teaser released
-
ఎమోషనల్ బ్యూటీ
అంకిత్ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యూటీ’. వర్ధన్ దర్శకత్వంలో వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రోడక్ట్ పతాకాలపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ ఈ సినిమాను నిర్మించారు.ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘ఓ అందమైన ప్రేమకథతో పాటు మిడిల్ క్లాస్ ఎమోషన్స్ను ప్రేక్షకులు ఈ మూవీలో చూస్తారు’’ అని తెలిపింది యూనిట్. ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గానిన్. -
జహాపన
‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ లాంటి చిత్రాల్లో బాలనటుడుగా చేసిన ఆనంద్ వర్ధన్(Anand Vardhan) హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిదురించు జహాపన’(Nidurinchu Jahapana). నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్ గా నటించారు. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్పై సామ్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.ఈ మూవీ టీజర్ను రిలీజ్(Teaser released) చేశారు. ‘మనిషి నిద్రపోయే వరకు సైన్స్ అయితే.. నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయ, సింపుల్గా చెప్పాలంటే నీ లైఫ్లో పదిహేడేళ్ల జీవితాన్ని మిస్ అయిపోయావు’ వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్. -
వైవిధ్యమైన ప్రేమకథ
ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్న. ఆమె లీడ్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు–దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.ఈ చిత్రం టీజర్ చూసిన అనంతరం డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ను రాహుల్ రవీంద్రన్ చూపించాడు. రష్మిక నటన, భావోద్వేగాలు, క్లోజప్ షాట్స్ చాలా బాగున్నాయి’’ అని పేర్కొన్నారు. ‘‘వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది’’ అన్నారు మేకర్స్. ఇదిలా ఉంటే త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్లో రష్మిక పాత్రను, నేపథ్యాన్ని హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్తో పరిచయం చేస్తారని సమాచారం. -
నాకు తల చాలా ముఖ్యం
‘‘మన శరీరానికి తల ఎంత ముఖ్యమో... నాకు ఈ ‘తల’ సినిమా కూడా అంతే ముఖ్యం. డ్యాన్స్ మాస్టర్గా నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆర్బీ చౌదరిగారిని నేను దేవుడిలా భావిస్తాను. ఆయన నిర్మాణంలో మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్ని హీరోగా పరిచయం చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అని డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తెలిపారు. అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం ‘తల’. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలానే ఉంటాను. ఆడియన్స్ తప్పకుండా ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ఎస్తేర్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ‘తల’లో నా పాత్ర ఉంటుంది’’ అని చె΄్పారు. -
ముక్కోణపు ప్రేమకథ
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ కీలకపాత్రలో, హర్ష చెముడు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబరు 8న విడుదల కానుంది. కాగా దసరా పండగని పురస్కరించుకుని ఈ చిత్రం టీజర్ని రిలీజ్ చేశారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రిషి అనేపాత్రలో నిఖిల్ కనిపించనున్నారు. యాక్షన్ ఎలిమెంట్, చేజింగ్ సన్నివేశాలు, కథలోని కొన్ని కీలక మలుపులతో టీజర్ని విడుదల చేశాం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తోపాటు చక్కటి వినోదం, రొమాన్స్ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. ‘స్వామి రారా, కేశవ’ వంటి చిత్రాల తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, నేపథ్య సంగీతం: సన్నీ ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్. -
బృంద వస్తోంది
హీరోయిన్ త్రిష టైటిల్ రోల్లో నటించిన థ్రిల్లింగ్ క్రైమ్ మిస్టరీ వెబ్ సిరీస్ ‘బృంద’. సూర్య మనోజ్ వంగాలా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో ఆగస్టు 2 నుంచి ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్లో పోలీసాఫీసర్ బృందగా త్రిష నటించారు. ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. -
నా ముందు సైలెంట్గా ఉండాలి!
తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీగా దూసుకెళుతున్నారు యంగ్ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం నితిన్తో ‘రాబిన్హుడ్’, రవితేజ ‘ఆర్టీ 75’ (వర్కింగ్ టైటిల్) వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం (మే 14) శ్రీలీల బర్త్డే. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘రాబిన్హుడ్’లో ఆమె చేస్తున్న లేడీ బాస్ నీరా వాసుదేవ్ ΄పాత్ర లుక్, టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్.‘‘జ్యోతీ... సునామీలో టి సైలెంట్ ఉండాలి... నా ముందు నువ్వు సైలెంట్గా ఉండాలి’ అంటూ శ్రీలీల చెప్పిన డైలాగ్ టీజర్లో ఉంది. ‘ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్’ (2023) చిత్రం తర్వాత హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.‘యునిక్ యాక్షన్, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ‘రాబిన్హుడ్’ రూపొందుతోంది. ఈ చిత్రంలో నితిన్ పాత్రకు శ్రీలీల పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. వారి పాత్రలు రాయడంలో వెంకీ కుడుముల స్పెషల్ కేర్ తీసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఈ నెలలోనే లాక్డౌన్!
ఈ నెలలోనే లాక్డౌన్ అంటున్నారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. కానీ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే... ఆమె చెబుతున్నది ‘లాక్డౌన్’ సినిమా గురించి. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాక్డౌన్’. ఏఆర్ జీవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్.కాగా ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటించినట్లుగా తెలుస్తోంది. లాక్డౌన్లో చిక్కుకుపోయి కష్టాలు పడుతున్న ఓ యువతి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. లాక్డౌన్ కష్టాలతోపాటు కరోనా వైరస్ గురించిన అంశాలను ఈ సినిమాలో కాస్త సీరియస్గానే చూపిస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్స్టన్, ఇందుమతి, రాజ్కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు కెమెరా: వీజే సాబు జోసెఫ్. -
తక్కువ అంచనా వెయ్యొద్దు!
