shock
-
అమెరికాలో ఉద్యోగులకు మస్క్ బిగ్ షాక్..!
వాషింగ్టన్:అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్ ఇలాన్ మస్క్ పెద్ద షాక్ ఇచ్చారు. ఈ మేరకు మస్క్ శనివారం(ఫిబ్రవరి22) ఎక్స్(ట్విటర్)లో ఒక షాకింగ్ పోస్టు చేశారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని బాంబు పేల్చారు. Consistent with President @realDonaldTrump’s instructions, all federal employees will shortly receive an email requesting to understand what they got done last week.Failure to respond will be taken as a resignation.— Elon Musk (@elonmusk) February 22, 2025 మస్క్ తన ట్వీట్లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్ అందాయి. ఈ మెయిల్లో ఐదు బుల్లెట్ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం.ఈ మెయిల్కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. మస్క్ నేతృత్వంలోని ఉద్యోగుల సంఖ్య తగ్గించడంలో డీవోజీఈ మరింత దూకుడుగా వెళ్లాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిన గంటల్లోనే ఉద్యోగులకు మెయిళ్ల రూపంలో షాక్ తగలడం గమనార్హం. అయితే మస్క్ మెయిళ్లపై ఫెడరల్ ఉద్యోగుల యూనియన్ తీవ్రంగా స్పందించింది. చట్టవ్యతిరేకంగా ఉద్యోగులను తొలగిస్తే కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. తాము ఎంతో కష్టపడి ముఖ్యమైన విభాగాల్లో ప్రజలకు సేవ చేస్తుంటే ట్రంప్ మరోసారి తమను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. -
కోర్టులో పులివెందుల పోలీసులకు చుక్కెదురు
-
కరీంనగర్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి,కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే కరీంనగర్లో ఆ పార్టీకి తాజాగా బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నగర మేయర్ సునీల్రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం(జనవరి25) కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు. ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయాలు అందించారు.2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించారు. అయితే తర్వాత ఏడాది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో పార్టీకి కీలక నేతగా ఉన్న సునీల్రావు బీజేపీలోకి వెళుతుండడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. -
విద్యుత్ షాక్కు నలుగురు యువకులు బలి
ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణపై స్థానికంగా రెండు సామాజికవర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇటీవల వివాదాన్ని పరిష్కరించారు. ఈ నేపథ్యంలో సోమవారం గౌడ సామాజికవర్గం వారు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు, అన్నసమారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు 25 అడుగుల భారీ ఫ్లెక్సీ కడుతుండగా వారికి 11కేవీ విద్యుత్ వైరు తగిలింది. తీవ్ర విద్యుదాఘాతానికి గురై బొల్లా వీర్రాజు (25), కాసగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (29) అక్కడికక్కడే మృతిచెందారు. కోమటి అనంతరావు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందినవారిలో కాసగాని కృష్ణకు పెళ్లి కాగా, మిగిలిన ముగ్గురు అవివాహితులు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తొలుత పశి్చమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ యువకులు అందరూ కొబ్బరి ఒలుపు కారి్మకులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తాడిపర్రు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. త్వరలో కొత్త మార్పులు
ఎస్బీఐ కార్డ్ తమ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నియమాలలో రెండు పెద్ద మార్పులను చేసింది. నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగం ఎక్కువైంది. చాలా మంది ఇప్పుడు విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులను కూడా క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని ఉపయోగిస్తున్నయితే ఇది త్వరలో కొంచెం ఖరీదైనది కావచ్చు.యుటిలిటీ బిల్లు చెల్లింపుపై ఛార్జీఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లించడం కొంతమంది కస్టమర్లకు ఖరీదైనదిగా మారనుంది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50 వేల కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లును చెల్లిస్తే దానిపై 1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ కార్డ్ తెలిపింది. యుటిలిటీ బిల్లు రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే దానిపై ఎటువంటి అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.ఫైనాన్స్ ఛార్జీలోనూ మార్పుశౌర్య/డిఫెన్స్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ల ఫైనాన్స్ ఛార్జీలో కూడా ఎస్బీఐ కార్డ్ కొన్ని మార్పులు చేసింది. ఆయా కార్డులపై 3.75 శాతం ఫైనాన్స్ ఛార్జీ విధించనుంది. ఈ మార్పు నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది. ఇక్కడ అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్లు అంటే ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేదా పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేనివి. -
నోయిడా వాసికి రూ.4 కోట్ల కరెంటు బిల్లు
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో రైల్వే ఉద్యోగి బసంత్శర్మకు జూన్ నెల కరెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ఓ రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతుండగా అద్దెకు ఇచ్చిన తన ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు మెసేజ్ వచ్చింది.ఏకంగా రూ.4 కోట్ల కరెంటు బిల్లు జులై 24కల్లా కట్టాలని ఆ మెసేజ్లో ఉంది. అది చూసి తొలుత ఆశ్చర్యపోయి తర్వాత కంగారుపడ్డాడు. టెనెంట్కు ఫోన్ చేసి కనుక్కుంటే సాధారణంగా వాడినట్లే జూన్లోనూ విద్యుత్ వాడామని సమాధానమిచ్చాడు.దీంతో బసంత్శర్మ విద్యుత్ అధికారులకు ఫోన్ చేశాడు. వారు చెక్చేసి చూడగా ఎర్రర్ కారణంగా కంప్యూటర్ జనరేటెడ్ బిల్లులో పొరపాటు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బిల్లును సరిచేసి పంపడంతో బసంత్ శర్మ ఊపిరి పీల్చుకున్నాడు. -
బాంబే హైకోర్టు షాక్.. జైలుకు చంద్రబాబు?
-
కునాల్ఘోష్కు తృణమూల్ షాక్
కోల్కతా: పార్టీ ప్రధాన కార్యదర్శి కునాల్ఘోష్కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాక్ ఇచ్చింది. ఆ పదవి నుంచి ఘోష్ను తప్పిస్తూ పార్టీ హైకమాండ్ బుధవారం(మే1) ఆదేశాలు జారీ చేసింది.ఇంతకుముందే ఘోష్ను అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించిన పార్టీ హైకమాండ్ తాజాగా ఆయనను ప్రధాన కార్యదర్శి పదవిని కూడా తొలగించింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తపస్రాయ్పై ఘోష్ బుధవారం బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు. తపస్రాయ్ పార్టీ మారడం సరైందేనని, తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్సే సరైన దిశలో వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తృణమూల్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఘోష్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. -
Red Sea: ‘హౌతీ’ రెబల్స్కు అమెరికా షాక్
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నహౌతీ గ్రూపు మిలిటెంట్లకు అమెరికా, బ్రిటన్ సంయుక్త దళాలు షాక్ ఇచ్చాయి. హౌతీలకు చెందిన డజన్ల కొద్దీ డ్రోన్లను శనివారం రాత్రి కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘హౌతీలకు చెందిన 28 దాకా అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్(యూఏవీ)ను ఎర్ర సముద్రంలో తాజాగా కూల్చివేశాం. హౌతీల దాడిలో అమెరికా సంయుక్త దళాల నౌకలతో పాటు వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదు’ అని అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) వెల్లడించింది. శనివారం ఉదయం అమెరికా డెస్ట్రాయర్ నౌకలు, వాణిజ్య కార్గో నౌకల మీద 37 డడ్రౌన్లతో పెద్ద ఎత్తున హౌతీలు దాడికి దిగాయి. దీనికి ప్రతిగా రంగంలోకి దిగిన అమెరికా సంయుక్త దళాలు హౌతీల డ్రోన్లను కూల్చివేశాయి. కాగా, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వద్ద అమెరికా, ఇజజ్రాయెల్లకు చెందిన వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. ఈ దాడులు గత ఏడాది నవంబర్ నుంచి మొదలయ్యాయి. వీటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్త దళాలు తిప్పికొడుతున్నాయి. ఇదీ చదవండి.. కెనడాలో ట్రూడో వ్యతిరేక పవనాలు -
చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి?
