితి. మొత్తమ్మీద సమైక్య సెగతో రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించడం ఎయిర్లైన్స్ సంస్థలకు వరంగా మారింది. -
నాల్గోరోజుకు చేరిన వైఎస్సార్సీపీ నాయకుల అమరణదీక్ష
కడప, న్యూస్లైన్: సమైక్యపోరు ఉధృత రూపం దాల్చుతోంది. సమైక్యరాష్ట్రానికి మద్దతుగా పలుచోట్ల వైఎస్సార్ సీపీ నాయకులు ఆమరణదీక్షలకు దిగుతున్నారు. గురువారం పార్టీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్రెడ్డి రాజంపేటలో, కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, మాజీమేయర్ రవీంద్రనాథ్రెడ్డి ఆమరణదీక్ష గురువారం నాటిని నాలుగొరోజుకు చేరుకున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్బాబు, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, ద్వారకానాథరెడ్డి సంఘీభావం తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు, ఉద్యోగులు తరలివచ్చి దీక్షలకు మద్దతు పలికారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష దీక్షలకు సంఘీభావం తెలిపి ఆటపాటలతో ఆకట్టుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి ఆమరణ దీక్షకు పూనుకున్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు టోల్గేట్ సమీపంలో ఆమరణదీక్ష చేపట్టారు. ప్రకాశం జిల్లా పర్చూరులో గొట్టిపాటి భరత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆరోరోజుకు చేరుకుంది, వైఎస్సార్సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈనెల 19 నుంచి విజయవాడలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా దేవరపల్లిలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు గురువారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఇదిలాఉండగా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ యువనేతలు పోలు కిరణ్మోహన్రెడ్డి, గుర్రం గౌతమ్, సాల్మన్రాజు చేపట్టిన నిరవధిక నిరహారదీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. బాబు, కిరణ్లతోనే అధోగతి: ఆకేపాటి రాజంపేట: తెలుగుతల్లి గర్భం నుంచి పుట్టినదే సీమాంధ్ర ఉద్యమమని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి అన్నారు. గురువారం రాజంపేట పాతబస్టాండు కూడలిలో ఆమరణదీక్ష చేపట్టిన ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబునాయుడులచే రాజీనామాలు చేయించిన తరువాతే ఆయా పార్టీల నాయకులు ఉద్యమాలు చేస్తే బాగుంటుందన్నారు. బాబు, కిరణ్ల వల్లే ఈ రాష్ట్రం రెండుగా చీలిందన్నారు. సోనియా పెంపుడు కుక్కలచే నియమించబడిన కమిటీ ఆమెకు విరుద్ధంగా చెప్పగలదా అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ఆ కమిటీకి సమస్యలు చెప్పుకోవాలంటే తెలుగువారికి ఎంత దుస్థితి పట్టిందో అవగతమవుతోందన్నారు. సమైక్యం కోసం వైఎస్సార్సీపీ 16మంది ఎమ్మెల్యేలు తమ పదవులను తృణప్రాయంగా వదలుకున్నార న్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధం: కొరముట్ల రైల్వేకోడూరు: రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే సోనియా తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరులోని వైఎస్సార్సర్కిల్ వద్ద ఆమరణదీక్ష చేపట్టిన ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా రాష్ట్రాన్ని విభజించేందుకు సిద్ధపడ్డారన్నారు. ప్రస్తుతం రాష్ట్రం సమైక్యాంధ్ర నినాదాలతో అగ్నిగుండంగా తయారైందని, అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం లేదని ఆరోపించారు. సమైక్యాంధ్ర కొరకు ప్రాణత్యాగానికైనా సిద్ధమై అమరణ నిరాహారదీక్షకు కూర్చున్నానన్నారు. సీమాంధ్రులు 60 సంవత్సరాలు కష్టపడి రాజధాని హైదరాబాద్ను అభివృద్ధి చేశారని, ఇప్పుడు దానిని ఎలా వదిలేసి వెళతారని ప్రశ్నించారు. -
మేరా భారత్ మహాన్