నెగటివ్ క్యారెక్టర్స్లో తనదైన విలనిజాన్ని పండించిన సోనూ సూద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫతే’. ఈ చిత్రానికి సోనూయే దర్శకత్వం వహించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రచయిత కూడా సోనూనే కావడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ని ‘వచ్చేస్తున్నా’ అంటూ శనివారం విడుదల చేశారు సోనూ సూద్. సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తోంది. కాగా.. టైటిల్కి ట్యాగ్లైన్గా ‘నెవర్ అండర్ఎస్టిమేట్ ఎ నోబడీ’ అని పెట్టారు. అంటే.. ఎవర్నీ తక్కువ అంచనా వేయొద్దు అని అర్థం. ఈ యాక్షన్ థ్రిల్లర్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. భారతదేశానికి చెందినవారితో పాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సైబర్ క్రైమ్లో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
శనివారమే 'నాని' వేట!
‘‘కోపాలు రకరకాలుగా ఉంటాయి.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది.. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే ఎవరినైనా చూశారా.. నేను చూశాను’’ అంటూ నటుడు ఎస్జె సూర్య చెప్పే డైలాగ్స్తో విడుదలైంది ‘సరిపోదా శనివారం’ టీజర్. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఆగస్ట్ 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శనివారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్ని విడుదల చేశారు. నాని చేస్తున్న సూర్య పాత్ర ఒకే ఒక్క రోజు (శనివారం) మాత్రమే కోపం చూపిస్తుందని టీజర్ ద్వారా స్పష్టం చేశారు. వారంలో జరిగే ఘటనలను పేపర్ పై రాసుకుని, తనని ఇబ్బందిపెట్టేవారిని శనివారం వేటాడతాడు సూర్య. ఇక నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు దానయ్య తెలిపారు. -
Yatra 2 Teaser: ఆకట్టుకుంటున్న 'యాత్ర 2' టీజర్
‘ఏన్నా.. ఇంత రాత్రి అయినా నిద్ర పోకుండా ఈడ ఏం చేస్తున్నావన్నా’ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రధారి జీవా డైలాగ్తో ‘యాత్ర 2’ టీజర్ విడుదలైంది. ‘యాత్ర’ వంటి హిట్ మూవీకి సీక్వెల్గా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్తో కలసి శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట.. ఆయన కోసం ఎదురు చూస్తున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘కాదన్నా.. మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి మీ ముందు నిల్చున్నా మీకు కనపడదు కదా అన్న’ (జీవా), ‘నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకు కనపడతా కదా అన్న, నాలాంటోళ్లు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘నా రాజకీయ ప్రత్యర్థినైనా, శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ, మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్యా’ (వైఎస్ఆర్ పాత్రధారి మమ్ముట్టి) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మహి వి. రాఘవ్. మహేశ్ మంజ్రేకర్, సుజానె బెర్నెర్ట్, కేతకీ నారాయణన్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: సంతోష్ నారాయణన్. -
చిత్రం చూడర...
వరుణ్ సందేశ్, శీతల్ భట్ హీరో హీరోయిన్లుగా, ‘నేనింతే’ ఫేమ్ అదితీ గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా ‘చిత్రం చూడర..’. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. యాక్షన్ అండ్ సస్పెన్స్ అంశాలతో సినిమా కథనం ఉంటుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: జవహర్ రెడ్డి, సహనిర్మాత: ధన తుమ్మల. -
‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’సినిమా టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
అంబాజీపేట బ్యాండు
సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్పై నిర్మించారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదలలో దర్శకులు మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్ రమేశ్, భరత్ కమ్మ, నిర్మాతలు ఎస్కేఎన్, శరత్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘నాలాంటి కొత్త డైరెక్టర్కు చాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్, ‘బన్ని’ వాసు, వెంకటేష్ మహాగార్లకు, సుహాస్కి థ్యాంక్స్’’ అన్నారు దుశ్యంత్ కటికినేని. ‘‘నా కెరీర్లో ఈ మూవీ మైలురాయిగా నిలుస్తుంది’’అన్నారు సుహాస్. సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడారు. -
‘నేనే సరోజ’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
శాన్వీ మేఘన, కౌశిక్ బాబు జంటగా శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే సరోజ: ఉరఫ్ కారం చాయ్’. గాళ్స్ సేవ్ గాళ్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఎస్ 3 క్రియేషన్స్ పతాకంపై రచయిత డా. సదానంద్ శారద నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసిన శాసన సభ్యులు ముఠా గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్థిని పాత్రలో శాన్వీ మేఘన పవర్ఫుల్గా నటించారు.ఓ సామాజిక అంశాన్ని తీసుకుని ఈ తరహా సినిమాను నిర్మించిన దర్శక–నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఆడపిల్ల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్ష చూపించేవారికి తాగిస్తాం కారం చాయ్ అంటూ గుణపాఠం చెప్పేలా సరోజ పాత్ర ఉంటుంది. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు శ్రీమాన్ గుమ్మడవెల్లి. ‘‘ఆలోచనాత్మక సంభాషణలు.. శాన్వి వీరోచిత పోరాటాలు, ఆర్. ఎస్. నంద హాస్యం.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అన్నారు రచయిత, నిర్మాత సదానంద్ శారద. -
గూఢచారి 111
‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ హీరో హీరోయిన్లుగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘చారి 111’. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రకటించడంతో పాటు, కాన్సెప్ట్ టీజర్ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ కనిపిస్తారు. అలాగే ఆయన పాత్రలో ఓ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘స్పై జానర్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. కథలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు అదితీ సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది – మంత్రి జగదీశ్వర్ రెడ్డి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏ సినిమానైనా విమర్శనాత్మక కోణంలో చూసే వ్యక్తిని నేను. ‘స్పార్క్’ టీజర్ప్రారంభం చూడగానే నాకు ‘శివ’ సినిమా గుర్తొచ్చింది. విక్రాంత్లో, ఈ సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది. ఈ సినిమా కొత్త ట్రెండ్ని క్రియేట్ చేయడంతో పాటు విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘యూఎస్లో చదువుకుని, అక్కడే జాబ్ చేసినా సినిమాలపై ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ ప్రేమతోనే ‘స్పార్క్’ కథ రెడీ చేసుకున్నాను. నేను ప్రేమతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమతో హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విక్రాంత్. తుంగతుర్తి ఎమ్మేల్యే కిశోర్, రచయిత అనంత శ్రీరామ్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడారు. -