సాక్షి, చిత్తూరు: కుప్పం నుంచి పారిపోయే యోచనలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్లలో సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారాయన. కనీసం మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. తన మన పార్టీ భేదాలు లేకుండా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఓ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేద్దామనుకుంటున్నానని బహిరంగ సభలో ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం రూపురేఖల్ని మార్చేశారు, భారీగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది. తాజాగా.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. కుప్పం నుంచి పోటీకి ఆసక్తికనబరుస్తూ నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో 35 ఏళ్ల నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు రెస్ట్ ఇచ్చి.. తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారామె. బహిరంగ సభలో భువనేశ్వరీ ఏమన్నారంటే.. "కుప్పంకు వచ్చాను.. ఇక్కడ నాకొక కోరిక ఉంది నా మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది (సభకు వచ్చిన వారిని ఉద్దేశిస్తూ..) నేనేమి మిమ్మల్ని కొట్టను.. తిట్టను 35ఏళ్లుగా చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు నాకొక కోరిక ఉంది ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెబుతున్నా నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా" చంద్రబాబు అస్త్ర సన్యాసం.!? భువనేశ్వరీ చేసిన ప్రకటన రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రకటనగా చూడాలి. చాలా కాలంగా చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. సరిగా ఎన్నికలకు రెండు నెలల ముందు భార్య భువనేశ్వరీతో ప్రకటన చేయించాడని భావిస్తున్నారు. పైగా భువనేశ్వరీ మాటల్లో స్పష్టంగా ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు విశ్రాంతి కావాలని చెబుతున్నారు. చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో రోగాలున్నాయని కోర్టుకు నివేదిక రూపంలో ఇచ్చారు. అసలే అనారోగ్యం.. ఆపై వయస్సు మీద పడడం.. చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. వృద్ధాప్యం పెరగడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొడుకు లోకేష్ను ఎంత ఎంకరేజ్ చేసినా.. ఫలితం లేకపోవడంతో రాజకీయాల నుంచే తప్పుకోవడం మేలని టిడిపిలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు తప్పుకోవడానికి కారణమేంటీ? కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలున్నాయి. నాలుగు చోట్ల YSRCP గెలిచింది కుప్పం నగర పంచాయతీలో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది కుప్పం మండలంలోని 29 పంచాయతీల్లో 25 చోట్ల YSRCP గెలిచింది కుప్పంలో వరుస ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా తప్పుకోవడం మేలని భావిస్తున్నారు కుప్పం పట్టణాన్ని చంద్రబాబు హయాంలో మున్సిపాలిటీ చేయలేదు. 2019 తర్వాత సీఎం జగన్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అయింది కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండ్ను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. గత ఏడాది సీఎం జగన్ వచ్చిన తర్వాత రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు కుప్పంలో తాగునీటి సమస్యకు చంద్రబాబు పరిష్కారం చూపించలేదు. ఈ పనులను సీఎం జగన్ పూర్తి చేయించి ఈ నెలలో పరిష్కారం కల్పిస్తున్నారు కుప్పంలో దొంగ ఓట్ల తొలగింపు అత్యంత కీలకమైన విషయం. ఏకంగా 30వేల దొంగ ఓట్లు ఉన్నట్టు వైఎస్సార్సిపి ఫిర్యాదు చేసింది. వీటిని ఎన్నికల సంఘం తొలగించడంతో టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అత్యంత ప్రతికూలతలున్న ప్రస్తుత సమయంలో తాను పోటీ చేసి ఓడిపోవడం సరికాదన్న ఆలోచనలో బాబు ఉన్నారు భరత్, కుప్పం YSRCP ఇన్ఛార్జ్ "అన్ని స్థానిక సంస్థల్లో YSRCP విజయం సాధించింది. తాజా సర్వేల్లో ఓడిపోతానని చంద్రబాబుకు అర్థమయింది. ఎలాగూ ఓడిపోతానని తేలిపోవడంతో చంద్రబాబు పలాయనవాదం ఎంచుకున్నట్టుంది. అందుకే భువనేశ్వరీతో ఎన్నికల ముందు ఈ ప్రకటన చేయించాడు. చంద్రబాబు హయాంలో కుప్పంలో పార్టీ వివక్ష వీపరీతంగా సాగింది. టిడిపికి చెందిన వాళ్లకు మాత్రమే పనులు జరిగాయి. 2019 తర్వాత ప్రజలు స్పష్టమైన మార్పు చూస్తున్నారు. అర్హులైన వారు ఏ పార్టీ అయినా సంక్షేమం అందింది. జగన్ రూపంలో గొప్ప నాయకత్వాన్ని చూశారు. ఓటమి కళ్ల ముందు కనబడడంతో చంద్రబాబు ముందే కుప్పం నుంచి పారిపోతున్నారు." చంద్రబాబు కింకర్తవ్యం.!? చంద్రబాబు గత కొన్నాళ్లుగా పెనమలూరు నియోజకవర్గంపై కన్నేశారు. కుప్పంలో ఎలాగూ గెలవలేను కాబట్టి .. తన సామాజిక వర్గం అంటే కమ్మ ఓటర్లు అత్యధికంగా ఉన్న పెనమలూరు అయితే తనకు సేఫ్ అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తొలుత విశాఖ అనుకున్నా.. అక్కడ గెలిచే అవకాశం లేదని పార్టీ సర్వేల్లో తేలింది. దీంతో కుప్పంను వదిలిపెట్టి పెనమలూరులో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు చంద్రబాబు. 2019లో పెనమలూరులో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది. ఇక్కడ గెలిచిన పార్థసారథిని తెర వెనక ఏం చేశారో కానీ తనవైపునకు తిప్పుకున్నారు చంద్రబాబు. భువనేశ్వరీ ప్రకటనను ఎలా చూడాలి? భువనేశ్వరీ ప్రకటన సరదా కామెంట్ కాదు భువనేశ్వరీ ఏ సభలో ఎలా మాట్లాడాలి అన్నది పక్కగా స్క్రిప్టింగ్ చేస్తారు ముందే ఏం చేయాలి.? ఎలా ప్రకటనలు చేయాలి అన్నదానిపై శిక్షణ ఇస్తారు కార్పోరేట్లో ఉండడం వేరు, ప్రజల్లోకి రావడం వేరు కాబట్టి భువనేశ్వరీ విషయంలో పార్టీ అంత జాగ్రత్త తీసుకుంటారు శిక్షణ కోసమే నిజం గెలవాలి యాత్రను వెంట వెంటనే కాకుండా.. బ్రేకులిస్తూ తీసుకెళ్తున్నారు అంటే భువనేశ్వరీ మాట్లాడే ప్రతీ మాటకు చంద్రబాబు డైరెక్షన్ ఉంటుంది చంద్రబాబు ఒక విషయాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి చేసిన ప్రయత్నం ఇది కుప్పంలో పోటీ చేసి చంద్రబాబు ఓడిపోతే.. అసలుకే మోసం వస్తుందన్న భయం కుప్పం సేఫ్ సీటు కాదు కాబట్టి ముందే భార్యతో చెప్పించడం రెండు నియోజకవర్గాలు అనుకున్నా.. రెండింటా ఓడిపోతే ఎలా అన్న భయాలు తెలంగాణలోనూ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అందరూ ఓడిపోయారు (ఈటల రెండు చోట్లు, రేవంత్, కేసిఆర్ ఒక్కో చోట) చంద్రబాబు కుప్పంలో పోటీ చేయలేనప్పుడు పార్టీని ఏం నడిపిస్తాడు? భువనేశ్వరీ ద్వారా చంద్రబాబే ఒక ఫీలర్ వదిలారు ముందుగా భువనేశ్వరీతో చెప్పించి, ఆ తర్వాత ఓ పార్టీ ప్రకటన చేయించే ఆలోచన చంద్రబాబుది ఇప్పటికీ పొత్తులపైనే నమ్మకం తప్ప.. ఇది చేస్తానని, ఇది చేశానని బలంగా చెప్పుకోలేని చంద్రబాబుకు రిటైర్మెంట్ టైం వచ్చింది భువనేశ్వరీ ప్రకటన చూస్తుంటే ఇది చంద్రబాబు అస్త్ర సన్యాసమే -
సీఎం జగన్ జనాదరణ చూసి చంద్రబాబు గ్యాంగ్ లో కంగారు
-
