SUV cars
-
ఎలక్ట్రిక్ కిసిక్!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్యూవీలు దుమ్మురేపేందుకు ఫుల్ చార్జ్ అవుతున్నాయి. దేశీ కంపెనీలతో పాటు విదేశీ దిగ్గజాలు సైతం భారత్ మార్కెట్లోకి పలు కొంగొత్త మోడళ్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎలక్ట్రిక్ జర్నీ షురూ చేస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఈ ఏడాదే మన ఈవీ మార్కెట్ రేసుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో జరగనున్న అతిపెద్ద భారత్ మొబిలిటీ ఆటో షోలో అనేక కంపెనీలు ‘ఎలక్ట్రిక్’ ఆవిష్కరణలతో ఫాస్ట్ ట్రాక్లో దూసుకెళ్లనున్నాయి.గతేడాది రికార్డు ఈవీ అమ్మకాలతో జోష్ మీదున్న వాహన దిగ్గజాలు... 2025లో రెట్టించిన ఉత్సాహంతో గ్రీన్ కార్ల కుంభమేళాకు సై అంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా రోడ్డెక్కనున్న ఈవీల్లో అత్యధికంగా ఎస్యూవీలే కావడం విశేషం! కాలుష్యానికి చెక్ చెప్పడం, క్రూడ్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా పర్యావరణానుకూల వాహనాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. దీంతో దాదాపు దేశంలోని అన్ని కార్ల కంపెనీలూ ఎలక్ట్రిక్ మార్కెట్లో వాటా కొల్లగొట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశీ కార్ల అగ్రగామి మారుతీ. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహన రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న మారుతీ తొలిసారి ఈవీ అరంగేట్రం చేస్తోంది. హ్యుందాయ్తో పాటు లగ్జరీ దిగ్గజాలు మెర్సిడెస్, ఆడి, స్కోడా కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాప్గేర్లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రాతో సహా చైనా దిగ్గజం బీవైడీ ఈవీ డ్రైవ్తో పోటీ మరింత హీటెక్కనుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఆటో ఎక్స్పో వేదికగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ మెగా ఆటో షో (జనవరి 17–22 వరకు)లో 16 కార్ల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందులో పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నప్పటికీ ఈసారి ఆధిపత్యం ఈవీలదే. అయితే అందరి కళ్లూ మారుతీ తొలి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ఈ–విటారా పైనే ఉన్నాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లకు మించి ఉంటుందని, ధర రూ.15 లక్షలతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక గతేడాది మార్కెట్ వాటాను కొద్దిగా పెంచుకున్న మహీంద్రా ఈ ఏడాది ఎలక్ట్రిక్ గేర్ మారుస్తోంది. రెండు ఈవీ ఎస్యూవీలను రోడ్డెక్కించనుంది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాటా 2024లో ఏకంగా రెట్టింపై 21 శాతానికి ఎగబాకింది. విండ్సర్తో భారత్ ఈవీ మార్కెట్లో సంచలనానికి తెరతీసింది. గడిచిన 3 నెలల్లో 10 వేలకు పైగా విక్రయాలతో అదరగొట్టింది. బ్యాటరీ రెంటల్ సర్వీస్ (బీఏఏఎస్)ను అందించడం వల్ల కారు ధర కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది. హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్ ్స ఈవీలు కూడా క్యూలో ఉన్నాయి. అన్ని కంపెనీలూ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో టాటా మోటార్స్ వాటా గతేడాది 62%కి (2023లో 73%) తగ్గింది. అయితే, సియరా, సఫారీ, హ్యారియర్ ఎస్యూవీ ఈవీలతో మార్కెట్ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.టెస్లా వచ్చేస్తోంది... భారత్లో ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ కింగ్ టెస్లా ఈ ఏడాది ముహూర్తం ఖారారు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం, ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దిగుమతి సుంకం విషయంలో త్వరలోనే భారత్ సర్కారుతో సయోధ్య కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు పట్టుబడుతుండగా.. ముందుగా దిగుమతి రూట్లో వచ్చేందుకు మస్క్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బెంగళూరు ఆర్ఓసీలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది. పలు నగరాల్లో రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు కోసం కంపెనీ లొకేషన్లను అన్వేషిస్తోంది. తొలుత కొన్ని మోడళ్లను (మోడల్ ఎస్, మోడల్ 3) పూర్తిగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. వీటి ప్రారంభ రూ. 70 లక్షలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
బుల్లి ఎస్యూవీలు.. భలే జోరు!
దేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీల) క్రేజ్ ఓ రేంజ్లో ఉంది! ఒకపక్క, కార్ల అమ్మకాల్లో మందగమనం నెలకొన్నప్పటికీ.. మైక్రో ఎస్యూవీలు మాత్రం దుమ్మురేపుతున్నాయి. కస్టమర్లు చిన్న కార్లు/ హ్యాచ్బ్యాక్ల నుంచి అప్గ్రేడ్ అవుతుండటంలో వాటి సేల్స్ అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నాయి. మరోపక్క, చిన్న ఎస్యూవీల సెగ్మెంట్ తగ్గేదేలే అంటూ టాప్ గేర్లో దూసుకుపోతోంది! – సాక్షి, బిజినెస్ డెస్క్గత కొంతకాలంగా దేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్లో ట్రాక్లో వెళ్తున్నాయి. డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోతుండటంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వాటిని ఎలాగైనా వదిలించుకునేందుకు నానాతిప్పలు పడాల్సి వస్తోంది. అయితే, చిన్న ఎస్యూవీలు దీనికి మినహాయింపు. హాట్ కేకుల్లా సేల్ అవుతూ దేశీ మార్కెట్లో అవి భారీ వాటాను కొల్లగొడుతున్నాయి. రూ.10 లక్షల వరకు ధర ఉన్న మైక్రో ఎస్యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్ ఈ సెగ్మెంట్లో టాప్ లేపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (2024–25, ఏప్రిల్–జూలై) వీటి అమ్మకాలు 72 శాతం దూసుకెళ్లగా... మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో కేవలం 1.8 శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం దీనికి నిదర్శనం. ఈ నాలుగు నెలల్లో 1,75,350 (11 శాతం వృద్ధి) చిన్న ఎస్యూవీలు అమ్ముడవడం విశేషం. మరోపక్క, చిన్నకార్లు/హ్యాచ్బ్యాక్స్ సేల్స్లో 17 శాతం (69,936 యూనిట్లు) తగ్గుదల నమోదైంది. చిన్న ఎస్యూవీల కేటగిరీలోకి ఎక్స్టర్, పంచ్తో పాటు కాంపాక్ట్ మోడల్స్ అయిన మారుతీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ ఎంట్రీ వేరియంట్లు ఉంటాయి. క్యూ కడుతున్న కంపెనీలు... ఈ సెగ్మెంట్ శరవేగంగా దూసుకుపోతుండటంతో ఇతర కార్ల దిగ్గజాలు సైతం ఇందులోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నాయి. కియా మోటార్స్ తన తొలి మైక్రో ఎస్యూవీ ‘క్లావియా’ను తీసుకొచ్చే ప్లాన్లో ఉండగా.. హ్యుందాయ్ మరో కాంపాక్ట్ ఎస్యూవీ ‘బేయాన్’తో మార్కెట్ షేర్ను మరింత పెంచుకోవాలనుకుంటోంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్తో ఈ విభాగంలో పోటీ పడుతోంది. ఇక ఫోక్స్వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా సైతం వచ్చే ఏడాది ఆరంభంలో తొలి కాంపాక్ట్ ఎస్యూవీ కైలాక్ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సెగ్మెంట్లోకి దూకనుంది. ప్రస్తుతం మైక్రో ఎస్యూవీల విభాగంలో పంచ్, ఎక్స్టర్ హవా కొనసాగుతుండటంతో మారుతీ కూడా ఈ విభాగంపై కన్నేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజా కంటే తక్కువ ధరలో ప్రత్యేకంగా కొత్త మోడల్ను మారుతీ రూపొందిస్తోందని, రెండేళ్లలో రోడ్డెక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.మారుతున్న ట్రెండ్... హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే మరింత విశాలమైన స్పేస్, దృఢమైన రూపంతో ఆకర్షణీయంగా ఉండటంతో దేశంలో ఎస్యూవీల క్రేజ్ కేకపుట్టిస్తోంది. దీనికితోడు ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్యూవీలు అందుబాటు ధరల్లో లభిస్తుండటం వల్ల గ్రామీణ కొనుగోలుదారులు కూడా వీటికే సై అంటున్నారని, దీంతో చిన్న ఎస్యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ‘ఈ ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మైక్రో ఎస్వీయూల సెగ్మెంట్ అవతరించింది. ధర విషయానికొస్తే ఎక్స్టర్ వంటి చిన్న ఎస్యూవీలు కొన్ని హ్యాచ్బ్యాక్లతో సమానమైన ధరకే లభిస్తున్నాయి. దీనికితోడు పరిశ్రమలో తొలిసారిగా సన్రూఫ్, డాష్క్యామ్, 6 ఎయిర్బ్యాగ్ల వంటి వినూత్న ఫీచర్లు చిన్న ఎస్యూవీల్లోనూ ఉండటం కూడా కస్టమర్లు వీటి వెంట పడటానికి మరో ప్రధాన కారణం. నచి్చన ఫీచర్లు, డిజైన్ ఉంటే రేటెక్కువైనా కొనేందుకు వెనుకాడటం లేదు’ అని హ్యుందాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. 2024 తొలి 8 నెలల్లో మైక్రో ఎస్యూవీల సేల్స్ 86% దూసుకెళ్లగా... మొత్తం ఎస్యూవీ విభాగం విక్రయాల వృద్ధి 19 శాతంగా ఉంది. -
ఎస్యూవీల రారాజు ఇదే..
దేశంలో ఎస్యూవీలకు ఆదరణ ఇటీవల బాగా పెరుగుతోంది. భారతీయులు కొంటున్న పాసింజర్ వాహనాల్లో దాదాపుగా సగం ఎస్యూవీలే ఉంటున్నాయి. కస్టమర్లలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా అన్ని ప్రముఖ ఆటోమొబైల్ మేకర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్ ఎస్యూవీలను కస్టమర్లకు పరిచయం చేస్తున్నాయి.దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 14 శాతం వృద్ధితో 2.12 లక్షల వాహనాల అమ్మకాలను సాధించింది. ఇందులో 1.24 లక్షల వాహనాలు ఎస్యూవీలు ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. నెలవారీ ఉత్పత్తి 49,000 యూనిట్లను నుంచి ఈ సంవత్సరం చివరి నాటికి 64,000 యూనిట్లకు పెంచుతోంది కంపెనీ.దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీలలో మహీంద్రా అగ్రగామిగా నిలిచింది. మొత్తం ఎస్యూవీ మార్కెట్లో మహీంద్రా ఎస్యూవీల వాటా 21.6 శాతంగా ఉంది. ఇతర విభాగాల్లోనూ మహీంద్రా లీడ్లో ఉంది. 50.9 శాతం మార్కెట్ వాటాతో ఎల్సీవీ (లైట్ కమర్షియల్ వెహికల్), 44.7 శాతం వాటాతో ట్రాక్టర్లు, 43.4 శాతం వాటాతో ఎలక్ట్రిక్ 3-వీలర్లతో సహా అనేక ఇతర విభాగాలలో వాహనాలను అత్యధికంగా విక్రయిస్తోంది. దీంతో కంపెనీ మొత్తం త్రైమాసిక ఆదాయం 10 శాతం పెరిగింది. అయితే నికర లాభం మాత్రం 6 శాతం పడిపోయింది.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థార్ 5-డోర్ వాహనాన్ని ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆవిష్కరించడానికి మహీంద్రా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు టీజర్లు, ట్రైలర్లు వచ్చాయి. ఈ వాహనానికి థార్ రోక్స్ అని పేరు పెట్టింది కంపెనీ. దీని ప్రారంభ ధర సుమారు రూ.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా. -
రీల్స్ పిచ్చి పీక్స్కు.. సముద్రంలో కార్లతో ఇరుక్కపోయిన యువకులు
కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. తాగా ఇలాంటి ఘటనలో మరొకటి వెలుగు చూసింది.ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కొంతమంది యువకులు తమ కారును సముద్రంలోకి నడిపి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన గుజరాత్లోని కచ్ సముద్ర తీరంలో జరిగింది. ఇద్దరు యుకులు రీల్స్ కోసం తమ రెండు మహీంద్రా థార్ ఎస్యూవీ కారులను ముంద్రా సముద్ర తీరంలోకి పోనిచ్చారు. నీరు లోతు పెరగడం, అలల కారణంగా రెండు వాహనాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. దీంతో యువకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రెడ్, వైట్ మహీంద్రా థార్ వాహనాలను నీటిలో నుంచి బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కచ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు ఎస్వీలను స్వాధీనం చేసుకున్నామని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు.Gujarat: In an attempt to make a reel, two young men drove 2 Thar vehicles into the deep waters near the seashore in Mundra, Kutch due to which both vehicles get stuck in the water. With the help of locals, both vehicles were retrieved, also Kutch police filed an FIR against the… pic.twitter.com/m9YR0ByK7b— IANS (@ians_india) June 23, 2024 -
ఘోర ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. అయిదుగురి మృతి
చెన్నై: తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. విరుధ్ నగర్-మధురై జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన ఎస్యూవీ కారు తొలుత నెమ్మదిగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం ఎడమ వైపున్న డివైడర్ను బలంగా ఢీకొట్టి గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టింది. దెబ్బకు ఏకారు కంగా నాలుగు లేన్ల హైవేకు అవతలి వైపు సర్వీస్ లైన్లో ఎగిరిపడింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం దాటికి సంఘటనా స్థలంలో భారీగా దుమ్ము పేరుకుపోయింది. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా ముధురైలోని విల్లుపురానికి చెందినవారుగా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Tamil Nadu: Five people, including four members of the same family from Madurai's Villapuram, were killed when a speeding SUV collided with a moped at Sivarakottai near Tirumangalam on the Virudhunagar-Madurai highway: Madurai district SP Arvind (CCTV footage source:… pic.twitter.com/kFCzEvttJW — ANI (@ANI) April 10, 2024 -
రూ.16.8 లక్షల ఎస్యూవీని ఆవిష్కరించిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మధ్యశ్రేణి ఎస్యూవీ క్రెటా ఎన్లైన్ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుందని తెలిపింది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఎన్లైన్ శ్రేణిలో ఇప్పటికే ఐ20 హ్యాచ్బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ ఉన్నాయి. ఎన్ లైన్, ప్రామాణిక మోడల్ వాహనాల మధ్య డిజైన్లో పలు మార్పులుంటాయి. కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్వీల్స్, రెడ్ ఫ్రంట్, రేర్ బ్రేక్ కాలిపర్స్, గ్రిల్పై ఎన్ లైన్ బాడ్జింగ్ పలు డిజైన్ సంబంధిత మార్పులుంటాయి. ఎన్ లైన్ వినియోగదార్ల సగటు వయసు 36 ఏళ్లుగా ఉందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ–స్కూటర్కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
ఘోర ప్రమాదం.. కొంపముంచిన ఓవర్టేక్.. ఏడుగురి మృత్యువాత
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అతివేగంతో వెళ్తున్న ఓ కారు ఆటోను, బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు. మొత్తం రెండు బైక్లు, ఒక ట్రాక్టర్, ఎస్యూవీకారు, ఆటోరిక్షా ధ్వంసమయ్యాయి. కోరాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బోరిగుమ్మలో సింగిల్ రోడ్డుపై ఒక వైపు నుంచి ఎస్యూవీ కారు, ఆటో రిక్షా వస్తున్నాయి. ఎస్యూవీ వేగంగా దూసుకొచ్చి ఆటోరిక్షాను ఓవర్టెక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఆటోతోపాటు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఘటన అనంతరం ఎస్యూవీ కారు అక్కడి నుంచి పరారయ్యింది. ఆటో బోల్తా పడటంతో అందులోని 15 మంది ప్రయాణికులు రోడ్డుపై డిపోయారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించాడు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న 13 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వారిని కోరాపుట్లోని ఓ మెడికల్ కాలేజీకి తరలించినట్లు వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు మూడు లక్ష చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. చదవండి: బిహార్ పాలిటిక్స్.. నితీశ్ సర్కారు కీలక నిర్ణయం Seven people were killed in an #accident in #Odisha’s Borigumma earlier today. Who is in fault in this video?? 😭😭pic.twitter.com/dE8NBX9CfP — Sann (@san_x_m) January 27, 2024 -
హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్ విటారా కార్లు!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజికి విడుదల చేసిన కార్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఆ సంస్థ మార్కెట్కి పరిచయం చేసిన మారుతీ గ్రాండ్ విటారా ఏడాదిలోనే లక్ష కార్లు అమ్ముడు పోయాయి. అంచనా ప్రకారం.. నెలకు సుమారు 8,333 కార్లను విక్రయాలు జరిగాయి. తద్వారా దేశీయంగా మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో వేగంగా వేగంగా సేల్స్ జరిగిన కార్ల జాబితాలో గ్రాండ్ విటారా చోటు దక్కించుకోవడం గమనార్హం. ప్రత్యర్ధులకు పోటీగా ఇతర ఆటోమొబైల్ సంస్థలకు పోటీగా మారుతి మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లను డిజైన్ చేసింది. ఈ వేరియంట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరిడర్, హోందయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్వేగన్ టైగన్, సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్, ఎంజీ ఆస్టర్లు ఉన్నాయి. అయితే, బలమైన హైబ్రిడ్ పవర్ట్రెయిన్ను అందించిన ఎస్యూవీలలో హైరైడర్, గ్రాండ్ విటారాలు మాత్రమే ఉన్నాయి. ఇ-సీవీటీ ట్రాన్స్మిషన్తో కూడిన గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ వేరియంట్ లీటరుకు 27.97 కి.మీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా, మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ,‘గత ఏడాది విడుదలైన గ్రాండ్ విటారా ఎస్యూవీ ఔత్సాహికులకు కొత్త డ్రైవింగ్ అనుభూతిని అందిస్తూ కొత్త శకానికి నాంది పలికింది. ఎస్యూవీ వేరియంట్లో 22 శాతం వాటాతో మారుతి సుజికి వేగంగా వృద్ది సాధించిందని అన్నారు. గ్రాండ్ విటారా ధర గ్రాండ్ విటారా ధర ప్రస్తుతం రూ. 10.70 లక్షల నుండి రూ. 19.99 లక్షల వరకు ఉంది (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్). -
హోండా ఎలివేట్ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లోకి మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ ప్రవేశపెట్టింది. ఎలివేట్కు భారత్ తొలి మార్కెట్ కాగా, ఈ మోడల్ ద్వారా కంపెనీ మధ్యస్థాయి ఎస్యూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధర ఎక్స్షోరూంలో రూ.10.99–15.99 లక్షలు ఉంది. 121 పీఎస్ పవర్, 145 ఎన్ఎం టార్క్తో 6–స్పీడ్ మాన్యువల్, 7–స్పీడ్ సీవీటీ ట్రిమ్స్లో 1.5 లీటర్ ఐ–వీటీఈసీ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. లీటరుకు మైలేజీ మాన్యువల్ ట్రిమ్ 15.31, సీవీటీ 16.92 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో తయారైంది. 6 ఎయిర్బ్యాగ్స్, లేన్ వాచ్ కెమెరా, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ, ట్రాక్షన్ కంట్రోల్తో వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మల్టీ యాంగిల్ రేర్ వ్యూ కెమెరా, 458 లీటర్ల కార్గో స్పేస్, 7 అంగుళాల హెచ్డీ ఫుల్ కలర్ టీఎఫ్టీ మీటర్ క్లస్టర్, 10.25 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ ఎల్సీడీ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆడియో, డ్రైవ్ వ్యూ రికార్డింగ్ వంటి హంగులు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్కు పోటీనిస్తుంది. అయిదు ఎస్యూవీలు: భారత్లో 2030 నాటికి అయిదు ఎస్యూవీలను ప్రవేశపెట్టనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుముర తెలిపారు. ‘భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఎస్యూవీల వాటా ఏడాదిలో 43 నుంచి 48 శాతానికి చేరింది. ఈ విభాగం కంపెనీకి చాలా కీలకం కానుంది. ఎలివేట్ చేరికతో కంపెనీకి కొత్త కస్టమర్లు తోడు కానున్నారు. ఎస్యూవీ విభాగంలో లేకపోవడంతో చాలా కోల్పోయాం. అందుకే ఎలివేట్ను పరిచయం చేయడం గొప్పగా భావిస్తున్నాం’ అని వివరించారు. రాజస్తాన్లోని ప్లాంటు సామర్థ్యాన్ని పెంచామని, ప్రస్తుతం రోజుకు 660 యూనిట్లు ఉత్పత్తి చేయగలమని చెప్పారు. జూలై నుంచి ఎలివేట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. -
కొత్త కారు కొనేవారికే కష్టమే! జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో..
