sudha murthy
-
‘మా అల్లుడు వెరీగుడ్’: సుధా మూర్తి
తన అల్లుడు ఎంతో మంచివాడని, ఆయన్ని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉందని అంటున్నారు ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి. లండన్ విద్యాభవన్లో జరిగిన దీవాళి గళా కార్యక్రమంలో ఆమె భారతీయ విలువలు, సంస్కృతి మీద మాట్లాడుతూ..మనిషికి మంచి చదువే కాదు.. సంప్రదాయ మూలాలు కూడా ముఖ్యమేనని అంటున్నారు సుధా మూర్తి. శనివారం లండన్లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్లో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూతురు అక్షతా మూర్తి, ఆమె భర్త..బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్లు హాజరయ్యారు.మంచి విద్య మీకు పైకి ఎగరడానికి(ఎదగడానికి) రెక్కలను ఇస్తుంది, కానీ గొప్ప సంస్కృతి మిమ్మల్ని మీ మూలాల్లో నిలబెట్టేలా చేస్తుంది. ఉషా సునాక్(రిషి తల్లి) ఆయన్ని(రిషి) అద్భుతంగా పెంచారు. ఆ పెంపక పునాదుల్లో.. బలమైన భారతీయ సంస్కృతి ఉంది. సునాక్ బ్రిటిష్ జాతి గర్వించదగ్గ వ్యక్తి. అదే సమయంలో.. ఆయన భారతీయ వారసత్వంలో విలువలు కూడా కనిపిస్తాయి అంటూ అల్లుడిని ఆకాశానికెత్తారామె.ఈ సందర్భంగా.. భారతీయ కళను, సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు భారతీయ విద్యాభవన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. భారతీయ సంప్రదాయాల్ని నేర్చుకునేందుకు మీ పిల్లలను ఇక్కడికి(విద్యాభవన్)కు పంపండి. మనం ఒక వయసుకి వచ్చాక.. మన మూలాలను తాకాల్సి ఉంటుంది అంటూ ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్లు సైతం హాజరయ్యారు. విద్యాభవన్ నిర్వాహకులకు రిషి, అక్షతలు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్,అంతకు ముందు.. భవన్ యూకే చైర్మన్ సుభాను సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎన్ నందకుమారలు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే.. భారత కళలను ఎలా ప్రదర్శిస్తున్న తీరును, ఆ సెంటర్ సాధించిన విజయాల్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. రామాయణం, కలిపూజ వంటి అంశాలను ప్రస్తావించారు. పలువురు కళాకారులు భారతీయ నృత్య కళలు ప్రదర్శించారు. -
పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య సుధామూర్తి నెట్ఫ్లిక్స్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో స్టార్ గెస్ట్లుగా పాల్గొన్నారు. అందులో తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. నారాయణ మూర్తి తన 25వ వివాహ వార్షికోత్సవం రోజున సుధామూర్తికి శుభాకాంక్షలు తెలపడం మరిచిపోయానన్నారు.‘ఒకరోజు నేను ఆఫీస్కు బయలుదేరుతుండగా సుధ ఉదయం నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఏదైనా ప్రత్యేకత ఉందా? అని అడిగింది. ఏమీలేదు అని జవాబిచ్చాను. ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వస్తుండగా మళ్లీ ఈరోజు ప్రత్యేకతేంటో ఆలోచించారా? అని అడిగింది. ఏమీలేదని అదే సమాధానం చెప్పాను. నేను ఆ తర్వాతిరోజు ముంబయిలో ఒక సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. నేను ఎయిర్పోర్ట్కు వెళ్లి విమానం ఎక్కుతుండగా నా కూతురు అక్షత(బ్రిటన్ మాజీ ప్రధాని రిషీసునాక్ భార్య) నుంచి కాల్ వచ్చింది. ఏం చేస్తున్నారు? అని అడిగింది. ఫ్లైట్ ఎక్కుతున్నాను అని సమాధానం ఇచ్చాను. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. వేరే విమానం ఎక్కి బెంగళూరు వెళ్లండని చెప్పింది. అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పండని తెలిపింది. మీరు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశానికి హాజరు అవ్వాల్సి ఉంది. వీలైతే మీరు ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకోండి. కానీ అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిందేనని పట్టుపట్టింది’ అని నారాయణమూర్తి చెప్పారు.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్తో దోస్తీ ఇందుకేనా..?సుధామూర్తి నవ్వుతూ ‘అది మా 25వ వివాహ వార్షికోత్సవం. కొంత ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. నా భర్త ఆ విషయాన్ని మరిచిపోయేసరికి ఐదు-పది నిమిషాల పాటు కొంత బాధ అనిపించింది. కానీ ఆయన పనితీరు నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి ఇలాంటి విషయాలు అంతగా పట్టించుకోను. కానీ, ఈ విషయంలో నా కూతురు చాలా కలత చెందింది’ అని చెప్పారు. -
The Great Indian Kapil Show: చూతము రారండీ
వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో పెద్దరికం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్నవాళ్ళయినా, పెద్దవాళ్ళయినా పెద్దరికం అన్నది మహిళలకు ఒక సొగసు. మళ్లీ మగవాళ్లు అలాక్కాదు. వాళ్లకెంత వయసు వచ్చినా కూడా మాటల్లో, చేతల్లో చిన్నవాళ్లే... మహిళలతో పోలిస్తే’!సుధామూర్తి వయసు 74. మూర్తి గారి వయసు 78. ఆమె ఆగస్టు 19 న పుడితే, ఆయన ఆగస్టు 20 న జన్మించారు. తేదీలను బట్టి చూసినా సుధ ఆయన కన్నా ఒకరోజు ‘పెద్దరికం ’ ఉన్నవారు. (తమాషాకు లెండి). సరే, సంగతి ఏమిటంటే... ఈ దంపతులిద్దరూ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఆహ్వానం వస్తే వెళ్లారు. సాధారణంగా కపిల్ బాలీవుడ్ సెలబ్రిటీలను తన టాక్ షో కు పిలుస్తుంటారు. అందుకు భిన్నంగా ఈసారి ఈ బిజినెస్ దిగ్గజ దంపతుల్ని ఒప్పించి రప్పించారు. వారితో టాక్ షో సరదాగా నడిచింది. భర్త గురించి భార్యను, భార్య గురించి భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు యాక్టర్ కమ్ కమెడియన్ కపిల్ శర్మ. వాటిల్లో ఒక ప్రశ్న : ‘మొదటిసారి సుధాజీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెలా అనిపించింది?’ అని అడిగారు కపిల్. దానికి మూర్తి గారు చాలా గంభీరంగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు. ‘ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే.. ఒక స్వచ్ఛమైన గాలి పరిమళం నా శ్వాసలోనికి వెళ్లినట్లుగా...’ అన్నారు. ఆ మాటకు వెంటనే సుధామూర్తి... ‘అప్పుడు ఆయన వయసులో ఉన్నారు కదా’ అన్నారు జోకింగ్గా. దెబ్బకు ఆడియెన్స్ భళ్లుమన్నారు. నిజానికి సుధామూర్తి ఉద్దేశ్యం ఆడియెన్స్ని నవ్వించడం కాదు, భర్తలోని కవితాత్మక భావోద్వేగాన్ని కాస్త నెమ్మది పరచటం. పైగా అంతమంది ఎదుట భర్త తనను అంతగా ‘అడ్మైర్’ చెయ్యటంతో ఆమెలోని పెద్దరికం మధ్యలోనే కల్పించుకుని ఆయన్ని ఆపవలసి వచ్చినట్లుంది. ఆపకపోతే... ఇంకా ఏం చెబుతారో అని. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ నెల 9న నెట్ఫ్లెక్స్లో స్ట్రీమ్ ఆయ్యే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎపిసోడ్లో మూర్తి గారి ఈ అమాయకత్వాన్ని, సుధామూర్తి పెద్దరికాన్ని కనులారా వీక్షించవచ్చు. (డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది)ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు -
కలతలు లేని కాపురానికి సుధామూర్తి చెప్పిన సూపర్ టిప్స్
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ విద్యావేత్త, దాత, రచయితగా పేరు తెచ్చుకున్న సుధామూర్తి తనదైన సూచనలు, సలహాలతో తన అభిమానులకు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇటీవల వైవాహిక జీవితంలో భార్యాభార్తల సఖ్యతకు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలిపారు.సుధామూర్తి చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. ఆమె మాటతీరు, కట్టూ బొట్టూ, ప్రసంగాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఆమె నవ దంపతులకు కూడా చాలా కీలకమైన సలహాలు ఇచ్చారు.కలహాలు లేని కాపురం ఎక్కడా ఉండదుభార్యభర్తలమధ్య తేడాలు, అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. వస్తాయి. కానీ వాటిని చిలికి చిలికి గాలి వానలా మారకుండా ఇరువురూ జాగ్రత్త పడాలి. అసలు కలహాలు,కలతలు లేని కాపురాలు ఎక్కడ ఉంటాయి. తగాదాలు పడని వాళ్లు భార్యభర్తలే కాదు అంటూ సుధామూర్తి తెలిపారు. కానీ ఒకరు గట్టిగా మాట్లాడినపుడు, ఆగ్రహంగా ఉన్నపుడు ఇంకొకరు తగ్గాలి. ఇద్దరూ అరుచుకుంటూ ఉంటే సమస్య పరిష్కారం కాదు. శాంతి, సహనం అనేది ఇద్దరి మధ్య ఉండాలి. ఒకర్నొకరు గౌరవించుకోవాలిఒకళ్లు చెప్పింది మరొకరు వినాలి. ఒకరి విజ్ఞానాన్ని మరొకరు పంచుకోవాలి. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.థ్యాంక్స్ చెప్పుకోవడం, ప్రశంసించుకోవడం ద్వారా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం, ప్రేమ పెరుగుతుంది. భాగస్వామి చేసే చిన్న పనులను గుర్తించి మెచ్చుకోవాలని సుధా మూర్తి సూచించారు. కొన్ని విషయాల్లో ఎవరు ఒకరు రాజీ పడాలి. మార్పునకు సిద్ధంగా ఉండాలి. రిలేషన్ షిప్ కోసం కొన్ని విషయాల్లో రాజీ పడడం దీర్ఘకాలిక సంతోషాల్ని పంచుతుంది.బాధ్యలు బరువులు పంచుకోవాలిఇంట్లో, జీవితంలో బాధ్యతలను, బరువులను పంచుకోవడం చాలా ముఖ్యం. జీవితం అంటేనే కష్టనష్టాల పయనం. ఎవ్వరమూ పర్ఫెక్ట్ కాదు. లోటుపాట్లను గమనించుకొని అర్థం చేసుకొనిముందుకు సాగాలి. కష్టనష్టాలను, బరువు బాధ్యతలను సమానంగా పంచుకోవడంలోనే అసలైన భార్యభర్తల విలువ తెలుస్తుంది. అబ్బాయిలకో సలహాముఖ్యంగా ఈతరం అబ్బాయిలకు చెప్పేది ఒకటే. వంటగదిలో భార్యకు సహాయం చేయడం అనేది చాలా ముఖ్యం. జీవితభాగస్వామి కష్టాల్ని, బాధ్యతల్ని పంచుకోవడం ద్వారా టీం వర్క్,భాగస్వామ్య అనేభావాలను పెంపొదిస్తుంది. ఆధునిక ప్రేమ అనే అంశంపై ఏర్నాటు చేసిన ఒక కాంక్లేవ్లో సుధామూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగానే ఆమె యువ జంటలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. దంపతులుగా తామూ ఈ విషయాలను పాటించామని, ఇవే తమ సక్సెస్ మంత్రా అని సుధామూర్తి వివరించారు. -
నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్
రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి రక్షా బంధన్ సందర్భంగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పండుగ వెనుక ఉన్న కథను షేర్ చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. అంతకు మించే రాఖీ పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయంటూ పోస్టలు పెట్టారు. ఇంతకీ ఆమె షేర్ చేసుకున్న కథ ఏంటంటే.. రక్షా బంధన్ తనకు ఒక ముఖ్యమైన పండుగా అని చెప్పారు. ఇది ఒక సోదరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నాకు సహాయం చేయాలని సూచించే రక్షయే ఈ చిన్న దారం అని అన్నారు. అందుకు సంబంధించిన గాథను కూడా చెప్పుకొచ్చారు. "మేవార్ రాజ్యపు కర్ణావతి తన రాజ్యం శత్రు రాజుల దాడికి గురై సంకట స్థితిలో ఉన్నప్పుడూ పొరుగున ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయున్కు ఒక చిన్న దారం పంపింది. ఇది తాను ఆపదలో ఉన్నాను, దయచేసి నన్ను మీ సోదరిగా పరిగణించి రక్షించండి అని ఆ దారం రూపంలో హుమాయున్ రాజుకి సందేశం పంపింది. అయితే హుమాయున్ ఆ దారం అర్థం ఏంటో అస్సలు తెలియదు. తన మంత్రుల ద్వారా అసలు విషయం తెలుసుకుని రక్షించేందుకు ఢిల్లీ పయనమయ్యాడు. అయితే సమయానికి హుమాయున్ చేరుకోలేకపోవడంతో కర్ణావతి మరణించింది." అని సుదామూర్తి పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే వినయోగదారులు ఈ వ్యాఖ్యలతో విభేధించడమే గాక మహాభారత కాలంలోనే రక్షాబంధన్ గురించి ఉందంటూ నాటి ఘటనలను వివరించారు. శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా శ్రీకృష్ణుడి వేలుకి గాయమవ్వడం జరుగుతుంది.వెంటనే ద్రౌపది చీర కొంగు చింపి కట్టిందని, అందుకు ప్రత్యుపకారంగా కౌరవులు నిండు సభలో అవమానిస్తున్నప్పుడూ ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడని అన్నారు. అలాగే బలిచక్రవర్తి పాతాళ రాజ్యాన్ని రక్షిస్తుండేవాడు. అతడు తన భక్తితో విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన్నే రాజ్యనికి కాపలాగా ఉంచాడు. అయితే లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని ఈ శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ కట్టి తన భర్తను దక్కించుకుందని పురాణ వచనం అంటూ సుధామూర్తి పోస్ట్కి కౌంటర్ ఇస్తూ పోస్టులు పెట్టారు. కాగా, చిన్నప్పుడు తాను తెలుసుకున్న రాఖీ పండగ కథలను తెలియజేయాలనుకోవడమే తన ఉద్దేశమని సుధామూర్తి వివరణ ఇచ్చారు. (చదవండి: 'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!) -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ!
రాజ్యసభ, ఎంపీ, రచయిత సుధానారాయణమూర్తి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను జోడిస్తూ, మరికొన్ని అవగాహన కల్పించే అంశాలను తన అభిమానులతో కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన చిన్నప్పటి ఫోటో ఒకటి ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.‘‘ఈ ఫోటో నాకు సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు హుబ్లీలోని ఒక స్టూడియోలో తీసింది. ఆ సమయంలో, మేము షిగ్గావ్లో ఉండేవాళ్లం, కానీ అక్కడ స్టూడియోలు లేనందున, మేము ఈ ఫోటో కోసం హుబ్లీకి వెళ్లాం’’ అంటూ సుధామూర్తి తన బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు.This picture was taken in a studio in Hubli when I was around 1 year old. At the time, we were living in Shiggaon, but since there were no studios there, we travelled to Hubli for this photograph. pic.twitter.com/YjhjJ3Aw5L— Smt. Sudha Murty (@SmtSudhaMurty) July 30, 2024 -
30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనలేదు
-
వ్యాక్సిన్ ఇప్పిద్దాం...మహిళల ప్రాణాలు కాపాడదాం
రాజ్యసభ సభ్యురాలిగా మొదటిసారి సమావేశాల్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి భారతీయ పేద మహిళల్లో ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటున్న సర్వైకల్ క్యాన్సర్ మరణాల గురించి మాట్లాడారు. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం వేక్సిన్ ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. నిజమే. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇది చైతన్యం కలిగించాల్సిన సమయం. ప్రభుత్వం పూనుకోవాల్సిన సమయం.కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాప్తి 7% నుంచి 27% మందిలో కనిపిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్గా మారనప్పటికీ, చాలా కేసుల్లో క్యాన్సర్ ముప్పు మాత్రం ఉంటుంది. పద్ధెనిమిదేళ్ల తర్వాత పెళ్లయ్యే యువతులతో పోలిస్తే అంతకంటే ముందుగానే వివాహమయ్యేవారిలో ఇది ఆరు శాతం ఎక్కువ. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతి ఏడాది 1,23,907 మంది మహిళల్లో దీన్ని కనుగొంటుండగా... ఏటా 77,348 మంది మరణిస్తున్నట్లు అంచనా. గణాంకాల ప్రకారం సంఖ్యాపరంగా పదిహేనో ఏటి నుంచి 44 ఏళ్ల మహిళల్లో వస్తూ, వారిని మృత్యుముఖానికి నెట్టే క్యాన్సర్లలో ఇది రెండో అతి పెద్దది.ఏమిటీ సర్వైకల్ క్యాన్సర్? మహిళల్లో యోని (వెజైనా) తర్వాత వచ్చే భాగమే సర్విక్స్. ఇది గర్భాశయానికి కింద ఉంటుంది. అంటే ఇది యోనికీ, గర్భాశయానికీ (యుటెరస్)కూ మధ్యన సన్నటి దారిలా ఉండే సర్విక్స్ గర్భాశయానికి ముఖద్వారంలా ఉంటుంది కాబట్టే దీన్ని ‘గర్భాశయ ముఖద్వారం’ అనీ, దీనికి వచ్చే క్యాన్సర్ను ‘సర్వైకల్ క్యాన్సర్’ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) అని అంటారు. నిజానికి మిగతా క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం మంచి పరిష్కారం. దీని చికిత్స కూడా చాలా సులభం. ఎంత ముందుగా గుర్తిస్తే దీనికి అంత సమర్థంగా, తేలిగ్గానూ చికిత్స అందించవచ్చు. సాధారణంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో, నగరాల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఈ క్యాన్సర్ విషయానికి వస్తే ఇది గ్రామీణ ప్రాంతాల స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చిన్నవయసులోనే అందునా పద్ధెనిమిదేళ్ల వయసు కంటే చాలా తక్కువ వయసులోనే అక్కడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ ఉండటం ఇందుకు ఒక కారణమని కొంతమంది పరిశీలకుల విశ్లేషణ. అయితే ఇంతటి తీవ్రమైన వ్యాప్తిలోనూ అదృష్టం ఏమిటంటే... ఈ క్యాన్సర్ రావడానికి ముందర కనీసం 10 ఏళ్ల ముందుగానే కనుగొనగలిగేలా దీనికి చాలా ఎక్కువ వ్యవధిగల ప్రీ–క్యాన్సరస్ దశ ఉంటుంది. ఈ సమయంలో కనుగొనగలిగితే దాన్ని దాదాపు పూర్తిగా నయం చేయడానికి అవకాశముంటుంది.ప్రధాన రకాలు... సర్వైకల్ క్యాన్సర్లలో రెండు ప్రధాన రకాలుంటాయి. మొదటిది తరచుగా కనిపించే ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే రకం. రెండోది ‘అడెనోకార్సినోమా’ తరహాకు చెందినదైతే, ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే, సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించవచ్చు. ఇది కాస్త అరుదు. రిస్క్ ఫాక్టర్లు...హెచ్పీవీ వైరస్ సోకడం అనేది సర్వైకల్ క్యాన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. చాలామందిలో ఈ హెచ్పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్యాన్సర్కు దారితీసే ప్రమాదమముంది. అలాగే పొగ తాగడం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్కు దారితీసే రిస్క్ఫ్యాక్టర్లలో కొన్ని.చికిత్స ప్రక్రియలు... ఈ క్యాన్సర్ల మొదటి, రెండో దశల్లో శస్త్రచికిత్స అయినా, రేడియోథెరపీ, కీమోథెరపీ... ఈ మూడూ బాగానే పనిచేస్తాయి. అయితే ఈ అన్ని చికిత్సా ప్రక్రియలకు వాటివాటి ప్రయోజనాలూ, దుష్ప్రభావాలూ రెండూ ఉంటాయి. చికిత్సకు ముందు ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. సర్జరీతో సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. సర్జరీ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే సాధారణ జీవితం గడిపేలా బాధితులు కోలుకోగలరు. సర్జరీ విజయావకాశాలు 75% నుంచి 90% వరకు ఉంటాయి. పైగా చిన్నవయసులోనే దీని బారిన పడ్డవారికి డాక్టర్లు సాధారణంగా శస్త్రచికిత్సనే సూచిస్తుంటారు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. ఇక సర్జరీతో వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువే. ఇది ఎంతమాత్రమూ ప్రాణాంతకం కాదు. ఇక కొద్దిమందిలో సర్జరీ తర్వాత కాంప్లికేషన్లు వస్తే / సర్జరీ అంటే భయపడేవారికి డాక్టర్లు ‘రాడికల్ రేడియోథెరపీ’ అనే చికిత్స చేస్తారు. హెచ్పీవీతో సమర్థమైన నివారణమామూలుగా శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ ను తయారుచేస్తుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్ను తెచ్చిపెట్టే హెచ్పీవీ వైరస్ విషయంలో మాత్రం మహిళల దేహం ఎలాంటి యాంటీబాడీస్లనూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి హెచ్పీవీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం శరీరంలో ఉండిపోయి సర్వైకల్ క్యాన్సర్కు దారితీయవచ్చు. అదే హెచ్పీవీ వ్యాక్సిన్ను మహిళకు తొమ్మిది నుంచి 26 ఏళ్ల వయసు లోగా ఇప్పిస్తే యాంటీబాడీస్ను తయారుచేసి, సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కేవలం బాలికలు, యువతులకే కాకుండా బాలురు, యువకులకూ కూడా ఇచ్చే అత్యాధునిక వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే పురుషులు క్యారియర్లుగా మారి దీన్ని మహిళలకు వ్యాప్తి చేస్తారు కాబట్టి మగవాళ్లకూ ఇచ్చే వ్యాక్సిన్లు రూపొందాయి. ఇవి ఒకటి రెండు రకాలకే గాక... మరిన్ని రకాల సర్వైకల్ క్యాన్సర్లను నివారిస్తాయి. 9 నుంచి 14 ఏళ్ల మగపిల్లల్లో రెండు డోసులూ, పధ్నాలుగేళ్లు దాటిన వారికి 0, 2, 6 నెలల్లో వరసగా ఇవ్వాలి. కారణాలుసర్విక్స్ మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన కారణంగా క్యాన్సర్కు గురయ్యే అవకాశాలెక్కువ. సర్వైకల్ క్యాన్సర్కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) ప్రధానం. ఈ వైరస్ లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్పీవీ వైరస్ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే క్యాన్సర్ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్స్లో పాల్గొనేవారికీ హెచ్పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ... సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్స్మియర్ మంచి పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, లైంగిక జీవితం ప్రారంభమై మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో మరో వెసులుబాటు ఏమిటంటే ఇది రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దీన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–క్యాన్సరస్ దశ’ దీనికి ఉంది డా‘‘ కావ్య ప్రియ వజ్రాల లీడ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ – రిస్క్ ఆబ్స్టెట్రీషియన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కు వ్యాక్సిన్ను ప్రభుత్వమే అందజేస్తే మహిళాలోకానికి చాలా మేలు చేసినట్లవుతుంది. తమ కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, ఏ నాలుగో దశలోనో, మూడో దశలోనో హాస్పిటల్స్కు వస్తూ, చేజేతులా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. అదే తొమ్మిది నుంచి 45 ఏళ్ల వయసులోనే వారికీ వ్యాక్సిన్ ఇప్పిస్తే ఎన్నో మరణాలను నివారించగలం. కోవిడ్ టైమ్లో దేశం మొత్తానికి వ్యాక్సిన్ ఇప్పించిన మనకు ఇదేమీ కష్టం కాబోదు. ప్రైవేటు సంస్థల్లో దీన్ని దాదాపు రూ. 1,400 నుంచి రూ. 1,500 లకు అమ్ముతున్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపి, చవగ్గా ఏ ఏడువందల రూపాయలకో ఇప్పించగలిగితే అత్యంత నిరుపేద మహిళల ప్రాణాలనూ మనం కాపాడ గలిగినవాళ్లమవుతాం. – సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలు, సమాజ సేవిక -
'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం..!
ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ దాతృత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి చాలా సింపుల్గా ఉంటారు. చెప్పాలంటే సింపుల్ సిటీకి కేరాఫ్ ఆమె అన్నంతగా చాలా సాదాసీదాగా ఉంటారామె. అయితే ఆమె వద్ద ఎన్నో చీరలు ఉండవని, షాపింగ్ చేయరని కథలు కథలుగా విన్నాం. రెండు లేదా మూడో చీరలే ఉంటాయని సుధా కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేంటి ఇన్ఫోసిస్ కంపెనీ అధినేత భార్య వద్ద అన్నే చీరలా అని అందరూ ఆశ్చర్యపోయారు కూడా. నేటి రోజుల్లో చిన్నగా స్టార్డమ్ వచ్చి, పేరు ప్రఖ్యాతలు వస్తేనే..వారి రేంజ్, లుక్కు మారిపోతుంది. ఏదో గోల్డ్స్పూన్ బేబీ మాదిరి ఫోజులు ఇచ్చేస్తుంటారు. అదొక స్టేటస్ ఆఫ్ సింబల్ అన్నట్లు ఉంటుది వ్యవహారం. కానీ ఆమె ఆహార్యం సాధారణ గృహిణిలా ఉంటుంది. ఇటీవలే అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఆమె రాజ్యసభ ఎంపీగా నామనేట్ అయ్యిన సంగతి తెలిసిందే. లోక్సభలో రాజ్యసభ ఎంపీగా తొలి ప్రసంగంలో చాలా ముఖ్యమైన అంశాలపై మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని మోదీ సైతం ఆమె ప్రసంగానికి ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన వద్ద చీరలు ఎందుకు లేవు? తాను ఎందుకు కొనుగోలు చెయ్యరో తదితర ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తాను 30 ఏళ్లుగా చీర కొనలేదని అన్నారు. కాశీ పర్యటనకు వెళ్లినప్పుడూ మనకు బాగా ఇష్టమైనది వదిలేయాలి అని అంటారు. అందుకోసం తాను బాగా ఇష్టపడే షాపింగ్ ని వదిలేస్తానని గంగామాతకు వాగ్దానం చేశానని అన్నారు. తనకు పొదుపుగా, సింపుల్గా ఉండటం తన తల్లిదండ్రులు, తాతల నుంచి వచ్చిందని చెప్పారు. తన తల్లి చనిపోయినప్పుడూ ఆమె వస్తువులు పంచేందుకు కేవలం అరంగంట సమయమే పట్టిందన్నారు. ఎందుకంటే అప్పటికీ ఆమె వద్ద కేవలం నాలుగు చీరలు ఉన్నాయి. ఇలా సింపుల్గా బతకడం వాళ్ల పెంపకం నుంచి మొదలయ్యింది కాబట్టి చాలా సులభంగా సాదాసీదాగా జీవిస్తున్నానని అన్నారు. రెండు దశాబ్దాలుగా తన సోదరీమణులు, సన్నిహితులు, తాను పనిచేసే ఎన్జీవోలు తనకు బహుమతిగా చీరలు ఇస్తుంటారని, వాటినే తాను ధరిస్తానని చెప్పారు. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్తో కలిసి పనిచేయడం ద్వారా జీవితాలు మారిపోయిన మహిళల బృందం చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చీరలు ఇచ్చారని అవే తన వద్ద ఉన్నాయని సుధామూర్తి అన్నారు. అంతేగాదు తన సోదరీమణులు ప్రతి ఏడాది బహుమతిగా ఇస్తున్న చీరల సేకరణ పెరుగుతున్నందున నిర్వహించడం కష్టంగా ఉందని వారికే నేరుగా చెప్పేశానని అన్నారు. అంతేగాదు సుధామార్తి చీరలు ధరించిన పర్యావరణ హితార్థం కనీసం ఐరన్ కూడా చేయించరు. అలాగే నేలను తుడిచేలా చీరను ధరించను కాబట్టి చాలా జాగ్రత్తగా, మన్నికగా బట్టలను వాడతాను కాబట్టి పెద్దమొత్తంలో చీరలు కావాల్సిన అవసరం పడలేదన్నారు. అపార సంపద ఉన్నప్పటికీ..అత్యంత సాదాసీదాగా జీవిస్తారు సుధా. ఆమె నుంచి సాధారణ జీవితంలోని గొప్పతనం, పొదుపుగా ఉండటం రెండూ నేర్చుకోవచ్చు. మనిషి వద్ద ఉండే అపారమైన మేధస్సు, జ్ఞానానికి మించిన గొప్ప వస్తువులు ఏమీ అవసరం లేదని సుమధామూర్తి ఆచరించి చూపిస్తున్నారు. అపారమైన సంపద ఉండి కూడా ఓ సాధారణ వ్యక్తిలా ఉండే ఆమె ఆహార్యం ఎందరికో స్ఫూర్తి. ఇక ఆమె అనేక పుస్తకాలు రచించారు, ముఖ్యంగా పిల్లలపై ఎక్కువగా రాశారు.(చదవండి: ఆ యోగాసనంలో కాబోయే తల్లి దీపికా పదుకొణె..ఆ టైంలో మంచిదేనా..!) -
సుధామూర్తి తొలి స్పీచ్..ప్రధాని ప్రశంసలు
న్యూఢిల్లీ: పుస్తక రచయిత్రి, దాత, ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఎంపీగా రాజ్యసభలో తొలిసారి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యం అంశంపై ఆమె ప్రసంగించారు. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. బుధవారం(జులై 3) ఎగువసభకు వచ్చిన ఆయన సుధామూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవలే సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె సభలో మాట్లాడారు. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు. ఆ వ్యాక్సిన్ను తీసుకుంటే క్యాన్సర్ను అడ్డుకోవచ్చన్నారు. చికిత్స కంటే నివారణే మేలని చెప్పారు. ఈసందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది తీరని లోటు అన్నారు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని, ఆ అనుభవంతో సర్వైకల్ వ్యాక్సిన్ను బాలికలకు అందించడం సులభమన్నారు. దీంతోపాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు. దేశానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటే ఆదాయం పెరుగుతుందని సూచించారు. సుధామూర్తి చేసిన ఈ ప్రసంగంపై ప్రధాని స్పందించారు. మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలని అన్నారు. గత పదేళ్లకాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టిసారించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని, గర్భిణీలకు వ్యాక్సినేషన్ తీసుకువచ్చామని వెల్లడించారు. -
‘ఆడామగా సమానమే, కానీ పురుషుల్లో..’ సుధామూర్తి కీలక వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి లింగ సమానత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితం అనే బండికి చక్రల్లాంటివారు. జీవన యానం సాఫీగా సాగాలంటే ఇద్దరూ ఉండాలి.. తన దృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమే కానీ, వేర్వేరు మార్గాల్లో అన్నారు.లింగ సమానత్వం అంటే ఏమిటో వివరిస్తూ ఒక వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. స్త్రీ, పురుషులు సైకిల్కి రెండు చక్రాల్లాంటివారు. వీరిలో ఎవరూ లేకపోయినా బండి ముందుకు సాగదు.. అని ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి మూర్తి పేర్కొన్నారు.In my view, men and women are equal but in different ways. They complement each other like two wheels of a bicycle; you can't move forward without the other. pic.twitter.com/MMShEOtg9Q— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 27, 2024మహిళలు పురుషులు ఇద్దరూ ఒకరికొకరు భిన్నం. ఇద్దరిలోనూ ప్లస్, మైనస్లు ఉంటాయి. అయితే పురుషులతో పోలిస్తే మహిళలకు చాలా భాష తెలుసు. మేనేజ్మెంట్లో వారు చాలా అద్భుతం. పుట్టుకతోనే వారు మంచి మేనేజర్లు. ప్రేమ, జాలి కరుణ ఎక్కువ. అమ్మ, నాన్న, తోబుట్టువులు, అత్తమామలు, వదినలు, పిల్లలు ఇలా సన్నిహిత బంధువులు అందరికీ చక్కటి ప్రేమను పంచుతారు. మరోవైపు పురుషులు మహిళలంత భావోద్వేగులు కాదు. కొంచెం భిన్నం. పురుషుల్లో మంచి ఐక్యూ ఉండివచ్చు కానీ,మంచి ఈక్యూ (ఎమోషనల్ కోషెంట్) ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. -
నన్ను ప్రశంసించడానికి కాల్ చేస్తే.. రాంగ్ కాల్ అని పొరబడ్డా : సుధామూర్తి
‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, రచయిత, రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత డా. ఏపీజే అబ్దుల్ కలాం నుంచి తనకు పోన్ వస్తే రాంగ్ కాల్ అంటూ ఆపరేటర్కి చెప్పిన సంగతిని ప్రస్తావించారు. నిజానికి తన భర్త నారాయణ మూర్తికి ఉద్దేశించిన కాల్ ఏమో అనుకుని పొరపాటు పడ్డానని చెప్పారు. ఆ తరువాత విషయం తెలిసి చాలా సంతోషించానని ఆమె పేర్కొన్నారు.Once I received a call from Mr. Abdul Kalam, who told me that he reads my columns and enjoys them. pic.twitter.com/SWEQ6zfeu4— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 25, 2024 విషయం ఏమిటంటే..ఎక్స్ వేదికగా సుధామూర్తి దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్ కలామ్ నుంచి తనకు ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో వివరించారు. ‘ఐటీ డివైడ్' పేరుతో సుధామూర్తి ఒక కాలమ్ నడిపేవారు. దీన్ని అబ్దుల్ కలాం క్రమం తప్పకుండా చదివేవారట. అంతేకాదు ఈ రచనను బాగా ఆస్వాదించేవారు కూడా. ఇదే విషయాన్ని స్వయంగా ఆమెకు చెప్పేందుకు అబ్దుల్ కలాం ఫోన్ చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ఫోన్ కాల్ వస్తే ‘రాంగ్ కాల్’ అని (ఆపరేటర్కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణమూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే అలా చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ‘‘లేదు లేదు.. ఆయన (అబ్దుల్ కలాం) ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు’ అని ఆపరేటర్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. తాను కాలమ్ని చదివి ప్రశంసించడానికి కలాం ఫోన్ చేశారని తెలిసి చాలా సంతోషించాననీ, చాలా బావుందంటూ మెచ్చుకున్నారని సుధా మూర్తి ప్రస్తావించారు. ఈ సందర్బంగా కలాం నుంచి పౌరపురస్కారం అందుకుంటున్న ఫోటోని కూడా ఆమె పోస్ట్ చేశారు. కాగా రచయితగా పరోపకారిగా సుధామూర్తి అందరికీ సుపరిచితమే. బాల సాహిత్యంపై పలు పుస్తకాలు రాశారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఆమె సాహిత్యానికి పలు అవార్డులు కూడా దక్కాయి. 73 ఏళ్ళ వయసులో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇంకా అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) కూడా ఆమెను వరించాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
రాజ్యసభ ఎంపీగా 'సుధామూర్తి' ప్రమాణ స్వీకారం
ఇంజనీర్ నుంచి పరోపకారిగా మారి ఎంతోమందికి సహాయం చేస్తున్న'సుధామూర్తి' ఈ రోజు (గురువారం) తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్లోని తన ఛాంబర్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించింది. కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారంలభించింది. అంతే కాకుండా ఈమెను 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. TELCOతో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ అయిన సుధామూర్తి.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా మారిన ఇన్ఫోసిస్ ప్రారంభానికి ప్రధాన కారకురాలు కూడా. #WATCH | Author and philanthropist Sudha Murty, nominated to the Rajya Sabha by President Droupadi Murmu, takes oath as a member of the Upper House of Parliament, in the presence of House Chairman Jagdeep Dhankhar Infosys founder Narayan Murty and Union Minister Piyush Goyal… pic.twitter.com/vN8wqXCleB — ANI (@ANI) March 14, 2024 -
సూధామూర్తి ఆస్తి విలువ ఎంతో తెలుసా..
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఎంపీగా నియమితులైన సుధామూర్తికి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్లో 0.83% వాటాకు సమానమైన 3.45 కోట్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుత షేరు ధర రూ.1,616.95 ప్రకారం, సుధామూర్తి షేర్ల విలువ రూ.5,600 కోట్ల వరకు ఉండొచ్చు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్లో 1.66 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ.2,691 కోట్లు. 2006లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న సుధామూర్తికి.. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ పురస్కారమూ లభించింది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ భార్య అక్షతామూర్తి ఈమె కుమార్తె. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం ‘సుధామూర్తిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. సామాజిక కార్యకలాపాలు, దాతృత్వం, విద్య.. ఇలా పలు విభాగాల్లో ఆమె అందించిన సేవలు అమోఘం. రాజ్యసభ సభ్యురాలిగా దేశ భవిష్యత్తును మార్చడంలో నారీశక్తికి నిదర్శనంగా ఆమె తన వంతు పాత్ర పోషిస్తారని కోరుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్లో తెలిపారు. -
International Womens Day 2024: రాజ్యసభకు సుధామూర్తి
సాక్షి, న్యూఢిల్లీ/బనశంకరి: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రాజ్యసభకు నామినేట్ చేయడం తనకు డబుల్ సర్ప్రైజ్ అని సుధామూర్తి పేర్కొన్నారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదని చెప్పారు. రాష్ట్రపతి తనను పెద్దల సభకు నామినేట్ చేయడానికి గల కారణం తెలియదని అన్నారు. ఉన్నత చట్టసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇది తనకు కొత్త బాధ్యత అని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యురాలిగా తన వంతు సేవలు అందిస్తానని వివరించారు. ప్రధాని మోదీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం థాయ్లాండ్లో పర్యటిస్తున్న సుధామూర్తి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాష్ట్రపతిద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రంగాల్లో ఎన్నెన్నో సేవలు అందించిన సుధామూర్తి చట్టసభలోకి అడుగు పెడుతుండడం నారీశక్తికి నిదర్శనమని మోదీ ఉద్ఘాటించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. టెల్కోలో తొలి మహిళా ఇంజనీర్ డాక్టర్ సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జని్మంచారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ ఆర్హెచ్ కులకరి్ణ, విమలా కులకరి్ణ. సుధామూర్తి హుబ్లీలోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో బీఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కంప్యూటర్స్లో ఎంఈ చేశారు. టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్ కంపెనీ(టెల్కో)లో ఉద్యోగంలో చేరారు. దేశంలోనే అతి పెద్దవాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్గా గుర్తింపు పొందారు. 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సుధామూర్తి సహ వ్యవస్థాపకురాలు. సంస్థ ప్రారంభించే సమయంలో రూ.10వేలు తన భర్తకు ఇచ్చి ప్రోత్సహించారు. సేవా కార్యక్రమాలు.. పురస్కారాలు 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను సుధామూర్తి ప్రారంభించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో పలు పుస్తకాలు రాశారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం 2,300 ఇళ్లు నిర్మించారు. పాఠశాలల్లో 70 వేల గ్రంథాల యాలు నిర్మించారు. భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ,, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు స్వీకరించారు. సాహిత్యంలో ఆమె చేసిన సేవకుగానూ ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం, శ్రీరా జా–లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. భర్త నారాయణమూర్తి (2014)తో సమానంగా 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ద్వారా తాను అందుకున్న మొత్తాన్ని టోరంటో విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. నాన్ఫిక్షన్ విభాగంలో క్రాస్వర్డ్ బుక్ అ వార్డు, ఐఐటీ–కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు అక్షతామూర్తి, రోహన్మూర్తి సంతానం. అక్షతామూర్తి భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి. వీరిది ప్రేమ వివాహం. రాజ్య సుధ – ప్రత్యేక కథనం ఫ్యామిలీలో.. -
Infosys Sudha Murty: రాజ్య సుధ
సాటి మనుషుల కోసం పని చేయడం సామాజిక సేవ ద్వారా పరిస్థితులను మెరుగుపరచడం యువతకు స్ఫూర్తిగా నిలవడం.. రచయితగా ఎదగడం ఇన్ఫోసిస్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం సుధామూర్తిని నేడు రాజ్యసభకు చేర్చాయి. ఉమెన్స్ డే రోజు ఆమెను రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి జీవన విశేషాలు. ► తొలి పాఠాలు సుధామూర్తి బాల్యం హుబ్లీలో గడిచింది. తండ్రి కులకర్ణి డాక్టర్. ఆయన రోజూ టీ సేవించేవాడు. ఒకరోజు పాలు రాలేదు. తండ్రి టీ తాగక వేరే ఏ పనీ మొదలుపెట్టలేక కూచుని ఉన్నాడు. ‘ఏంటి నాన్నా?’ అని అడిగింది సుధామూర్తి. ‘ఉదయాన్నే టీకి నేను అలవాటు పడ్డానమ్మా. ఇవాళ టీ తాగక తలనొప్పి వచ్చింది. నువ్వు మాత్రం దేనికీ అతిగా అలవాటు పడకు.. కాఫీ, టీలకైనా సరే’ అన్నాడు. సుధామూర్తి ఆ పాఠాన్ని గుర్తు పెట్టుకుంది. ఇవాళ ఆమెకు డెబ్బై నాలుగు ఏళ్లు. నేటికీ ఉదయాన్నే లేచి టీగానీ కాఫీ గాని తాగి ఎరగదు. సుధామూర్తి హుబ్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షిగావ్లో పుట్టింది. అక్కడ ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య స్కూల్ టీచర్. ఆయన తనకంటే వయసులో ఎంత చిన్నవారినైనా ‘మీరు’ అని బహువచనం వాడేవారు. ‘నీ కంటే చిన్న కదా తాతయ్య’ అని సుధామూర్తి అంటే ‘లోపలి ఆత్మ పెద్దదే కదమ్మా’ అనేవారు. ఎదుటివారిని గౌరవించడం అలా నేర్చుకుందామె. తాతయ్య ఆమెకు మూడు జీవన పాఠాలు నేర్పారు. 1.సింపుల్గా జీవించు 2.జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండు 3. పుస్తకాలు చదువు. ఇవి సుధామూర్తి నేటికీ పాటిస్తూనే ఉంది. అమ్మమ్మ ‘ఆకలితో ఉన్నవారిని గమనించు’ అని చెప్పింది. వాళ్ల ఇంటికి రోజూ ఒక భిక్షకుడు వస్తే ఇంట్లో మంచి బియ్యం నిండుకుని ముతకబియ్యం ఉన్నా అమ్మమ్మ మంచి బియ్యమే భిక్షకుడికి వేసేది. ‘ముతక బియ్యం మనం తినొచ్చులే’ అనేది. ఇదీ సుధామూర్తికి తొలి పాఠమే. ఇక అమ్మ విమల నేర్పిన పాఠం– ‘ఎంతో అవసరమైతే తప్ప డబ్బు ఖర్చు పెట్టకు’ అని. అంతే కాదు నీకు బాల్యంలో మంచి అలవాట్లు ఉంటే అవే కాపాడతాయి అని కూడా ఆమె అనేది. ఉదయాన్నే లేచి కాగితం మీద 10 సార్లు ‘దేవుడికి నమస్కారం’ అని రాయించేదామె. నేటికీ సుధా మూర్తి ఆ అలవాటును మానలేదు. ఇక స్కూల్ టీచరు రాఘవేంద్రయ్య... ‘నీకు లెక్కలు భలే వస్తున్నాయి. లెక్కల్ని వదలకు. పైకొస్తావ్‘ అన్నాడు. ఆమె ఆనాటి నుంచి లెక్కల్నే రెక్కలుగా చేసుకుంది. ► కుతూహలమే గురువు చిన్నప్పుడు సుధామూర్తికి ప్రతిదీ కుతూహలమే. వీధుల్లో కొట్లాటలు అవుతుంటే అక్కడకు పరిగెత్తి వెళ్లి నిలబడేది. వినోదం కోసం కాదు. కారణం ఏమై ఉంటుందా అని. చిన్న ఊళ్లో ప్రతి ఇల్లూ అందరికీ పరిచయమే. అందరి జీవితాలనూ ఆమె పరిశీలిస్తూ ఉండేది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగితే ఆమె తప్పని సరిగా ఒక స్టీలు క్యారేజీ తీసుకుని బయలుదేరేది. విందులో ఏ పదార్థాలు బాగున్నాయో ఏ పదార్థాలు బాగలేవో మొత్తం రుచి చూసి వస్తూ వస్తూ బాగున్న వాటిని క్యారేజీలో అడిగి తెచ్చుకునేది. కాలేజీ రోజుల వరకూ కూడా పెళ్ళిళ్లకు క్యారేజీ తీసుకోకుండా సుధామూర్తి వెళ్లేది కాదు. ‘ఎందుకో నాకు గిన్నెల క్యారేజీ అంటే నేటికీ ఇష్టం’ అంటుందామె. ► మసాలా దోసె పార్టీ లెక్కలు బాగా నేర్చుకున్న సుధా హుబ్లీలోని బి.వి.బి. కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేరింది. ఇక ఆ రోజు నుంచి ఊళ్లోని పెద్ద మనుషులంతా ఆమె తండ్రి దగ్గరకు వచ్చి వాపోవడమే. ‘అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నావ్. పెళ్లెవరు చేసుకుంటారు’ అని బెంగపడటమే. తండ్రి కూడా ఒక దశలో తప్పు చేశానా అనుకున్నాడు. కాని సుధామూర్తి మొదటి సంవత్సరానికి ఫస్ట్ క్లాస్లో పాసైంది. తండ్రికి సంతోషం కలిగింది. ‘ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావ్ కదా... పద మసాలా దోసె పార్టీ చేసుకుందాం’ అని తీసుకెళ్లాడు. ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్క్లాస్ తెచ్చుకోవడం.. తండ్రి తీసుకెళ్లి మసాలా దోసె తినిపించడం. ఆ తండ్రీ కూతుళ్ల జీవితంలో పార్టీ చేసుకోవడం అంటే అదే. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ‘కాని ఆ పార్టీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అపురూపం అనిపించేది’ అంటుందామె. ► చరిత్ర మార్చిన కార్డు ముక్క 1974లో టాటా వారి ‘టెల్కో’ సంస్థలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు పడ్డాయి. పేపర్లో ఆ యాడ్ చూసింది సుధామూర్తి. అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. కాని యాడ్ కింద ‘స్త్రీలు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఉంది. అప్పుడు సుధామూర్తికి ఆగ్రహం వచ్చింది. రోషం కలిగింది. జె.ఆర్.డి.టాటాకు ఒక కార్డు గీకి పడేసింది. ‘దేశంలో ఉన్న ఇంతమంది స్త్రీలకు పని చేసే హక్కు లేకపోతే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు?’ అని ప్రశ్న. ఆ కార్డు జె.ఆర్.డి. టాటాకు చేరింది. ఆ వెంటనే ఆమెకు ఇంటర్వ్యూకు పిలుపు, ఆపై ఉద్యోగం వచ్చాయి. పూణెలో సుధామూర్తి తొలి ఉద్యోగం చేసింది. ఆమె రాసిన లేఖను టాటా సంస్థ నేటికీ భద్రపరిచి ఉంచింది. 1974లో టెల్కోలో సుధామూర్తి ఒక్కతే మహిళా ఉద్యోగి. దాదాపు 50 ఏళ్ల తర్వాత సుధామూర్తి పూణెలో ఆ సంస్థను సందర్శిస్తే (ఇప్పుడు టాటా మోటార్స్) 900 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ‘నేను అక్కడ నిలబడి మా తండ్రిని తలుచుకుని ఉద్వేగంతో కన్నీరు కార్చాను. ఎవరు భయపెట్టినా నన్ను ఆయన చదివించాడు. నా వల్ల ఇవాళ ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు అని’ అందామె. ► జీవితం అంతులేని పోరాటం ‘జీవితం అంటే అంతులేని పోరాటం. ఎవరికీ ఏ వయసులో ఉన్నా కన్సెషన్ ఉండదు. పోరాటం చేయాలి. ఓడిపోయినా పోరాట అనుభవం మిగులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. క్షమిస్తే మంచిది. మర్చిపోతే ఇంకా మేలు. కాని ముందుకు సాగడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని మెరిపిస్తాయి. ప్యాషన్తో పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. ఒక మనిషిని పైకి తెచ్చేది డబ్బు కాదు ప్యాషన్. నమ్మిన పనిని విలువలతో ఆచరిస్తే ఎవరైనా పైకి రావాల్సిందే’ అంటుందామె. ► రాజ్యసభ సభ్యురాలు ‘ఇది ఊహించలేదు. రాష్ట్రపతి నన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీని గురించి నేను కూచుని ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయగలనో అంతా చేయాలి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వ సేవకురాలిని’ అని కొత్త బాధ్యతకు సిద్ధమవుతోంది సుధామూర్తి. ఇల్లాలే శక్తి నారాయణ మూర్తితో వివాహం అయ్యాక ఇన్ఫోసిస్ సంస్థను ఆయన స్థాపించాలనుకున్నప్పుడు 10 వేల రూపాయలు పెట్టుబడి తనే ఇచ్చింది సుధామూర్తి. అయితే ఆమెను ఇన్ఫోసిస్కు బయటి వ్యక్తిగానే ఉండటం మంచిదని సూచించాడు నారాయణమూర్తి. ఆమె కొంచెం బాధపడింది. ఎప్పటికైనా ఇన్ఫోసిస్ సంస్థలో చేరతాననే భావించింది. అదే సమయంలో చాలా కాలం పాటు పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయింది. ‘సంవత్సరంలో 200 రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు నారాయణమూర్తి. ఆ రోజుల్లో ఫోన్ లేదు. కారు లేదు. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కదాన్నే వెళ్లాలి. సంస్థ ఆర్థిక కష్టాలు.. ఇంటి కష్టాలు.. అన్నీ తట్టుకుని నారాయణమూర్తికి వెన్నుదన్ను అందించాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు చైర్మన్ అయ్యాను. ఆ ఫౌండేషన్తో వేలాది మంది జీవితాల్లో వెలుగు తెచ్చే వీలు నాకు కలిగింది. ఈ సంతృప్తి ఇన్ఫోసిస్ డైరెక్టర్గా పని చేసి ఉంటే నాకు దక్కేది కాదు’ అంటుందామె. -
ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం ద్వారా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ అయినందుకు శ్రీమతి సుధామూర్తిగారికి నా హృదయపూర్వక అభినందనలు. పరోపకారిగా, సామాజిక సేవకురాలిగా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి. భవిష్యత్ లో సుధామూర్తి మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారాయన. My heartfelt congratulations to @SmtSudhaMurty garu on being nominated to the Rajya Sabha on International Women’s Day. Her invaluable contributions as a philanthropist, social worker, entrepreneur and author are immeasurable. I earnestly hope that she achieves even greater… — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటంతో డబుల్ సర్ప్రైజ్గా.. చాలా ఆనందంగా ఉందని ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సుధా మూర్తి ఓ మీడియా సంస్థ ద్వారా స్పందించారు. -
అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం
ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్, సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ నిర్ణయం వెలువడడం విశేషం. సుధామూర్తి సంఘ సేవకురాలిగా అందరికీ సుపరిచితం. ఈమె గొప్ప రచయిత్రి. కంప్యూటర్ ఇంజినీర్గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సుధామూర్తి పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నారు. కర్ణాటకలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్యను చేరేలా తోడ్పడుతున్నారు. ఆమె గతంలో కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిసింది. ఆమె నవలే సీరియల్గా.. సుధామూర్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ‘ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ ప్రారంభించారు. ఆమె కాల్పనిక రచనలు కూడా రాస్తారు. ఆమె రచించిన కన్నడ నవల ‘డాలర్ సొసే’ ఇంగ్లిష్లో డాలర్ బహుగా ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత ఆ నవల 2001లో ‘జీ టీవీ’లో సీరియల్్గా ప్రసారం చేశారు. భూరి విరాళాలు.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి ఐఐటీ కాన్పూర్లోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఉండే హెచ్.ఆర్.కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్ ఏర్పాటుకు, నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాలకు భూరి విరాళాలను అందజేశారు. కర్ణాటకలోని బి.వి.బి.టెక్నికల్ కాలేజీలో ఎలక్టికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్) నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్మెడల్ సాధించారు. పోరాడితే దక్కిన ఉద్యోగం.. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆటో పరిశ్రమలో పేరొందిన టెల్కో కంపెనీలో మహిళా ఇంజినీర్గా ఉద్యోగం సాధించారు. అంతా ఈజీగా ఈ ఉద్యోగం రాలేదు. అప్పటికి ఈ సంస్థలో కేవలం పురుషులకే స్థానం కల్పించేవారు. దాన్ని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి పోస్టుకార్డు రాశారు. దానికి స్పందించిన ఆయన తనకు ఇంటర్వ్యూ నిర్వహించారు. అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించారు. ఆ సంస్థకు పుణె బ్రాంచిలో పనిచేస్తున్నపుడే ఆవిడకు నారాయణ మూర్తితో పరిచయం ఏర్పడి తర్వాత వివాహం చేసుకున్నారు. అందుకున్న పురస్కారాలు.. మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్కు క్యాపిటలిస్ట్గా ఉన్న కెటారామన్ వెంచర్స్ సంస్థలకు పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నారు. 2004 - సామాజిక సేవకుగాను శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం 2006 - భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం. (సామాజిక సేవ, దాతృత్వం, విద్యా రంగం) దేశంలో న్యాయ విద్య , ఉపకారవేతనాల అందజేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డేతో కలిసి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. సాహితీ సేవ, ఆమె రచనలకు ఆర్.కె.నారాయణన్ పురస్కారం అందుకున్నారు. 2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అట్ఠిమబ్బే (Attimabbe) అవార్డు అందుకున్నారు. 2023 -పద్మ భూషణ్ అవార్డు 2023 - గ్లోబల్ ఇండియన్ అవార్డు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ ప్రముఖ రచనలు మదర్ ఐ నెవెర్ న్యూ మేజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ వైస్ అండ్ అదర్ వైస్ మేజిక్ డ్రమ్ అండ్ ఆదర్ ఫేవరేట్ స్టోరీస్ 3000 స్టిచెస్: ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రార్డినరీ లైవ్స్ గ్రాండ్ మాస్ బాగ్ ఆఫ్ స్టోరీస్ -
రాజ్యసభకు సుధామూర్తి.. ‘నారీ శక్తికి నిదర్శనం’: మోదీ
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రచయిత, సామాజిక వేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి ఎంపికపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం భారత ‘నారీ శక్తి’కి శక్తివంతమైన నిదర్శమని మోదీ పేర్కొన్నారు. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. విద్య, దాతృత్వంతో సహా విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి ఆపారమైనదని ప్రశంసించారు. మహిళల శక్తి, సామర్థ్యాలను చాటిచెప్పేలా ఆమె పార్లమెంట్ పదవీకాలం ఉన్నతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు చేశారు. I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji's contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F— Narendra Modi (@narendramodi) March 8, 2024 కాగా సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. -
Sudha Murty: ఇన్ఫోసిస్ డైరెక్టర్గా రిటైరయ్యేదాన్ని..