జాతీయ భావం... సమైక్య వాదం మువ్వన్నెల రెపరెపల నడుమ హోరెత్తిన నినాదం సాక్షి, నెట్వర్క్: మువ్వన్నెల పతాక రెపరెపలకు సమైక్య నినాదం శృతి కలిసింది. సమైక్యాం ధ్ర పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తున్న సకలజనులు గురువారం స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూనే సమైక్యాంధ్ర ఆకాంక్షనూ ఎలుగెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగులు అధికారికంగా జరిగిన స్వాతంత్య్రదినోత్సవంలో పాల్గొనకుం డా అక్కడే వేరుగా జాతీయజెండా ఎగురవేశశారు. కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో ‘సమైక్యాంధ్రపై కవి సమ్మేళనం’ నిర్వహించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంవద్ద జాతీయ, సమైక్య పతాకాలను పక్కపక్కనే ఎగురవేశారు. ముమ్మిడివరంలో జేఏసీ నేతలు పెన్మత్స జగ్గరాజు, కోనా శ్రీనివాసరావు, బీవీఆర్ చౌదరిల ఆధ్వర్యంలో సమైక్యవాదులు గుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఆరు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న మంత్రి తోట నరసింహం సతీమణి వాణి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. కేంద్రమంత్రి దిగ్విజయ్సింగ్తోపాటు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ... ఫోన్లో మంత్రి తోట నర్సింహం, వాణితో మాట్లాడి దీక్షను విరమించాలని కోరారు. టీడీపీ కి చెందిన రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సీతానగరం కస్తూర్బా ఆశ్రమం ఎదుట గాంధీలా కర్ర చేత పట్టుకుని నిలబడి ఎనిమిది గంటలు దీక్ష చేశారు. శ్రీకాకుళంలో స్వర్ణమంజరి అంధుల పాఠశాల విద్యార్థులు గాంధీ, నెహ్రూ, వివేకానందుడు, అల్లూరి సీతారామరాజు, తెలుగు తల్లి వేషధారణలతో ర్యాలీ తీశారు. జేసీస్ ఫెమీనా ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ కుండలతో ప్రదర్శన నిర్వహించారు. ఇచ్ఛాపురంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు బస్టాండ్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో జెండా వందనం సందర్భంగా సమైక్యాంధ్ర ఆవశ్యకతపై ఉద్వేగంగా మాట్లాడుతూ సర్పంచ్ మల్లిపెద్ది ధనలక్ష్మి స్పృహతప్పి పడిపోయారు. పాలకొల్లులో మూడోరోజూ బంద్ కొనసాగింది. తాడేపల్లిగూడెంలో విద్యార్థులు రాష్ర్ట చిత్రపటం ఆకారంలో కూర్చుని సమైక్యాంధ్ర కు మద్దతు తెలిపారు. విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో ఐక్య విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం జరిగింది. గోపాలపట్నంలో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్లకు పెద్దకర్మ నిర్వహించారు. ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. అనకాపల్లిలో గుడ్ షెపర్డ్ విద్యార్థులు వెయ్యి అడుగుల భారీ పతాకాన్ని ప్రదర్శించారు. విజయనగరంలో ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక, న్యాయవాదుల సంఘం సభ్యులు, ఎన్జీఓలు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి ఎత్తుబ్రిడ్జి వరకు ర్యాలీగా వెళ్లి రాజీవ్ విగ్రహం ఎదురుగా భారీ మానవహారం నిర్మించారు. పార్వతీపురంలో సమైక్యవాదులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. చీపురుపల్లిలో ఆర్ఈసీఎస్ ఉద్యోగులు బైక్ ర్యాలీ, మూడురోడ్ల జంక్షన్లో మానవహారం నిర్వహించారు. వర్షంలోనూ సమైక్యం...: ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నా నెల్లూరు జిల్లాలో ఆందోళనకారులు ఉద్యమాన్ని కొనసాగించారు. నెల్లూరులో ఆర్టీసీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి వంటావార్పు, మానవహారం, ర్యాలీలు నిర్వహించారు. సూళ్లూరుపేటలో ఆందోళనకారులు జాతీయ జెండాకు బదులుగా సమైక్యాంధ్ర జెండాను ఎగురవేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కనిగిరిలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ప్రతిజ్ఞ బూనారు. ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో శంకర్విలాస్సెంటర్, హిందూకళాశాల కూడలి, లాడ్జిసెంటర్ వద్ద కార్యకర్తలతో ప్రదర్శన, మానవహారం చేశారు. జిల్లాలో అన్నిచోట్లా వైఎస్ఆర్ సీపీ నేతలు రిలేదీక్షలకు కూర్చొన్నారు. చిలకలూరిపేటలో ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేశారు. తెనాలి, మంగళగిరి, మాచర్లలో వైఎస్సా ర్ సీపీ నేతలు ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్సింగ్ దిష్టిబొమ్మలను ఊరేగించారు. పలువురు ఎన్జీవోలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను తీసుకోలేదు. మున్సిపల్ ఉద్యోగులు విజయవాడలో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు రెండోరోజు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట, పెనుగంచిప్రో లు మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. చిల్లకల్లులో