సాధారణంగా ఎప్పటికప్పుడు వాహన తయారీ సంస్థలు తన ఉత్పత్తుల ధరలను పెంచుతూనే ఉంటాయి. ముడిసరుకుల ధరల కారణంగా.. ఇతరత్రా కారణాలు చూపిస్తూ ఏడాదికి కనీసం ఒక్క సారైనా పెంచుతుందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు పెరిగినట్లు స్పష్టంగా తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మంగళవారం జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త కారు కొనాలనుకునే వారికి జీఎస్టీ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల మీద జీఎస్టీ సెస్ పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కావున ఇప్పుడు కొత్త ఎమ్యూవీ కార్లను కొనుగోలు చేసేవారు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. 28 శాతం జీఎస్టీ ఉండగా.. దీనిపైన 22 శాతం సెస్ విధించారు. దీంతో వాహన ధరలకు రెక్కలొచ్చాయి. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) ఎస్యూవీ అంటే పొడవు 4 మీటర్ల కంటే ఎక్కువ ఉండటమే కాకుండా.. ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీ కంటే ఎక్కువ ఉండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 మీమీ కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఉన్న కార్లు మాత్రమే ధరల పెరుగుదల అందుకుంటాయని తెలుస్తోంది. గతంలో సెస్ అనేది 20 శాతంగా ఉండేది. ఇది తాజాగా రెండు శాతం పెరిగి సెస్ 22 శాతానికి చేరింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఎస్యూవీలకే డిమాండ్
న్యూఢిల్లీ: ఎస్యూవీలకు బలమైన డిమాండ్తో దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో మే నెలలో విక్రయాల జోరు సాగింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ బలమైన హోల్సేల్ అమ్మకాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, కియా, ఎంజీ మోటార్ ఇండియా వంటి ఇతర తయారీ సంస్థలు సైతం విక్రయాల్లో వృద్ధి సాధించాయి. అగ్రశ్రేణి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 15 శాతం పెరిగి 1,43,708 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, ఎస్–ప్రెస్సోతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 30 శాతం తగ్గి 12,236 యూనిట్లకు పడిపోయాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల విక్రయాలు 5 శాతం పెరిగి 71,419 యూనిట్లకు చేరాయి. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల సేల్స్ 65 శాతం అధికమై 46,243 యూనిట్లకు చేరాయి. గత నెలలో కంపెనీ రెండంకెల అమ్మకాల వృద్ధికి ఎస్యూవీలు క్రెటా, వెన్యూ ఆజ్యం పోశాయని హ్యుందాయ్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. టాటా మోటార్స్ అంతర్జాతీయ వ్యాపారంతో సహా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 66% వృద్ధితో 5,805 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 3,505 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది. -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా ? బడ్జెట్ ధరలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యూందాయ్ భారతీయ మార్కెట్లో చిన్న ఎస్యూవీని త్వరలో పరిచయం చేయబోతోంది. బడ్జెట్లో (ప్రారంభ ధర రూ.6లక్షలు) ఏఐ3 కోడ్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ కారునే ఇక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. టాటా పంచ్, సిట్రోవెన్ సి3, మారుతీ సుజుకీ ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ మోడళ్లకు ఇది పోటీనిస్తుంది. 1.2 లీటర్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీతో రంగ ప్రవేశం చేయవచ్చని సమాచారం. దేశీయ ప్యాసింజర్ వాహన రంగంలో ఎస్యూవీల విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భారత్లో హ్యుండై వెన్యూ, క్రెటా, ఆల్కజార్, టక్సన్ ఎస్యూవీలను విక్రయిస్తోంది. -
షాకింగ్ ఘటన: అందరూ చూస్తుండగానే అగ్నికి ఆహుతైన కారు!
టాటా మోటార్స్! మధ్య తరగతి ప్రజల కారు కలల్ని నిజం చేసేలా కొత్త కొత్త కార్లను సరికొత్త హంగులతో మార్కెట్కు పరిచయం చేస్తుంటుంది. అందుకే మధ్య తరగతి వాహన ప్రియులకు టాటా కంపెనీ కార్లంటే చాలా ఇష్టం. పైగా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడదు. కాబట్టే ఆ కంపెనీ కార్లు ఎప్పుడు విడుదల అవుతాయి? ఎప్పుడు వాటిని సొంతం చేసుకుందామా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అంతటి క్రేజ్ ఉన్న టాటా మోటార్స్కు చెందిన ‘టాటా పంచ్’ కారు చూస్తుండగానే అగ్నికి ఆహుతైంది. కారు బ్యానెట్లో సంభవించిన ప్రమాదంతో మొదలై చివరికి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో కారు యజమాని సురక్షితంగా బయటపడ్డాడు. గుజరాత్కు చెందిన ప్రబల్ బోర్డియా నెల రోజుల క్రితం టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ కారును కొనుగోలు చేశాడు. ఈ తరుణంలో అత్యసర పని నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా జాతీయ రహదారి మార్గంలో బోర్డియా కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న బోర్డియాతో పాటు ఇతర ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షణాల్లో కారు బూడిదైంది. ఈ సందర్భంగా కారు యజమాని మాట్లాడుతూ..‘నేను నెల రోజుల క్రితం కొనుగోలు చేసిన నా టాటా పంచ్ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు బానెట్లో ఆటోమేటిక్గా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ మేం ప్రాణాల్ని కాపాడుకోగలిగామని’ తెలిపారు. కారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు టాటా పంచ్ ఘటనపై టాటా మోటార్స్ యాజమాన్యం స్పందించింది. వాహనదారుల భద్రతే ప్రాధాన్యత ఈ ప్రమాదంపై టాటా మోటార్స్ అధికారిక ప్రకటన చేసింది. టాటా మోటార్స్ ప్రతినిధి మాట్లాడుతూ, “మేము టాటా పంచ్ ప్రమాదానికి గల కారణాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దర్యాప్తు ఏజెన్సీల సహకారంతో ఈ దురదృష్టకర సంఘటనకు కారణాలు తెలుసుకుంటాం. వాహనాలు, వాటి వినియోగదారుల భద్రతే టాటా మోటార్స్ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. 5 స్టార్ రేటెడ్ మోస్ట్ సేఫ్టీ కారు టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ను అందుకున్న భారతీయ మార్కెట్లో అత్యంత చవకైన కారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపితేనే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి వస్తాయి. కారులో కూలెంట్ ఉందా బానెట్లో కూలెంట్ అనేది కారు ఇంజిన్ కూలింగ్ సిస్టెమ్కు ఉపయగపడే ఓ లిక్విడ్. చలి కాలంలో.. కూలింగ్ సిస్టెమ్లోని నీరు గడ్డ కట్టకుండా ఉండేందుకు ఈ కూలెంట్ ఉపయోగపడుతుంది. బాయిలింగ్ పాయింట్ను కూడా పెంచుతుంది. ఇక వేసవి కాలంలో.. ఓవర్ హీటింగ్ బారి నుంచి కూడా రక్షిస్తుంది ఈ కూలెంట్. కూలెంట్ కారులో ఉన్నప్పుడు ఇంజిన్ చల్లగా ఉంటుంది. అది లేకుంటే ఇంజిన్ వేడిగా అయి రాపిడి ఎక్కువై మంటలు చెలరేగే అవకాశముంటుంది. చదవండి👉 ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే? -
ఎస్యూవీలపై మారుతీ సుజుకీ గురి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంపై దృష్టిసారించింది. ఈ సెగ్మెంట్లో 2023–24లో 33 శాతం వాటా చేజిక్కించుకోవడం ద్వారా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బ్రెజ్జా, గ్రాండ్ వితారా ఎస్యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. మార్చి నుంచి జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్లు రోడ్డెక్కనున్నాయి. జిమ్నీ ఇప్పటికే 17,500 యూనిట్లు, ఫ్రాంక్స్ 8,500 యూనిట్ల బుకింగ్స్ను కైవసం చేసుకోవడం విశేషం. భారత ప్యాసింజర్ వాహన రంగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వాటా 42.5 శాతం ఉంది. 2022–23లో ఇది 45 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ విభాగంలో మారుతీ సుజుకీ వాటా 11.5 శాతం. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో సంస్థకు ఏకంగా 45 శాతం వాటా ఉంది. దీనిని 50 శాతానికి పెంచుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 2023 జనవరిలో ఎస్యూవీల విపణిలో మారుతీ సుజుకీ 15 శాతం వాటా దక్కించుకుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ విభాగంలో 2021–22లో టాటా మోటార్స్కు 18 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రాకు 15 శాతం వాటా ఉన్నట్టు సమాచారం. -
భారత్లో బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధర రూ.1.22 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ తాజాగా ఎక్స్7 ఎస్యూవీని భారత్లో ప్రవేశపెట్టింది. ధర రూ.1.22 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. చెన్నై ప్లాంటులో ఈ కార్లను తయారు చేస్తున్నారు. 3 లీటర్ 6 సిలిండర్ ఇంజన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పెట్రోల్ వర్షన్ 5.8 సెకన్లలో, డీజిల్ వర్షన్ 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ ప్రకటన తెలిపింది. -
కేంద్రం సంచలన నిర్ణయం..! ఆ కార్ల తయారీ నిలిపివేత?
త్వరలో కేంద్రం రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) నిబంధనల్ని అమలు చేయనుంది?. దీంతో భారత్లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని కంపెనీలకు చెందిన కార్లు, ఎస్యూవీలు కనుమరుగు కానున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కొత్త ఉద్గార నిబంధనలు డ్రైవింగ్ సమయంలో కార్ల నుంచి విడుదలయ్యే ఎన్ఓఎక్స్ వంటి కాలుష్య కారకాల్ని కొలవడం, వేగం వృద్ధి, క్షీణతలో తరచూగా వచ్చే మార్పులను పరిణగలోకి తీసుకోనున్నాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, కార్ల తయారీదారులు తమ ఇంజిన్లను తక్కువ ఉద్గారాలకు అప్గ్రేడ్ కావాల్సి ఉంటుంది. ఇంజన్ అప్డేషన్ ప్రక్రియ ఖరీదైంది. కాబట్టే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో పలు కంపెనీల 27 డీజిల్ కార్లు, ఎస్యూవీల కార్యకలాపాల్ని నిలివేసే అవకాశం ఉంది. ఆర్డీఈ నిబంధనల ప్రకారం వాహనాలు డ్రైవింగ్ సమయంలో విడుదలయ్యే ఉద్గార స్థాయిలను గుర్తించేలా పరికరాన్ని కలిగి ఉండాలి. ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉత్ప్రేరక కన్వర్టర్లు, ఆక్సిజన్ సెన్సార్ల వంటి క్లిష్టమైన భాగాలను పరికరం పర్యవేక్షిస్తుంది. కార్మేకర్లు క్రాంక్షాఫ్ట్ పొజిషన్లు, థొరెటల్, ఇంజన్ ఉష్ణోగ్రతను స్కాన్ చేయడానికి వాహనాల సెమీకండక్టర్లను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కార్లు, ఎస్యూవీలలో ఇంధనం మండే స్థాయిని నియంత్రించడానికి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లను కూడా అమర్చాలి. అన్ని డీజిల్ ఇంజిన్లు ఉద్గారాల నియంత్రణ ఖరీదైన 'సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్' (ఎస్ఈఆర్) సాంకేతికతకు మారవలసి ఉంటుంది. కాబట్టి, డీజిల్ కార్ల ధర గణనీయంగా పెరుగుతుంది. కార్ల తయారీకి భారీగా ఖర్చు చేయడం, తయారీ ఖర్చు.. కార్ల ధరల్ని పెంచడం.. పెరిగిన ధరలతో వాటి డిమాండ్ పడిపోవడం వంటి పరిణామలత నేపథ్యంలో సంస్థలు కార్ల తయారీని, అమ్మకాల్ని నిలివేయనున్నాయి. వాటిలో హోండా సిటీ 4వ జెన్, సిటీ 5వ జెన్ (డీజిల్), అమేజ్ (డీజిల్), జాజ్ డబ్ల్యూఆర్ -వీ, మరాజు, అల్ట్రాస్ జీ4, కేయూవీ 100, మహీంద్రా, హ్యుందాయ్, స్కోడా ఒక్కొక్కటి రెండు మోడళ్లను నిలిపివేయనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ ఐ20, వెర్నా డీజిల్ మోడళ్లను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తే, స్కోడా ఆక్టావియా, సూపర్బ్ కార్లు మార్కెట్లో కనుమరుగు కానున్నాయి. టాటా ఆల్ట్రోజ్ (డీజిల్), రెనాల్ట్ క్విడ్ 800, నిస్సాన్ కిక్స్, మారుతి సుజుకి ఆల్టో 800 నిలిపివేయనున్న జాబితాలో ఉన్నాయి. చదవండి👉 టోల్ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
అదిరే లుక్తో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ప్రవేగ్ డైనమిక్స్ తాజాగా డిఫై పేరుతో ఎస్యూవీని ఆవిష్కరించింది. ఎక్స్షోరూంలో ధర రూ.39.5 లక్షలు. డెలివరీలు వచ్చే ఏడాది మూడవ త్రైమాసికం నుంచి ఉంటాయి. 800 యూనిట్లకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని వివరించింది. బెంగళూరు ప్లాంటులో ఏటా 6,000 బ్యాటరీ ప్యాక్స్ తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. వీర్ పేరుతో ఆఫ్–రోడ్ మిలిటరీ వర్షన్ ఎస్యూవీని కంపెనీ అభివృద్ధి చేసింది. చదవండి: భారీ షాక్, మరో రంగానికి చెందిన వేలాది మంది ఉద్యోగుల తొలగింపు -
పండుగ జోష్: టాప్గేర్లో వాహన విక్రయాలు
ముంబై: పండుగ సీజన్ కలిసిరావడంతో అక్టోబర్లో ఆటో అమ్మకాలు పెరిగాయి. ఎస్యూవీ, మిడ్ సిగ్మెంట్, ఎంట్రీ లెవల్ కార్లకు భారీగా డిమాండ్ పెరగడంతో పాసింజర్ వాహన విక్రయాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా-మహీంద్రా, కియా మోటార్స్, హోండా కార్స్ ఇండియా చెప్పుకొదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. అయితే ఇదే నెలలో ద్విచక్ర విక్రయాలు విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా మోటోసైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, టీవీఎస్ మోటార్ విక్రయాలు నిరాశపరిచాయి. ♦ మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విక్రయాలు అక్టోబర్లో 1,67,520కు చేరాయి. గతేడాది అక్టోబర్ అమ్మకాలు 1,38,335తో పోలిస్తే 21 శాతం పెరిగాయి. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 43,556 నుంచి 33% వృద్ధితో 58,006 యూనిట్లకు చేరాయి. ♦ టాటా మోటార్స్ అమ్మకాలు 15 శాతం వృద్దిని సాధించి 78,335 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే ఆగస్టులో 67,829 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
భారత్కు నిస్సాన్ గ్లోబల్ మోడల్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ నిస్సాన్.. అంతర్జాతీయంగా విక్రయిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ను (ఎస్యూవీ) భారత మార్కెట్లో పరిచయం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో మాగ్నైట్, కిక్స్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్–ట్రయల్, జూక్, కష్కాయ్ మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఎక్స్–ట్రయల్, కష్కాయ్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత రోడ్లపై ఈ రెండు మోడళ్ల పరీక్ష మొదలైందని వెల్లడించింది. భారతీయ రోడ్లు, విభిన్న భూభాగాలకు ఈ వాహనాలు అనుకూలమా కాదా అన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని ఈ పరీక్షలు అంచనా వేస్తాయని కంపెనీ తెలిపింది. పరీక్షలు పూర్తి అయ్యాక సానుకూల ఫలితాలు వస్తే తొలుత ఎక్స్–ట్రయల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ తర్వాత కష్కాయ్ కూడా రోడ్డెక్కనుంది. ఉద్గారాలను బట్టి పన్ను..: వాహనాల పొడవు, ఇంజన్ పరిమాణం కంటే ఉద్గారాల ఆధారంగా ప్రయాణికుల వాహనాలపై పన్ను విధించడాన్ని భారతదేశం పరిగణించాలని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ రాకేష్ శ్రీవాస్తవ అన్నారు. ‘ఆటోమొబైల్స్ ద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి హైబ్రిడ్ల వంటి బహుళ సాంకేతికతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్గారాల స్థాయిని బట్టి వేర్వేరు పన్ను స్లాబ్లు ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే నాలుగు మీటర్ల లోపు, నాలుగు మీటర్ల కంటే పొడవు, ఇంధనం పరంగా భిన్నమైన పన్ను నిర్మాణాన్ని కలిగి ఉంది. జీఎస్టీ విధానం ప్రకారం కార్లపై 28 శాతం పన్నుతోపాటు సెస్ విధిస్తున్నారు. 4 మీటర్ల కంటే పొడవు ఉండే కార్లు, ఎస్యూవీలకు 50 శాతం, హైబ్రిడ్ వాహనాలకు 43 శాతం, ఎలక్ట్రిక్ వెహికిల్స్కు 5 శాతం జీఎస్టీ ఉంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 లాంచ్ చేసిన నిమిషాల్లోనే రికార్డు బుకింగ్స్ సొంతం చేసుకోవడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్కి అనుగుణంగా మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకువస్తోంది. ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి విడుదలయ్యే కార్ల క్రేజ్ గురించి కూడా చెప్పక్కర్లేదు. అందుకే అధిక కస్టమర్లు మహీంద్రా వాహనాల వైపే మొగ్గు చూపుతుంటారు. నేపథ్యంలో స్కార్పియో, XUV700 వంటి కొన్ని మోడళ్లపై 24 నెలలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థతి ఏర్పడింది. అయినా వీటికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదట. కాగా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కొత్త కొత్త మోడళ్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఇటీవల విడుదల చేసిన మహీంద్రా స్కార్పియో N దాని ప్రీమియం, ఫీచర్-రిచ్ ప్యాకేజీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. SUVలోని Z8, Z6 వేరియంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎంతలా అంటే కస్టమర్లు ఈ వాహనం కావాలంటే 24 నెలల వరకు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు Z8L దాదాపు 20 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇతర వేరియంట్లు మార్కెట్లో తక్కువ వెయిటింగ్ పీరియడ్ను కలిగి ఉన్నాయి. మహీంద్రా XUV700 మహీంద్రా XUV700కి కూడా మార్కెట్లో డిమాండ్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ కారు అమ్మకాలలో దూసుకుపోతోంది. ఈ SUV మీద ప్రస్తుతం కస్టమర్లు ఎంచుకునే వేరియంట్పై ఆధారపడి 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. అయితే పెట్రోల్ వెర్షన్లతో పోల్చినప్పుడు డీజిల్ మోడల్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. స్కార్పియో, ఎక్స్యూవీ 700 వంటి మోడళ్లకు ఏకంగా 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ రెండు కార్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కేవలం ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి. చదవండి: ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్న్యూస్.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్కార్ట్ బంపరాఫర్! -
మహీంద్రా ఈ–ఎస్యూవీలకు జియో–బీపీ చార్జింగ్ నెట్వర్క్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రిక్ ఎస్యూవీల కోసం చార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్లు జియో–బీపీ వెల్లడించింది. ముందుగా 16 నగరాల్లో ఎంఅండ్ఎం డీలర్షిప్ నెట్వర్క్లు, వర్క్షాప్లలో డీసీ ఫాస్ట్ చార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలిపింది. ఎంఅండ్ఎం ఇటీవలే తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ – ఎక్స్యూవీ400ను ఆవిష్కరించింది. త్వరలో మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టనుంది. దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్–బ్రిటన్కు చెందిన బీపీ కలిసి ఇంధనాల రిటైలింగ్ కోసం జాయింట్ వెంచర్గా జియో–బీపీని ఏర్పాటు చేశాయి. -
ఎస్యూవీల్లోకి హోండా రీఎంట్రీ: వచ్చే ఏడాది కొత్త మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్యూవీలైన సీఆర్-వి, బీఆర్-వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్-వి, జాజ్ ఎస్యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది. నిష్క్రమించే ఆలోచనే లేదు.. హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది. -
జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా!
చెన్నై: గత కొంత కాలంగా కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా మహీంద్రా ఎక్స్యూవీ 400 (Mahindra XUV 400) ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ లుక్ని విడుదల చేసింది. అనంతరం తమ తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఎక్స్యూవీ 400ను వచ్చే ఏడాది జనవరిలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. 2022 డిసెంబర్లో టెస్ట్ డ్రైవ్లు, 2023 జనవరి తొలి వారం నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని కంపెనీ ఈడీ (ఆటో, వ్యవసాయ రంగాలు) రాజేష్ జెజూరికర్ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో మహీంద్రా తన ఎక్స్యువి700 ఎస్యూవి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసి ఓ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి మహీంద్రా ఎక్స్యూవీ 400 బుకింగ్స్లో పాత రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మహీంద్రా కూడా ఈ కారుపై హైప్ క్రియేట్ చేసేందకు సెప్టంబర్ 8 సాయంత్రం 7.30 ఎక్స్యూవీ 400 కారు లుక్కు సంబంధించిన వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో చూశాక కొంతకాలంగా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా నెక్సాన్ SUV వంటి వాటికి గట్టి పోటినే ఇచ్చేలా కనిపిస్తుంది. చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే! -
ప్రత్యర్థులకు ధీటుగా మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్తో 400 కి.మీ ప్రయాణం!