ఐర్లాండ్ రాజధానిలో చెలరేగిన హింస: ప్రధాని దిగ్భ్రాంతి,కొత్త చట్టాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ సిటీ సెంటర్లో గత రాత్రి (గురువారం, నవంబరు 23) కత్తి పోట్ల ఘటన తీవ్ర అల్లర్లు , భారీ విధ్వంసానికి దారి తీసింది. పాఠశాల వద్ద ఓ వ్యక్తి పొడవాటి కత్తితో విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, మహిళ (స్కూల్ కేర్ అసిస్టెంట్) తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన అనంతరం సెంట్రల్ డబ్లిన్ అంతటా హింసాత్మక నిరసన చెలరేగింది. ఈ ఘటన తరువాత దేశంలో మరింత అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఐర్లాండ్ పోలీసు చీఫ్ హెచ్చరించారు. శుక్రవారం నాటికి రాజధాని ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలతో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు బీభత్సం సృష్టించారు. 11 పోలీసు వాహనాలను ధ్వంసం చేయగా, 13 దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో మరిన్నిదుకాణాలను దుండగులు లూటీ చేశారు. మూడు గంటలకు పైగా జరిగిన అల్లర్లలో మూడు బస్సులు, ఒక రైలు(ట్రామ్ను) తగుల బెట్టారు. అనేక మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇలాంటి హింస గతంలో ఎన్నడూ చూడలేదని ఐరిష్ పోలీసు కమీషనర్ డ్రూ హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డబ్లిన్ తగులబడిపోతున్నట్టుగా అనిపించిందంటూ స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రధాని దిగ్భ్రాంతి, కొత్త చట్టాలు కత్తిపోట్ల ఘటనపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది అల్లర్లలో పాల్గొన్నారని , వీరంతా జాతికే అవమానం తెచ్చారని మండిపడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలోనే కొత్తచట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు. We are all shocked by the incident which has taken place in Parnell Square. A number of people have been injured, some of them children. Our thoughts and our prayers go out to them and their families. — Leo Varadkar (@LeoVaradkar) November 23, 2023 50 ఏళ్ల ఐరిష్ పౌరుడిని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నాడు. నిరాయుధులను చేసి, పోలీసులు వచ్చే వరకు అతన్ని నేలపై పిన్ చేశారు. అతను ఆసుపత్రిలో మరియు కాపలాగా చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి కారణం ఏంటి అనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. JUST IN: Another hotel on fire in Dublin, Ireland… Citizens set fire to the Holiday Inn that is used to house immigrants following the violent stabbing of three children..pic.twitter.com/51Y7Gj4dXC — Chuck Callesto (@ChuckCallesto) November 24, 2023 -
సరదాగా డీఎన్ఏ టెస్టు... షాకిచ్చిన రిపోర్టు!
ఒక యూరోపియన్ మహిళ తన సోదరీమణులతో కలిసి సరదాగా ఇంట్లోనే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంది. అయితే వాటి ఫలితాలు తన జీవితంలో ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో ఆమె గ్రహించలేకపోయింది. తన తల్లిదండ్రులు ఇన్నాళ్లూ ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారని ఆమె ఊహించలేకపోయింది. ఈ మహిళ తన గుర్తింపును వెల్లడించకుండా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్లో ఒక వివరణాత్మక పోస్ట్ పెట్టింది. దానిలో ఆమె.. ‘నేను, నా సిస్టర్స్ సరదాగా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకున్నాం. ఒక కిట్ సాయంతో డిఎన్ఏ టెస్టు చేయించుకున్నాం. ఆ పరీక్ష ఫలితాలు రాగానే గుండె బద్ధలయ్యే నిజం వెలుగు చూసింది. డీఎన్ఏ పరీక్ష ఫలితాలలో తన అన్నలు, అక్కాచెల్లెళ్లకు పూర్తి బంధుత్వం ఉందని, తానుమాత్రం ఒంటరినని తేలిందని ఆ మహిళ చెప్పింది. కాగా ఆమె సోదరి తమ తల్లిదండ్రులతో ఈ విషయమై మాట్లాడాలని నిర్ణయించుకుంది. అయితే తల్లిదండ్రులు ఆ డిఎన్ఏ ఫలితాలు నిజం కాదని అన్నారు. అయితే ఆమె తండ్రి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని కోరాడు. తల్లి ఈ విషయంలో తనకేమీ పట్టనట్టు వ్యవహరించింది. అయితే ఎట్టకేలకు తండ్రి నిజాన్ని చెప్పాడు. అయితే ఆమె ఎప్పటికీ తన కుమార్తెనేనని అన్నాడు. ఇంతకాలం తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టడంపై ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఏదో తేడా కనిపించడంతో తనకు వేరే తండ్రి ఉన్నడని అనుకునేదానినని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె తల్లితో నాటి పరిస్థితిని చర్చించాలనుకుంటోంది. అయితే తల్లి తనకు ఏమీ తెలియదని అంటోంది. కాగా ఆ మహిళ తన జీవసంబంధమైన తండ్రిని గుర్తించగలిగింది. అయితే ఇప్పుడు తాను ఏమి చేయాలంటూ ఆమె రెడ్డిట్ యూజర్స్ను కోరింది. ఇది కూడా చదవండి: పాక్పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
చంద్రబాబుకు పురందేశ్వరి షాక్
-
కోర్టులో ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు
నాకు అతని మీద ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ లేవు. కేవలం ఓ అన్నలాంటోడు. నేను వెళ్లిపోతే చచ్చిపోతాడేమోనని అతనితో ఇంతకాలం కలిసి ఉన్నా.. అంటూ కోర్టులో ఆ యువతి ఇచ్చిన స్టేట్మెంట్ షాక్తో ఆ ప్రియుడికి దిమ్మతిరిగిపోయింది. ఆ షాక్లోనే జడ్జి ఛాంబర్లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సోమవారం కేరళ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రిస్సూర్ జిల్లాకు చెందిన విష్ణు(31).. నెల రోజులుగా 23 ఏళ్ల యువతితో ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. తమ ప్రేమకు పేరెంట్స్ ఒప్పుకపోవడంతో తాను ఇంటి నుంచి వచ్చేశానని ఆమె అతనితో చెప్పిందట. అయితే తన కూతురు కనిపించకుండా పోయిందంటూ ఆమె తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తన కూతురిని అక్రమంగా విష్ణు బంధించాడని పిటిషన్లో ఆరోపించాడాయన. దీంతో.. సోమవారం ఆ జంటను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అప్పటిదాకా విష్ణు లేనిదే తాను ఉండలేనంటూ పోలీసులతో, మీడియా ముందు చెప్పుకొచ్చిన ఆ యువతి.. జడ్జి ముందు మాట మార్చింది. తనకు తన పేరెంట్స్ ముఖ్యమని, తాను తన కుటుంబంతోనే వెళ్లిపోతానని.. కేవలం విష్ణు మీద ఒక అన్నలా ఆప్యాయత ఉందేతప్ప మరేయితర ఫీలింగ్ లేదని, అతను బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. దీంతో డివిజన్ బెంచ్ యువతిని ఇష్టప్రకారంగా వెళ్లిపోవచ్చని సూచిస్తూ.. విష్ణుని మందలించింది. అయితే ఆ ఊహించని పరిణామంతో బోరున విలపిస్తూ బయటకు వెళ్లిపోయిన విష్ణు.. ఓ కత్తితో జస్టిస్ అను శివరామన్ ఛాంబర్కు వెళ్లాడు. తన మణికట్టు కోసుకుని ఏడ్వసాగాడు. న్యాయమూర్తి అప్రమత్తం చేయడంతో పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఎపిసోడ్లో ఇంకో కొసమెరుపు ఏంటంటే.. విష్ణుకు అప్పటికే వివాహం అయ్యింది. అయితే.. సదరు యువతితో రిలేషన్షిప్లో ఉన్నాడని తెలిశాక భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. -
ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు!