దేశంలో అత్యంత గుర్తింపు పొందిన దంపతుల్లో ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధా మూర్తి ఒకరు. దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషితో నారాయణమూర్తి ప్రసిద్ధి చెందితే రచయిత్రిగా, సేవా కార్యక్రమాలతో ఆయన సతీమణి సుధా మూర్తి గుర్తింపు పొందారు. అయితే భర్త కంపెనీ కోసం ఎంతో కష్టపడిన ఆమె కంపెనీలో మాత్రం భాగం కాలేకపోయారు. దానికి తన భర్త పెట్టిన షరతే కారణమంటున్నారు సుధా మూర్తి. అనేక దశాబ్దాల సహచర్యం ఉన్న ఈ దంపతులు తమ జీవిత విశేషాల గురించి పలు సందర్భాల్లో పంచుకుంటుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధా మూర్తి తన భర్తతో సాన్నిహిత్యాన్ని, తమ వైవాహిక బంధం గురించి వెల్లడించారు.తమ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను కంపెనీ (ఇన్ఫోసిస్)లో చేరలేకపోవడమే జీవితంలో నాకు అత్యంత కష్టతరమైన విషయం. నేను ఎందుకు చేరలేకపోయానంటే.. కంపెనీ భార్యాభర్తల కంపెనీ కాకూడదని ఆయన షరతు పెట్టారు. ఆ కష్టతరమైన సమయం నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. నేను ఎంతగానో ప్రేమించిన కంపెనీ, దాని కోసం చాలా పనిచేశాను. కానీ అందులో భాగం కాలేకపోయాను" అన్నారు సుధామూర్తి. అయినప్పటికీ తాను జీవితంలో సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పటికి నేను బహుశా ఇన్ఫోసిస్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసి ఉండేదాన్ని. కానీ నేను నా పనితో చాలా మంది జీవితాలను స్పృశించగలిగాను. బహుశా ఇది దేవుడి నిర్ణయం. నాకు మాత్రమే సాధ్యమైంది" అన్నారు. నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన ఇన్ఫోసిస్. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు. -
Infosys Sudha Murty: పుస్తకం కలిపింది ఇద్దరినీ
1974. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మొదటిసారి సుధామూర్తి, నారాయణమూర్తి పూణెలో కలిశారు. వారి మధ్య ప్రేమ చిగురించడానికి దోహదం చేసింది పుస్తక పఠనం. ఆ ప్రేమ కథ ఏమిటో 50 ఏళ్ల తర్వాత ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’లో పంచుకున్నారు సుధామూర్తి. తమ సుదీర్ఘ వైవాహిక జీవితం సఫలం కావడానికి ఇద్దరూ తీసుకున్న జాగ్రత్తలు చెప్తూ ఈనాటి యువతకు అనుభవంతో నిండిన సూచనలు చేశారు. అందమైన ప్రేమకథలు, సఫలమైన ప్రేమకథలు తెలుసుకోవడం బాగుంటుంది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఫిబ్రవరి 5న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పాల్గొన్నారు. చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన బయోగ్రఫీ ‘యాన్ అన్కామన్ లవ్: ది ఎర్లీ డేస్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ విడుదలైన సందర్భంగా తనకు నారాయణమూర్తికీ మధ్య ఎలా ప్రేమ పుట్టిందో కొద్దిగా సిగ్గుపడుతూ, ముసిముసిగా నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేమ కథ వినండి. 1974 అక్టోబర్. పూణెలోని ‘టెల్కొ’లో మొదటి మహిళా ఇంజనీరుగా చేరిన సుధ రోజూ కంపెనీ బస్లో వచ్చి వెళుతుండేవారు. ప్రసన్న ఆమె కొలీగ్. అతను ఏదో ఒక పుస్తకం చదువుతుంటే ఏ పుస్తకమా అని సుధ తొంగి తొంగి చూసేవారు. అతను చదివే ప్రతి పుస్తకం మీద ఒకే పేరు ఉండేది... మూర్తి అని. ఒకరోజు ఉండబట్టలేక ‘ఎవరీ మూర్తి’ అని అడిగారు సుధ. ‘నా రూమ్మేటు. పుస్తకాల పిచ్చోడు. చాలా పుస్తకాలు చదువుతాడు’ అన్నాడు ప్రసన్న. ‘నీకూ పుస్తకాల పిచ్చేగా. కావాలంటే పరిచయం చేస్తానురా’ అన్నాడు. ‘అమ్మో... బేచిలర్ల రూముకు వెళ్లడమా’ అని సుధ జంకారు. కాని కుతూహలం పట్టలేక ‘ఫలానా రోజున ఐదు నిమిషాలకు వచ్చి వెళతా’ అని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగాయి. ఈ మూర్తి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడా... రింగుల రింగుల జుట్టుతో ఉంటాడా.. షోగ్గా (అప్పటికి హిందీ సినిమాల ఫ్యాన్ కాబట్టి) రాజేష్ ఖన్నాలా ఉంటాడా అని ఒకటే ఊహలు. తీరా రూముకు వెళ్లేసరికి దళసరి కళ్లద్దాల బక్కపలచటి యువకుడు ఎదురుపడ్డాడు. సుధని చూసి, ఆమెకు పుస్తకాలంటే ఇష్టమని తెలిసి తన దగ్గరున్న పుస్తకాలన్నీ చూపించాడు. ఆమె బయల్దేరే ముందు అబ్బాయిలు వేసే పాచిక ‘కావాలంటే తీసుకెళ్లి చదివి ఇవ్వు’ అన్నాడు. కొన్నిరోజుల తర్వాత ‘మనం డిన్నర్ చేద్దామా’ అని ఆహ్వానించాడు. దానికీ భయమే సుధకు. ‘వస్తా. కాని మన కామన్ఫ్రెండ్ ప్రసన్న కూడా మనతో ఉండాలి. నా వాటా బిల్లు డబ్బులు నేనే కడతా’ అందామె. వారి స్నేహం బలపడింది. ఒకరోజు నారాయణమూర్తి ధైర్యం చేసి సుధతో చెప్పాడు– ‘ఆరోజు నువ్వు మొదటిసారి నా రూమ్కు వచ్చి వెళ్లాక అంతవరకూ లేని వెలుగు వచ్చినట్టయ్యింది. జీవితం పట్ల ఇంత ఆసక్తి ఉన్న అమ్మాయిని నేను చూళ్లేదు’... ఆ మాటలే ప్రేమను ప్రపోజ్ చేయడం. ఆమె సంతోషంగా నవ్వడమే ప్రేమను అంగీకరించడం. ప్రేమ మొదలైన నాలుగేళ్లకు సుధ.. సుధామూర్తి అయ్యారు. ‘నారాయణమూర్తి, నేను భిన్నధృవాలం. నేను అన్నింటికీ మాట్లాడతాను. అతను అసలు మాట్లాడడు. నాకు అన్నింట్లో జోక్యం కావాలి. అతను అవసరమైతే తప్ప జోక్యం చేసుకోడు. మా జీవితంలో అనంగీకారాలు, ఆర్గ్యుమెంట్లు లేవని కాదు. ఇన్ఫోసిస్ మొదలెడుతున్నప్పుడు నువ్వు ఇందులో ఉండకూడదు అన్నాడు నారాయణమూర్తి. ఐదేళ్లు నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడప్పుడు కొంత చివుక్కుమంటూండేది. కాని తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు చైర్మన్గా నేను సామాజిక సేవతో ఎందరి జీవితాలకో చేయూతనిచ్చి తృప్తి పొందాను. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఎవరిని వారులా ఉండనివ్వాలి. నారాయణమూర్తి కోరుకున్నట్టుగా నేను అతణ్ణి ఉండనిచ్చాను, నాలా నన్ను అతను ఉండనిచ్చాడు’ అన్నారామె. ‘ఇన్ఫోసిస్ పెట్టాక అతి కష్టమ్మీద ఒక క్లయింట్ దొరికాడు. కాని పేమెంట్స్ ఇష్టమొచ్చినప్పుడు ఇచ్చేవాడు. నారాయణమూర్తికి ఉద్యోగుల జీతాలు సమయానికి చెల్లించాలని నియమం. అతను టెన్షన్ పడుతుంటే– ఎందుకంత టెన్షన్... నగలు బ్యాంకులో కుదవ పెట్టి డబ్బు తెస్తాను. సర్దుబాటు చేసుకో అన్నాను. నారాయణమూర్తి కదిలిపోయాడు. ఎందుకంటే ఏదో అవసరం వచ్చి గతంలో తల్లి నగలు కుదువ పెట్టాల్సి వచ్చిందట. అవి విడిపించుకోలేకపోయారు. అది గుర్తొచ్చి వద్దు వద్దు అన్నాడు. ఏం పట్టించుకోకు.. లోను తీసుకోవడానికి సెంటిమెంట్లు ఏమిటి అని తెచ్చి ఇచ్చాను. ఆ రోజు గాజులు లేని నా బోసి చేతులను చూసి నారాయణమూర్తి చాలా బాధ పడ్డాడు. కొన్నాళ్లకు విడిపించాడనుకోండి. ఈ మాత్రం సర్దుబాట్లు కాపురంలో అవసరం’ అన్నారామె. వైవాహిక బంధం ఎలా నిలబడుతుంది? ఆడియెన్స్లో ఎవరో అడిగారు. ‘నమ్మకం, సహనం, సర్దుబాటుతనం వల్ల మాత్రమే. జీవితంలో సహనం ముఖ్యమైనది. సహనంగా ఉంటే జీవితం మనకు కావలసినవి ఇస్తుంది. వైవాహిక జీవితంలో అనుకున్నవన్నీ చేసే స్వేచ్ఛ, వీలు లేకపోవచ్చు. అప్పుడు ఉన్న పరిమితుల్లోనే ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ మొదలుపెట్టి బిజీగా ఉండగా నేను ఐదేళ్లూ పిల్లల్ని చూసుకుంటూ కూడా పుస్తకాలు రాసి సంతోషపడ్డాను. వీలైనంతగా కొత్త ప్రాంతాలు చూశాను. మగవాళ్లకు సాధారణంగా ఆడవాళ్లు తమ కంటే తెలివితక్కువగా ఉండాలని ఉంటుంది. అవసరమైతే వారిని అలా అనుకోనిచ్చేలా చేస్తూ స్త్రీలు తమ సామర్థ్యాలను వీలైనంత ఉపయోగించుకోవాలి. జీవితంలో, వైవాహిక జీవితంలో రాణించాలి’ అన్నారు సుధామూర్తి. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
సుధా-నారాయణమూర్తి లవ్ స్టోరీ: పెళ్లికి తండ్రి నో....చివరికి పెళ్లి ఖర్చు కూడా!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేరు టెక్ ప్రపంచంలో తెలియని వారుంటారు. ఆయన భార్య, ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి రిటైర్డ్ చైర్పర్సన్ సుధామూర్తి కూడా చాలామందికి ఇన్సిపిరేషన్. తాజాగా వీరిద్దరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్గా మారింది. నాలుగేళ్ల డేటింగ్ తరువాత 1978, ఫిబ్రవరి 10న నారాయణ, సుధా మూర్తి మూడుముళ్ల బంధంలో ఒక్కటైనారు. అయితే అన్ని విషయాల్లో గుంభనం, దూరదృష్టితో ఉండే నారాయణమూర్తి, భోళాగా, డబ్బు విషయంలో చాలా ప్రణాళికా బద్దంగా ఉండే సుధ పరిచయం ప్రేమ విచిత్రంగానే జరిగింది. కొన్ని భేదాభిప్రాయాలున్నప్పటికీ, ఒకరిపై మరొకరు నమ్మకం వారి ప్రేమను శాశ్వతం చేసింది. పూణేలో తమ కామన్ ఫ్రెండ్ విప్రో ప్రసన్న ద్వారా తామిరువురం కలుసుకున్నామని జ్ఞాపకాలను ఒక ఇంటర్వ్యూలో సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె పూణే బ్రాంచ్లో టెల్కోగా పనిచేస్తున్నారు. ఒక సాయంత్రం పూణేలోని గ్రీన్ ఫీల్డ్స్ హోటల్లో భోజనానికి ప్రసన్న ద్వారా సుధ , ఆమె స్నేహితులను నారాయణ ఆహ్వానించారు. ఈ బృందంలో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో మొదట్లో వెళ్లేందుకు ఇష్టపడలేదు కానీ నారాయణ ఆమెను ఒప్పించారట. అలాగే ప్రసన్న దగ్గరినుంచి చాలా పుస్తకాలను తీసుకోవానే వారట సుధ. ఆ పుస్తకాలపై ఎక్కువగా నారాయణమూర్తి పేరు ఉండేదట. అలా తన మనస్సులో నారాయణ ఊహాచిత్రం ముందే ఉండేదంటూ గుర్తు చేసుకున్నారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది.. ముఖ్యంగా ఆయనలోని వినయం, ముక్కు సూటిగా ఉండే తత్వం తననను ప్రేమలో పడేసిందని ఆమె చెప్పారు. ‘‘నా పొడవు 5'4" పొడవు ఉన్నాను . దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నేను నా జీవితంలో ఎప్పటికీ ధనవంతుడు కాలేను,నేను మీకు ఏ సంపదను ఇవ్వలేను. మీరు అందంగా ఉన్నారు. పైగా తెలివైనవారు కూడా. నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగారట నారాయణమూర్తి. పెళ్లి ఖర్చు సమంగా పంచుకున్నాం రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నారాయణమూర్తి మొదట్లో వీరిద్దరి వివాహాన్ని సుధ తండ్రి వ్యతిరేకించారు. జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నారు అని సుధ తండ్రి అడిగితే, కమ్యూనిస్టు పార్టీలో నాయకుడిగా ఎదగాలని, అనాథాశ్రమాన్ని తెరవాలనుకుంటున్నానని మూర్తి చెప్పారట. దీంతో ఆయన ససేమిరా అన్నారట. చివరికి 1977 చివరిలో నారాయణ పాట్నీ కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్గా జాయిన్అయిన తరువాత మాత్రమే ఆయన అంగీకరించారు. అమెరికా వెళ్లే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం మేరకు వబెంగుళూరులోని నారాయణ ఇంట్లో కుటుంబ సన్నిహితుల పెళ్లి చేసుకున్నామని ఆమె చెప్పారు. అలా తనకు తొలి పట్టు చీర వచ్చిందని గుర్తు చేసు కున్నారు. అంతేకాదు ఆనాటి తమ పెళ్లి ఖర్చును ఇద్దరమూ సమానంగా పంచుకున్నామని సుధామూర్తి వెల్లడించారు. ఒక్కొక్కరు రూ.400 చొప్పున మొత్తం పెళ్లి ఖర్చు రూ.800 అయిందని చెప్పారు. అలాగే ఇటీవల కాలంలో ఆయన పాత జ్ఞాపకాల గురించి మీడియాతో పంచుకుంటున్న నారాయణమూర్తి కూడా . తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మధ్యతరగతి నేపథ్యం తాము ఎక్కువగా ఆటోలోనే ప్రయాణించే వారమంటూ ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. కన్నడ రాని డ్రైవరున్న ఆటోలో తాము కన్నడలోమాట్లాడుకుంటూ తమ జీవితంలో కీలక మైన విషయాలను షేర్ చేసుకున్నట్టు నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. 1981లో పూణేలో తన సహచరులతో కలిసి ఇన్ఫోసిస్ను స్థాపించారు. సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలన్న తన భర్త కల సాకారం కోసం 10 వేల రూపాయలను సుధామూర్తి అప్పుగా ఇచ్చారు. అదే ఆ తరువాత కోట్లాది రూపాయల విలువ చేసే దేశంలో అనే అత్యున్నత ఐటీ సంస్థగా అవతరించింది. అలాగే ఇటీవల తన భార్య సుధ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని మరీ నారాయణ మూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. -
మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి..
నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే.. ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన 'ఇన్ఫోసిస్' (Infosys). ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు. ఈ రోజు 83.92 బిలియన్ల విలువ కలిగిన స్థాయికి చేరిన ఇన్ఫోసిస్ ప్రారంభంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నట్లు, దాని కోసం అనేక త్యాగాలను చేయాల్సి వచ్చినట్లు సుధామూర్తి చెబుతూ.. తమ కుమార్తె అక్షతా మూర్తిని 90 రోజుల వయసున్నప్పుడు తమ తల్లిందండ్రుల దగ్గర వదిలిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించింది. టెక్ కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు సుధామూర్తి, నారాయణ మూర్తి ముంబైకి మారారు. ఆ సమయంలో కంపెనీ వృద్ధికి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పరిస్థితులు ఎలా మారతాయో ఊహకందని సమయంలో.. నా బిడ్డ అక్షతా మూర్తి తన తాతయ్యల వద్ద పెరగడం మంచిదని భావించిన సుధామూర్తి.. చిన్నారిని ముంబై నుంచి కర్ణాటకలోని తన తల్లిదండ్రులు, సోదరి వద్ద వదిలి పెట్టింది. ఎంతో గారాబంగా పెంచుకోవాల్సిన చిన్నారిని విడిచిపెట్టడం చాలా కష్టమైన నిర్ణయమని సుధామూర్తి చెబుతూ.. ఆ రోజు నుంచి అక్షతకు నా తల్లి, సోదరి తల్లులుగా మారారని తెలిపింది. ఈ రోజు ఇన్ఫోసిస్ ఇంత పెద్ద సంస్థగా అవతరించినదంటే ఒక్క రోజులో జరిగిన పని కాదు. ఇదీ చదవండి: అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి మీరు ఒక కంపెనీ స్థాపించినప్పుడు.. ఎదురయ్యే కష్టమైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సుధామూర్తి చెప్పారు. ఈ రోజు యూకే ప్రధాని భార్యగా.. వెంచర్ క్యాపిటలిస్ట్గా ఎదిగిన 'అక్షతా' కర్ణాటకలోని హుబ్లీలో తన తాతయ్యలతో కలిసి పెరిగింది. ఏదైనా విలువైనది చేయాలని ఆకాంక్షించినప్పుడు త్యాగాలు అనివార్యమని మూర్తి దంపతులు స్పష్టం చేశారు. -
స్టోర్రూంలో పడుకోబెట్టిన క్లయింట్.. ‘దాన్ని బట్టే నువ్వు ఎలాంటివాడివో తెలుస్తుంది’
Infosys Narayana Murthy: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి జీవితానికి సంబంధించిన ఏదో ఒక విశేషం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. ప్రారంభ రోజుల్లో ఆయన పడిన అవమానం గురించిన అంశం తాజాగా బయటకు వచ్చింది. భార్య సుధామూర్తికి కోపం తెప్పించిన ఈ ఘటన గురించి నారాయణమూర్తి ఏం చెప్పారంటే.. ఇన్ఫోసిస్ ప్రారంభ రోజులలో క్లయింట్ వర్క్ కోసం నారాయణ మూర్తి ఒకసారి యూఎస్ వెళ్ళినప్పుడు, ఒక అమెరికన్ వ్యాపారవేత్త తన ఇంటిలో నాలుగు బెడ్రూమ్లు ఉన్నప్పటికీ నారాయణమూర్తిని స్టోర్రూంలో పడుకోబెట్టాడు. కిటికీలు లేని ఆ రూంలో చుట్టూ అట్టపెట్టెల మధ్య ఒక పెట్టెపైనే ఆ రాత్రి ఆయన నిద్రించారు. సుధా మూర్తి, నారాయణ మూర్తి జీవితాల్లో తొలినాళ్ల గురించి భారతీయ-అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుణి రచించిన "యాన్ అన్కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి" జీవితచరిత్ర పుస్తకంలో ఈ విశేషాలు వెల్లడయ్యాయి. న్యూయార్క్కు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ అనే కంపెనీ అధినేత డాన్ లీల్స్.. నారాయణమూర్తి పట్ల కొన్ని సందర్భాల్లో అనుచితంగా ప్రవర్తించేవాడు. తరచుగా చెల్లింపులను ఆలస్యం చేసేవాడు. మ్యాన్హట్టన్ వెళ్లినప్పుడు తనకే కాకుండా ఇతర ఇన్ఫోసిస్ సహచరులకు సైతం హోటల్లను బుక్ చేసుకోవడానికి అనుమతినిచ్చేవాడు కాదు. ఇలా మూర్తి ఒకసారి క్లయింట్ వర్క్ కోసం యూఎస్ వెళ్ళినప్పుడు, డాన్ లీల్స్ ఆయన్ను స్టోర్రూమ్లో పడుకోబెట్టాడు. కిటికీలు కూడా లేని ఉన్న ఆ రూంలో చుట్టూ అట్టపెట్టెల మధ్యే ఆ రాత్రి ఆయన నిద్రించాడు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కంపెనీ కోసం నారాయణమూర్తి ఇలాంటి అవమానాలను ఎన్నో సహించారు. అతిథి దేవుడిలాంటివారని తన అమ్మ అంటుండేదని, అతిథులతో వ్యవహరించిన తీరుని బట్టే నువ్వు ఎలాంటివాడివో తెలుస్తుందని చెబుతూ ఈ ఘటన గురించి భార్య సుధా మూర్తితో నారాయణమూర్తి చెప్పారు. అనుకోకుండా వాళ్ల నాన్న ఎవరినైనా ఇంటికి ఆహ్వానించినప్పుడు తన తల్లి తాను తినకుండా అతిథికి అన్నం పెట్టేదని గుర్తు చేసుకున్నారు. కానీ డాన్ లీల్స్ తాను విలాసవంతమైన బెడ్పై పడుకుని తనను మాత్రం స్టోర్రూంలో పెట్టెపై పడుకోబెట్టాడని నారాయణమూర్తి చెప్పగా సుధామూర్తికి మాత్రం ఈ ఘటన కోపం తెప్పించినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. -
‘తప్పు చేశాను సుధా.. నన్ను క్షమించవా!’