సాఫ్ట్గా ఉండకు.. ఆడుకుంటారు
‘కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటార్రా. నువ్వేం కంగారు పడకు’ అనే డైలాగ్తో మొదలైంది ‘రంగబలి’ టీజర్. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ‘అయ్య బాబోయ్.... రేపట్నుంచి చూత్తారుగా.. మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేస్తది (నాగశౌర్య)’, అయినా.. నువ్వేం అంత సాఫ్ట్గా ఉండకు.... ఆడుకుంటారు (యుక్తి తరేజ)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో బీ ఫార్మసీ చదివిన యువకుడి ΄ాత్రలో నాగశౌర్య, డాక్టర్ ΄ాత్రలోయుక్తి తరేజ నటించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: పవన్ సీహెచ్. -
'కొట్టర కొట్టు.. బొక్కలు చూర అయ్యేటట్టు..' అదిరిపోయిన టీజర్
‘నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా!’, ‘నీ గేటు దాటలేనన్నావ్... దాటా!’, నీ పవర్ దాటలేనన్నావ్...దాటా!’, ‘ఇంకేంటి దాటేది...!’ అనే డైలాగ్స్తో విడుదలైంది రామ్ కొత్త సినిమా టీజర్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కుమార్, జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. సోమవారం (మే 15) హీరో రామ్ బర్త్ డే సందర్భంగా ‘ఫస్ట్ థండర్’ పేరుతో ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. సదర్ ఉత్సవాల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్ విజువల్స్లో ‘కొట్టర కొట్టు... నరాలు కట్టు! బొక్కలు చూర అయ్యేటట్టు..’ అనే బ్యాక్గ్రౌండ్ సాంగ్ టీజర్లో వినిపించింది. ‘‘మా హీరో రామ్ మేకోవర్, యాక్టింగ్, బోయపాటి శ్రీనుగారి డైరెక్షన్, తమన్ రీ రికార్డింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో టైటిల్, ఇతర వివరాలు వెల్లడిస్తాం. దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం
‘‘డైరెక్టర్ ఆనంద్, నేను మంచి స్నేహితులం. ‘ఊరు పేరు భైరవకోన’ లాంటి సినిమాని ఆయన నాతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నా పుట్టినరోజున(ఆదివారం) ఈ మూవీ టీజర్ విడుదల కావడం స్పెషల్ మూమెంట్. తొలిసారి చండీయాగం చేసి టీజర్ రిలీజ్ చేయడం చాలా పాజిటివ్గా ఉంది. అనిల్ సుంకరగారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు’’ అన్నారు. ‘‘టైగర్’ సినిమా నుంచి సందీప్, నాకు స్నేహం మొదలైంది. మరోసారి కలసి సినిమా చేస్తే ఇంకా గ్రాండ్గా ఉండాలని ‘ఊరు పేరు భైరవకోన’ చేశాం’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ సినిమా సందీప్ కెరీర్లో మరచిపోలేని బహుమతి అవుతుందని మాట ఇస్తున్నా’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘మహాచండీ యాగంతో టీజర్లాంచ్ చేయడం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. ఈ ఐడియా ఇచ్చిన సందీప్గారికి థ్యాంక్స్’’ అన్నారు రాజేష్ దండా. హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాజ్ తోట. -
"మళ్ళీ పెళ్లి" టీజర్ లో రచ్చ..
-
భారత్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ కారు - ఇదే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఈ ఏడాది భారత్లో విడుదల చేయనున్న చిన్న ఎస్యూవీకి ఎక్స్టర్గా నామకరణం చేసింది. ఈ మేరకు టీజర్ను విడుదల చేసింది. జూలైలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆగస్ట్ నుంచి మార్కెట్లో అడుగు పెట్టనుందని సమాచారం. దక్షిణ కొరియాతోపాటు పలు దేశాల్లో అమ్ముడవుతున్న ఏఐ3 (క్యాస్పర్) మోడల్కు స్వల్ప మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఈ వాహనం భారత్ కోసం తయారు చేస్తున్నారు. భవిష్యత్లో పొరుగున ఉన్న దేశాలకూ ఎగుమతి చేస్తారు. గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్ఫామ్పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. 1.0 లీటర్ టీ–జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో తయారు కానుంది. -
కాలర్ ఎగరేసుకునే సమయం ఇది
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రంజిత్ జయకొడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మైఖేల్’. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను గురువారం విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నాకు నేను పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష మైఖేల్. మూడుసంవత్సరాల క్రితం ‘మైఖేల్’ వర్క్ను స్టార్ట్ చేశాం. ఈ సినిమా కోసం దాదాపు 24 కేజీల బరువు తగ్గాను. సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు నంబరవన్ అని నంబర్స్ చెబుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది’’ అన్నారు. ‘‘మైఖేల్’ చేసేందుకు ఒప్పుకున్న సందీప్ కిషన్, విజయ్ సేతుపతిలతో పాటు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్. ‘‘మైఖేల్’ పట్ల హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు రామ్మోహన్ రావు, భరత్ చౌదరి. -
పునీత్ రాజ్కుమార్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్.. దేవుడి పాత్రలో..
Lucky Man Teaser Released: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ (Puneeth Rajkumar) మరణం సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఇక ఆయన కుటుంబీకులకు, అభిమానులకు ఎనలేని శోకాన్ని మిగిల్చింది. ఇప్పటికీ ఆయన్ను తలచుకోని అభిమాని లేడు. తన ప్రియతమ హీరోను వెండితెరపై చూడలేమన్న నిజాన్ని తట్టుకోలేకపోయారు. అయితే పునీత్ రాజ్కుమార్ మరణం కన్నా ముందు కమిట్ అయి, చిత్రీకరించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో 2022, మార్చి 17న విడుదలైన 'జేమ్స్' ప్రేక్షకులను అలరించింది. పునీత్ రాజ్కుమార్ను వెండితెరపై చూసుకున్న అభిమానులు కంటతడిపెట్టారు. తర్వాత ఆయన్ను మళ్లీ చూస్తామో లేదో అని కుమిలిపోయారు. అయితే పునీత్ రాజ్కుమార్ అభిమానులకు త్వరలోనే సర్ప్రైజ్ దక్కనుంది. మరోసారి పునీత్ రాజ్కుమార్ను వెండితెరపై చూసే అదృష్టం కలగనుంది. పునీత్ మరణం కంటే ముందు ఆయన ఒప్పుకుని, నటించిన చిత్రాల్లో 'జేమ్స్'తోపాటు 'లక్కీ మ్యాన్' కూడా ఉంది. పునీత్ రాజ్కుమార్ గెస్ట్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది చిత్రబృందం. రొమాంటిక్ కామెడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ భగవంతుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పునీత్ రాజ్కుమార్ చేసే డ్యాన్స్ ఫ్యాన్స్తో పాటు ఆడియెన్స్ను ఆకట్టుకునేలా ఉంది. నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డార్లింగ్ కృష్ణ, సంగీత శృంగేరి, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు -
'మనసు తప్ప ఏదైనా వెతికి పెడతా' అంటున్న షణ్ముఖ్ జశ్వంత్..