రాజస్థాన్లోని బాడ్మేర్లో విద్యుదాఘాతానికి నలుగురు బలయ్యారు. పిండిమరకు విద్యుత్ ప్రవహించిన నేపధ్యంలో వీరు ఒకరిని కాపాడబోయు మరొకరు మృతి చెందారు. మృతులలో ఇద్దరు చిన్నారులతోపాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బాడ్మేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అర్జున్సింగ్ ఇంటిలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంటిలో అర్జున్సింగ్ లేడు. అతని భార్య పిండిమరలో గొధుమలను ఆడిస్తుండగా, ఆమె విద్యుదాఘాతానికి గురయ్యింది. బాధతో తల్లి విలవిలలాడుతుండగా, వారి ఇద్దరి పిల్లలను ఆమెను పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. బాధితుల అరుపులు విన్న అర్జున్ సింగ్ బంధువు హఠెసింగ్ అక్కడికు వచ్చి, వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్ అంజుమ్ తాహిర్ సమా మాట్లాడుతూ పిండిమరకు విద్యుత్ ప్రవాహం జరిగి, దానిని ముట్టుకున్న నలుగురు మృతి చెందారని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు! -
జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్ష రద్దు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షను రద్దు చేసింది. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిం చెప్పింది. అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది కీ విడుదల చేయాలని సంస్థను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన పిటిషన్ను అనుమతిస్తూ తుది తీర్పు వెలువరించింది. అలాగే స్టే ఎత్తివేయాలంటూ దాఖలైన మధ్యంతర అప్లికేషన్లను కొట్టివేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022, సెపె్టంబర్ 4న నిర్వహించిన పరీక్షకు 79,898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపీయింగ్, ఇతర అవకతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దా ఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యా యస్థానం, తీర్పు వెలువరించే వరకు ఫలితాలను వెల్లడించవద్దని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్పై మరోసారి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించలేదని భావించిన న్యాయమూర్తి.. రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. -
మానవ శరీరంలో సంభవించే సడెన్ షాక్లు ఏంటో తెలుసా!
మానవ శరీరంలో సంభవించే సడెన్ షాక్లు గురించి చాలామందికి తెలియదు. ఉన్నటుండి సడెన్గా చనిపోయాడనే అనుకుంటాం. అసలు ఇవి ఎలా సంభవిస్తాయి?. ఎందువల్ల అనే దాని గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో తెలుసుకుందాం. మానవ శరీరంలో సంభవించే అనేక రకాల షాక్లు ఉన్నాయి. వాటిలో అత్యంత సాధారణ రకాల షాక్లు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. హైపోవోలెమిక్ షాక్: తీవ్రమైన రక్తస్రావం లేదా నిర్జలీకరణం వంటి రక్తం లేదా శరీర ద్రవాల గణనీయమైన నష్టం జరిగినప్పుడు ఇది సంభవిస్తుంది. 2. కార్డియోజెనిక్ షాక్: తరచుగా గుండెపోటు లేదా గుండె వైఫల్యం కారణంగా శరీర అవసరాలను తీర్చడానికి గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు ఇది జరుగుతుంది. 3. అనాఫిలాక్టిక్ షాక్: ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య, ఇది ఆహారం, మందులు లేదా పురుగుల కుట్టడం వంటి అలెర్జీ కారకాలకు ప్రతిస్పందనగా సంభవించవచ్చు, దీని వలన రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. 4. సెప్టిక్ షాక్: ఇన్ఫెక్షన్ శరీరం అంతటా వ్యాపించి, దైహిక తాపజనక ప్రతిస్పందన తక్కువ రక్తపోటుకు దారితీసినప్పుడు ఇది సంభవిస్తుంది. 5. న్యూరోజెనిక్ షాక్: వెన్నుపాము దెబ్బతిన్నప్పుడు లేదా స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థకు అంతరాయం ఏర్పడినప్పుడు ఈ రకమైన షాక్ ఏర్పడుతుంది, దీనివల్ల రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల ఏర్పడుతుంది. అన్ని రకాల షాక్లు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, తక్షణ వైద్య సహాయం అవసరమని గమనించడం ముఖ్యం. మీరు/మీకు తెలిసిన ఎవరైనా ఇలాంటి షాక్ లక్షణాలను ఎదుర్కొంటుంటే, దయచేసి వెంటనే వారికి తక్షణ వైద్య సాయం అందేలా చూడండి. --ఆయర్వేద వైద్యులు నవీన్ నడిమింటి (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్ప్లేస్లో చేతులకు వచ్చే సమస్యలు!) -
‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను
తమన్నా నటించిన తాజా వెబ్సిరీస్ ‘ఆఖరి సచ్’. 2018లో ఢిల్లీలో బూరారిప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండుమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలతో ‘ఆఖరి సచ్’ రూపొందింది. తమన్నా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, రాహుల్ బగ్గా లీడ్ రోల్స్లో రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఇందులో అన్య అనే ఇన్వేస్టిగేటివ్ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. ‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సిరీస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా కెరీర్లో తొలిసారిగా ఓ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. అలాగే నా కంఫర్ట్జోన్ దాటి చాలా ఎమోషన్స్తో కూడు కున్న అన్య పాత్రలో నటించాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
కరెంటుషాక్తో ఒకరు.. భయంతో మరొకరు..
కల్వకుర్తి టౌన్: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు నీటిగుంతలో కరెంటుషాక్కు గురై మరణించగా, మరొకరు భయంతో ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. కల్వకుర్తికి చెందిన అనిల్(18), రాజేశ్ వాటర్ప్లాంట్లలో ఆటోడ్రైవర్లు. తమ పనులు ముగిసిన తర్వాత కల్వకుర్తి తిమ్మనోనిపల్లి వద్ద ఉన్న నరసింహారెడ్డి వ్యవసాయ పొలంలోని నీటిగుంతలో ఈత కొట్టడానికి వెళ్లారు. పక్క పొలంలో ఉన్న కుర్మిద్దకు చెందిన శివ (22)ను సైతం ఈత కొట్టడానికి పిలిచారు. ముగ్గురు కలిసి నీటిగుంతలోకి దిగారు. అయితే అది లోతుగా ఉండటంతో నీటిని బయటకు తోడేందుకు విద్యుత్ మోటారు ఏర్పాటు చేశారు. నీళ్లు తోడేస్తుండగా మధ్యలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వారు గుంతలోకి దిగి ఈత కొడుతున్నారు. కొద్దిసేపటికి కరెంటు సరఫరా కావడంతో అనిల్ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో భయాందోళనకు గురైన శివ సమీపంలోని మరో వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సంచలన వీడియో: శివాని తెలివితేటలకు పోలీసులు షాక్
-
పవన్ కళ్యాణ్ కు దిమ్మదిరిగే షాకిచ్చిన కేంద్రం
-
200 ఏళ్లనాటి ఫార్మ్హౌస్లో రహస్య భూగృహం.. లోపల ఏముందో చూసేసరికి..