దేశంలోని ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీ కార్లకు ఓ క్రేజ్ ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 రికార్డు బుకింగ్స్ కావడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్కి అనుగుణంగా మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతుంది. అందుకు భాగంగానే మహీంద్రా ఎక్స్యూవీ 400 (Mahindra XUV 400) ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ లుక్ని విడుదల చేసింది. అయితే మహీంద్రా ఈ కారు విడుదలకు ముందే, టీజర్లతో కారుపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మహీంద్రా ఎక్స్యూవీ 400తో కొంతకాలంగా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా నెక్సాన్ SUV వంటి వాటికి గట్టి పోటినే ఇచ్చేలా కనిపిస్తుంది. అయితే ఈ ఈవీ(EV) గురించి కంపెనీ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. సమాచారం ప్రకారం.. కొత్త మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV ధర సుమారు రూ. 14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. లుక్స్ పరంగా చూస్తే.. మహీంద్రా ఎక్స్యూవీ 400.. ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్లు, క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్తో కూడిన కొత్త హెడ్లైట్లతో పూర్తిగా రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సింగిల్ ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారుతో 150హార్స్ పవర్, రెండు బ్యాటరీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఒక సారి ఛార్జింగ్పై 400కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చ . 4.2 మీటర్లు పొడవు, XUV 300తో పోలిస్తే స్పేస్ పెద్దదని తెలుస్తోంది. ఆరు ఎయిర్ బ్యాగ్లు. వాటర్ ప్రూప్ బ్యాటరీ ప్యాక్, ప్రతీ చక్రానికి డిస్క్ బ్రేకులు, రియర్ వ్యూ కెమరా ఇతర ఫీచర్లు ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కి.మీ కాగా 8.3 సెకన్లకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, స్టైలిష్ లుక్ అదిరిందయ్యా! -
ఘోర ప్రమాదం.. లోయలోకి కారు దూసుకెళ్లి 8 మంది మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కిష్ట్వారా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్యూవీ కారు అదుపుతప్పి భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎస్యూవీ కారు.. చింగమ్ ప్రాంతం నుంచి ఛత్రూకు వెళ్తోందని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో బొండా గ్రామానికి సమీపంలో ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయినట్లు చెప్పారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరోవైపు.. కారు లోయలో పడి 8 మంది మృతి చెందిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రమాదం జరగటం దురదృష్టకరమన్నారు. అన్ని విధాల అవసరమైన సాయం అందిస్తామన్నారు. ఇదీ చదవండి: ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు -
మూడేళ్లలో సగం ఎస్యూవీలే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) హవా నడుస్తోంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఎస్యూవీల వాటా 35–38 శాతం ఉంటే.. భారత్లో ఇది 42 శాతమని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. భారత్లో సంస్థ మూడవ షోరూం మోడీ బీవైడీని హైదరాబాద్లో శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. మూడేళ్లలో ఎస్యూవీల వాటా 50 శాతానికి చేరుతుందన్నారు. హ్యాచ్బ్యాక్ల ధరలోనే రూ. 6–7 లక్షల నుంచే ఈ మోడళ్లు లభ్యం కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ధర ప్రాధాన్యత కాదు.. ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో హైదరాబాద్ విభిన్న మార్కెట్. ఇక్కడి మార్కెట్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్ విపణి గణనీయంగా వృద్ధి చెందింది. విక్రయాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత భాగ్యనగరి టాప్లో నిలిచింది. కారు కొనుగోలు నిర్ణయం విషయంలో ఒకప్పుడు ధర ప్రామాణికంగా ఉండేది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు బ్రాండ్, ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్స్, సేఫ్టీ తర్వాత ధర నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ప్యాసింజర్ కార్లు 2,50,972 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 50,000 యూనిట్లు.. దేశంలో సగటున నెలకు అన్ని బ్రాండ్లవి కలిపి 3,500 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 26,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో దేశవ్యాప్తంగా 50,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతాయని అంచనా. ప్యాసింజర్ వాహన రంగంలో ఈవీల వాటా 2 శాతమే. ఇది 2030 నాటికి 30 శాతానికి చేరనుంది. ఇక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో టాప్–1 ర్యాంక్ కోసం హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ–ప్యాసింజర్ వెహికల్స్లో దక్షిణాది వాటా 50–60 శాతంగా ఉంది. కస్టమర్లు తమ రెండవ కారుగా ఈవీని కొనుగోలు చేస్తున్నారు. -
మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల అభిమానులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ ప్రారంభించే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ ఈ విషయాలు తెలిపారు. ఈవీలను ప్రస్తుత ప్లాంట్లలోనే తయారు చేస్తారా లేక ప్రత్యేకంగా కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘మేం అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం వివిధ రాష్ట్రాలు ఎంత మేర సబ్సిడీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయో పరిశీలించుకుని, తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అయితే, ప్లాంటు ఏర్పాటుకు సబ్సిడీ మాత్రమే ప్రాతిపదిక కాబోదని, వాహనాల తయారీకి అనువైన పరిస్థితులు తదితర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని జెజూరికర్ తెలిపారు. ‘అసలు ఆటోమోటివ్ వ్యవస్థ అనేదే లేని ప్రాంతానికి వెళ్లాము. అది ఆటోమోటివ్ హబ్ అయి ఉండాలి. వాహనాల తయారీకి అనువైన పరిస్థితులు ఉండి, ఈవీ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెడుతున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. మేము మూడు–నాలుగు అవకాశాలను మదింపు చేసి, తగు నిర్ణయం తీసుకుంటాము’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ) ఎగుమతులపై స్పందిస్తూ.. ఇంకా ఏయే మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నది నిర్ణయం తీసుకోలేదని రాజేశ్ చెప్పారు. ఎంఅండ్ఎం ఇటీవలే ఎక్స్యూవీ, బీఈ బ్రాండ్ కింద అయిదు ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్ను ప్రదర్శించింది. 2024–2026 మధ్యలో నాలుగు వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీకి ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సంప్రదాయ ఇంధనాలతో పనిచేసే వాహనాల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. -
అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు.. మిగతా కంపెనీలకు దెబ్బే!
ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 రికార్డు బుకింగ్స్ అందుకు నిదర్శనం. తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లాలని సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతుంది. అందుకు భాగంగానే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ( SUV) మోడల్ని విడుదల చేసింది. అయితే ఈ కారు విడుదలకు ముందే, మహీంద్రా వీలు దొరికినప్పుడల్లా టీజర్లతో ఈ కారుపై హైప్ను పెంచుతోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, భారతీయ వాహన తయారీ సంస్థ 5 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను (SUV) విడుదల చేయాలని యోచిస్తోంది. వీటిని ప్రతాప్ బోస్ నేతృత్వంలోని మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) రూపొందించిందని గమనించాలి. కంపెనీ దాఖలు చేసిన ట్రేడ్మార్క్ల ప్రకారం, SUVలకు XUV-e1, SUV-e2, SUV-e3, SUV-e5, SUV-e6, SUV-e7, SUV-e8. SUV-e9 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ట్రేడ్మార్క్ చేసిన పేర్లలో 4వ సంఖ్యతో ఉన్న పేరు సిరీస్లో లేకుండా పోయింది. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUVల ఫీచర్లు, ఇంటీరియర్ల గురించి ఈ టీజర్ ద్వారా కస్టమర్లకు క్లూ ఇచ్చింది. ఇందులో కస్టమర్ ప్రాధాన్యతలకు సరిపడా రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ కోసం వ్యక్తిగత వినియోగదారు సెట్టింగ్లు ప్రతి ప్రయాణీకుడు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాయి. స్పష్టమైన కనెక్టివిటీ ఫీచర్ల కారణంగా కస్టమర్లు.. కాల్స్, టెక్స్ట్లు, మ్యూజిక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ను యాక్సెస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలలో లెదర్ సీట్లు, పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. And the curtain rises… pic.twitter.com/wRFQrejABu — anand mahindra (@anandmahindra) August 15, 2022 చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి -
స్కోడా ఎస్యూవీ బుకింగ్స్ షురూ..ప్రైస్ ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా ఎస్యూవీ కొడియాక్ బుకింగ్స్ను తిరిగి ప్రారంభించింది. జనవరి–మార్చిలో డెలివరీలు ఉంటాయని కంపెనీ బుధవారం ప్రకటించింది. ఎక్స్షోరూంలో ధర రూ.37.49 లక్షల నుంచి రూ.39.99 లక్షల వరకు ఉంది. రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కొడియాక్ బుకింగ్స్ను కంపెనీ జనవరిలో ప్రారంభించింది. -
మూడు మోడళ్లకు హోండా స్వస్తి
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 2023 మార్చి నాటికి మూడు మోడళ్లకు స్వస్తి పలుకుతోంది. వీటిలో జాజ్, డబ్యుఆర్–వీ, నాల్గవతరం సిటీ ఉన్నాయి. సమాచారం ప్రకారం.. హోండా ఇండియా అక్టోబర్ 2022 తర్వాత జాజ్, మార్చి 2023 తర్వాత హోండా డబ్యుఆర్–వీ మోడళ్లతో పాటు కంపెనీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్లలో ఒకటైన- హోండా సిటీ (నాల్గవతరం ) కూడా డిసెంబర్ 2022 నాటికి ఉత్పత్తిని కూడా నిలిపివేయనుంది. దీని ప్రకారం దేశీయ మార్కెట్లో ఇకపై హోండా కేవలం సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, అమేజ్ మోడళ్లను మాత్రమే విక్రయించనుంది. అలాగే ఎస్యూవీలను భారత్లో ప్రవేశపెట్టనుంది. గ్రేటర్ నోయిడా ప్లాంటును మూసివేసిన తర్వాత 2020 డిసెంబర్ నుంచి సివిక్, సీఆర్–వీ మోడళ్ల ఉత్పత్తిని హోండా కార్స్ నిలిపివేసింది. కొత్త కంపెనీల రాకతో సంస్థ మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతూ వస్తోంది. చదవండి: Amazon: అమెజాన్ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు! -
ఐదేళ్లలో 36 మోడళ్లు.. 6.52 లక్షల సేల్స్.. అయినా ఆ కార్లకు క్రేజ్ తగ్గలే!
భారత ఆటోమొబైల్ రంగంలో కార్ల హవా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు వ్యక్తిగత ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో భారతీయులు ఎస్యూవీ కార్లు వైపు అడుగులేస్తున్నారు. అందుకు నిదర్శనమే గత ఐదేళ్లలో 36 ఎస్యూవీ మోడళ్లు మార్కెట్లో విడుదల కావడంతో పాటు విజయవంతంగా అమ్మకాలలోనూ జోరు ప్రదర్శిస్తోంది. ఎస్యూవీ క్రేజ్ తగ్గేదేలే సేఫ్టీ, కంఫర్ట్తో పాటు సన్రూఫ్, టెక్నాలజీ కనెక్టెడ్ ఫీచర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ తరహా పాపులర్ మోడల్ కార్ల కోసం కొన్ని సార్లు రెండు సంవత్సరాలు వరకూ వేచి చూస్తున్నారు కూడా. ప్రస్తుతం ఎస్యూవీలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. గతంలో హ్యాచ్బ్యాక్లు సేల్స్ చార్ట్లలో ఆధిపత్యం చెలాయించేవి, కానీ ఎంట్రీ-లెవల్, మిడ్-సైజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) ఇటీవల కాలంలో జనాదరణ ఎక్కువ పొందుతున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల్లో ఎస్యూవీ (SUV) సెగ్మెంట్ అమ్మకాలలో వృద్ధిని సాధిస్తోంది. పరిశ్రమలో దాదాపు 19 శాతం ఉన్న ఎస్యూవీ విభాగం 2021-22లో 40 శాతానికి పెరిగింది. దీని బట్టి ఆ వాహనాల అమ్మకాలు వాటికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని తెలిపారు. గతేడాది 30.68 లక్షల కార్లు అమ్ముడైతే వాటిలో ఎస్యూవీల వాటా 6.52 లక్షల యూనిట్లు. గత ఐదేండ్లలో మార్కెట్లో కంపాక్ట్, మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లే ఎంటర్ కావడం ఆశ్చర్యమేమీ కాదు. నూతన శ్రేణి ఎస్యూవీ కార్ల పట్ల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నాక కార్ల తయారీ సంస్థలు అటువైపు దృష్టి మళ్లించారంటున్నారు. 2016-17లో సేఫ్టీ ఫీచర్లు గల కార్లు 17 శాతం అమ్ముడైతే.. 2021-22లో 24 శాతానికి పెరిగింది. ఇటీవల మార్కెట్లో మారుతి బ్రెజా మోడల్ కారు లాంచ్ చేస్తే.. మొత్తం వివిధ కార్ల బుకింగ్స్లో 70 శాతం దానివే ఉన్నాయి. ఎస్యూవీలతోపాటు కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కార్లను తేవడంతో మార్కెట్లో మూడో స్థానానికి టాటా మోటార్స్ దూసుకొచ్చింది. చదవండి: Elon Musk: కోర్టులో విచారణ వాయిదా కోరిన ఎలాన్ మస్క్.. ఏం ప్లాన్ వేశావయ్యా! -
స్టైలిష్ లుక్తో..హ్యుందాయ్ నుంచి ఎస్యూవీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త టుసో ఎస్యూవీని ఆవిష్కరించింది. వచ్చే నెల ప్రారంభంలో ఈ కారు మార్కెట్లోకి రానుంది. పెట్రోల్ వేరియంట్ 6 స్పీడ్, డీజిల్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, 2 లీటర్ పవర్ట్రైయిన్స్, అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్తో రూపుదిద్దుకుంది. కెమెరా, రాడార్ సెన్సార్స్తో ఆటోమేటిక్ సెన్సింగ్ టెక్నాలజీని పొందుపరిచారు. ఈ విభాగంలో తొలిసారిగా 29 రకాల ఫీచర్లను జోడించారు. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది కస్టమర్లు టుసోను సొంతం చేసుకున్నారు. 2021లో అంతర్జాతీయంగా 4.85 లక్షల టుసో కార్లు అమ్ముడయ్యాయి. భారత్లో ఏటా సుమారు 40,000 యూనిట్లు రోడ్డెక్కుతున్నాయి. 2025 నాటికి ఇది 55,000 యూనిట్లకు చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. -
సరికొత్త ఫీచర్లతో అదరగొడుతోన్న..నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ షురూ!
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్ను పరిచయం చేసింది. జులై 8 ( నిన్న శుక్రవారం) నుంచి ఈ కార్ బుకింగ్స్ను ప్రారంభించినట్లు తెలిపింది. జులై 18న ఈ కారును విడుదల చేయనుంది. మాగ్నైట్ ఎక్స్వీ వేరియంట్ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైఫై కనెక్టివిటీ, 7 అంగుళాల ఫుల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, డైమంట్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. మూడు వేరియంట్లలో నిస్సాన్ సంస్థ మ్యాగ్నైట్ రెడ్ పేరుతో మూడు వేరియంట్లలో మ్యాగ్నైట్ టర్బో ఎక్స్వీ ఎంటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ టర్బో ఎక్స్వీ సీవీటీ రెడ్ ఎడిషన్, మ్యాగ్నైట్ ఎక్స్వీ ఎంటీ రెడ్ ఎడిషన్ కార్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఈ కార్ల వినియోగదారులకు మెమోరబుల్ జర్నీని అందించేందుకు బోల్డ్ డిజైన్, పవర్ ప్యాక్డ్ పర్మామెన్స్, కంఫర్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లను జత చేసినట్లు నిస్సాన్ ప్రతినిధులు వెల్లడించారు. నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఫీచర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ రెడ్ ఎడిషన్ కార్లలో కారు గ్రిల్స్(కారు హెడ్లైట్స్ మధ్యలో ఉండే డిజైన్),ఫ్రంట్ బంపర్ క్లాడింగ్,వీల్ ఆర్చ్, బాడీ సైడ్ క్లాడింగ్లు ఉన్నాయి. వీటితో పాటు రెడ్ ఎడిషన్లో బోల్డ్ బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్,టైల్ డోర్ గ్రానిషన్ పొందుపరిచింది. యాంబినెట్ మూడ్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్,7.0 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రామెంట్ క్లస్టర్, వైఫై కనెక్టివీటి, స్టార్ట్, స్టాప్ కోసం పుష్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, బ్రేక్ అసిస్ట్ వంటి సదుపాయం ఉంది. కార్లపై డిస్కౌంట్ ఇటీవల నిన్సాన్ ప్రతినిధులు నిస్సాన్ మ్యాగ్నైట్ సీవీటీ వేరియంట్ ఎక్స్, ఎక్స్వీలపై డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ కార్ల ప్రైస్ రేంజ్ రూ.5.88లక్షల నుంచి రూ.10.56లక్షల మధ్య ఉంది. -
ఎం అండ్ ఎం దూకుడు: వచ్చే సెప్టెంబరులోనే
సాక్షి, ముంబై: దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ సెక్టార్లో దూసుకుపోనుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో తమ ఈవీ ఎక్స్యూఏవీ 400ని ఆవిష్కరించ నున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ గురువారం అర్థరాత్రి రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతలతో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీని లాంచ్ చేస్తామన్నారు. అంతేకాదు 2027 నాటికి తమ ఎస్యూవీలలో 20 శాతం నుండి 30 శాతం వరకు ఎలక్ట్రిక్గా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఎలక్ట్రిక్ ఎస్యూవీ రంగంలో అగ్రగామిగా ఉండేందుకు మహీంద్రా భారీ కసరత్తే చేస్తోంది. 2022, ఆగస్ట్ 15 న జరిగే యూకే ఈవెంట్లో తమ విజన్ను ప్రకటిస్తామని ఆటో అండ్ అగ్రి విభాగానికి చెందిన రాజేష్ జెజురికర్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అగ్రగామిగా ఉన్న తాము భవిష్యత్తులో 4వీల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో కూడా టాప్లో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఈవో అనిష్ షా తెలిపారు. తాజాగా ఎంఅండ్ఎం యూకే డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థ, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (బీఐఐ) తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కొత్త ఫోర్-వీలర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థను తీసుకురానుంది. ఇందులో రూ. 1,925 కోట్ల పెట్టుబడి ఒప్పందాన్ని చేసుకుంది. ఈ సంస్థలో బీఐఐ వాటా 2.75 శాతంగా, ఎం అండ్ ఎం వాటా 4.76 శాతంగా ఉంటుంది. తొలుత ఇరు కంపెనీలు రూ. 1,925 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తాయి. రెండు విడతలుగా, రూ. 70,070 కోట్ల విలువైన మూలధన సమకూర నుందని అంచనా. ఈ డీల్ ప్రకటించిన తర్వాత ఎంఅండ్ఎం షేర్లు ట్రేడింగ్ ఆరంభంలో ఆల్-టైమ్ హైని నమోదు చేశాయి. -
కార్లు, బైక్తో హిరో మాదిరి స్టంట్లు...ఖైదీలా జైల్లో...
సాక్షి, నొయిడా: ఇటీవల కాలంలో సోషల్ మీడియా స్టార్డమ్ కోసం రకాలరకాల స్టంట్లు చేసి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకన్న ఉదంతాలను చూస్తునే ఉన్నాం. కొన్ని ప్రమాదకరమైన స్టంట్లు రద్దీగా ఉండే రహదారుల్లో చేసి ప్రజలను భయబ్రాంతుకు గురిచేసిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాదు ఇలాంటి విన్యాసాలతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యిపోవాలనుకుంటారే తప్ప అవి ఎంత ప్రమాదకరమని కొంచెం కూడా ఆలోచించారు. అలానే ఒక వ్యక్తి ముందు వెనుక ఆలోచించకుండా రద్దీగా ఉండే రహదారుల్లో ఇలాంటి స్టంట్లు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన 21 ఏళ్ల వ్యక్తి సోషల్ మీడియా క్రేజ్ కోసం భయంకరమైన స్టంట్లు చేసి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఆ వ్యక్తి రద్దీగా ఉండే రహదారిలో బాలీవుడ్ సినిమా 'పూల్ ఔర్ చిత్రంలో' హిరో అజయ్ దేవ్గన్ ఎంట్రీ స్టంట్ని చేశాడు. రెండు ఎస్యూవీ కారులపై ఏ మాత్రం భయంలేకుండా నిలబడి ఉండే భయంకరమైన స్టంట్ చేశాడు. అంతేకాదు మోటారు బైక్తో కూడా కొన్ని రకాల భయంకరమైన విన్యాసాలు చేశాడు. ఐతే అతను తన ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పెట్టే స్టంట్లు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీపుటేజ్ల ఆధారంగా సదరు వ్యక్తిని రాజీవ్గా గుర్తించడమే కాకుండా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో స్టంట్ వీడియోలు పోస్ట్ చేసేందుకే ఈ ప్రమాకరమైన స్టంట్ చేసినట్లు చెప్పాడన్నారు. गाड़ियों व बाइक पर खतरनाक स्टंट करने वाले युवक को थाना सेक्टर-113 नोएडा पुलिस द्वारा गिरफ्तार कर स्टंट में प्रयुक्त वाहनों को सीज किया गया।#UPPolice pic.twitter.com/92yYu33O45 — POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 22, 2022 (చదవండి: ఇంట్లో అలంకరణకు ఉపయోగించే ప్లవర్వేజ్... ఓ కుటుంబాన్ని కోటిశ్వరులుగా మార్చింది) -
ఎలక్ట్రిక్ కారుపై అదిరిపోయే బంపరాఫర్, రూ.7లక్షల భారీ డిస్కౌంట్!
భారతీయులకు శుభవార్త. ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్పై బంపరాఫర్ ప్రకటించింది. మెర్సిడెజ్ బెంజ్కు చెందిన మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎస్యూవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు సుమారు రూ.7లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. మెర్సిడెజ్ బెంజ్ సంపన్నులను టార్గెట్ చేస్తూ 2020 అక్టోబర్ నెలలో ఇండియన్ మార్కెట్లో ఎక్స్ షోరూమ్ ధర రూ.99.3లక్షలతో మెర్సిడెజ్ బెంజ్ఈక్యూసీని విడుదల చేసింది. అయితే ఆ తర్వాత మ్యానిఫ్యాక్చరింగ్, ట్రాన్స్ పోర్ట్ కాస్ట్ పెరగడంతో రెండు సార్లు ఆ వెహికల్ ధరల్ని పెంచింది. దీంతో బెంజ్ కారు ధర రూ.1.06కి చేరింది. తాజాగా ఆ కారుపై రూ.7లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు కారణంగా దేశీయ మార్కెట్లో ఈ కారు తరహా ఫీచర్లతో బీఈవీ ఎస్యూవీ వెహికల్స్ విడుదలయ్యాయి. ఆ వెహికల్స్ దెబ్బతో మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ వెహికల్స్ సేల్స్ తగ్గాయి. అందుకే ఆ పోటీ తట్టుకొని సేల్స్ జరిపేలా భారీ డిస్కౌంట్ ఇస్తూ ఈ కీలకం నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ ఎంతంటే? 80కేడ్ల్యూహెచ్ బ్యాటరీ, 20.8-19.7కేడబ్ల్యూహెచ్/100కేఎం..402.3బీపీహెచ్ ఉండగా మ్యాక్స్ పవర్ 760ఎన్ఎంతో పీక్ టార్క్ అందిస్తుంది. స్పీడ్ 5.1 సెకండ్స్లో 0 నుంచి 100కిలోమీటర్ల వేగంతో వెళ్లగా టాప్ స్పీడ్ గంటకు 180కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఇక ఈ కారును సింగిల్ ఛార్జ్తో 471కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయోచ్చు. అంతేకాదు ఈ కారులో మూడు ఛార్జింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయని మెర్సిడెంజ్ బెంజ్ ప్రతినిధులు చెబుతున్నారు అందులో హోమ్ ఛార్జింగ్, ఏసీ వాల్ అవుట్లెట్, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలున్నాయి. 50కేడ్ల్యూహెచ్ టైప్ కార్ ఫుల్ ఛార్జింగ్ 90నిమిషాల్లో ఎక్కుతుంది.హోమ్ ఛార్జింగ్ యూనిట్ 2.4కేడ్ల్యూహెచ్ ఫుల్ చార్జింగ్ పెట్టేందుకు 21 గంటలు పడుతుండగా..7.4కేడ్ల్యూహెచ్ ఏసీ వాల్ ఛార్జర్ సైతం ఫుల్ ఛార్జింగ్ పెట్టేందుకు 21గంటల సమయం పడుతుంది. ఇక లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్న ఈ కారుపై అపరిమితంగా సర్వీసింగ్తో పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్తో 5ఏళ్ల వారంటీని..ఈక్యూసీ బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీని అందిస్తున్నట్లు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ తెలిపింది. చదవండి: సంచలనం! ఎలన్ మస్క్కు ఎదురు దెబ్బ..ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు! -
చేతులు కలిపాయ్..దుమ్ము దులిపేస్తున్నాయ్! దేశీయ రోడ్లపై ఎస్యూవీ చక్కెర్లు!
ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్ ఎస్యూవీ వెహికల్స్కు యమా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ను దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ తో పాటు వోక్స్వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్ కార్లు క్యాష్ చేసుకుంటున్నాయి. అదే సమయంలో దేశీయ ఆటోమొబైల్ సంస్థలు సైతం ఎస్యూవీ మార్కెట్ను గ్రాబ్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా మనదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా భాగస్వామ్యంలో కొత్త మిడ్ సైజ్ ఎస్యూవీని మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థ భాగస్వామ్యంలో తయారైన తొలి ఎస్యూవీ వెహికల్స్ టెస్ట్లో భాగంగా దేశీయ రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వెహికల్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. వెహికల్ ఒక్కటే.. కోడ్లు మాత్రం రెండు మారుతి సుజుకీ - టయోటా సంస్థలు మిడ్ రేంజ్ ఎస్యూవీ వెహికల్స్ను తయారు చేశాయి. కానీ ఆ కార్ల కోడ్లు మాత్రం విడి విడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజికి ఎస్యూవీ కోడ్ వైఎఫ్జీ కాగా..టయోటా కారు కోడ్ డీ22 అని పేరు పెట్టారు. ఇక ఆ కార్ల ముందు భాగం చూడటానికి చాలా స్పెషల్ గా ఉంది. హెడ్ ల్యాంప్లను విడగొట్టి.. అదే ప్లేస్లో బంపర్, ఎల్ఈడీ లైట్లతో పాటు హెడ్ లైట్లతో కారును డిజైన్ చేశారు. ఫ్రంట్ ఫాసియా పాక్షికంగా కనిపిస్తుంది. ప్రత్యేక టయోటా, మారుతి కార్ల తరహాలో ఉంటున్నాయి. అయితే, టొయోటా డీ22 ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్ లు కనిపిస్తున్నప్పటికీ, మారుతి వైఎఫ్జీకి కింద భాగంలో ఏ ఆకారంలో పెద్ద హెడ్ల్యాంప్తో ఎల్ఈడీ డీఆర్ఎల్లు ఉన్నాయి. రెండు ఎస్యూవీల మంచి గ్రౌండ్ క్లియరెన్స్,వెనుకవైపు ఒకేలా డిజైన్ను కలిగి ఉంటాయి. ఫీచర్లు, సెక్యూరిటీ పరంగా కొనుగోలు దారుల్ని అట్రాక్ట్ చేస్తాయని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా పరికరాల పరంగా, అవి మొప్పలకు లోడ్ అవుతాయని ఆశించవచ్చు. మారుతీ సుజుకి, టయోటా ఆల్ న్యూ మిడ్ సైజ్ ఎస్యూవీలు కర్ణాటక బిడాడిలో టయోటా రెండవ ప్లాంట్లో తయారు చేస్తున్నారు. ఈ ఎస్యూవీలు దీపావళికి ముందు ఈ పండుగ సీజన్లో దేశీయ మార్కెట్ లో విడుదల కానుండగా.. ఆ కార్ల ధరలు అవి రూ. 10 లక్షలు, రూ.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెగ్మెంట్లో ఉండనున్నాయి. చదవండి: ఉద్యోగులకు బిగ్షాక్.. 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం! -
సోనూసూద్ ఎస్యూవీని స్వాధీనం చేసుకున్న పోలీసులు!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా పోలింగ్ బూత్ వద్ద బాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోనూసూద్ ఎస్యూవీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనూ సూద్ సోదరి మాళవికా సూద్ సచార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన తన సోదరి మాళవిక సూద్ సచార్ కోసం బాలీవుడ్ నటుడు మోగాలో క్యాంప్ చేస్తున్నాడు. అయితే మోగా జిల్లాలోని లంధేకే గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోనూ సూద్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని (ఎస్యూవీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎస్డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా సోనూ సూద్ ఇంటిపై వీడియో నిఘాను ఆదేశించారు. ఈ మేరకు సిటీ పోలీస స్టేషన్ ఆఫీసర్ దేవిందర్ సింగ్ మాట్లాడుతూ ..అనుమానాస్పద కార్యాచరణ ఆధారంగా ఎస్యూవీని స్వాధీనం చేసుకున్నాము. లంధేకే గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఎస్యూవీ తిరుగుతున్నట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము దానిని స్వాధీనం చేసుకున్నాము. అంతేకాదు అతను మోగాలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆ వాహనాన్ని ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనూ సూద్కు మోగా నియోజకవర్గంలో ఓటు లేనందున ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి వీల్లేదని ఇంట్లోనే ఉండాలని ఎస్డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా ఆదేశించారు. అయితే అతను ఆ ఆదేశాలను ఉల్లంఘించాడు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి. అని అన్నారు. ఈ విషయమై సోనూసూద్ను మాట్లాడుతూ.. “శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్, అలియాస్ మఖన్ బ్రార్, నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం పార్కింగ్ సమస్య మాత్రమే. వాహనం సరిగ్గా పార్క్ చేయలేదు. ఇంకేమీ లేదు" అని చెప్పారు. (చదవండి: కాంగ్రెస్కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ) -
యజమానులు ఉద్యోగులకు కార్లు గిప్ట్ గా ఇస్తారా? ఇదిగో ఈయన ఇస్తున్నాడు!!
కేరళకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పద్మశ్రీ అవార్డ్ గ్రహిత,వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియాను గుర్తు చేస్తున్నారు. తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు బెంజ్ కార్లతో పాటు మరెన్నో బహుమతుల్ని అందిస్తూ హాట్ టాపిగ్గా నిలుస్తున్నారు. కేరళకు చెందిన ఏకే షాజీ మైజీ డిజిటల్ రీటైల్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ సంస్థలో చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా సీఆర్ అనీష్ 22ఏళ్లుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 22 సంవత్సరాలుగా వ్యాపారవేత్త ఎకె షాజీతో కలిసి పనిచేస్తున్న సీఆర్ అనీష్ విధేయతకు గుర్తుగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ క్లాస్ 220 డి కారును ప్రజెంట్ చేశాడు. ఈ సందర్భంగా ప్రియమైన అనీ గత 22 సంవత్సరాలుగా మీరు నాకు బలమైన స్తంభంలా ఉన్నారు. మీరు మీ కొత్త క్రూజింగ్ భాగస్వామిని ప్రేమిస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ వ్యాపారవేత్త ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులకు బ్లాక్ లగ్జరీ ఎస్యూవీని బహుమతిగా ఇచ్చిన ఫోటోల్ని జత చేస్తూ ఇన్స్ట్రాగ్రామ్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. గతంలో ఉద్యోగులకు విశ్వసనీయతకు ప్రతిఫలమివ్వడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం షాజీ తన ఉద్యోగులకు ఆరుగురు చొప్పున కారును బహుమతిగా ఇచ్చాడు. కాగా, గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా తన ఉద్యోగులకు విలాసవంతమైన బహుమతుల్ని అందించారు. 018లో దీపావళికి తన ఉద్యోగులకు 600 కార్లు ఇచ్చాడు. 3 కోట్ల విలువైన మూడు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్యూవీలను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. -
అత్యంత తక్కువ ధరకే ఎస్యూవీ కార్..! ఎగబడి కొంటున్న టాటా మోటార్స్ ఎస్యూవీ కార్లు ఇవే..
గత ఏడాది ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన టాటా మోటార్స్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహనం నెక్సన్, మైక్రో ఎస్యూవీ భారత కార్ల మార్కెట్లను శాసిస్తున్నాయి. ఎస్యూవీ కార్లలో పంచ్ తక్కువ ధరకే రావడంతో వాహనదారులు ఎగబడుతునారు. గత ఏడాది జనవరిలో కంటే ఈ ఏడాది జనవరిలో అమ్మకాల్లో ఈ రెండు కార్లు దుమ్మురేపాయి. టాటా మోటార్స్ గత ఏడాది ఆవిష్కరించిన రెండు ఎస్యూవీ విజయవంతంగా నిలుస్తునాయి. 2022 మొదటి నెలలోనే అద్భుతమైన వృద్ధిని కంపనీ సాధించింది. టాటా నెక్సాన్ కాంపాక్ట్ SUV జనవరి 2022లో 13,816 యూనిట్లను విక్రయించగా, టాటా పంచ్ సబ్-కాంపాక్ట్ SUV గత నెలలో 10,027 యూనిట్లను విక్రయించింది. ఇక నెక్సాన్ గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన suv గా నిలుస్తోంది. నాలుగో ఎస్యూవీ ఈ ఏడాది జనవరిలో భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ప్యాసింజర్ వాహనాల్లో నెక్సాన్ నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకోగా, టాటా పంచ్ కూడా ప్రారంభించిన ఐదు నెలల్లో టాప్ జాబితాలోకి ప్రవేశించింది. ఈ రెండు Tata SUVల అమ్మకాల విజయం కారణంగా, స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలలో సంవత్సరానికి గత ఏడాది జనవరితో పోల్చితే 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆటోమేకర్ గత నెలలో అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతితో కలిపి మొత్తం 76,210 యూనిట్లను విక్రయించింది. ప్రభావం చూపని ధరల పెంపు...! టాటా మోటార్స్ తన కాంపాక్ట్ SUV నెక్సాన్ ధరను గత ఏడాది నవంబర్లో రూ.11,000 వరకు పెంచినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రు.7.30 లక్షల నుంచి రూ. 13.35 లక్షల మధ్య అందుబాటులో ఉంది (ఎక్స్-షోరూమ్). ఇక టాటా మోటార్స్ పంచ్ సబ్-కాంపాక్ట్ SUV ధరను కూడా పెంచగా... ధరల పెరుగుదల ప్రభావం కార్ల అమ్మకాలను ఎలాంటి ప్రభావం చూపలేదు. -
వారెవ్వా ఆడి..గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఆడి ‘క్యూ7 ఎస్యూవీ’ కొత్త వెర్షన్ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఎక్స్షోరూం ధర క్యూ7 ప్రీమియం ప్లస్ రూ.79.99 లక్షలు, క్యూ7 టెక్నాలజీ రూ.88.33 లక్షలు ఉంది. 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్తో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 8 ఎయిర్బ్యాగ్లను పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది. రూ.5లక్షలు చెల్లించి కార్ బుక్ చేసుకోవచ్చు లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన నూతన వెర్షన్ ప్రీమియం ఎస్యూవీ ‘క్యూ7’కు బుకింగ్లు తీసుకుంటున్నట్టు గతంలో ప్రకటించింది. 3 లీటర్ల పెట్రోల్ ఇంజన్తో ఉండే ఈ కారు కోసం ముందుస్తుగా రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో 2021లో తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేశామని.. ఆడి క్యూ7 బుకింగ్లతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించామని ఆడి ప్రతినిధులు వెల్లడించారు. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, క్వాట్టో ఆల్వీల్ డ్రైవ్, పార్క్ అసిస్ట్ తదితర ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. -
ఎగుమతుల్లో హ్యుందాయ్ సంచలనం
ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ క్రెటా సంచలనం సృష్టించింది. భారత్ నుంచి ఒక ఏడాదిలో రికార్డు స్థాయి యూనిట్ల ఎగుమతితో సరికొత్త రికార్డు నెలకొల్పింది. హ్యుందాయ్ క్రెటా 2021కిగానూ మోస్ట్ ఎక్స్పోర్టెడ్ ఎస్యూవీ ఘనత దక్కించుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పెరుగుదల 26.17 శాతం నమోదు కావడం విశేషం. మొత్తం 32, 799 యూనిట్లు ఓవర్సీస్కి ఎగుమతి అయ్యాయి. 2020లో యూనిట్ల సంఖ్య 25,995 యూనిట్లుగా ఉంది. ఇక 2021లో హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తంగా 42, 238 ఎస్యూవీల ఎగుమతితో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో క్రెటా గ్రాండ్తో పాటు వెన్యూ మోడల్స్ కూడా ఉన్నాయి. వెన్యూ 7,698 యూనిట్లు, క్రెటా గ్రాండ్ 1,741 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. క్రెటా, ఐ20, వెర్నా, అల్కాజర్ మోడల్స్ను ఎంపిక చేసిన మార్కెట్లలోకి వదిలింది హ్యుందాయ్ ఇండియా. సౌతాఫ్రికాతో పాటు పెరూ, డొమినికా రిపబ్లికా, చాద్, ఘనా, లావోస్కు సైతం ఎన్ లైన్, ఎల్పీజీ వేరియెంట్లను ఎగుమతి చేసింది. -
బీఎండబ్ల్యూ నుంచి ఎస్యూవీ కారు.. దుమ్మురేపే స్పీడు..
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ఎక్స్3 ఎస్యూవీని గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ. 59.9 లక్షలుగా ఉంది. స్థానికంగా తయారయ్యే ఈ కారు రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 2–లీటర్ ఫోర్–సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 252 హెచ్పీ సామర్థ్యాన్ని, 350 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 235 కిలో మీటర్ల వేగం ప్రయాణించగలదు. బీఎండబ్ల్యూ ఎక్స్ 3కి సంబంధించి డీజిల్ మోడల్ను తర్వలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ‘‘మిడ్–సైజ్ స్పోర్ట్ యాక్టివిటీ వెహికల్(ఎస్ఏవీ) విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు బీఎండబ్ల్యూ ఎక్స్3ని ప్రవేశపెట్టాము. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, డ్రైవింగ్ పనితీరు కస్టమర్లకు సరికొత్త అనూభూతినిస్తాయి’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. చదవండి: దూసుకెళ్తున్న లంబోర్గినీ కార్లు -
బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఆయా ఎస్యూవీ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఆయా మోడళ్లపై సుమారు రూ. 82 వేల వరకు కార్పోరేట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, ఎక్సేచేంజ్ బోనస్ను కొనుగోలుదారులకు అందించనుంది. ఈ ఆఫర్ 2022 జనవరి 31 వరకు అందుబాటులో ఉండనుంది. అల్టురాస్, స్కార్పియో, మొరాజో, ఎక్స్యూవీ300, మహీంద్రా కేయూవీ100 ఎన్ఎక్స్టీ, వాహనాలపై ఈ తగ్గింపు వర్తించనుంది. మహీంద్రా ఆయా మోడల్స్పై అందిస్తోన్న ఆఫర్స్..! మహీంద్రా Alturas SUV మహీంద్రా అల్టురాస్ ఎస్యూవీపై గరిష్టంగా రూ. 81, 500 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్బోనస్ రూ. 50,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 11, 500, సుమారు రూ. 20 వేల వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చును. మహీంద్రా కేయూవీ100 నెక్స్ట్ మహీంద్రా కేయూవీ100 నెక్స్ట్పై గరిష్టంగా రూ. 61, 055 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్బోనస్ రూ.20,000 వరకు, కార్పోరేట్ డిస్కౌంట్ రూ. 3, 000, క్యాష్ డిస్కౌంట్ రూ. 38, 055 కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియోపై గరిష్టంగా రూ. 29, 000 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్ఆఫర్ రూ.10,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 4, 000, సుమారు రూ. 15 వేల వరకు ఇతర ప్రయోజనాలు కొనుగోలుదారులకు లభిస్తాయి. మహీంద్రా మొరాజో మహీంద్రా మొరాజో గరిష్టంగా రూ. 40,200 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్ఆఫర్ రూ.15,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 5,200,క్యాష్ బెనిఫిట్ రూ. 20, 000 కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మహీంద్రా ఎక్స్యూవీ300 మహీంద్రా ఎక్స్యూవీ300 గరిష్టంగా రూ. 69, 002 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్ఆఫర్ రూ.25,000 వరకు, కార్పోరేట్ డిస్కౌంట్ రూ. 4, 500, క్యాష్ బెనిఫిట్స్ రూ. 30,002 వరకు అందబాటులో ఉండనున్నాయి. ► వీటితోపాటుగా మహీంద్రా బోలెరో ఎస్యూవీ కొనుగోలుపై రూ. 13,000; సబ్కాంపాక్ట్ ఎస్యూవీపై రూ. 10, 000 వరకు క్యాష్ బెనిఫిట్స్ను అందిస్తోంది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..! -
SUV: గేర్ మార్చిన మారుతి.. వేగం పెంచిన టాటా
ముంబై: దేశీయంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (ఎస్యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ దిగ్గజాలు ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ ఆధిపత్యం ఉన్న ఈ సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్) కొత్తగా పలు ఎస్యూవీలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త హంగులతో సరికొత్త బ్రెజాను ఆవిష్కరించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరో మూడు కార్లను ఆవిష్కరించవచ్చని పేర్కొన్నాయి. వీటిలో ఒకటి బ్రెజాకు ప్రత్యామ్నాయ ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ ఉండవచ్చని వివరించాయి. టాటా మోటర్స్ కూడా ఈ సెగ్మెంట్లో దూకుడు పెంచుతోంది. 2020లో కంపెనీ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో ఎస్యూవీల వాటా 37 శాతంగా ఉండగా 2021లో ఇది 52 శాతానికి పెరిగింది. ఇక అక్టోబర్లో నెక్సాన్, పంచ్ మోడల్స్ భారీగా అమ్ముడవడంతో (రెండూ కలిపి 18,549 వాహనాలు) ఎస్యూవీ మార్కెట్లో అగ్ర స్థానం కూడా దక్కించుకుంది. పుష్కలంగా నిధులు ఉండటం, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతుండటం ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్కు సానుకూలాంశాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాహన విక్రయాల్లో 38 శాతం వాటా.. వాహన విక్రయాల్లో ఎస్యూవీల వాటా గత కొన్నాళ్లుగా గణనీయంగా పెరిగింది. 2016లో మొత్తం వాహన విక్రయాల్లో ప్యాసింజర్ వాహనాల వాటా 51 శాతంగాను, ఎస్యూవీల వాటా 16 శాతంగాను నమోదైంది. అదే 2021కి వచ్చేసరికి ఎస్యూవీల వాటా 38 శాతానికి ఎగిసింది. హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్కు (40 శాతం వాటా) ఇది దాదాపు సరిసమానం కావడం గమనార్హం. 2020లో ఎస్యూవీల మార్కెట్ వాటా 29 శాతంగా ఉంది. ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందునే ఈ విభాగంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. గత మూడేళ్లలో 50 పైగా కొత్త మోడల్స్ను లాంచ్ చేశాయి. వీటిల్లో హ్యుందాయ్కి చెందిన క్రెటా అత్యధికంగా 1,25,437 యూనిట్లు అమ్ముడై బెస్ట్ సెల్లర్గా నిల్చింది. వ్యూహరచనలో మారుతీ .. ఎస్యూవీ విభాగంలో పోటీ తీవ్రతరమవుతుండటంతో మారుతీ సుజుకీ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం పడుతోంది. లాభదాయకత అధికంగా ఉండే ఈ విభాగంలో కంపెనీకి పెద్ద స్థాయిలో మోడల్స్ లేకపోవడం ప్రతికూలంగా ఉంటోంది. విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మినహా స్పోర్ట్ యుటిలిటీ విభాగంలో.. ముఖ్యంగా మిడ్–ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీకి మరే ఇతర మోడల్స్ లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంట్రీ స్థాయి ఎస్యూవీ మోడల్స్లో బ్రెజా దాదాపు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, బోలెడన్ని కొత్త మోడల్స్తో తీవ్ర పోటీ ఉన్న మధ్య స్థాయి ఎస్యూవీ విభాగంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని మారుతీ వర్గాలు తెలిపాయి. కాంపాక్ట్ ఎస్యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతీ దాదాపు 540 బేసిస్ పాయింట్ల మేర మార్కెట్ వాటా కోల్పోయిందని విశ్లేషకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మారుతీ తన వ్యూహాలకు మరింతగా పదును పెడుతోందని వివరించారు. పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగలగడం, కొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు కావాల్సిన స్థాయిలో నిధులు, సాంకేతికత మొదలైనవన్నీ చేతిలో ఉండటం మారుతీకి సానుకూలాంశాలని పేర్కొన్నారు. హ్యుందాయ్ ఆధిపత్యం.. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల విభాగంలో హ్యుందాయ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీ వాహన విక్రయాల్లో సగభాగం దీన్నుంచే ఉంటోంది. ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజర్, టక్సన్, కోనా ఈవీ అనే అయిదు వాహనాలతో హ్యుందాయ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి తోడుగా టక్సన్లో ప్రీమియం వెర్షన్ను, మరో ఎలక్ట్రిక్ ఎస్యూవీని ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఫ్రంట్ రూఫ్, కనెక్టెడ్ కార్లు, వాహనంలో మరింత స్థలం, సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు హ్యుందయ్ ఇండియా వర్గాలు తెలిపాయి. గత కొన్నాళ్లుగా పలు ఎస్యూవీలు వచ్చినప్పటికీ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని వివరించాయి. హ్యుందాయ్ గ్రూప్లో భాగమైన కియా కూడా ఇటీవలే టాప్ 5 ఆటోమొబైల్ సంస్థల లిస్టులోకి చేరింది. సెల్టోస్, సోనెట్ మోడల్స్ ఇందుకు తోడ్పడ్డాయి. కియా ఎస్యూవీ సెగ్మెంట్పైనే దృష్టి పెడుతోంది. సెడాన్, హ్యాచ్బ్యాక్ విభాగంలోకి ప్రవేశించే యోచన లేదనేది కంపెనీ వర్గాల మాట. చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..! -
2021లో తెగ వెతికిన టాప్-5 ఎస్యువీ కార్లు ఇవే..!