Shanmukh Jaswanth Agent Anand Santosh Teaser: యూట్యూబ్ స్టార్గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్బాస్ ఐదో సీజన్లో చివరకు నిలిచి, రన్నరఫ్గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. ఇదిలా ఉంటే బిగ్బాస్, బ్రేకప్ తర్వాత తన కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టాడు షణ్ముఖ్ జశ్వంత్. ఈ క్రమంలోనే 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్ చేస్తున్నట్లు ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'ఇంతకీ నువ్ ఏం చేస్తుంటావ్ ? నెలకు నీ జీతం ఎంత వస్తుంటుంది ? అసలు ఎంత ఖర్చవుతుంది ? ఎంత మిగులుతుంది ?' అంటూ షణ్ముఖ్ను ప్రశ్నలు అడగడంతో ప్రారంభమవుతుంది ఈ టీజర్. ఈ ప్రశ్నలకు నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్ను సర్ అని షణ్ముఖ్ ఇచ్చే సమాధానం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వెబ్ సిరీస్పై ఆసక్తి కలిగించారు. ఇందులో షణ్ముఖ్ జశ్వంత్ స్టైలిష్గా కనిపించాడు. 'మనసు తప్ప.. ఫిజికల్గా, లిక్విడ్గా ఏదైనా వెతికి పెడతా' అని చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సిరీస్కు అరుణ్ పవర్ దర్శకత్వం వహించగా, సుబ్బు స్క్రిప్ట్ అందించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. చదవండి: నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు.. నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ -
ఒక్కరి మనసునైనా దొంగలించామా మామ.. ఆసక్తిగా టీజర్
Kiran Abbavaram Nenu Miku Kavalsinavadini Teaser: వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్లో ఉన్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ హీరో ఇటీవలే 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీధర్ గాదే దర్శకత్వంలో యూత్ఫుల్, ఫ్యామిలీ కథాంశంతో రెడీ అవుతోన్న సినిమా 'నేను మీకు కావాల్సిన వాడిని'. ఈ సినిమాలో సోనూ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. 'డ్రైవర్వి డ్రైవర్లా ఉండూ' అనే డైలాగ్తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'పదిసార్లు ప్రేమలో ఓడిపోయినా సరే.. సిగ్గు లేకుండా పదకొండోసారి ప్రేమకోసం పరితపించే ప్రేమికుల మధ్య బతుకుతున్నాం' అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్, కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కిరణ్ అబ్బవరమే స్క్రీన్ప్లే, సంభాషణలు అందించడం విశేషం. -
రణ్బీర్ వీరోచిత పోరాటం.. ఆసక్తిగా 'షంషేరా' టీజర్
Shamshera Teaser: Ranbir Kapoor Battle With Sanjay Dutt For His Tribe: బాలీవుడ్ లవర్ బాయ్ తన ప్రియసఖి, క్యూటీ అలియా భట్ను వివాహం చేసుకుని పెళ్లిపుస్తకం తెరిచాడు. ఇక తన సినీ కెరీర్పై ఫోకస్ పెట్టాడు రణ్బీర్. ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకోగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ ఆసక్తికరంగా ఉంది. యశ్రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం 'షంషేరా'. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్ అయి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ను బుధవారం (జూన్ 22) విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ సీక్వెన్స్తో ఆద్యంతం ఆసక్తిగా ఉంది. పోరాట యోధుడిగా, ఆపదల్లో చిక్కుకున్న తన వర్గాన్ని కాపాడుకునే వీరుడిగా రణ్బీర్ యాక్టింగ్, రగ్గ్డ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో సంజయ్ దత్ విలన్గా అలరించనున్నాడు. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్ను శుక్రవారం (జూన్ 24) రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అలాగే ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్ యూ సాన్' అంటూ సూసైడ్ నోట్ -
రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్
Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇటీవల ఈ షోను ఇక కొనసాగించనని కరణ్ జోహార్ ప్రకటించి అభిమానులను షాక్గు గురిచేశాడు. కానీ తాజాగా ఆదివారం (జూన్ 19) ఈ షో 7వ సీజన్ను టెలీకాస్ట్ చేస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేసి ఆశ్చర్యపరిచాడు కరణ్ జోహార్. ఈ వీడియోలో రణ్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్, సైఫ్ అలీ ఖానా, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తదితరులు ఉన్నారు. అలాగే ఈ టీజర్లో 'ఇప్పుడు రాబోయే సీజన్ మరింత పెద్దది, మెరుగైనది, ఇంకా మరింత అందమైనది' అని కరణ్ జోహార్ ఉత్సాహంగా చెప్పడం మనం చూడొచ్చు. కాపీ విత్ కరణ్ సీజన్ 7 ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో జులై 7 నుంచి ప్రసారం కానుంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
పాయల్తో ఆది సాయి కుమార్ రొమాన్స్.. ఆసక్తిగా 'తీస్ మార్ ఖాన్' టీజర్
Aadi Sai Kumar Tees Maar Khan Teaser Released: 'ప్రేమ కావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయి కుమార్ లవ్లీ, సుకుమారుడు వంటి చిత్రాలతో అలరించాడు. ఇటీవల 'బ్లాక్' మూవీతో సందడి చేసిన ఆది సాయి కుమార్ అంతగా మెప్పించలేకపోయాడు. అయితే జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో ముందుకు పోతున్నాడు ఆది. ప్రస్తుతం ఆది సాయి కుమార్ చేతిలో తీస్ మార్ ఖాన్, టాప్ గేర్, క్రేజీ ఫెలో తదితర చిత్రాలు ఉన్నాయి. తాజాగా 'తీస్ మార్ ఖాన్' మూవీ టీజర్ రిలీజ్ అయింది. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో ఆది తీస్ మార్ ఖాన్ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు. 'రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి' అంటూ డైలాగ్తో వచ్చే ఆది ఎంట్రీ బాగుంది. ఇందులో అనూప్ సింగ్ ఠాకూర్ విలన్గా అలరించనున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కల్యాణ్ జి గొగణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్ కీలక పాత్రు పోషిస్తున్నారు. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ సైలెంట్గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. -
లావణ్య త్రిపాఠీ 'హ్యాపీ బర్త్డే'.. ఇంటింటికీ గన్ను, ఎదురు లేని ఫన్ను..
