save
-
రైలు కింద పడిన మహిళ.. కాపాడేందుకు ట్రైన్ రివర్స్
ముంబై: ఓ మహిళ రైలు కింద పడి ప్రాణాలతో బయడపటింది. రైలు కింద మహిళా చిక్కుకున్న విషయాన్ని గ్రహించిన పైలట్ ట్రైన్ను వెనక్కి వెళ్లనివ్వడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది, అయితే ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లను కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై లోకల్ స్టేషన్లో సోమవారం చోటుచేసుకుంది.ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మహిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ రైలు రద్దీగా ఉండటంతో ఆమె ఎక్కే క్రమంలో కాలు జారింది. దీంతో.. రైలు కింద పడిపోయింది. అప్పటికే రైలు కదలడంతో.. ఒక కంపార్ట్మెంట్ ఆమె పై నుంచి వెళ్లింది. అప్పుడు ప్లాట్ఫామ్పై ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బంది అలారం మోగించడంతో.. రైలు వెనక్కు వెళ్లింది.పోలీసు అధికారులు ట్రాక్లపై దిగి.. ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంటనే మహిళను సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నిల తెలిపారు. ఈ ఘటనలో మహిళ తన రెండు కాళ్లను కోల్పోయింది.కాగా.. ముంబైలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను రద్దు కావడంతో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరింది. ఫుట్బోర్డు వద్ద కూడా నిలబడి మరీ ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలోనే బేలాపూర్ స్టేషన్లో చాలాసేపు తర్వాత థానేకి వెళ్లే రైలు రావడంతో.. జనాలందరూ ఎగబడ్డారు. దీంతో బాధిత మహిళ కాలుజారి కిందపడినట్లు అధికారులు పేర్కొన్నారు. -
మనుమరాలిని విషనాగు నుంచి కాపాడి.. కన్నుమూసిన బామ్మ!
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లోని అందరినీ కంటతడి పెట్టించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి షాహ్గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్గుపూర్ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న బామ్మ, మనవరాలి మంచంపైకి ఒక భారీ నాగుపాము చేరింది. ఆ పాము మనుమరాలి వైపు కదులుతున్న విషయాన్ని గమనించిన బామ్మ దానిని చేత్తో పట్టుకుంది. వెంటనే ఆ విషనాగు బామ్మను కాటేసింది. ఈ సమయంలో బామ్మ ఆర్తనాదాలను విన్న కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే బామ్మను సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్కు తరలించారు. అయితే ఆ బామ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా పామును చేత్తో పట్టుకుని, మనుమరాలిని కాపాడున్న బామ్మ సాహసానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వీక్షకులు బామ్మ సీతాదేవి(72) తెగువకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె మనుమరాలు(24)కు ఎటువంటి హాని జరగలేదు. కాగా పాము కాటుకు బామ్మ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయకుండా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. -
మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!
రక్తదానం చేసి ఇతర కుక్కల ప్రాణాలను కాపాడిన ఇలాంటి కుక్కలు హైదరాబాద్లో పదుల సంఖ్యలో ఉన్నాయని మీకు తెలుసా?. హైటెక్స్లో మూడు రోజుల పాటు జరిగిన జంతు ప్రదర్శన పెటెక్స్, హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ ముగిసింది. డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ను ముందుకు తీసుకెళ్లినందుకు బోబీ చౌహాన్ పెట్టింగ్ మ్యాటర్స్, డాగ్ స్పెషలిస్ట్ కంపెనీ ఈ సందర్భంగా గుర్తించబడింది. అలాగే ఈ డ్రైవ్లో రక్తదానం చేసినందుకు అనేక కుక్కలు వాటి యజమానులను కూడా సత్కరించారు. మనుషులు మాదిరిగానే కుక్కలు కూడా..! బాబ్బీ చౌహాన్ ప్రకారం, కుక్కలు, పిల్లులు మనుషుల మాదిరిగానే రక్తదానం చేయవచ్చు. నగరంలో గత ఐదేళ్లలో దాదాపు 200 రక్తదానాలు నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు, పెంపుడు కుక్కలను పెంచుకుంటున్న వారిలో దీనిపై పెద్దగా అవగాహన లేదు. కుక్కలు ప్రతి మూడు నెలలకొకసారి మనుషుల మాదిరిగా రక్తదానం చేయవచ్చు. వీటికి 12 బ్లడ్ గ్రూపులు, 11 క్రాస్ మ్యాచింగ్ గ్రూపులు ఉన్నాయి. నగరంలో కుక్క లేదా కుక్కల బ్లడ్ బ్యాంక్ లేదని ఆయన అన్నారు. పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు రక్తదానం చేయడానికి, ఇతర కుక్కలను రక్షించడానికి సిద్ధంగా ఉంటే డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆలోచనతో రోస్టియన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అంతేగాదు వారు నిహిత్ మెషిన్ ఆవిష్కరించారు. ఇది కుక్కలా ఆహరం విక్రయించే వెండింగ్ మెషీన్. ఇది ఉపయోగించిన లేదా వేస్ట్ నీటి బాటిళ్లను తీసుకుంటుంది. ముఖ్యంగా ఇది వీధి కుక్కల ప్రయోజనం కోసం పెంపుడు జంతువుల ఆహారాన్ని అందించడమే గాక రెండు సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకటి ప్లాస్టిక్ పెట్ బాటిళ్లను బాధ్యతాయుతంగా పారవేయడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే అదే సమయంలో ప్లాస్టిక్ సమస్యకు చెక్పెడుతుంది. ఈ యంత్రాన్ని ఎక్స్పోలో ప్రదర్శించారు. Pawstive మార్పు తీసుకొద్దాం. అలాగే వెండింగ్ మిషన్తో భూమిని కలుషితం కాకుండా చూద్దాం అని వ్యవస్థాపకుడు నొక్కి చెప్పారు. (చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!) -
గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? స్పెయిన్లో ఏం జరుగుతోంది?
స్పెయిన్లోని పర్యావరణ కార్యకర్తలు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఐరోపా దేశాలు తీవ్రమైన కరువుతో తల్లడిల్లుతున్న నేపధ్యంలో స్పెయిన్కు చెందిన పర్యావరణ కార్యకర్తలు నీటిని పొదుపు చేయడానికి నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మాడ్రిడ్, వాలెన్సియా, ఇబిజా, నవర్రాతో సహా ఆరు రాష్ట్రాలలో గోల్ఫ్ కోర్సుల రంధ్రాలను మూసివేశారు. గోల్ఫ్ కోర్స్ చుట్టూ ఉన్న పచ్చటి ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ 22,000 గ్యాలన్లకు పైగా నీరు అవసరమని వారు చెబుతున్నారు. కరువు కారణంగా స్పెయిన్ రైతులు తమ పంటలకు తగినంత నీరు అందకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దేశంలో గోల్ఫ్ కోర్సుల కంటే పంట పొలాలకు నీటి అవసరం అధికమని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం పర్యావరణ కార్యకర్తలు ప్రస్తుతం 10 గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేశారు. మైదానంలో కొన్ని గుంతలలో మొక్కలు నాటడమే కాకుండా కొన్నింటిని సిమెంటుతో మూసివేశారు. ఎక్స్టింక్షన్ రెబెల్లియన్ (ఎక్స్ఆర్) సంస్థ సభ్యులు పర్యావరణ కార్యకర్తలతో కలిసి ఈ పనులు చేపట్టారు. కరువు సంక్షోభం మధ్య నీటి వృథాను అరికట్టేందుకు గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేయడం తప్పనిసరి అని ఎక్స్టింక్షన్ రెబెల్లియన్ గ్రూప్ పేర్కొంది. దేశమంతా కరువుతో తల్లడిల్లిపోతున్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఉన్నతవర్గం వారు గోల్ఫ్ కోర్సుల పేరుతో నీటిని వృథా చేయడం తగదన్నారు. సంపన్నుల అనవసర కార్యకలాపాల వల్ల వనరులు వృథా అవుతున్నాయని వారు ఆరోపించారు. కొన్ని నెలలుగా స్పెయిన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, చెరువులు, ఇతర నీటి వనరులలోని నీటిశాతం నిరంతరం తగ్గతూవస్తోంది. ఈ నేపధ్యంలోనే శాన్ రోమన్ డి కా సౌ రిజర్వాయర్ నీటి మట్టం 1990 నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో రిజర్వాయర్లో మునిగిపోయిన పాత చర్చి పూర్తిగా కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్లో కరువు పరిస్థితులు మరింతగా పెరగనున్నాయి. ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? -
దయచేసి.. మా కుమారుడిని కాపాడండి!
ఖమ్మం: మెదడులో నీరు చేరడంతో అనారోగ్యం పాలైన ఓ విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బ్రెయిన్కు సర్జరీ చేస్తేనే బతుకుతాడని వైద్యులు సూచించడంతో కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేచిచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని గాదెపాడు గ్రామానికి చెందిన భూక్యా సంతు, ప్రమీల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడైన భూక్యా హర్షిత్ కారేపల్లిలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. కాగా మూడేళ్ల కిందట హర్షిత్కు జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చూపించగా.. చిన్నారి బ్రెయిన్లో నీరు చేరిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో హర్షిత్కు రెండుసార్లు బ్రెయిన్ సర్జరీ జరిగి కోలుకుంటున్న క్రమంలో ఇటీవల తిరిగి అనారోగ్యానికి గురికావడంతో రెయిన్బోకు తీసుకొచ్చారు. చికిత్స అనంతరం మరోసారి బ్రెయిన్ సర్జరీ చేయాలని, సుమారు రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యు లు తెలపడంతో ఇప్పటికే ఇల్లు, వాకిలి అమ్ముకోవడంతో పాటు స్నేహితుల సహకారంతో రూ.12 లక్షల వరకు ఖర్చుచేశామని వాపోయారు. ఇదిలా ఉండగా హర్షిత్ తండ్రి సంతుకు 2021వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై బ్రెయిన్ సర్జరీ కావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తమ కుమారుడి ప్రాణాలైనా కాపాడుకుందామని, దాతలు సహకరించాలని హర్షిత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చదవండి: బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉండి మరీ అరాచకం..! ఒక్కసారిగా ఇలా.. -
హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు?
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతగా అడాల్ఫ్ హిట్లర్ పేరుగాంచాడు. హిట్లర్ అనేక దేశాలలో విధ్వంసం సృష్టించాడు. లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నాడు. హిట్లర్ నియంతృత్వం ఎంతగా పెరిగిందంటే అతని కారణంగా ఒక దేశంతో మరో దేశం పోరాడేందుకు సిద్ధం అయ్యింది. అలాంటి హిట్లర్ చొరవతోనే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు మనం హిట్లర్ జీవితంలోని ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. ప్రపంచమంతా హిట్లర్ నియంతృత్వానికి ఆందోళన చెందింది. ఈ నేపధ్యంలోనే అతన్ని చంపడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. ఎవరికీ ఇది అంత సులభం కాలేదు. హిట్లర్ను వెన్నంటి ఉండే నాజీ సైన్యం అతనిని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడేది. ఆహారంలో విషం కలిపి, తనను ఎవరైనా చంపేస్తారేమోనని హిట్లర్ నిత్యం భయపడేవాడు. దీనిని తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని కూడా అనుసరించాడు. హిట్లర్కు సన్నిహితులైన 15 మంది మహిళలు ఆయనకు వడ్డించే ఆహారాన్ని మొదట రుచి చూసేవారు. ఎప్పుడైనా ఆహారంలో విషం కలిపితే, దానిని రుచి చూసే మహిళ చనిపోతుంది. అప్పుడు హిట్లర్ ప్రాణాలకు రక్షణ ఏర్పడుతుంది. హిట్లర్ ఆహారం తీసుకునే ప్రతిసారీ ఈ మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు. హిట్లర్ తినే ఆహార పదార్థాలు అధికంగా ఉండటం వలన వాటిని పలువురు మహిళలు రుచి చూసేవారు. హిట్లర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పలు పద్ధతులను ఉపయోగించేవాడు. ఎటువంటి దాడికి గురికాని సైనిక బంకర్లలో తల దాచుకునేవాడు. భారీ స్థాయిలో ఉన్న నాజీ సైన్యం అతనిని నిరంతరం కాపాడుతుండేది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంతలా తాపత్రయపడిన హిట్లర్ చివరికి విషాహారం కారణంగానే మృతి చెందాడు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
మార్కెట్ యార్డుల్లో విద్యుత్ ఆదాకు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డుల్లో ఇంధన సామర్థ్య చర్యల ద్వారా విద్యుత్ను, డబ్బును ఆదా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. గుంటూరు యార్డును ఆసియాలోనే అతిపెద్ద విద్యుత్ ఆదా మిర్చి వ్యాపార కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖతో భాగస్వామి అయ్యేందుకు అంగీకరించింది. రాష్ట్రంలోని మరికొన్ని కీలక మార్కెట్ యార్డుల్లో కూడా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయనుంది. వ్యవసాయ వాణిజ్యానికి మార్కెట్ యార్డులు కీలక కేంద్రాలు. ఇక్కడ లైటింగ్, శీతలీకరణ, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ కోసం విద్యుత్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వీటిని విద్యుత్ పొదుపు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవితో ఈఈఎస్ఎల్ కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ సీజీఎం అనిమేష్ మిశ్రా ఆదివారం భేటీ అయ్యారు. విద్యుత్ ఆదా చర్యలకు సంబంధించిన నివేదికను చిరంజీవికి అందజేశారు. అనంతరం ఈఈఎస్ఎల్ అధికారులు, మార్కెటింగ్, సహకార శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. తొలుత గుంటూరు మిర్చి యార్డులో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేస్తా మన్నారు. ఈఈఎస్ఎల్ ప్రతినిధులు నితిన్ భట్, సావిత్రి సింగ్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు. -
రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం..
రాయ్పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది రాఖీ పౌర్ణమి. సంతోషంగా జీవతాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ అన్నదమ్ముల్లకు ఆడపిల్లలు రాఖీ కడుతారు. వారి రక్షణ ఎప్పుడూ తనకు ఉండాలని కోరుకుంటారు. పండగపూట సోదరి కళ్లలో ఆనందం చూడటానికి ఓ మంచి గిఫ్ట్తో అన్నాదమ్ముళ్లు సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే.. చత్తీస్గఢ్లో మాత్రం ఓ సోదరి తమ్ముడి మీద ప్రేమతో ఓ కిడ్నీనే దానంగా ఇస్తోంది. ఓం ప్రకాశ్(48), ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్వాసి. గత ఏడాది మే నెల నుంచే అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఓ కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం వ్యాధి బారినపడ్డాయి. డయాలసిస్తో కాలం వెల్లదీస్తున్నాడు. అనేక ఆస్పత్రులకు తిరిగిన అనంతరం కిడ్నీ మార్పిడికి కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. దీంతో కిడ్నీదాత కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో తమ్ముడి కోసం ఓం ప్రకాశ్ పెద్ద అక్క శీలాభాయ్ పాల్ ముందుకు వచ్చింది. రాయ్పూర్లోని టిక్రపారలో ఉంటున్న ఆమె తమ్ముడి సమస్య తెలిసి వెంటనే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. పరీక్షల అనంతరం ఆమె కిడ్నీ ఓం ప్రకాశ్కు సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆపరేషన్ జరనుంది. తమ్ముడంటే ప్రేమ అని తెలిపిన శీలాభాయ్.. అతనితో కలిసి జీవితాంతం బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు ఇంకా మూడు రోజులు ఉండగా.. నేడు శీలాభాయ్ తన తమ్ముడు ఓం ప్రకాశ్కి రాఖీ కట్టింది. తన తమ్ముడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించింది. ఇదీ చదవండి: Raksha Bandhan 2023 Special: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా! -
మరణించినా.. మరోసారి జీవించే అరుదైన అవకాశం..!