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాణయ మూర్తి పరిచయం అక్కర్లేని పేరు. రెండు దశాబ్ధాల పాటు టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేసిన ఆయన తన అభిప్రాయాలను తెలపడంలో ఎప్పుడూ మెుహమాట పడరు. ఇలా చేయడం వల్ల అనేకసార్లు విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఆయినప్పటికీ ఆయన మాత్రం తనపని తాను చేసుకుపోతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. కష్టపడి పనిచేసే వారికి రుణ పడి ఉండాలి కొద్ది రోజుల క్రితం భారత యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ వ్యవస్దాపకుడు నారాయణ మూర్తి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేశంలోని విద్యావంతులు అత్యంత ఎక్కువగా కష్టపడే వారికి తక్కువగా కష్టపడి పనిచేసే వారు రుణ పడి ఉండాలని అన్నారు. ‘రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తారు’ అంటూ తన వైఖరిని సమర్థించుకున్నారు. చాలా మంది భారతీయులు, ఎన్ఆర్ఐలు చాలా మంది ప్రజలు శారీరకంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకుంటారు. కాబట్టి భారత్లో కష్టపడి పనిచేయడం అనేది ఓ సర్వ సాధారణం. అలాగే భారీ రాయితీలతో విద్యను పూర్తి చేసిన మనలో చాలా మంది ప్రభుత్వం అందించే సబ్సీడీలకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక తాను చేసే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చినప్పటికీ భారత్లో చాలా మంది, ఎన్ఆర్ఐలు తన వ్యాఖ్యల్ని ఏకీభవిస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యల్లో తప్పు ఏమైనా ఉందా? నా ఫీల్డ్లో నా కంటే మెరుగ్గా ఉన్నవారు ఎవరైనా ఉంటే నేను వారిని గౌరవిస్తాను. వారితో మాట్లాడుతాను. ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో తప్పు ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేనైతే తప్పు ఉందని అనుకోను అని అన్నారు. నేను చేసిన పనికి చింతిస్తున్నా పనిలో పనిగా తన భార్య సుధా మూర్తి విషయంలో తాను చేసిన పనికి చింతిస్తున్నట్లు తెలిపారు. 1981లో కేవలం తన వాటాగా రూ.10,000తో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నారాయమూర్తి మారారు. అయితే ఈ డబ్బును తన భార్య సుధా మూర్తి దాచుకున్న సొమ్మని పలుమార్లు గతంలోనే వెల్లడించారు. భార్య దాచుకున్న మెుత్తాన్ని వ్యాపార పెట్టుబడిగా పెట్టి దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఇన్ఫోసిస్ను తీర్చిదిద్దటంలో ఆయన తన జీవితాన్ని వెచ్చించారు. సహా వ్యవస్థాపకుల కంటే సుధా మూర్తికి తాజా ఇంటర్వ్యూలో పెట్టుబడిగా డబ్బులిచ్చిన భార్యకు కంపెనీలో ఎందుకు అవకాశం కల్పించలేదని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తన భార్య డబ్బుతో కంపెనీని ప్రారంభించినప్పటికీ ఆమెతో పాటు కుటుంబాన్ని ఇన్ఫోసిస్కు దూరంగా ఉంచాలనే తన నిర్ణయం సరైంది కాదన్నారు. ఇదే విషయంలో తాను చింతిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇతర సహ వ్యవస్థాపకుల కంటే సుధా మూర్తికి ఎక్కువ అర్హత ఉందని నమ్మినప్పటికీ.. తన భార్యను సంస్థలో చేరడానికి ఎప్పుడూ అనుమతించలేదని అన్నారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి.. తన భార్య సుధా మూర్తిని క్షమాపణలు కోరేలా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. -
సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ..
ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్, ప్రముఖ రచయిత్రి 'సుధామూర్తి' (Sudha Murthy) ఇటీవల కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా.. లేదా అనే విషయాన్ని గురించి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుధా మూర్తి కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించి, భవన నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని.. కళ, సంస్కృతి, భారతీయ చరిత్ర మొత్తం ఉట్టిపడేలా ప్రతిదీ చాలా అందంగా ఉన్న ఈ నిర్మాణం గురించి చెప్పడానికి మాటలు చాలవని తెలిపింది. అంతే కాకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించడం తన కల అని.. ఆ కల ఇప్పటికి నిజమైందని విలేకరులతో వెల్లడించింది. ఈ సందర్భంగా విలేకరులు మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని సుధా మూర్తిని ప్రశ్నించారు. విలేకరుల ప్రశ్నకు నవ్వుతూ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని.. రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తన కోడలు గురించి ప్రస్తావిస్తూ అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులకు ముందు అపర్ణ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. #WATCH | Delhi | As Sudha Murty visits the Parliament, she says, "It is so beautiful...No words to describe. I wanted to see this for a long time. It was a dream come true today. It is beautiful...It's art, culture, Indian history - everything is beautiful..." pic.twitter.com/P2kKp2Wj2o — ANI (@ANI) December 8, 2023 -
కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే?
ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ 'సుధామార్తి' (Sudha Muthy) ఇటీవల తన కోడలు 'అపర్ణ కృష్ణన్' (Aparna Krishnan)తో ఎలా ఉంటుంది. కోడలి వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సూధామూర్తి కొడుకు రోహన్ మూర్తి మొదట్లో 'లక్ష్మీ వేణు'ను వివాహం చేసుకున్నాడు. కానీ వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత రోహన్ 'అపర్ణ క్రష్ణన్' అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు కొడుకు పెళ్లిని చాలా సింపుల్గా చేసినప్పటికీ.. కోడలిని మాత్రం బాగా చూసుకుంటుందని.. అపర్ణ క్రష్ణన్ గతంలో స్వయంగా వెల్లడించింది. తన అత్తగారి గురించి ఎవరైనా అడిగితే.. నాకు ఆమె రోల్ మోడల్ అని, అంతే కాకుండా ప్రతి అత్తకు రోల్ మోడల్ అని చెబుతానని చెప్పింది. సుధామూర్తిని తన కోడలితో సంబంధం ఎలా ఉంటుంది అని అడిగితే, ఏ సమస్య లేదని చెబుతూ.. ఒకరినొకరు అపార్థం చేసుకోవడానికి చాలా సమయం కావాలని. నేను ఎప్పుడూ నా పనిలో బిజీగా ఉంటాను, ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటుంది. అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ' సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సుధామూర్తి 'కంటెంట్ నాదే కానీ ఇది అపర్ణ బేబీ'ది అని చెప్పింది. ఈ సిరీస్ ప్రారంభించడానికి కోడలి ఆలోచనే కారణమని కూడా వెల్లడించింది. -
పిల్లలు ఇష్టపడే యానిమేటెడ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండి..
చిన్నపిల్లలు అన్నం తినమని మారాం చేసినా, నిద్రపోకుండా ఏడుస్తున్నా పెద్దవాళ్లు కథలు చెప్పేవారు. మరీ ముఖ్యంగా నానమ్మలు, అమ్మమ్మలు కథలు చెప్తూ పిల్లలకు బాల్యం నుంచే నీతి పాఠాలు బోధించేవారు. బడిలో చెప్పని ఎన్నో విషయాలను కథల రూపంలో తెలుసుకునేవారు. ఇప్పుడు ఫోన్ల వాడకం పెరిగిపోయాక కథలు చెప్పేవాళ్లే కరువయ్యారు. కథలు చెప్తానంటున్న సుధామూర్తి అయితే టీవీ, ఫోన్లోనూ పిల్లల కోసం బోలెడన్ని కార్టూన్ చిత్రాలు, యానిమేషన్ కథలు, పాటలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాను కూడా కథలు చెప్తానంటోంది ఇన్ఫోసిస్ చైర్ పర్సన్, రచయిత్రి సుధామూర్తి. ఆమె చిన్నపిల్లల కోసం ఎన్నో కథల పుస్తకాలు తీసుకొచ్చింది. పిల్లలకు అర్థమయ్యేలా సరళ భాషలో కథలు రాసి ఆకట్టుకుంది. ఈసారి ఓ అడుగు ముందుకువేసి యానిమేటెడ్ సిరీస్ చేసింది. తను రాసిన కథలకు, పాత్రలకు ప్రాణం పోసి పిల్లల ముందుకు తీసుకొచ్చింది. 'స్టోరీ టైమ్ విత్ సుధా అమ్మ' పేరిట యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేసింది. మూర్తి మీడియా, కాస్మోస్ మాయ సంస్థల భాగస్వామ్యంతో ఈ సిరీస్ తెరకెక్కింది. మూర్తి మీడియా యూట్యూబ్ ఛానల్లో ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రసారమవుతోంది. ఈ సిరీస్లో మొత్తం 52 కథలు ఉంటాయి. స్టోరీ టైమ్ విత్ సుధా అమ్మ సిరీస్ అక్టోబర్ 31 నుంచి యూట్యూబ్లో ప్రసారమవుతోంది. చదవండి: ఆదిపురుష్కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు.. దేశం వదిలి వెళ్లిపోయా.. -
ఇన్ఫోసిస్ సుధామూర్తి పేరుతో వసూళ్లు.. పూజారి అరెస్ట్!
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్.నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పేరుతో డబ్బు వసూళ్లు చేస్తున్న బెంగళూరుకు చెందిన అరుణ్కుమార్(34) అనే పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి బెంగళూరు సమీపంలోని మల్లేశ్వరంలో అరుణ్కుమార్ను అరెస్ట్ చేసినట్లు జయానగర్ పోలీసులు తెలిపారు. అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలోని కన్నడ కూట నుంచి అరుణ్కుమార్ రూ.5 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నిర్వహించబోయే కన్నడ కూటాలో సుధామూర్తిని ముఖ్య అతిథిగా తీసుకొస్తానని చెప్పి వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. అయితే సదరు సంస్థ నుంచి ఏప్రిల్లో వచ్చిన ఆహ్వానాన్ని సుధామూర్తి తిరస్కరించారు. అయిన్పటికీ ఆమె సమావేశానికి హాజరవుతున్నట్లు ఓ మహిళ ఫొటోలు, వీడియోలను వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాలోని మిల్పిటాస్లో సెప్టెంబరు 26న సేవా ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ సోషల్ మీడియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ డాక్టర్ సుధామూర్తి’ ఈవెంట్ను తప్పడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకు మరో మహిళ కారణమని తెలిపారు. ఆ ఈవెంట్కు టిక్కెట్ ధర రూ.3,330 నిర్ణయించినట్లు చెప్పారు. -
సుధా మూర్తి పేరిట మోసం.. పోలీసులకు ఫిర్యాదు
ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రచయిత్రి సుధా మూర్తి బెంగళూరు పోలీసుల్ని ఆశ్రయించారు.రెండు వేర్వేరు ఘటనల్లో తన పేరును ఉపయోగించి లావణ్య, శ్రుతి అనే పేరుతో ఇద్దరు మహిళలు మోసాలకు పాల్పడ్డారంటూ ఆమె తరఫున తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మమత సంజయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మమత సంజయ్ ఫిర్యాదు మేరకు .. 2023 ఏప్రిల్ 5న సుధా మూర్తికి ఓ ఈమెయిల్ వచ్చింది. కన్నడ కూట ఆఫ్ నార్తన్ కాలిఫోర్నియా (కేకేఎన్సీ) సంఘం 50వ వార్షికోత్సవానికి అధితులుగా రావాలనేది ఆ మెయిల్ సారాంశం. అయితే అదే నెల ఏప్రిల్ 26న ఆ మెయిల్కు సుధా మూర్తి ఆఫీస్ ప్రతినిధులు స్పందిస్తూ.. బిజీ షెడ్యూల్ వల్ల కేకేఎన్సీ ఈవెంట్కు రాలేరని సమాధానం ఇచ్చారు. సుధా మూర్తి పర్సనల్ అసిస్టెంట్గా కానీ ఆగస్టు 30న మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారంటూ ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుధా మూర్తి కేకేఎన్సీ నిర్వాహకుల నుంచి వివరాల్ని సేకరించారు. ఈ సందర్భంగా తాను సుధామూర్తి పర్సనల్ అసిస్టెంట్గా పరిచయం చేసుకున్న లావణ్య అనే మహిళ ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తేలింది. అంతేకాదు ఆమె పలువురిని నుంచి నగదు వసూలు చేసినట్లు తేలింది. ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు అమెరికాలో ‘మీట్ అండ్ గ్రీట్’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి సుధా మూర్తి హాజరవుతున్నారంటూ శ్రుతి అనే మరో మహిళ ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లావణ్య, శ్రుతి పేరుతో మోసం చేసిన వారిపై సుధా మూర్తి వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ మోసానికి పాల్పడిన మహిళలు ఎక్కడ ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఆ ఇద్దరు మహిళలపై ఐపీసీ-419 (మోసం), 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-66(సి), 66(డి) సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
24 ఏళ్ల కింద కొన్న చీరే.. మళ్ళీ కొనలేదు - ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు సైతం వారానికో, నెలకో షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే వందల కోట్లకు అధిపతి అయినప్పటికీ చాలా సింపుల్గా, ఎంతో మందికి ఆదర్శమైన ఒక మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్ఫోసిస్ అనగానే గుర్తొచ్చేది 'నారాయణ మూర్తి', కానీ ఈ రోజు ఇన్ఫోసిస్ ఆ స్థాయిలో ఉందంటే దానికి పెట్టుబడి 'సుధా మూర్తి' ఇచ్చినదే అని చాలామందికి తెలియకపోవచ్చు. సుధా మూర్తి నేడు సుమారు రూ. 775 కోట్లు సంపద కలిగి ఉన్నప్పటికీ గత 24 సంవత్సరాల్లో ఒక్క చీర కూడా కొనలేదు అంటే చాలా మంది నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. నిజానికి సింప్లిసిటీ గురించి మాట్లాడాల్సి వస్తే తప్పకుండా ఎవరైనా సుధా మూర్తి గురించి మాట్లాడతారు. 1950 ఆగష్టు 19న జన్మించిన సుధామూర్తి ఉన్నత భావాలు కలిగిన విద్యావేత్త, రచయిత్రి మాత్రమే కాదు.. ఎంతో మందికి సహాయం చేసే పరోపకారి కూడా. ఈమెకు 2023లో భారత ప్రభుత్వం దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అందించింది. చీరలు కొనకపోవడానికి కారణం.. 24 సంవత్సరాలుగా చీరలు కొనకపోవడానికి వెనుక ఒక కారణం కూడా ఉందని తెలుస్తోంది. కాశీకి వెళ్ళినప్పుడు పవిత్ర గంగా స్నానం చేసి షాపింగ్ (ముఖ్యంగా చీరలు కొనడం) మానేస్తాని చెప్పుకోవడమే అని తెలుస్తోంది. ఎవరైనా గంగా నదిలో తమకు ఇష్టమైన వాటిని వదిలిపెడితే మంచి జరుగుతుందని నమ్ముతారు. కానీ సుధా మూర్తి చీరలు కొనటం మానేసింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? సుధా మూర్తి ఇష్టాలతో నారాయణ మూర్తి కూడా ఏకీభవించారు. ఈ కారణంగానే వారు ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సాదాసీదాగా ఉంటారు. వీరిరువురూ పుస్తకాలు మాత్రం విరివిగా కొనుగోలు చేస్తారు. ఇప్పటికి వీరు 20,000కంటే ఎక్కువ బుక్స్ సేకరించినట్లు తెలుస్తోంది. -
ఐటీ దిగ్గజం 'ఇన్ఫోసిస్' కంపెనీ ఇలా మొదలైంది..!
ఈ రోజు సుధామూర్తి గురించి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా మాత్రమే కాకుండా.. సమాజసేవలో తమవంతు కృషి చేస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే నేడు లక్షల కోట్ల ఐటీ కంపెనీగా అవతరించిన సంస్థ ఒక చిన్న గదితో ప్రారంభమైనట్లు, కేవలం రూ. 10,000 పెట్టుబడితో ముందుకు కదిలినట్లు బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగిన నారాయణ మూర్తి విజయం వెనుక సుధామూర్తి ఉందని అందరికి తెలుసు. కంపెనీ ప్రారంభించాలని కలలు కన్న రోజుల్లోనే ఆమె వద్ద రూ. 10,000 అప్పుగా తీసుకుని స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడే భారత్ ఐటీ రంగంలో అడుగులు వేస్తున్న సమయంలో భవిష్యత్తుని చూసి కంపెనీ ప్రారంభించారు. నేడు లక్షల కోట్ల విలువైన కంపెనీ ఆ రోజు చిన్న గదిలో ప్రారంభమైనట్లు చెబుతారు. అదే ఈ రోజు వేలమందికి ఉద్యోగాలు కల్పించి ముందడుగు వేస్తోంది. 1981లో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ఈ రోజు ప్రపంచంలో పేరుగాంచిన పెద్ద ఐటీ కంపెనీగా రూ. 5 లక్షల కోట్లకంటే ఎక్కువ విలువైనదిగా నిలబడింది. ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్లీ.. ధర తెలిస్తే షాకవుతారు! ఇంజినీర్ అంటే ఒకప్పుడు కేవలం పురుషులు మాత్రమే ఉండేవారు.. అయితే స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదని టెల్కో కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ ఉద్యోగంలో చేరి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. నేడు టాటా కంపెనీలో మహిళలు కూడా పనిచేస్తున్నారంటే అది సుధామూర్తి చలవే. -
Sudha Murty Photos: అమృతమూర్తి 'సుధామూర్తి' అరుదైన ఫోటోలు
-
టాటా కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ - ఎవరో చెప్పుకోండి చూద్దాం!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎన్నో సామజిక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచిన ఈ ఆదర్శమూర్తి ఇప్పుడు ఎలా ఉంటారనేది అందరికి తెలుసు. అయితే చదువుకునే వయసులో ఎలా ఉండేదో ఇక్కడ చూడవచ్చు. సుధామూర్తి 1974లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందింది. 150 మంది విద్యార్థులలో ఈమె ఒక్కరే మహిళ కావడం గమనార్హం. అప్పట్లో ఎన్నో ఆటంకాలను సైతం ఎదుర్కోగలిగిన ధీశాలి. మహిళల హక్కుల కోసం పాటుపడి అప్పట్లో ఏకంగా జేఆర్డీ టాటాకు లేఖ రాసింది. ఈ రోజు టాటా కంపెనీలో మహిళలు పనిచేస్తున్నారంటే దాని వెనుక సుధామూర్తి హస్తం ఉండటమే. ఇప్పటికే కళ, సంస్కృతి, ప్రజా పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, పేదరికం తగ్గింపు, మహిళా సాధికారత వంటి అనేక రంగాల్లో తనదైన రీతిలో సామజిక ఈమె సేవ చేసింది. ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో! సుధామూర్తి హార్వర్డ్ యూనివర్శిటీలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించింది. అనేక అనాథాశ్రమాలను స్థాపించింది, గ్రామీణాభివృద్ధి ప్రయత్నాలలో పాల్గొంది, అన్ని కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ అండ్ లైబ్రరీ మౌలిక సదుపాయాలను అందించాలనే ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. నిరాడంబరమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఈమెకు పద్మ భూషణ్ అవార్డుతో సన్మానించింది. -
కరీనా కపూర్ కనీసం పట్టించుకోలేదు: నారాయణ మూర్తి వీడియో వైరల్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా నారాయణ మూర్తి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్పై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అభిమానులను కరీనా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ దీనిని తాజాగా ఓ ఇన్స్టా పేజీలో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఐఐటీ కాన్పూర్ చర్చా కార్యక్రమంలో నారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి కరీనా కపూర్ ప్రస్తావన తీసుకొచ్చారు. అభిమానుల పట్ల ఆమె వ్యవహరించిన తీరును నారాయణ మూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. అయితే మధ్యలో ఆయన సతీమణి సుధామూర్తి కల్పించుకొని నారాయణ మాటలను వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ నారాయణ మూర్తి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలిపారు. ‘నేను ఓసారి లండన్ నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్ కూర్చున్నారు. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి హాయ్ అంటూ పలకరించారు. కానీ, ఆమె కనీసం స్పందించలేదు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలకరిస్తే కనీసం లేచి నిల్చొని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే’నన్నారు నారాయణ మూర్తి. చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే! ఇంతలో సుధామూర్తి కల్పించుకొని.. కరీనాకు కోట్లలో అభిమానులుంటారు. బహుశా ఆమె విసిగిపోయి ఉంటుందని అన్నారు. ‘నారాయణ మూర్తి ఓ సాఫ్ట్వేర్ వ్యక్తి, కంపెనీ ఫౌండర్.. నీకు 10వేల మంది అభిమానులు ఉంటారేమో.. కానీ, సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు కదా’’ అని అన్నారు. సుధామూర్తి మాటలకు అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. ఆమెను ప్రశంసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు. అయినప్పటికీ నారాయణ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఇక్కడ సమస్య అది కాదు. ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం కూడా ఆ ప్రేమను తిరిగి ప్రదర్శించాలి. ఏ రూపంలోనైనా సరే.. అది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మనలోని అహాన్ని తగ్గించే మార్గాలు అంతే’ నని అన్నారు. చదవండి: 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళను ఉరితీయనున్న సింగపూర్ View this post on Instagram A post shared by ENTREPRENEURS OF INDIA (@eoindia) -
ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..
రచయిత్రి, ప్రముఖ ఆదర్శ మూర్తి 'సుధామూర్తి' (Sudha Murthy) గత కొంత కాలంగా తన ప్రేమ గురించి, పారిశ్రామిక వేత్త భర్తగా ఉంటే భార్య ఎలా నడుచుకోవాలి అనే చాలా వివరాలు వెల్లడించింది. కాగా ఇప్పుడు తాను ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, నాన్వెజ్ ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా ఇష్టపడుతుందా అనే వివరాలు తెలిపింది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ఖానే మే కౌన్ హై (Khaane Mein Kaun Hai) ఎపిసోడ్లో మాట్లాడుతూ.. తాను ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పుకొచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తన ఫుడ్ తానే తీసుకెళుతుందని వెల్లడించింది. శాఖాహారానికి, మాంసాహారానికి ఒకే చెంచా ఉపయోగించడం తనకు నచ్చదని.. ఆఖరికి గుడ్లు, వెల్లులి కూడా తినదని తెలిపింది. విదేశాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్ రెస్టారెంట్ కోసం వెతుకుతానని, ముందు జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్ నిండుగా తినుబండారాలను తీసుకెళ్తానని కూడా చెప్పింది. తన వద్ద కుకింగ్ బ్యాగ్ కూడా ఉందని, అందులో ఆహారాన్ని వండడానికి ఉపయోగించే చిన్న కుక్కర్ ఉంటుందని చెప్పారు. (ఇదీ చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!) కొన్ని సంవత్సరాల క్రితం సుధామూర్తి తన అమ్మమ్మతో.. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎందుకు మీ తినుబండారాలను మీతో తీసుకెళ్లకూడదు, బయట ఎందుకు తింటారు అని సరదాగా అడిగిందని.. చివరకు ఆ విధానాన్నే నేను అనుసరిస్తున్నానని సుధామూర్తి చెప్పింది. కావున ఇప్పుడు ఏ దేశానికీ వెళ్లినా దాదాపు తన ఫుడ్ తానే తీసుకెళుతుందని స్పష్టం చేసింది. -
సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!