2020తో పోలిస్తే 2021లో కార్ల అమ్మకాలు పెరిగినప్పటికీ ఆశించినంత మేర కొనుగోళ్లు జరగలేదు. దీనికి ప్రధాన కారణం సెమీకండక్టర్ కొరత. ఈ కొరత వల్ల ఆటో పరిశ్రమ 2021లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సమస్యల్లో చిన్న ఊరట ఏంటి అంటే? కంపెనీల కార్ల కొనుగోళ్లలో ఎస్యువీ కార్ల అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు ఒక నివేదిక తెలిపింది. ఎస్యువీ కార్లకు డిమాండ్ కొత్త కార్ల అమ్మకాలలో మాత్రమే కాదు, ప్రీ-ఓన్డ్ కార్ల అమ్మకాలలో కూడా ఉన్నట్లు తేలింది. అయితే, ఈ ఎస్యువీ కార్ల కోసం వినియోగదారులు నెట్టింట్లో తెగ వెతికేశారు. ఎక్కువగా వెతికిన కార్లలో కింద పేర్కొన్న కార్లు టాప్-5 స్థానంలో నిలిచాయి. కియా సెల్టోస్ ప్రముఖ దక్షిణ కొరియా కార్ల సంస్థ కియా నుంచి వచ్చిన కియా సెల్టోస్ గురుంచి 2021లో గూగుల్ సర్చ్లో నెలకు సగటున 8 లక్షల 20 వేల మంది ఈ కారు గురుంచి వెతికారు. భారతీయ మార్కెట్లో ఈ కంపెనీ విడుదల చేసిన మొదటి కారు ఇది. దీనిని 2019లో విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో మొత్తం నాలుగు మోడల్స్ విక్రయిస్తున్నారు. కియా సెల్టోస్ మూడు ఇంజిన్లలో వస్తుంది. కియా సెల్టోస్ ప్రారంభ ధర ₹9.95 లక్షల(ఎక్స్ షోరూమ్)కు విక్రయిస్తున్నారు. మహీంద్రా థార్ ఈ ఏడాది గూగుల్ సర్చ్లో నెలకు సగటున 6.7 లక్షల మంది మహీంద్రా థార్ రెండో ఎస్యువీ కారు సర్చ్ చేశారు. ఈ మహీంద్రా థార్ ఎస్యువీలో రెండు ఇంజిన్ ఆప్షన్ లు ఉన్నాయి. 2.0-లీటర్ ఎమ్ స్టాలియన్ 150 టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్, రెండో ఆప్షన్ 2.2-లీటర్ ఎమ్ హాక్ 130 డీజిల్ ఇంజిన్. మహీంద్రా థార్ బేస్ వేరియంట్ ధర ₹12.78 లక్షల(ఎక్స్ షోరూమ్)తో ప్రారంభమవుతుంది. టాటా నెక్సన్ టాటా నెక్సన్ 2021లో ఎస్యువీల కోసం గూగుల్లో ఎక్కువగా సర్చ్ చేసిన వాటిలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ ఎస్యువీ భద్రత పరంగా గ్లోబల్ ఎన్సిఎపి టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ ఎస్యువీ రెండు ఇంజిన్ లతో వస్తుంది. 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, మరో 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. టాటా నెక్సన్ ₹7.29 లక్షల(ఎక్స్షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది. కియా సోనెట్ 2021లో గూగుల్లో ఎక్కువగా వెతికిన ఎస్యువీల పరంగా చూస్తే కియాకు చెందిన సోనెట్ 4వ స్థానంలో నిలిచింది. ఈ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది ప్రారంభంలో సెల్టోస్ కాంపాక్ట్ ఎస్యువీతో పాటు అమ్మకానికి వచ్చింది. ఈ కియా సోనెట్ ప్రారంభ ధర ₹6.89 లక్షలు(ఎక్స్ షోరూమ్). టాటా పంచ్ 2021లో గూగుల్లో ఎక్కువగా వెతికిన ఎస్యువీల పరంగా చూస్తే కియాకు చెందిన సోనెట్ 5వ స్థానంలో ఉంది. టాటా పంచ్ ఇతర టాటా కార్ల కంటే ఎక్కువ బుకింగ్స్ సంపాదించింది. టాటా పంచ్ 1.2-లీటర్ రీవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. టాటా పంచ్ ₹5.48 లక్షల(ఎక్స్ షోరూమ్) ధరకు లభ్యం అవుతుంది. (చదవండి: ఐఫోన్లలో అదిరిపోయే ఫీచర్, సిమ్కార్డ్తో పనిలేకుండా..!) -
అదిగో మహీంద్రా..! ప్రీ బుకింగ్స్లో దుమ్మురేపుతోంది..!
ఎస్యూవీ మార్కెట్లో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన ఎక్స్యూవీ700 ప్రీబుకింగ్స్లో దుమ్మురేపుతోంది. ప్రీ బుకింగ్స్ను ప్రారంభించిన 14రోజుల్లో 65,000 వెహికల్స్ బుకింగ్స్ జరిగినట్లు దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సంస్థ తెలిపింది. రోజుకు 25వేల వెహికల్స్ బుకింగ్ అక్టోబర్ 7నుంచి మహీంద్రా ఎక్స్యూవీ 700 ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రీ బుకింగ్స్లో 14 రోజుల స్వల్ప వ్యవధిలో 65,000 వెహికల్స్ అమ్మకాలు జరిగాయి. బుకింగ్స్ ప్రారంభమైన తొలిరోజు అక్టోబర్ 7, అక్టోబర్ 8 ఈ రెండు రోజుల్లో ఒక్కో రోజు సుమారు 25వేల వెహికల్స్ పై బుకింగ్ జరిగినట్లు మహీంద్రా ప్రతినిధులు తెలిపారు. ఈ రెండు రోజుల పాటు జరిగిన 50వేల వెహికల్స్ బుకింగ్ కేవలం 3 గంటల్లోనే జరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇక వెహికల్స్ డెలివరీ విషయానికి వస్తే గతవారం ఎక్సయూవీ 700 డీజిల్ వేరియంట్ వెహికల్స్ డెలివరీ ప్రారంభం కాగా,పెట్రోల్ ఎక్స్యూవీ700 వేరియంట్స్ డెలివరీ వెహికల్స్ అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎక్స్యూవీ సరికొత్త రికార్డులు ఇటీవల చెన్నైలో ప్రూవింగ్ ట్రాక్ (ఎమ్ఎస్పీటీ) లో మహీంద్రా ఎక్స్యూవీ700 సరికొత్త రికార్డ్లని క్రియేట్ నమోదు చేసింది. ప్రూవింగ్ ట్రాక్లో జరిగిన 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్లో మహీంద్రా ఎక్స్యూవీ ఒక్కొక్కటి సుమారు 4000 కి.మీ. మొత్తంగా 17000 కిలోమీటర్ల మేర ప్రయాణించాయి. గతంలో ఈ రికార్డు 3161 కిలోమీటర్లతో ఉండేది. చదవండి: Mahindra XUV 700: మేఘాలలో తేలిపొమ్మన్నది -
టాటా పంచ్ అదిరింది: ఫీచర్స్, ధర ఎంతంటే
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు 'టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ'ని విడుదల చేసింది. గత కొద్ది కాలంగా కార్ మార్కెట్లో టాటా పంచ్ ఎస్యూవీ వెహికల్ ఆసక్తికరంగా మారింది. అందుకు కారణం యూకేకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం(ఎన్సీఏపీ)ను నిర్వహిస్తుంది. క్యాంపెయిన్లో భాగంగా మనదేశంలో 'సేఫర్ కార్స్ ఫర్ ఇండియా' పేరుతో పలు కార్లపై టెస్టులు నిర్వహిస్తుంది. ఆ టెస్టుల్లో కార్ల సేఫ్టీని బట్టి స్టార్ రేటింగ్ను అందిస్తుంది. తాజాగా నిర్వహించిన సేఫర్ కార్స్ క్యాంపెయినింగ్లో టాటా పంచ్ కారు 5 స్టార్ రేటింగ్ను సొంతం చేసుకుంది. టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ ఫీచర్లు పిల్లల సేప్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందిన టాటా పంచ్ మైక్రో ఎస్యూవీలో 7అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్తో పాటు ఐఆర్ఏ కనెక్టివిటీ సూట్, స్మూత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కోసం 90 డిగ్రీల ఓపెన్ డోర్స్, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్,క్రూయిస్ కంట్రోల్, కూలెడ్ గ్లోవీ బాక్స్, 4స్పీకర్స్, ఆటో సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్ లైట్స్ ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. టాటా పంచ్ ధర ఇండియాలో విడుదలైన టాటా పంచ్ ప్రారంభ ధర రూ.5.49లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందుబాటులో ఉంది. ఈ ధర 2021,డిసెంబర్ 31వరకు అలాగే కొనసాగుతుందని టాటామోటార్స్ ప్రతినిధులు తెలిపారు.ఇక అడిషనల్గా అందుబాటులో ఉన్న ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) సౌకర్యం కావాలనుకుంటే అదనంగా మరో రూ.60వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
సరికొత్త ఘనత సాధించిన సూపర్ లగ్జరీ కారు లంబోర్ఘిని ఉరుస్
ఇటాలియన్ సూపర్ లగ్జరీ కారు తయారీ కంపెనీ లంబోర్ఘిని సరికొత్త ఘనత సాధించింది. ప్రముఖ లంబోర్ఘిని ఎస్యూవీ ఉరుస్ కారు ప్రపంచంలోనే ఎత్తైన లడఖ్ ప్రాంతంలోని ఉమ్లింగ్ లా పాస్ రహదారిపై నడవడం ద్వారా భారతదేశంలో మరో మైలురాయిని సాధించిందని కంపెనీ తెలిపింది. అక్టోబర్ 8, 9న రెండుసార్లు సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్లో ఉరుస్ ప్రయాణించడంతో ఇప్పటి వరకు లంబోర్ఘిని ప్రయాణించిన ఎత్తైన ప్రాంతం ఇదేనని లంబోర్ఘిని ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. నడపడం కష్టం ఉమ్లింగ్ లా పాస్ అనేది భారతదేశంలోని లడఖ్లో ఒక పర్వత మార్గం. ఈ మార్గం సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల అక్కడ వాహనం నడపాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ మార్గంలో 86 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నమ్మశక్యం కాని అద్భుతమైన ఘనత సాధించినట్లు కంపెనీ తెలిపింది. "లంబోర్ఘిని ప్రపంచంలోని అత్యధిక క్లిష్టమైన రహదారిపై నడుస్తున్నపుడు మాకు నిజంగా గర్వించదగ్గ క్షణం" అని లంబోర్ఘిని ఇండియా అధిపతి శ్రీ శరద్ అగర్వాల్ చెప్పారు. (చదవండి: ఆరు రోజులు.. రూ.10.56 లక్షల కోట్ల సంపద) ఈ సంధర్భంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్ఓ)కు అభినందనలు తెలియజేశారు. లంబోర్ఘిని ఎస్యూవీ ఉరుస్ అనేది ఒక సూపర్ స్పోర్ట్స్ కారు. ప్రపంచంలో అన్ని మార్గాలలో ప్రయాణించే అగ్రశ్రేణి కారు. 4-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్ తో నడిచే ఈ ఉరుస్ కారు 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రపంచంలోనే అత్యధిక క్లిష్టమైన రోడ్డులో నడవడంతో తన సామర్థ్యాలను ప్రదర్శించిందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో లంబోర్ఘినికి ఉరుస్ ప్రారంభ ధర ₹3.16 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ సూపర్ లగ్జరీ ఎస్యూవీని ప్రస్తుతం 8-10 నెలల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. -
జీప్ రాంగ్లర్ ఎస్యూవి వెహికల్ కొనేవారికి షాక్!
మీరు కొత్తగా జీప్ రాంగ్లర్ ఎస్యూవి కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక చేదువార్త. జీప్ ఇండియా గత వారం కంపాస్ ధరలను భారీగా పెంచగా, ఈ సారి రాంగ్లర్ ధరలను గణనీయంగా పెంచింది. ఈ ఏడాది మార్చిలో జీప్ ఇండియా భారతదేశంలో రాంగ్లర్ ఎస్యూవిని అసెంబుల్ చేయడం ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం కంపాస్, రాంగ్లర్ వాహనాలను పూణేలోని రంజన్ గావ్ ఫెసిలిటీలో తయారు చేస్తుంది. ఇది ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా ఉంది. అన్ లిమిటెడ్, రూబికాన్ అనే రెండు వేరియెంట్లలో రాంగ్లర్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ రెండు వేరియెంట్ల ధరలు రూ.1,25,000 పెరిగాయి. అన్ లిమిటెడ్ ధర ఇప్పుడు రూ.55.15 లక్షలు కాగా, రూబికాన్ రూ.59.15 లక్షలుగా దేశంలో ఇంతకు ముందు అమ్మకానికి వచ్చిన సీబియు వెర్షన్ కంటే రాంగ్లర్ సుమారు రూ.10 లక్షలు చౌక. మనదేశంలో అసెంబుల్ చేసిన ఈ జీప్ రాంగ్లర్ ఎస్యూవి 5-డోర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. దీనికి పాత మోడల్ లాగానే 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 268 హెచ్పి శక్తిని, 400 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్తో 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ స్టాండర్డ్ గా వస్తుంది. (చదవండి: ఎలాన్ మస్క్, జెఫ్బెజోస్: వీళ్లిద్దరూ ఏక్ నెంబర్ 'పిసినారులు') ఇందులో ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, డీఆర్ఎల్లు, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, లెదర్ అప్హోల్స్టరీ, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 7.0-ఇంచ్ కలర్ ఎంఐడి స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, 8.4-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ / స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రాంగ్లర్ ఎస్యూవీ కావడంతో రిమువబుల్ డోర్స్, హార్డ్ టాప్ పైకప్పు ఉంటుంది. జీప్ రాంగ్లర్ లో ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, టైర్ ప్రెజర్ మానిటర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా స్టాండర్డ్ సేఫ్టీ పరంగా అందిస్తుంది. -
సెప్టెంబరులో బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ ఇదే !
కరోనా కంటే సెమికండక్టర్లు ఆటో మొబైల్ పరిశ్రమను ఎక్కువ ఇబ్బందులకు గురి చేసింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మార్కెట్ పుంజుకుంటుంది అనుకునే తరుణంలో ఈ చిప్సెట్ల కొరత వచ్చి పడింది. విపత్కర పరిస్థితుల్లోనూ ఈ కంపెనీ కార్ల అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. కియా సంచలనం రెండేళ్ల కిందట కియా ఇండియా మార్కెట్లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్ల అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తోంది. సెప్టెంబరులో మిగిలిన ఆటోమొబైల్ కంపెనీ కార్ల అమ్మకాల్లో తగ్గుదల ఉండగా కియా విషయంలో అది జరగలేదు. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే కియా కార్ల అమ్మకాలు 1.4 శాతం పెరిగాయి. సెప్టెంబరులో కియా సంస్థ నుంచి 14,441 యూనిట్ల కార్ల అమ్మకాలు జరిగాయి. ఎస్యూవీలో నంబర్ వన్ కియా కార్ల అమ్మకాల్లో మేజర్ షేర్ సెల్టోస్దే. మిడ్ ఎస్యూవీ సెగ్మెంట్లో సెల్టోస్కి ఎదురు లేకుండా పోతుంది. 2019 ఆగస్టులో ఈ మోడల్ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది కియా. సెప్టెంబరు అమ్మకాలకు సంబంధించి ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్గా ఉన్న హ్యుందాయ్ క్రెటాను అధిగమించింది. సెప్టెంబరులో 9,583 సెల్టోస్ వాహనాలు అమ్ముడయ్యాయి. లక్ష దాటిన సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో సోనెట్ సైతం మంచి ఫలితాలు కనబరిచినట్టు కియా తెలిపింది. సెప్టెంబరు నెలలో సోనెట్ అమ్మకాలు లక్ష మార్క్ను క్రాస్ చేసినట్టు వివరించింది. సెప్టెంబరులో 4,454 సోనెట్ కార్లు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. కార్నివాల్లో ఫేస్లిఫ్ట్ మల్టీ పర్పస్ వెహికల్ సెగ్మెంట్లో కియా నుంచి ప్రీమియం వెహికల్గా కార్నివాల్ ఉంది. ఈ కారు అమ్మకాలు బాగుంటంతో తాజాగా ఈ వెర్షన్లో అప్డేట్ చేసింది కియా. ప్రీమియం, ప్రెస్టీజ్, లిమోసైన్, లిమోసైన్ ప్లస్ వేరియంట్లలో కార్నివాల్ను అందిస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు దేశంలో 3.30 లక్షల కార్లు అమ్ముడైనట్టు కియా తెలిపింది. చదవండి : Tesla: టెస్లా జోరు.. మిగతా కంపెనీల బేజారు..! -
అక్టోబర్ 4న టాటా మైక్రో ఎస్యూవీ కారు బుకింగ్స్ ఓపెన్
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన మైక్రో ఎస్యూవీ పంచ్ కారు బుకింగ్స్ కోసం అక్టోబర్ 4 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ మైక్రో ఎస్యూవీని 2021 అదే రోజున లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. అయితే, బుకింగ్ మొత్తం ఎంత అనేది టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. త్వరలో రాబోయే మైక్రో ఎస్యూవీ ఫీచర్లను ఆటపట్టించింది. ఇండియన్ మార్కెట్లో గత కొంత కాలంగా ఎస్యూవీ వెహికల్స్కి డిమాండ్ పెరుగుతోంది. సెడాన్లకు ధీటుగా ఎస్యూవీ వెహికల్స్ అమ్మకాలు సాగుతున్నాయి. అందుకే ఈ కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది. టాటా మోడల్ కార్లలో అందించే 7 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇందులో కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎస్యూవీ ప్రమాణాలతో, పట్టణాలు, నగరాల్లో ప్రయాణించేందుకు అనువైన చిన్న వాహనంగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. స్పోర్టీ త్రీ స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఆల్ట్రోజ్ నుండి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్ వంటి ఫీచర్లతో రానుంది. పంచ్ తన కీలక ప్రత్యర్థుల్లో ఒకరైన మారుతి సుజుకి ఇగ్నిస్ కంటే పెద్దదిగా ఉంటుందని తెలుస్తుంది. ఇగ్నిస్ కారుతో పోలిస్తే దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.(చదవండి: రిలయన్స్ డిజిటల్లో ఎలక్ట్రానిక్స్పై భారీ ఆఫర్లు) 'Right' from all the angles. ;) I Pack A PUNCH Bookings open on 4th October#TataPUNCH #TataMotors pic.twitter.com/MQRc1JjV97 — Tata Motors Cars (@TataMotors_Cars) September 30, 2021 -
ఇండియన్ మార్కెట్లో ఫోక్స్ వ్యాగన్ టైగున్ ఎస్యూవీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా తాజాగా సరికొత్త టైగున్ ఎస్యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆఫర్లో ధర ఎక్స్షోరూంలో రూ.10.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల మధ్య ఉంది. పెట్రోల్ ఇంజన్తో 1 లీటర్, 1.5 లీటర్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో తయారైంది. ఇప్పటికే 12,200 పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. హ్యూండాయ్ క్రెటా, కియా సెల్టోస్కు ఇది పోటీ ఇవ్వనుంది. ఫోక్స్వ్యాగన్ ఇండియా 2.0 ప్రాజెక్ట్లో టైగున్ తొలి ఉత్పాదన. మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో దేశంలో అన్ని బ్రాండ్లవి కలిపి ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ‘వినియోగదార్లకు ఎంపిక పరిమితమైంది. రెండు సంస్థలదే ఈ విభాగంలో ఆధిపత్యం. అందుకే టైగున్ను ప్రవేశపెట్టాం. మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో వచ్చే ఏడాది నుంచి 10% వాటా చేజిక్కించుకోవాలన్నది మా లక్ష్యం. కొత్త విభాగాలు, కొత్త అవకాశాలపై దృష్టిసారించాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. చదవండి: టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’ -
ఆ కారుపై లక్ష వరకు బెనిఫిట్ ఆఫర్స్ !