మనిషికి ఒకటే జన్మ.. అదే మనిషి అవయవాలకు మాత్రం రెండు జన్మలు. అవయవదానం చేస్తే మరణించినా మరోసారి జీవించే అవకాశం ఉంది. ఒక్క మనిషి చనిపోతే గుండె, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చేతులు, ముఖం, కణజాలం, ఎముకమజ్జ, మూలకణాలు దానం చేసి మరో 8 మంది ప్రాణాలు కాపాడొచ్చు. దేశంలో మరణాల సంఖ్య అధికంగా ఉన్నా.. అవయవదాతలు ఆ స్థాయిలో ఉండడం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువుల ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు, అవగాహన రాహిత్యంతో చాలామంది ముందుకు రావడం లేదు. 18ఏళ్లు దాటినవారు ఆర్గాన్స్ డొనేట్ చేయొచ్చు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ప్రాణం పోసిన.. దాతల సహకారంతో బతుకుతున్న వారిపై.. అన్నకు తమ్ముడి కిడ్నీ సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్రెడ్డి(53) రైతు. షటిల్ ఆడేవాడు. ఉన్నట్టుండి వాంతులయ్యా యి. ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీలు ఫెయిలయ్యాయని వైద్యులు నిర్ధారించారు. డయాలసిస్కు నెలకు రూ.40వేల నుంచి రూ.60వేల వరకు ఖర్చయ్యాయి. మూడు నెలలు గడిచాయి. విజయేందర్రెడ్డిని ఆస్పత్రిలో ఆ స్థితిలో చూసిన అతని తమ్ముడు జితేందర్రెడ్డి(50) తన రెండు కిడ్నీల్లో ఒకటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ అయింది. మృత్యువు ముంగిట అసహాయంగా నిల్చున్న అన్నకు ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది. విజయేందర్రెడ్డి ప్రస్తుతం జిల్లెల్లలో వ్యవసాయం, తమ్ముడు జితేందర్రెడ్డి హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తొలి డోనర్ లక్ష్మి సిరిసిల్లకల్చరల్: సిరి సిల్లలోని గాంధీనగర్కు చెందిన ఇప్పనపల్లి నారాయణ, లక్ష్మి దంపతులు. మిర్చి బండి పెట్టుకుని జీవించేవారు. 12 ఏళ్లక్రితం పనులు ముగించుకుని ఇంటికెళ్లారు. అర్ధరాత్రి దాటాక విపరీతమైన తలనొప్పితో లక్ష్మి కింద పడిపోయింది. ఆమెను హైదరాబాద్లోని కిమ్స్లో చేర్పించారు. ఆమె బ్రెయిన్డెడ్ కావడంతో అవయవదానంపై అవగాహన కల్పించారు. ఆమె కుమారులు సంతోష్, రమేశ్ అంగీకారం మేరకు లక్ష్మి ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, మూత్రపిండాలు సేకరించి నలుగురు వ్యక్తులకు అమర్చారు. జిల్లాలోనే తొలి అవయవ దాతగా లక్ష్మి గుర్తింపుపొందారు. తండ్రి.. భార్య ఇద్దరూ దాతలే కోరుట్ల: తండ్రి.. భార్య ఇద్దరూ కిడ్నీ దాతలుగా నిలిచారు. కోరుట్లకు చెందిన గీత కార్మికుడు పోతుగంటి శ్రీనివాస్ 2017లో వెన్నునొప్పితో అవస్థ పడడంతో తండ్రి రఘుగౌడ్ వైద్యులతో పరీక్షలు చేయించాడు. శ్రీనివాస్కు కిడ్నీ సమస్య ఉందని తేలడంతో కలవరపడ్డాడు. వైద్యులు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకతప్పదని చెప్పడంతో రఘుగౌడ్ తన కిడ్నీదానం చేశాడు. శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడింది. ఐదేళ్ల తరువాత 2022లో మళ్లీ వెన్నునొప్పి మొదలైంది. మరోసారి పరీక్షించిన వైద్యులు మళ్లీ కిడ్నీ మార్పిడి చే యాల్సిందేనని చెప్పడంతో అతడి భార్య లావణ్య కిడ్నీ ఇచ్చింది. శ్రీని వాస్ తేరుకుని ప్రస్తుతం ఏ సమస్య లేకుండా తన పనులు తాను చేసుకుంటున్నాడు. అవయవదాతల‘అబ్బిడిపల్లె’ ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లె వాసులు మూకుమ్మడిగా అవయవదానానికి అంగీకరిస్తూ తీర్మానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అప్పటి కలెక్టర్ సంగీతకు లేఖ అప్పగించారు. అబ్బిడిపల్లెలో 600 జనాభా ఉంటుంది. సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు భీష్మాచారి ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కల్పించగా.. సర్పంచ్ ఒజ్జ కోమలత ఆధ్వర్యంలో తీర్మానం చేసి శభాష్ అనిపించుకున్నారు. మెడికల్ కాలేజీకి మృతదేహం కోల్సిటీ: గోదావరిఖని శివాజీనగర్కు చెందిన దేవకి పార్థసారథి (85) తన మరణానంతరం అవయవాలు దానం చేస్తానని సదాశయ ఫౌండేషన్కు అంగీకార పత్రం రాసిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న అనారోగ్యంతో మృతి చెందగా.. కుటుంబసభ్యులు ఆమె నేత్రాలను ఐ బ్యాంక్కు, పార్థివదేహాన్ని రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించారు. బతికుండగానే.. సారంగాపూర్: బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన పానగంటి స్వప్న(45) అంగన్వాడీ టీచర్. తాను చనిపోయాక తన అవయవాలు దానం చేయాలని భర్త నర్సయ్యతో చెబుతుండేది. తీవ్ర జ్వరంబారిన పడి చనిపోయిన ఆమె కోరిక మేరకు ఆమె రెండు కిడ్నీలు, గుండెను దానం చేశారు కుటుంబసభ్యులు. నలుగురికి ప్రాణం కోల్సిటీ: గోదావరిఖనిలోని ఎల్బీనగర్కు చెందిన మింగాని సంపత్(41) ఎమ్మెస్సీ, బీఈడీ చదివారు. ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ డైరెక్టర్. 2019 జనవరి 14న రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లి మరణించారు. నలుగురికి లివర్, రెండు కిడ్నీలు, గుండె అమర్చారు. ఏడుగురికి పునర్జన్మ కోల్సిటీ: తాను మరణించి మరో ఏడుగురికి పునర్జన్మిచ్చారు గోదారిఖనిలోని విద్యానగర్కు చెందిన సిరిసిల్ల ఇమానుయేల్(33). హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేసే ఆయన 2019 జనవరి 3న బైక్పై ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వారంపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఆయన కుటుంబసభ్యులు ఆయన అవయవాలను దానం చేయగా.. ఏడుగురికి పునర్జన్మ లభించింది. దేహదానానికి నిర్ణయం కోల్సిటీ: గోదావరిఖని చంద్రబాబుకాలనీలో నివాసం ఉంటున్న మేరుగు లింగమూర్తి ఓసీపీ–3లోని బేస్ వ ర్క్షాప్లో ఆపరేటర్. ఎనిదేళ్ల క్రితం రెండు కిడ్నీలు చెడిపోయా యి. డయాలసిస్పై ఉన్న భర్త లింగమూర్తిని బతికించుకోవడానికి అతని భార్య విజయ తన కిడ్నీని దానంచేసింది. ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో తమ మరణానంతరం తమ దేహాలను మెడికల్ కాలేజీ కొడుకు కళ్లు సజీవం.. కోల్సిటీ: నా కొడుకు విజయ్పాల్రెడ్డి 2018 సెప్టెంబర్ 27న చనిపోయాడు. నేను, భార్య సుశీలతోపాటు నా కుటుంబ సభ్యులు దుఃఖంలో కూడా విజయపాల్రెడ్డి నేత్రాలను ఐ బ్యాంక్కు దానం చేశాం. నా భార్య, నేను కూడా మా మరణానంతరం నేత్రదానం చేస్తామని అంగీకారం తెలిపాం. చనిపోయిన వారి అవ యవాలు మరికొందరికి ఉపయోగకరంగా ఉంటాయి. వారిలో మనవారిని చూసుకోవచ్చు. – మారెల్లి రాజిరెడ్డి, యైంటింక్లయిన్కాలనీ, గోదావరిఖని తమ్ముడు తోడుండాలని.. కోరుట్లరూరల్: మాది మండలంలోని సంగెం. నాకు ఒక అన్న. ఇద్దరు తమ్ముళ్లు. చిన్న తమ్ముడు చీటి రాంచందర్రావుకు 18ఏళ్ల క్రితం అనారోగ్యంతో రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. డయాలసిస్ చేసినా ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్పారు. తమ్ముడిని కాపాడుకునేందుకు ఒక కిడ్నీ ఇచ్చా. కొంతకాలానికి తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడు. కిడ్నీ ఇచ్చిన నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. అన్ని పనులు చేసుకుంటున్నా. తమ్ముడే దక్కలేదు. – చీటి మురళీధర్ రావు, సంగెం, కోరుట్ల రాష్ట్రం మొదటిస్థానం కోల్సిటీ: అవయవదానంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. మన రాష్ట్రం దేశంలో అవయవదానంలో మొదటిస్థానంలో నిలిచింది. గోదావరిఖని ప్రాంతంలో ఎక్కువ మంది ముందకు వస్తున్నారు. 2008లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పురుడుపోసుకున్న సదాశయ ఫౌండేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అవయవదాతల కుటుంబాలకు, స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. – టి.శ్రవణ్కుమార్, సదాశయ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మా ఆయన్ను దక్కించుకోవాలని.. విద్యానగర్(కరీంనగర్): మా వారు వారాల ఆనంద్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రíహీత. 2013లో ఆయనకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. వారానికి మూడుసార్లు డయాలసిస్ ఏడాదిపాటు చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన్ను దక్కించుకునేందుకు నేను ఒక కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యా. నా కిడ్నీని ఆనంద్కు 15 జూలై 2014లో ట్రాన్స్ప్లాంట్ చేశారు. నా జీవితంలో ఆయన లేని లోటును ఊహించలేను. నాలో భాగమైన ఒక కిడ్నీ ఇచ్చి బతికించుకున్నాను. ఇప్పుడు నేను, మావారు పిల్లలతో ఆనందంగా ఉన్నాం. – వారాల ఇందిరారాణి, గృహిణి, కరీంనగర్ కొడుకు ప్రాణం పోశాడు వేములవాడ: మాది వేములవాడ. కొన్నేళ్లక్రితం లివర్వ్యాధి ఉండేది. ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. నా కొడుకు మారుతి లివర్ నాకు సరిపోయింది. 17 నవంబర్ 2017న మారుతి లివర్లోని కొంతభాగాన్ని నా లివర్కు జతచేశారు. ఇప్పుడు ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. నా కొడుకు లివర్ ఇచ్చి నాకు ప్రాణం పోశాడు. – కుమ్మరి శంకర్, వేములవాడ -
విద్యుత్ షాక్ నుంచి అమ్మాయిని కాపాడిన ఆర్టిఫిషియల్ గోళ్లు
సాధారణంగా విద్యుత్ షాక్ తగిలినవారు తీవ్రంగా గాయాలపాలు కావడమో లేదా మృతి చెందడమో జరుగుతుండటాన్ని మనం చూసేవుంటాం. అయితే ఇటీవల ఒక కాలేజీ యువతికి విద్యుత్ షాక్ తగిలి 4 అడుగుల దూరం ఎగిరిపడంది. అయితే ఇంత జరిగినా ఆమెకు చిన్నపాటి గాయం కూడా కాకపోవడం విశేషం. ఈ విచిత్ర ఉదంతం ఇంగ్లండ్లో చోటుచేసుకుంది. తనకు ఎదురైన అనుభవం గురించి బాధితురాలు మాట్లాడుతూ తాను నకిలీ గోళ్లు పెట్టుకున్నకారణంగా విద్యుత్ షాక్ నుంచి బయటపడ్డానని తెలిపింది. 21 ఏళ్ల నికోల్ ఫోర్మ్యాన్ అనే యువతి ఇంటిలోని బాయిలర్ సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్కు గురయ్యింది. బాయిలర్ను బంద్ చేయకుండానే నీటిని వేడి చేసి, స్నానం చేసేందుకు ఆ నీటిలో కాలు మోపింది. వెంటనే ఆమె షాక్నకు గురయ్యింది. ఎడిన్బర్గ్ క్వీన్ మార్గరిట్ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఆ యువతి..‘షాక్ తగిలిన వెంటనే నాలుగు అడుగుల దూరం ఎగిరిపడ్డాను. తరువాత స్పృహ కోల్పోయానని’ తెలిపింది. ఇంటిలోని వారు ఆమెను గమనించి వెంటనే బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, ఆమె పెట్టుకున్న నకిలీ గోళ్ల కారణంగానే ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ షాక్ నుంచి బయటపడిందని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన నికోల్..‘మా అమ్మ నా ఆర్టిఫిషిల్ గోళ్లను చూసి నన్ను తెగ మందలించేది. అయితే ఇప్పుడు ఆ గోళ్లే తనను కాపాడాయని తెలుసుకుని సంతోషపడుతోందని’ తెలిపింది. ఇది కూడా చదవండి: భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన! -
నడక చైర్లోని పసివాడు.. పైకప్పు కూలిపోయేంతలో.. వైరల్ వీడియో!
ఇంటర్నెట్లో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి వైరల్గా మారింది. ఈ వీడియో కంబోడియాకు చెందినది. ఒక మహిళ తమ ఇంటి పైకప్పు కూలిపోతున్న సమయంలో తన పిల్లవాడిని ఎలా కాపాడిందనేది ఈ వీడియోలో ఉంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను కన్నుతిప్పుకోనీయకుండా చేస్తోంది. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన రాజధాని నోమ్ పెన్హ్లో చోటుచేసుకుంది. వీడియో ఉన్న కంటెంట్ ప్రకారం పిప్సర్ అనే మహిళ ఒక పిల్లవాడిని ఎత్తుకుని కనిపిస్తుంది. గదిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు. ఆ తల్లికి ఏదో శబ్ధం వినిపించగానే ఇద్దరు పిల్లలతో సహా బయటకు పరిగెడుతుంది. అయితే ఇంకో పిల్లాడు అక్కడే నడక చైర్లో ఉంటాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆమె ఆ నడకచైర్లో ఉన్న పిల్లవాడిని కూడా లాక్కుని బయటకు వచ్చేస్తుంది. ఇంతలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోతుంది. ఆ తల్లి నడకచైర్లో ఉన్న పిల్లవాడిని కాపాడటంలో ఒక్క క్షణం జాప్యం చేసినా, ఆ పసిపిల్లవాడు ప్రమాదం బారిన పడేవాడని వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పిల్లవాడిన కాపాడిన ఆ తల్లి ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ఇంటిపై కప్పు మా మీద పడితే మేం చనిపోయేవాళ్లం. అందుకే మేము పరుగుపరుగున వచ్చేశాం అని తెలిపారు. ఇంటి యజమాని మీడియాతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం జరిగినప్పుడు వాటర్ ప్రూఫింగ్ సరిగా జరగలేదని, ఇప్పుడు కుర్తుస్తున్న భారీ వర్షాలకు ఇంటిపైకప్పు కుంగిపోయి, పడిపోయిందని తెలిపారు. నిర్మాణం సరిగా లేకపోవడం వలనే ఇలా జరిగిందన్నారు. అందుకే ఎవరైనా ఇంటిని కొనుగోలు చేసేముందు అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: భారత్, పాక్లను కలిపిన కేంబ్రిడ్జ్ స్నేహం.. గత 31 ఏళ్లుగా.. The #ceiling of a residence in Phnom Penh, #Cambodia, #collapsed in the living room. Luckily, the #mother inside the house acted quickly, picking up one child with one hand and holding a school bicycle having another child with the other. All her children were saved in the end. pic.twitter.com/aK9wXVsTvW — Warm Talking (@Warm_Talking) July 18, 2023 -
బాలాసోర్ రైలు ప్రమాదం: ‘కూతురి మొండితనమే ప్రాణాలు నిలబెట్టింది’
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదాన్ని ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. ప్రమాదంలో కొందరు ఇంటిలోనివారిని కోల్పోగా, మరికొందరు క్షతగాత్రులుగా మిగిలారు. దీనికి భిన్నంగా కొందరు విచిత్ర పరిస్థితుల్లో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అటువంటి కథనం ఒకటి వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే తన 8 ఏళ్ల కుమార్తెతో పాటు ఒక తండ్రి కోరమండల్ ఎక్స్ప్రెస్లో కటక్ వెళ్లేందుకు బయలుదేరారు. వారు కరగ్పూర్లో రైలు ఎక్కారు. వారికి థర్డ్ ఏసీలో సీటు రిజర్వ్ అయ్యింది. అయితే వారికి కిటికీ దగ్గరి సీటు లభ్యం కాలేదు. అయితే కుమార్తె తనకు కిటికీ దగ్గరి సీటు కావాలని మొండిపట్టు పట్టింది. తండ్రి ఎంత నచ్చజెప్పినా ఆ చిన్నారి మాట వినలేదు. దీంతో ఆ తండ్రి టీసీని సంప్రదించి, కిటికీ దగ్గరి సీటు కావాలని రిక్వస్ట్ చేశారు. దీనికి టీసీ సమాధానమిస్తూ మీరు మరో ప్రయాణికుని అడిగి వారి సీటు అడ్జెస్ట్ చేసుకోండని సలహా ఇచ్చారు. దీంతో ఆ తండ్రి మరో కోచ్లోని ఇద్దరు ప్రయాణికులను రిక్వస్ట్ చేయడంతో వారు అందుకు అంగీకరించారు. దీంతో ఆ తండ్రీకుమారులు ఆ రెండు సీట్లలో కూర్చున్నారు. కొద్దిసేపటికి వారు ప్రయాణిస్తున్న రైలు బాలాసోర్ చేరుకున్నంతలోనే ప్రమాదానికి గురయ్యింది. ఆ తండ్రీకూతుర్లు కూర్చున్న కోచ్కు ఈ ప్రమాదంలో ఏమీకాలేదు. అయితే అంతకుమందు వారికి కేటాయించిన సీట్లు కలిగిన బోగీ తునాతునకలైపోయింది. ఆ బోగీలోని చాలామంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బారి నుంచి బయటపడిన ఆ తండ్రి పేరు ఎంకే దేవ్. అయిన మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె మొండితనం వలనే ఈరోజు తాము ప్రాణాలతో బయటపడగలిగామన్నారు. కాగా అతని కుమార్తె చేతికి స్వల్పగాయమయ్యింది. ఆ చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ‘ ట్రైన్ టాయిలెట్లో ఉన్నాను... ఒక్క కుదుపుతో..’ -
ఒడిశా రైలు ప్రమాదం: బోగీలో నుంచి పిల్లలను బయటకు విసిరేసి...
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 270కిపైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మూడు రైళ్లు ఢీకొన్న నేపధ్యంలో కొన్ని సెకెన్ల వ్యవధిలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంటనే తేరుకున్న కొందరు ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటపడ్డారు. ఇదేరీతిలో ఒక మహిళ ఎంతో ధైర్యంతో తన ముగ్గురు పిల్లలను కాపాడుకుంది. రైళ్లు ఢీకొన్న సమయంలో చాలా బోగీలు చెల్లాచెదురైపోయాయి. ఇదేవిధంగా పక్కకు ఒరిగిపోతున్న బోగీలో ఉన్న ఒక మాతృమూర్తి ఎంతో ధైర్యం, సమయస్ఫూర్తితో తన పిల్లల ప్రాణాలను రక్షించింది. రైళ్లు ఢీకొన్న సమయంలో ప్రయాణికుల అరుపులు, కేకలు విన్న సీతాదాస్ అనే 45 ఏళ్ల మహిళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఇద్దరు కుమార్తెలను ఒక కుమారుడిని బోగీలోని కిటికీలో నుంచి బయటకు విసిరివేసింది. ఆ రైలు పట్టాలకు ఒకవైపు పంట పొలాలు ఉన్నాయి. ఆ చిన్నారులను ఆమె ఆ పంటపొలాలలోకి విసిరివేసింది. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రమాదం జరిగిన సమయంలో ఇక తన ప్రాణాలు పోవడం ఖాయమని అనిపించిందని, అందుకే పిల్లలను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నానన్నారు. వెంటనే పిల్లలను కిటికీలో నుంచి బయటకు తోసివేశానని’ తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో సీతతో పాటు ఆమె భర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. విపత్కర సమయంలో అంత్యంత తెలివితేటలతో పిల్లలను కాపాడుకున్న ఆమెను అందరూ అభినందిస్తున్నారు. చదవండి: ‘ ఒక పెద్ద కుదుపు.. అంతా అయిపోయింది’ -
రియల్ హీరో వీడియో వైరల్.. ఊహించని ట్విస్ట్
పరోపకారిగా బతికే మనుషులు.. ఈరోజుల్లో కనిపించడం అరుదైపోయింది. కొందరు తాము చేసింది చిన్నసాయంగానే ఫీలైనప్పటికీ.. అవతలి వాళ్లు మాత్రం దానిని విలువైందిగా భావించొచ్చు. అలా ఓ పసిప్రాణాన్ని కాపాడిన వ్యక్తి అదేమంత పెద్దసాయం కాదని అంటుంటే.. ఊహించని ప్రతిఫలం, అదీ ఎంతోకాలంగా అతను ఎదురుచూస్తుందే దక్కింది ఇప్పుడు.. కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి ఓ పసికందును కాపాడిన వీడియో గత కొన్నిరోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఒక పెద్దావిడ ఓ చిన్నారిని స్ట్రోలర్లో పెట్టుకుని తీసుకెళ్లే యత్నం చేస్తుంది. ఆ టైంలో ఆమె కారులో ఏదో సర్దుతుంటే.. గాలి బలంగా వీయడంతో ఆ స్ట్రోలర్ దానంతట అదే వాహనాలు తిరుగుతున్న రోడ్డు వైపుగా వెళ్తుంటుంది. ఆమె అప్రమత్తమయ్యేలోపు కిందపడిపోగా.. ఓ వ్యక్తి ఆపద్బాంధవుడిలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్నారిని రోడ్డు మీదకు వెళ్లకుండా రక్షించాడు. కట్ చేస్తే.. ఆ వ్యక్తి చేసిన సాహసానికి ఇప్పుడు నజరానా లభించింది. అదేంటో కాదు.. అతనికి ఉద్యోగం!. ఆ ఘటనకు ముందు ఆపిల్బీ అనే రెస్టారెంట్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యాడతను. అది అయిపోయి బయటకు రాగానే.. ఈ ఘటన జరిగింది. అయితే.. ఆ వ్యక్తి సాహసం వైరల్ కావడంతో.. ఆ కంపెనీ వాళ్లు అతన్ని పిలిచి మరీ తమ ఫ్రాంచైజీల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇచ్చారట. దీంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఆ వ్యక్తి పేరు రోన్ నెస్మ్యాన్. సొంతిల్లు లేదు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గత ఎనిమిది నెలల నుంచి దగ్గరి బంధువు ఇంట్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ ఇంటర్వ్యూకు వెళ్లిన అతనికి.. ఆపదలో ఉన్న చిన్నారి కంటపడింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను రక్షించి.. రియల్ హీరోగా అందరితో ప్రశంసలు అందుకున్నాడు. ఆ క్షణం ఆ పెద్దావిడ భయంతో వణికిపోతుంటే.. ఆమెను కౌగిలించుకుని ధైర్యం చెప్పి ఓదర్చాడట ఈ రియల్ హీరో. Another HERO😊 surveillance video captures a homeless man saving a baby in a stroller rolling toward heavy traffic. The baby’s aunt was unloading items on the backseat of her SUV parked outside of the A1 Hand Car Wash, when the stroller started to roll away towards the street.… pic.twitter.com/wihD0EmNFQ — DeL2000 (@DeL2000) May 4, 2023 -
పాల దిగుబడిపై వడ‘దెబ్బ’
నరసాపురం రూరల్: వేసవిలో పాడిపశువుల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో పశువులకు వడదెబ్బ తగిలితే పాల దిగుబడి తగ్గడమే కాక పశువులు ఎదకు వచ్చే పరిస్థితులు కనిపించవని, అంతేకాక పశువు చూడుకట్టే అవకాశం ఉండదని పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై.సుధాకర్ చెబుతున్నారు. వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల్లో సోకే వ్యాధులను ఆయన వివరించారు. వేసవిలో గేదెలు, ఆవులపై సరైన శ్రద్ధ తీసుకోనట్లయితే వడదెబ్బకు గురై ఒక్కొక్కసారి పశువు ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు ఇవే వేసవిలో పశువులు తాగే నీరు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచాలి. వేసవిలో సహజంగానే నీటి వనరులు తగ్గి నిల్వ ఉండే నీరు మురికిగా, ఆకుపచ్చగా మారతాయి. పశువులు ఈ కలుషితమైన నీరు తాగితే వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరి పారుడు వ్యాధులు కలుగుతాయి. కాబట్టి పశువులు తాగేందుకు స్వచ్ఛమైన నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. లేదంటే రోజులో కనీసం మూడుసార్లు నీటిని అందించడం అవసరం, ఆరుబయట తొట్టెల్లో పగలు నిల్వ ఉన్న నీరు వెచ్చగా మారతాయి. నీడ ప్రాంతంలో నిల్వ ఉంచిన చల్లటి నీటినే పశువులకు తాగించాలి. ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువ నీటిని తాగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, పశువు వయస్సు తదితరాలనుబట్టి రోజుకు సుమారుగా 28 లీటర్ల నీరు అవసరమవుతాయి. పాలిచ్చే పశువులు అదనంగా ప్రతి లీటరు పాల దిగుబడికి నాలుగు లీటర్ల చొప్పున నీటిని తాగుతాయి. ఇది కాకుండా పశువులను శుభ్రపరిచేందుకు, షెడ్లలో నేలను శుభ్రపరిచేందుకు ప్రతి పశువుకు 110 లీటర్ల నీరు అవసరం పడుతుంది. వడదెబ్బ తగలకుండా.. పశువులకు వడదెబ్బ తగలకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల పాక చుట్టూ పాత గోనెలు కట్టి వాటిని అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. పైకప్పును కొబ్బరి ఆకులతో గానీ, ఎండి వరిగడ్డితో గాని కప్పాలి. మంచినీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేట్లు చూడాలి. పశువులను ఉదయం, సాయంత్రం మాత్రమే అంటే చల్లని వాతావరణంలోనే మేత మేసేందుకు విప్పాలి. పశువులు ఎక్కువగా ఎండలో తిరగకుండా చూడాలి. వీలైనంత పచ్చని మేతను ఇవ్వాలి. సంకర జాతి ఆవులైతే పంకాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బకు గురైతే లక్షణాలు ఇలా.. వడదెబ్బకు గురైన పశువు లక్షణాలను పరిశీలిస్తే శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల నుంచి 108 డిగ్రీల వరకు పెరుగుతుంది. పశువులు నడిచేటప్పుడు తూలుతాయి. శ్వాసక్రియ ఎక్కువగా ఉంటుంది. పశువు చాలా నీరసంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి కింద పడి కొట్టుకుని స్పృహకోల్పోతాయి. పశువు నీటి కొరకు చూస్తుంటుంది. పశువు చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది. పశువులో పాల ఉత్పత్తి కొల్పోతుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ తగిలిందని రైతు గ్రహించాలి. చేయాల్సిన చికిత్స ఇదే వడదెబ్బ తగిలిన పశువును రైతులు గుర్తించిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. గుడ్డతో ఐస్ చుట్టి పశువు నుదుటిపై నొత్తాలి. కొద్ది ఊరట కలిగిన తరువాత దగ్గరలోని పశు వైద్యుడిని సంప్రదించి సైలెన్లు పెట్టాలి. ఒక్క సారి వడదెబ్బ తగిలిన పశువుకు బతికినంత కా లం పాలదిగుబడి గతంలో మాదిరిగా ఉండదు. జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ వై సుధాకర్, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు -
షాకింగ్ ఘటన.. స్నేహితుడి భార్యను కాపాడబోయి..