గ్రామస్తులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. గంగూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్బాబు ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేశారు. రెగ్యులర్ వైద్య సేవలు బంద్: అనంతపురంలో పంచాయతీరాజ్ జేఏసీ నేతృత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మద్దతు పలికారు. ఈనెల 19 నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్ను అడ్డుకుంటామని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రకటించారు. శుక్రవారం నుంచి అత్యవసర వైద్యసేవలు మినహా రెగ్యులర్ వైద్య సేవలను బంద్ చేస్తున్నామని వైద్య ఆరోగ్య జేఏసీ నాయకులు తెలిపారు. ధర్మవరంలో వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సమైక్యవాదం ఢిల్లీకి వినిపించేలా ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ విజయమ్మ విజయవాడలో చేపట్టనున్న దీక్షకు మద్దతుగా కళ్యాణదుర్గంలో వైఎసార్ కాంగ్రెస్ పార్టీ ట్రే డ్ యూనియన్ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. రాయదుర్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఎస్ఎస్ వలీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి సంఘీభావం తెలిపారు. కర్నూలులో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 15వ రో జూ కొనసాగాయి. ఆత్మకూరులో జ్యువెలర్స్ అసోసియేషన్ చేపట్టిన రిలేదీక్షలకు వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్రెడ్డి సంఘీభావం ప్రకటించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండాతోపాటు నల్లజెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సమైక్యవాదులు కేంద్రమంత్రుల ఫొటోలను కుక్కలు, గుంటనక్కల రూపాల్లో చిత్రించి నిరసన తెలిపారు. విభజన ఆందోళనతో ఆత్మహత్య గుత్తి, న్యూస్లైన్: రాష్ట్ర విభజనతో ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయనే నిరాశతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని జక్కలచెరువుకు చెందిన మోహన్, రంగమ్మ కుమారుడు రంగస్వామి (24) గ్రాడ్యుయేషన్ తరువాత ఐటీఐ చేశారు. విద్యుత్ సంస్థలో పోల్ టు పోల్ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ కొంతకాలం క్రితం ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి గ్రామంలో చిన్న చిన్న విద్యుత్ పనులు చేస్తుండేవాడు. రాష్ట్రం విడిపోతే మళ్లీ ఉద్యోగం రాదనే ఆందోళనతో గురువారం సూసైడ్ నోట్ రాసి.. గ్రామానికి సమీపంలోని పొలానికి వెళ్లి క్రిమి సంహారక మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
కిలో రూ. 80కి చేరిన ఉల్లిధర
న్యూఢిల్లీ/తాడేపల్లి గూడెం, కర్నూలు న్యూస్లైన్: ఉల్లి ధర మరింత పైపైకి దూసుకుపోతోంది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కిలో రూ. 80కి చేరుకుంది. నెల రోజుల వరకూ ధరలు దిగివచ్చే అవకాశం లేదని మార్కెట్వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో ఉల్లి కిలో రూ. 80కి చేరింది. ఆసియా అతిపెద్ద ఉల్లి మార్కెట్ నాసిక్లో హోల్సేల్ ధర రూ. 45గా ఉంది. ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రంలోని పలు శాఖల అధికారులు బుధవారం సమావేశమయ్యారు. ఉల్లి ఎగుమతులను తగ్గించేందుకు ఎంఈపీని పెంచాలని, విదేశాల నుంచి దిగుమతులు పెరిగేలా చర్యలు చేపట్టాలని నాఫెడ్ సూచించినట్లు తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్లో కంటే దేశంలోనే ఉల్లి ధరలు అధికంగా ఉన్నాయని కేంద్ర ఆహార మంత్రి కేవీ థామస్ చెప్పారు. ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన రాష్ట్రంలో ఉల్లిని ఎక్కువగా పండించే కర్నూలు జిల్లాలోనూ ఈసారి దిగుబళ్లు 40 శాతం తగ్గాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో కర్నూలు మార్కెట్ బంద్ కావడంతో ఉల్లి హైదరాబాద్కు తరలుతోంది. పండిన పంటలో 80 శాతాన్ని పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉల్లి ధరలు బుధవారం లోక్సభలోనూ మంటలు పుట్టించాయి. ధరలు పెరుగుతున్నా.. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని విపక్షాలు మండిపడ్డాయి. సీపీఎం సభ్యుడు కరుణాకరణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వ చర్యల మూలంగా ధరలు మరింతగా పెరుగుతున్నాయని మండిపడ్డారు. -
సీమాంధ్ర రైళ్లకు అదనపు బోగీలు