Nissan Compact SUV Kicks: అమెరికా కంపెనీలు ఇండియా మార్కెట్ నుంచి వైదొలుగుతుండటంతో ఇతర కార్ల తయారీ కంపెనీలు ఇండియాలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా జపాన్ కార్ మేకర్స్ కంపెనీ నిస్సాన్ సరికొత్త బెనిఫిట్ ఆఫర్స్తో ముందుకు వచ్చింది. కాంపాక్ట్ ఎస్యూవీ స్టో అండ్ స్టడీ అండ్ విన్ ది రేస్ అనే నానుడి నిజం చేస్తోంది నిస్సాన్ ఆటో. అమ్మకాల పరంగా మెరుపులు లేకపోయినా నిస్సాన్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో నిలదొక్కుకుంటోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఆకర్షణీయమై మోడళ్లను రిలీజ్ చేస్తోంది. ఆ ఒరవడిలో కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో కిక్స్ను రిలీజ్ చేసింది. తాజాగా ఈ మోడల్ ప్రమోషన్లో భాగంగా పలు బెనిఫిట్ ఆఫర్స్ ప్రకటించింది. సెప్టెంబరు 30 వరకు కొనుగోలు చేసే కార్లపై ఈ బెనిఫిట్ ఆఫర్ వర్తిస్తుంది. కిక్స్ ఫీచర్స్ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రెల్ ఇంజన్తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో వేరియంట్ 154 బీహెచ్పీతో 254 ఎన్ఎమ్ టార్క్ని రిలీజ్ చేస్తుంది. రెండో వేరియంట్ అయిన 1.5 లీటర్ వేరియంట్ 105 బీహెచ్పీతో 142 ఎన్ఎం టార్క్ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్లో లభిస్తున్నాయి. కిక్స్ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్ తెలిపింది. బెనిఫిట్ ఆఫర్స్ ఇలా 1.3 లీటర్ టర్బో వేరియంట్పై - క్యాష్ బెనిఫిట్ రూ. 15,000 - ఆన్లైన్ బుకింగ్ బోనస్ రూ. 5,000 - ఎక్సేంజీ బోనస్ రూ.70,000 - సెలక్ట్ కార్పోరేట్ బెనిఫిట్స్ రూ. 10,000 - స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.99 శాతం 1.5 లీటర్ వేరియంట్పై - క్యాష్ బెనిఫిట్ రూ. 10,000 - ఆన్లైన్ బుకింగ్ బోనస్ రూ. 5,000 - ఎక్సేంజీ బోనస్ రూ.20,000 - సెలక్ట్ కార్పోరేట్ బెనిఫిట్స్ రూ. 10,000 - స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.99 శాతం చదవండి : సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
మార్కెట్లోకి మరో ఎస్యువి లాంచ్ చేసిన కియా ఇండియా
ఆటోమొబైల్ మార్కెట్లో రోజుకొక కొత్త కారు విడుదల అవుతుంది. తాజాగా కియా ఇండియా దేశంలో మధ్య తరహా కియా సెల్టోస్ ఎస్యువి కారును విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.17.79 లక్షలుగా ఉంది. ఈ మోడల్ మ్యాట్ గ్రాఫైట్ కలర్, 18 అంగుళాల క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్, లెదర్ ఎట్ అప్ హోల్ స్ట్రీతో ఇతర ఫీచర్లతో వస్తుంది. సెల్టోస్ ఎక్స్ లైన్ ప్రత్యేకంగా జీ1.4 టీ-జీడీఐ 7 డీసీటీ, డీ1.5 6 ఎటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్లతో అందుబాటులో ఉంటుందని కియా ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. పెట్రోల్ ఎక్స్ లైన్ 7 డీసీటీ ట్రిమ్ ధర రూ.17.79 లక్షలు కాగా, డీజిల్ ఎక్స్ లైన్ 6 ఏటీ వేరియంట్ ధర రూ.18.10 లక్షలుగా ఉంది. కియా సెల్టోస్ ఎక్స్ లైన్ 1.4-లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ సీఆర్ డీఐ విజీటీ డీజిల్ మోటార్ వేరియంట్ అందుబాటులో ఉన్నాయి. రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో 2,00,000 యూనిట్ల అమ్మకాలు, 40 శాతానికి పైగా సెగ్మెంట్ వాటాను ఇది కలిగి ఉంది. సెల్టోస్ ప్రారంభించినప్పటి నుండి దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా ఉంది.(చదవండి: Amazon: రైతులకు టెక్నికల్గా సాయం) -
కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్కే జై కొడుతున్నారు
దేశంలో కార్ల వినియోగం రోజోరోజుకు పెరిగిపోతుంది. ఆకట్టుకునే ఫీచర్లు, టెక్నాలజీతో పాటు రకరకాల మోడళ్లతో వాహన దారుల్ని కనువిందు చేస్తున్నాయి. దీంతో వాహన దారులు సరసమైన ధరల్లో తమకు కావాల్సిన కార్లను సొంతం చేసుకునేందుకు వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా సన్ రూఫ్ ఆప్షన్ ఉన్న ఎస్యూవీ వాహనాలు కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతుండగా..ఆయా ఆటోమొబైల్ సంస్థలు ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)వాహనాల్లో ఈ సన్ రూఫ్ ఫీచర్ తప్పనిసరిగా మారుతోంది. లగ్జరీ టూ బడ్జెట్ కార్లు సన్ రూఫ్..! లాంగ్ డ్రైవ్లో వెదర్ను ఎంజాయ్ చేసేందుకు వెస్ట్రన్ కంట్రీస్కు చెందిన ఆటోమొబైల్ సంస్థలు లగ్జరీ కార్లలో ఈ ఫీచర్ను యాడ్ చేసేవి. ఆ తర్వాత భారత మార్కెట్లో హై ఎండ్ కార్లలో ఈ ఫీచర్ ఉండేది. అయితే గత మూడేళ్లుగా మిడ్ రేంజ్ ఎస్యూవీలలో సన్రూఫ్ ఆప్షన్ను ప్రవేశపెట్టారు. దీంతో ఆ కార్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రానురాను సన్రూఫ్ అనేది కార్లకు తప్పనిసరి ఫీచర్గా మారింది. వాహన తయారీ సంస్థలు సైతం వివిధ బడ్జెట్లలో గ్లాస్ రూఫ్, సన్ రూఫ్, పనోరమిక్ సన్రూఫ్, స్కై రూఫ్ ఆప్షన్లను ప్రవేశపెడుతున్నాయి. అందుకు తగ్గట్టే అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ సన్ రూఫ్ ఆప్షన్ ఒక భాగమైంది. ఎస్ యూవీ వాహనాల్లో ఈ సన్ రూఫ్ ఫీచర్ ఉండడంతో సేల్స్ పెరిగిపోతున్నాయని ఆటో మొబైల్ రీసెర్చ్ సంస్థ 'జాటో' తెలిపింది. సర్వేలు ఏం చెబుతున్నాయి సన్రూఫ్ ఫీచర్కి సంబంధించి 2019తో ఇప్పటి పరిస్థితులను పోల్చితే .. సన్రూఫ్ ఆప్షన్ ఉన్న కార్ల అమ్మకాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్టు జాటో తెలిపింది. ఈ ఫీచర్ ఉండటం వల్ల కారు ప్రయాణంలో కొత్త రకం అనుభూతిని పొందడంతో పాటు ... కారు శుభ్రంగా ఉండడమే కాకుండా, శబ్ధ కాలుష్యం నుంచి దూరంగా ఉండొచ్చనే అభిప్రాయం వినియోగదారుల్లో పెరిగింది. -
టాటా మోటార్స్ నుంచి మైక్రో ఎస్యూవీ
ఆటోమొబైల్ రంగంలో నంబర్ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తోన్న టాటా మోటార్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఎస్యూవీకి డిమాండ్ ఇండియన్ మార్కెట్లో గత కొంత కాలంగా ఎస్యూవీ వెహికల్స్కి డిమాండ్ పెరుగుతోంది. సెడాన్లకు ధీటుగా ఎస్యూవీ వెహికల్స్ అమ్మకాలు సాగుతున్నారు. ఎలాంటి రోడ్లపైనా అయినా ప్రయాణం చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైలింగ్ డిఫరెంట్గా ఉండటమే ఇందుకు కారణం. పోటీలో టాటా టాటా నుంచి ఎంట్రీ లెవల్ ఎస్యూవీగా నెక్సాన్ కారు ఉంది. అయితే దీని సగటు ధర పది లక్షలకు దగ్గర ఉంది. ఇంత కంటే తక్కువ ధరలో మరిన్నీ ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎస్యూవీ అందించేందుకు టాటా సిద్ధమైంది. మైక్రో ఎస్యూవీ పేరుతో టాటా హెచ్బీఎక్స్ను మార్కెట్లోకి తేనుంది. ఈ మైక్రో ఎస్యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఇప్పటికే ఈ మైక్రో ఎస్యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఎంట్రీ లెవల్లో పోటీ టాటాలో టాప్ ఎండ్ ఎస్యూవీగా ఉన్న హారియర్, సఫారీ తరహా ఎక్స్టీరియర్, ఆల్ట్రోజ్ తరహా ఇంటీరియర్తో హెచ్బీఎక్స్ ఉండవచ్చని అంచనా. టియాగోలో ఉపయోగించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చతారని సమచారం. మొత్తంగా కారు తయారీకి సంబంధించి ఆల్ఫా ఆర్కిటెక్చర్ మోడల్ ఆధారంగా ఈ కారు రూపుదిద్దుకుంటోంది. మారుతి ఇగ్నీస్, మహీంద్రా కేయూ 100లతో పాటు త్వరలో మార్కెట్లోకి రాబోతున్న హ్యుందాయ్ క్యాస్పర్లకు టాటా హెచ్బీఎక్స్ పోటీ విసరనుంది. It's Showtime! The most awaited SUV now has a name. Stay tuned.#TataMotors #HBX #ComingSoon pic.twitter.com/tI0bZL5ngI — Tata Motors Cars (@TataMotors_Cars) August 21, 2021 చదవండి: Hyderabad: ఐటీ కంపెనీల నయా ట్రెండ్..! -
ఎస్యువి కార్ల కోసం మహీంద్రా సరికొత్త లోగో
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సోమవారం(ఆగస్టు 9) ఇండియా ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోలో తన అన్ని ఎస్యువి కార్ల కోసం కొత్త లోగోను ఆవిష్కరించింది. రాబోయే మహీంద్రా ఎక్స్యువి 700 కారు ఈ లోగోతో రానున్న మొట్ట మొదటి ఎస్యువి అవుతుంది. దేశంలో తన ఎస్యువిల కోసం తీసుకొస్తున్న లోగోను చూస్తే 'ఎక్స్ ప్లోర్ ది ఇంపాజిబుల్' అనే బ్రాండ్ స్టేట్ మెంట్ ను అండర్ లైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ లోగో కొత్త సవాళ్లను స్వీకరించే ఆశయం & సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. "ఇది కొత్త లోగో మాత్రమే కాదు, మహీంద్రాలో పునరుజ్జీవం పొందిన స్ఫూర్తికి ప్రాతినిధ్యం" అని ఎంఅండ్ఎమ్ లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ వీజయ్ నక్రా అన్నారు. లాంఛ్ చేయడానికి సిద్దంగా ఉన్న ఎక్స్యువి 700పై ఇప్పుడు అందరి దృష్టి ఉంటుంది. త్వరలో రాబోయే ఎక్స్యువి 700 మీద సరికొత్త లోగో డిజైన్ ఉంటుంది. "లోగో మార్పు వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే మీరు కోరుకున్న చోటుకు వెళ్ళవచ్చు, మీరు కోరుకున్నప్పుడు పూర్తి భద్రతతో సరికొత్త ప్రపంచానికి వెళ్లడం" అని ఎంఅండ్ఎం లిమిటెడ్ లో ఇవిపీ, చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ అన్నారు. -
ఫీచర్స్ అదిరే, టాటా మోటార్స్ నుంచి న్యూ మోడల్ కార్
ముంబై: టాటా మోటార్స్ తన టియాగో శ్రేణిలో ‘‘టియాగో ఎన్ఆర్జీ’’ పేరుతో కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్షోరూం వద్ద ప్రారంభ ధర రూ.6.57 లక్షలుగా ఉంది. ఎస్యూవీ తరహాలో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద టైర్లు, విశాలమైన, ధృడమైన బాడీ క్లాడింగ్, రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్మిషన్ వెర్షన్లలో లభిస్తుంది. పుష్ బటన్ స్టార్ట్, రేర్ పార్కింగ్ కెమెరా, ఆటోఫోల్డ్ ఓఆర్వీఎం, బ్లాక్ ఇంటీరియన్స్, ఏబీఎస్ ఈబీడీ బ్రేకింగ్ వ్యవస్థ, రేర్ వైపర్ వంటి అధునాతన సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అత్యుత్తమ భద్రత ప్రమాణాలను కలిగి ఉంది. టియాగోలానే కొత్త కారు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుందని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా ఆశాభావం వ్యక్తంచేశారు. -
Jeep: జీప్ నుంచి మరో ఎస్యూవీ..త్వరలోనే రిలీజ్..!
ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు జీప్ మరో ఎస్యూవీను మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లోకి 3 రోస్ ఎస్యూవీను ఈ సంవత్సరం చివర్లో లేదా 2022 ప్రారంభంలో జీప్ విడుదల చేయనుంది. ఈ ఎస్యూవీను ‘మెరిడియన్’ పేరుతో భవిష్యత్తులో జీప్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మోడల్ ప్రస్తుతం స్పాట్ టెస్టింగ్ పరీక్షలను ఎదుర్కొంటుంది. #Jeep has registered a new trademark for the name ‘Meridian’ in India, hinting at the possibility of a new name for the brand’s upcoming 3-row SUV. The model recently spotted testing is expected to be launched later this year or in early 2022.https://t.co/b8ysFe7wMt#CWNews pic.twitter.com/jUjv8ShykY — CarWale (@CarWale) July 8, 2021 -
కాస్ట్లీ కారు బుక్ చేసిన పవన్ కల్యాణ్, ధర ఎంతంటే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహార వీరమల్లు సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ను జరుపుకుంటోంది. దీనితో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ మూవీకి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా పవన్ ఓ లగ్జరీ కారు బుక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రేంజ్ రోవర్ ఎస్యూవీ 3.0 మోడల్ కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీని ఖరీదు రూ. 4 కోట్ల రూపాయలు ఉంటుందని టాక్. కాగా కొద్దిమంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉండే ఈ రేంజ్రోవర్ కారు దేశంలోనే అంత్యంత విలువైనది. 4 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ మోడల్ను పవన్ తన పేరు మీద బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడు సింపుల్గా ఉండే పవన్ ఇంతటి విలువైన కారును కొనుగోలు చేయడంతో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కాగా పవన్ ప్రస్తుతం ఇటూ సినిమాలు అటూ రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో దూర ప్రయణాలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఖరీదైన కారును కొనుగోలు చేస్తున్నారని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. -
హ్యుందాయ్ కొత్త ఎస్యూవీ‘ అల్కజార్’
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీదారు హ్యుందాయ్ సరికొత్త అల్కజార్ మోడల్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రెస్టీజ్, ప్రీమియం, సిగ్నేచర్ వేరియంట్లలో భారతీయ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ అల్కజార్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభించనుంది. ప్రారంభ ధర రూ.16.3లక్షలు కాగా, హై ఎండ్ మోడల్ రూ.20 లక్షలుఎక్స్ షోరూం)గా ఉండనుంది. ఫీచర్ల ఆధారంగా మొత్తం 14 వేర్వేరు వేరియంట్లలో ఇది అందుబాటులోఉంటుంది. హ్యుందాయ్ భారత మార్కెట్లో 25 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ‘అల్కాజార్’ తో ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశిస్తోంది. 25వేల రూపాయలనుచెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు కొత్త అల్కాజార్ డీజిల్ వేరియంట్ ధర 16.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) ,పెట్రోలు వేరియంట్ ధర 16.30లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం. అల్కజార్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 14.5 కిమీ, డీజిల్ వెర్షన్ లీటరుకు 20.4 కిమీ మైలేజీ ఇస్తుంది. 2.0-లీటర్ పెట్రోల్ ఎంపిఐ ఇంజన్ 9.5 సెకన్లలో గంటకు 100 కిమీ వేగం అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఇస్తుందని హ్యుందాయ్ వెల్లడించింది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ (ఆప్షనల్) ట్రాన్స్ మిషన్ లతో లభ్యమవుతాయి. హ్యుందాయ్ అల్కజార్ ఎస్యూవీ ప్రధానంగా టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్ యూవీ-700, ఎంజీ హెక్టర్ ప్లస్ లకు గట్టి పోటీగా నిలవనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. హ్యుందాయ్ 10.25-అంగుళాల మల్టీ డిస్ప్లే డిజిటల్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే బోస్ సౌండ్ సిస్టమ్ (8 స్పీకర్లు),ఏక్యూఐ డిస్ప్లేతో ఆటో హెల్తీ ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్-ఎనేబుల్డ్ స్మార్ట్ పనోరమిక్ సన్రూఫ్, టంబుల్ సీట్లు (కెప్టెన్ & 60:40 స్ప్లిట్ సీట్లు), డ్రైవ్ మోడ్ సెలెక్ట్ (కంఫర్ట్ | ఎకో | స్పోర్ట్), ట్రాక్షన్ కంట్రోల్ మోడ్లు (మంచు | ఇసుక | మట్టి ), ప్రధాన ఆకర్షణలు. -
ఆడి నుంచి ఈ - ట్రోన్ ఎస్యూవీ
వెబ్డెస్క్ : లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి నుంచి ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లోకి రానుంది. ఈ ట్రోన్ పేరుతో తొలి ఎస్యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇండియలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్కి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో క్రమంగా అన్ని మేజర్ కార్ల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ ట్రోన్ పేరుతో ఎస్యూవీ ఎలక్ట్రిక్ కారుని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది ఆడి సంస్థ. ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 71.4 kWh గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 280 కి,మీ నుంచి 340 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర ఎంతనేది ఇంకా కంపెనీ నిర్ణయించలేదు. 6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. గరిష్ట వేగం 190 కిలోమీటర్లుగా ఉంది. ఈ ట్రోన్ కారుని న్యూ ఏజ్ లగ్జరీ ఎస్యూవీగా ఆడి పేర్కొంటోంది. ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియెంట్ లైటింగ్, పనోరమిక్ సన్రూఫ్ తదితర ఫీచర్ల ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ EQC, జాగ్వర్ ఐ పేస్ కార్లకు పోటీగా ఆడి ఈ ట్రోన్ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్కి ఉన్న డిమాండ్ నేపథ్యంలో త్వరలోనే పోర్షే, వోల్వో, లాండ్ రోవర్ సంస్థలు కూడా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. చదవండి: ఆపిల్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టు మరింత వేగవంతం! -
మహీంద్రా బంపర్, ఈ వాహనంపై రూ.2.2లక్షల క్యాష్ ఆఫర్
మహమ్మారి కారణంగా రవాణా రంగం పూర్తిగా స్తంభించి పోయింది. అయితే కరోనా వైరస్ తగ్గి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆన్ లాక్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు కార్ల కంపెనీలు భారీ ఆఫర్లను, డిస్కౌంట్ లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ కార్ల సంస్థ మహీంద్రా పలు వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చదవండి : Mahindra : మహీంద్ర బంపర్ ఆఫర్ మహీంద్రా బొలేరో క్యాష్ ఆఫర్: రూ3,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ.10,000 వరకు కార్పొరేట్ ఆఫర్: రూ. 3,000 వరకు మహీంద్రా స్కార్పియో ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్: రూ. 4,500 వరకు విలువైన ఉచిత ఎక్విప్ మెంట్రూ.17,042 వరకు మహీంద్రా మరాజో క్యాష్ ఆఫర్: రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్:రూ. 15,000 వరకు కార్పొరేట్ ఆఫర్:రూ. 5,200 వరకు మహీంద్రా ఎక్స్యూవీ 300 క్యాష్ ఆఫర్: రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ. 25,000 వరకు కార్పొరేట్ ఆఫర్:రూ.4,000 వరకు విలువైన ఉచిత ఉపకరణాలు: రూ.10,000 వరకు మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి క్యాష్ ఆఫర్: రూ. 38,055 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్:రూ. 20,000 వరకు కార్పొరేట్ ఆఫర్: రూ. 3,000 వరకు మహీంద్రా ఎక్స్యూవీ 500 క్యాష్ ఆఫర్:రూ. 51,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్: ₹ 50,000 వరకు కార్పొరేట్ ఆఫర్: రూ.6,500 వరకు విలువైన ఉచిత ఉపకరణాలు: ₹ 15,000 వరకు మహీంద్రా అల్టురాస్ జి 4 క్యాష్ ఆఫర్: రూ.2.2 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ. 50,000 వరకు కార్పొరేట్ ఆఫర్:రూ.11,500 వరకు ఫ్రీ ఎక్విప్ మెంట్ : రూ. 20,000 వరకు. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే లభిస్తాయి. ప్రాంతాల్ని బట్టి ఆఫర్లు మారతాయని మహీంద్రా ప్రతినిధులు తెలిపారు. -
అదిరే అల్కాజర్, సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో సందడి
కరోనా కారణంగా కొత్త కార్ల తయారీ, విడుదల ఆగిపోయింది. అయితే పరిస్థితులు అదుపులోకి రావడంతో కొత్త కొత్త కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ 7 సీట్ల సామర్థ్యంతో ప్రీమియం ఎస్యూవీ- 'అల్కాజర్ వచ్చే వారం మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ కార్ను ప్రీ ఆర్డర్ కోసం హ్యుందాయ్ ప్రతినిధులు అందుబాటలోకి తెచ్చారు. రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ మరియు రెండు ఇంజన్ ఆప్షన్లతో ఈ కార్ రాబోయే హ్యుందాయ్ ఎస్యూవీ టాటా సఫారి వంటి కార్లతో పోటీ పడుతుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే కొత్త అల్కాజర్ ఎస్యూవీని ఎన్ని ట్రిమ్ లెవల్లో అందిస్తుందో హ్యుందాయ్ ఇండియా ధృవీకరించలేదు. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. హ్యుందాయ్ ఎస్యూవీ సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (ఓ), ప్లాటినం మరియు ప్లాటినం (ఓ) అనే మొత్తం ఆరు ట్రిమ్ లెవల్స్ అందుబాటులో ఉంచవచ్చని తెలుస్తోంది. హ్యుందాయ్ అల్కాజర్ యొక్క సెగ్మెంట్ వీల్బేస్ 2,760 మి.మీటర్లుగా ఉంది. దీంతో పాటు.. • 10.25 అంగుళాల మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే • 8స్పీకర్లతో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం • AQI డిస్ప్లేతో ఎయిర్ ప్యూరిఫైయర్ • సీట్ల ముందు భాగంగా వాటర్ బాటిల్, బుక్స్ పెట్టుకునేలా సెట్ బ్యాక్ టేబుల్ • వాయిస్-ఎనేబుల్డ్ స్మార్ట్ పనోరమిక్ సన్రూఫ్ • మంచు, ఇసుక వంటి ప్రదేశాల్లో కార్ ను కంట్రోల్ చేసే ట్రాక్షన్ కంట్రోల్ మోడేస్ • హ్యుందాయ్ బ్లూ లింక్ కనెక్ట్ చేసిన కార్ సిస్టమ్ • యాంబెంట్ వేరియంట్స్ 64రంగుల కలర్స్ తో లైంటింగ్ • హ్యుందాయ్ బ్లూ లింక్ కనెక్ట్ చేసిన కార్ సిస్టమ్ హ్యుందాయ్ అల్కాజర్ ఇంజిన్ వివరాలు రాబోయే హ్యుందాయ్ అల్కాజర్ ఎస్యూవీకి ఒక పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజిన్లను డిజైన్ చేశారు. పెట్రోల్ మోటారు 2.0-లీటర్ ఎంపిఐ యూనిట్ ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 157 బిహెచ్పి మరియు 191 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరొకటి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. ఇది బెల్ట్లు 113 బిహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ మరియు ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో రెండు ఇంజిన్లను రెండు ట్రాన్స్మిషన్లతో హ్యుందాయ్ అల్కాజర్ మార్కెట్లో సందడి చేస్తోంది. చదవండి : సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ను రూపొందించిన విద్యార్థులు -
బెంట్లీ లగ్జరీ కారు నయా వర్షన్.. రేటు ఎంతంటే?