'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠీ. గతేడాది 'చావు కబురు చల్లగా' సినిమాతో అలరించిన లావణ్య ప్రస్తుతం 'హ్యాపీ బర్త్డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బ్లాక్ కామెడీ థ్రిల్లర్గా అలరించనుంది. ఇందులో నరేశ్ అగస్త్య హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ఆద్యంతం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంది. ఇంటింటికి గన్ను.. ఎదురులేని ఫన్ను.. వంటి పలు డైలాగ్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చెర్రీ, హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. ఒక్క ఏడాదిలో ఏకంగా 20 సినిమాలు ఒప్పుకున్న స్టార్ హీరో ! -
O2 Teaser: ఇంకో 12 గంటల వరకు బతికి ఉండవచ్చు..
Nayanatara O2 Movie Teaser Released Will Stream On Disney Plus Hotstar: స్టార్ హీరోయిన్ నయన తార గ్యాప్ లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తోంది. అనామిక, కర్తవ్యం వంటి హీరోయిన్ సింట్రిక్ పాత్రల్లో మెప్పించిన నయన్ ఇటీవల 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీతో ప్రేక్షకులను నవ్వించింది. తాజాగా 'ఓ2' (O2) సినిమాతో ఆడియెన్స్ను థ్రిల్కు గురి చేయనుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. నయనతార, ఇతర ప్రయాణికులు కలిసి కొచ్చిన్కు వెళ్తున్న బస్సు లోయలో పడిపోతుంది. అందులో ఉన్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశారనేదే సినిమా కథగా తెలుస్తోంది. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించని ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, జీఎస్ వెంకటేశ్ దర్శకత్వం వహించారు. కాగా నయనతార ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్', 'గోల్డ్' తదితర చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ?
Keerthy Suresh Selva Raghavan Chinni Movie Release Date: 'ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటీ ? ఎవరైనా మన మీద రాయి విసిరితే.. తిరిగి మనమూ విసరాలి. మనమీద ఉమ్మేస్తే.. మనమూ ఉమ్మేయ్యాలి. మనల్ని కొడితే మనమూ కొట్టాలి' అని ఆవేశంగా అంటోంది కీర్తి సురేష్. 'మహానటి' కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తుంది. 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్కు ఏ మూవీ అంతగా సక్సెస్ను ఇవ్వలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది కీర్తి సురేష్. 'సర్కారు వారి పాట' చిత్రం మే 12న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందే కీర్తి సురేష్ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడదల కానుంది. కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సాని కాయిదమ్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'చిన్ని' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6న 'చిన్ని' మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శుక్రవారం (ఏప్రిల్ 22) విడుదల చేశారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్తోపాటు ధనుష్ అన్న, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పగ, ప్రతీకారం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. టీజర్లో కీర్తి సురేష్ ఎమోషనల్గా చెప్పిన డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది: కీర్తి సురేష్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'లేడీ థోర్' వచ్చేసింది.. ఆసక్తిగా 'థోర్: లవ్ అండ్ థండర్' టీజర్
Chris HemsworthThor Love And Thunder Teaser Released: మార్వెల్ సినిమాటిక్ యూనివర్సిటీ (ఎమ్సీయూ) నుంచి వచ్చిన చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. మార్వెల్ నుంచి వచ్చిన సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ ఎదురుచూపులను పటాపంచలు చేస్తూ క్రిస్ హేమ్స్వర్త్ నటించిన 'థోర్: లవ్ అండ్ థండర్' సినిమా అప్డేట్ను ఇచ్చారు. ఈ సినిమా టీజర్ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్ను ప్రకటించారు. థోర్ సిరీస్లో నాలుగో చిత్రంగా ఈ మూవీ రానుంది. టీజర్ విడుదల చేసి మూవీ ప్రియులకు మరింత ఆసక్తిని పెంచారు. ఈ చిత్రానికి అంతకుముందు వచ్చిన 'థోర్: రాగ్నరోక్' డైరెక్టర్, ఆస్కార్ విజేత తైకా వైటిటి దర్శకత్వ వహించారు. ఈ మూవీ కథ 'ది అవేంజర్స్: ఎండ్గేమ్' తర్వాత నుంచి కొనసాగడం టీజర్లో చూపించారు. థోర్ (క్రిస్ హేమ్స్వర్త్) గార్డియన్స్ అయిన పీటర్ క్విల్ (క్రిస్ ప్రాట్), అతని బృందంతో నివసిస్తుంటాడు. గాడ్ ఆఫ్ థండర్ కవచాన్ని వదిలేసి మళ్లీ ఎప్పటిలా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. తర్వాత థోర్ ఎప్పుడూ ఎదుర్కోలేని సంఘటనలు ఫేస్ చేసినట్లు చూపించారు. అలాగే ఇందులో థోర్ మాజీ ప్రేయసీ జేన్ ఫోస్టర్ (నటాలీ పోర్ట్మన్) లేడీ థోర్గా అలరించనుంది. ఇందులో 'ది డార్క్ నైట్' హీరో క్రిస్టియన్ బాలే కూడా ఉండటం విశేషం. టీజర్లో మూవీకి సంబంధించిన క్లూలను వదిలి చిత్రంపై అనేక అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ మూవీ ఇండియాలో జూలై 8న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రక్తం తాగిన కంగనా రనౌత్.. యాక్షన్ ప్యాక్డ్గా 'ధాకడ్' టీజర్