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమంతో సీమాంధ్ర ప్రాంతంలో బస్సులు రోడ్డెక్కని పరిస్థితి నెలకొనటంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే స్వచ్ఛందంగా స్పందించి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మరోవైపు రెగ్యులర్ రైళ్లకు కూడా అదనపు బోగీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తోంది. సీమాంధ్రలో బస్సులు నడిచే పరిస్థితి లేదని కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం దృష్టికి వచ్చినా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా రైల్వేను కోరాలనే స్పృహ లేకపోవటంతో ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా అదనపు రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుంది. ప్రస్తుతం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నా రైల్వే అధికారులు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుని అదనపు రైళ్లను నడుపుతున్నారు. ఆగస్టు నెలలో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండకపోవటంతో అదనపు రైళ్లను నడపాల్సిన పరిస్థితి రాదు. సమైక్య ఉద్యమంతో బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు రైళ్లను ఆశ్రయించటంతో రద్దీ అమాంతం పెరిగింది. దీన్ని గుర్తించిన రైల్వే అధికారులు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అదనపు బోగీల వివరాలు సేకరించి రెగ్యులర్ రైళ్లకు జత చేస్తున్నారు.తాజాగా 10 వేల అదనపు బెర్తులు అందుబాటులోకి వచ్చేలా 157 అదనపు బోగీలను సిద్ధం చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు బెర్తులను ఈనెల 31వ తేదీ వరకు రద్దీ మార్గాల్లోని ప్రధాన రైళ్లకు అనుసంధానిస్తారు. అదనపు బోగీలు ఈ రైళ్లకే.. కాకినాడ-బెంగళూరు(శేషాద్రి ఎక్స్ప్రెస్), తిరుపతి-ఆదిలాబాద్(కృష్ణా ఎక్స్ప్రెస్), కాచిగూడ-చిత్తూరు(వెంకటాద్రి ఎక్స్ప్రెస్), తిరుపతి-మచిలీపట్నం ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-రాజ్కోట్ ఎక్స్ప్రెస్లకు అదనపు బోగీలను రైల్వేశాఖ సిద్ధం చేసింది. సికింద్రాబాద్-షిర్డీ ఎక్స్ప్రెస్కు కూడా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పరిస్థితి ఇలాగే ఉంటే మరిన్ని అదనపు బోగీలను తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
జోరు వానలోనూ ఆగని పోరు
సాక్షి నెట్వర్క్: ఎడతెరపి లేని వర్షంలోనూ సమైక్య సెగ ఎగసింది. సీమాంధ్ర జిల్లాల్లో సోమవారం జోరు వానను సైతం లెక్కచేయకుండా సమైక్యవాదులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో వేకువజాము నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉన్నా నిరసనలు పోటెత్తాయి. రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఊరుకోమని సమైక్యవాదులు హెచ్చరించారు. ఏఐసీసీ అధిష్టానం వేర్పాటు ప్రకటన వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, వంటావార్పులు, రాస్తారోకోలతో హోరెత్తించారు. సోనియాగాంధీ, కేసీఆర్, బొత్సల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు సోమవారం కూడా అడుగడుగునా కనిపించాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కటిక యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మిగనూరులో మాల మహానాడు యూత్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మకు మద్యం బాటిళ్ల దండను వేసి పుర వీధుల్లో ఊరేగించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కేసీఆర్, సోనియగాంధీ దిష్టిబొమ్మలను ఊరేగించి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దహనం చేశారు. విజయనగరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స, దిగ్విజయ్ సింగ్, రాహుల్గాంధీ, సోనియా గాంధీ, కేసీఆర్ మాస్కులు వేసుకున్న వ్యక్తులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి సీమాంధ్ర ప్రజల చెవిలో పువ్వులు పెట్టినట్లు నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో భవన నిర్మాణ కార్మికులు కేసీఆర్, సోనియాలకు సమాధి కడతాం అంటూ లారీల్లో బొమ్మల్ని ఊరేగించి వినూత్నంగా నిరసన తెలిపారు. చిల్లర వర్తకులు గుర్రాలు, ఒంటెలపై ప్రదర్శనగా వెళ్లి బీచ్రోడ్డులోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైతుబజార్ల బంద్ కృష్ణాజిల్లా వ్యాప్తంగా రైతుబజార్లు మూతపడ్డాయి. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉన్నా జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. కేబుల్ ఆపరేటర్లు పూర్తిగా వినోద ప్రసారాలను నిలిపివేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి 24 గంటల బంద్ చేపట్టాలని పెట్రోల్బంక్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. నూజివీడులో వీఆర్వోలు భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత గౌతంరెడ్డి నేతృత్వంలో విజయవాడలో అర్చకులు సమైక్యాంధ్ర కోసం హోమం నిర్వహించారు. తిరువూరులో వేలాదిమంది విద్యార్థులు, డ్వాక్రా మహిళలు ప్రదర్శన చేపట్టారు. ఎడ్లబండ్ల ర్యాలీ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులో భారీ ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పాల్గొని రైతుల ఉద్యమానికి ఊతమిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ఏలూరు నగర బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి ఉద్యమానికి మద్దతు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో వంటావార్పు నిర్వహించారు. భీమవరం పరిసర ప్రాంతాలకు చెందిన క్రైస్తవ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించి, ప్రార్థనలు చేపట్టాయి. పాలకొల్లులో రైతు వేదిక ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు సమైక్యాంధ్ర కోరుతూ కదం తొక్కారు. మరో రెండురోజులు ‘తూర్పు’బంద్ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సోమవారం బంద్ పాటించారు. మంగళ, బుధవారాలు కూడా బంద్ పాటించాలని జేఏసీలు నిర్ణయించాయి. విద్యా సంస్థలు వరుసగా 12వ రోజు కూడా మూత పడ్డాయి. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. మంత్రి తోట నరసింహం సతీమణి వాణి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది. చేనేత కార్మికుల ప్రదర్శన పిఠాపురంలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. తుని, పాయకరావు పేటల్లో రిక్షాపుల్లర్స్ ర్యాలీలు నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన 23 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఉద్యోగులు రాజమండ్రిలో ర్యాలీ చేపట్టారు. వికలాంగుల నిరశన దీక్షలు రాజానగరం సెంటర్లో వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. అనపర్తిలో నాయీ బ్రాహ్మణులు సోనియా గాంధీ, కేసీఆర్ల దిష్టిబొమ్మలతో శవయాత్ర చేసి దేవీచౌక్లో దగ్ధం చేశారు. నెల్లూరు జిల్లాలో వర్షాన్ని సైతం లెక్కచేయక జనం రోడ్లమీదకు వచ్చారు. నెల్లూరు నగరంలోని జాతీయ రహదారిపై జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి హైవేను దిగ్బంధించడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచి పోయింది. కావలిలో ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రకాశం జిల్లాలో సోమవారం వేకువజాము నుంచి జోరున వర్షం పడుతున్నా సమైక్య హోరు మాత్రం కొనసాగింది. పర్చూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య కుమారుడు భరత్ చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష రెండో రోజుకు చేరింది. కదం తొక్కిన కార్మికులు కర్నూలు నగరంలో వైఎస్సార్సీపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేలాదిమంది ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆదోనిలో విద్యుత్శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి సమైక్య ఆందోళనలో పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. నంద్యాలలో రాయలసీమ ఇంజినీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టగా.. వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. గళార్చనతో నిరసన తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రాస్తారోకో చేపట్టారు. ఇందిరా మైదానంలో ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో గళార్చన నిర్వహించి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో సుమారు 300 మంది మహిళలు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లో కార్మికులు బస్సులను తాడుతో కట్టి లాగి నిరసన తెలిపారు. చిత్తూరులో వైఎస్సార్సీపీ నేత ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో జానపద గేయాలతో ప్రజలను చైతన్య పరచారు. పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సుమారు 4వేల మంది దళిత, గిరిజనులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ గుంటూరు కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ నేతృత్వంలో జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా గుంటూరులో ఆందోళనలు చేపట్టారు. దుగ్గిరాలలో పసుపు రైతుల నిరసన నేపథ్యంలో యార్డులో వేలం ప్రక్రియను నిలిపివేశారు. 