Sudha Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రముఖ రచయిత్రిగా, మానవతామూర్తిగా ప్రసిద్ధి చెందిన ఈమె ఆధునిక కాలంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గత కొన్ని రోజులకు ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలలో తన ప్రేమ గురించి వెల్లడించింది. కాగా ఇటీవల ఒక సినిమా చూసి ఏడ్చానని చెప్పుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఎప్పుడూ సినిమాలలోని ఎమోషనల్ సీన్లు చూసి కంటతడి పెట్టుకోలేదని, 'అలియా భట్' (Alia Bhatt) నటించిన 'రాజీ' మూవీలో తన నటనకు ఏడ్చేసినట్లు చెప్పుకొచ్చింది. మొదటి సారి 1958లో సినిమా చూసినట్లు, అప్పటి నుంచి వైజయంతిమాలకు అభిమానిగా మారానని చెప్పింది. ఈ తరం వారిలో 'అలియా భట్' నటనను అభిమానిస్తానని.. ఆమె గ్రేట్ యాక్టర్ అని కొనియాడింది. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్, మ్యూజిక్ వంటి వాటని గురించి ఇంట్లో చర్చించుకుంటామని సుధామూర్తి తెలిపారు. 2018లో విడుదలైన రాజీ సినిమాలో అలియా భట్ ఇండియా కోసం గూఢచారి పాత్రలో గొప్పగా నటించింది. ఈ మూవీ ఏకంగా రూ. 190 కోట్లు వసూలు చేసింది. అంతే కాకుండా 64 వ ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో ఉత్తమ నటి పురస్కారం ఒకటి కావడం గమనార్హం. -
తిరుమల శ్రీనివాసుడికి ఇన్ఫోసిస్ మూర్తి దంపతుల భారీ కానుకలు
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దంపతులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భారీ కానుకలు సమర్పించారు. సతీమణి సుధామూర్తి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆదివారం(జూలై 16) తిరుమలకు చేరుకున్న నారాయణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేకంగా చేయించిన బంగారు కానుకలను టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు గాను బంగారుతో ప్రత్యేకంగా శంఖం, కూర్మ ఆకృతులను తయారు చేయించారు. రెండు కేజీల పరిమాణంతో ఉన్న ఈ స్వర్ణాభరణాల విలువ కోటి రూపాయలు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి ➤ ఇన్ఫోసిస్ మూర్తిపై మహాభారత పాత్ర ప్రభావం.. అప్పట్లో కరుడుకట్టిన వామపక్షవాది! తిరుమల వేంకటేశ్వర స్వామిని సుధామూర్తి ఇష్టదైవంగా భావిస్తారు. ఏటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. తొలిసారి తాను 1953లో తిరుమల కొండకు వచ్చానని, అప్పటి నుంచి 70 ఏళ్లుగా తిరుమలకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి.. ప్రస్తుతం టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలిగానూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
అలా తపన పడే భర్తలకు కేవలం భార్యగా ఉంటే సరిపోదు!
Sudha Murthy: భారతదేశంలో పరిచయం అవసరంలేని పేరు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధా మూర్తి'. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్గా, రచయిత్రిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందినప్పటికీ నిరాడంబరంగా జీవించడం ఈమెకు మాత్రమే సాధ్యమవుతుంది. గతంలో అనేక సందర్భాల్లో ఈమె నారాయణ మూర్తితో తన ప్రయాణం గురించి వెల్లడించింది. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో విజయవంతమైన భర్తల దగ్గర భార్యలు ఎలా ఉండాలి? అనేదాని గురించి వివరించింది. యువ పారిశ్రామిక వేత్తల భార్యలకు సూచనలు చేసే క్రమంలో నారాయణ మూర్తి లాంటి సక్సెస్ఫుల్ పర్సన్ని డీల్ చేయడం అంత ఈజీ కాదని చెప్పింది. అంతకు ముందే నారాయణ మూర్తి మాట్లాడుతూ తాను జీవితంలో విజయం సాధించడానికి తన భార్య చాలా సహకరించిందని చెప్పారు. సుధా మూర్తి మాట్లాడుతూ.. నిజానికి జీవితంలో సక్సెస్ సాధించాలని తపనపడే వారు సాధారణ వ్యక్తుల మాదిరిగా ఉండరు, వారికి ఇంట్లో లాజిక్ ఉండదు, ఆఫీసులో మాత్రమే లాజిక్ ఉంటుంది. కాబట్టి మీరు భార్యగా మాత్రమే కాకుండా, సెక్రటరీ, ఫైనాన్స్ మేనేజర్, నానీ, అడ్వైజర్ వంటి ఎన్నో పాత్రలు పోషించాల్సి వస్తుంది. ఇందులో ఏదైనా తప్పితే ప్రతికూల ప్రభావం ఎదురవుతుందని వెల్లడించింది. (ఇదీ చదవండి: మెటా థ్రెడ్స్లోకి టాలీవుడ్ హీరోలు.. ఫస్ట్ ఎంట్రీ ఎవరిదంటే?) పాత రోజుల్లో కొంత మంది తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లేవారు. అక్కడ తపస్సు ఎన్ని రోజులు చేస్తారో తెలియదు. పారిశ్రామిక వేత్తలు కూడా వారి కంపెనీ కోసం తపస్సు చేస్తారు. జీవితాన్ని దాని కోసం త్యాగం చేస్తారు. కావున భార్య తప్పకుండా అన్ని విషయాలలోనూ సహకరించాలి. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) ఒక స్త్రీ పురుషుడికన్నా బలంగా ఉండాలని చెబుతూ.. కంపెనీలో నారాయణ మూర్తి చాలా స్ట్రాంగ్గా ఉంటారు, అయితే నేను అంతకంటే స్ట్రాంగ్గా ఉంటానని సుధామూర్తి చెప్పుకొచ్చింది. ప్రతి భార్య మంచి మేనేజర్, అద్భుతమైన సీఈఓ, గొప్ప సహచరురాలుగా ఉండాలన్నారు. నా మాటలు భర్త కోసం త్యాగాలు చేస్తున్న భార్యలకు అంకితమని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో నారాయణ మూర్తి కూడా తన భార్య సుధా మూర్తి గురించి చాలా గొప్పగా చెప్పాడు. -
టాటా కంపెనీలో ఒకప్పుడు రోజులు గుర్తొచ్చేశాయి - సుధామూర్తి
భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో 'రతన్ టాటా' (Ratan Tata) గురించి తెలుసు. దీనికి ప్రధాన కారణం ఈయన గొప్ప పారిశ్రామిక వేత్త అని మాత్రమే కాదు.. దాత్రుత్వంలో కలియుగ కర్ణుడగా కీర్తించబడటం కూడా. టాటా మోటార్స్ కంపెనీ ఇప్పుడు భారతదేశంలో తిరుగులేని సంస్థగా అవతరించినప్పటికీ దీని ఫౌండర్ మాత్రం JRD టాటా. జెఆర్డి టాటా ప్రారంభించిన ఈ కంపెనీలో మొదటి మహిళా ఇంజనీర్ ఇన్ఫోసిస్ చైర్పర్సన్ 'సుధామూర్తి' (Sudha Murty) అని చాలా మందికి తెలియకపోవచ్చు. నిజానికి సుధామూర్తి టాటా కంపెనీలో ఇంజనీర్ కావడం వెనుక పెద్ద కథే ఉంది. అప్పట్లో టాటా సంస్థను టెల్కో అని పిలిచేవారు. ఇప్పుడు టాటా కంపెనీలో సగం మంది మహిళలు పనిచేయడానికి ప్రధాన కారకురాలు కూడా ఈమే కావడం గమనార్హం. 1974లో బెంగళూరులో టాటా ఇన్స్టిట్యూట్లో సుధామూర్తి ఎమ్.టెక్ చేస్తున్న సమయంలో తమ క్లాసులో అందరూ అబ్బాయిలే ఉండేవారని, అంతకు ముందు బీఈ చేసినప్పుడు కూడా క్లాసులో తానొక్కటే అమ్మాయని వెల్లడించింది. ఒకరోజు కాలేజీ నోటీస్ బోర్డులో ఉన్న ప్రకటనలో పుణెలోని టెల్కో కంపెనీలో పనిచేసేందుకు ఉత్సాహవంతులైన యువకులు కావాలని ఉండటం చూసింది. అయితే అందులోనే యువతులు అప్లై చేసుకోకూడదని అందులో వెల్లడించారు. (ఇదీ చదవండి: ఆ ఖరీదైన కార్లన్నీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్యారేజీలోనే! అవేంటంటే..) ఇది చూడగానే ఆమెకు పట్టరాని కోపం వచ్చి హాస్టల్కి వెళ్లి జేఆర్డీ టాటాకు లేఖ రాసి అందులో మహిళలు సంస్థలో అవకాశం ఇవ్వకపోతే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని.. సమాజంలో 50 శాతం పురుషులు ఉంటే మిగిలిన 50 శాతం మంది స్త్రీలు ఉన్నారు. ఉద్యోగావకాశాలను కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేస్తే సమాజం ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించినట్లు చెప్పింది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?) లేఖను అనుసరించి జెఆర్డీ టాటా సుధామూర్తిని ఇంటర్వ్యూకి పిలిచారు, ఆ తరువాత అందులో పనిచేసారు. అయితే సుధా మూర్తి సోషల్ మీడియావైలో చేసిన ఒక పోస్ట్ ప్రకారం, సుమారు 40-50 సంవత్సరాల తరువాత టాటా మోటార్స్గా పిలవబడే పూణే టెల్కోను సందర్శించినట్లు.. అక్కడ 300 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారని, అది చూడగానే తనకు ఏడుపు వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇదంతా సుధామూర్తి రతన్ టాటా తాతకు చేసిన ఆ ఒక్క అభ్యర్థన ప్రతి ఫలమే. -
సుధా మూర్తి కోపంతో జేఆర్డీ టాటాకు రాసిన లేఖలో అంత వుందా.. అదే మహిళలకు వరమైంది!
Sudha Murthy: ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసమే లేదు. అయితే ఇటీవల ఈమె కపిల్ శర్మ షోలో పాల్గొని తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందరితో షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గురించి వెల్లడించిన సుధా మూర్తి, తాజాగా జేఆర్డీ టాటాకు కోపంతో లేఖ రాసిన విషయాన్ని బయటపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. సుధా మూర్తి 1974లో బెంగళూరులో చదువుకునే టాటా ఇన్స్టిట్యూట్లో ఎమ్.టెక్ చేస్తున్న సమయంలో తమ క్లాసులో అందరూ అబ్బాయిలే ఉండేవారని, అంతకు ముందు బీఈ చేసినప్పుడు కూడా క్లాసులో తానొక్కటే అమ్మాయని చెప్పుకొచ్చింది. అయితే ఒకరోజు కాలేజీ నోటీస్ బోర్డులో ఉన్న ప్రకటనలో పుణెలోని టెల్కో కంపెనీలో పనిచేసేందుకు ఉత్సాహవంతులైన యువకులు కావాలని ఉండటం చూసింది. అయితే అందులోనే యువతులు అప్ప్లై చేసుకోకూడదని వెల్లడించింది. ఇది చూడగానే ఆమెకు పట్టరాని కోపం వచ్చిందని వెల్లడించింది. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) నోటీసులొని ప్రకటన చూసిన తరువాత జేఆర్డీ టాటాకు లేఖ రాసినట్లు తెలిపింది. అందులో మహిళలు అవకాశం ఇవ్వకపోతే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని.. సమాజంలో 50 శాతం పురుషులు, 50 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే ఉద్యోగావకాశాలను కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేస్తే సమాజం ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించినట్లు చెప్పింది. ప్రతి సంవత్సరం టాటా పుట్టిన రోజు సందర్భంగా మార్చి 15న తమ ఇన్స్టిట్యూట్కు వచ్చారని, అప్పుడు ఆయనను భయంతోనే దూరం నుంచి చూశానని తెలిపింది. సుధా మూర్తి రాసిన లేఖ పనిచేసినట్లే ఉంది. అందువల్లనే టాటా సంస్థల్లో మహిళలు కూడా ముందుకు వెళుతున్నారు. దీనికి ప్రధాన పాత్ర 'సుధా మార్తి'దే అని చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
బ్రిటన్ ప్రధాని అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు: సుధామూర్తి
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి అందరికీ సుపరిచితురాలే. రచయిత్రి, విద్యావేత్త, సామాజిక వేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. కోట్ల సంపద ఉన్నప్పటికీ సాధారణ మహిళగానే జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. కాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సుధామూర్తికి సొంత అల్లుడు అన్న విషయం తెలిసిందే. నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షరతో రిషి వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం(కృష్ణ సునక్, అనౌష్క సునక్). గతేడాది సెప్టెంబర్లో రిషి సునాక్ యూకే ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల సుధామూర్తి లండన్కు వెళ్లగా అక్కడ ఎదురైన ఓ ఆసక్తికర విషయాన్ని బాలీవుడ్ టాక్షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొని పంచుకున్నారు. లండన్లో తన అడ్రస్ చెబితే ఇమిగ్రేషన్ అధికారులు నమ్మలేదని తెలిపారు. తాను ప్రధాని అత్తగారినంటే ‘జోక్ చేస్తున్నారా’ అని అడిగారని పేర్కొన్నారు. ‘నేను ఒకసారి యూకే వెళ్లాను. లండన్లో ఎక్కడ ఉంటారని ఇమిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్ అడ్రస్ అడిగారు. నాతో పాటు మా అక్క కూడా ఉన్నారు. నా కొడుకు కూడా లండన్లో నివసిస్తున్నాడు. కానీ నాకు అతని పూర్తి అడ్రస్ తెలియదు. అందుకే అల్లుడు రిషి సునాక్ నివాసించే 10 డౌనింగ్ స్ట్రీట్’ను అడ్రస్గా రాశాను. అది చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు నావైపు అదో రకంగా చూశారు. మీరు జోక్ చేస్తున్నారా అని అడిగారు. నేను నిజమే అని చెప్పాను. కానీ ఆయన నమ్మినట్లు నాకు అనిపించలేదు.72 ఏళ్ల వయసున్న నాలాంటి సాధారణ మహిళ బ్రిటన్ ప్రధాని రిషి అత్తగారంటే అక్కడ ఎవరూ నమ్మలేదు.’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ షోలో సుధామూర్తితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్, నిర్మాత గునీత్ మోంగా కూడా పాల్గొన్నారు. చదవండి: ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు.. -
‘ముసలోళ్లం.. చూసి నేర్చుకోండి..లేదంటే’! ఇన్ఫీ నారాయణమూర్తి దంపతుల వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి, ఆయన సతీమణి, రచయిత్రి సుధామూర్తి విశేషంగా నిలిచారు. ఎందుకుంటే పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పోలింగ్ బూత్కొచ్చి క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి దంపతులు ఓటు హక్కు వినియోగంపై యువతకు సందేశమిస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు. బెంగళూరులోని జయనగర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేసిన నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. ఓటు హక్కను వినియోగించుకోకపోతే, ఆ తరువాత పాలకులను ప్రశ్నించే హక్కునుకూడా కోల్పోతామని సుధామూర్తి వ్యాఖ్యానించారు. తాము పెద్దవాళ్ల మైనప్పటికీ ఉదయమే ఓటు హక్కును వినియోగించు కున్నామనీ, తమ నుంచి యువత నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. పద్మభూషణ్ అవార్డీ మీడియాతో మాట్లాడుతూ ‘‘దయచేసి మమ్మల్ని చూసి నేర్చుకోండి. ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైన భాగం" అన్నారు. #WATCH | Jayanagar, Bengaluru | Sudha Murty gives a message to young voters after casting her vote; says, "Please look at us. We are oldies but we get up at 6 o'clock, come here and vote. Please learn from us. Voting is a sacred part of democracy..."#KarnatakaElections pic.twitter.com/B1ecZCH93M — ANI (@ANI) May 10, 2023 ఈ సందర్బంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యత గురించి యువతకు చెప్పాల్సిన బాధ్యత పెద్దలదే. తన తల్లిదండ్రులు తనకు అలాగే చెప్పారని చెప్పారు. తాను విదేశాల నుంచి ఈరోజు ఉదయం తిరిగొచ్చాననీ, అయినా ఓటు వేసేందుకు వచ్చానని నారామణ మూర్తి తెలిపారు ఫస్ట్ ఓటు వేద్దాం.. ఆ తరువాతే ఇది బాగాలేదు.. అది బాగాలేదు అనే చెప్పవచ్చు లేదంటే.. విమర్శించే హక్కు ఉండదనిపేర్కొన్నారు. మరోవైపు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని కోరమంగళలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికలు తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార బీజేపీకి, అటు కాంగ్రెస్కు చాలా కీలకం. కర్నాటక లోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా, 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఓటు హక్కు వినియోగించుకున్న సుధామూర్తి, గాలి జనార్దన్ రెడ్డి సతీమణి
-
కర్ణాటక పోలింగ్ గురించి ఇన్ఫోసిస్ సుధా మూర్తి మరియు గాలి లక్ష్మి అరుణ
-
Sudha Murty: 'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది!'
రిషి సునాక్ అతి చిన్న వయసులో బ్రిటన్ ప్రధాని అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతని అత్తగారు సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలు.. అతని అధికార హోదాను మరోసారి వార్తల్లో హైలెట్గా నిలిచేలా చేసింది. ఈమేరకు ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు, దిగ్జజ పారిశ్రామిక వేత్త నారాయణ మూర్తి భార్య సుధామూర్తి మాట్లాడుతూ..తన కూతురు కారణంగానే రిషి సునాక్ అతి చిన్న వయసులో యూకేకి ప్రధాని అయ్యారని ఆన్లైన్లో ప్రసారం అవుతున్న ఓ వీడియోలో అన్నారు. ఆ వీడియోలో..తన కూతురే దీన్ని సాధ్యం చేసిందన్నారు. తాను తన భర్తను వ్యాపారవేత్తను చేస్తే తన కుమార్తె తన భర్తను ప్రధానిని చేసిందని చెప్పారు. "ఇదంతా భార్య మహిమే. భార్య భర్తను ఎలా మారుస్తుందో చూడండి. ఐతే నేను నా భర్తను మాత్రం మార్చలేకపోయాను..నేను ఆయన్ని కేవలం వ్యాపారవేత్తని చేశానని, కానీ నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అన్నారు. కాగా, రిషి సునాక్ 2009లో అక్షతామూర్తిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడేళ్లలోనే యూకేకి ప్రధాని అయిన ఎంపీగా నిలవడమే గాక, అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా పేరుగాంచారు. కాగా అక్షతమూర్తి ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్లలో ఒకరి కుమార్తె, దాదాపు 730 మిలియన్ల పౌండ్ల వ్యక్తిగత సంపదతో శక్తిమంతమైన మహిళగా ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు, భారతదేశానికి చెందినవారు. అక్షతామూర్తి తండ్రి నారాయణమూర్తి ఇన్పోసిస్ వ్యవస్థాపకుడు, భారతదేశంలోని అత్యంత సంపన్నులో ఆయన ఒకరు. (చదవండి: మణిపూర్లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు) -
సుధామూర్తికి పద్మభూషణ్.. అత్తపై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. కంప్యూటర్ ఇంజనీర్గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్,. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలు అనాథాశ్రయాలను ప్రారంభించిన ఆమె.. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందింస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడుతున్నారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తల్లికి దక్కిన గౌరవంపై మురిసిపోతూ ఆమె కూతురు, యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారు. రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషన్ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యానని అన్నారు. సమాజం కోసం చేసిన సేవకు ఆమెకీ అవార్డు దక్కిందని చెప్పుకొచ్చారు ‘25 సంవత్సరాలుగా స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసి అక్షరాస్యతను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలలు నిర్వహిస్తుంది. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. ఎలా జీవించాలో తనను చూసి నేర్చకున్నాను. గుర్తింపుకోసం అమ్మ ఎప్పుడూ ఎదురు చూడలేదు. కానీ నిన్న దక్కిన గుర్తింపు ప్రత్యేకం. మా తల్లిదండ్రులు మాకు(తమ్ముడు, నాకు) కష్టపడి పనిచేయడం, మానవత్వం చూపడం, నిస్వార్థంగా జీవించడం వంటి ఎన్నో విలువలు నేర్పించారు’ అంటూ తల్లిపై ప్రేమను చాటుకున్నారు. అక్షతమూర్తి పోస్టుపై అల్లుడు రిషి సునాక్ స్పందించారు. సుధామూర్తి ఘనతను కొనియాడుతూ.. ‘గర్వించదగ్గ రోజు’ అంటూ క్లాప్ ఎమోజీని షేర్ చేశారు. కాగా ఇప్పటికే సుధామూర్తి అందించిన సామాజిక కార్యక్రమాలకుగానూ 2006లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Akshata Murty (@akshatamurty_official) -
పద్మశ్రీ అవార్డు అందుకున్న కీరవాణి.. సుధామూర్తికి పద్మభూషణ్ ప్రధానం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురికి పద్మ అవార్డులు ప్రధానం చేశారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థపాకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్కు ప్రకటించిన పద్మ విభూషణ్ను ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థపాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. సామాజిక సేవ చేసినందుకు ఆమెను ఈ అవార్డు వరించింది. అలాగే చినజీయర్ స్వామి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరైంది. అలాగే సూపర్ 30 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వ్యవస్థపాపకుడు ఆనంద్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని ఈ ఏడాది 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చిలోనే జరిగింది. ఆ రోజు అవార్డు అందుకోలేకపోయిన పలువురికి రాష్ట్రపతి బుధవారం వీటిని ప్రధానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోనే ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ.. -
ఇన్ఫోసిస్ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..!