నిడదవోలు రూరల్(తూర్పుగోదావరి జిల్లా): క్షణికావేశంలో కాలువలోకి దూకిన స్నేహితుడి భార్యను కాపాడబోయి ప్రమాదవశాత్తూ యువకుడు మృతిచెందినట్లు పట్టణ ఎస్సై పి.నాగరాజు గురువారం తెలిపారు. నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కాపకాయల నరేంద్రకుమార్ (31) గతంలో ఒక ప్రైవేట్ సెల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తున్నాడు. నరేంద్రకుమార్ స్నేహితుడు కొవ్వూరుకు చెందిన జావిద్ బాషా(చోటు)కు అతని భార్య దేవికి మనస్పర్థలు వచ్చాయి. దీంతో నరేంద్రకుమార్ భార్యాభర్తలను ఈ నెల 14వ తేదీన శెట్టిపేట తీసుకువచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా గొడవలు పెరగడంతో భార్య దేవి.. శెట్టిపేట పవర్ప్లాంట్ వద్ద బుధవారం తెల్లవారుజామున వంతెనపై నుంచి కాలువలోకి దూకేసింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో కాలువలోకి దిగిన నరేంద్రకుమార్ ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా నరేంద్రకుమార్ మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి నాగతులసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: వివాహితతో సహజీవనం.. అసలు విషయం తెలిసి షాకయిన మహిళ -
నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం
మద్యం సేవించే అధికారికంటే రిక్షా తొక్కేవాడిని, కూలీలను పెళ్లిచేసుకోవడం సముచితమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు తమ కుమార్తెలు, సోదరీమణులకు మద్యపానం చేసేవారితో అస్సలు వివాహం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఉత్తరప్రదేశ్లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యపానం డి అడిక్షన్పై జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ...తాను ఎంపీగా తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయినప్పుడూ..సామాన్య ప్రజలను ఎలా కాపాడగలనంటూ భావోద్వేగానికి గురయ్యారు. "తన కొడుకు ఆకాష్ తన స్నేహితులతో మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. మానిపించేందుకు డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాం. ఆ అలవాటు మానుకుంటాడని పెళ్లి కూడా చేశాను కానీ అతను పెళ్లైన తర్వాత కూడా తాగడం ప్రారంభించాడు. క్రమంగా అది అతని మరణానికి దారితీసింది. దీంతో అతడి భార్య వితంతువుగా మారింది. పైగా వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు." అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అందువల్ల దయచేసి మీరు మీ కుమార్తెలను, సోదరీమణులను ఇలాంటి వ్యసనపరులకు కట్టబెట్టకుండా రక్షించండి. ఈ తాగుడు వ్యసనం కారణంగా ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎంపీ కూడా 80 శాతం క్యాన్సర్ మరణాలకు కేవలం పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనమే కారణమని అన్నారు. ఈ డీ అడిక్షన్ కార్యక్రమంలో ప్రజలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని కుటుంబాలను రక్షించుకోవాలని ఆయన కోరారు. అలాగే జిల్లాను వ్యసన రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్ను అన్ని పాఠశాలలకు తీసుకువెళ్లాలని, పైగా ఉదయం ప్రార్థన సమయంలో పిల్లలకు దీని గురించి చెప్పాలని కేంద్ర మంత్రి కౌశల్ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
ఏపీలో పొగాకు రైతులను ఆదుకోండి : ఎంపీ మాగుంట
-
మాజీ సీఎం కాన్వాయ్ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కాన్వాయ్ని ఒక ఏనుగు అడ్డుకుంది. ఆయన కారులో వస్తుండగా అకస్మాత్తుగా అడవి నుంచి ఒక ఏనుగు రోడ్డుపైకి వచ్చి మాజీ సీఎం వాహనాన్ని అడ్డుకుంది. ఈ హఠాత్పరిణామానికి మంత్రి కారు దిగి ప్రాణాల కోసం పరుగెత్తవలసి వచ్చింది. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్-దుగడ్డ హైవే మీదుగా కోత్ద్వార్కి వస్తుండగా చోటుచేసుకుంది. తొలుత మాజీ సీఎం ఏనుగు వెళ్లిపోతుందనుకుని కారులోనే కూర్చుని ఉన్నారు. కానీ ఆ ఏనుగు అనుహ్యంగా మంత్రి కారువైపు వస్తుండటంతో మంత్రితో సహా ఆయన తోపాటు ఉన్న జనాలు కూడా భయంతో కారుదిగి పక్కనే ఉన్న కొండల వద్దకు పరుగులు తీశారు. పాపం సీఎం చివరకు కొండ ఎక్కి ప్రాణాలను ఎలాగోలా రక్షంచుకున్నారు. దాదాపు అరగంటపాటు మాజీ సీఎం కాన్వాయ్ అక్కడే ఉండాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది గాలిలో కాల్పులు జరిపి ఏనుగును ఎలాగోలా తరిమికొట్టారు. శివాలిక్ ఎలిఫెంట్ కారిడార్ ప్రాంతం కొట్ద్వార్-దుగడ్డ మధ్య ఉండడంతో హైవేపై ఏనుగులు తరచూ వస్తుంటాయని దుగడ్డ రేంజ్ ఆఫీసర్ ప్రదీప్ డోబ్రియాల్ తెలిపారు. ఇలాంటి ఘటనలు అక్కడ సర్వసాధరణమేనని చెప్పారు. (చదవండి: బిహార్లో మద్యం నిషేధం విఫలం: ప్రశాంత్) -
ఎమర్జెన్సీకి ఫోన్ చేసి తల్లిని కాపాడిన 4ఏళ్ల బుడతడు
నాలుగేళ్ల చిన్నారి ఎమర్జెన్సీ నెంబర్కి కాల్చేసి మరీ తన తల్లిని కాపాడుకున్నాడు. అసలేం జరిగిందంటే...తస్మానియాకి చెందిన నాలుగేళ్ల బాలుడు రెండు రోజుల క్రితమే అంబులెన్స్కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ని ఎలా డయల్ చేయాలో నేర్చుకున్నాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఆమె తల్లి మూర్చతో కింద పడిపోయింది. దీంతో సదరు బాలుడు ఆ ఎమర్జెన్సీ నెంబర్ '000కి' కాల్ చేసి అమ్మ కింద పడిపోయిందని చెప్పాడు. వెంటనే పారామెడికల్స్ వచ్చి ఆ బాలుడి తల్లికి సకాలంలో వైద్యం అందించి ఆమెను రక్షించారు. అంతేకాదు సదరు అంబులెన్స్ పారామెడికల్ అధికారులు ఆ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక సర్టిఫికేట్ని కూడా ప్రధానం చేశారు. ఆ బాలుడి తల్లి ఒక నర్సు ఆమె ఫోన్ అన్లాక్లో ఉంటే ఎలా ఓపెన్ చేయాలో, ఎమర్జెన్సీ నెంబర్కి ఎలా కాల్ చేయాలో నేర్పించినట్లు తెలిపారు. అదే ఈ రోజు తన జీవితాన్ని కాపాడుతుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తన కొడుకు ఒక చిన్న హిరో అయిపోయాడంటూ మురిసిపోయారు. ఈ ఘటనతో ఆ బాలుడు వార్తల్లో నిలిచాడు. అంతేకాదు ఈ విషయం సోషల్ మాధ్యమాలో కూడా తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ పిల్లవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ...చిన్న ఛాంపియన్ అని ప్రశంసిస్తున్నారు. (చదవండి: వైట్ హౌస్లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు) -
తల్లి ప్రేమ అంటే ఇదే కదా.. ప్రాణాలు తెగించి.. పులితో పోరాడి..
భోపాల్: పులితో ప్రాణాలకు తెగించి పోరాడి కన్నకొడుకుని కాపాడుకుంది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలోని జబల్పూర్లో చోటు చేసుకుంది. ఒక పులి రోహనియా గ్రామంలో టైగర్రిజర్వ్ వెలుపల తిరుగుతుందని సమాచారం. కానీ ఆ విషయం సదరు మహిళకు తెలియదు. ఆమె తన ఏడాది వయసున్న కొడుకుని తీసుకుని పొలానికి వెళ్లింది. పొలంలోని పొదలమాటున దాగి ఉంది పులి. సదరు మహిళ పొలం పనులు చేస్తుండగా..ఒక్కసారిగా మాటేసిన పులి సదరు బాలుడిపై హఠాత్తుగా దాడి చేసింది. దీంతో ఆమె తన చేతిలో ఏ ఆయుధం లేకపోయినా.. ఆ పులితో ప్రాణాలకు తెగించి పోరాడింది. పులిచేసే ప్రతి దాడిని ఎదుర్కొంటూ...మరోవైపు అరుస్తూ చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో గ్రామస్తులంతా వచ్చి ఆ పులిని తరిమికొట్టారు. ఈ ఘటనలో ఆ బాలుడికి తలకు తీవ్రగాయలవ్వగా, తల్లి శరీరమంతా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ తల్లికొడుకు లిద్దరు జబల్పూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారిద్దరు క్షేమంగానే ఉన్నారని టైగర్ రిజర్వ్ మేనేజర్ భారతి తెలిపారు. -
భయానక వీడియో: కాలనాగు నుంచి బిడ్డను కాపాడుకుంది
వైరల్: కర్ణాటక మాండ్య నుంచి భయానక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఓ తల్లి సమయస్ఫూర్తితో భారీ విష సర్పం కాటు నుంచి బిడ్డను రక్షించుకుంది. రెప్పపాటులో ఆ బిడ్డకు ఘోర ప్రమాదమే తప్పింది. ఆ తల్లీబిడ్డలు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వస్తున్న టైంలో ఈ ఘటన జరిగి ఉంటుందని స్పష్టం అవుతోంది. ఇంటి బయట మెట్ల కింద నుంచి పాము వెళ్తోంది. ఆ సమయంలో పామును గమనించకుండా ఆ చిన్నారి కిందకు కాలు వేయబోయాడు. అంతలో.. ఆ తల్లి చూపించిన తెగువ, సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు. ఎంతైనా అమ్మ కదా! View this post on Instagram A post shared by India Today (@indiatoday) -
స్నేహితుడిని కాపాడబోయి మృత్యువాత
మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరు జలపాతంలో గురువారం పలవెల హసన్ ప్రీతమ్(21) మునిగిపోయి మృతి చెందాడు. అప్పటి వరకు స్నేహితులతో ఆనందంగా గడిపిన హసన్కు పొల్లూరు జలపాతం యమపాశమైంది. మృతుడు హసన్ ప్రీతమ్ కాకినాడ కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ డిపార్టెమెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి గురువారం ఉదయం 4 గంటలకు రెండు మోటార్బైక్లపై బయలుదేరి 11 గంటలకు పొల్లూరు జలపాతం వద్దకు చేరుకున్నారు. స్నానం చేసేందుకు హసన్ప్రీతమ్, మరో స్నేహితుడు ద్విగిజయ్ అబురుక్లు జలపాతంలోకి దిగారు. స్నానం చేస్తుండగా ద్విగిజయ్ నీటిలో మునిగిపోవడంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో హసన్ ప్రీతమ్ నీటిలో మునిగిపోయి చనిపోయాడు. సంఘటన జరిగిన వెంటనే ఎస్ఐ వి.సత్తిబాబు తమ సిబ్బందితో అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. గత ఏడాదే ఉద్యోగం వచ్చింది పలవెల హసన్ ప్రీతమ్ తల్లిదండ్రులు చనిపోయారు. సొంత గ్రామం మండపేట. తల్లి పద్మ మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తూ 2020 సంవత్సరంలో చనిపోయారు. దీంతో కుమారుడు హసన్కు 2021 సంవత్సరంలో కాకినాడ కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. మృతుడికి ఒక సోదరి ఉంది. ఆమె ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నంలో డిగ్రీ చదువుతున్నారు. బంధువులు పొల్లూరు బయలు దేరారు. ఒంటరైన సోదరి కాకినాడ : కన్నతల్లి అనారోగ్యంతో మృత్యువాతపడింది. కొద్ది నెలలకే తండ్రి అనారోగ్యంతో చనిపోయారు. తనే అమ్మా నాన్నలా తోడుగా నిలిచిన అన్నయ్యను కూడా మరణం వెంటాడింది. ఇలా మూడేళ్ళ వ్యవధిలో ఒకరి వెంట ఒకరుగా కుటుంబ సభ్యులంతా చనిపోవడంతో ఇప్పుడామె ఒంటరి అయ్యింది. ఆమె దయనీయ స్థితిని చూసిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చింతూరు మండలం పొల్లూరు జలపాతంలో పడి పలివెల హసన్ప్రీతమ్ మరణించాడన్న సమాచారంతో ఇక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే...కాకినాడ నగర పాలకసంస్థ అసిస్టెంట్ ఇంజినీ ర్గా పనిచేస్తున్న పద్మశ్రీ రెండున్నరేళ్ళ క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆమె మరణించిన మరికొద్ది నెలలకే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తండ్రి వెంకటేశ్వరరావును కూడా మృత్యువు వెంటాడి తీసుకుపోయింది. తల్లి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వీరి కుమారుడు హసన్ప్రీతమ్కు కారుణ్య నియామకం ద్వారా కాకినాడ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ ధైర్యాన్ని కూడగట్టుకుని చెల్లెలు హర్షితను చదివిస్తూ తనే అమ్మా, నాన్నగా, అన్నగా తోడుండి బాసటగా నిలిచాడు. అన్న ప్రోత్సాహంతో కొద్ది రోజుల క్రితమే హర్షిత విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో బీటెక్లో చేరింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబాన్ని మరోసారి విధి వెంటాడింది. అవివాహితుడైన అన్న హసన్ ప్రతీమ్ గురువారం రంపచోడవరం ఏజన్సీ పొల్లూరు జలపాతంలో గల్లంతై మృత్యువాత పడ్డాడన్న సమాచారం బయటపడింది. దీంతో హర్షిత పరిస్థితిని తలుచుకుని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..!) -
ప్రాణం నిలిపిన డెలివరీ బాయ్.. సర్వత్రా హర్షం
డెలివరీ బాయ్ల జీవితాల గురించి తెలియంది కాదు. కరోనాలాంటి కష్టకాలంలోనూ పొట్టకూటి కోసం రిస్క్ చేస్తున్న వాళ్లు కోకోల్లలు. అయితే డెలివరీ బాయ్ల విషయంలో కొంత మందికి చిన్నచూపు ఉంటుంది. అలాంటి వాళ్ల కళ్లు తెరిపించే ఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముంబై(మహారాష్ట్ర)లో రిటైర్డ్ కల్నల్ మోహన్ మాలిక్ కుటుంబం నివసిస్తోంది. కిందటి నెల (డిసెంబర్ 25న) హఠాత్తుగా ఆ పెద్దాయన తీవ్ర అస్వస్థలకు లోనయ్యారు. వెంటనే ఆయన కొడుకు ఆస్పత్రికి తీసుకుని బయలుదేరాడు. దారిలో భారీ ట్రాఫిక్. ఇంచు కూడా కదల్లేని స్థితి. దీంతో టూవీలర్ మీద త్వరగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో కారు దిగి సాయం కోసం మాలిక్ కొడుకు అందరినీ బతిమాలాడు. కానీ, ఎవరూ సాయానికి ముందుకు రాలేదు. ఆ టైంలో డెలివరీలతో అటుగా వెళ్తున్నాడు ఒక స్విగ్గీ డెలివరీ బాయ్. మాలిక్ కొడుకు పడుతున్న కష్టం చూసి చలించి.. వెంటనే ఆ పెద్దాయన తన బైక్ మీద కూర్చోబెట్టుకుని ముగ్గురూ ఆస్పత్రికి బయలుదేరాడు. అడ్డుగా వాహనాలను గట్టిగా అరుస్తూ పక్కకు తప్పుకునేలా చేసి మరీ వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకున్నాడు ఆ డెలివరీ బాయ్. అలా సకాలంలో ఆస్పత్రికి చేరడంతో మోహన్ మాలిక్ ప్రాణం నిలిచింది. అయితే ఆస్పత్రికి చేరిన వెంటనే.. ఆ డెలివరీ బాయ్ అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇన్నాళ్లూ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసి కోలుకున్న ఆ పెద్దాయన.. ఈ మధ్యే డిశ్చార్జి అయ్యారు. స్విగ్గీ ప్రతినిధులను సంప్రదించి.. ఎలాగోలా ఆ డెలివరీ బాయ్ జాడ కనుక్కోగలిగాడు. ఆ డెలివరీ బాయ్ పేరు మృణాల్ కిర్దత్. తన ప్రాణం కాపాడిన ఆ యువకుడిని.. రియల్ సేవియర్గా కొనియాడుతున్నాడు ఆ పెద్దాయన. సకాలంలో స్పందించిన ఆ డెలివరీ బాయ్ పనికి సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అతనికి ఏదైనా సాయం అందించాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు దిస్ రియల్ హీరో. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) -
తాతా నీళ్లు తాగు.. గంగిరెద్దు ఇదిగో అరటిపండు! సల్లగుండు బిడ్డా
సోషల్మీడియాలో ఈమధ్య ఎందుకు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. కానీ, కొన్ని వీడియోలు మాత్రం మనసును హత్తుకునేలా ఉంటున్నాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లుగా, ఫేస్బుక్లోనూ వైరల్గా మారింది. గంగిరెద్దును ఆడించే ఓ పెద్దాయన స్పృహ కోల్పోతే.. ఓ చిన్నారి అతనికి చేసిన ఉడతా సాయం పలువురి చేత ప్రశంసలు కురిపిస్తోంది. ఓ తాత గంగిరెద్దును ఆడిస్తూ భిక్షాటన చేస్తూ ఓ గేట్ ముందుకు చేరగా.. ఆ ఇంటి మహిళ ఆయన్ని ఈసడించుకుంది. ఆ పక్కనే మరో ఇంటి ముందుకు వెళ్లగా.. హఠాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడ్డాడు ఆ పెద్దాయన. దీంతో గంగిరెద్దు ఆ బసవన్నను లేపే ప్రయత్నం చేసింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అదేం పట్టన్నట్లు ముందుకు సాగిపోగా.. ఆ పక్కనే వెళ్తున్న ఇద్దరు చిన్నారులు మాత్రం అది గమనించారు. అందులో బ్యాగ్ వేసుకున్న ఓ చిన్నారి ఆ గంగిరెద్దు తాతకు దగ్గరగా వెళ్లింది. బసవన్నకు భయపడుతూనే ఆ తాతను లేపే ప్రయత్నం చేసింది. ఆపై తన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ను తాతకు అందించి.. ఆపై ఎద్దుకు అరటి పండు అందించింది. చివరికి పైకి లేచిన తాత ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు చెప్తున్న వీడియోను చూసి పలువురు ఆ చిన్నారిని ‘చిన్నవయసు-పెద్దమనసు’ అంటూ పొగుడుతున్నారు. ఇది ఎప్పటి వీడియో?.. ఏదైనా షార్ట్ఫిల్మ్లో భాగమా? అనే విషయంపై స్పష్టత లేదు. కానీ, కంటికి ఇంపుగా ఉండడంతో వైరల్ అవుతోంది. -
దేవుడే వారి రూపంలో వచ్చి.. నిండు ప్రాణం నిలబెట్టారు
కడప : కొన్ని క్షణాలు ఆలస్యమైతే ఒక నిండు ప్రాణం పోయేది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. మెరుపులా వచ్చారు ఇద్దరు పోలీసులు.. ఇంటి తలుపులు పగలకొట్టి ఉరికి వేలాడుతున్న వ్యక్తిని కాపాడారు. నిజంగా దేవుడే పోలీసుల రూపంలో వచ్చాడేమో అనేలా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని చౌటపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న అతను ఉరేసుకునేందుకు ఫ్యాన్కు చీర చుడుతున్నాడు. కిటికిలో నుంచి కుమారుడ్ని గమనించిన తల్లి చెన్నమ్మ గట్టిగా కేకలు వేసింది. ఆత్మహత్య చేసుకోవద్దని, బయటికి రమ్మంటూ ఆమె రోదించసాగింది. ఈ క్రమంలోనే ఆమె కమాండ్ కంట్రోల్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. బ్లూకోల్ట్స్–7కు చెందిన పోలీసులు రామాంజనేయులు, నరసింహనాయుడు హుటా హుటిన చౌటపల్లెలోని ఎస్సీ కాలనీకి వెళ్లారు. స్థానికుల సాయంతో వెంటనే ఇంటి తలుపు పగులకొట్టారు. అప్పటికే ఉరికి వేలాడుతున్న సుబ్బరాయుడును పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడారు. తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేయడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను ఇన్చార్జి డీఎస్పీ చెంచుబాబు, రూరల్ ఎస్ఐ శివశంకర్ అభినందించారు. సుబ్బరాయుడు తల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. క్షణాల్లో స్పందించి సుబ్బరాయుడిని కాపాడిన బ్లూకోల్ట్స్ పోలీసులు రామాంజనేయులు, నరసింహనాయుడును జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. -
కేబీఆర్ పార్కు: ప్లీజ్ ఇక్కడ నేనున్నానని అందరికీ చెప్పరూ!
ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అవతలి వారికి ఆ విషయం తెలియజేసేందుకు పూర్వకాలంలో గ్రామాలు, ఇతర చారిత్రక ప్రాంతాల్లో ధర్మ గంటలు ఏర్పాటు చేసేవారు. సమస్య ఉన్న వారు ఇక్కడికి వచ్చి ధర్మ గంటను మోగిస్తే సంబంధిత అధికారులు లేదా గ్రామ పెద్దలు అక్కడికి వచ్చి వారి సమస్యను విని పరిష్కరించేవారు. సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద ‘సేవ్ అవర్ సోల్’ (ఎస్వోఎస్) టవర్ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్కు ప్రధాన గేటు ముందు ఏర్పాటు చేసిన ఈ స్తంభానికి పైన ఒక కెమెరా ఏర్పాటు చేశారు. మధ్యలో ఒక బటన్ ఏర్పాటు చేసి అది నొక్కి మాట్లాడితే సంబంధిత కమాండ్ కంట్రోల్లో వారు చెప్పేది వినడమే కాకుండా వారు ఎవరో చూసేందుకు కూడా కెమెరాలు బిగించారు. చదవండి: సినిమా కథను తలపించే లవ్స్టోరీ.. ప్రియుడి కోసం భారత్కు.. అతడి మరణంతో... ► ఈ ఎస్వోఎస్ స్తంభం ఏర్పాటు చేసిన ఏడాదిన్నర తర్వాత ఇటీవలే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ► అయితే ఇక్కడొక ధర్మగంట ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ► వారం క్రితం ఇదే కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్వేలో సినీ నటి షాలూ చౌరాసియాపై, ఈ నెల 2వ తేదీన ఫిలింనగర్కు చెందిన ఓ యువతిపై, జనవరి 22వ తేదీన ఓ వైద్యురాలిపై ఆగంతకుడు దాడి చేశాడు. ఆ సమయంలో ఇలాంటి ధర్మగంట ఆ ప్రాంతంలో అందుబాటులో ఉండి ఉంటే వీరు క్షణాల్లో తమ సమస్యను చెప్పుకొని పోలీసుల దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లే ఆస్కారం ఉండేది. ► ఈ ఎస్వోఎస్ స్తంభం గురించి చాలా మందికి తెలియదు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కూడా ఈ ఎస్వోఎస్కు సంబంధించి కనెక్షన్ కూడా బిగించారు. ► ఎవరైనా తమ సమస్యను చెప్పుకోగానే క్షణాల్లో సమీపంలోని పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై బాధితులకు న్యాయంచేసే విధంగా ఏర్పాట్లు చేశారు. చదవండి: టీఎస్ఆర్టీసీపై కిన్నెరసాని మొగులయ్య పాట.. ► తీరా లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ఎస్వోఎస్ స్తంభం ఎవరికీ తెలియని దుస్థితిలో ఉండిపోయింది. ► కనీసం ఆ స్తంభం విషయంలో అవగాహన కల్పించాలనే ఆలోచన కూడా సంబంధిత అధికారులకు లేకుండా పోయింది. పలుమార్లు ఈ ఎస్వోఎస్ స్తంభంపై అవగాహన కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ► కేబీఆర్ పార్కుతో పాటు పీవీఎన్ఆర్మార్గ్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ► బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద, జూబ్లీహిల్స్ రోడ్ నం. 92 సీవీఆర్ న్యూస్ వద్ద, స్టార్ బక్స్ హోటల్ వద్ద, కళింగ కల్చరల్ ట్రస్ట్ అగ్రసేన్ చౌరస్తాలో, బాలకృష్ణ ఇంటి ముందు వీటిని ఏర్పాటు చేయడం ద్వారా వాకర్లకు, సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీరు పేర్కొంటున్నారు. -
ముప్పును తగ్గించే కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష!
తినే ఉప్పు.. శాస్త్రీయ నామం సోడియం క్లోరైడ్ ఎక్కువైతే ముందు రక్తపోటు.. జాగ్రత్తలేవీ తీసుకోకపోతే.. కొంత కాలం తరువాత గుండెజబ్బులు, గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అనేక శాస్త్ర పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి ఈ విషయాన్ని. కానీ మనకే కాదు.. ప్రపంచం మొత్తమ్మీద ఉప్పులేని వంటకం తినడం దాదాపు ఎవరికీ ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? ఉప్పులో సోడియం క్లోరైడ్ తగ్గించి.. పొటాషియం క్లోరైడ్ పెంచితే సరి అంటున్నారు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా, చైనాలతోపాటు భారత్లోనూ కేంద్రాలున్న ఈ స్వతంత్ర వైద్య పరిశోధన సంస్థ ఇటీవలే ఒక భారీస్థాయి అధ్యయనం ఒకదాన్ని నిర్వహించింది. ఉప్పులో సాపేక్షంగా పొటాషియం క్లోరైడ్ను ఎక్కువ చేసి ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలేవీ ఉండవని నిర్ధారించింది. అంతేకాదు.. ఈ కొత్త రకం ఉప్పును తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు, అకాల మరణం వంటివి కొంతమేరకు తగ్గుతాయని కూడా ఈ పరిశోధన చెబుతోంది. -సాక్షి, హైదరాబాద్ ప్రాణాలకు రక్ష! కొత్త రకం ఉప్పును అందరూ వాడటం మొదలుపెడితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బ్రూస్ నీల్ చెబుతున్నారు. అవసరానికి మించి ఉప్పు తినడం ఇప్పుడు అన్నిచోట్ల ఎక్కువ అవుతోందని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రత్యామ్నాయాల (సైంధవ లవణం వంటివి)ను ఉపయోగించడం ఖరీదైన వ్యవహారం అవుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సోడియం క్లోరైడ్ తక్కువగా, పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా ఉన్న ఉప్పును తయారు చేసి, పంపిణీ చేయడంతోపాటు, వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించడం ఎంతైనా అవసరమని, పైగా ఈ కొత్త రకం ఉప్పు ఖరీదు తక్కువేనని వివరించారు. తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిని మినహాయించి మిగిలిన వాళ్లు ఎవరైనా ఈ కొత్తరకం ఉప్పును వాడవచ్చునని చెప్పారు. ఇదీ పరిశోధన... ప్రత్యామ్నాయ ఉప్పు ప్రభావాన్ని, సమర్థతను అంచనా వేసేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ చైనాలో దాదాపు 21 వేల మందిపై పరిశోధన నిర్వహించింది, గుండెపోటు లేదా అదుపులో లేనంత ఎక్కువ రక్తపోటు ఉన్న వారిని దాదాపు 600 గ్రామాల నుంచి ఎంపిక చేసింది. 2014 ఏప్రిల్లో మొదలుపెట్టి 2015 జనవరి వరకూ అంటే దాదాపు తొమ్మిది నెలలపాటు వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ ఉప్పు మరికొందరికి సాధారణ ఉప్పు అందించింది. ఒక్కో వ్యక్తికి రోజుకు 20 గ్రాముల చొప్పున ఈ ప్రత్యామ్నాయ ఉప్పును అందించి వంట, నిల్వ (ఊరగాయ లాంటివి)లకు వాడేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ తరువాత అంటే 2015 నుంచి ఐదేళ్లపాటు ఈ గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ వచ్చింది. ఐదేళ్ల కాలంలో మూడు వేల మంది గుండెపోటుకు గురయ్యారు. అయితే ప్రత్యామ్నాయ ఉప్పును తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 14 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తేలింది. గుండెకు సంబంధించిన సమస్యల విషయానికి వస్తే 13 శాతం తగ్గుదల నమోదు కాగా... అకాల మృత్యువు బారిన పడే అవకాశం 12 శాతం వరకూ తగ్గింది. చదవండి: హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు సిద్దిపేటలోనూ పరిశోధన ప్రత్యామ్నాయ ఉప్పును వాడటం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుందనేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ భారత్లో జరిపిన ఒక పరిశోధన తార్కాణంగా నిలుస్తోంది. సుమారు ఆరు నెలల క్రితం వెలువడ్డ ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. ప్రత్యామ్నాయ ఉప్పు వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గింది. తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతంలో తాము 502 మందిపై ఈ పరిశోధన నిర్వహించామని వీరిలో కొంతమందికి 70 శాతం సోడియం క్లోరైడ్, 30 శాతం పొటాషియం క్లోరైడ్ల మిశ్రమమైన ప్రత్యామ్నాయ ఉప్పును, మరికొందరికి వంద శాతం సోడియం క్లోరైడ్ ఇచ్చామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సుధీర్ రాజ్ థౌట్ తెలిపారు. చదవండి : మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’ మూడు నెలల తరువాత పరిశీలించినప్పుడు ప్రత్యామ్నాయ ఉప్పును వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 4.6 యూనిట్లు తగ్గిపోగా, డయాస్టోలిక్ బ్లడ్ప్రెషర్లో, మూత్రంలో ఉప్పు అవశేషాల విషయంలోనూ సానుకూల మార్పులు కనిపించాయని వివరించారు. ఈ ఫలితాలు రక్తపోటు నివారణకు ఉపయోగించే మాత్రల ప్రభావంతో పోల్చదగ్గదిగా ఉందన్నారు. చదవండి : జొమాటోకు మరో ఎదురుదెబ్బ, నెటిజనుల మండిపాటు -
Afghanistan: మమ్మల్ని రక్షించండి - తెలంగాణ వలస కార్మికుల వేడుకోలు
మోర్తాడ్ (బాల్కొండ): అఫ్గానిస్తాన్లో ప్రస్తుత దయనీయ పరిస్థితు లకు వీరిద్దరి గాథలు అద్దం పడుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని అఫ్గాన్కు వెళ్లిన తెలంగాణ వాసుల దయనీయ స్థితి. కొందరు అక్కడి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోగా మరికొందరు అక్కడే చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపు తున్నారు. అఫ్గాన్లోని మన విదే శాంగ కార్యాలయాన్ని ఉద్యోగులు ఖాళీ చేసినా అక్కడ చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎంత? వారి స్థితి గతులేంటో ఇప్పటికీ తెలియట్లేదు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం, నాటో సేనలు ఖాళీ చేస్తుండటం.. అంతలోనే తాలిబన్లు అఫ్గాన్ను తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో వలస కార్మికుల్లో ఉపాధి కల చెదిరిపోయింది. ఫలితంగా తమ వీసాలకు గడువు ఉన్నా అఫ్గాన్ను వీడాల్సి వస్తుందని వలస కార్మికులు వాపోతున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లిపోవడానికి గడువు సమీపించింది. కాగా అమెరికన్ సైన్యంకు సేవలు అందించే ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని గుర్తించిన కొందరు తెలంగాణ యువకులు అఫ్గాన్లోనే ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో సైన్యం ఉపసంహరణ జరిగినా రాయబార కార్యాలయాలల్లో విధులు నిర్వహిస్తే తమ ఉద్యోగానికి ఢోకా ఉండదని వలస కార్మికులు భావించారు. ఈ క్రమంలో ఏజెన్సీల మెప్పు పొంది అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతలోనే అంతా అయిపోయింది.. కానీ అంతలోనే తాలిబన్లు అఫ్గానిస్తాన్ మొత్తాన్ని వశం చేసుకోవడంతో అమెరికా సహా అన్ని దేశాల రాయబార కార్యాలయాలను ఖాళీ చేశాయి. ఈ క్రమంలో రాయబార కార్యాలయాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అమెరికా ఎంబసీకి అనుబంధంగా పని చేసే కార్మికులను నాలుగు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి రావడానికి సెలవులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు సెలవులపై ఇంటికి రాగా అఫ్గాన్లో మారిన పరిస్థితులతో మళ్లీ అక్కడకు వెళ్లలేకపోతున్నారు. కాబుల్లో చిక్కుకుపోయాను నేను అఫ్గానిస్తాన్లోని అమెరికన్ మిలటరీ క్యాంపులో సహాయ కుడిగా పనిచేస్తాను. కాబూల్ పట్టణం కసబ్ అనే ప్రాంతంలో చిక్కుకున్నాను. రెండు మూడు రోజుల కింద తాలిబన్లు కాల్పుల మోత మోగిం చారు. బిక్కుబిక్కుమంటూ క్యాంపు గదిలోనే దాక్కున్నాం. సెల్ఫోన్లు వినియోగించ డానికి అనుమతి లేదు. రహస్యంగానే వాడుతున్నాం. తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో తెలియట్లేదు. నాతో పాటు చాలామంది ఇక్కడ చిక్కుకున్నారు. - బొమ్మన రాజన్న( మంచి ర్యాల) ఎటుపోవాలో తెలియడం లేదు నేను అఫ్గానిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయంలో పని చేస్తున్నాను. నాకు ఇక్కడ పని చేయడానికి వీసా గడువు ఇంకా ఉంది. కానీ తాలిబన్ల కారణంగా అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ చేశారు. నాతో పాటు ఇక్కడ ఉపాధి పొందుతున్న విదేశీయులను రెండు రోజుల కింద ఖతర్కు తరలించారు. మమ్మల్ని ఇక్కడే ఉంచుతారో లేక ఇంటికి పంపుతారో తెలియట్లేదు. - బొమ్మెన మహేందర్ (మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా) అమెరికా బాధ్యత తీసుకోవాలి- స్వదేశ్ పరికిపండ్ల (ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు) అఫ్గాన్లో 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం, నాటో దళాలకు సేవలు అందించిన తెలంగాణ వలస కార్మికులను అమెరికా ప్రభుత్వం చేరదీయాలనే డిమాండ్ వస్తోంది. అఫ్గాన్ పౌరులతోపాటు తెలంగాణ వలస కార్మికులకు కూడా అమెరికా తమ దేశ వీసాలను జారీ చేసి ఉపాధి కల్పించాలి. -
వైరల్ వీడియో: రియల్ హీరోస్.. అగ్నిప్రమాదం నుంచి ముగ్గురు చిన్న పిల్లలని..
-
ఇంట్లో ఒంటరిగా ముగ్గురు పిల్లలు; నిజమైన హీరోలు మీరే!
మాస్కో: సాధారణంగా మనం.. ఒక్కోసారి.. అనుకోని సంఘటనలు.. విపత్కర పరిస్థితులు చూస్తుంటాం. ఈ క్రమంలో, కొంత మంది స్పందిస్తే.. మరికొంత మంది మనకెందుకులే అనుకుని పట్టించుకోరు. ఇది మా పనికాదనో.. మాకేందుకు రిస్క్లే అనుకుని కనీసం ప్రయత్నం కూడా చేయరు. మరికొంత మంది మాత్రం.. తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి సాటివారిని కాపాడుతుంటారు. రష్యాలో ఇటీవల జరిగిన సంఘటన కూడా ఈ కోవకు చెందినదే. ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కొంత మంది పిల్లలు దాంట్లో చిక్కుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన కొంతమంది వెంటనే స్పందించి ఆ పిల్లలను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేవరకు వేచి చూడకుండా వారు తక్షణం స్పందించడంతో పిల్లలంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సాహసీకులు పిల్లలను కాపాడిన తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. వివరాలు.. రష్యాలోని కోస్ట్రోమా నగరంలో ఉన్న మూడంతస్తుల అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో మంటలు అపార్ట్మెంట్ చుట్టు వ్యాపించాయి. ప్రమాదం జరిగినప్పుడు అపార్ట్మెంట్లోని ఒక ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలు మాత్రమే ఉన్నారని తెలిసింది. దీంతో, ఇంటి పక్కన ఉన్న కొంత మంది యువకులు, ఆ పిల్లలను ఎలాగైన కాపాడాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో, ఆ ఇంటి ప్రవేశ ద్వారాన్ని పగుల గొట్టాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం సఫలం కాలేదు. మంటలు మాత్రం, వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆ పిల్లలు ఇంట్లోని ఒక కిటికీ దగ్గరకు వచ్చి కాపాడాలని అరుస్తున్నారు. దీంతో వారికొక ఐడియా వచ్చింది. వెంటనే వారు అపార్ట్మెంట్కు ఆనుకొని ఉన్న ఒక పైపును పట్టుకొని, పిల్లలు చిక్కుకొని ఉన్న ఇంటి కిటికీ దగ్గరకు చేరుకున్నారు. వారంతా, ఒకరి తర్వాత మరోకరు చైన్ మాదిరిగా నిలబడ్డారు. ఈ క్రమంలో మొదటి వ్యక్తి, కిటికీ దగ్గర ఉన్న పిల్లలను చేరుకున్నారు. ఆ తర్వాత, వెంటనే కిటికీ నుంచి ఒకరి తర్వాత..మరొకరుగా.. ముగ్గురు పిల్లలను నెమ్మదిగా కిందకు దించారు. ఈ క్రమంలో, ముగ్గురు పిల్లలు క్షేమంగా కిందకు చేరడంతో అక్కడి వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే, ముగ్గురు పిల్లల ప్రాణాలను కాపాడిన వారిని అక్కడి అధికారులు సాహాస పురస్కారానికి నామినెట్ చేసినట్టుగా తెలిసింది. కాగా, ఆ ఇంట్లో ఉంటున్న సదరు, మహిళకు నలుగురు సంతానం. అగ్నిప్రమాదం జరగటానికి ముందు తన భర్తను ఇంట్లో ఉంచి, ఆమె ఏదో పనిమీద నాలుగో బిడ్డను తీసుకొని బయటకు వెళ్లింది. కాగా, ఆమె భర్త కూడా పిల్లలు పడుకున్నారని బయట తాళం వేసుకొని మరో పనిమీద బయటకు వెళ్లినట్టు తెలిసింది. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్..’, ‘ ముగ్గురి నిండు ప్రాణాలు కాపాడారు..’, ‘ ఇప్పటికీ మానవత్వం బతికే ఉందని ఇలాంటప్పుడే అనిపిస్తోంది..’, ‘ ఐకమత్యంగా ఉంటే గొప్ప పనులు సాధించొచ్చు.. అని మరోసారి రుజువైంది..’ ‘ నిజమైనా హీరోలు మీరే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అదేమో కింగ్ కోబ్రా.. ఆ యువతి ఎలా పట్టేసుకుందో! -
వర్క్ ఫ్రం హోం: గూగుల్ లాభం ఎంతో తెలుసా?