10వేల మందితో సమైక్య మార్చ్ పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లి కేంద్రంలో సమైక్య నినాదం హోరెత్తింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు పదివేలమందికిపైగా చేయి చేయి కలిపి భారీ మార్చ్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యార్ధులు నిరసనప్రదర్శనలు చేపట్టారు. పాలకొండ-విశాఖపట్నం రహదారిలో గోపాలపురం వద్ద , యువజన సంఘాల ప్రతినిధులు నాటుబండ్లు, ట్రాక్టర్ ట్రాలీలు రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఎచ్చెర్లలోని బీఆర్ఏయూ విద్యార్థులు ఆంటోని కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. ‘అనంత’ 48 గంటల జిల్లా బంద్ విజయవంతం అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 48 గంటల జిల్లా బంద్ విజయవంతమైంది. వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ కూడా బంద్కు పిలుపునివ్వడంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్రంగా కొనసాగింది. విశాఖ నగరంలోని శ్రీకనకమహాలక్ష్మి దేవస్థానం అధికారులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి జగదాంబ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. 14న విశాఖలో సింహగర్జన 14న ఏయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ ఇంజినీరింగ్ గ్రౌండ్స్లో సింహగర్జన ఉంటుందని, బీచ్రోడ్డులో ఈనెల 18న మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ప్రకటించారు. బద్వేలులో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు వైఎస్సార్ జిల్లా బద్వేలులో క్రైస్తవ సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించి నాలుగురోడ్ల కూడలిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని వేడుకున్నారు. కడపలో గెజిటెడ్ అధికారులు సైతం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేశారు. ఇరిగేషన్ ఉద్యోగులు వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. ఆర్టీపీపీలో ఉద్యోగులు విధులను బహిష్కరించారు. గడికోట, రవీంద్రనాథ్ల ఆమరణ నిరశన సాక్షి, కడప: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్తో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి సోమవారం నుంచి వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వీరివురికి సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చిన జనంతో కలెక్టరేట్ పరిసరప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జీవితాలను త్యాగం చేసైనా విభజనను అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్పార్టీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ర్టవ్యాప్తంగా ప్రాంతాలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకోలేకే విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ అధిష్టానం జగన్ను రాజకీయంగా ఎదుర్కోవాలే గానీ ఇలా కుట్రలు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూంటే జనం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాయలసీమ వాసి కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఈ ప్రాంతం తరఫున ఏ వాదన వినిపించకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో కూడా 50 శాతం మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ, రాజ్యాధికారం కోసం కాంగ్రెస్పార్టీ తెలుగుజాతిని రెండు ముక్కలుగా చేసేందుకు సిద్ధపడిందని మండిపడ్డారు. విభజన జరిగిన తర్వాత జూరాల ఎత్తుపెంచితే రాయలసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే సాగునీటి సమస్యలతో సీమ రైతాంగం అల్లాడిపోతోందని, విభజన జరిగితే ఎడారి కావడం త థ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమరణ నిరాహారదీక్షలో వైసీపీ నేతలు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్లు