ఒక్కోసారి కొన్ని దశాబ్ధాల పురాతన గృహాలలో అనుకోని విధంగా ఏవైనా లభిస్తే మన ఆశ్చర్యానికి అవధులు ఉండవు. యూకేలోని ఒక టిక్టాకర్ తన తల్లిదండ్రులకు సంబంధించిన 200 ఏళ్ల క్రితం నాటి పురాతన ఫార్మ్హౌస్లోని ఫ్లోర్బోర్డ్ కింద కనిపించిన ఆనవాళ్లు చూసి తెగ ఆశ్చర్యపోయింది. ఇటువంటిది ఒకటి ఉందని ఆమెకు బాల్యంలో ఎప్పుడూ తెలియలేదు. ఇంటి రెనోవేషన్ సందర్భంగా ఆ ఇంటిలో ఒక భూగృహం ఉందని ఆమెకు తెలిసింది. దశాబ్ధాల తరబడి రహస్యంగా.. జెనిఫర్ మల్లాఘన్ ఇటీవల తమ చారిత్రాత్మక పురాతన ఇంటికి సంబంధించిన ఒక వీడియోను టిక్టాక్లో షేర్ చేసింది. ఈ ఇంటిలో తన తల్లిదండ్రులు 6 దశాబ్ధాల పాటు ఉన్నారని, అయితే తనకు ఈ ఇంటిలో భూగృహం ఉందన్న సంగతి ఇన్నాళ్లలో తెలియలేదన్నారు. జెనీఫర్ ఈ వీడియో కాప్షన్లో ‘ఈ భూగృహం ఏళ్ల తరబడి రహస్యంగానే ఉంది’ అని పేర్కొన్నారు. 44 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తవ్వకాల మధ్య నిలుచుని, చేతులతో ఒక పరికరం పట్టుకుని, కంపార్ట్మెంట్ను తెరిచే ప్రయత్నం చేస్తుంటాడు. లోపల చీకటిగా ఉంటూ, ఆ గది భయం గొలిపేదిగా కనిపిస్తుంది. గది తెరుచుకున్నా.. మల్లాఘన్ మాట్లాడుతూ భయపెడుతున్న ఆ గదిలో ఎటువంటి సామాను లేదని తెలిపింది. విలువైన ఖజానా అంతకన్నా లేదని పేర్కొంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ఈ గదిని రెనోవేషన్ చేస్తారా? అని అడగగా, దానికి జవాబుగా ఆమె ఆ గది రెనోవేషన్ చేయబోమని, దానిలో ఏముందో చూడాలని అనుకున్నామని తెలిపింది. గతంలోనూ బయల్పడిన భూగృహాలు ఈ విధంగా భూగృహం బయటపడటం ఇదేమీ తొలిసారి కాదు. గత నెలలోనే ఒక రెడిట్ యూజర్ తమ కొత్త ఇంటిలో హిడెన్ రూమ్లో కొన్ని ప్రైవేట్ వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. 1970-1980ల మధ్యకాలం నాటి ఈ గదిలో కొన్ని పురాతన వస్తువులతో పాటు ఒక బీరుబాటిల్ కూడా దొరికిందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే.. -
ఫేర్వెల్ పార్టీలో హడలెత్తించిన బాలిక.. శవపేటికలో నుంచి లేచి..
చాలామంది చిన్నారులు స్కూల్ ఫేర్వెల్ పార్టీకి అందమైన వస్త్రధారణతో వస్తుంటారు. అయితే 16 ఏళ్ల అబీ రికెట్స్ తమ స్కూల్ ఫేర్వెల్ కార్యక్రమానికి విచిత్ర రీతిలో సిద్ధమై వచ్చింది. తన క్లాస్మేట్స్ను సర్ప్రైజ్ చేసేందుకు ఒక షో-స్టాపింగ్ స్టంట్కు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఆమె ఒక శవపేటికతో పాటు అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. స్కూల్ ఫేర్వెల్ పార్టీ రోజున ఆమె నలుపురంగు దుస్తులు ధరించింది. తరువాత ఆరడుగుల శవపేటికలో పడుకుంది. చేతులను క్రాస్చేసి పెట్టుకుంది. అప్పుడు ఆమెతో పాటు వచ్చిన అంత్యక్రియల నిర్వహణ సిబ్బంది ఆ శవ పేటికను రెడ్ కార్పెట్పై ఉంచారు. ఇంతలో ఆమె ఎంతో నాటకీయంగా తన కళ్లను తెరిచింది. అక్కడున్నవారంతా ఆమెను చూసి కేకలు పెట్టారు. చుట్టుపక్కలవారు కేకలు పెడుతూ.. ఈ ఘటన గురించి అబీ వివరిస్తూ..‘అప్పుడు నన్ను చూసి చుట్టుపక్కల ఉన్నవారంతా ఆందోళనగా కేకలు పెట్టారని, అసలు విషయం గ్రహించి చప్పట్లు కొట్టారన్నారు. మా ఉపాధ్యాయులు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని’ అన్నారని ఆమె తెలిపింది. అబీ అంత్యక్రియల ‘షో’లో ఆమె తండ్రి, సోదరుడు కూడా ఆమెకు సహకరించారు. వారు అంత్యక్రియల నిర్వాహకుల పాత్ర పోషించారు. ఈ విధంగా అందరినీ భయపెట్టేందుకు అబీ రెండు గంటల పాటు అలంకరణ చేసుకుంది. కుమార్తె షో అద్భుతమంటూ.. తాము శవవాహనం అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించామని, అయితే ఇలాంటి షో కోసం ఎవరూ వాహనం ఇవ్వబోమని చెప్పారని అబీ తెలిపింది. దీంతో తమ ఇంటిలోని వారే తన షో కోసం అన్ని ఏర్పాట్ల చేశారని చెప్పింది. ఈ సందర్భంగా అబీ తండ్రి మాట్లాడుతూ తమ కుమార్తె చేసిన షో విషయంలో తాము ఎంతో గర్విస్తున్నామన్నారు. ఇది కలకాలం నిలిచిపోతుందన్నారు. ఇది కూడా చదవండి: గొంతులో ఇరుక్కున్న లెగ్ పీస్.. వైద్యుని వింత సలహాకు కంగుతిన్న మహిళ..! -
ట్వీట్లకు పరిమితులు
శాన్ ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమం ట్విట్టర్ వినియోగదారులకు ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ గట్టి షాక్ ఇచ్చారు. ప్రతీరోజూ ట్వీట్లను చూడడానికి పరిమితి విధించారు. వెరిఫైడ్, అన్వెరిఫైడ్ అకౌంట్లకు వేర్వేరు పరిమితులు విధించారు. అన్వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు రోజుకి 600 పోస్టులు మాత్రమే చూడగలరని, వెరిఫైడ్ ఖాతాదారులు రోజుకి 6 వేల పోస్టులు చూడగలరని శనివారం ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. త్వరలో ఈ ట్వీట్ల సంఖ్యను అన్వెరిఫైడ్ అకౌంట్లకు 800కి వెరిఫైడ్ అకౌంట్లకి 8 వేలకు పెంచుతామని చెప్పారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వినియోగదారులకి శనివారం ట్విట్టర్ యాక్సెస్లోకి రాలేదు. కొందరు ట్వీట్లు చేస్తుంటే కెనాట్ రిట్రైవ్ ట్వీట్స్, లిమిట్ ఎక్సీడెడ్ అన్న మెసేజ్లు వచ్చాయి. దీంతో ట్విట్టర్ డౌన్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ట్విట్టర్ డేటాను చాట్జీపీటీ వంటి కృత్రిమ మేధతో పని చేసే వ్యవస్థలకి శిక్షణ ఇవ్వడానికి దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే ఈ పరిమితులు వచ్చాయని చెప్పారు. -
కోర్టు మెట్లెక్కిన ట్విటర్ ఉద్యోగులు..
-
మహేష్ ఫాన్స్ కు మరో షాక్ ఇచ్చిన త్రివిక్రమ్
-
మీ ఫోన్ లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
-
కరెంట్ షాక్తో 40 మంది మృతి?