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ పరిశ్రమలో రెండో అతిపెద్ద సంస్థగా ఇన్ఫోసిస్ తన సేవలతో దిగ్గజంగా నిలిచింది. 1981లో టెక్ దిగ్గజం ఎన్ఆర్ నారాయణ మూర్తి మరో ఆరుగురు టెక్కీల కలల పంటగా ఇన్ఫోసిస్ ఆవిష్కారమైంది. ఏడు మంది ఇంజనీర్లు కలిసి, మహారాష్ట్ర పూణే లో 250 డాలర్ల పెట్టుబడితో 1981లో ప్రారంభించారు. 1981 జులై 2న ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్గాఅవతరించింది. ఆ తరువాత 1983 నుంచి కర్ణాటకలోని బెంగుళూరుకు మారింది. 1992 ఏప్రిల్లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుని అదే ఏడాది ఐపీవోకి వచ్చింది. ఇక ఆ తరువాత 2011 జూన్ నాటికి ఇన్ఫోసిస్ లిమిటెడ్గా సేవలందిస్తోంది. కలలైతే ఉన్నాయి, కానీ డబ్బు లేదు. కానీ ముందుకు సాగాలనే పట్టుదల, ధైర్యం, దృఢ నిశ్చయం, స్ట్రగుల్కి తోడుగా నిలిచారు. ముగ్గురు మహిళలు. వాకి ఎనలేని తోడ్పాటుతో వారు దూసుకుపోయారు ఇన్ఫోసిస్ డ్రీమర్లు. ఫోన్లు లేవు.. కార్లు లేవు.. ఎలాంటి విందులు, విలాసాలు లేవు. ఉన్నదల్లా కంపెనీని నిలబెట్టాలనే ఆరాటం మాత్రమే. పగలూ రాత్రి అదే పోరాటం మాత్రమే వినూత్నంగా సృష్టించాలనే తపన తమను ముందుకు నడిపించిందంటారు నారాయణమూర్తి. తగినంత సొమ్ము లేనపుడు ఇన్ఫోసిస్ ఫౌండర్స్కు వారి భార్యలనుంచి లభించిన సహకారం మద్దతు మాత్రం కొండంత అండగా నిలిచింది. ఆ రోజు వారందించిన సాయమే ఇన్ఫోసిస్ను టాప్ కంపనీగా నిలబెట్టింది. ఫలితంగా సుధామూర్తి, రోహిణి నీలేకని, కుమారి దేశంలో అత్యంత ధనవంతులైన మహిళలుగా నిలిచారు. ఆ ముగ్గురు మూర్తులు వీరే సుధా మూర్తి ఇన్పీ నారాయణమూర్తి భార్య సుధామూర్తి అంటే పరిచయం అవసరం లేని పేరు. తనదైన వ్యక్తిగతం, ఆదర్శ జీవితం, దాతృత్వంతో అనేకమంది మనసు దోచుకున్న ఆదర్శమూర్తి. ఇన్ఫోసిస్ స్థాపనలో తన దగ్గర 10వేల రూపాయలను ఇచ్చిన నారాయణమూర్తిని సొంతకంపెనీ వైపు నడిపించిన ధీర వనిత. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఛారిటీ, సోషల్ సర్వీసెస్ వింగ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు సుధా నాయకత్వం వహిస్తున్నారు. తన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత అవసరమైన వారికి ఇవ్వడంలోనే తనకు సంతోషం అంటరావిడ. రోహిణి నీలేకని ఇన్ఫోసిస్ ఫౌండర్, ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకని భార్య రోహిణి నీలకేని. ఇన్ఫోసిస్ కష్టాల్లో ఉన్న తొలి రోజుల్లో నందన్కు అండగా నిలిచారు. తన దగ్గరున్న 10వేల రూపాయలను సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత ఇన్ఫోసిస్ అఖండ విజయంతో ధనవంతురాలిగా నిలిచారు. జర్నలిస్టుగా తన కరియర్ ప్రారంభించిన రోహిణి ప్రముఖ రచయిత కూడా. నవలలు, ట్రావెలాగ్లు, టెక్ బుక్స్, పిల్లలకోసం బుక్స్ లాంటి దాదాపు 19 పుస్తకాలు రాశారు. అలాగే అర్ఘ్యం , అక్షర లాంటి ఫౌండేషన్స్తో గొప్ప ఫిలాంత్రపిస్ట్గా నిలిచారు. (రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే?) కుమారి శిబులాల్: ఇన్ఫోసిస్ ఫౌండర్స్లో ఒకరైన శిబులాల్ భార్య కుమారి శిబులాల్. గ్లోబల్ కస్టమర్ డెలివరీకి డైరెక్టర్, ఫౌండర్ కుమారి ఇన్ఫోసిస్ అద్భుతమైన జర్నీలో కీలక పాత్ర పోషించారు. శిబులాల్, కుమారి దంపతులు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో బోస్టన్ సౌత్ షోర్ శివారులో నివసిస్తున్నప్పటికీ ఆమె తరచూ ఇండియాలో సందడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బెంగళూరులో పేద పిల్లలకు సహాయం కోసం స్థాపించిన అక్షయ అనే స్వచ్ఛంద ట్రస్ట్కు చైర్పర్సన్గా ఉన్నారు. అక్షయ స్కాలర్షిప్లను అందిస్తుంది. 2002 సంవత్సరంలో వెయ్యి మంది పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్స లకు స్పాన్సర్గా నిలవడం విశేషంగా నిలిచింది. మనం చేసే సమాయం సముద్రంలో నీటి బిందువు లాంటిది..కానీ చుక్క చుక్క కలిస్తే సముద్రం.. ఆమాత్రం మనం చేయకపోతే ఎలా అంటారు కుమారి శిబులాల్. ఆమె మంచి క్రీడా ప్రేమికురాలు కూడా. ఈ నేపథ్యంలోనే స్వస్థలమైన కేరళలో ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను స్థాపించడానికి ఘన సాయం అందింబారు. గోల్డెన్ గర్ల్, అథ్టెట్, పీటీ ఉషకు ఈ విషయంలో అండగా నిలిచారు. అంతేకాదు ఉషా స్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఆరుగురు విద్యార్థులకు అక్షయ ట్రస్ట్ పూర్తిగా స్పాన్సర్ చేసింది. ఇన్ఫోసిస్ కో ఫౌండర్స్ ఎన్ ఆర్ నారాయణమూర్తి నందన్ నీలేకని ఎస్. గోపాలకృష్ణన్ ఎస్ డి షిబులాల్ కే. దినేష్ ఎన్ఎస్ రాఘవన్ అశోక్ అరోరా -
సుధామూర్తి సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్తాపకులు నారాయణమూర్తి భార్య, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. విద్యావేత్త, రచయితగా, సామాజిక సేవకురాలిగా అనేక కార్యక్రమాలను నిర్వహించి మంచి పేరును సంపాదించారు. అంతేగాక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్గా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రంగాలలో ఆమె అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం సుధామూర్తిని పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. అయితే సంపన్న కుటుంబం, వేల కోట్ల ఆస్తులు, ఉన్నత స్థాయిలో ఉన్న సూధామూర్తి ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించుకోరు. మాటల్లోనూ, చేతల్లోనూ ఎంతో నిరాడంబరత ప్రదర్శిస్తూ అందరి మన్ననలు అందుకుంటారు. తాజాగా మరోసారి ఆమె తన సింస్లిసిటీతో వార్తల్లోకెక్కారు. కేరళ తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయంలో మంగళవారం జరిగిన ప్రసిద్ధ పొంగళ(Pongala) పండుగకు వేలాది మంది మహిళలు తరలివచ్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు సుధామూర్తి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆమె అనేకమంది మహిళల మధ్య కూర్చొని పొంగళి (బియ్యం,కొబ్బరి, బెల్లంతో చేసే తీపి వంటకం) తయారు చేసి దేవతకు సమర్పించారు. అంతేగాక భక్తులకు ప్రసాదం వడ్డించడంలోనూ సాయం చేశారు. అయితే సుధామూర్తి వద్ద భద్రత, వీఐపీ హడావిడి లేకపోవడంతో తనను ఎవరూ గుర్తించలేకపోయారు. మహిళలందరితోపాటే గుడి వద్ద మండుతున్న ఎండలో కూర్చొని నైవేద్యాన్ని సిద్ధం చేస్తున్న ఆమె ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. A totally humbling experience. This is Sudha Murthy, Rishi Sunak's(PM) mother in-law!!!#SudhaMurthy #RishiSunak pic.twitter.com/ZrEAAHnds7 — Viren Patel (@shaakbhaji) March 11, 2023 సుధామూర్తి ఇంత సింపుల్గా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భర్త, అల్లుడు గొప్ప స్థానంలో ఉన్నా ఆమెలో ఒకింత కూడా గర్వం నిపించడం లేదని ప్రశంసిస్తున్నారు. కాగా అత్యధికంగా మహిళలు తరలివచ్చే అట్టుకల్ పొంగళ పండుగకు తాను రావడం ఇదే తొలిసారి అని మూర్తి తెలిపారు. ఎంతో మంది మహిళలు కలిసి ఈ వేడుకలు చేసుకుంటున్నారని, అంతా ఒక్కటే అనే సందేశమిచ్చేదే ఈ వేడుక అని పేర్కొన్నారు. అందరూ సమానమేనన్న ఈ భావన తనకెంతో నచ్చిందన్నారు. i am proudly say that the women empower of india sri sudha murthy to lead our generation to power missile her is the founder of infosys nd everyone learns alot from her how to respect our culture traditions simplicity 🙏 @AskAnshul @SriSri @NameisNani @imVkohli @narendramodi pic.twitter.com/VTxAHxEprO — Rakurthi Suresh (@SureshnaiduR) March 10, 2023 చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అంతటితో ఆగకుండా.. -
పేరెంటింగ్: కూతురు నేర్పిన పాఠం
‘పిల్లలతో స్నేహంగా ఉండండి. వాళ్లు తల్లిదండ్రులకు భయపడేలా ఉంచకండి. వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి’ అంటున్నారు సుధామూర్తి. 15 ఏళ్ల వయసున్నప్పుడు 45 ఏళ్లు ఉన్న తనకు తన కూతురు అక్షత నేర్పిన పాఠం వల్ల తాను ఈ రోజు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు. ‘పిల్లలకు తమ మీద తాము ఆధారపడటం నేర్పాలి. ఆనందం పొందడం నేర్పించాలి. నా తల్లిదండ్రుల నుంచి అదే నేర్చుకున్నాను. నా పిల్లలకూ అదే నేర్పాను’ అన్నారు సుధామూర్తి. జైపూర్లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొని తల్లిదండ్రులను, యువతను ఉద్దేశించి తన పుస్తకాల నేపథ్యంలో మాట్లాడారు. ‘పిల్లల నుంచి తల్లిదండ్రులు... తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకుంటూనే ఉండాలి. అలా జరగాలంటే ఇద్దరి మధ్య భయం లేని సంభాషణ జరిగే వాతావరణం ఉండాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు భయపడేలా ఉంటే తమ మనసులోది చెప్పకుండా ఉంటారు. అప్పుడు ఇరుపక్షాలకూ నష్టం జరుగుతుంది’ అన్నారు సుధామూర్తి. తొలికాలపు మహిళా ఇంజినీర్గా, ఇన్ఫోసిస్ దిగ్గజంగా తనకు ఉన్న గుర్తింపు కంటే పుస్తకాలు రాయడం ద్వారా ‘దేశానికి అమ్మమ్మ’గా తనకు వస్తున్న గుర్తింపు, తన రాతలూ మాటలూ నవతరం వింటున్న తీరు తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారామె. జైపూర్లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో శుక్రవారం క్రిక్కిరిసిన పాఠకుల మధ్య ‘మై బుక్స్ అండ్ బిలీఫ్స్’ అనే అంశం మీద మాట్లాడారు. ► ఆడపిల్ల గొప్పతనం ‘ఆడపిల్ల దేనిలోనూ తక్కువ కాదని నేను నిరూపించదల్చుకున్నాను. మా నాన్న డాక్టర్. నేను డాక్టరైతే బాగుంటుందని అనుకున్నాడు. మా అమ్మ లెక్కల టీచర్. నేను కూడా లెక్కలు టీచరు అయితే సరిపోతుందని భావించింది. కాని నేను అప్లయిడ్ సైన్స్లో ఇంజినీరింగ్ చేద్దామని నిశ్చయించుకున్నాను. ఇంజినీరింగ్ మగవారి విద్య అని అప్పటివరకూ భావన. మా నానమ్మ నేను ఇంజినీరింగ్ చదివితే తమ ఇళ్లల్లో కుర్రాళ్లు ఎవరు పెళ్లి చేసుకుంటారని హడలిపోయింది. ఆడపిల్లలు ఇంజినీరింగ్ చేస్తారని తెలియక నేను చదివిన కాలేజీలో లేడీస్ టాయిలెట్ కట్టలేదు. నేను చేరాక కూడా ఈ సెమిస్టర్ అయ్యాక మానేస్తుంది వచ్చే సెమిస్టర్లో మానేస్తుంది అని కట్టలేదు. నేను మానలేదు. పట్టుదలగా ఇంజినీరింగ్ పూర్తి చేశాను. జ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు... అందరిది... అదే నేను నిరూపించాను. ఏ ఇంటి అమ్మాయిలైనా ఇలాంటి పట్టుదలతో ఉండాలి. మీ మీద మీరు ఆధారపడి ముందుకు పోవాలి’ అందామె. ► కూతురి పాఠం ‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక నేను మంచి ఇంజనీర్ని అనిపించుకోవాలని... మగవాళ్ల కంటే బాగా పని చెయ్యాలని ఉద్యోగంలో విపరీతంగా కష్టపడేదాన్ని. (భర్త నారాయణమూర్తితో) ఇన్ఫోసిస్ స్థాపించాక లాభాల గురించి పత్రికల్లో వార్తలు వచ్చినా పిల్లలకు అది పెద్ద విషయంగా చూపేదాన్ని కాదు. అంతేకాదు, పది రూపాయలు పిల్లలకు ఇచ్చినా లెక్క అడిగేదాన్ని. ఇలా ఉండగా నా కూతురు అక్షత, అప్పుడు 15 ఏళ్లు ఉంటాయి, తనకు తెలిసిన ఒక పేద పిల్లాడికి కాలేజీలో సీటు వచ్చిందని, ఆ అబ్బాయిని స్పాన్సర్ చేయమని నన్ను అడిగింది. నేను నా పని హడావిడిలో ఆ మాట విని– నువ్వు స్పాన్సర్ చెయ్ అనేశాను తేలిగ్గా. దానికి నా కూతురు భయపడకుండా– అమ్మా... నీకు 45 ఏళ్లు వచ్చాయి. మంచి స్థితిలో ఉన్నావు. ఆదాయం ఉంది. ఒకరికి సాయం చేయగలవు. నాకు నువ్వు పాకెట్ మనీ కూడా ఇవ్వవు. కాని సాయం చేయమనేసరికి నన్ను చేయమంటున్నావు. చేయగలిగిన స్థితిలో ఉండి నువ్వు చేయలేనప్పుడు ఇంకొకరు సాయం చేయాలని ఆశించకు అంది. ఆ రోజు ఆఫీస్కు వెళ్లి అలా కూర్చుండిపోయాను. రెండు రోజులు ఆ మాటలు వెంటాడాయి. దాని నుంచే నా ఫౌండేషన్ పుట్టింది. ఫలితం? ఎందరో పేదలకు సాయం చేస్తున్నాను. ఎదుటివాళ్లకు సాయం చేయడంలోని ఆనందం నా కూతురి వల్లే పొందడం నేను నేర్చుకున్నాను’ అందామె. ► పోల్చి చూసుకోవద్దు ‘పిల్లలకు ఇంకొకరితో పోల్చి చూసుకోవడం నేర్పించవద్దు. నా కొడుక్కు నాలుగో ర్యాంకు వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లాణ్ణి కంగ్రాచ్యులేట్ చేయమన్నాను. నేను చేయను... వాడు నాకు పోటీ అన్నాడు. మన కంటే బాగా పని చేసేవారు ఎప్పుడూ ఉంటారు... మన కంటే ప్రతిభ ఉన్నవారిని చూసి ఈర్ష్య పడటం మంచి అలవాటు కాదు అని నేర్పించాను. పిల్లలకు తమతో మాత్రమే తాము పోల్చుకుని చూసుకోవాలని చెప్పాలి. నిన్నటి కంటే ఇవాళ మెరుగ్గా ఉన్నానా అని చెక్ చేసుకుని ఎదిగేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. నీ మంచి మిత్రుడివి నీవే... చెడిపోవాలంటే నిన్ను చెడగొట్టుకునేది నీవే... నీలోని మంచి మిత్రుడిని కాపాడుకో అని చెప్పాలి’ అన్నారామె.‘తల్లిదండ్రులు పిల్లలకు దేశం తిప్పి చూపించాలి. మన దేశాన్ని అర్థం చేయిస్తే వారు తాము తెలుసుకోవాల్సింది తెలుసుకుంటారు. ఒంటి మీద చొక్కాలేని పేదలే ఈ దేశాన్ని నిజంగా అర్థం చేయిస్తారు అనే మాట పిల్లలకు చెప్తే దేశం కోసం వాళ్లు ఏం చేయాలో తోటివారికి ఎలా సాయం చేయాలో తెలుసుకుంటారు’ అని ముగించారామె. ‘నీ మంచి మిత్రుడివి నీవే... చెడిపోవాలంటే నిన్ను చెడగొట్టుకునేది నీవే... నీలోని మంచి మిత్రుడిని కాపాడుకో’ అని చెప్పాలి. – సుధామూర్తి – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా
న్యూఢిల్లీ: విద్యావేత్త, రచయిత్రి, పరోపకారి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి అంటే పరిచయం అక్కర లేని పేరు. ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవ ఈవెంట్లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఉరిమే ఉత్సాహం ఉంటే చాలు సంతోషానికి వయసుతో పని లేదంటూ ఆమె సరదాగా కాలు కదిపిన వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. (10 వేలతో..వేల కోట్లు... మీరూ ఇలా చేయండి!) ఈ ఈవెంట్లో బాలీవుడ్ గాయని, మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్తో కలిసి సుధా మూర్తి చిన్నగా స్టెప్పు లేశారు. బుధారం రాత్రి ఎలక్ట్రానిక్స్ సిటీ బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇన్ఫోసిస్ @ 40 ఈవెంట్లో చాలా చురుగ్గా పాల్గొన్న సుధామూర్తి గురు సినిమాలోని "బర్సో రే మేఘా మేఘా" పాటకు ఉత్సాహంగా పదం కలిపారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటించిన ఈ పాటకు సుధామూర్తి ఆనందం ఇంటర్నెట్లో అందరినీ ఆకట్టుకుంటోంది. Someone just sent this to me. Sudha Murty dancing and singing with @shreyaghoshal as part of the #Infy4Decades celebration in Bengaluru last night. Wholesome 😍 pic.twitter.com/I17Ns49qDR — Chandra R. Srikanth (@chandrarsrikant) December 15, 2022 Omg..!!!🙏🏻 legend's Sudhamurthy amma & Shreyaghoshal di . #SudhaMurty mam @shreyaghoshal #Infosys #ShreyaGhoshal #Legends . (Sudha amma dances her heart out on 'Barso Re Megha' with shreya di💃🏻🔥) pic.twitter.com/MmtT1CvZtt — 💕𝑺𝒉𝒓𝒆𝒚𝒂_𝑺𝒖𝒔𝒉💕 (@Sush36068856) December 15, 2022 -
10 వేలతో..లక్షల కోట్లు...మీరూ ఇలా చేయండి!
సాక్షి,ముంబై: ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి మరోసారి తన ప్రత్యేకతను చాటు కున్నారు. విద్యావేత్త, రచయిత్రి, దాత, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధామూర్తి వ్యాఖ్యలు ఇన్వెస్టర్లు సక్సెస్ మంత్రాగా నిలుస్తున్నాయి. సంస్థ 40 ఏళ్ల ప్రస్థానంపై తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన భర్త నారాయణమూర్తికి తాను అప్పుగా ఇచ్చిన 10వేల రూపాయలు ఈ రోజు బిలియన్ డాలర్లుగా మారతాయని తాను కలలో కూడా ఊహించలేదంటూ ఆమె ఆనందాన్ని ప్రకటించారు. అంతేకాదు ఈ నేపథ్యంలో ప్రపంచంలో (కనీసం ఇండియాలో) తానే అత్యుత్తమ ఇన్వెస్టర్గా భావిస్తానని వ్యాఖ్యానించడం విశేషం. (బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా) ఈ సందర్బంగా సుధామూర్తి తన సక్సెస్ జర్నీని వివరించిన తీరు ఆకట్టుకుంటోంది. ఇన్ఫోసిస్ ఈ స్థాయికి రావడానికి ప్రారంభంలో తాము ఏడెనిమిదేళ్లు చాలా కష్టపడాల్సి వచ్చిందని చివరికి విజయం సాధించామని ఆమె తెలిపారు. ఏదైనా సక్సెస్ సాధించాలంటే కష్టపడి పనిచేయాలి. ఓపికతో ఉంటే విజయం దానంతట అదే వరిస్తుందని అప్ కమింగ్ పారిశ్రామికవేత్తలకు సూచించారు. (మరోసారి భారీ సేల్, మునుగుతున్న టెస్లా..ట్విటర్ కోసమే? ఇన్వెస్టర్లు గగ్గోలు) సక్సెస్ కావాలంటే ఈ జనరేషన్కి ఓపిక చాలా అసవరమని తాను భావిస్తా అన్నారు. ఒక్క రోజులోనే ఏమీ సాధించలేం. రోమ్ నగరం ఒక రోజులో నిర్మాణం జరగలేదు కదా. అలాగే ఒక కంపెనీని నిర్మించాలంటే చాలా కష్టపడాలి. నిబద్ధతతో పనిచేయాలి. క్లిష్టమైన పరిస్థితిల్లో ఓపిక పట్టాలని చెప్పు కొచ్చారు. ఓపిగ్గా కష్టపడితే విజయం దానంతట అదే వస్తుంది. కానీ డబ్బు కోసం పరిగెత్తితే, మననుంచి డబ్బు కూడా పారిపోతుందని సుధామూర్తి అన్నారు. ఈ సందర్భంగా తన అల్లుడు, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గురించి కూడా సుధామూర్తి ప్రస్తావించారు. 40 ఏళ్ల ఇన్ఫోసిస్ ప్రస్థానం ► 1981లో 40 ఏళ్ల కిందట కేవలం 250 డాలర్ల పెట్టుబడితో, ఏడుగురు ఇంజనీర్లతో ప్రారంభమైంది ఇన్ఫోసిస్ ►బెంగళూరులో ప్రధాన కార్యాలయంగా నాస్డాక్ లిస్టెడ్ IT కంపెనీ ఇన్ఫోసిస్. ► తొలి పెట్టుబడిదారు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి భర్తకు రూ. 10 వేల అప్పు ► అత్యుత్తమ సేవలతో దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజంగా అవతరించింది ► నాలుగు దశాబ్దాల్లోనే కంపెనీ మార్కెట్ వాల్యూ 6.65 లక్షల కోట్ల స్థాయికి చేరింది ► మార్కెట్ క్యాపిటలైజేషన్లో 100 బిలియన్ డాలర్ల చేరుకున్న నాల్గవ భారతీయ కంపెనీగా అవతరించింది. ► దేశంలోని తొలి కంప్యూటర్ షేరింగ్ సిస్టమ్ కోసం పనిచేసిన నారాయణ మూర్తి ► సాఫ్ట్రోనిక్స్ అనే సంస్థను ప్రారంభించిన మూర్తి ► అక్కడే సుధామూర్తితో పరిచయం, ప్రేమ ► సంస్థకు నష్టాలు రావడంతో ఏడాదిన్నర తర్వాత సంస్థ మూసివేత ► ఉద్యోగ ఉంటేనే పెళ్లి అని సుధామూర్తి తండ్రి షరతు ► పుణేలోని ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్లో జనరల్ మేనేజర్గా ఉద్యోగం ► 1981లో నారాయణ మూర్తి ఉద్యోగానికి గుడ్బై..ఇన్ఫోసిస్ ఆవిర్భావానికి నాంది. -
ఇన్ఫీ సుధామూర్తి పిక్ వైరల్, వివాదాస్పద చర్చ
సాక్షి, ముంబై: ఇన్ఫీ సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వానికి ఆమె ఒక ప్రత్యేక ఉదాహరణ అని చెబుతూ ఉంటారు. అయితే ఈ సారి మాత్రం ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్, సుధా మూర్తి రచయిత్రిగా, విద్యావేత్తగా, పరోపకారిగా మాత్రమే కాకుండా ఒక్కోసారి తన విశాల హృదయంతో చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. తాజాగా 2019 నాటి ఒక ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే కొంతమంది ఈ ఫోటోపై నెగిటివ్గా స్పందిస్తుండగా, మరికొంతమంది పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఆమె ఒకరోల్ మోడల్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం మైసూరు రాజ కుటుంబానికి చెందిన ప్రమోదా దేవి వడియార్ కాళ్లకు మొక్కుతున్న ఒకటి విశేషంగా నిలిచింది. ఇదే పిక్లొ అలనాటి అందాల నటి బి. సరోజా దేవిని కూడా గుర్తించవచ్చు. మైసూర్ రాష్ట్ర చివరి పాలకుడు జయచామరాజ వడియార్ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన క్రమంలో ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది. ప్రమోదా దేవి వడియార్ దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ భార్య. Sudha Murthy bowing before a member of the mysore royal family. She is supposed to be a role model. Is this still a tradition of greeting the members of Royal family in India? Or was it more like an action out of reverence or respect? pic.twitter.com/1xSedjLXXB — Kamran (@CitizenKamran) September 26, 2022 Sudha Murthy bowing before a member of the mysore royal family. She is supposed to be a role model. Is this still a tradition of greeting the members of Royal family in India? Or was it more like an action out of reverence or respect? pic.twitter.com/1xSedjLXXB — Kamran (@CitizenKamran) September 26, 2022 -
‘పీఎం కేర్స్’ ట్రస్టీలుగా రతన్ టాటా, సుప్రీం మాజీ జడ్జి