Dhaakad Teaser: Kangana Ranaut In 7 Fiery Looks: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ తనదైన శైలీలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్గా పేరు తెచ్చుకుంది. ఏ అంశంపైనైనా సూటిగా సుత్తి లేకుండా, ఎలాంటి భయం లేకుండా విమర్శలు సంధించి తాను కూడా వివాదాలపాలైంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో దూసుకుపోతున్న 'లాకప్' షోకు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తూనే సినిమాలతో బిజీగా ఉంది. కంగనా తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్'. రజ్నీష్ రజీ ఘాయ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీని దీపక్ ముకుత్, సోహెల్ మక్లాయ్ నిర్మించారు. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఇచ్చింది కంగనా. 'ధాకడ్'ను మే 20నల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తూ టీజర్ రిలీజ్ చేసింది. 'యాక్షన్, స్టైల్, థ్రిల్. అన్ని ఒక్కరిలో ఉన్న ఏజెంట్ అగ్ని వచ్చేసింది.' అని కంగనా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో టీజర్ను షేర్ చేసింది. ఈ మూవీలో కంగనా రనౌత్ 'అగ్ని' అనే ఏజెంట్ పాత్రలో అలరించనుంది. టీజర్లో శత్రువుల రక్తం తాగే హార్డ్కోర్ ఏజెంట్గా కంగనా కనిపించింది. తాను చేసిన యాక్షన్ సీన్స్ సూపర్గా ఉన్నాయి. టీజర్లో కంగనా మొత్తంగా 7 విభిన్నమైన గెటప్లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ అవుతోంది. 'నేను మణికర్ణికలో చేసిన యాక్షన్ సన్నివేశాలకు మంచి ప్రశంసలు వచ్చాయి. అవి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. సినిమాల్లో హీరోయిన్స్ యాక్షన్ సీన్స్ చేయడం చాలా అరుదు. ధాకడ్ మూవీ స్క్రిప్ట్ నా దగ్గరికొచ్చినప్పుడు ఒక కమర్షియల్ చిత్రంలో ఒక స్త్రీని యాక్షన్ హీరోయిన్గా చూపించడమనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.' అని కంగనా తెలిపింది. -
సుడిగాలి సుధీర్ క్రైం థ్రిల్లర్ 'కాలింగ్ సహస్ర'.. టీజర్ విడుదల
Sudheer Calling Sahasra Movie Teaser Released By Allu Aravind: సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరియయం అక్కర్లేని పేరు. మెజీషియన్గా అందరి దృష్టిన ఆకర్షించిన సుధీర్ ఓ కామెడీ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. తనదైన యాంకరింగ్, కామెడీ, డ్యాన్స్తో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్. అలా వచ్చిన క్రేజ్తో వెండితెరపై హీరోగా మారాడు. విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాలతో అలరించిన సుధీర్ తాజాగా 'కాలింగ్ సహస్ర' అనే డిఫరెంట్ క్రైం స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమా టీజర్ను శుక్రవారం (ఏప్రిల్ 1) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక నిమిషం 18 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్లో ప్రతి సన్నివేశం ఆసక్తి పెంచేలా ఉంది. 'బతకడం కోసం చంపడం సృష్టి ధర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది', 'చివరగా చావంటే కేవలం ప్రాణం పోవడం కాదురా.. మన కళ్ల ముందు మనం ప్రేమించిన వాళ్లు పోవడం' అనే డైలాగ్లతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఈ మూవీలో క్రైంతోపాటు మంచి లవ్ యాంగిల్ ఉన్నట్లు తెలుస్తోంది. రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ సంయుక్త సమర్పణలో విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలుగా వ్యవహరించారు. అరుణ్ విక్కీరాల దర్శకత్వం వహించగా మోహిత్ రహ్మణియక్ సంగీతం అందించారు. -
'మాచర్ల నియోజకవర్గం' ఫస్ట్ ఎటాక్ వచ్చేసింది.. సినిమా అప్పుడే విడుదల
Macherla Niyojakavargam Movie Teaser And Release Date Released: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎమ్ఎస్. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్కు జోడిగా కృతిశెట్టి నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి నితిన్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మూవీ టీజర్ను రిలీజ్ చేసింది. ఈ టీజర్తోపాటు సినిమా విడుదల తేదిని కూడా ప్రకటించారు మూవీ మేకర్స్. మాచర్ల నియోజకవర్గం సినిమాను ఫస్ట్ ఎటాక్ అంటూ టీజర్ లాంచ్ చేసి, ప్రపంచవ్యాప్తంగా జూలై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు టీజర్ రిలీజ్తోపాటు సినిమా విడుదల తేదిని ప్రకటించి గిఫ్ట్గా ఇచ్చారు మేకర్స్. మాచర్ల నియోజకవర్గంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో అలరించనున్నాడు నితిన్. ఈ పాత్రలో నితిన్ చాలా అద్భుతంగా ఉన్నాడు. పూర్తిస్తాయి మీసాలు, కత్తిరించిన గడ్డం గెటప్తో మాస్గా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ టీజర్లో విలన్లు నితిన్పై ఎటాక్ చేసే యాక్షన్ సీన్ చూపించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ను వెంకట్ మాస్టర్ తెరకెక్కించారు. రాజకీయ నేపథ్యంతో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. ఇందులో నితిన్ను మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్లో చూడనున్నట్లు తెలుస్తోంది. -
థ్రిల్లర్ మూవీగా అనుపమ పరమేశ్వరన్ 'బటర్ఫ్లై'.. టీజర్ విడుదల
Anupama Parameswaran Starrer Butterfly Movie Teaser Out: ప్రేమమ్’ మూవీతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల్లో డిసెంట్ రోల్స్ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ కేరళ కుట్టి రౌడీ బాయ్స్ మూవీతో కొంత నెగెటివిటీని మూటగట్టుకుంది. అయినా ఫ్యాన్స్లో ఉన్న తనపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బటర్ఫ్లై. ఈ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గంటా సతీష్ బాబు తెరకెక్కిస్తున్నారు. రవి ప్రకాష్, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ను గురువారం సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్లో అనుపమ సంతోషంగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా అనూహ్యా మార్పులు చోటుచేసుకోవడం చూపించారు. యువతరంతోపాటు కుటంబ ప్రేక్షకుల్ని మెప్పించే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ మూవీకి ఛాయగ్రహనం సమీర్ రెడ్డి కాగా, అరవింద్ షారోన్, గిడోన్ కట్టా సంగీతమందిస్తున్నారు. -