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు గత ఏడాది దాదాపు ప్రపంచమంతా పూర్తి లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో చిన్నా పెద్ద కంపెనీల ఉద్యోగులందరూ ఇంటినుంచే పనిచేయాల్సి (వర్క్ ఫ్రం హోం) వచ్చింది. ఇది అటు ఉద్యోగులకు ఇటు చాలా కార్పొరేట్ కంపెనీలకు కలిసి వచ్చింది. ముఖ్యంగా గూగుల్, ఆపిల్ ఫేస్బుక్, ట్విటర్,తదితర టెక్ కంపెనీలకు పలు రకాలుగా ఖర్చులు తగ్గి పెద్ద ఎత్తున ఆదాయం ఆదా అయింది. గూగుల్కు ఒక బిలియన్ డాలర్ల మేర ఖర్చు తగ్గిందట. అంటే సుమారు 7,400 కోట్ల రూపాయలను గూగుల్ ఆదా చేసింది. (వెయ్యి పడకలతో కోవిడ్ ఆసుపత్రి: రిలయన్స్) బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మొదటి త్రైమాసికంలో, ప్రమోషన్లు, ప్రయాణాలు, ఎంటర్టైన్మెంట్ వినోదానికి సంబంధించిన గత ఏడాదితో పోలిస్తే 268 మిలియన్లను ఆదా చేసింది, వార్షిక ప్రాతిపదికన ఒక బిలియన్లకు పైగా ఉంటుందని కంపెనీ ఫలితాల ఆధారంగా విశ్లేషకుల అంచనా. డిజిటల్ ఈవెంట్ల కారణంగా 2020లో గూగుల్ ప్రకటనలు ప్రచార ఖర్చులు 1.4 బిలియన్ డాలర్లు తగ్గాయని ఆల్ఫాబెట్ తెలిపింది. ప్రయాణ, వినోద ఖర్చులు 371 మిలియన్ డాలర్లు తగ్గాయి. గూగుల్ ఈ పొదుపును కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు ఉపయోగించినట్లు నివేదిక పేర్కొంది. మహమ్మారి కారణంగా సంస్థలో మార్కెటింగ్, పరిపాలనా ఖర్చులు చాలా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే, అనేక ఇతర టెక్ కంపెనీల మాదిరిగా కాకుండా, గూగుల్ ఈ ఏడాది సెప్టెంబరులో చాలా చోట్ల తన కార్యాలయాలను తెరవ నున్నామని, ఇది ఆయాదేశాల కోవిడ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. గూగుల్ 'హైబ్రిడ్' మోడల్లో ఉద్యోగులు తగినంత దూరంలో కూర్చొని సేవలందిస్తారని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్లో గూగుల్ పెట్టుబడులు పెట్టడం కొనసాగుతుందని పోరాట్ చెప్పారు. చదవండి : కరోనా విలయం: చూస్తే కన్నీళ్లాగవు: వైరల్ ట్వీట్ -
రోహిణీలోనే దేశీ వరి
దేశీ వరి విత్తనాలను ఇంటి ఆహారపు అవసరాల కోసం కనీసం ఒక ఎకరంలో నైనా వేసుకొంటే మంచిదని, దేశీ వరి విత్తనాలను ఆరు తడి పద్ధతిలో మామూలు పద్ధతితో పోల్చితే 10 శాతం నీటితోనే సాగు చేయవచ్చని ప్రకృతి వ్యవసాయదారుడు, సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విజయరామ్ తెలిపారు. ఈ పద్ధతిలో 90 శాతం నీటిని ఆదా చేయవచ్చు. కలుపు నియంత్రణ కోసం మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 45 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలి. ఆరు తడి పద్ధతిలో వరిలో అంతర పంటలను కూడా వేయవచ్చు. అలా వేద్దాం అనుకున్న వారు మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 60 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలన్నారు. 180 నుంచి 210 రోజుల పంట కాలం ఉండే వరి రకాలు (మా పిళ్లై సాంబ, మొలగొలుకులు, మడుమురంగి లాంటివి) రోహిణి కార్తె (మే 25 నుంచి ప్రారంభం)లో నాట్లు వేసుకుంటేనే అనుకూలం. అలా అయితేనే 2వ పంటకు వీలు దొరుతుందన్నారు. జనవరి ఆఖరు లోపు నేల స్వభావం, నీటి వసతిని బట్టి పుచ్చకాయ, దోస, కూరగాయలు, నువ్వులు లేక పశుగ్రాసపు పంటలు వేసుకోవచ్చు. కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మొదట ఏడాది ఒక ఎకరంలో మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలన్నారు. దేశీ వరి విత్తనాలతో మొదటి సంవత్సరం దిగుబడి 10 బస్తాల నుండి 20 బస్తాల వరకు రావచ్చని, తదుపరి కొంత పెరుగుతుందన్నారు. కేవలం వరిని మాత్రమే కాకుండా పప్పు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు పండించే ప్రయత్నమూ చేయాలి. వర్షము పడినప్పుడు పొలములో కొన్ని రోజుల వరకూ నీరి నిలిచిపోయే పరిస్థితి ఉన్న వారు (మాగాణి భూముల వారు, కోస్తా ప్రాంతాల వారు) కనీసం 200 గజాల స్థలంలోనైనా 2 అడుగుల ఎత్తులో మట్టిని వేసి ఇంటి అవసరాల కోసం కూరగాయలు పెంచుకోవాలన్నారు. దేశీ వరి విత్తనాలను పండించే రైతులు ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఉన్నారని, వారి దగ్గరి నుంచి విత్తనాలు తీసుకోవచ్చని విజయరామ్ వివరించారు. వివరాలకు హైదరాబాద్లోని సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం కేంద్ర కార్యాలయానికి (04027654337 , 04027635867) ఫోన్ చేయవచ్చు. పొద్దున 10 గం. నుంచి సా. 6 గం. వరకు. గురువారం సెలవు. -
ఆ గంట..ఉత్కంఠ!
సాక్షి, అనకాపల్లి టౌన్: ఓ చిన్నారి చేసిన ఘనకార్యం అటు అధికారుల్ని.. ఇటు స్థానికుల్ని పరుగులు పెట్టించింది. తల్లిదండ్రులకి ముచ్చెమటలు పట్టించింది. చివరికి అగ్నిమాపక దళం ప్రవేశంతో ఉత్కంఠకు తెరపడింది. అనకాపల్లి పట్టణంలోని చవితినవీధి ఆర్కే అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 203లో శుక్రవారం అసలు ఏం జరి గింది. ఆ ప్లాట్లో తోకల ప్రవీణ్రాజా, వసుధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 14 నెలల మహదేవ్ అనే బాలుడు సంతానం. శుక్రవారం ప్రవీణ్రాజా ఇంట్లోని హాల్ పనిలో నిమగ్నపోయారు. ఆయన భార్య వసుధ వంటపనిలో బిజీగా ఉన్నారు. అక్కడే ఆడుకుంటున్న మహదేవ్ వంటింటి తలుపును వేశాడు. దానికి ఆటోమేటిక్ లాక్ అమర్చిన కారణంగా గడియపడింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులిద్దరూ గమనించలేదు. పనిమీద తండ్రి మెయిన్ డోర్ దగ్గరకు బయటకు వెళ్లాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారి పక్కగదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. దానికి కూడా ఆటోమేటిక్ లాక్ అమర్చి ఉండడంతో అది కూడా మూసుకుపోయింది. లోపలి నుంచి చిన్నారి తలుపుతీద్దామని ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఏడుపు మొదలుపెట్టాడు. వంట గదిలో ఉన్న తల్లికి ఏడుపు వినిపించింది. బయటకొచ్చేందుకు యత్నించింది. తలుపు ఆటోమేటిక్గా లాక్ అయిన పరిస్థితిని తెలుసుకుంది. భయంతో కేకలు... చిన్నారి ఏడుపు ఓ వైపు.. ఏం జరుగుతుందోనన్న ఆందోళన మరోవైపు.. భయంతో కేకలు వేయడం మొదలుపెట్టింది. అవి విన్న స్థానికులు పెద్దసంఖ్యలో అపార్టుమెంట్ కిందకు చేరుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక ఒకటే ఉత్కంఠ. ఇంతలో బయటకెళ్లిన తండ్రి ఇంటికి చేరుకున్నారు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్లారు. ఆయనకు పరిస్థితి అర్థమైంది. రెండు గదుల తలుపులూ తీసేందుకు యత్నించారు. వీలుకాకపోవంతో పక్కిం టి వారి సాయంతో ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. గంట పాటు రెస్క్యూ... అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి మార్టిన్ లూథర్కింగ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపరేషన్ మొదలుపెట్టారు. అపార్ట్మెంట్పై నుంచి తాడు సాయంతో హోంగార్డు గోపీ నెమ్మదిగా బాలుడు ఉన్న గదిలోకి ప్రవేశించాడు. లోపలి నుంచి లాక్ అయిన తలుపును తెరిచాడు. అలాగే వంటగది తలుపును కూడా ఓపెన్ చేశాడు. బాలుడ్ని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఆపరేషన్కు గంట సమయం పట్టింది. అగ్నిమాపక సిబ్బంది చొరవను స్థానికులు అభినందిచారు. ఈ ఆపరేషన్లో అగ్నిమాపక శాఖాధికారి ఆర్.వెంకటరమణ, సిబ్బంది కృష్ణప్రసాద్, మదీన, గణేష్, నాయుడుబాబు పాల్గొన్నారు. -
మానవత్వమా నీవేక్కడ..?
న్యూఢిల్లీ : మానవత్వం, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న రోజులివి. బిడ్డలకు కన్న తల్లిదండ్రులు బరువవుతున్న కాలం ఇది. కడపున పుట్టిన వారే కడవరకూ చూస్తారనే నమ్మకంలేని కాలంలో తోడబుట్టిన వారి నుంచి ఇలాంటి ఆప్యాయతను ఆశించడం అత్యాశే అవుతోంది. మతి స్థిమితం లేని సోదరి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడో అన్న. తోబుట్టువుగా కాదు కదా కనీసం మనిషి అనే విషయాన్ని మరిచి ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించాడు. చివరకూ ఢిల్లీ మహిళా కమీషన్ చొరవతో బాధితురాలు ఆ నరకం నుంచి బయటపడ్డారు. హృదయవిదారకమైన ఈ ఘటన వివరాలు.. ఢిల్లీకి చెందిన బాధితురాలు మానసిక వికలాంగురాలు. ఆమెకు ఇద్దరూ సొదరులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు మరణించే వరకూ వారితో పాటు ఉన్న బాధితురాలిని రెండేళ్ల క్రితం ఆమె సోదరుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అతడు తన భార్యతో కలిసి బాధితురాలిని తీవ్రంగా హింసిస్తున్నారు. ఆమెకు సరైన తిండి కాదు కదా అసలు భోజనం పెట్టడమే మానేశారు. నాలుగు రోజులకు ఒకసారి ఒక బ్రెడ్డు మాత్రమే ఇస్తున్నారు. బాధితురాలు మానసిక వికలాంగురాలు కావడంతో ఆమె తన పనులను స్వయంగా చేసుకోలేదు. సోదరుడు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె తన మలమూత్రాల మధ్యనే అత్యంత జుగుప్సాకరమైన పరిసరాల్లో జీవనం గడుపుతోంది. బాధితురాలికి మరో సోదరుడు ఉన్నాడు. కానీ ఆమె ప్రస్తుతం ఉంటున్న సోదరుడు ఆమెను చూడటానికి ఎవ్వరిని అనుమతిచ్చేవాడు కాదు. దాంతో బాధితురాలి రెండో సోదరుడు ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్కు సమాచరం అందించాడు. అధికారులు బాధితురాలి సోదరుని ఇంటికి వచ్చినప్పుడు, అతడు వారిని తిట్టడమే కాక ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడ్డాడు. దాంతో సదరు అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లి అక్కడ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న బాధితురాలిని అంబేద్కర్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ మాట్లాడుతూ ‘బాధితురాలి వయసు కేవలం 50 ఏళ్లు ఉండోచ్చు.. కానీ సరైన పోషణ అందకపోవడంతో 90 ఏళ్ల వయసు వ్యక్తిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చాం. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆశ్రమానికి మారుస్తాం. ప్రజలు కూడా తమ చుట్టు పక్కల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆ వివరాలు మాకు తెలియజేయండి. బాధితులకు సాయం చేయండి’ అని కోరారు. -
అక్రమ మైనింగ్ కేసు: యరపతినేనిని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం
-
ఢిల్లీ వేదికగా మరో ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీ మరో ఉద్యమానికి వేదిక కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఎన్నో పర్యవరణ ఉద్యమాలను నిర్వహించిన చిప్కో ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమానికి సిద్ధమైంది. అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం చెపట్టిన చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే మూడు వేలకు పైగా చెట్లను నరికి వేసిందని, సరోజినీ నగర్లో మరో 16,500 చెట్లను తొలగించుటకు సిద్ధంగా ఉందని చిప్కో ఉద్యమకారుడు విక్రాంత్ తొంగాడ్ తెలిపారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీ వ్యాప్తంగా చిప్కో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ కారణంగా వాతావరణ కాలుష్యంగా మారి ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్రం చేపట్టిన ఎన్బీసీసీ కంపెనీ నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చిప్కో ఉద్యమకారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 16,500 చెట్లను నరికివేతకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చిందని, దీనికి వ్యతిరేకంగా ఆదివారం సరోజినీ నగర్లో భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం చెట్లను కౌగిలించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నట్లు పర్యవరణ ఉద్యమకారిణి చావీ మేథి తెలిపారు. దీనిపై తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ని కూడా ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. ఈ ఉద్యమానికి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. -
పోలీస్ సాబ్ మీరు సూపర్; వీడియో వైరల్
రామ్ నగర్, ఉత్తరాఖండ్ : ప్రేమకు, మానవత్వం చాటుకోవడానికి మతం అడ్డురాదు. వాటికి తెలిసిందల్లా ప్రేమను పంచడం... సాయం చేయడమే. ఉత్తరాఖండ్లో ఈ రెండు సంఘటనలు ఏక కాలంలో జరిగాయి. తమ మతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడన్న కారణంగా ముస్లిం యువకుడిపై కొందరు హిందూ యువకులు దాడికి దిగారు. ఈ సంఘటన రామ్పూర్ గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో జరిగింది. ఈ గొడవ గురించి ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ గంగాదీప్ సింగ్కు సమాచారం అందించారు స్థానికులు. సింగ్ ఆ ప్రదేశానికి చేరుకునే సరికి హిందూ యువకులు ముస్లిం యువకుడిని కొట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇది గమనించిన సింగ్ బాధిత యువకుడిని కాపాడటం కోసం ముందుకు వెళ్లి ఆ యువకుడికి అడ్డుగా ఉండి కాపాడాడు. ఈ తతంగాన్ని ఒకరు ఫోన్లో రికార్డు చేసి ట్విటర్లో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారంతా గంగాదీప్ సింగ్ను అభినందనలతో ముంచేత్తుతున్నారు. ‘పోలీస్ సాబ్ మానవత్వానికి మతంతో పని లేదని చాటారు...మీరు సూపర్ సార్’ సోషల్ మీడియాలో హీరోను చేస్తూ కామెంట్ చేశారు. -
టెక్నాలజీ సాయంతో వారు ఏంచేశారంటే ?
టెక్నాలజీని వినాశనానికి ఉపయోగిస్తే ఎంతటి తీవ్ర పరిణామాలుంటాయో ఇప్పటికే ఎన్నో ఘటనల ద్వారా తెలిసింది. అదే టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటే ఎంతటి ప్రయోజనాలుంటాయో ఢిల్లీ పోలీసులు చాటిచెప్పారు. ఇంతకీ టెక్నాలజీ సాయంతో వారు చేసిన మంచిపని ఏంటో తెలుసా? ఇది చదవండి... న్యూఢిల్లీ : సెల్ఫోన్లాంటి చిన్న వస్తువు పోతేనే విలవిల్లాడిపోతాం. మరి కన్నబిడ్డలు దూరమైతే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణించలేనిది. కనిపించకుండా పోయిన బిడ్డ గురించే ఆలోచిస్తూ రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిపేస్తున్న తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. మరి వారి గర్భశోకాన్ని తీర్చేదెలా? ఇందుకు పరిష్కారం చూపారు ఢిల్లీ పోలీసులు. తప్పిపోయిన చిన్నారులను ఓ సాఫ్ట్వేర్ సాయంతో, వారి సొంతవారెవరో గుర్తించేస్తున్నారు. కేవలం నాలుగు రోజుల్లో 3వేల మంది చిన్నారులను గుర్తించి, కన్నవారి చెంతకు చేర్చారట. ఇందుకోసం ఢిల్లీ పోలీసులు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏంటో తెలుసా? ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్). సాఫ్ట్వేర్ ప్రయోగాత్మకంగా ఎటువంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకునేందుకు ఓ నాలుగు రోజులు ప్రయత్నిస్తేనే 3 వేల మంది చిన్నారులను కాపాడగలిగామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ సరికొత్త సాఫ్ట్వేర్ను వాడేందుకు ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఎప్రిల్ 5న ఢిల్లీ హైకోర్టు అనుమతిని కోరారు. కానీ హైకోర్టు మాత్రం ఈ అప్లికేషన్ను వాడేందుకు అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతేగాక పిల్లల డేటాను ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టవద్దని హెచ్చరికలు జారీచేసింది. దాంతో పోలీసులు వివిధ చిల్డ్రన్స్ హోమ్స్లో ఉంటున్న 45 వేలమంది పిల్లలపై ఎఫ్ఆర్ఎస్ సాఫ్ట్వేర్ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీంతో వారి ముఖాల ద్వారా 2,930 మంది పిల్లల వివరాలను గుర్తించారు. ఈ విషయాన్నే మహిళాశిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్లో వివరించింది. తప్పిపోయిన పిల్లలను వెతకడానికి ఈ సాఫ్ట్వేర్ బాగా ఉపయోగపడడంతో అనేక ఎన్జీవో సంస్థలు హర్షం వ్యక్తం చేస్తూ.. సాఫ్ట్వేర్ను పోలీసులకు ఉచితంగా అందించాలని సూచించాయి. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్సైతం పిల్లలను గుర్తించేందుకు ఉపయోగపడే ఈ సాఫ్ట్వేర్ను సమర్థించింది. తప్పిపోయిన చిన్నారులను తమ వారి దగ్గరు చేర్చేందుకు ఈ సాఫ్ట్వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్లకు మంటలు
కృష్ణా జిల్లా : కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు టైర్లకు మంటలు అంటుకున్నాయి. టోల్ ప్లాజా సిబ్బంది గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ముంబాయి నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును నిలిపివేసి అక్కడ ఉన్న సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మరో బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా స్థానిక ఎమ్మార్వో పద్మజ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. రాపిడి వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. -
సొంత వైద్యం అతన్ని కాపాడింది
పెర్త్ : ఎవరికైనా గుండె పోటు వస్తే ఏం చేస్తాం. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్తాం. కానీ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తిని తీసుకెళ్లటానికి పక్కన ఎవరూ లేరు. పోనీ తెగించి ఒక్కడే వెళ్దామనుకున్న ఆస్పత్రి అంత దగ్గర్లో లేదు. అయినా సొంత వైద్యంతో తన ప్రాణాలను తానే కాపాడుకున్నాడు ఆ వ్యక్తి. పెర్త్ నగరానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణంలో 44 ఏళ్ల వ్యక్తి జీవిస్తున్నాడు. మూడు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటు సంకేతాలు కనిపించాయి. ఆస్పత్రి అక్కడికి 150 కిలోమీటర్లు దూరంలో ఉంది. సహాయం అందించడానికి దగ్గర్లో ఎవరూ లేరు. అయినా ప్రాణాలపై అతను ఆశ వదలుకోలేదు. నర్సుగా తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ప్రాథమిక పరీక్షలు చేసుకున్నాడు. ముందుగా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఇకెజీ) అనే పరీక్ష చేసుకున్నాడు. ఆ ఫలితాన్ని అత్యవసర టిలిహెల్త్ ద్వారా ఓ గుండె సంబంధిత వైద్యుడికి మెయిల్ చేశాడు. అవతలి వైద్యుడు అతనికి గుండె పోటు వచ్చిందని నిర్ధారించాడు. దీంతో ఆ వ్యక్తి క్లాట్ డిసాల్వింగ్ అనే చికిత్స చేసుకున్నాడు. దాంతో గుండెనొప్పి తగ్గి అతను ఉపశమనం పొందాడు. ఆ మరుసటిరోజు పెర్త్ లోని ఓ ఆసుపత్రికి వెళ్లి పూర్తి స్థాయిలో వైద్యం అందించుకున్నాడు. -
ప్రాణాలు కాపాడిన సీటు బెల్టు
పెనుకొండ రూరల్: జాతీయరహదారిపై వేగంగా వెళుతున్న కారు కుక్క అడ్డురావడంతో బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న దంపతులు సీటుబెల్టు ధరించడం వల్ల ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. పెనుకొండ ఎస్ఐ జనార్ధన్ తెలిపిన మేరకు... బెంగళూరుకు చెందిన సంతోష్ తన భార్య ప్రశాంతితో కలసి ఆదివారం ఉదయం గుంతకల్లుకు కారులో బయల్దేరాడు. పెనుకొండ మండలం హరిపురం జాతీయ రహదారిపై కుక్క అడ్డురావడంతో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. వాహనం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ సీటు బెల్టు ధరించడంతో లోపల ఉన్న వారికి ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, వాహనదారులు గమనించి దంపతులను బయటకు తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గూగుల్లో ఈ మార్పును గమనించారా?