సాక్షి, న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా పలువురు ప్రముఖల పేర్లను నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సహా పలువురు ఉన్నారు. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది కేంద్రం. కొత్తగా నియామకమైన సభ్యులతో సహా పీఎం కేర్స్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమైన మరుసటి రోజునే ఈ ప్రకటన వెలువడింది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ‘పీఎం కేర్స్ ఫండ్లో అంతర్గతంగా భాగమైనందుకు ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు.’ అని ఓ ప్రకటన చేసింది ప్రధాని కార్యాలయం. ఇతర ట్రస్టీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలు ఉన్నారు. మరోవైపు.. పీఎం కేర్స్ ఫండ్ సలహాదారుల బోర్డుకు కాగ్ మాజీ అధికారి రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకులు ఆనంద్ షాలను నామినేట్ చేసింది కేంద్రం. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన క్రమంలో అత్యవసర సహాయ చర్యల కోసం 2020లో పీఎం కేర్స్ ఫండ్ ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని ఎక్స్ అఫీసియో ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు. పీఎం కేర్స్కు విరాళాలు ఇచ్చిన వారందరికీ పన్ను మినహాయింపు వర్తింపుజేశారు. అలాగే.. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు గత ఏడాది మే 29న పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4వేలకుపైగా చిన్నారుకు ఈ నిధి ద్వారా సాయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదీ చదవండి: పీఎం కేర్స్కు 4,345 మంది ఎంపిక -
రాష్ట్రపతి రేసులో మీరెందుకు లేరు? సుధామూర్తి ఆసక్తికర సమాధానం
ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ రూపు రేఖలు మార్చడంలో ఇతోధికంగా తోడ్పడిన కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. నారాయణమూర్తి స్థాపించిన ఇన్ఫోసిస్ దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా వెలుగొందుతోంది. ఇన్ఫోసిస్ ఎదుగుదల వెనుక ఫౌండర్ నారాయణమూర్తి శ్రమతోతో పాటు ఆయన భార్య సుధామూర్తి సహకారం కూడా ఉంది. రచయితగా, సామాజిక కార్యకర్తగా ఎప్పుడూ చురుగ్గా ఉండే సుధా నారాయణమూర్తికి ఆడియన్స్ నుంచి ఊహించిన ప్రశ్న ఎదురైంది. ఎంతో సున్నితమైన అంశం మీద ఎదురైన సవాల్కు ఆమె సూటిగా సుత్తి లేకుండా జవాబు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరు పలు వాడల్లో పర్యటించారు సుధామూర్తి. ఈ సందర్భంగా సప్నా బుక్హౌజ్ను సందర్శించారు. అక్కడికి వచ్చిన పిల్లలు, పెద్దలు, స్థానికులతో కలిసి ముచ్చటించారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండే మీరు రాష్ట్రపతి పదవి పోరులో ఎందుకు లేరంటూ స్థానికులు ప్రశ్నించారు. దీనిపై సుధామూర్తి స్పందిస్తూ.. ‘ నేను రాష్ట్రపతి రేసులో ఉండటం అనేది కేవలం వాట్సాప్లోనే జరిగింది. బయటెక్కడా అలాంటి ప్రయత్నాలు జరగలేదు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలోకి నన్ను లాగొద్దు’ అంటూ ఆమె బదులిచ్చారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్కోవిండ్ పదవీ కాలం జులై 24తో ముగుస్తుంది. దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నికలు జులై 21న జరగబోతున్నాయి. అధికార పార్టీ తరఫున ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష పార్టీల తరఫున మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్సిన్హాలు బరిలో నిలిచారు. అయితే కర్నాటకలో మాత్రం రాష్ట్రపతి అభ్యర్థిగా సుధామూర్తిని ఎందుకు ప్రకటించరు అంటూ వాట్సాప్లో మేసేజ్లు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి ప్రచారాలకు సుధామూర్తి నేరుగా సమాధానం ఇచ్చారు. చదవండి: ఇన్ఫీ సీఈఓ సలీల్ పరేఖ్ జీతం ఎంత? మరో ఐదేళ్లు సీఎండీగా -
'పేరెంటింగ్ అనేది ఒక మహాయజ్ఞం'.. ఇన్ఫోసిస్ సుధామూర్తి
పేరెంటింగ్ తల్లిదండ్రులకు పరీక్ష అంటే చాలా చిన్న మాట. పరీక్షకు ఒకసారి తప్పితే మరోసారి రాసుకునే అవకాశం ఉంటుంది. పేరెంటింగ్కి ఆ అవకాశం ఉండదు. ఉన్నది ఒక్కటే ఆప్షన్, ఆ ఒక్క అవకాశంలోనే ఉత్తీర్ణత సాధించాలి. అందుకే ఇది ఒక మహాయజ్ఞంతో సమానం. పేరెంటింగ్ మహాయజ్ఞంలో తల్లిదండ్రులను ఉత్తీర్ణులను చేయడానికి ఉపయోగపడే విషయాలను చెప్పారు ఇన్ఫోసిస్ సుధామూర్తి. ఆమె పేరెంటింగ్ అంశంగా రెండు రచనలు, ఒక వీడియో చేశారు. ఆమె చెప్పిన పేరెంటింగ్ టిప్స్ ఆలోచింపచేస్తున్నాయి. మాటలే మార్గదర్శనం! ►ఎవరి కలలు వారివే. తల్లిదండ్రులు తమ కలలను పిల్లల మీద రుద్దకూడదు. పిల్లలు ప్రతి ఒక్కరికీ తమకంటూ కొన్ని ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉంటాయి. వాటిని తల్లిదండ్రులు గౌరవించాలి. ►వ్యక్తి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి డబ్బు ప్రామాణికం కాదు. క్లాసులోని పిల్లల్లో కొందరు ఎక్కువ డబ్బు ఉన్న ఇంటి వాళ్లు ఉంటారు. కొందరు తక్కువ డబ్బు ఉన్న వాళ్లు ఉంటారు. అందరితో ఒకేరకంగా స్నేహంగా మెలగాలని పిల్లలకు నేర్పించాలి. ►పిల్లలు ఏదైనా కావాలని అడిగితే వారి మాట పూర్తి కాకముందే కొనివ్వడానికి సిద్ధం కాకూడదు. వాళ్లు అడిగిన వస్తువు అవసరం ఏంటో వారినే అడగాలి. నిజంగా అది తక్షణ అవసరమైనదే అయితే వెంటనే కొనివ్వచ్చు. కొన్ని అప్పుడే కొని తీరాల్సిన అవసరాలు కాకపోవచ్చు. వాటిని వాయిదా వేయడమే కరెక్ట్. ►మాట్లాడాలి, మాట్లాడాలి, మాట్లాడాలి. ఇన్నిసార్లు చెప్పడం ఎందుకంటే... పిల్లలతో తల్లిదండ్రులు ఎంత ఎక్కువ సమయం గడిపితే, ఆ సమయంలో పిల్లలతో ఎంత స్నేహంగా మాట్లాడితే అంత మంచిది. పిల్లల ఆలోచనలను తల్లిదండ్రుల అర్థం చేసుకునే సమయం ఆ మాటల ద్వారానే. మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠంలా కాకుండా మాటల్లో మాటగా చెప్పగలిగేది కూడా అప్పుడే. ►ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్పించాలి. ఒక వ్యక్తి వృత్తిని బట్టి, సమాజంలో ఆ వ్యక్తికి దక్కుతున్న హోదాను బట్టి గౌరవాలు పెరగడం తగ్గడం తప్పు. ఒక వ్యక్తి పెద్ద ప్రొఫెసర్ కావచ్చు, అతడి కారు డ్రైవర్ కావచ్చు, తోటమాలి కావచ్చు, ఇంటి ముందు చెత్త తీసుకువెళ్లే వ్యక్తి కావచ్చు... ఎవరి జీవితం వారిది. వారి పనులను బట్టి గౌరవాల్లో హెచ్చుతగ్గులు ఉండరాదు. అన్ని పనులూ గౌరవప్రదమైనవేనని తెలియచేయాలి. ►పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, వారిని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారో మీరు అలా ఉండడానికి ప్రయత్నించండి. పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు తప్పుల తడకలా ఉంటూ పిల్లలు ఒప్పుల కుప్పలా పెరగాలంటే సాధ్యం కాదు. ►పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చకూడదు. ఎవరి బలాలు వారివే, ఎవరి బలహీనతలు వారివే. సుధామూర్తి జీవితాన్ని పలుకోణాల్లో పరిశీలించి, తన అనుభవాలతో విశ్లేషించి, ఆమె తన పిల్లల పెంపకంలో పాటించి చెప్పిన విషయాలివి. అలాగే పేరెంట్స్ ధోరణి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేవిధంగా ఉండకూడదని మరో విషయాన్ని జత చేశారు చైల్డ్ సైకాలజిస్ట్ సుదర్శిని. ‘‘మరొకరి పిల్లలతో కానీ ఇంట్లో తమ ఇద్దరు పిల్లల మధ్య కానీ కంపారిజన్ చేయకూడదు. అలాగే పిల్లల మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోకూడదు. ఇద్దరు పిల్లలున్న ఇంట్లో ఒకరి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఒకరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంత ఘోరమైన తప్పు మరొకటి ఉండదు’’ అన్నారామె. పేరెంటింగ్ అత్యంత కేర్ఫుల్గా సాగాల్సిన యజ్ఞం. అమ్మానాన్నల భుజాల మీద కనిపించని బాధ్యత. అయితే ఈ బాధ్యత బరువుగా అనిపించదు. సంతోషంగా మోసే ఈ బాధ్యత అంతే సంతోషకరమైన ఫలితాలనివ్వడానికి నిపుణులు చెప్పిన సూచనలు తప్పకుండా ఉపయోగపడతాయి. – వాకా మంజులారెడ్డి ఎవరికి వారు ప్రత్యేకం ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకలా ఉండరు. అలాగే ఒక తల్లికి పుట్టిన పిల్లలిద్దరూ ఒకలా ఉండాలని కూడా లేదు. సన్నగా– కొంచెం బొద్దుగా, మేని ఛాయలో తేడా, ఎత్తులో తేడా, తెలివితేటల్లో తేడాగా ఉంటారు. అలాగే వారి ఇష్టాయిష్టాలు కూడా భిన్నంగా ఉండచ్చు. ఈ తేడాల రీత్యా ఒకరిని ప్రత్యేకంగా, మరొకరి పట్ల నిరాసక్తంగా ఉంటూ పక్షపాతం చూపించడం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం ఆ ఇద్దరు పిల్లలకూ నష్టమే. పిల్లల్లో ప్రతి ఒక్కరిలో తమకంటూ ‘ది బెస్ట్ క్వాలిటీ ఒకటి ఉంటుంది. పేరెంట్స్ ఆ క్వాలిటీని గుర్తించాలి తప్ప తమ అభిరుచులను రుద్దకూడదు. – డాక్టర్ సుదర్శిని, చైల్డ్ సైకాలజిస్ట్ -
Sudha Murthy : అప్పట్లో జీన్స్, టీషర్ట్స్లో వెళ్లేదాన్ని.. కానీ ఆ తర్వాత..
దేశంలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్న మొదటి తరం వ్యక్తుల్లో ముఖ్యులు ఎం నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ను స్థాపించి దేశవ్యాప్తంగా వేలాది మందికి ఉపాధి కల్పించారు. ఐటీ రంగంలో భారత్కు బలమైన పునాదులు పడటానికి సహాకరించారు. అలాంటి నారాయణమూర్తికి అర్థాంగిగా తన వంతు సహాకారం అందిస్తూనే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సుధా మూర్తి. ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేలాది మందికి అండగా నిలిచారు. పాతికేళ్ల సేవాకార్యక్రమాల నుంచి త్వరలో ఆమె పక్కకు తప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఐటీ రంగం నుంచి వచ్చిన సుధామూర్తి మురికివాడలకు ఎలా వెళ్లారు. అక్కడి ప్రజల అక్కరలు తీర్చే క్రమంలో తనని తాను ఎలా మార్చుకున్నారు? ఈ దేశ ప్రజల పట్ల ఆమె అభిప్రాయాలు ఏంటీ అనే వివరాలను సుధా మూర్తి మాటల్లోనే తెలుసుకుందాం.. 1996 డిసెంబరు 6న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించాం. అప్పుడు ఈ ఫౌండేషన్కి రూ. 36 లక్షలు కేటాయించారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బుతో చాలా సహాయ కార్యక్రమాలు చేయోచ్చు అనుకున్నాను. అనుకున్నదే తడవుగా మా టీమ్తో కలిసి రంగంలోకి దిగాను. కానీ ఆ తర్వాతే తెలిసింది... ఈ పని నేను అనుకున్నంత సుళువు కాదని. జీన్స్ టూ శారీ ఇప్పుడంటే చీరకట్టు సంప్రదాయ బొట్టుతో సాధారణ గృహిణిలా కనిపిస్తున్నాను. కానీ ఫౌండేషన్ స్టార్ చేసిన కొత్తలో నేను జీన్స్, టీ షర్ట్స్ షూస్లో ఎక్కువగా ఉండేదాన్ని. ఫౌండేషన్ తరఫున ఏదైనా పని చేసేందుకు స్లమ్ ఏరియాలకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు నా దగ్గరికి వచ్చే వారు కాదు. వాళ్ల కోసమే నేను వచ్చానని నమ్మేవాళ్లు కాదు. నా దగ్గర డబ్బున్నా అది సరైన విధంగా ఖర్చు చేయాలేని పరిస్థితి ఉండేది. ఒక వేళ చేసిన మనీ ఖర్చు పెట్టగలిగేదాన్ని కానీ. వాళ్ల బాధలు స్వయంగా విని అర్థం చేసుకునే అవకాశం రాకపోయేది. అందుకే సేవా కార్యక్రమాల్లో మనసు పెట్టి పని చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే వారిలో ఒకరిగా కలిసిపోవాలని నిర్ణయించుకున్నాను. దీంతో జీన్స్, టీ షర్ట్స్ పక్కన పెట్టి సంప్రదాయ చీర కట్టు, బొట్టులోకి మారిపోయాను. నేను ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య హోదాలో కాకుండా ఓ సాధారణ స్కూలు టీచరు తరహాలో ప్రజలతో కలిసి పోయాను. సహనం డబ్బులు చాలు సమస్యలు పరిష్కరించవచ్చు అనుకున్నాను. కానీ ఆ అభిప్రాయం తప్పని త్వరలోనే అర్థమైంది. ఫౌండేషన్ ద్వారా నేను చేయాల్సిన పనులు మనుషులుతో కంప్యూటర్లతో కాదని తెలిసింది. కంప్యూటర్ అయితే కమాండ్ ఇచ్చి ఎంటర్ కొడితే కావాల్సిన పని జరుగుతుంది. కానీ మనుషులు అలా కాదు. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలు ఉంటాయి. వాటి ఆధారంగా వారి ప్రతిస్పందన ఉంటుంది. మనం చెప్పగానే వాళ్లు వెంటనే మారిపోరు. దానికి సమయం పడుతుంది. అన్నింటికీ మించి ఎదుటి వారు చెప్పే సమస్యని సహనంతో వినడం.. ఆ తర్వాత దానికి తగ్గ పరిష్కారం ఎలా అని ఆలోచించడం అలవాటు చేసుకున్నాను. దాతృత్వం అనేది డబ్బు కాదు మనసుతో చేసే పని అర్థం చేసుకున్నాను. అందుకే మనఃస్ఫూర్తిగా ఇన్ఫోసిస్ బాధ్యతలు నిర్వర్తించాలని నిర్ణయం తీసుకున్నాను. చదవండి: అప్పట్లో కంప్యూటర్లు కావాలంటే ఢిల్లీ వెళ్లాల్సిందే - నారాయణమూర్తి ఇవ్వడమే పనిగా.. ప్రజల్లో కలిసిపోయేందుకు వారితో పాటు కలిసి తిన్నాను, వారి భాషలోనే మాట్లాడాను అలా చేస్తున్న క్రమంలో వారి కష్టాలు, బాధలు మరింతగా అర్థం అయ్యాయి. వారితో పోల్చుకుంటే దేవుడు నాకు ఏ లోటు రానివ్వలేదు. దేశంలో నూటికి తొంభైశాతం మందికి లేని సౌకర్యాలు, అవకాశాలు నాకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడే సృష్టించిన ఈ ప్రజలకి నేను కూడా ఏదైనా చేయాలని గట్టినా అనుకున్నాను అంతే ! అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన 25 ఏళ్లుగా ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. సాయంలో అహం వద్దు దాతృత్వ కార్యక్రమాలు చేసేప్పుడు.. మనం ఇచ్చే వాళ్లం.. వాళ్లు తీసుకునే వాళ్లు అనే ఫీలింగ్ చాలా మందికి తెలియకుండానే ఏర్పడుతుంది. వాళ్లకు ఏం కావాలో పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం ఏం ఇవ్వాలని అనుకుంటున్నామో అదే ఇస్తాం. చాలా సార్లు సాయం తీసుకునే వాళ్ల అభిప్రాయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోం. వారిని తక్కువ అంచనా వేస్తాం. ఇది సరికాదు. ఆహార కొరత, విద్య, వైద్యం వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు కుటుంబాలకు అవసరాలు వేరేగా ఉంటాయి. వాటిని వారి మాటల్లో విని మన మనసుతో అర్థం చేసుకోవాలి.. అప్పుడు సాయం చేస్తే వాళ్లకి ఫలితం.. మన మనసుకి తృప్తి దక్కుతుంది. చేయాల్సింది ఎంతో ఉంది పాతికేళ్ల కిందట రూ. 36 లక్షల రూపాయలతో ఎన్నో మంచి పనులు చేయోచ్చని ఫౌండేషన్ స్థాపించాం. ఇప్పుడు రూ. 400 కోట్ల రూపాయల ఫండ్ ఉంది. అయితే మా కళ్ల ముందు కనిపిస్తున్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ ఫండ్ ఏ మూలకు సరిపోదు. ఐనప్పటికీ ప్రాధాన్యత క్రమం ఆధారంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నాం. కోవిడ్తో పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఆహారలేమి, నిరుద్యోగం, హెల్త్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. దేశ జనాభా అందరికీ రెండు పూటల తిండి, ఇంటర్ వరకు ఆటంకం లేని విద్య, ధరించేందుకు మంచి దుస్తులు కొనుక్కునే దశ వచ్చే వరకు మన దేశం అభివృద్ధి చెందనట్టే లెక్క. స్పందించే హృదయం ఉండాలి గడిచిన 25 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి త్వరలో తప్పుకోబోతున్నాను. నా తర్వాత ఈ బాధ్యతలు చూసుకునే వారికి ప్రాధాన్యతలు వేరేగా ఉండొచ్చు.వారి లక్ష్యాలు భిన్నంగా ఉండొచ్చు. అలా ఉండటం తప్పేమి కాదు. నిజానికి అలా ఉంటడం వల్ల విభిన్న రంగాల్లో సేవా కార్యక్రమాలు విస్తరిస్తాయి కూడా. అయితే ఎదుటి వారి కష్టాలను చూసి మనసు లోతుల్లోంచి స్పందించే గుణం మాత్రం తప్పకుండా ఉండాలి. - సాక్షివెబ్ ప్రత్యేకం చదవండి: ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రూ.100 కోట్ల సాయం -
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రూ.100 కోట్ల సాయం
సాక్షి, బెంగళూరు: దేశంలో కోవిడ్ నియంత్రణ కోసం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రూ.100 కోట్లు విరా ళాన్ని ప్రకటించింది. గత ఏడాది కరోనా సమయంలో రూ.100 కోట్లు సాయం చేశాం, ఇప్పుడు మరో రూ.100 కోట్ల సహాయం చేస్తామని ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి సోమవారం తెలిపారు. ఆసుపత్రులకు వెంటిలేటర్లు, ఆక్సిజన్, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, మాస్క్లు తదితర వసతుల కోసం ఈ మొత్తం ఇస్తున్నట్లు చెప్పారు. వాహన డ్రైవర్లకు, కార్మికులకు నిత్యావసరాలను అందజేస్తామన్నారు. -
ప్లాన్ బీ వద్దే వద్దు..
ఆఫీస్ టైమ్ అయిపోయింది. ఆఫీస్ బయట నిలుచుని ఉంది ఆ అమ్మాయి.‘‘ఇక్కడేం చేస్తున్నావమ్మా?’’ తలతిప్పి చూసిందా అమ్మాయి. జె.ఆర్.డి. టాటా. తన బాస్. బిగ్బాస్. టెల్కో అధినేత!టెల్కో ఉద్యోగి ఆమె. ఆయనా ఇంటికే వెళుతూ, ఆమెను చూసి ఆగి, ‘ఇక్కడేం చేస్తున్నావమ్మా..’ అని అడిగారు. సన్నగా చినుకులు పడుతున్నాయి. ‘‘సర్.. మావారు వస్తానన్నారు. అందుకే వెయిట్ చేస్తున్నారు’’ అంది ఆ అమ్మాయి. ‘‘చీకటి పడుతోంది. మీ వారు వచ్చే వరకు నేనూ ఇక్కడే ఉంటాను’’ అన్నారు టాటా. ఆ అమ్మాయి బిగుసుకుపోయింది. చివరికి ఆ ‘మావారు’ వచ్చారు. దూరంగా ఉండి, భార్యను పిలిచారు. ‘‘సరే అమ్మా.. జాగ్రత్తగా వెళ్లండి’’ అని, ‘‘మీవారికి చెప్పు. ఇక ముందెప్పుడూ నిన్ను ఇలా వెయిట్ చేయించొద్దని’’ అని చెప్పారు. ఆ అమ్మాయి : సుధ. ఆ ‘మావారు’ : మూర్తి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి. నాటి సుధామూర్తి తరానికి జెఆర్డి టాటా ఎలాగో, నేటి ఐటీ యువతరానికి నారాయణమూర్తి అలాగ. ఇద్దరూ రెండు తరాలకు గురుతుల్యులు. ‘భార్యను వెయిట్ చేయించొద్దు అని జేఆర్డీ సర్ చెప్పమన్నారు’ అని సుధ తన భర్తకు నవ్వుతూ చెప్పే ఉంటారు. స్టార్టప్స్ విషయంలో నారాయణమూర్తి బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు చెప్పే మాట కూడా అలాంటిదే.. ‘‘మీరేదైనా మొదలు పెట్టాలని అనుకుంటున్నప్పుడు వెయిట్ చేయకండి’’ అని. అంటే వెంటనే స్టార్ట్ చేసేయమని కాదు. స్టార్ట్ చేసేందుకు అవసరమైన పనుల్లో దిగడానికి ఆలస్యం చేయొద్దని. 74 ఏళ్ల ఐటీ దిగ్గజం నారాయణమూర్తి ఏం చేయాలో ఎవరికీ చెప్పరు. ఏం చేయకూడదో చెబుతుంటారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులుగానే కాదు, తన తొలి స్టార్టప్ ‘సాఫ్ట్రోనిక్స్’ని స్థాపించి నష్టాలపాలైన అనుభవజ్ఞుడిగా కూడా ఆయన మాటకు ఈనాటికీ ఎంతగానో విలువ ఉంది. అందుకే దేశంలోని అనేక యూనివర్సిటీలు ఆయన్ని గౌరవ అతిథిగా ఆహ్వానించి తమ విద్యార్థులకు రెండు మాటలు చెప్పించుకుంటాయి. రెండు రోజుల క్రితం కూడా ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్.ఎం.ఐ.ఎం.ఎస్. యూనివర్శిటీ (నర్సీ మాంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్) విద్యార్థులకు ‘చేయకూడని పనులు’ అంటూ బెంగళూరు నుంచి ఆన్లైన్లో కొన్ని అమూల్యమైన సూచనలు చేశారు. స్టార్టప్ పెట్టేందుకు సిద్ధమైనవారికి ‘ప్లాన్–బి’ ఉండకూడదన్నది ఆ వర్చువల్ ఇంటరాక్షన్లో విద్యార్థులతో మాట్లాడుతూ నారాయణమూర్తి ఇచ్చిన సలహా! ప్లాన్–బీ లేకపోతే ఎలా! అంత ప్లాన్డ్గా కంపెనీకి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వెంటనే ప్లాన్–బీ లోకి షిఫ్ట్ అయిపోవాలి కదా. పారిశ్రామిక వేత్తలందరికీ ప్లాన్–బీ ఉంటుంది. అయితే మూర్తిగారు ఇందుకు పూర్తిగా విరుద్ధం. ‘‘ప్లాన్–ఏ మీద పూర్తి నమ్మకం లేనప్పుడే ప్లాన్–బీ ని ఆపద్ధర్మంగా ఓ పక్కన ఉంచుకుంటాం. అంటే మిమ్మల్ని మీరే నమ్మడం లేదన్నమాట. అంత నమ్మకం లేనప్పుడు కంపెనీని ఎలా రన్ చేస్తారు? ఎలా సక్సెస్ అవుతారు?’’ అని ప్రశ్నిస్తారు ఆయన. మన దగ్గర ఉన్నది ది బెస్ట్ అయినప్పుడు దానితోనే ముందుకు వెళ్లాలి అని సూచన. ఓ విద్యార్థి అడిగాడు : మూర్తిగారూ.. మీ ఫస్ట్ స్టార్టప్ ‘సాఫ్ట్రోనిక్స్’ని ఎందుకు మూసేయాల్సి వచ్చింది! నేననుకోవడం మీ దగ్గర ప్లాన్–బీ లేకపోబట్టేనని..’’ అన్నాడు. ఆ ప్రశ్నకు ఆ పలుచని మనిషి నారాయణమూర్తి నిండుగా నవ్వారు. భారతీయ ఐటీ కంపెనీలకు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ (అల్గోరిథమ్స్) ఇచ్చే కంపెనీ సాఫ్ట్రోనిక్స్. ఆ కంపెనీ.. కాలానికంటే ముందుండటంతో ఇండియాలో అనుకున్న విధంగా మార్కెటింగ్ జరగలేదు. ‘‘అయినప్పటికీ.. ప్లాన్–బీ ఉంటే బాగుండేది కదా అని మేము అనుకోలేదు..’’ అని ఆ విద్యార్థితో అన్నారు. సాఫ్ట్రోనిక్స్ మూసేశాక మూర్తి ఐదేళ్లు పుణెలోని పత్ని కంప్యూటర్స్లో చేశారు. తర్వాత బెంగళూరు వచ్చి ఏ మాత్రం వెయిట్ చెయ్యకుండా ‘ఇన్ఫోసిస్’ ప్రారంభించారు. సక్సెస్ అయ్యారు. ‘‘అప్పుడూ నాకు ప్లాన్–బీ లేదు’’ అన్నారు ఇంటరాక్షన్లో నారాయణమూర్తి. స్టార్టప్స్ పెట్టదలచిన బిజినెస్ విద్యార్థులకు ఆయన చేసిన ఇంకో సూచన.. ‘‘సాదాసీదా నైపుణ్యాలకు ఉపాధి కల్పించకండి. జాబ్లోకి తీసుకున్నవారికి చిన్న చిన్న జీతాలు ఇవ్వకండి’’. ఒక మాట కూడా. కంపెనీకి వచ్చిన లాభాల్లో మీరే మునిగి తేలకండి.. అని! అందుకే ఆయన ఇప్పటికీ భారతదేశపు ఐటీ సూపర్ స్టార్. -
సుధా మూర్తి కూరగాయలు అమ్మారా?