భువనేశ్వర్/న్యూఢిల్లీ: ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటనలో ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని తెలుస్తోంది. దుర్ఘటన తాలూకు కొత్త విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత వివరాలను గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) మంగళవారం వెల్లడించింది. ‘ప్రమాదం జరిగినపుడు చెల్లాచెదురుగా పడిన బోగీలు పై నుంచి వెళ్తున్న ఓవర్హెడ్ లోటెన్షన్(ఎల్టీ) విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ తీగలు తెగి కొన్ని బోగీలపై పడ్డాయి. అప్పటికే ధ్వంసమైన బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు ఈ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అందుకే దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు’ అని ఎఫ్ఐఆర్లో నమోదుచేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ పి.కుమార్ నాయర్ చెప్పారు. మార్చురీలో వందకుపైగా మృతదేహాలు రైలు ప్రమాదంలో 278 మంది మరణించగా 177 మంది ప్రయాణికుల మృతదేహాలను వారి బంధువులు గుర్తుపట్టారు. దాంతో ఈ మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తయింది. తలలు తెగి, ప్రమాదంలో నుజ్జునుజ్జయి అసలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైన మృతదేహాలను.. తమ వారి ఆచూకీ కోసం మార్చురీకి వచ్చిన వారూ గుర్తించలేకపోతున్నారు. ఘటన జరిగిన తర్వాత మృతదేహాలు రెండు మూడు చోట్లకు సరిగా ప్యాక్చేయకుండానే తరలించిన కారణంగా కొంతమేర కుళ్లి దుర్వాసన వస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు షురూ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు మంగళవారం బాలాసోర్ జిల్లాకు చేరుకున్నారు. బాలాసోర్ రైల్వే పోలీసులు రైల్వే చట్టంలోని ఈ నెల 3న వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సీబీఐ అధికారులు స్వీకరించారు. స్థానిక పోలీసులు నమోదు చేసి కేసును దర్యాప్తు ప్రక్రియలో భాగంగా మళ్లీ రిజిస్టర్ చేసి, దాన్ని సొంత ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు మొదలుపెట్టారు. ఎల్రక్టానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వేశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ కార్యకలాపాలపై తమకు కొంత పరిజ్ఞానం ఉందని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా రైలు సెక్యూరిటీ సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకుంటామని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ (స్పెషల్ క్రైమ్) విప్లవ్కుమార్ చౌదరి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం మంగళవారం మధ్యాహ్నం బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనాస్థలి, సిగ్నల్ గదిని క్షుణ్నంగా పరిశీలించింది. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సిబ్బందిని ప్రశ్నించనుంది. -
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
యూట్యూబ్ క్రియేటర్స్ కి బిగ్ షాక్.. ఆ ఫ్యూచర్ తొలగింపు..!
-
తీవ్రంగా చలించిపోయా: బైడెన్
వాషింగ్టన్: ఒడిశాలోని బాలాసోర్లో రైలు ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్లో సుమారు 300 మందిని బలి తీసుకున్న రైలు ప్రమాద విషాద వార్త విని తీవ్రంగా చలించిపోయానని బైడెన్ పేర్కొన్నారు. ‘భారత్లో చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన రైలు ప్రమాద విషాద వార్త విని నేను, నా భార్య జిల్ బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి, క్షతగాత్రుల గురించి ప్రార్థిస్తున్నాం. భారత్, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక మూలాల్లో ఉన్న విలువలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది’అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలాసోర్ ఘటనపై ఇప్పటికే యూకే ప్రధాని రిషి సునాక్, రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్ ప్రధాని కిషిదా తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
రెజ్లర్లకు షాక్!
-
2018మూవీ కి బిగ్ షాక్..
-
కూలర్లో నీళ్లు పోస్తుండగా..
హైదరాబాద్: ఇంట్లో కూలర్లో నీళ్లు పోస్తుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ రిసాలబజార్లో హర్షియాబేగం(29) తన భర్త మహ్మద్తో కలిసి ఉంటున్నది. ఆదివారం రాత్రి కూలర్ను ఆఫ్ చేయకుండా నీళ్లు పోసింది. అదే సమయంలో ఆమె కూలర్ తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను కాపాడబోయిన మహ్మద్కు కూడా విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు. కాగా కూలర్ ఐరన్ది కావడంతో అందులోకి విద్యుత్ ప్రవహించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
టీడీపీ మహానాడులో లోకేష్కు షాకిచ్చిన కార్యకర్త
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి టీడీపీ మహానాడులో నారా లోకేష్కు కార్యకర్త షాకిచ్చాడు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని లోకేష్ను నిలదీశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ లోకేష్ను కార్యకర్త వెంకటేశ్వరరావు అడ్డుకున్నాడు. కార్యకర్తను పట్టించుకోకుండా లోకేష్ వెళ్లిపోయారు. దీంతో మహానాడు ప్రాంగణంలోనే వెంకటేశ్వరరావు నిరసనకు దిగాడు. చదవండి: పచ్చి రాజకీయ రాక్షసుడిగా మారిపోయిన రామోజీ -
అశ్వద్వామా తో త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ షాక్
-
మెటాకు భారీ షాక్
-
ట్రంప్ కు మరో దెబ్బ
-
కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పేషెంట్..
యువ వైద్యురాలి మృతి యావత్తు కేరళ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపింది. దీంతో వైద్యుల, ఆరోగ్య కార్యకర్తలకు కేరళ రాష్ట్రంలో ఎలాంటి భద్రత లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో కేరళ ప్రతిష్ట దిగజారిపోయిందంటూ ప్రతిపక్షాలు పినరయి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి. అసలేం జరిగిందంటే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బుధవారం కేరళలో 24 ఏళ్ల వందనా దాస్ అనే యువ వైద్యురాలు పెషెంట్ దాడిలో మృతి చెందింది. నిజానికి ఆ రోగిని పోలీసులు తీసుకువచ్చారు. అతను సస్పెన్షకు గురైన ఓ ఉపాధ్యాయుడు. పేరు సందీప్. తన కుటుంబ సభ్యులతో గొడవ పడి రక్షించమంటూ అతను పోలీసుల అత్యవసర హెల్ప్లైన్కి ఫోన్ చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన సందీప్ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆ సమయంలో వందనాదాస్ అతడి గాయానికి డ్రస్సింగ్ చేస్తోంది ఇంతలో ఆకస్మికంగా రెచ్చిపోయి..చికిత్స చేస్తున్న డాక్టర్తో సహా సమీపంలో ఉన్న పోలీసులు, సిబ్బందిపై కత్తెరతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆ పేషెంట్ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు యువ డాక్టర్ వందనా దాస్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం గురించి తెలసుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు. దీన్ని దిగ్బ్రాంతికరమైన బాధకర ఘటన అని అన్నారు. బాధ్యులపై ప్రభుత్వం సత్వరమే కఠిన చర్యలు తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఐతే ఈ ఘటనకు వ్యతిరేకంగా మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసీయేషన్(కేజీఎంఓఏ) వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. మరోవైపు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేరళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ఏడురోజుల్లోగా ఈ ఘటనపై కొల్లాం జిల్లా పోలీస్ చీఫ్ను నివేదిక ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉండగా, కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ బాధితురాలు హౌస్ సర్జన్ అని, అంతగా అనుభవం లేదని చేసిన ప్రకటన కాస్త మరింత వివాదాస్పదమై విమర్శలకు ఆజ్యం పోసింది. ఆమె ప్రకటనపై కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకరన్ ఫైర్ అయ్యారు. వైద్యురాలి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ..ఇలాంటికి జరగడం దురదృష్టకరమని సుధాకరన్ అన్నారు. యువ వైద్యురాలు హత్య యావత్తు కేరళ రాష్ట్రాన్నే కలిచివేసిందని కేరళ సీనియర్ నేత సతీశన్ అన్నారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని సతీశన్ ఆరోపణలు చేశారు.ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పినరయి ప్రభుత్వాన్ని తప్పుపడుతూ విమర్శలు చేయడం ప్రారంభించాయి. కాగా, విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలపడమే గాక ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఐతే కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, ఈ విషాద సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే గాక మెడికల్ టూరిజానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలో ఇలాంట ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ ఘటన కేరళ ప్రతిష్టను దెబ్బతీసిందని, కేరళలోని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల భద్రతలో లోపాలను తేటతెల్లం చేసిందని విమర్శించారు. (చదవండి: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్) -
టీమ్ ఇండియాకి భారీ ఎదురుదెబ్బ
-
సంగారెడ్డి: అత్తామామల హత్యకు అల్లుడి షాకింగ్ స్కెచ్
సాక్షి, సంగారెడ్డి: చిన్న చిన్న విషయాలే.. ఒక్కోసారి తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా ఉసిగొల్పుతాయి. అలా ఓ అల్లుడు ఏకంగా తనకు పిల్లనిచ్చిన అత్తామామల్ని చంపేయాలని ప్లాన్ వేశాడు. అది మామూలు స్కెచ్తో కాదు.. షాకింగ్ స్కెచ్తో!. చివరకు ఆ కుట్ర బయటపడడం, అందుకు కారణం ఏంటో తెలిసి పోలీసులతో పాటు స్థానికులు షాక్ తినడం ఒకదాని వెంట మరొకటి జరిగాయి. అత్తమామల హత్యకు షాకింగ్ స్కెచ్ వేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. రమేష్ అనే వ్యక్తి తన భార్య తల్లిదండ్రుల్ని చంపడానికి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా.. ఈ నెల 12వ తేదీన ఇంటి తలుపులకు కరెంట్ షాక్ పెట్టాడు. అయితే రమేష్ అనుకున్నట్లు జరగలేదు. అత్తామామలకు బదులుగా.. తల్లీకూతుళ్లు ఆ తలుపును తాకడంతో షాక్కి గురయ్యారు. కరెంట్ షాక్తో విలవిలలాడుతూ.. వాళ్లు వేసిన కేకలకు స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కరెంట్ ఆఫ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో తాజాగా అల్లుడు రమేష్ కుట్రదారుడని తేలింది. ఇంతకీ ఎందుకు చంపాలని ప్రయత్నించాడో తెలుసా?.. గతంలో ఓసారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ అత్తామామలు, అల్లుడు రమేష్ను మందలించలేదనట. పలకరించలేదన్న ఆ కోపంతో అప్పటి నుంచి రగిలిపోతున్న రమేష్.. ఎలాగైనా వాళ్లను చంపేయాలని అనుకున్నాడట. చివరకు కరెంట్షాక్తో యత్నిస్తే తన మీదకు రాదని అలా చేశానని రమేష్ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఆ అల్లుడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: మంచిర్యాలలో దారుణం.. ఊరంతా చూస్తుండగానే.. -
టీమిండియా క్రికెటర్లకు షాక్ ఇచ్చిన మస్క్ మామ
-
గూగుల్ కి షాకిస్తున్నసెల్ ఫోన్ కంపెనీస్..