సాక్షి, టెక్నాలజీ : ఇంటర్నెట్ యూజర్లకు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ షాక్ ఇచ్చింది. ఇకపై మీకు నచ్చిన ఫోటోలను ఇష్టమొచ్చినట్లు సేవ్ చేసుకోకుండా సెర్చింజన్లో మార్పులు చేసేసింది. ఫ్రీ ఫోటోలకు ఆస్కారం లేకుండా ‘వ్యూ ఇమేజ్’ బటన్ను తొలగించేసింది. ఇంతకు ముందు గూగుల్లో ఏదైనా ఫోటోలను ఓపెన్ చేసినప్పుడు పక్కన విజిట్, షేర్లతోపాటు వ్యూ ఇమేజ్ ఆప్షన్ కూడా కనిపించేది. దానిని క్లిక్ చేస్తే ఆ ఫోటో ఓపెన్ అయ్యి సేవ్ చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే కాపీ రైట్స్ కారణం చెబుతూ ఇప్పుడు ఆ ఆప్షన్ను గూగుల్ తొలగించేసింది. ఇప్పుడు గూగుల్ లో కేవలం విజిట్, షేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ‘గూగుల్లో నేటి నుంచే కొన్ని మార్పులు చేశాం. వ్యూ ఇమేజ్ బటన్ను తొలగించేశాం అని, యూజర్లకు, ఆధారిత వెబ్సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఈ పని చేశాం’ అని ఓ ప్రకటనలో గూగుల్ పేర్కొంది. దీని ద్వారా విజిట్ పేజ్ బటన్ ద్వారా ఆధారిత వెబ్ సైట్కు యూజర్ వెళ్తాడు. తద్వారా తమ ఆదాయం పెంచుకునేందుకే గూగుల్ ఈ పని చేసినట్లు స్పష్టమౌతోంది. హై డెఫినేషన్ ఫోటోలు కావాలనుకుంటే తప్పనిసరిగా ఆ వెబ్సైట్ను ఆశ్రయించాల్సిందేనని గూగుల్ చెబుతుండగా.. ప్రత్యామ్నయ మార్గాలను కూడా వెతుక్కునే పనిలో యూజర్లు పడ్డారు. Today we're launching some changes on Google Images to help connect users and useful websites. This will include removing the View Image button. The Visit button remains, so users can see images in the context of the webpages they're on. pic.twitter.com/n76KUj4ioD — Google SearchLiaison (@searchliaison) 15 February 2018 -
ఈ శునకం నిజంగా హీరో!
న్యూయార్క్: ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడేందుకు కాస్త వెనకాముందు ఆలోచిస్తాం. మనకేదైనా నష్టం కలుగుతుందేమోనని భయపడతాం. కానీ జంతువులకు ఇలాంటి ఆలోచనలు, భయాలు ఉండవు కదా..? అందులో శునకంలాంటి విశ్వాసంగల జీవికి అసలే ఉండవనే విషయం మరోసారి రుజువైంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న శునకం ఆపదలో ఉన్న మరో మూగజీవిని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. న్యూయార్క్కి చెందిన మార్క్ ఫ్రీలీ అనే వ్యక్తి తన పెంపుడు శునకంతో కలిసి బీచ్లో నడుస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ పెంపుడు శునకం ఒక్కసారిగా నీటిలోకి దూకింది. ఎందుకలా దూకిందో ఫ్రీలీకి కాసేపు అర్థం కాలేదు. అయితే నీటిలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ జింకను కాపాడేందుకు ఆ శునకం నీటిలో దూకిందని గ్రహించాడు. వెంటనే ఆ శునకం జింక పిల్లలను కాపాడే ఘటనను వీడియో తీశాడు. జింక పిల్ల మెడ భాగాన్ని ఆ శునకం నోటితో పట్టుకుని నెమ్మదిగా ఒడ్డుకు తీసుకొచ్చింది. అంతేకాదు.. జింక పిల్లకు కొన్ని సపర్యలు కూడా చేసింది. ఈలోపు ఫ్రీలీ జంతు సంరక్షణ విభాగానికి సమాచారమిచ్చి జింకను ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ జింక పిల్ల కోలుకుంటోంది. -
ప్రకాశం జిల్లాలో బాలకార్మికులకు విముక్తి
-
ఇదేమి ప్రజాస్వామ్యం?
- నడిబజారులో నవ్వులపాలు - వైఎస్సార్సీపీ పిలుపునకు ప్రజా మద్ధతు - సేవ్ డెమోక్రసీకి అనూహ్య స్పందన సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునకు జిల్లాలో అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది. పార్టీ రహితంగా నేతలు, విద్యార్థులు, మేధావి వర్గం నుంచి నిరసనకు మద్ధతు లభించింది. రామచంద్రపురం నియోజకవర్గం (ఇక్కడ స్థానిక ఎన్నికలున్నాయి) మినహాయిస్తే మిగిలిన 18 నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు అప్రజాస్వామికంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైఎస్సార్సీపీ ఆందోళనల్లో పాల్గొనడం కనిపించింది. పలు ప్రాంతాల్లో వామపక్షాల నేతలు, పార్టీ శ్రేణులు వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి నిరసన గళాన్ని వినిపించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్లు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, తహసీల్థార్ కార్యాలయాల వద్ద ధర్నాలు, కొన్ని చోట్ల నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని, మరికొన్నిచోట్ల వెనక్కు నడుస్తూ, ఇంకొన్ని చోట్ల చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించమంటూ దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసి వినూత్న నిరసన తెలియచేశారు. అటు ఏజెన్సీలో సైతం గిరిజనులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాలుపంచుకోవడం కనిపించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జిల్లాను సమన్వయం చేసుకుంటూ సేవ్ డెమొక్రసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయించారు. - సేవ్ డెమెక్రసీ పేరుతో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్తో కలిసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ, జాతీయ రహదారి దిగ్భంధనం, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా, రెండు గంటలపాటు రాస్తారోకో చేసి భారీ మోటారు సైకిళ్ళ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి,ప్రచారసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, జిన్నూరి బాబి తదితరులు పాల్గొన్నారు. - ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, చంద్రబాబు తీరుతో మేధావులు అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు జోక్యం చేసుకోవాలని కొత్తపేటలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజలతో ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడమే కాకుండా టీడీపీలో సమర్ధులు లేనట్టు మంత్రి పదవులను ఇచ్చి రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహస్యం చేశారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. తుని శాంతినగర్లోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. - రంపచోడవరంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, నియోజకవర్గనేత, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) ఆధ్వర్యంలో నాయకులు , కార్యకర్తలు, భారీ ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్ సెంటర్లో రాజమండ్రి–భద్రాచలం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రఘుదేవపురం నుంచి సీతానగరం వరకు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పాదయాత్రతో నిరసన తెలియచేశారు. పాదయాత్ర ఆద్యంతం ‘సేవ్ డెమోక్రసీ నినాదాలతో మారుమోగింది. అనంతరం సీతానగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. - అమలాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, బొమ్ము ఇజ్రాయిల్, బీసీ, విద్యార్థి విభాగాల అధ్యక్షులు మట్టపర్తి మురళీకృష్ణ, జక్కంపూడి కిరణ్ తదితరులు ఆందోళన నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీలో కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు తదితర నేతల ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. కడియం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, రూరల్ కో–ఆర్డిటర్ గిరాజాల బాబు, రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు నేతలు భారీ ధర్నా, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని, వెనక్కు నడుస్తూ నిరసన తెలియచేశారు. కో–ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణప్రసాద్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ముమ్మిడివరంలో కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పెయ్య చిట్టిబాబు తదితరులు 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. - పి.గన్నవరంలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండుగుదిటి మోహన్ తదితరులు భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పి.గన్నవరం సెంటర్లోæ చిట్టిబాబు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. రాజోలు కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సఖినేటిపల్లి రేవు నుంచి రాజోలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మండపేటలో కో–ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్య, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రా«ధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కో–ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు తదితరులు బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కరాచీ సెంటర్లో బాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. - పెద్దాపురం నుంచి సామర్లకోట వరకు కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో భారీ మోటారు సైకిల్ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కాకినాడ సిటీ గాంధీనగర్ నుంచి బైక్ర్యాలీని సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ ప్రారంభించగా నగర అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి తదితరులు పిఠాపురంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించి పార్టీ కార్యాలయం నుంచి మోటారు సైకిళ్లపై ప్రదర్శన నిర్వహించి ఉప్పాడ సెంటర్లో ధర్నా నిర్వహించారు. కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. -
మండే ఎండలు..అప్రమత్తత అవసరం
-
ఇందన పొదుపు అందరి బాధ్యత
కర్నూలు (రాజ్విహార్): ఇందనం పొదుపు చేస్తే భవిష్యత్తరాలకు ఆసరాగా ఉంటుందని ఫ్యాక్టరీస్ డిప్యూటీ డైరెక్టరు శివశంకర్రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కర్నూలు–1డిపో గ్యారేజీలో ఇందన పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని చెప్పారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఎన్వీరాల్మెంట్ ఇంజినీర్ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ సంస్థ సూచించిన మార్గాలను అనుసరిస్తేనే పొదుపు సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోహిత్ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్బాబు డిమాండ్ చేశారు. గురువారం కేకే భవన్లో రోహిత్ ప్రథమ వర్ధంతి నిర్వహణపై కేవీపీఎస్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్యతో సంబంధం ఉన్న కేంద్రమంత్రులు, వీసీ, ఇతర అధికారులను కాపాడడం కోసం అçసలు ఆయన దళితుడే కాదని చెప్పడం భావ్యం కాదన్నారు. రోహిత్ వేముల జ్ఞాపకార్థం జనవరి 17ను దళిత హక్కుల దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేకే భవన్లో 17న వర్ధంతి సభను నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు రాధాకృష్ణ, నాగేశ్వరరావు, మహేష్ పాల్గొన్నారు. -
ప్రాణాలకు రక్షణ కల్పించరూ..
గుంటూరు ఈస్ట్ : జిల్లా పోలీసు కార్యాలయంలోని రూరల్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. మొత్తం 18 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రాణాలకు రక్షణ కల్పించాలి ఏఈఎల్సీ మాచర్ల ప్రాంత బిషప్గా 12 సంలుగా పనిచేస్తున్న తనకు ఏఈఎల్సీ కార్యవర్గ సభ్యుడైన ప్రొఫెసర్ లాం ప్రకాష్ నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని బిషప్ రెవరెండ్ వై.సువర్ణరావు రూరల్ అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడుకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెస్ట్ గుంటూరు సినడు పరిధిలో నరసరావుపేట, తుర్లపాడు, వినుకొండ ప్రాంతాలు ఉన్నాయన్నారు. పల్నాడు ప్రాంతాన్ని ప్రత్యేక సినడుగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత క్రీస్తు విశ్వాసులు అనేక సంవత్సరాలుగా కోరుతున్నారని చెప్పారు. అందుకు ఏఈఎల్సీ అధ్యక్షుడు పరదేశీబాబు అంగీకరించినట్లు తెలిపారు. ఈ నెల ఆరో తేదీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయించేందుకు పల్నాడు ప్రాంతానికి చెందిన వందలాది మంది విశ్వాసులతో బ్రాడీపేటలోని ఏఈఎల్సీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇచ్చామన్నారు. అయితే ప్రొఫెసర్ లాం ప్రకాష్ తమకు వ్యతిరేకంగా కొంతమందిని పురికొల్పి అదే రోజు సాయంత్రం ఏఈఎల్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పారని ఆరోపించారు. కొద్ది రోజులుగా కొందరు ఫోన్లో తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అడిషనల్ ఎస్పీని కోరినట్లు వివరించారు. పల్నాడు ప్రాంతానికి చెందిన 83 ప్యారిష్ల ప్రతినిధులు అడిషనల్ ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. -
ప్రొఫెసర్ లక్ష్మీ అరెస్ట్ కాకుండా యత్నాలు
-
పంటలు కాపాడేందుకు నీరందిస్తాం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈ వీర్రాజు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టు పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు చేసిన పంట పొలాలకు పూర్తిగా నీరు అందిస్తామని ప్రాజెక్టు సీఈ వీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన సాగర్ కుడికాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుపై నున్న కంట్రోల్ రూమ్లో విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన బోర్డు మీటింగ్లో గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వేసిన 9.5 లక్షల ఎకరాల పంటపొలాలను కాపాడేందుకు ఒక తడి పూర్తిగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. గుంటూరు బ్రాంచ్ కెనాల్స్ కింద వేసిన 2లక్షల ఎకరాలలో ఇప్పటికే లక్ష ఎకరాల భూమి తడిసిందని మరో లక్ష ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు చెప్పారు. జూలకల్లు బ్రాంచ్ కెనాల్ నుంచి తంగిడ, ఆకురాజుపల్లిలోని మిరప పంటలకు మరో తడి నీరు ఇస్తే పంట రైతు చేతికి అంది వస్తుందన్నారు. సాగర్ జలాశయంలో నీరు తక్కువుగా ఉందని దీనిని దష్టిలో పెట్టుకొని రైతులు రబీ పంటలను వేయవద్దని సూచించారు. రైతులను రబీ పంటలను వేస్తే పెట్టిన పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. కుడికాలువపై అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల కనెక్షన్లు తొలగించేందుకు నీటిసంఘాలు పోలీసుల సహకారంతో ప్రత్యేక బందాలను ఏర్పాటు చే యాలని కోరారు. చివరి ఆయకట్టు భూముల వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం సాగు, తాగు నీటికి విడుదల చేస్తున్న 10 టీఎంసీలలో ఇప్పటికే 7.5 టీఎంసీలు విడుదల చేశామని వివరించారు. మరో మూడు రోజులలో నీటి విడుదల పూర్తవుతుందన్నారు. మరో 3 టీఎంసీల నీటి అవసరం ఉందనే విషయాన్ని ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయన వెంట కుడికాలువ డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరావు, జేఈలు లక్ష్మీనారాయణ, కేశవరావు, సత్యనారాయణ ఉన్నారు. -
గిరిజనులను రక్షిస్తున్నారా? భక్షిస్తున్నారా?