న్యూఢిల్లీ: బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ బెంట్లీ మోటార్స్ మంగళవారం దేశీయ మార్కెట్లోకి బెంటేగా కొత్త వెర్షన్ రిలీజ్ చేసింది. బెంట్లీ నుంచి వచ్చిన మొదటి సూపర్ యూటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) బెంటెగా కావడం విశేషం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బెంట్లీ లగ్జరీ ఎస్యూవీ కారు. 2015లో ఈ కారును లాంచ్ చేయగా, ప్రస్తుతం ఈ బెంటేగా ఎస్యూవీ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను విడుదల చేసింది. దీని ఎక్స్షోరూమ్ (ఢిల్లీ) ధర రూ .4.10 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. బెంట్లీ కంపెనీ న్యూ బియాండ్ 100 బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా రూపొందించారు. ఈ ఎస్యూవీ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్తో రానుంది. 10.9 అంగుళాల స్క్రీన్, సూపర్-హై-రిజల్యూషన్ గ్రాఫిక్స్ కలిగిన నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో పాటు హైకనెక్టివిటీతో పనిచేస్తుందని ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. కొత్త బెంటేగా వర్షన్ను భారతీయ కస్టమర్లకు ముందుకు తీసుకురావటం సంతోషంగా ఉందని అధికారిక బెంట్లీ మోటార్స్ డీలర్షిప్ ఎక్స్క్లూజివ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాగ్లా తెలిపారు. బెంట్లీ 100 సంవత్సరాలకు పైగా ఆటోమోటివ్ లగ్జరీ కార్ల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. ఈ సరికొత్త డిజైన్తో వెనుక భాగం లెగ్రూమ్ ఎక్కువగా పెరిగింది. ఫ్రంట్ అండ్ రియర్ కొత్త డిజైన్లు బెంట్లీ డీఎన్ఎను కొనసాగిస్తోంది. కొత్త బెంటెగాలో ఎంబెడెడ్ సిమ్ను ఉపయోగించడంతో మై బెంట్లీ కనెక్ట్ సేవలను ఈజీగా పొందవచ్చు. అలాగే పాత వర్షన్లో ఉన్న వైర్లెస్ ఆపిల్తో పాటుగా ఆండ్రాయిడ్ ఆటోతో కూడా రానుంది. (చదవండి: ఆల్న్యూ క్రెటా అమ్మకాల జోరు) -
కొత్త దారిని ఎంచుకున్నందుకు...
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో ఆరుగురు కొత్త కుర్రాళ్లు కీలకపాత్ర పోషించారు. సిరాజ్, శుబ్మన్ గిల్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్లు ఇదే సిరీస్లో అరంగేట్రం చేయగా, శార్దుల్ ఠాకూర్కు కూడా బ్రిస్బేన్ మ్యాచ్ దాదాపు తొలి టెస్టులాంటిదే. వీరి ప్రదర్శనను అభినందిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన తరఫు నుంచి ప్రత్యేకంగా జీప్లను కానుకలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రికెటర్లకు కొత్త మోడల్ ‘థార్–ఎస్యూవీ’లు అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రూ. 13 లక్షలు విలువ చేసే థార్–ఎస్యూవీ జీప్ను మహీంద్రా సంస్థ నుంచి కాకుండా తన సొంత డబ్బులతో వీటిని ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ‘భవిష్యత్తులో భారత యువకులు పెద్ద కలలు కనవచ్చని, అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించవచ్చనే నమ్మకాన్ని వీరు కలిగించారు. ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లగలిగిన వీరి విజయ గాథల్లో ఎంతో వాస్తవం ఉంది. జీవితంలో అన్ని రంగాలకు ఇవి స్ఫూర్తినందిస్తాయి. ఈ ఆరుగురికి కంపెనీ సొమ్ము నుంచి కాకుండా నా సొంత డబ్బులతో కొత్త థార్ ఎస్యూవీ వాహనాలను కానుకగా అందించడం పట్ల ఎంతో ఆనందిస్తున్నా. వీరంతా తమపై తాము ఎంతో నమ్మకముంచి నలుగురు నడిచిన దారిలో కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకొనే సాహసం చేయడమే నేను బహుమతి ఇవ్వడానికి కారణం. వీరికి నా అభినందనలు. వీలైనంత తొందరగా తగిన ప్రాధాన్యత ఇస్తూ వారికి ‘థార్’లు అందజేయమని మహీంద్రా కంపెనీకి విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ ఆనంద్ ట్వీట్ చేశారు. -
క్రికెటర్లకు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్
ఆస్ట్రేలియాలో అదరగొట్టిన క్రికెటర్లకు కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా క్రికెటర్లకు ఊహించని బహుమతి లభించనుంది. ప్రతిభ గల వారిని ఎప్పుడూ ప్రోత్సహించే వారిలో మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ముందుంటారు. టెస్ట్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేసిన ఆరు మంద్రి క్రికెటర్లకు మహేంద్ర ఎస్యూవీ వాహనాలు అందిస్తానని ప్రకటించారు. అది కూడా తన వ్యక్తిగత ఖాతా నుంచి అందిస్తానని ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా టెస్ట్ (బోర్డర్ గావస్కర్ సిరీస్)తో అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, నవ్దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్లకు తమ కంపెనీకి చెందిన థార్ ఎస్యూవీ కార్లను బహుమతిగా ఇస్తానని శనివారం ఆనంద్ మహేంద్ర ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ ఆరుగురు తమ జీవితాల్లో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేలా భారతీయులకు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర ప్రశంసించారు. Six young men made their debuts in the recent historic series #INDvAUS (Shardul’s 1 earlier appearance was short-lived due to injury)They’ve made it possible for future generations of youth in India to dream & Explore the Impossible (1/3) pic.twitter.com/XHV7sg5ebr — anand mahindra (@anandmahindra) January 23, 2021 -
4.71 లక్షల ఎస్యూవీల రీకాల్
న్యూయార్క్: గత సెప్టెంబర్లో యూఎస్లో ప్రారంభించిన హ్యుండాయ్ టస్కన్ ఎస్యూవీల రీకాల్ను కొనసాగిస్తున్నట్లు దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ తాజాగా వెల్లడించింది. యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్ కలిగిన కార్ల కంప్యూటర్లలో అంతర్గతంగా సమస్యలు ఎదురవుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లకు అవకాశమేర్పడుతున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా 2016-2018 మధ్య తయారైన కొన్ని మోడళ్లలో ఈ సమస్యలు కనిపిస్తున్నట్లు వివరించింది. దీంతో అగ్రిప్రమాదానికి అవకాశముంటుందని తెలియజేసింది. వీటికి జతగా 2020-21 మోడళ్లను సైతం రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే హ్యుండాయ్కు చెందిన స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగిన టస్కన్ వాహనాలను వెనక్కి పిలవడం లేదని పేర్కొంది. యూఎస్లో 2020 సెప్టెంబర్లో ప్రారంభించిన కార్ల రీకాల్లో భాగంగా మరో 4.71 లక్షల ఎస్యూవీలకు రిపేర్ సర్వీసులు అందించనున్నట్లు తెలియజేసింది. రిపేర్లు పూర్తయ్యేవరకూ కార్లను బయటే పార్క్ చేయవలసిందిగా ఈ సందర్భంగా యజమానులకు సూచించింది. చదవండి: (ఇక భారత్లోనూ ఎలక్ట్రిక్ కార్ల హవా) సమస్యపై దర్యాప్తు ఎస్యూవీలలో ఎదురవుతున్న సమస్యలపై కొనసాగిస్తున్న దర్యాప్తులో భాగంగా తాజా రీకాల్ను చేపట్టినట్లు హ్యుండాయ్ యూఎస్ వెల్లడించింది. కొన్ని కార్లలో అగ్రిప్రమాదాలు జరగడంతో రిపేర్కు సన్నాహాలు చేసినట్లు పేర్కొంది. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలియజేసింది. ఫిబ్రవరి చివరికల్లా యజమానుల జాబితాను సిద్ధం చేయగలమని వెల్లడించింది. తద్వారా యజమానులు డీలర్ల దగ్గరకు కార్లను తీసుకుని వెళితే కంప్యూటర్లలో ఫ్యూజు మార్పిడిని చేపడతారని తెలియజేసింది. నిజానికి సెప్టెంబర్లో ఇదే సమస్యతో 2019-21 మధ్య కాలంలో తయారైన 1.8 లక్షల టస్కన్ ఎస్యూవీలను యూఎస్లో రీకాల్ చేసింది. తుప్పు కారణంగా రక్షణాత్మక యాంటీలాక్ బ్రేక్ సర్క్యూట్ బోర్డులలో షార్ట్ సర్క్యూట్లకు వీలు ఏర్పడుతున్నట్లు వివరించింది. ఇంజిన్లు ఆఫ్చేసి ఉన్నప్పటికీ ఈ సమస్య ఎదురయ్యే వీలున్నట్లు పేర్కొంది. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) -
భారత్లోకి కొత్త కంపాస్ ఫేస్లిఫ్ట్ ఎస్యూవీ
న్యూఢిల్లీ: అమెరికన్ కార్ బ్రాండ్ జీప్ తన కంపాస్ ఫేస్లిఫ్ట్ ఎస్యూవీని 2017 తర్వాత తిరిగి భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త ఫేస్లిఫ్ట్ ఎస్యూవీ 2020 గ్వాంగ్జౌ ఆటో షోలో ఆవిష్కరించబడిన ఎస్యూవీ మాదిరిగానే ఉంటుంది. జనవరి 2021 చివరి నాటికి ఈ కారు యొక్క టెస్ట్ డ్రైవ్ కూడా ప్రారంభించబడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎస్యూవీల కంటే తక్కువ ధరకే లభిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. ఇందులో గత మోడల్ కంటే అప్డేటెడ్ ఫీచర్స్, అప్డేటెడ్ ఇంటీరియర్స్, రిఫ్రెష్ స్టైలింగ్ ను కలిగి ఉంది. కంపెనీ ఈ ఎస్యూవీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది.(చదవండి: ఫార్చూనర్ కొత్త వెర్షన్...) కంపాస్ ఫేస్లిఫ్ట్ ఎస్యూవీలో ఫుల్-ఎల్ఈడి హెడ్లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్ఇడి టైల్లైట్స్, 7 స్లాట్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్తో కొత్త ఫ్రంట్ బంపర్ మరియు కొత్త ఫాగ్ లైట్ హౌసింగ్ ఉన్నాయి. ఫ్రంట్, రియర్ బంపర్స్ రెండూ కూడా సవరించబడ్డాయి. కొత్త డాష్బోర్డ్లో 10.1-అంగుళాల టచ్స్క్రీన్ కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత ఎఫ్సిఎ యొక్క కొత్త యుకనెక్ట్ 5 టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ఎస్యూవీ యొక్క వెనుక భాగంలో పెద్దగా ఎటువంటి మార్పులు జరగలేదు. కొత్త జీప్ కంపాస్లో ఏడు-ఎయిర్బ్యాగులు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్పి), బ్రేక్ అసిస్ట్ (బిఎ), టెర్రైన్ మోడ్లు, హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ ఉన్నాయి. ఫేస్లిఫ్ట్ యొక్క డాష్బోర్డ్లో డబుల్-స్టిచ్చింగ్ బ్రౌన్ లెదర్ ఇన్సర్ట్లను మరియు బ్రష్ చేసిన అల్యూమినియం లాంటి ట్రిమ్ను కూడా పొందుతుంది. (చదవండి: కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!) -
కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!
చెన్నై, సాక్షి: జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల సొంత వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీనికితోడు దశాబ్ద కాలపు కనిష్టాలకు వడ్డీ రేట్లు చేరడం వాహన కొనుగోలుదారులకు ప్రోత్సాహాన్నిస్తోంది. అయితే ఇదే సమయంలో ఆటో రంగ కంపెనీలు నిర్వహణను మెరుగుపరిచేందుకు తాత్కాలికంగా ప్లాంట్లను నిలిపివేయడం, మరికొన్ని కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు వాహన సరఫరాలకు అంతరాయాలను కల్పిస్తున్నట్లు ఆటో రంగ నిపుణులు వివరించారు. దీంతో ప్రధానంగా కొన్ని కార్ల కంపెనీలు డిమాండుకు తగిన సరఫరాలు చేయలేకపోతున్నట్లు తెలియజేశారు. వెరసి అధిక డిమాండ్ కలిగిన మోడళ్లలో కొత్త కారును కొనుగోలు చేయాలంటే వినియోగదారులు కనీసం 30 రోజుల నుంచి 10 నెలల వరకూ వేచిచూడవలసిన పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) చిన్న కార్లు, ఎస్యూవీలు సైతం కొంతకాలంగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనా(ఎస్యూవీ)లకే కాకుండా చిన్న కార్లకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. దీంతో ప్రాచుర్యం పొందిన ఎస్యూవీలతోపాటు.. ఆటో దిగ్గజం మారుతీ తయారీ చిన్న కార్లకు సైతం వెయిటింగ్ పిరియడ్ నడుస్తున్నట్లు చెప్పారు. ఉదాహరణగా మారుతీ తయారీ ఆల్టో, వేగన్-ఆర్, స్విఫ్ట్తోపాటు.. హ్యుండాయ్ తయారీ ఐ20, వెర్నా తదితర కార్ల కొనుగోలు కోసం 1-10 నెలల సమయం వేచిచూడవలసి వస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి సామర్థ్యంతో నిజానికి గత అక్టోబర్ నుంచీ మారుతీ సుజుకీ ప్లాంట్లు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఆటో నిపుణులు తెలియజేశారు. అయినప్పటికీ స్విఫ్ట్, ఆల్టో, వేగన్-ఆర్ మోడళ్ల కార్లను సొంతం చేసుకునేందుకు కనీసం 3-4 వారాలు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇక ఎర్టిగా మోడల్ డెలివరీకి 6-8 వారాలు వేచిచూడవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల మారుతీ నిర్వహణాసంబంధ కార్యక్రమాల కోసం ప్లాంట్లను వారం రోజులపాటు మూసివేసింది. ఇక హ్యూండాయ్ క్రెటా తదితర ప్రధాన మోడళ్ల తయారీని పెంచే సన్నాహాల్లో ఉంది. క్రెటా రోజువారీ తయారీ సామర్థ్యాన్ని గత ఆరు నెలల్లో 340 యూనిట్ల నుంచి 640 యూనిట్లకు పెంచినట్లు హ్యుండాయ్ తెలియజేసింది. ఈ బాటలో వెన్యూ, వెర్నా తయారీని పెంచుతున్నట్లు పేర్కొంది. ఇక 2-3 నెలల వెయిటింగ్ ఉంటున్న ఐ20 మోడల్ కార్ల తయారీని ఇటీవల నెలకు 9,000 నుంచి 12,000 యూనిట్లకు పెంచినట్లు వెల్లడించింది. వెర్నా మోడల్ కార్లను 40 శాతం వరకూ ఎగుమతి చేస్తున్నట్లు తెలియజేసింది. ఎంఅండ్ఎం సైతం ఇటీవల భారీగా పెరిగిన డిమాండుకు అనుగుణంగా నాసిక్లో వాహన ఉత్సాదక సామర్థ్యాన్ని పెంచినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలియజేసింది. దీంతో నెలకు 2,000 యూనిట్ల తయారీ నుంచి ప్రస్తుతం 3,500 యూనిట్లవరకూ పెరిగినట్లు వెల్లడించింది. ఎంఅండ్ఎం ఇటీవలే విడుదల చేసిన థార్ మోడల్ వాహన డెలివరీకి 20-40 వారాలు పడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఇదేవిధంగా నిస్సాన్ మ్యాగ్నైట్ మోడల్ తయారీని 2700 యూనిట్ల నుంచి నెలకు 4,000 వాహనాలకు పెంచినట్లు పేర్కొంది. కాగా.. మరోపక్క కియా మోటార్స్ ఇంజిన్లు, బంపర్ల సరఫరా సమస్యల కారణంగా సెల్టోస్, సోనెట్ మోడళ్ల డెలివరీకి 2-3 నెలల కాలం పడుతున్నట్లు ఆటో నిపుణులు తెలియజేశారు. కాగా.. డిసెంబర్లో గత దశాబ్ద కాలంలోలేని విధంగా ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 2,76,500 యూనిట్లకు చేరాయి. వార్షిక ప్రాతిపదికన 18 శాతం జంప్చేసినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ కొత్త జీఎల్ఈ ఎల్డబ్ల్యూబీ
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన టాప్ ఎండ్ ఎస్యూవీ ‘జీఎల్ఈ లాంగ్ వీల్బేస్ (ఎల్డబ్ల్యూబీ)’ కారులో కొత్త వేరియంట్లను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జీఎల్ఈ 450 4మ్యాటిక్ ఎల్డబ్ల్యూబీ, జీఎల్ఈ 400 డీ 4మ్యాటిక్ ఎల్డబ్ల్యూబీ పేర్లతో రెండు వేరియంట్లలో వీటిని విడుదలచేసింది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభ్యమౌతున్న ఈ నూతన కార్ల ధరల శ్రేణి రూ. 88.80 లక్షలు – రూ. 89.90 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఇవి కేవలం 5.7 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని, ఎస్యూవీ విభాగంలో జీఎల్ఈ ఎల్డబ్ల్యూబీ కంపెనీకి మూల స్తంభం లాంటిదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. -
సెల్టోస్ ధర పెరిగింది
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్.. ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సెల్టోస్ ఎస్యూవీ కారు ధరలను పెంచింది. మోడల్ ఆధారంగా రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు పెంపుదల ఉంటుందని ప్రకటించింది. గతేడాది అగస్టులో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర అంతక్రితం రూ. 9.69 లక్షలు ఉండగా.. పెంపుదల తర్వాత రూ. 9.89 లక్షలు – 16.29 లక్షలదాకా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇక మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా, రెనో సంస్థలు గతనెల్లోనే కార్ల ధరలను పెంచాయి. -
ఇక్కడ ఎస్యూవీలంటేనే ఇష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూరోపియన్ కార్ల దిగ్గజం ఫోక్స్వ్యాగన్ వచ్చే రెండేళ్లలో కొత్తగా నాలుగు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ను (ఎస్యూవీ) మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుతం టిగువన్ ఎస్యూవీని దేశీయ మార్కెట్లో కంపెనీ విక్రయిస్తోంది. భారతీయులకు ఎస్యూవీలపై మక్కువ ఎక్కువని ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డైరెక్టర్ స్టీఫెన్ న్యాప్ శుక్రవారమిక్కడ చెప్పారు. ఈ విభాగంలో రానున్న రోజుల్లో తమ స్థానాన్ని పదిలపర్చుకుంటామన్నారు. 2020లో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్పోలో నూతన మోడళ్లను ప్రదర్శిస్తామని తెలియజేశారు. కంపెనీ 20వ కార్పొరేట్ బిజినెస్ సెంటర్ను ప్రారంభించేందుకు హైదరాబాద్కు వచి్చన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఫోక్స్వ్యాగన్ కార్లు ఖరీదైనవని కస్టమర్లు అనుకునేవారు. నాలుగేళ్ల వారంటీ, విడిభాగాల ధర 15 శాతం తగ్గించడం ద్వారా ఆ భావన నుంచి బయటపడేలా చేశాం’ అని చెప్పారు. ఎస్యూవీలతోపాటు మరో రెండు కొత్త మోడళ్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. అయిదేళ్లలో 3 శాతం.. ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో ఫోక్స్వ్యాగన్కు 1.4 శాతం వాటా ఉంది. అయిదేళ్లలో 3 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు స్టీఫెన్ చెప్పారు. ‘ఇండియా 2.0 కార్యక్రమంలో భాగంగా 2022 నాటికి రూ.8,000 కోట్లు ఖర్చు చేయాలని గతేడాది నిర్ణయించాం. మోడళ్ల అభివృద్ధి, ఆర్అండ్ డీ కోసం ఈ పెట్టుబడి పెడతాం. పుణే ఆర్అండ్ డీ కేంద్రంలో ప్రస్తుతం 650 మంది ఇంజనీర్లు ఉన్నారు. దీనిని 5,000 స్థాయికి పెంచుతాం. భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్ కోసం ఇక్కడ కార్లను అభివృద్ధి చేస్తాం. బీఎస్–4 వాహనాల తయారీని డిసెంబర్ నుంచి నిలిపేస్తున్నాం. మార్కెట్లో బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనాల ధర డీజిల్ 12– 15 శాతం, పెట్రోల్ 5 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పాత మోడళ్లన్నిటినీ కొనసాగిస్తాం. చార్జింగ్ స్టేషన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాక ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెడతాం’ అని తెలిపారు. -
ఆడికార్లపై కళ్లు చెదిరే ఆఫర్..