-
రాహుల్ గాంధీకి షాక్ !
-
రాహుల్ గాంధీ పిటిషన్ ను కొట్టేసిన సూరత్ సెషన్స్ కోర్టు
-
దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చిన సమంత..
-
అది ఆఫర్ లెటర్ కాదు.. ఫ్రెషర్లకు షాకిచ్చిన క్యాప్జెమినీ!
ఆన్బోర్డింగ్ విషయంలో కాస్త ఓపిక పట్టాలని ఫ్రాన్స్కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్జెమినీ ఫ్రెషర్లను కోరింది. 2022లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేసినవారిని 2023లో ఎప్పుడైనా ఆన్బోర్డ్ చేయనున్నట్లు తెలియజేసింది. ఖాళీల లభ్యత ఆధారంగా ఆన్బోర్డింగ్ ఉంటుందని అభ్యర్థులకు సమాచారం అందించింది. (ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!) క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఆన్బోర్డింగ్పై స్పష్టత కోసం కంపెనీని సంప్రదించగా ఈ మేరకు బదులిచ్చింది. ఎంపికైన అభ్యర్థులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) మాత్రమే ఇచ్చామని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కంపెనీకి లేదని పేర్కొంది. దీన్ని ఆఫర్ లెటర్గా పరిగణించకూడదని యూనివర్సిటీ రిలేషన్స్ అండ్ టాలెంట్ హైరింగ్ టీమ్ తెలిపింది. (తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే!) భారతదేశంలోని చాలా ఐటీ కంపెనీలు గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లను ఇంకా ఆన్బోర్డ్ చేయలేదు. మాంద్యం సంకేతాలు ఉన్న ఉత్తర అమెరికా, యూరప్లో వ్యాపార అనిశ్చితి దీనికి కారణం. దీంతో సిబ్బంది వ్యయాల విషయంలో ఆయా కంపెనీలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు, అంచనాలు గణనీయమైన మందగమనాన్ని సూచిస్తున్నాయి. -
చంద్రబాబుకు షాకిచ్చిన పుల్లారావు
-
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ లీడర్లు
-
ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన చెల్లి అని తెలిసి భర్త షాక్..!
ఆరేళ్లుగా కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత భార్య తనకు సొంత చెల్లి అని తెలిసి కంగుతిన్నాడు ఓ భర్త. ఇందుకు సంబంధించిన కథనాన్ని రెడ్డిట్లో పోస్టు చేయగా అది వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ పోస్టును ఈ డిలీట్ చేశారు. సదరు వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. పుట్టినప్పుడే తల్లిదండ్రులు అతడ్ని వేరేవాళ్లకు దత్తత ఇచ్చారు. దీంతో అసలైన పేరెంట్స్ ఎవరో తనకు తెలియదు. 6 ఏళ్ల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవలే ఇతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి కుమారుడు పుట్టాడు. ఆ వెంటనే ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆమెకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు భర్తకు సూచించారు. వెంటనే కిడ్నీ దాతల కోసం ఆమె కుటుంబసభ్యులతో పాటు తన కుటుంబసభ్యులు ఎవరనే విషయం కునుగొనేందుకు భర్త ప్రయత్నించాడు. భార్య తరఫు కుటుంబసభ్యుల్లో ఎవరి కిడ్నీ ఆమెతో మ్యాచ్ కాలేదు. ఈ క్రమంలోనే చివరకు తన కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడమని టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. పరీక్షల అనంతరం వైద్యులకు షాకింగ్ విషయం తెలిసింది. భార్య, భర్తల కిడ్నీ మ్యాచ్ అయింది. వైద్యులు ఈ విషయాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత మరిన్ని టెస్టులు నిర్వహించగా.. అనూహ్యంగా అతని కిడ్నీ భార్య కిడ్నీతో అసాధారణ రీతిలో మ్యాచ్ అయింది. అప్పుడే వీళ్లిద్దరు అన్నాచెల్లి అని వైద్యులు నిర్ధరించారు. ఈ విషయం తెలిశాక భర్త షాక్ అయ్యాడు. ఇన్నాళ్లుగా కాపురం చేస్తూ.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సొంత సోదరితోనా అనుకుని వాపోయాడు. రెడ్డిట్లో ఈ వ్యక్తి షేర్ చేసిన స్టోరీపై నెటిజన్లు స్పందించారు. 'మీరు ఇంతకుముందు ఎలా సంతోషంగా ఉన్నారో.. మున్ముందు కూడా అలాగే ఉండండి. మీ సిస్టర్-వైఫ్కు కిడ్నీ దానం చేయండి. మీ పిల్లలకు గొప్ప తల్లిదండ్రులుగా ఉండండి' అని సూచించారు. చదవండి: విజృంభిస్తున్న H5N1.. సోకితే 100 మందిలో 50 మంది ఖతం.. మరో మహమ్మారిగా మారుతుందా? -
భారత్ లో ట్విట్టర్ ఆఫీసులు బంద్
-
నేలమీద పడేసి చేతులు విరగ్గొట్టి
టెన్నెసీ: అమెరికాలో పోలీసుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగర పోలీసులు 29 ఏళ్ల నల్లజాతీయుడ్ని దారుణంగా హింసించడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల మొదట్లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి గొంతుపై బూటు కాలుతో తొక్కి చంపిన ఘటనని తలపించేలా ఈ దౌర్జన్య కాండ కూడా సాగింది. కాకపోతే తాజా ఘటనకు పాల్పడ్డ పోలీసులు కూడా నల్లజాతీయులే! ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడెక్స్లో పనిచేసే 29 ఏళ్ల టైర్ నికోల్స్ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మెంఫిస్ పోలీసులు జనవరి 7న ఆపారు. వాహనంలోంచి లాగి నేలమీద పడేసి దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆరుగురు పోలీసులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి, ఎలక్ట్రిక్ పరికరాలతో షాకిచ్చి కిండపడేశారు. ముఖంపై ఇష్టారాజ్యంగా కొట్టారు. వికృతానందంతో నవ్వుతూ భుజం విరిగేలా కొట్టారు. ‘మామ్ , మామ్’ అంటూ నికోల్స్ దీనంగా రోదిస్తున్నా రెండు నిమిషాల పాటు ఆపకుండా చితక్కొట్టారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 10న మరణించాడు. పోలీసులు కొడుతున్న వీడియో చూసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్లంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పోలీసులపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు. నికోల్స్కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నికోల్స్ తన భుజంపై తల్లి వెల్స్ పేరును టాటూగా వేసుకున్నాడు. తన కొడుకు దారుణ హింసకు గురై మరణించాడంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. బైడెన్ దిగ్భ్రాంతి టైర్ నికోల్స్పై పోలీసుల హింసాకాండపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే మనసు కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయులకు దేశంలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలకి ఇది మరొక ఉదాహరణన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. నికోల్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. -
టాటా గ్రూప్ కి షాకిచ్చిన ఎయిర్ ఇండియా ఫైలట్స్
-
జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
-
జీవితా రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్ల టోకరా
-
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు షాక్
-
OTT యూజర్లకు జియో బిగ్ షాక్..