బుట్టాయగూడెం : పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులను రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షిస్తున్నారా? భక్షిస్తున్నారా? అని ఆయా శాఖల అధికారులను హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. శనివారం మండలంలోని కేఆర్ పురం ఐటీడీఏ వద్ద గిరిజన ఎల్టీఆర్ పోడు భూములు, పునరావాస ప్యాకేజీ సమస్యలపై బహిరంగ విచారణ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు భూసమస్యలపై గోడును రిటైర్డ్ జడ్జి వద్ద మొరపెట్టుకున్నారు. 20 సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటున్నామని, ఆ భూములకు సంబంధించి తమకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో పాటు తమ పేర్లు 1(బి) లో కూడా ఉన్నాయంటూ వాటికి సంబంధించిన రికార్డులను ఆయనకు చూపించారు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే తమ పేర్లు 1(బి)లో లేకుండా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారంటూ వాపోయారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ గిరిజనుల కష్టాలను వింటుంటే చెప్పలేని బాధ కలుగుతుందన్నారు. ఆదివాసీలైన గిరిజనులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన చట్టాలు ఇక్కడ అమలు కావడంలేదని స్పష్టమవుతుందన్నారు. గిరిజనులను కాపాడాల్సిన అధికారులే గిరిజనేతరులకు అండగా ఉంటూ వారి హక్కులను కాలరాస్తున్నట్టు తెలుస్తుందని చెప్పారు. చట్టాలను కాలరాసే ఏ అధికారైనా వారిపై కేసులు పెట్టవచ్చన్నారు. ఏ గిరిజన ప్రాంతంలో లేని సమస్యలు ఈ ప్రాంతంలోనే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు నీతి, నిజాయితీతో ఉంటే సమస్యలు ఏర్పడేవే కావన్నారు. వారిలా లంచాలకు ఎగబడి అక్రమాలకు పాల్పడడం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నట్టు అర్థమవుతుందన్నారు. ఇక్కడి గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై గవర్నర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. రెడ్డిగణపవరంలో కూడా గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కూడా గిరిజనులు తమ బాధలను చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పల్లా త్రినా«థరావు, గిరిజన సంఘం నాయకులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు ఏ.రవి, ఎ.ఫ్రాన్సిస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు కాకి మధు తదితరులు పాల్గొన్నారు. -
తగ్గనున్న గృహరుణాల ఈఎంఐలు
భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 25 పాయింట్లు, వడ్డీ రేట్లను 6.25శాతానికి తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు గృహ రుణాల చెల్లింపుదారుల పాలిట వరమే. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండిగ్ రేట్స్(ఎమ్ సీఎల్ఆర్)ను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన వడ్డీ రేట్ల తగ్గుదల లాభాలను వినియోగదారులకు బ్యాంకులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు లోన్ తీసుకునే సమయంలో ఉన్న వడ్డీ రేట్లనే రుణం తీరిపోయే వరకూ బ్యాంకులు పాటించేవి. అంటే లోన్ తీసుకున్న వ్యక్తి ఆ మొత్తం చెల్లించే వరకూ సమకాలీన మార్పులతో సంబంధం లేకుండా వడ్డీ చెల్లింపులు చేయాల్సివచ్చేది. ఏప్రిల్1 కంటే ముందు లోన్లు తీసుకున్నవారు కూడా ఎమ్ సీఎల్ఆర్ వడ్డీ రేట్ల విధానానికి మారవచ్చు. ఆర్బీఐ రెపో రేటును కూడా తగ్గించడంతో సాధారణ వడ్డీ రేట్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు తాజా నిర్ణయం వల్ల మార్కెట్ లోకి ధన ప్రవాహం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2015 జనవరి నుంచి ఇప్పటివరకూ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 175 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. కాగా తగ్గిన వడ్డీ రేట్లలో పావు శాతానికి పైగా మాత్రమే వినియోగదారుల వద్దకు వెళ్లింది. ఆర్బీఐ తగ్గించిన 25 పాయింట్ల రెపో రేటుకు చెందిన ఫలాలు వినియోగదారులను చేరితే.. రూ.30 లక్షలను(20 ఏళ్ల చెల్లింపు) గృహ రుణంగా తీసుకున్న వారికి చెల్లించాల్సిన మొత్తంలో ఏడాదికి రూ.5,855లు తగ్గుతాయి. అదే రూ.50 లక్షలు(20 ఏళ్ల చెల్లింపు), రూ.75లక్షలు(20 ఏళ్ల చెల్లింపు) రుణాలు తీసుకున్న వారికి ఏడాదికి రూ.9,759లు, రూ.14,638లు తగ్గుతాయి. -
‘ఆర్టీసీని కాపాడుకుందాం’
– ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి వెల్లడి – ఆరు కొత్త బస్సుల ప్రారంభం మదనపల్లె అర్బన్: ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థలను కాపాడుకుందామని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వన్డిపో పరిధిలో ఆరు నూతన బస్సులు సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో అనువజ్ఞులైన డ్రైవర్లు ఉండడం వల్ల ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేరుస్తారని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు సైతం రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెకించేందుకు కృషి చేయాలన్నారు. అక్రమ వాహనాలను అరికట్టేందుకు తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. హైదరాబాదుకు రెండు సూపర్ లగ్జరీ బస్సులు, రెండు బెంగళూరుకు, రెండు మదనపల్లె–తిరుపతి మార్గాల్లో ప్రవేశపెట్టడంతో వన్ yì పోకు మరింత ఆదాయం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వన్, టూ డిపో మేనేజర్లు ఎస్.వి ప్రభాకర్, పెద్దన్నశెట్టి, అసిస్టెంట్ మేనేజర్ ధనలక్ష్మీ, ఎంప్లాయిస్ యూనియన్, ఎన్ఎంయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
చట్టాలతో ముస్లిం మహిళలకు రక్షణ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి గుంటూరు ఈస్ట్: గృహ హింసకు గురయ్యే ముస్లిం మహిళలకు చట్టాలు పటిష్టవంతంగా రక్షణ కల్పిస్తున్నాయని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. మహిళలు వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పొన్నూరు రోడ్డులోని లాల్ జాన్ బాషా కల్యాణ మండపంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం మహిళా చట్టాలు– హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల హక్కుల రక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు తూర్పు ఎమ్యెల్యే ముస్తఫా మాట్లాడుతూ గృహ హింసకు గురయిన మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులు తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలను సమాజంలోని అందదూ ఖండించాలని కోరారు. అనంతరం మొదటి స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.జె.సుధా, జిల్లా జువైనల్ కోర్టు ప్రధానన్యాయమూర్తి కె.ప్రత్యూష కుమారి, ఏఎస్పీ భాస్కర్రావు మాట్లాడారు. సదస్సులో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ ఖాజా వలీ, గౌరవాధ్యక్షుడు ఎస్.ఎం.గౌస్ మోహిద్దీన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ సయ్యద్రసూల్, ముస్లింలు పాల్గొన్నారు. -
స్పృహ కోల్పోతున్న.. సురక్షితంగా చేర్చిండు
ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి బూర్గంపాడు: కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బూర్గంపాడు వద్దకు చేరుకునే సరికి డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురై..నీరసంతో స్పృహ కోల్పోబోతున్నా..బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి..ప్రయాణికులను రక్షించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బస్సులోని ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం 10:30 గంటలకు కొత్తగూడెం నుంచి బస్సు బయల్దేరగా..40 నిమిషాల తర్వాత డ్రైవర్ మల్సూర్ అస్వస్థతకు గురై..చొక్కా తడిచేలా చెమట పట్టి.. నీరసంగా మారాడు. శరీరం తూలిపడుతున్న విషయాన్ని కండక్టర్ గమనించి ఏమైందని ప్రశ్నిస్తున్నా..ఓపికగా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. 11:30 గంటలకు బూర్గంపాడు వద్దకు చేరుకునే సరికి ఓపికంతా నశించి బస్సును రోడ్డు పక్కన ఆపేసి స్టీరింగ్పై వాలిపోయాడు. ప్రయాణికులు, స్థానిక యువకులు అతడిని కిందకు దింపి..బైక్పై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బీపీ, షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోవటంతో ఒళ్లంతా చెమటలు పోసి స్పృహ కోల్పోయే స్థితికి చేరాడని తెలిపారు. ఈ స్థితిలోనూ క్షేమంగా డ్రైవింగ్ చేసిన అతడిని అంతా అభినందించారు. ప్రథమ చికిత్స అనంతరం భద్రాచలం తరలించారు. బస్సులోని ప్రయాణికులను కండక్టర్ వేరే బస్సులో ఎక్కించి పంపించారు. -
rtc driver save pasingers
ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి బూర్గంపాడు: కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బూర్గంపాడు వద్దకు చేరుకునే సరికి డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురై..నీరసంతో స్పృహ కోల్పోబోతున్నా..బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి..ప్రయాణికులను రక్షించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బస్సులోని ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం 10:30 గంటలకు కొత్తగూడెం నుంచి బస్సు బయల్దేరగా..40 నిమిషాల తర్వాత డ్రైవర్ మల్సూర్ అస్వస్థతకు గురై..చొక్కా తడిచేలా చెమట పట్టి.. నీరసంగా మారాడు. శరీరం తూలిపడుతున్న విషయాన్ని కండక్టర్ గమనించి ఏమైందని ప్రశ్నిస్తున్నా..ఓపికగా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. 11:30 గంటలకు బూర్గంపాడు వద్దకు చేరుకునే సరికి ఓపికంతా నశించి బస్సును రోడ్డు పక్కన ఆపేసి స్టీరింగ్పై వాలిపోయాడు. ప్రయాణికులు, స్థానిక యువకులు అతడిని కిందకు దింపి..బైక్పై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బీపీ, షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోవటంతో ఒళ్లంతా చెమటలు పోసి స్పృహ కోల్పోయే స్థితికి చేరాడని తెలిపారు. ఈ స్థితిలోనూ క్షేమంగా డ్రైవింగ్ చేసిన అతడిని అంతా అభినందించారు. ప్రథమ చికిత్స అనంతరం భద్రాచలం తరలించారు. బస్సులోని ప్రయాణికులను కండక్టర్ వేరే బస్సులో ఎక్కించి పంపించారు. -
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్) : జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆర్డీఓ లక్షీ్మనారాయణతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. బైపాస్ కారణంగా కేవలం 25 ఇళ్లు మాత్రమే పోతున్నాయన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలోనే మెడికల్ కాలేజీ, బైపాస్ రోడ్డు, పట్టణ ప్రధాన రోడ్డు ఫోర్ లే¯Œæగా మారుస్తున్నామన్నారు. బైపాస్ రోడ్డు ఎస్వీఎస్ ఆస్పత్రి పక్క నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు 9.7కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుందన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారమే బైపాస్ సర్వే జరుగుతోందన్నారు. ఈ రోడ్డు వల్ల రవాణా వ్యవస్థ మెరుగై ప్రజల బతుకుదెరువుకు అవకాశాలు లభిస్తాయన్నారు. రూ.పది కోట్లతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్డును విస్తరిస్తున్నామన్నారు. ఇందులోభాగంగా దుకాణాలు కోల్పోయే వ్యాపారులు సహకరించాలని కోరారు. అనంతరం బైపాస్ సర్వే మ్యాప్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ టీపీఓలు విద్యాసాగర్, ప్రతాప్, సర్వే ఏజెన్సీ నిర్వాహకులు శివకుమార్, రంగయ్య, శ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, శివరాజ్, సురేశ్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మంచాల: పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్యగౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆరుట్ల గ్రామంలో ఎండిన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని కేవలం హామీలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఐదుసార్లు ప్రకృతి వైపరిత్యాల వల్లన పంటలు దెబ్బతిన్న రైతులకు నయా పైసా కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. కేంద్రం కరువు నిధులు ఇచ్చామని చెబుతుందని.. రాష్ర్ట ప్రభుత్వం మాత్రం వాటిని రైతులకు ఇవ్వడం లేదన్నారు. పంట రుణమాఫీ విషయంలో కూడా నష్టపూరితంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు పంటలు ఎండి నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పంటలు పూర్తిగా చేతికి రాకుండా పోయాయన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దాసరమోని సురేష్, లోంగారి యాదగిరి, ఎన్నుదుల మహేష్, సుంకరి దానయ్యగౌడ్, తాళ్ల ప్రభాకర్గౌడ్, జోగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు భాషను పరిరక్షించుకుందాం
అనంతపురం సిటీ: తెలుగు భాషకు ప్రాణం పోయాలి..అచ్చ తెలుగును కాపాడు కోవాలని తెలుగు భాషా సంఘం జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ‘కృష్ణా పుష్కర కవితోత్సవం’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పొట్లూరి హరికృష్ణతోపాటు రాష్ట్ర పౌరసంబంధాలు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువశ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ చమన్తో పాటు ప్రముఖ కవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణాపుష్కరాల ప్రాధాన్యతను వివరిస్తూ కొందరు, జిల్లా కరువు స్థితిగతులకు అద్దం పట్టేలా మరికొందరు కవులు తమ కవిత్వాన్ని చదివి వినిపించారు. నేటి తరానికి అచ్చతెలుగు భాషను అందించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంగ్లంపై మోజుతో తల్లిలాంటి తెలుగు భాషను పక్కన పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కవితలతో మెప్పించిన వారిని తెలుగు భాషా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతల్లో కవులు జాబిలి జయచంద్ర, ఏలూరి యంగన్న, రియాజ్, రఘురామయ్య, వెంకటేశులు, జూటూరు షరీఫ్లతో పాటు పలువురు ఉన్నారు. -
నాటకానికి జవసత్వాలు అందించాలి
సినీ,రంగ స్థల నటుడు జయప్రకాష్రెడ్డి కరీంనగర్కల్చరల్: నాటక రంగానికి కళాపోషకులు జీవం పోయాలని సినీ, రంగస్థల నటుడు జయప్రకాష్రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ కళాభారతిలో టీఎస్ఎన్పీడీఎల్ స్పోర్ట్స్, కల్చరల్ కౌన్సిల్ కరీంనగర్శాఖ ఆధ్వర్యంలో ‘ఈ లెక్క ఇంతే’ నాటక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి జయప్రకాష్రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. నాటకం ఇంకా బతికే ఉందని.. దానికి జీవసత్వాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంచి నాటకానికి ఆదరణ ఎప్పటికీ ఉంటుందని అన్నారు. అనంతరం ఈనెలలో ఉద్యోగ విరమణ చేయనున్న విద్యుత్ శాఖ ఎస్ఈ స్వర్గం రంగారావును విద్యుత్ ఉద్యోగులు ఘన ంగా సన్మానించారు. కార్యక్రమంలో బుల్లితెర నటులు ఆర్.అప్పారావు, టి.మురళి, సినీ రంగ స్థల నటులు రొడ్డ యాదగిరి, కేతిరి మల్లారెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ‘ఈ లెక్క ఇంతే’ నాటకంలో మంచాల రమేశ్, జ్యోతి, కొత్తకొండ సత్యనారాయణ, కిషన్రెడ్డి ప్రధానపాత్ర పోషించారు. అంతకుముందు నటుడు జయప్రకాష్రెడ్డిని కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, నేతికుంట యాదయ్య, రంగస్థల నటులు రోడ్డ యాదగిరి, ఆగస్టీన్, మల్లారెడ్డి తదితరులు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. -
చేనేత సంపదను కాపాడుకుందాం
మహబూబ్నగర్ వ్యవసాయం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేనేతవస్త్రాల తయారీలో మెళకువలు పాటించి నాణ్యమైన వస్త్రాలను తయారు చేయాలని జేసీ ఎం.రాంకిషన్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుల కార్యాలయం ఆవరణలో జరిగిన చేనేత దినోత్సవంలో ఆయన మాట్లాడారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారుచేసిన ఘనత జిల్లా చేనేత కార్మికులకే దక్కిందన్నారు. జిల్లాలోని గద్వాల, నారాయణపేట చేనేతవస్త్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. చేనేత కార్మికులు నేత పనిలో సాంకేతిక పద్ధతులను అలవర్చుకుంటే నంబర్వన్గా నిలుస్తామన్నారు. చేనేత వస్త్రాల విక్రయం కోసం అమెజాన్ వంటి కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ ఎం.రాంకిషన్ కోరారు. అంతకుముందు జిల్లాకేంద్రంలో చేనేత ర్యాలీని జేసి రాంకిషన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీ తిరుమల్రావు, సెరికల్చర్ డీడీ గోపాల్, డీఓలు జహీరుద్దీన్, సంతోష్, రాములు, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గట్టు వీరన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలను సంరక్షించాలి
కరీంనగర్రూరల్ : హరితహారంలో భాగంగా కరీంనగర్ మండలం ఎలగందల్లో గురువారం 50వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ సభ్యులు ఎడ్ల శ్రీనివాస్, ఎం.డీ జమీలొద్దీన్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిమ్మల అంజయ్య, సర్పంచ్ ప్రకాశ్, ఎంపీటీసీ రామస్వామి, తహశీల్దార్ జయచంద్రారెడ్డి, ఎంపీడీవో దేవేందేర్రాజు, ఈజీఎస్ ఏపీవో శోభ, ఆర్టీఏ సభ్యులు రమేశ్ పాల్గొన్నారు. రేకుర్తిలో సర్పంచ్ నందెల్లి పద్మప్రకాశ్ ఆధ్వర్యంలో ఖర్జురా, ఈత మొక్కలు నాటారు. ఉపసర్పంచ్ కృష్ణకుమార్, ఎంపీటీసీ శేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
కొడుక్కు కరెంట్ షాక్... కాపాడిన తండ్రి
వేమనపల్లి : మండలంలోని మంగనపల్లి గ్రామానికి చెందిన కంపెల మల్లేశ్ విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... మల్లేశ్ పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. తన గేదె ఇంటి పక్కనున్న పొలంలో మేత మేస్తోంది. సాయంత్రం కావటంతో గేదెను కట్టేసేందుకు దాని వద్దకు వెళ్లాడు. పొలంలోని విద్యుత్ స్థంభానికి ఉన్న సపోర్ట్ వైర్కు విద్యుత్ ప్రసారం అయ్యే విషయాన్ని గమనించలేదు. దాని కింద నుంచి వెళ్లగా సపోర్ట్వైర్ అతడి ఎడమ చేతికి తలిగి షాక్కు గురయ్యాడు. గమనించిన అతడి తండ్రి, వికలాంగుడైన వద్ధుడు ముత్తయ్య(78) తన ప్రాణాలు పోయినా సరేననుకుని తెగించి కొడుకును కాపాడాడు. ఫెన్సింగ్ పైనుంచి దూకి కర్ర సహాయంతో విద్యుత్ తీగెలను కొట్టాడు. అంతలోనే విద్యుత్ తీగెలు విడిపోయాయి. కాలు పట్టి అవతలికి లాగి కొడుకును కాపాడాడు. అపస్మారక స్థితిలో ఉన్న మల్లేశ్ను సోదరుడు వెంకటేశ్, కుటుంబసభ్యులు నీల్వాయి వాగు వద్దకు తరలించారు. వాగులో వరద నీరు ఎక్కువగా ఉన్నా ఎలాగోలా వాగు దాటి 108 అంబులెన్స్ సహాయంతో మంచిర్యాలకు తరలించారు. బాధితుడు ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో అత్యవసర వైద్యం అందిస్తున్నారు. -
నీటిని పొదుపుగా వాడండి
తల్పునూరు (గోపాల్పేట) : భావితరాల అవసరాల కోసం ఇప్పటి నుంచే నీటిని పొదుపు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్త మస్తాన్రావు రైతులకు సూచించారు. శనివారం చైతన్య రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆత్మ మహబూబ్నగర్ సౌజన్యంతో గోపాల్పేట మండలంలోని తల్పునూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చూడాలన్నారు. కాల్వల ద్వారా కాకుండా పైపులతో నీటిని పంట పొలాలకు పారించడం ద్వారా ఆదా చేయవచ్చన్నారు. బిందు, తుంపర సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జామసామేల్, ఎన్జీఓ వీఎస్ఎస్ ఆంజనేయులు, రైతులు శేఖర్రెడ్డి, కష్ణమ్మ, సాయిరెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
మాకు న్యాయం చేయండి..
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను కలిసిన యడవల్లి ఎస్సీలు చిలకలూరిపేట రూరల్ : యడవల్లి వీకర్స్ లాండ్ సొసైటీలో సభ్యులమైన తమ భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోకుండా న్యాయం చేయాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన ఎస్సీలు బుధవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ కమలమ్మను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ భూముల విషయమై గతంలోనే యడవల్లి గ్రామానికి చెందిన ఎస్సీలు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్పర్సన్కు అర్జీ అందజేశారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ సంబంధిత నివేదికలతో హాజరు కావాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, గ్రామానికి చెందిన ఎస్సీలకు లేఖలు పంపారు. ఈ విషయమై కమిషన్ చైర్పర్సన్ను ఢిల్లీలోని కార్యాలయంలో యడవల్లి గ్రామస్తులు, న్యాయవాది ప్రసన్నకుమార్, గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు బి.శ్రీనునాయక్ కలిశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఫోన్ ద్వారా సాక్షికి తెలిపారు. కష్ణా పుష్కరాల నేపథ్యంలో వివిధ పనుల్లో ఉన్నామని సంబంధిత ప్రభుత్వ అధికారులు విన్నవించారని, మరో విడత వారు హాజరయ్యేలా లేఖలు పంపుతామని కమిషన్ చైర్పర్సన్ తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఎస్సీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. -
జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలి: బండా శ్రీశైలం
కోదాడ: కరువుతో జిల్లా రైతాంగం, పనులు లేక వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండా శ్రీశైలం కోరారు. ఆదివారం కోదాడలోని సందరయ్య భవన్లో జరిగిన ఆ సంఘం డివిజన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల వల్ల వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకు పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించినప్పటికీ పలు కంపెనీలు ఇంకా ధరలు తగ్గించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు బ్యాంక్ రుణాలు ఇవ్వకుండా సతాయిస్తున్నాయన్నారు. పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం వల్ల అధిక వడ్డీలు చెల్లించలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కంది, పెసర కల్తీ విత్తనాలు సరఫరా చెయడం వల్ల రైతులు నష్టపోయారని,కల్తీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జుట్టుకొండ బసవయ్య, ఏనుగుల వీరాంజనేయులు, బుర్రి శ్రీరాములు, వీరయ్య, వెంకటేశ్వర్లు, బిక్షం తదితరులు పాల్గొన్నారు. -
ఓ రిస్ట్బ్యాండ్ మీ జీవితాన్ని కాపాడుతుంది!
లండన్: జేమ్స్బాండ్ సినిమాలోని హీరో క్యారెక్టర్ సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన పరికరాలతో ప్రత్యర్థులను బురిడీ కొట్టిస్తాడు కదా!. సరిగ్గా అలాంటి పరికరమే ఒకటి రూపొందించబడింది. కాకపోతే అది ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కాదు.. ఎవరికి వారు క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను కాపాడుకోవటానికి. సరికొత్త రిస్ట్బ్యాండ్ ఆవిష్కరణ ఇప్పుడు జేమ్స్బాండ్ చిత్రంలోని టెక్నాలజీని గుర్తుచేస్తోంది. కింగ్లీ అనే రిస్ట్బ్యాండ్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. అన్ని రిస్ట్బ్యాండ్లలా ఇది కేవలం అలంకరణకే కాకుండా ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోతే ఇది కాపాడుతోంది. నీటిలో మునిగినప్పుడు దీనికి గల మీట నొక్కితే చాలు దీనిలో అదృశ్యంగా ఉన్న బెలూన్ ఓపెన్ అయిపోతుంది. అలా నీటిలో మునిగిన వారు పైకి తేలడానికి ఇది తోడ్పడటమే కాకుండా.. వారికి సంబంధించిన వ్యక్తులను సైతం ఇది అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతం దీని మార్కెట్ ధర సుమారు రూ. 7 వేల వరకూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఏటా నీటిలో మునిగిపోవటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ రిస్ట్బ్యాండ్ ఉపయుక్తంగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. -
పులితో కుక్క ఫైట్...