కూడా కూర్చున్నారు. మరో 12మంది రిలేనిరాహారదీక్షలో కూర్చున్నారు. పగిలిన గుండెలు సాక్షి నెట్వర్క్: సీమాంధ్రలో మృత్యుఘోష ఆగడం లేదు. విభజన వార్తలను తట్టుకోలేక సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో తొమ్మిది మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన బోనెల వైకుంఠరావు (23) పొక్లెయిన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అతను రాష్ట్రాన్ని విడదీయవద్దని బిగ్గరగా కేకలు వేస్తూ నేలకొరిగిపోయాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి పంచాయతీ పరిధిలోని కంది శ్రీరామపురంలో జామి వెంకటరావు విభజన వార్తలపై పదిరోజులుగా ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో న్యూస్పేపర్ చదువుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలొదిలాడు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక గెడ్డంవారిపేటకు చెందిన కూలీ బూల పల్లయ్య (40) పెద్దకొడుకు వెంకటేష్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాష్ట్రాన్ని విడదీస్తున్నారని మనస్తాపం చెందిన పల్లయ్య హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవలసిందేనని కేసీఆర్ అన్నరోజు నుంచీ మరింత ఆందోళనకు గురయ్యాడని, సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించాడు. అనంతపురం జిల్లా సోమందేపల్లికి చెందిన బాదయ్యపల్లి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం వరిఘేడు గ్రామానికి చెందిన దాసి మత్తయ్య (58) సోమవారం రాత్రి టీవీలో విభజన వార్తలు చూస్తూ కలతచెంది గుండెపోటుతో మరణించగా, దెందులూరుమండలం దోసపాడులో పెనుబోయిన సుబ్బమ్మ (70) విభజన నిర్ణయూన్ని తట్టుకోలేక.. హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న తన మనుమడి భవిష్యత్పై బెంగపెట్టుకుని సోమవారం గుండె ఆగి మరణించింది.సమైక్యాంధ్ర ఉద్యమాలకు సంబంధించి టీవీల్లో వార్తలు చూస్తూ ఉద్వేగానికి లోనై సోమవారం వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురు గుండె పోటుతో మృతి చెందారు. జమ్మలమడుగు మండలం సిరిగేపల్లిలో బుకే రామదాసు నాయక్ (40) ఆదివారం రాత్రి టీవీ వార్తలు చూస్తూ గుండె నొప్పితో కుప్పకూలి మరణించారు. అట్లూరు క్రాస్రోడ్డులోని మద్దూరు కాలనీకి చెందిన నరసింహులు (35) ఎక్కడైనా సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నాలు జరుగుతుంటే వెళ్లేవాడు. సోమవారం రాత్రి టీవీ చూస్తూ గుండె పోటు రావడంతో ఆటోలో కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రైల్వేకోడూరులోని పారిశుద్ధ్య కాలనీలో సమైక్య ఉద్యమం వార్తలు చూస్తూ సోమవారం ఎన్.మంజుల (35) గుండెపోటుతో మృతిచెందినట్లు సమీప బంధువులు తెలిపారు. -
విభజించే హక్కు సోనియాకు లేదు: సబ్బం హరి
సాక్షి, విశాఖపట్నం: తెలుగువాళ్లని విభజించే హక్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేదని ఆ పార్టీ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. విభజనపై సోనియా నిర్ణయం తీసేసుకున్నారని, ఒక్కసారి మాట ఇస్తే ఆమె తప్పరని పార్టీ పెద్దలు వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి రానని గతంలో సోనియా గాంధీ అన్నారని, మరి ఇప్పుడెందుకు రాజకీయాలు చేస్తున్నారని సబ్బం విమర్శించారు. ఒక్కసారి చరిత్రను గుర్తుచేసుకోవాలని ఆయన సోనియా గాంధీని కోరారు. ప్రధాని పదవి కోసం ఆమె అప్పట్లో ములాయం సింగ్, మాయావతి, జయలలిత తదితరుల్ని కలిసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లోకి రానని చెబుతున్న ఆమె ఆ విషయాన్ని ఎందుకు గుర్తుచేసుకోవడం లేదని అడిగారు. సంఖ్య సరిపోకపోవడంతోనే నాడు ఆమె ప్రధాన మంత్రి కాలేదని గుర్తుచేశారు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్లు అందరూ దేశమైనా రాష్ట్రమైనా సమైక్యంగా ఉండాలని కృషి చేస్తే.. సోనియా మాత్రం విభజించడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ బీచ్రోడ్డులో ఆదివారం ఆయన ‘సమైక్యాంధ్ర ఉద్యమం-అవగాహన సదస్సు’ పేరిట సభ నిర్వహించారు. తొలుత పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేశారు. పార్టీలు, కుల వర్గాలకతీతంగా సమైక్యాంధ్ర కోసం అంతా ముందుకు రావాలని కోరారు. త్వరలో పాదయాత్ర.. రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదని హరి కుండబద్ధలు కొట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం తాను పాదం ముందుకు వేశానని, అందుకు వేదిక సిద్ధమైందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో త్వరలోనే పాదయాత్ర చేపడతానని, అంతా ముందుకు రావాలని కోరారు. వైఎస్సార్ తనకెంతో ఇష్టమైన నాయకుడని, ఆయనపై నిందలు మోపడం సబబుకాదని అన్నారు. రాష్ట్ర విభజనకు ఆయన ముందుకు వచ్చారని చెబుతున్న నాయకులు.. 