-
ఆ మూడు బ్యాంకులకు RBI షాక్..
-
SBI ఖాతాదారులకు మరో బిగ్ షాక్..
-
పొలిటికల్ కారిడార్ : దత్తపుత్రుడి అగచాట్లు ..
-
అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత
-
జనసేన నేతలపై తిరగబడుతున్న జనం
-
గన్ షాట్ : నీ ప్యాకేజీ మాకొద్దు ..
-
కరెంటు తీగలపై కారు తాళాలు తీస్తూ వ్యక్తి దుర్మరణం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): విద్యుత్ తీగపై పడిన కారు తాళాన్ని తీస్తున్న వ్యక్తికి తీగలు తగలడంతో షాక్ కొట్టి ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన హాసన్ పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు... ఉదయగిరికి చెందిన మల్లప్ప ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నాడు. ఆయన ఇంటి రెండో అంతస్తులో ఉంటాడు. ఏమైందో కానీ ఆయన కారు తాళాలు ఇంటి ముందు వెళ్లే కరెంట్ తీగపై పడ్డాయి. ఇంట్లో చెత్తను ఊడ్చే ఇనుప కడ్డీతో తాళాలను తీసేందుకు యత్నించాడు. ఆ ఇనుప రాడ్ కరెంటు తీగలను తాకగానే పెద్ద మెరుపుతో కూడిన మంటలు వచ్చి షాక్ కొట్టింది. మల్లప్ప అక్కడికక్కడే మరణించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై బడావణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఇనుప కడ్డికీ కరెంట్ తగిలితే ప్రమాదమని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? అని ప్రజలు ఆశ్చర్యపోయారు. చదవండి: (బెంగళూరులో పెరిగిన సహజీవనం కల్చర్.. బాధితులంతా వారే) -
ఎలాన్ మస్క్కు షాకిచ్చిన ట్విట్టర్ ఉద్యోగులు
-
పొలిటికల్ కారిడార్ : యనమలపై కోపాన్ని తీర్చుకుంటున్న నారా లోకేష్
-
ఏబీఎన్, టీవీ5 లకు గట్టి షాక్
-
జనసేనకు హైకోర్టు షాక్...
-
నవయుగ సంస్థకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
చంద్రబాబుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఝలక్
-
కాకినాడలో కేఏ పాల్కు చేదు అనుభవం
-
మినీ మహానాడులో చంద్రబాబుకు బిగ్ షాక్
-
నిర్మలా సీతారామన్కు కర్ణాటక మొండిచేయి?
సాక్షి, బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కర్ణాటక నుంచి ఈసారి షాక్ తగలనుందని సమాచారం. ఆమెకు రాజ్యసభ టికెట్ ఇవ్వకుండా స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె యూపీ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. స్థానికేతరులు అవకాశమిస్తున్నా.. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. జూన్ 10న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నేటి (24వ తేదీ) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రం తరఫున కేసీ రామ్మూర్తి, నిర్మలా సీతారామన్ల పదవీ కాలం ముగియనుంది. ఈ ఇద్దరికీ మళ్లీ టికెట్ ఇచ్చే విషయం సస్పెన్స్గా మారింది. -
చిదంబరానికి సీబీఐ షాక్
-
చనిపోయాడని అంత్యక్రియలు చేస్తే.. తిరిగొచ్చాడు
Tamil Nadu man returns home alive: కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమేనా? లేక కల అనిపిస్తుంది. కళ్లతో చూస్తున్నప్పటకీ ఇది నిజమేనా అని సందేహంగా ఉండిపోతాం. పరిస్థితులు కూడా అలానే ఎదురవుతాయి. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....55 ఏళ్ల మూర్తి అనే వ్యక్తి చనిపోయాడని భావించి ఆదివారం సాయంత్రం అతని బంధువులు ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అతను అనుహ్యంగా సజీవంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా బంధువులంతా షాక్ అయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో బనగలద్పూర్లో చోటుచేసుకుంది. మూర్తి దినసరి కూలీ. చెరకు కోయడానికి కొన్ని రోజుల క్రితం తిరుపూర్ వెళ్లాడు. అయితే అతని కుమారుడు కార్తిక్కి.. మూర్తి ఓ బస్టాప్లో చనిపోయినట్లు బంధువుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అతను సంఘటన స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి తన తండ్రేనని గుర్తించాడు కూడా. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అంతేగాదు ఆ మృతదేహానికి ఆదివారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు కూడా. ఇదిలా ఉండగా 24 గంటల తర్వాత కార్తిక్ వాళ్ల నాన్న మూర్తి అనుహ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబీకులు షాక్ తిన్నారు.ఈ క్రమంతో కార్తీ మాట్లాడుతూ..‘‘మా నాన్న మరణ వార్త విని చాలా షాక్ అయ్యాను. ఇప్పుడు అతను ఇంటికి రావడంతో తాను మరింత షాక్కి గురయ్యాను. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ అన్నాడు. కార్తీ ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించాడు. ఇప్పుడు పోలీసులు చనిపోయిన వ్యక్తి ఎవరా? అని విచారణ చేయడం ప్రారంభించారు. (చదవండి: హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ రైటర్ అరెస్ట్.. ట్విస్ట్ ఏంటంటే..) -
ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి.. అభిమానికి తీవ్ర గాయాలు
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఏ థియేరట్ వద్ద చూసినా డార్లింగ్ అభిమానుల హంగామా కనిపిస్తుంది. సాహో తర్వాత మూడేళ్లకు ప్రభాస్ సినిమా రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ ద్ద భారీ కటౌట్లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని కారంపూడి ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి నెలకొంది. ఈ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. థియేటర్ వద్ద 37ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. -
ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తూ ..
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం సాహెబ్పేట్ గ్రామానికి చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ బట్టు బాలయ్య (59) శనివారం జానకంపేట్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్పై విద్యుదాఘాతానికి గురై మర ణించాడు. ఓ ట్రాన్స్ఫార్మర్ నుంచి వ్యవసాయ పంపులకు విద్యుత్ అందట్లేదని రైతులు చెప్పడంతో ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా ఆపేసిన బాలయ్య దానిపైకి ఎక్కాడు. కానీ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా చేసే ఇన్సులేటర్ ఒకటి విరగడంతో యథావిధిగా విద్యుత్ సరఫరా అయ్యింది. దీన్ని బాలయ్య గమనించకపోవడంతో పైకెక్కగానే షాక్కు గురై ట్రాన్స్ఫార్మర్పైనే మరణించాడు. -
క్రెడిట్ కార్డు కస్టమర్లకు చార్జీల మోత..