బెంగళూరు : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్థాంగి.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి సమాజానికి మంచి చేస్తూ ఆదర్శప్రాయురాలుగా ఎంతో పేరు సంపాదించారు. ఎన్నో అనాథ ఆశ్రమాలు నెలకొల్పి ఎంతోమంది అనాథ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. స్వతహాగా మంచి రచయిత అయిన సుధా మూర్తి ఎన్నో మంచి నవలల కూడా రచించారు. (చదవండి : పుట్టిన రోజున పిల్లలకు కానుక) అలాంటి సుధా మూర్తి బెంగళూరు జయానగర్లోని రాఘవేంద్ర స్వామి మఠం వద్ద కూరగాయలు అమ్మారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ' ఫోటోలో కనిపించేది ముమ్మాటికి సుధా మూర్తియే. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న నారాయణమూర్తి భార్య సుధా మూర్తి ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాల్లో గడుపుతారు. ప్రతి ఏడాదిలో ఒకరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాసుడికి దండలు తయారు చేయడం.. మరో మూడు రోజులు రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద కూరగాయలను అమ్మడంతో పాటు భక్తులకు అందించే ప్రసాదానికి తనవంతుగా కూరగాయలు కట్ చేస్తుంది. వ్యాపారంలో తమకు వస్తున్న సంపద కారణంగా అహంకారం అనేది రాకూడదనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆమెకు ఇవే మా వందనాలు' అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు చూసిన కొన్ని ప్రచురణ సంస్థలు సుధా మూర్తి గురించి తప్పుడు కథనాలు ప్రచురించాయి. (చదవండి : డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చిన మినిస్టర్) కల్పితం : సుధా మూర్తి రాఘవేంద్ర స్వామి గుడి బయట కూరగాయలు అమ్ముతున్న ఫోటోలను చాలా సంస్థలు తమ కథనాల్లో తప్పుగా ప్రచురించాయి. సుధా మూర్తి కూరగాయలు అమ్మడం లేదని.. గుడి బయట సేవా కార్యక్రమాల పేరిట ఒక స్టోర్ నడుపుతున్నారని.. ఇలా తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ది చేసుకుంటున్నారని ఆరోపించాయి. కొన్ని సంవత్సరాలుగా స్టోర్ వద్దకు వచ్చి కూరగాయలతో పాటు ఇతర రకాల సేవలు కూడా అందిస్తున్నారు. వాస్తవం : వాస్తవానికి సుధా మూర్తి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. స్వచ్చంద సేవ పేరుతో కొన్ని సంవత్సరాల నుంచి రాఘవేంద్ర స్వామి గుడికి వస్తున్న ఆమె భక్తులకు భోజనం సిద్ధం చేయడం, పండ్లు కడగడం, ప్రసాదానికి కూరగాయలు కోయడం వంటి కార్యక్రమాలతో సుధా మూర్తి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సందర్భంలోనే ఆమె కూరగాయల ముందు కూర్చొని ఫోటోకు ఫోజిచ్చారు. అయితే ఆమె రాఘవేంద్ర స్వామి మఠంలో మూడు రోజులు మాత్రం తమ అనుమతితో స్టోర్ మేనేజర్గా విధులు నిర్వర్తించారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా అంతకుముందు బెంగళూరు మిర్రర్కు ఇచ్చిన ఇంటర్య్వూలో సుధా మూర్తి తన అనుభవాన్ని పంచుకున్నప్పుడు తన సేవా కార్యక్రమాల్ని స్వయంగా వెల్లడించారు. 'ప్రతి ఏడాదిలో మూడు రోజులు దేవుడికి స్వచ్చంద సేవ చేయాలని అనుకున్నా. ఉదయం నాలుగు గంటలకే లేచి.. బెంగళూరులోని రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్లి ఏ ప్రతిఫలం ఆశించకుండా స్వచ్చంద సేవ చేస్తుంటా. సెక్యూరిటీ గార్డు సాయంతో వంటగదితో పాటు అక్కడున్న పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుంది. అనంతరం భక్తులకు అందించే ప్రసాదాల కోసం నా వంతు సాయం అందిస్తా. తర్వాత కూరగాయల నుంచి వచ్చిన వ్యర్థాలను చెత్త డబ్బాలో వేసి స్వయంగా తీసుకెళ్లి పడేసి వస్తా. ఇదంతా స్వచ్చంద సేవ మాత్రమే.. ఏ ప్రతిఫలం ఆశించను. 'అంటూ ఆమె తెలిపారు. -
పుట్టిన రోజున పిల్లలకు కానుక
‘మీరు డిక్షనరీని చాలా చిన్నచూపు చూస్తారు. మీ రచనలు చదువుతుంటే డిక్షనరీ చూడాల్సిన అవసరం ఏర్పడదు. డిక్షనరీ మీద మీకెందుకంత విముఖత’ అని ఒకసారి సరదాగా శశి థరూర్ సుధామూర్తిని అడిగారు. శశి థరూర్ జటిలమైన ఇంగ్లిష్ పదాలు వాడి అందరి చేత డిక్షనరీ పట్టిస్తాడన్న సంగతి తెలిసిందే. దానికి సుధామూర్తి జవాబు ఇస్తూ ‘భారతదేశంలో చాలామంది పది, ఇంటర్ చదువు చదివినవాళ్లు. అంతవరకే చదివిన ఆడవాళ్లు ఎప్పుడూ నా దృష్టిలో ఉంటారు. నా పుస్తకాలు చదివి వారు అర్థం కాలేదు అనుకోవడానికి వీల్లేకుండా సామాన్యమైన భాషలో నేను రాయడానికి ఇష్టపడతాను’ అన్నారు. ఇన్ఫోసిస్ మూలస్తంభాలలో ఒకరైన సుధామూర్తి ఆ రంగంతోపాటు రచనారంగంలో కూడా కృషి చేసి అభిమానులను సంపాదించుకున్నారు. ఇంగ్లిష్లో దాదాపు పాతికపుస్తకాలు , కన్నడంలో పదిహేను పుస్తకాలు వెలువరించారామె. అవి ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తృతంగా అనువాదం అయ్యాయి. ఇప్పుడు తన 70వ జన్మదినం సందర్భంగా పిల్లలకు కానుకగా ఒక కథల పుస్తకం వెలువరించాలని నిర్ణయించారు. పెంగ్విన్ ప్రచురించనున్న ఈ పుస్తకం పేరు ‘గ్రాండ్పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’. ‘లాక్డౌన్ మొదలెట్టినప్పటి నుంచి నాకు ఒకటే ఆలోచన. నా చిన్నప్పుడు ఈ కరోనా వచ్చి ఉంటే నేను ఏం చేసి ఉండేదాన్ని... కచ్చితంగా బోర్ అయి ఉండేదాన్ని... తప్పకుండా మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు వెళ్లి కథలు విని ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఇలాంటి సమయంలో పిల్లలు కథలు వినడానికే ఇష్టపడతారు. వారి కోసం కథలు రాస్తే బాగుంటుందని రాశాను’ అన్నారు సుధామూర్తి. లాక్డౌన్లో ఆమె పిల్లల కథలు రాయడం మొదలుపెట్టి మొత్తం 20 కథలు రాశారు. అడవులు, సరోవరాలు, వింతలూ విడ్డూరాలు ఉండే ఈ కథలు అమ్మమ్మ, తాతయ్యలు కథలు చెప్తూ ఉంటే ఎలా ఉంటాయో అలాంటి ధోరణిలో ఉంటాయి. ప్రతికూల కాలంలో కూడా ఇష్టమైన వ్యాపకంలో మునిగి ఉంటే అవి ఫలవంతమై సంతృప్తినిస్తాయి అనడానికి కూడా సుధామూర్తి ఒక ఉదాహరణ. లాక్డౌన్కు ముందు సుధామూర్తి ‘గ్రాండ్మా బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’ తెచ్చారు. ఈ పుస్తకం దాని కొనసాగింపు అనుకోవచ్చు. వచ్చే నెలలో ఇది విడుదల కానుంది. పిల్లలకు ఒక అమ్మమ్మ కానుక అనుకోవచ్చు. -
‘షరతు ప్రకారం మగవారితో మాట్లాడలేదు’
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ 11వ సీజన్ ముగిసింది. షో చివరి ఎపిసోడ్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి పాల్గొన్నారు. సుధామూర్తిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించిన బిగ్బీ.. వయసులో చిన్నదైనా.. ఆమె కాళ్లకి నమస్కరించాడు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. సుధామూర్తి 60 వేల లైబ్రెరీలు, వందల స్కూళ్లు, 16 వేలకు మించిన టాయిలెట్లు కట్టించారని తెలిపారు. అనంతరం సుధామూర్తి తన నేపథ్యాన్ని వివరించారు. స్ఫూర్తిదాయకంగా,ఆదర్శవంతంగా సాగిన ఆమె జర్నీ గురించి స్వయంగా ఆమే వివరించారు. ‘ నేను ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పుడు మా తండ్రి తిరస్కరించారు. అలా చేస్తే మన కమ్యూనీటీలో ఎవరూ నిన్ను పెళ్లి చేసుకోరాని హెచ్చరించారు. అయినప్పటికీ నేను ఇంజనీరింగ్ చదివేందుకే మొగ్గు చూపాను. కర్ణాటకలోని హుబ్లిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. 599 మంది మగ విద్యార్థులు ఉన్న ఆ కాలేజీలో నేను ఒక్కదాన్నే మహిళా విద్యార్థిని. కాలేజీలో అడ్మిషన్ ఇచ్చే సమయంలో ప్రిన్సిపాల్ నాకు మూడు షరతులు విధించారు. అందులో ఒకటి ప్రతీరోజూ కాలేజీకి చీరకట్టులోనే రావాలి. రెండోది.. కాలేజీ క్యాంటీన్కి వెళ్లవద్దు. మూడవది..ఎట్టి పరిస్థితుల్లోనూ మగ విద్యార్థులెవరితోనూ మాట్లాడవద్దు. మొదటి షరతు ప్రకారం ప్రతీరోజూ నేను చీరలోనే వెళ్లాను. కాలేజీ క్యాంటీన్ అసలేమాత్రం బాగుండదని.. కాబట్టి అక్కడికి ఎప్పుడు వెళ్లలేదు .ఇక కాలేజీలో చేరిన ఏడాది వరకు ఏ మగ విద్యార్థితోనూ మాట్లాడలేదు.. కానీ నేను టాపర్ కావడంతో వాళ్లే నా వద్దకు వచ్చి మాట్లాడేవారు’ అని సుధామూర్తి చెప్పుకొచ్చారు. తాను చదువుకున్న కాలేజీలో కనీసం టాయిలెట్ వసతి కూడా లేదని చెప్పారు. అందుకే ఇన్ఫోసిస్ తరుపున దాదాపు 16వేల టాయిలెట్స్ నిర్మించినట్టు తెలిపారు. దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరుపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఆ సమయంలో ఎదురైన సవాళ్లను కూడా వివరించారు. కాగా, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం దేశంలో అత్యంత రేటింగ్ సంపాదించుకున్న రియాలిటీ షోగా పేరొందింది. 19 ఏళ్ల కేబీసీ ప్రయాణంలో ఇప్పటికి 11 సీజన్లు పూర్తయ్యాయి. 10 సీజన్లకు అమితాబ్ హోస్ట్గా వ్యవహరించారు. -
ప్రేక్షకురాలిపైనే సినిమా!
సొంతిల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్.. ఈ మూడూ ఉంటే చాలు లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది అంటారు ‘ఇన్ఫోసిస్’ కంపెనీ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి. సొంతిల్లు అన్నారు కానీ బంగళా అనలేదు. కారు అన్నారు కానీ ఆడీనో, బిఎండబ్ల్యూనో అనలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ అన్నారు కానీ కోట్లు, లక్షల కోట్లు అనలేదు. నెల నెలా అద్దె కట్టే అవసరం లేకుండా సొంత ఇల్లు, ఏ వేళనైనా ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా చిన్న కారు, ఊహించని ఆర్థిక అవసరాలకు ఎవరి దగ్గరా చెయ్యి చాచే అవసరం లేకుండా కొంత బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలని సుధామూర్తి మాటల్లోని అంతరార్థం. ఇంట్లో మొక్కల్ని పెంచడం; కారులో భర్త పిల్లల్తో కలిసి ప్రకృతి అందాలను వీక్షించడానికి వెళ్లడం ఆమెకు ఇష్టమైన విషయాలు. ఇక సినిమాలంటే ఎంతిష్టమో చెప్పేపనే లేదు. రోజుకో సినిమానైనా చూడందే ఆమెకు నిద్రపట్టదు. ఏడాదికి కనీసం 365 సినిమాలు చూస్తారు సుధామూర్తి. ఈ 69 ఏళ్ల వయసులోనూ ఆమె సినిమాలను వదిలిపెట్టనే లేదు. ఇంతగా సినిమాలను ఇష్టపడే, ప్రేమించే సుధామూర్తి పైనే ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది! సుధామూర్తి దంపతుల జీవితకథను అశ్వినీ అయ్యర్ తివారి ఒక స్ఫూర్తివంతమైన సినిమాగా తియ్యబోతున్నారు. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘నీల్ బత్తి సనాటా’ చిత్రాల దర్శకురాలే అశ్వనీ అయ్యర్. 2017లో వచ్చిన ‘బరేలీ కీ బర్ఫీ’ రొమాంటిక్ కామెడీ. అంతకుముందు ఏడాది వచ్చిన ‘నీల్ బత్తి సనాటా’ కామెడీ డ్రామా. సుధామూర్తితో కలిసి దిగిన ఫొటోను అశ్వినీ అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. ‘‘నిజాయితీతో కూడి ఈ ఆలూమగల జీవితం నాకు పెద్ద ఇన్స్పిరేషన్’’ అని రాశారు. అశ్వినీ అయ్యర్ తీయబోయే ఈ సినిమా బహుశా.. సుధామూర్తి దంపతులకు సొంతిల్లు, కారు, బ్యాంకు బ్యాలెన్సు లేని కాలం నుంచి మొదలవొచ్చు. ►సినిమాలను ఎంతగానో ఇష్టపడే, ప్రేమించే సుధామూర్తి పైనే ఇప్పుడొక సినిమా రాబోతోంది. కేవలం రెండు చిత్రాలతో ప్రసిద్ధురాలైన అశ్వినీ అయ్యర్ తివారీ ఆ సినిమాను తీయబోతున్నారు. -
వైరల్ వీడియో: ఇన్ఫోసిస్ సుధామూర్తి గొప్ప మనసు
సాక్షి, బెంగుళూరు : కేరళలో బీభత్సం సృష్టించిన భారీ వర్షాలు, వరదలు కేరళ-కర్ణాటక సరిహద్దులోని కొడగు జిల్లాను కూడా అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా కొడగులో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న కొడగు జిల్లాలోని ప్రజలకు సాయం చేయడానికి టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సామాజిక కార్యకర్త సుధామూర్తి ముందుకొచ్చారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులతో కలిసి వరద బాధితులకు నిత్యావసరాలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె స్వయంగా సరుకులను ప్యాక్ చేయడంతోపాటు సంస్థ ఉద్యోగుల పనిని దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, సుధామూర్తి ఔదార్యాన్ని వీడియో తీసిన కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఎంతోమంది సుధామూర్తి గొప్పమనసును మెచ్చుకున్నారు. ఈ వీడియోను ‘అమ్మ’ అనే హ్యాష్టాగ్తో షేర్ చేసుకుంటున్నారు. -
టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధామూర్తి ప్రమాణం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో సుధా నారాయణమూర్తి చేత జేఈవో శ్రీనివాసరాజు ప్రమాణం చేయించారు. స్వామివారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పదవి ద్వారా సామాన్య ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. -
అంతర్జాతీయ స్థాయికి ‘అక్షయపాత్ర’
సంగారెడ్డి రూరల్: దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రపంచ స్థాయికి ఎదిగిందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కందిలో ఇన్ఫోసిస్ సామాజిక సేవ విభాగం, ఫౌండేషన్ భాగస్వామ్యంతో నిర్మించిన మెగా సెంట్రలైజ్ అక్షయపాత్ర కిచెన్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..ఆకలితో ఉన్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి మెగా కిచెన్ ఏర్పాటుకు రూ.18.50 కోట్లను అందించిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మెన్ సుధామూర్తిని అభినందించారు. ఈ కిచెన్కు లక్ష మంది పాఠశాల విద్యార్థులకు సరిపడే మధ్యాహ్న భోజనం తయారు చేసే సామార్థ్యం ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అంధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.550 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరూ తమ చేతనైన సహాయం అందిస్తూ పేద విద్యార్థులకు చేయూత నివ్వాలని కోరారు. బడికి వెళ్లే విద్యార్థులు ఆకలితో విద్యకు దూరం కాకుండా అక్షయపాత్ర పని చేస్తోందన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ..అక్షయపాత్ర మెగా కిచెన్ ఏర్పాటుతో సంగారెడ్డి ప్రాంతంలో విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..మెగా కిచెన్ను ఏర్పాటు చేసి రోజుకు లక్ష మంది విద్యార్థులకు భోజనం అందించడంతో బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. అనంతరం అక్షయపాత్రపై ప్రముఖ గాయకుడు కారుణ్య ఆలపించిన సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌడ చంద్రదాస, వైస్ చైర్మెన్ చంచలపతిదాస, జెడ్పీ చైర్మెన్ రాజమణీ మురళీ యాదవ్, సర్పంచ్ ఉమారాణి శంకర్గౌడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజేంద్రబోయి, రిజినల్ ఆర్గనైజర్ లక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మెన్ విజేందర్రెడ్డి, జెడ్పీటీసీ మనోహర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ కొండల్రెడ్డి, టీఆర్ఎస్ మండలా«ధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్ పాల్గొన్నారు. -
కూరగాయలు అమ్మిన సుధామూర్తి
-
ఇన్ఫోసిస్ ఉద్యోగ మేళాకు భారీ స్పందన
బళ్లారి టౌన్, న్యూస్లైన్ : నగరంలోని వీరశైవ విద్యాలయంలో గురువారం ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన ఉద్యోగ మేళాకు భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ బసవరాజ్ ప్రారంభించి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి గతంలో ఈ కళాశాలలో చదివిందని గుర్తు చేశారు. ఇదే కళాశాలలో ఆ కంపెనీ బృహత్ క్యాంపస్ ఇంటర్వ్యూలు జరపడంతో తాము ఎంతో గర్విస్తున్నామన్నారు. ఇలాంటి వెనుకబడిన ప్రాంతాలలో ఉద్యోగాలు కల్పించి పేద విద్యార్థులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలక మండలి అధ్యక్షుడు జానెకుంటె సన్న బసవరాజు, ప్రొఫెసర్లు కే.మల్లికార్జునప్ప, ఎం.భోజరాజు, కంపెనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కాగా ఈ ఇంటర్వ్యూల్లో స్థానిక కళాశాలతోపాటు అల్లం సుమంగళమ్మ కళాశాల, హొస్పేట విజయనగర కళాశాల, కొట్టూరేశ్వర కళాశాల, సిరుగుప్ప ప్రభుత్వ కళాశాలకు చెందిన 487 మంది బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ విద్యార్థులు పాల్గొనగా 80 మంది ఎంపికయ్యారు. ఇందులో స్థానిక వీరశైవ కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థులు, హొస్పేట విజయనగర కళాశాల నుండి 34 మంది, అల్లం సుమంగళమ్మ కళాశాలకు చెందిన ఆరుగురు ఎంపికయ్యారు. -
సుధామూర్తి కొత్త నవల
(ఇన్ఫోసిస్) నారాయణమూర్తి చేయలేని పని ఒకటి న్యూ రిలీజెస్ సుధామూర్తి చేయగలరు. రాయడం. ఆమె గతంలో రాసిన How I Taught My Grandmother to Read & Other Stories లాంటి పుస్తకాలు అనేక భాషల్లో అనువాదం అయ్యాయి. సాహిత్యపరంగా వాటి నాణ్యత ఎలా ఉన్నా రీడబిలిటీ, చెప్పే విషయాన్ని ప్రాథమిక పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొని చెప్పడం వంటి లక్షణాలతో ఆమె ఆకట్టుకుంటున్నారు. ఆమె తాజా నవల House of Cards కూడా ఇప్పుడు అదే కోవలో పాఠకులను ఆకట్టుకుంటోంది. మృదుల అనే స్త్రీ కథ ఇది. పల్లెటూళ్లో పుట్టి, తండ్రికి ముద్దు బిడ్డగా ఎదిగి, ఒక డాక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది మృదుల. అతడు గవర్నమెంట్ సర్వీసులో బెంగళూరులో పని చేస్తూ ఉంటాడు. కాని కొద్ది కాలానికే ఆ పని మొహమ్మొత్తి ప్రయివేటుగా ప్రాక్టీసు చేయడానికి నిశ్చయించుకుంటాడు. మృదుల ఏమో టీచర్గా తన ఉనికి కాపాడాలనుకుంటుంది. ఒకరు ఒక చోట. మరొకరు మరో చోట. ఈ పరుగులో అనుబంధాల మధ్య ఘర్షణ, వాటి విలువ, రాబోయే తరానికి (తన కుమారుడికి) మృదుల ఎలా ఆ పరంపరను విశదం చేసింది.... ఇదంతా చర్చిస్తుంది ఈ నవల. సాధారణంగా స్త్రీల ఆత్మగౌరవం, వారి వికాసం సుధామూర్తి ప్రథమ లక్ష్యం కాబట్టి ఈ నవల కూడా అ దృష్టికోణాన్నే కలిగి ఉంటుంది. హాయిగా చదివించే శైలి. తప్పక చదవ్వొచ్చు. పెంగ్విన్ ప్రచురణ; వెల: రూ. 250 -
సుధామూర్తి కొత్త నవల
(ఇన్ఫోసిస్) నారాయణమూర్తి చేయలేని పని ఒకటి న్యూ రిలీజెస్ సుధామూర్తి చేయగలరు. రాయడం. ఆమె గతంలో రాసిన How I Taught My Grandmother to Read & Other Stories లాంటి పుస్తకాలు అనేక భాషల్లో అనువాదం అయ్యాయి. సాహిత్యపరంగా వాటి నాణ్యత ఎలా ఉన్నా రీడబిలిటీ, చెప్పే విషయాన్ని ప్రాథమిక పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొని చెప్పడం వంటి లక్షణాలతో ఆమె ఆకట్టుకుంటున్నారు. ఆమె తాజా నవల House of Cards కూడా ఇప్పుడు అదే కోవలో పాఠకులను ఆకట్టుకుంటోంది. మృదుల అనే స్త్రీ కథ ఇది. పల్లెటూళ్లో పుట్టి, తండ్రికి ముద్దు బిడ్డగా ఎదిగి, ఒక డాక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది మృదుల. అతడు గవర్నమెంట్ సర్వీసులో బెంగళూరులో పని చేస్తూ ఉంటాడు. కాని కొద్ది కాలానికే ఆ పని మొహమ్మొత్తి ప్రయివేటుగా ప్రాక్టీసు చేయడానికి నిశ్చయించుకుంటాడు. మృదుల ఏమో టీచర్గా తన ఉనికి కాపాడాలనుకుంటుంది. ఒకరు ఒక చోట. మరొకరు మరో చోట. ఈ పరుగులో అనుబంధాల మధ్య ఘర్షణ, వాటి విలువ, రాబోయే తరానికి (తన కుమారుడికి) మృదుల ఎలా ఆ పరంపరను విశదం చేసింది.... ఇదంతా చర్చిస్తుంది ఈ నవల. సాధారణంగా స్త్రీల ఆత్మగౌరవం, వారి వికాసం సుధామూర్తి ప్రథమ లక్ష్యం కాబట్టి ఈ నవల కూడా అ దృష్టికోణాన్నే కలిగి ఉంటుంది. హాయిగా చదివించే శైలి. తప్పక చదవ్వొచ్చు. పెంగ్విన్ ప్రచురణ; వెల: రూ. 250