60 ఏళ్లనుంచి తాము ఉద్యమం చేస్తున్నామని చెబుతున్న నాయకులు.. ఎవరైనా సరే వైఎస్సే విభజనకు ఆజ్యం పోశారని చెప్పగలరా అని ప్రశ్నించారు. తన పిల్లల కోసం, పదవుల కోసం సోనియా ప్రయత్నించారని, కానీ ఏనాడూ వైఎస్ తన పిల్లలకు పదవుల గురించి ఆలోచించలేదన్నారు. సమైక్యాంధ్ర కోసం ముందుకు రావాలని స్వర్గం నుంచి ఎన్టీఆర్ చంద్రబాబును కోరాలని, ఆయన మాట వినకపోతే కొడుకుల్నయినా కోరాలని సబ్బం అన్నారు. విశాఖ ప్రజలు పురందేశ్వరిని ఎన్నుకుంటే కనిపించకపోవడం ఘోరమన్నారు. తన కూతుర్ని ఉద్యమంలోకి పంపించాలని పైనున్న ఎన్టీఆర్ను కోరుకుంటున్నట్టు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవిది ఎక్స్ట్రా క్యారెక్టర్ అని, ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారని, రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంటే ఆయన మాత్రం కేరళలో పడవలకు జెండా ఊపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వెల్లడించిన అభిప్రాయాలు సరైనవేనన్నారు. జనం కోసం జగన్.. ‘జనం కోసం జగన్ తిరుగుతున్నారనే ఆయన్ను జైల్లోకి పంపారు.. ఇప్పుడు ఉద్యమ కాగడాలతో విజయమ్మ, షర్మిల ముందుకు వచ్చారు’ అని సబ్బం అన్నారు. పదవుల్ని త్యజించిన విజయమ్మ, జగన్ల గొప్పతనాన్ని ఆయన అభినందించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. జగన్, విజయమ్మలను చూసి ఇతర రాజకీయ నేతలు ఎంతో నేర్చుకోవాలని చెప్పారు. కేసీఆర్ది అబద్ధాల కుటుంబం టీఆర్ఎస్ నేత కేసీఆర్ది అబద్ధాల కుటుంబం అని హరి ధ్వజమెత్తారు. తెలుగువారి ఉనికినే ప్రశ్నించే స్థాయికి ఆయన ఎదిగిపోయారని, హైదరాబాద్ వచ్చి తగిన సమాధానం చెబుతామని అన్నారు. త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ర్టం మీ తాత సొత్తా అని కేసీఆర్ను ప్రశ్నించారు. ఆయన ఏపీ రాక్షసుడు అని, అంతమొందించాల్సిందేనని అన్నారు. సమాజంలో చిచ్చుపెడుతున్నవారెవరైనా త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. -
రైల్రోకో 11కి వాయిదా
సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంత నేతలు నిర్వహించ తలపెట్టిన రైల్రోకో వాయిదా పడింది. రంజాన్ నేపథ్యంలో తమ కార్యాచరణలో పలు మార్పులు చేసినట్లు సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ వెల్లడించింది. రాష్ట్ర విభజన నిరసన ఉద్యమాల కార్యాచరణ ప్రణాళికపై గురువారమిక్కడ సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో జేఏసీ గౌరవాధ్యక్షుడు పి.నరసింహారావు, కన్వీనర్ ఎన్.శామ్యూల్, జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులుతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, రాతంశెట్టి రామాంజనేయులు, పోలూరి వెంకటరెడ్డి, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, టీడీపీ తరఫున ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కాంగ్రెస్ నేత రాయపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశం పది తీర్మానాలు చేసింది. - సీమాంధ్రకు ప్యాకేజీలు అవసరంలేదు. రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలి - రాజకీయ నాయకులు రాజీనామాలు చేసి జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలి - చట్టబద్ధత లేని ‘ఆంటోనీ’ కమిటీని గుర్తించడంలేదని.. ఆ కమిటీని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయం - మండల, నియోజకవర్గాలు, గ్రామాల వారీగా జేఏసీలు ఏర్పాటు చేయాలి - ఈ నెల పదో తేదీ నుంచి గుంటూరు మార్కెట్ సెంటర్లోని శ్రీపొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలి - 11న రైల్రోకోలు - 12న విద్యార్థులతో భారీ ర్యాలీలు - 13న గుంటూరు జిల్లావ్యాప్త బంద్, నిరసన ర్యాలీలు - కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆంటోనీ కమిటీని బహిష్కరించాలి - అన్ని రాజకీయపార్టీలు కలసి ఉద్యమానికి మద్దతు పలకాలి