షాజహాన్ పూర్: యజమానికి విధేయతను ఎల్లప్పుడూ చాటుకుంటూ ఉండే జీవి కుక్క. నిద్రపోతున్న యజమానిని కాపాడటానికి ఏకంగా పులితో పోరాడి ఓ కుక్క ప్రాణాలు వదిలింది. ఉత్తరప్రదేశ్ లోని దుద్వా జాతీయ పార్కు సమీపంలోని బార్బాత్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యజమాని గురుదేవ్ సింగ్ తన కుక్కతో పాటు ఇంటి బయట పడుకున్నాడు. అర్ధరాత్రి అలికిడి విని దక్షిణ ఖేరి అడవి నుంచి వస్తున్న పులిని చూసిన జాకీ(కుక్క) యజమానిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించింది. గాఢమైన నిద్రలో ఉన్న సింగ్ ఏం జరుగుతుందో గమనించే లోపే పులి అతని మీద దాడికి దిగింది. దీంతో జాకీ ఒక్క ఉదుటున పులి మీదకు దూకి యజమానికి కాపాడటానికి ప్రయత్నించింది. పులి తిరిగి దాడి చేసి జాకీను అడవిలోకి లాక్కుని వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న సింగ్ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని జాకీ కోసం ఆ ప్రాంతాన్నంతా తీవ్రంగా గాలించారు. సాయంకాల సమయంలో అటవీశాఖ అధికారులు అందించిన సమాచారంతో దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన జాకీకి అంత్యక్రియలు నిర్వహించారు. జాకీ తల్లి ఒక వీధి కుక్క అని, తన పిల్లలు సుప్రీత్, గుల్షన్ ప్రీత్ లు చిన్నప్పుడే దాన్ని తీసుకువచ్చారని సింగ్ తెలిపారు. పిల్లలతో పాటు వారి వెనుకే స్కూల్ కి వెళ్లేదనీ, గుల్షన్ జాకీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. అరణ్యంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉందనీ, అప్పుడప్పుడు ఆహారం కోసం జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎన్ యాదవ్ తెలిపారు. -
పోతున్న ప్రాణాలు ఒడిసిపట్టింది
బ్రిస్టల్: 'ఒక్క నిమిషం ముందు వచ్చి ఉంటే బతికుండే వాడు' సాధారణంగా ఇది అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వైద్యుల నోట వినిపించే డైలాగ్. ఈ మాట వినగానే అతడి తలరాత అంతేలే అందుకే చనిపోయాడని అనుకుంటాం. కానీ, వాస్తవానికి ఆ నిమిషానికి సరిగ్గా కాపలా కాస్తే పోయే ప్రాణాన్ని అరచేతపట్టుకొని తిరిగి ఆ వ్యక్తిని బతికించవొచ్చని బ్రిస్టల్ నగరంలో నిరూపితం అయింది. పట్టపగలే కత్తిపోట్లతో పడి ఉన్న ఓ 40ఏళ్ల బిల్డర్ను చూసి అందరూ తమకెందుకులే అని వెళ్లిపోతుండగా నర్సుగా పనిచేస్తున్న ఆమె మాత్రం ఆగిపోయింది. తన స్నేహితుడితో కలిసి అతడి వద్దకు గబాగబా వెళ్లి మొకాలిపై కూర్చొని అతడి ప్రాణం కోసం ఎంతో ఆరాటపడింది. అతడు ఎవరూ ఏమిటీ అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. డిగ్నిటీ అనే అహంకారానికి వెళ్లకుండా నేరుగా అతడి చేయి చేతుల్లోకి తీసుకొని పల్స్ చెక్ చేసింది. శ్వాస కూడా ఆగిపోయిన ఆ వ్యక్తికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) పద్ధతి ద్వారా తిరిగి ఊపరిపోసింది. అంతకుముందు అతడి ఛాతీపై తన శాయశక్తులా బలంగా నొక్కుతూ క్షణాల్లో దూరమవుతున్న ఆయుషును తిరిగి తనకు అందించింది. అలా దాదాపు ఐదు నిమిషాలపాటు రోడ్డుపక్కనే ఓ ప్లాట్ ఫాం పై పడుకోబెట్టి ఆమె చేసిన సేవ అంతా ఇంత కాదు. ఆ వెంటనే బాధితుడిని బ్రిస్టల్ లోని సౌత్ మెడ్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు నిలబెట్టింది. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిమితంగానే ఉంది. -
ఆ చర్యతో కేంద్రానికి 21,000 కోట్ల మిగులు!
న్యూఢిల్లీ: ఎల్పీజీ సబ్సిడీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ప్రస్తుత విధానం ద్వారా గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఖజానాకు రూ. 21,000 కోట్ల మిగులుబాటు నమోదైంది. ఈ విషయాన్ని బుధవారం స్వయంగా ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమచేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2014 నవంబర్లో దేశంలో కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పటకీ 2015 జనవరి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారా 3.34 కోట్ల నకిలీ లబ్దిదారులకు సబ్సిడీ ఫలాలను అందకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 14,672 కోట్లు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 7,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలిందని ఢిల్లీలో సబ్సిడీలపై నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 2015-16లో సేవింగ్స్ తగ్గడానికి కారణం ప్రపంచ మార్కెట్లో చమురు ధర తక్కువగా ఉంటమేనని ఆయన తెలిపారు. -
ఆధార్తో ఏటా 6,700 కోట్లు ఆదా: ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్: ఆధార్ వల్ల భారత ప్రభుత్వానికి ఏటా వంద కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)ఆదా అవుతాయని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. ఆధార్ డిజిటల్ గుర్తింపు కార్డ్ వల్ల అవినీతి తొలగి ఈ స్థాయిలో ప్రభుత్వానికి సొమ్ములు ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు చెప్పారు. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2016: డిజిటల్ డివిడెండ్స్ పేరుతో ప్రపంచ బ్యాంక్ రూపొందించిన నివేదికను విడుదల చేస్తూ బసు ఈ విషయాలు వెల్లడించారు. -
పాతబస్తీలో మైనర్ బాలికకు అశ్రయం
-
కాఫీ మీ జీవితాన్ని కాపాడుతుంది..!
కాఫీ తాగడం అలవాటుపై అనేక అనుమానాలు, అపోహలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా పరిశోధకులు మాత్రం... కాఫీ తాగడం జీవితాన్నే కాపాడుతుందంటున్నారు. రోజుకు నాలుగైదు కప్పుల కాఫీ తాగడం జీవన పరిమాణాలనే పెంచుతాయంటున్నారు. అసలు కాఫీనే తాగే అలవాటు లేని వారికన్నా కాఫీ తాగేవారు ఎక్కువ కాలం బతుకుతున్నారని, మధుమేహం, గుండె జబ్బులనుంచి వచ్చే ప్రమాదాలను కూడా అరికట్టేందుకు కాఫీ సహకరిస్తుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, అకాల మరణాలు, న్యుమోనియా, ఇన్ఫ్లుయంజా వంటి వ్యాధుల వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండడంతోపాటు ఆత్మహత్యలకు పాల్పడాలన్న ఆలోచనల నుంచి కూడా కాఫీ దూరం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. పది సంవత్సరాలపాటు (1998 నుంచి 2009) సుమారు లక్షమంది నడివయస్కులపై చేసిన పరిశోధనల్లో కాఫీ తాగనివారికంటే తాగేవారు ఎక్కువకాలం బతికినట్లుగా తెలుసుకున్నారు. కాఫీలోని ఫినోలిక్ యాసిడ్లు, పొటాషియం, కెఫిన్ సహా మనుషుల జీవనంపై క్రియాశీలకంగా పనిచేస్తామయని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అధ్యయన రచయిత డాక్టర్ ఎరిక్కా లాఫ్టిఫైడ్ తెలిపారు. అలాగే ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగే వారికి వ్యాధుల ప్రమాదం అత్యల్పంగా ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే కాఫీ తాగేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. కొన్ని క్యాన్సర్ల తో బాధపడే వారికి కాఫీ అలవాటువల్ల కొంత జీవన కాలం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు గర్భిణిలు కాఫీ తాగొచ్చా కూడదా అన్న విషయంపై కూడ అనుమానాలను తాజా పరిశోధనలు తీరుస్తున్నాయి. రోజుకు సుమారు రెండు వందల మిల్లీగ్రాముల కెఫెన్ కలిగిన కాఫీని గర్భిణిలు కూడా తాగొచ్చని అమెరికన్ అబ్ స్టెట్రీషియన్స్, గైనకాలజిస్ట్ ల కళాశాల అధ్యయనకారులు చెప్తున్నారు. రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారిలాగే ప్రతిరోజూ అలవాటుగా కాఫీ తాగేవారు కూడ ఆరోగ్యంగానే ఉంటారని తెలుస్తోంది. అయితే అప్పటికే అనారోగ్యంతో బాధపడేవారు మాత్రం కాఫీ తాగకుండా ఉండటమే మంచిదంటున్నారు. ఏది ఏమైనా కాఫీ రోజువారీ జీవితంలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే పానీయంగా అధ్యయనకారులు చెప్తున్నారు. -
నదులను కాపాడే సీతాకోకచిలుకలు!
రంగు రంగు రెక్కలతో.. హరివిల్లును తలపిస్తూ...పచ్చని చెట్లపై ఎగిరే అందమైన సీతాకోక చిలుకలు.. చూపరులకు కనువిందు చేస్తాయి. మొక్కలపై వాలి.. వాటి పూల పుప్పొడితో ఆ జాతి అభివృద్ధికి దోహద పడతాయి. ఇప్పటికే సీతాకోకచిలుకలు ప్రపంచంలోని అనేక ఇతర జీవుల కన్నా శక్తివంతమైనవిగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం నదులను కాపాడ్డంలోనూ, అడవుల ఆరోగ్యాన్ని రక్షించడంలోనూ ఈ కీటకాలు సహాయపడతాయంటున్నారు పరిశోధకులు. సుమారు ఆరు దశాబ్దాలుగా సీతాకోక చిలుకల సమగ్ర జాబితాను తయారు చేస్తున్నారు సైంటిస్టులు. ఉత్తరాఖండ్ నైనిటాట్ జిల్లా భిట్మాల్ లోని బట్టర్ ఫ్లై రీసెర్చ్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్త స్మెటాసెక్...ఏళ్ళ తరబడి సీతాకోకచిలుకల సంగ్రహణకు పాటుపడుతూనే వాటి కొత్త జాబితానూ రూపొందిస్తున్నారు. స్మెటాసెక్... తన పరిశోధనల్లో భారతదేశ వ్యాప్తంగా 1,318 రకాల సీతాకోక చిలుకల జాతులు ఉన్నట్లుగా కనుగొన్నారు. సంవత్సరాల కాలం సీతాకోకచిలుకల సంగ్రహణలోనే గడిపిన స్మెటాసెక్... వాటిని పత్రబద్ధం చేయడమే కాక, అవి ఇండియాలోని నదులను కాపాడేందుకు ఎంతగానో సహకరిస్తాయని చెప్తున్నారు. క్రిమి కీటకాలను ఉపయోగించి అడవుల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రతయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సీతాకోక చిలుకల జాబితాను సేకరిస్తున్నామని, అవి ఎక్కడ ఏ రకంగా ఉన్నాయో తెలిస్తే.. వాటి జాతుల వర్గీకరణను స్పష్టం చేయవచ్చని, ఆపై అడవుల ఆరోగ్యాన్ని కనిపెట్టవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే ముందుగా వాటి జాబితాను సిద్ధం చేస్తున్నారు. భారత దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన జాతులు ఉన్నట్లుగా కనుగొన్నామని, ముఖ్యంగా నదీ ప్రాంతాల్లో ఉన్న సీతాకోక చిలుకలు నీటి ఆరోగ్యాన్ని పెంపొందించేవిగా ఉన్నాయని సైంటిస్ట్ స్మెటాసెక్ చెప్తున్నారు. నిజానికి అటవీశాఖ వారు అడవుల్లోని క్రిమి కీటకాలు, పక్షులు, ఇతర జాతుల వివరాలను సేకరించడం, వాటి లెక్కలను తెలపడంవల్ల నదీతీరాల్లోని అడవుల ఆరోగ్యం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని సీతాకోక చిలుకల నిపుణులు అంటున్నారు. వాటి జన్మ స్థలాన్ని బట్టి అక్కడి పర్యావరణ సమాచారం ఆధారంగా జల భద్రతను నిర్థారించేందుకు, నదీ ప్రవాహం స్థిరీకరించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు. సీనాకోక చిలుకలు.. మొక్కల పరపరాగ సంపర్కానికి మాత్రమే కాక... కప్పలు, కందిరీగలు, పక్షులు, పలు రకాల కీటకాలకు, ఇతర జాతులకు ఆహారాన్ని అందించడంలోనూ ఉపయోగపడతాయట. స్వాతంత్ర్యానంతరం భారత దేశంలో ప్రత్యేకంగా ఓ సీతాకోక చిలుకల జాబితా తయారు చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఎటువంటి జాతులు ఉన్నాయనేది ఎవ్వరూ తెలుసుకోలేదు. ప్రస్తుతం ఇండియాలో సైంటిస్ట్ స్మెటాసెక్ తో పాటు, జూలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆర్కే వర్స్ నే... అటువంటి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇండియాలోని కేరళ, కర్నాటక ప్రాంతాల్లో మాత్రమే వైవిధ్యంగా కనిపించే ట్రావెన్కోర్ ఈవెనింగ్ బ్రౌన్ సీతాకోకచిలుకలు ఉన్నాయని, అంతరించిపోతున్న ఇటువంటి జాతికి సమీపంగా కనిపించే కొన్ని జాతులు దక్షిణ ఆమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. రక్షిత ప్రాంతాల్లో ఇటువంటి జాతులు ఉండటం ఎంతో అదృష్టమని స్మెటాసెక్ తెలిపారు. -
ప్రాణాలకు తెగించిన కస్టమర్
ముంబయి: ఆర్ధిక రాజధాని ముంబయి నగర వీధిలో దారుణం చోటుచేసుకోబోయింది. వికలాంగుడైన రజ్నీష్ సింగ్ ఠాకూర్ అనే ఓ మొబైల్ షాప్ యజమానిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో షాపులో ఫోన్ కొనేందుకు వచ్చిన ఒక వినియోగదారుడు ఎంతో ధైర్యం చేసి ఆ వ్యక్తిని అడ్డుకోవడమే కాకుండా తన చేతుల్లో బంధించి పక్కన ఉన్న వ్యక్తులకు అప్పజెప్పాడు. ఆ వినియోగ దారుడు సాహసం చేసి ఉండకపోతే ఆ యజమాని చనిపోయేవాడు. అప్పటికే హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రెండుసార్లు కత్తితో దాడి చేయడంతో చేతికి, మెడకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ దృశ్యం అంతా కూడా ఆ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన వెనుక మొత్తం ఆరుగురు వ్యక్తుల హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి మరో ఇద్దరి కోసం గాలింపులు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే.. ఈ మధ్య రౌడీయిజం చేస్తూ కొందరు వ్యక్తులు రోజుకు వెయ్యి రూపాయలు తమకు చెల్లించాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలని, ఎవరైనా మాముళ్లు ఇస్తే వారి షాపులు తగులబెడతామని కూడా ఆ పోస్టర్లో హెచ్చరించారు. దీంతోపాటు ఎవరైనా వసూళ్లకు పాల్పడేవారు వస్తే తనకుగానీ, తన సోదరుడికిగానీ ఫోన్ చేయవచ్చని కూడా అందులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే వసూళ్లకు పాల్పడేవారు మొత్తం ఆరుగురు కలిసి రజ్నీష్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఆరుగురిలో ఐదుగురు కారులో కూర్చోగా ఒకరు మాత్రం కత్తితో వచ్చి సింగ్ పై దాడి చేయగా ఓ వినియోగదారుడు ధైర్యంగా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సింగ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ కస్టమర్ లేకుంటే తన సోదరుడు చనిపోయేవాడని సింగ్ సోదరుడు తెలిపాడు. -
'చిత్రహింసలు భరించలేకున్నా.. కాపాడండి'
ఆదోని (కర్నూలు): మనవడి గుండె ఆపరేషన్కు చేసిన అప్పు తీర్చేందుకు సౌదీ అరేబియా వెళ్లిన మహిళ అక్కడి ఇంటి యజమానురాలి చిత్రహింసలు భరించలేక తిరిగొచ్చే ఏర్పాట్లు చేయాలని కూతురిని బతిమాలుతోంది. వివరాలు.. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విజయభాస్కర్రెడ్డి నగర్కు చెందిన ఖాజాబాను(50)కు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు ఆయేషా, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసింది. ఆమె కూతురు వద్దే ఉంటోంది. కూలీ పనులకు వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితి. ఆయేషా కొడుకు మహబూబ్(4) గుండెకు చిల్లు పడటంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించినా.. ఖర్చులకు రూ.50వేలకు పైగా అప్పు చేసింది. వడ్డీ కట్టలేకపోవడంతో అప్పు రెట్టింపయింది. ఈ పరిస్థితుల్లో ఖాజాబాను తనకు తెలిసిన వారి ద్వారా ముంబైకి వెళ్లి ఓ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఆ తర్వాత తన మహమ్మద్ అనే వ్యక్తి ప్రతిపాదనతో సౌదీ వెళ్లేందుకు తిరిగి ఆదోనికి చేరుకుంది. సౌదీ వెళ్లే ప్రయత్నంలో కడప జిల్లా రాయచోటికి చెందిన బాషా అనే ఏజెంట్ గత డిసెంబర్లో వీరిని సంప్రదించాడు. షేక్ల ఇంట్లో పని మనిషిగా చేరితే నెలకు రూ.20వేల జీతం ఇస్తారని.. అంగీకరిస్తే అన్ని ఏర్పాట్లు చేస్తానన్నాడు. ఆ మేరకు పాస్పోర్టు, వీసా సిద్ధం కాగా.. గత ఫిబ్రవరి 3న ఖాజాబాను హైదరాబాద్ చేరుకుని, 5న సౌదీకి బయలుదేరింది. అక్కడి షేక్ ఇంట్లో పని మనిషిగా కుదిరిన ఆమెకు.. అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. -
నాణ్యతను కాపాడండి
కొరియర్ సర్వీసుల విస్తరణ తర్వాత పోస్టల్ సేవల పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గిన మాట నిజమే. కానీ నేటికీ తపాలా శాఖ సేవలే సామాన్యులకు అందుబాటులో ఉన్నాయనేది తిరుగులేని వాస్తవం. క్రమక్రమంగా కొరియర్ సర్వీసుల నాణ్యత తగ్గి, చార్జీలు మాత్రం విపరీతంగా పెరిగిపోవడంతో ఇటీవలి కాలంలో పలువురు తపాలా శాఖ సేవలపైవే మొగ్గు చూపుతున్నారు. అయితే తపాలా శాఖ వారు అందిస్తున్న స్టేష నరీలో నాణ్యత కొరవడుతోంది. ఇన్ల్యాండ్ లెటర్కు వాడే కాగితం మరీ పలచబడి పోయి, రాసేవారికి ఇబ్బందికరంగా మారింది. ఎన్వలప్ కవర్ల పరిస్థితీ అంతే. చేరాల్సిన చోటికి చేరే సరికే చిరిగిపోతున్నాయి. ఒక్క పోస్టు కార్డు మాత్రం పాత నాణ్యతను నిలబెట్టుకుంటోంది. కవర్లపై అంటించాల్సిన పోస్టల్ స్టాంపులకు వెనుక ఉండాల్సిన జిగురు చాలా నాసి రకంగా ఉంటోంది. ఎంత కొత్త స్టాంపులైనా అంటుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో కొరియర్ సర్వీసుల పట్ల మోజు తగ్గి తిరిగి పోస్టల్ సర్వీసులవైపు దృష్టి సారిస్తున్నారు. కాబట్టి తపాలాశాఖ, తాము అందిస్తున్న సామగ్రి నాణ్యతపై దృష్టిని కేంద్రీకరించాలి. తద్వారా పోస్టల్ శాఖ పూర్వ ప్రాభవాన్ని సం పాదించుకోగలుగుతుంది. - గూరుడు అశోక్ గోదూర్, కరీంనగర్ జిల్లా -
రైతులను ఆదుకోండి: జానారెడ్డి