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ ఎస్యూవీలపై రూ. 6లక్షల దాకా భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్గా ఈ డిస్కౌంట్ను అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 'లిమిటెడ్ పీరియడ్ సెలబ్రేటరీ ప్రైస్' ఆఫర్లోభాగంగా ఐకానిక్ మోడల్స్పై ఈ తగ్గింపును అందిస్తోంది. ఆడి పోర్ట్ఫోలియో నుండి బాగా ప్రాచుర్యం పొందిన ఈ రెండు మోడళ్లు భారతదేశంలో లాంచ్ చేసి దశాబ్దం పూర్తి కావడంతో, ఆడి కార్లను ప్రేమించే కస్టమర్లకు ప్రత్యేక ధరల బహుమతి ఇవ్వాలనుకుంటున్నామని తెలిపింది. 2009 లో ఇండియాలో లాంచ్ చేసిన పాపులర్ క్యూ 5, క్యూ 7 ఎస్యూవీల ధరలను రూ .6.02 లక్షల వరకు తగ్గించింది. ఆఫర్ కింద, పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలోని ఆడి క్యూ 5 ప్రస్తుత ధర రూ .55.8 లక్షలు. ఆఫర్ కింద రూ .49.99 లక్షలకే లభ్యం. తగ్గింపు రూ. 5.81 లక్షలు క్యూ 7 పెట్రోల్ వెర్షన్ ధర ప్రస్తుతం రూ .73.82 లక్షలతో పోలిస్తే రూ .4.83 తగ్గింపుతో రూ .68.99 లక్షలకు లభ్యం. క్యూ 7 డీజిల్ ఆప్షన్ కారును రూ .71.99 లక్షలకు అందుబాటులో ఉంచింది. అసలు ధర ధర రూ .78.01 లక్షలు. తగ్గింపు రూ .6.02 లక్షలు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, 2009 లో భారతదేశంలో మార్కెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి, క్యూ 5, క్యూ 7 కార్లు బహుళ ప్రజాదరణ పొందాయనీ, ప్రధానంగా ఇండియలో ఆడి బ్రాండ్ విజయానికి ఇవి మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. ఆఫర్ శుక్రవారం ప్రారంభం కాగా స్టాక్ కొనసాగే వరకు కొనసాగుతుందని ఆడి తెలిపింది. -
కొత్త కార్లొస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: దేశీ కార్ల మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడంపై మరిన్ని అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలు కన్నేశాయి. మూడు అంతర్జాతీయ కార్ల కంపెనీలు భారత మార్కెట్లో వాహనాలను ప్రవేశపెట్టబోతున్నాయి. బ్రిటన్ సంస్థ ఎంజీ మోటార్, దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్, ఫ్రెంచ్ దిగ్గజం సిట్రోయెన్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో డజను పైగా మోడల్స్ను ప్రవేశపెట్టేందుకు ఇవి సిద్ధమవుతున్నాయి. తద్వారా ఏటా 30 లక్షల పైచిలుకు కార్లు అమ్ముడయ్యే దేశీ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో వాటా దక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఆటోమొబైల్స్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం.. దేశీయంగా యుటిలిటీ వాహనాల మార్కెట్ 2013–2018 ఆర్థిక సంవత్సరాల మధ్య 11 శాతం మేర వార్షిక వృద్ధి నమోదు చేసింది. ప్యాసింజర్ కార్ల విభాగం సాధించిన 3 శాతం వృద్ధితో పోలిస్తే యుటులిటీ వాహనాల సెగ్మెంట్ వృద్ధి అధిక స్థాయిలో ఉండటం గమనార్హం. ఎంట్రీ సెగ్మెంట్కు దూరం.. కొత్తగా ఎంట్రీ ఇస్తున్న మూడు సంస్థలు ఎంట్రీ సెగ్మెంట్ కార్ల కన్నా అత్యధిక శాతం కస్టమర్లు కొనుగోలు చేసే మాస్ ప్రీమియం సెగ్మెంట్పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కొనుగోలుదారుల మారుతున్న అభిరుచులు, కాలుష్య నియంత్రణ ప్రమాణాలు, భద్రత, ఇంధనం ఆదా తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను (ఎస్యూవీ) ప్రవేశపెట్టబోతున్నాయి. కాస్త ధర ఎక్కువైనా కొంగొత్త ఫీచర్స్ ఉన్న వాహనాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండటంతో.. గడిచిన అయిదేళ్లలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల సగటు ధర సుమారు 6,000 డాలర్ల నుంచి 10,000 డాలర్లకు చేరిందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐహెచ్ఎస్ ఆటోమోటివ్ అంచనా వేసింది. దీనికి తగ్గట్లుగానే కొత్త కార్ల రేట్లు ఉండబోతున్నాయి. ముందుగా ఎంజీ హెక్టార్.. అన్ని కంపెనీల కన్నా ముందుగా ఎంజీ మోటార్ సంస్థ నుంచి హెక్టార్ వాహనం మార్కెట్లోకి రాబోతోంది. దీని ధర సుమారు రూ. 17 లక్షల నుంచి రూ. 20 లక్షల దాకా ఉండనుంది. హ్యుందాయ్ టక్సన్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్యూవీ 500, టాటా హ్యారియర్ వంటి వాహనాలతో ఈ ప్రీమియం ఎస్యూవీ పోటీపడనుంది. ఈ ఏడాది జూన్లో హెక్టార్ అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత ఈ ఏడాది చివరి త్రైమాసికంలో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంజీ ప్రవేశపెట్టనుంది. అటుపైన వచ్చే ఐదేళ్లలో ఏటా ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక కొత్త మోడల్ను ప్రవేశపెట్టనున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా ఈడీ పి. బాలేంద్రన్ వెల్లడించారు. ఎంజీ ఇప్పటికే 45 మంది డీలర్లను ఎంపిక చేసింది. వీటికి 110 ఔట్లెట్స్ నెట్వర్క్ ఉంటుందని బాలేంద్రన్ పేర్కొన్నారు. కార్ల మార్కెట్ కొంత మందగించినా .. ఎస్యూవీ విభాగం మాత్రం వృద్ధి నమోదు చేస్తోందని ఆయన తెలిపారు. కొంగొత్త ఫీచర్స్పరంగా, సేవలపరంగా తమ వాహనాలు విభిన్నంగా ఉంటాయని బాలేంద్రన్ పేర్కొన్నారు. అటు కియా మోటార్స్ ఇండియా కూడా ఎస్యూవీ మార్కెట్పైనే ఎక్కువగా కసరత్తు చేస్తోంది. ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఒక కొత్త మోడల్ను ప్రవేశపెట్టబోతున్నామని సంస్థ మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో కియా మోటార్స్ తొలి ఎస్యూవీని ప్రవేశపెట్టబోతోంది. దీన్ని ఎస్పీ2 కోడ్నేమ్తో వ్యవహరిస్తున్నారు. దీని ధర రూ. 10–16 లక్షల శ్రేణిలో ఉండబోతోంది. హ్యుందాయ్ క్రెటా, హోండా హెచ్ఆర్–వీ తదితర కార్లతో ఇది పోటీపడబోతోంది. సిట్రోయెన్ 2021లో తొలి ఎస్యూవీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఆ తర్వాత ఏటా ఒక కొత్త మోడల్ను ఆవిష్కరించనుంది -
జేఎల్ఆర్ 2 కొత్త వేరియంట్లు
ముంబై: జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇండియా తాజాగా ఎస్యూవీలు రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్లలో అదనపు ఫీచర్లతో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుత మోడళ్ల ధరలోనే ఈ కొత్త వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్ డీజిల్ వేరియంట్ల ధర రూ.99.48– రూ.143 లక్షల శ్రేణిలో, పెట్రోల్ వేరియంట్ల ధర రూ. 110.03–రూ. 196.75 లక్షల శ్రేణిలో ఉంది. అలాగే కంపెనీ తన రేంజ్ రోవర్ డీజిల్ వేరియంట్ల ధరను రూ.174.29– రూ.376.61 లక్షల శ్రేణిలో, పెట్రోల్ వేరియంట్ల ధరను రూ.187.16– రూ.388.16 లక్షల శ్రేణిలో నిర్ణయించింది. రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ 2018 మోడళ్లలో ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్సన్, ట్విన్–స్పీడ్ ట్రాన్స్ఫర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. -
మంచి దొంగ.. లైసెన్స్ ఇచ్చేశాడు..
పూణె : ఒక వస్తువు పోగొట్టుకున్నామంటే తిరిగి పొందడం కష్టం. దొంగతనం జరిగిన తర్వాత ఆ వస్తువులు మళ్లీ సొంతదారులకు చేరడం అనేది కల్లే. ఇక ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటివి పోగొట్టుకుంటే మళ్లీ అప్లై చేయాలంటే కాస్త తలనొప్పి వ్యవహారమే. అయితే దొంగతనం చేసినవారు...ఆ వస్తువుల్ని తిరిగి మనకి పంపిస్తే ఆ ఆనందమే వేరు కదా. పూణెకి చెందిన స్వప్న డేకి అచ్చంగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత నెల 28న తనకు వచ్చిన పార్శిల్ తెరచి చూసిన ఆమె స్వీట్ షాక్కు గురయ్యానని చెప్పారు. అందుకు కారణం పోయిందనుకున్న డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి పొందడమే. ఎంజీ రోడ్డులోని తన బొటిక్ను మూసివేసిన తర్వాత ప్రతీ సాయంత్రం వాకింగ్కు వెళ్లడం స్వప్న డేకు అలవాటు. రోజూ స్కూటర్పై వెళ్లే ఆమెకు కొడుకు ఈ మధ్యనే ఒక ఎస్యూవీ కారును బహుమతిగా ఇచ్చాడు. మార్చి 17 సాయంత్రం కారు పార్క్ చేసి వాకింగ్ ముగించుకుని వచ్చేసరికి కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న పర్సును దుండగుడు చోరీ చేశాడు. అందులో డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు డబ్బులు కూడా ఉన్నాయి. అయితే పర్స్ను కొట్టేసిన దొంగ... బ్రాండెడ్ పర్సును, అందులో ఉన్న రూ. 1500లను తనతో పాటే అట్టిపెట్టుకుని లైసెన్స్ని మాత్రం కొరియర్ చేసి నిజాయితీని చాటుకున్నాడు. దీంతో స్వప్న డేకు మళ్లీ లైసెన్స్ కోసం అప్లై చేయాల్సిన పని తప్పింది. డబ్బులు కొట్టేసినా.. లైసెన్స్ తిరిగి ఇచ్చేశాడు గనుక అతడు మంచి దొంగ అని సంబరపడిపోతున్నారు స్వప్న. -
భారత్కు ఎస్యూవీల కాన్వాయ్
సాక్షి, బిజినెస్ విభాగం : చిన్న కారు సోకు తగ్గిపోతోంది. ఆదాయాలు పెరుగుతుండటంతో ప్రజల చూపు ఎస్యూవీలు, మరింత గ్లామరస్గా ఉండే ఖరీదైన కార్ల వైపు మళ్లుతోంది. ధర, నిర్వహణ వ్యయాలు.. ఈ రెండూ కీలకంగా గతంలో వినియోగదారులు కార్లను కొనుగోళ్లు చేసేవాళ్లు. ఇదిప్పుడు మారుతోంది. ఇంజిన్ కెపాసిటీ, సౌకర్యం, సొగసులకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో చిరకాలంగా చిన్న కార్లకు మంచి మార్కెట్గా ఉన్న భారత్.. ఎస్యూవీ సెగ్మెంట్కు మంచి మార్కెట్గా ఎదగటం మొదలెట్టింది. భారత్లో వాహన మార్కెట్ మెచ్యూర్ అవుతోందనడానికి ఇది మంచి సూచననేది నిపుణుల మాట. ఏడాదికి దాదాపు 40 లక్షల వాహన విక్రయాలతో ప్రపంచంలోనే అయిదవ అతి పెద్ద వాహన మార్కెట్గా అవతరించిన భారత్లో మూడో తరం కొత్త కంపెనీలు రానున్నాయి. 90లలో హ్యుందాయ్, టొయోటా, హోండా మోటార్స్ తొలి తరం కంపెనీలుగా రాగా, 2000లలో ఫోక్స్వ్యాగన్, రెనో, నిస్సాన్ తదితర కంపెనీలొచ్చాయి. ఇప్పుడు మూడో తరం కొత్త కంపెనీలు.. కియా, పీఎస్ఏ, ఎమ్జీ.. ఇలా ఆరు కొత్త విదేశీ కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఎస్యూవీలపైననే దృష్టి పెడుతుండడం విశేషం. కియా, ఎమ్జీలు భారత్లో వచ్చే 3–4 ఏళ్లలో రూ.13,000 కోట్లు, పీఎస్ఏ గ్రూప్ రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. చిన్న కార్ల సెగ్మెంట్పై కాకుండా ఈ విదేశీ కంపెనీలు ప్రీమియమ్ ఎస్యూవీలు, హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లపై కన్నేశాయి. ఎస్యూవీల స్పీడ్... అమెరికాను అధిగమిస్తాం ఎస్యూవీల అమ్మకాలు జోరుగా పెరుగుతున్నాయి. మినీ కార్లు, కాంపాక్ట్ సెడాన్ల తర్వాత ఇప్పుడు కాంపాక్ట్ ఎస్యూవీలు భారత్లో బాగా అమ్ముడవుతున్నాయి. 4.2 మీటర్ల పొడవు, రూ.15 లక్షల రేంజ్ ఉండే ఈ ఎస్యూవీల విక్రయాల్లో గత ఏడాది మన దేశం జపాన్ను తోసిరాజని మూడోస్థానంలోకి వచ్చింది. త్వరలో రెండో స్థానంలో ఉన్న అమెరికాను కూడా అధిగమిస్తామని, చైనా తర్వాతి స్థానం మనదే అవుతుందనేది నిపుణుల అంచనా. గత ఐదేళ్లలో మన దేశంలో ఎస్యూవీల విక్రయాలు దాదాపు రెట్టింపయ్యాయి. స్పోర్ట్స్, మల్టీ యుటిలిటి వెహికల్స్ కలిపి గతేడాది 7.6 లక్షల వరకూ అమ్ముడయ్యాయి. మొత్తం అమ్ముడైన కార్లలో వీటి వాటా నాలుగో వంతు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో మొత్తం 8.3 లక్షల యుటిలిటీ వెహికల్స్ అమ్ముడయ్యాయి. మొత్తం 30 లక్షల అమ్మకాల్లో ఇది 28 శాతం. నాలుగేళ్లలో 35 కొత్త ఎస్యూవీలు.. వచ్చే నెల నుంచి ఆరంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహన విక్రయాలు 7–9 శాతం రేంజ్లోనే పెరుగుతాయని... ఎస్యూవీల అమ్మకాలు మాత్రం 14–15 శాతం వృద్ధితో పది లక్షల మార్క్కు చేరతాయని భావిస్తున్నారు. 2020 కల్లా ఈ కేటగిరీ అమ్మకాలు 15 శాతం చొప్పున చక్రగతిన వృద్దితో 14 నుంచి 15 లక్షల రేంజ్కు చేరొచ్చనే అంచనాలున్నాయి. దీంతో విదేశీ కంపెనీలు మన ఎస్యూవీ మార్కెట్పై కన్నేశాయి. ప్రస్తుతమున్న కంపెనీలూ కొత్త ఎస్యూవీలతో పాటు ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తేనున్నాయి. మొత్తం మీద నాలుగేళ్లలో 35 కొత్త ఎస్యూవీలు మన మార్కెట్ను ముంచెత్తనున్నాయి. దాదాపు ఆరు విదేశీ కంపెనీలు తమ యుటిలిటీ వాహనాలను మన మార్కెట్లోకి తేవడానికి సిద్ధమవుతున్నాయి. ఎస్ఏఐసీ కియా, పీఎస్ఏ, బెల్కి ఫోటన్,, ఛంగన్ కంపెనీలు తమ మోడళ్లను ముఖ్యంగా ఎస్యూవీలను భారత రోడ్లపైకి తెస్తున్నాయి. ఎంపిక ఎంతో కష్టం... విదేశీ కంపెనీలు పోలోమని భారత మార్కెట్లోకి వస్తుండడంతో ఇప్పుడు కారు కొనాలనే భారతీయ వినియోగదారులకు గట్టి చిక్కే ఎదురు కానుంది. ఎంచుకోవడానికి ఎన్నెన్నో మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి మరి. కొరియాకు చెందిన కియా మోటార్ కార్పొరేషన్, చైనాకు చెందిన ఎస్ఏఐసీ, పీఎస్ఏ గ్రూప్ తదితర విదేశీ కంపెనీలు వచ్చే ఏడాది కనీసం ఆరు ఎస్యూవీ మోడళ్లను అందుబాటులోకి తేనున్నాయి. ఎమ్జీ మోటార్ ఇండియా: చైనాకు చెందిన షాంగై ఆటోమోటివ్(ఎస్ఏఐసీ) అనుబంధ సంస్థ ఎమ్జీ మోటార్... ఇతర విదేశీ కంపెనీలతో పోలిస్తే ఇదే మొదట భారత్లోకి ఎస్యూవీ తేనుంది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన జీప్ కాంపాస్కు పోటీగా ఈ కంపెనీ కొత్త ఎస్యూవీని తెస్తోంది. ఆ తర్వాత క్రెటాకు పోటీగా మరో ఎస్యూవీని అందుబాటులోకి తేనుంది. మోరిస్ గ్యారేజెస్ (ఎమ్జీ) బ్రాండ్ ఎస్యూవీలను వచ్చే ఏడాది జూన్ కల్లా భారత మార్కెట్లోకి తెస్తామని, ఇప్పుడు భారత్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సెగ్మెంట్ ఎస్యూవీ సెగ్మెంటేనని ఎమ్జీ మోటార్ ఇండియా ఎమ్డీ రాజీవ్ చబా చెప్పారు. తమ కంపెనీ తొలి ఎస్యూవీకి కావలసిన విడిభాగాలను ఇప్పటికే 80–85 శాతం మేర సమీకరించామన్నారు. మరింతగా స్థానిక విడిభాగాలనే వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, దీంతో తమ ఎస్యూవీని ఆకర్షణీయమైన ధరకు అందించగలమని చెప్పారాయన. చాలా విదేశీ కంపెనీలు ఎంట్రీ లెవల్ ఎస్యూవీలపైననే దృష్టి పెడుతుండగా, ఎమ్జీ మోటార్ మాత్రం ప్రీమియమ్ ఎస్యూవీలపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. బెల్కి ఫోటన్: భాతర్లో ఎస్యూవీల జోరును చూసిన చైనా అతి పెద్ద వాణిజ్య వాహన కంపెనీ బెల్కి ఫోటన్.. భారత మార్కెట్ పట్ల తన ప్రణాళికలను పూర్తిగా మార్చుకుంది. భారత్లో ట్రక్కులతో అరంగేట్రం చేయాలనుకున్న ఈ కంపెనీ, ఆ ఆలోచనకు స్వస్తి చెప్పి బోర్గ్వార్డ్ బ్రాండ్ కింద ఎస్యూవీలను, వ్యాన్లను తేవాలనుకుంటోంది. ఫోర్స్ మోటార్స్ టెంపో ట్రావెలర్, జీప్ కాంపాస్, మహీంద్రా ఎక్స్యూవీలకు పోటీగా వాహనాలను అందించాలనుకుంటోంది. కియా: దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ ‘కాన్సెప్ట్ ఎస్పీ’ని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్ కారు ఆధారంగా ఈ కంపెనీ అందించనున్న ఎస్యూవీ.. హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్కు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్లోకి కాకుండా ఎస్యూవీతో భారత మార్కెట్లోకి అరంగేట్రం చేయాలనుకుంటున్నట్లు ఇటీవలే కియా మోటార్స్ ప్రెసిడెంట్ హాన్వూ పార్క్ చెప్పారు. మొదటగా కాన్సెప్ట్ ఎస్పీ ఆధారిత ఎస్యూవీని వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తామని, ఈ తర్వాత మరో చిన్న ఎస్యూవీని కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. భారత ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీ తీవ్రంగానే ఉన్నా, అవకాశాలు కూడా అపారంగా ఉన్నాయని కియా మోటార్స్ ఇండియా హెడ్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మనోహర్ భట్ వెల్లడించారు. మిడ్ సెగ్మెంట్ ఎస్యూవీలు గత ఏడాది మూడున్నర లక్షలు అమ్ముడయ్యాయని 2021 కల్లా ఈ అమ్మకాలు ఆరున్నర లక్షలకు చేరతాయని వివరించారు. పీఎస్ఏ: ఫ్రాన్స్కు చెందిన ఈ కంపెనీ ముందుగా ఎంట్రీ లెవల్ ఎస్యూవీని తేవాలనుకుంటోంది. భారత్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఈ కంపెనీకి ఇది మూడోసారి. ఒక కాంపాక్ట్ ఎస్యూవీని కూడా తేనున్నట్లు సమాచారం. మరోవైపు మారుతీ విటారా బ్రెజాకు పోటీగా ఒక ఎస్యూవీని రంగంలోకి దించనున్నట్లు సంబంధిత వర్గాలంటున్నాయి. చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్ ప్లాంట్ను తన ఉత్పత్తి కార్యకలాపాలకు ఈ కంపెనీ వినియోగించుకోనుంది. మారుతీ సుజుకీ: ప్రస్తుతం ఎస్యూవీ సెగ్మెంట్లో విటారా బ్రెజా ఒక్కటే ఈ కంపెనీకి ఉంది. మరిన్ని ఎస్యూవీలను మార్కెట్లోకి తేనుంది. హ్యుందాయ్ క్రెటాకు పోటీగా మిడ్సైజ్ ఎస్యూవీని తేవాలనునుకుంటోంది. ప్రసుత్తం ఎంట్రీ లెవల్ ఎస్యూవీ సెగ్మెంట్లో మహీంద్రాకు చెందిన కేయూవీ100 బాగా అమ్ముడవుతున్నాయి. దీనికి పోటీగా మరో ఎస్యూవీని తేవాలని మారుతీ ప్రయత్నిస్తోంది. క్రెటాతో మంచి విజయం దక్కించుకున్న హ్యుందాయ్ మరిన్ని ఎస్యూవీలపై దృష్టి సారిస్తోంది. ఫోక్స్వ్యాగన్: కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఫోక్స్వ్యాగన్ ‘టీ–క్రాస్’ని తెస్తోంది. ఇక రెనో కంపెనీ క్యాప్చర్ ఎస్యూవీని తేనుంది. రూ.8–15 లక్షల రేంజ్లో ఉన్న క్రెటా ఎస్యూవీకి పోటీగానే ఛంగన్, పీఎస్ఏలు ఎస్యూవీలను తేవాలనుకుంటున్నాయి. -
రెనో ‘కాప్చర్’ వచ్చేసింది..
పనాజి: వాహన తయారీ కంపెనీ ‘రెనో ఇండియా’ తాజాగా తన ప్రముఖ ప్రీమియం ఎస్యూవీ ‘కాప్చర్’ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.15 లక్షలలోపు ఉండొచ్చని అంచనా. ఇది దీపావళి పండుగకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కంపెనీ ఇప్పటికే అంతర్జాతీయంగా పది లక్షలకు పైగా కాప్చర్ వాహనాలను విక్రయించింది. ఇది జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్యూవీ, టాటా హెక్జా వంటి పలు మోడళ్లకు గట్టిపోటీనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ప్రీమియం ఎస్యూవీ అయిన కాప్చర్ ధర డస్టర్ కన్నా ఎక్కువగానే ఉంటుందని రెనో ఇండియా సీఈవో, ఎండీ సుమిత్ సాహ్ని తెలిపారు. ఇది పెట్రోల్, డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రెనో షోరూమ్లలో కాప్చర్ బుకింగ్స్ను ప్రారంభించామని తెలిపారు. కాగా రెనో ఇండియా కేవలం క్విడ్, డస్టర్ మోడళ్లను మాత్రమే భారత్లో విక్రయిస్తోంది.