'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్.. పవర్ఫుల్గా రవితేజ యాక్టింగ్
Ravi Teja Starrer Rama Rao On Duty Teaser Released: మాస్ మహారాజ రవితేజ, శరత్ మండవ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘'రామారావు ఆన్ డ్యూటీ'’. ఎల్ఎల్పి బ్యానర్లో సుధాకర్ చేకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్లో విడుదల చేస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ను మంగళవారం విడుదల చేశారు మేకర్స్. డిప్యూటీ కలెక్టర్గా రవితేజ పవర్ఫుల్ యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. రవితేజ గురించి 'వాడో సూపర్ మేన్' అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. ఇందులో ఫైల్స్పై రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్తో రవితేజ సంతకం చేయడం ఆకట్టుకుంటోంది. అలాగే ఒక చేతితో సంతకాలు చేస్తూ మరో చేతితో టైపింగ్ చేయడం అలరిస్తోంది. 'ఆయుధంలా బతికే తనలాంటి ధైర్యం' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
టెర్రరిజం బ్యాక్డ్రాప్తో 'రోజ్ గార్డెన్'.. టీజర్ విడుదల
Rose Garden Movie Teaser Released By AM Ratnam: నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి జంటగా చదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘రోజ్ గార్డెన్’. ఈ చిత్రం టీజర్ను నిర్మాత ఏఎం రత్నం హైదరాబాద్లో రిలీజ్ చేశారు. ‘‘టెర్రరిజం నేపథ్యంలో రూపొందించిన ప్రేమకథా చిత్రం ఇది. కశ్మీర్లో భారీ ఎత్తున నిర్మించాం. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలోని అన్ని పాటలను ముంబైలో రికార్డ్ చేశాం. ఒక పాటను ఏయం రత్నం రాశారు’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఏఎం రత్నం ఆకాంక్షించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ 'రోజ్ గార్డెన్' చిత్రానికి జి. రవికుమార్ కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఫొటోగ్రఫీ శంకర్ కంతేటి అందించగా ఎడిటర్గా నందమూరి హరి పనిచేశారు. పోసాని కృష్ణమురళి, గౌతమ్ రాజు, ధన్రాజ్ తదితరులు నటించారు. -
మనం పెట్టిందే చట్టం.. ఆసక్తిగా 'మహాన్' టీజర్
Vikram Mahaan Movie Teaser Released: విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు టీజర్ను సోమవారం విడుదల చేశారు మేకర్స్. విక్రమ్ గాంధీ మహాన్గా కనిపిస్తున్న ఈ చిత్రం నాటు సారా నేపథ్యంలో సాగనుంది. నాటు సారాకు వ్యతిరేకంగా, గాంధీ బాటలో నడుస్తానని తన తండ్రికి మాట ఇచ్చిన మహాన్ అదే మద్యానికి బానిస అవడం వంటి సన్నివేశాలను టీజర్లో చూపించారు. టీజర్లో విక్రమ్ నటన అదిరిపోయిందనే చెప్పవచ్చు. 'ఏపీలో ఎవడు బార్ని లీజుకు తీసుకున్నా సరే వాడు మన సిండికేట్ మనిషై ఉండాలి. మనం పెట్టిందే చట్టం' అనే డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే ఇందులో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ది మంచి ప్రభావం ఉన్న పాత్రలా ఉంది. టీజర్ చివర్లో ధృవ్ ఎంట్రీ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరి 10న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో నేరుగా విడుదల కానుంది. -
ఆ అమ్మాయి గురించి చెప్పాడు.. సినిమాలు పడవంటూ
Aa Ammai Gurinchi Meeku Cheppali Movie Teaser Released: యంగ్ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రానికి భిన్న కథలతో అలరించే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో ప్రేమకథా చిత్రం ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్మార్క్ స్డూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ఆరు సంవత్సరాల్లో వరుసగా 6 సూపర్ హిట్లు అందించిన కమర్షియల్ ఫిల్మ్ మేకర్గా సుధీర్ బాబుని పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. 6 సూపర్ హిట్లు అందించిన డైరెక్టర్గా కొంచెం గర్వంతో ఉన్న సుధీర్ బాబుకి అవన్ని రోటీన్ సినిమాలను అతని స్నేహితుడు ఎగతాళి చేయడం బాగుంది. అప్పుడే డాక్టర్ అలేఖ్య పాత్రలో నటిస్తున్న కృతి శెట్టిని హీరో కలుస్తాడు. ఆమె ఒక కళ్ల డాక్టర్. ఆమెకు సినిమాలంటే విరక్తి. అలాంటి అమ్మాయితో సినిమా చేసేందుకు ఒప్పించే ప్రయత్నంగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. తను అమ్ముకునే సినిమాలు కాకుండా తనను నమ్ముకునే సినిమాలు చేస్తానని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వివేక్ సాగర్ బీజీఎం అలరించింది. ఓవరాల్గా చూసుకుంటే టీజర్ పర్వాలేదనిపించింది. కానీ మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ అంటే తప్పకుండా అంచనాలు ఉంటాయి. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. -
'ఇదే మా కథ' కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేసిన వెంకటేశ్
సుమంత్ అశ్విన్, తాన్యా హోప్ జంటగా నటించిన చిత్రం 'ఇదే మా కథ' రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ను హీరో విక్టరీ వెంకటేశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్, భూమికా చావ్లా ముఖ్య పాత్రలు పోషించారు. మతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా నిర్మించిన ఈ సినిమాను నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్లో విడుదల కానుంది. చదవండి: నేను ఇన్స్టాల్మెంట్స్లో ప్రేమించను: నటి -
Anukoni Athidhi: భయపెడుతున్న సాయి పల్లవి
వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’.2019లో మలయాళంలో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మంచి హిట్ని సొంతం చేసుకుంది. త్వరలో ఈ మూవీ ఓటీటీ ద్వారా తెలుగులో సందడి చేయనుంది. ‘అనుకోని అతిథి’ పేరుతో ప్రముఖ ఓటీటీ ఆహాలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మానసిక సమస్యతో బాధపడే క్యారెక్టర్లో సాయి పల్లవి యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వివేక్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. -
ఆలియా @ ప్రెసిడెంట్ ఆఫ్ కామాటిపురా
‘‘కామాటిపురాలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగు ఉంటుంది. గౌరవంతో బతకాలి.. ఎవ్వరికీ భయపడకూడదు. నేను గంగూ బాయి.. ప్రెసిడెంట్ కామాటిపురా. మీరు కుమారి అంటూనే ఉన్నారు... నన్ను ఎవరూ శ్రీమతిని చేసిందే లేదు’’ వంటి డైలాగ్స్ ‘గంగూబాయి కాఠియావాడీ’ టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధానపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూబాయి కాఠియావాడీ’. జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వేశ్యా గృహం నడిపే యజమాని గంగూబాయిగా నటిస్తున్నారు ఆలియా భట్. కాగా ‘వకీల్ సాబ్’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ‘గంగూబాయి కాఠియావాడీ’ తెలుగు టీజర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగారు? అనేదే సినిమా ప్రధానాంశం. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ‘గంగూబాయి కాఠియావాడీ’ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్, ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. -
దేవా కథ చెబుతానంటే వద్దన్నాను: సుకుమార్
‘‘ప్రస్థానం’ సినిమాని మనం ఇప్పటికీ మరచిపోలేదంటే.. ఆ సినిమాలోని సెన్సిబిలిటీస్, న్యారేషన్ అంత గొప్పగా ఉంటాయి. ‘రిపబ్లిక్’ కథను దేవా చెబుతానంటే వద్దన్నాను. ఎందుకంటే ఓ మంచి దర్శకుడి కథను వినకూడదు.. చూడాలి. ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్ని సుకుమార్ విడుదల చేశారు. దేవా కట్టా మాట్లాడుతూ– ‘‘సుక్కు సార్కి ఏకలవ్య శిష్యుణ్ణి. ‘బాహుబలి’ ఎంత ల్యాండ్ మార్క్ సినిమానో ‘రంగస్థలం’ కూడా అంతే ల్యాండ్ మార్క్ మూవీ. ‘రంగస్థలం’ కారణంగానే ‘రిపబ్లిక్’ చేశాను’’ అన్నారు. ‘‘సాయితేజ్తో తొమ్మిదేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రతిఫలమే ‘రిపబ్లిక్’ చిత్రం’’ అన్నారు జె.పుల్లారావు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు జె.భగవాన్ . సాయితేజ్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్గారు టీచర్ అయితే, బుచ్చిబాబు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్.. దేవాగారు మిడిల్ బెంచ్, నేను లాస్ట్ బెంచ్. నిజాయతీగా చేసిన ఈ సినిమా అందరికీ చేరువవుతుంది. మణిశర్మగారితో పని చేయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో తీరింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నటులు మనోజ్ నందం, రవివర్మ, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ జై కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీజర్: నవ్వులు పూయిస్తున్న ‘జాతి రత్నాలు’
‘లైఫ్ అండ్ డెత్’ పరిస్థితిలో కూడా ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ నవ్వులు పూయిస్తున్నారు. వారు ముఖ్యపాత్రలుగా ‘జాతి రత్నాలు’ అనే సినిమా తెరకెక్కుతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఖైదీల వేషంలో నవీన్, ప్రియదర్శి, రాహుల్ కనిపించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నవీన్ పోలిశెట్టికి జోడీగా నటిస్తోంది. స్వప్న సినిమాస్ బ్యానర్పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 11వ తేదీన ‘జాతి రత్నాలు’ థియేటర్లలో విడుదల కానుంది. మురళీ శర్మ రూ.500 కోట్ల ప్రాజెక్టుతో ఈ ముగ్గురు హీరోలకు ఉన్న సంబంధమే చిత్ర కథగా టీజర్ను చూస్తే తెలుస్తోంది. అదే ఈ ముగ్గురి జీవితంలో ‘లైఫ్ అండ్ డెత్’ పరిస్థితి ఏర్పడటానికి కారణంగా కనిపిస్తోంది. ఆసక్తికరంగా, నవ్వులు పంచుతూ సాగిన ఈ టీజర్ను చూడండి. సినిమాటోగ్రఫీ సిద్దం మనోహర్, సంగీతం రాధన్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో వీకే నరేశ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
చైతూ, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ టీజర్ రిలీజ్
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్లను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక త్వరలోనే సినిమా రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ‘లవ్ స్టోరీ’ టీజర్ను ఆదివారం విడుదల చేశారు. చదవండి: సమంతకు నో చెప్పిన నాగచైతన్య! నిమిషం నిడివి గల ఈ టీజర్ను యూత్కు బాగా కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. జీవితంలో గొప్పగా స్థిరపడేందుకు చైతూ, పల్లవి ఇద్దరూ పడిన కష్టాలు, వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమను శేఖర్ కమ్ముల తనదైన శైలిలో అద్భుతంగా చిత్రీకరించారు. సినిమాలో నాగ చైతన్య తెలంగాణ యువకుడు రేవంత్గా కనిపించనున్నాడు. మౌనిక అనే అమ్మాయిగా సాయి పల్లవి నటించింది. ప్రేమ, వినోదం, కుటుంబ భావోద్వేగాలు ఇలా అన్నింటిని కలిపిన లవ్ స్టోరీగా రూపొందించారు. టీజర్లో ‘ఆ సాఫ్ట్ వేర్ జాబ్ ఏం చేస్తావ్.. కళ్లాద్దాలు వస్తాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది.. జుట్టు మొత్తం ఊశిపోతుంది’ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తంగా టీజర్ చూస్తుంటే శేఖర్ కమ్ముల ఖాతాలో మంచి హిట్ పడటం ఖాయమయ్యేలా అనిపిస్తోంది. ఫిదా వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అనంతరం ఆయన తెరకెక్కిస్తున్న అందమైన ‘లవ్ స్టోరీ’ ఇది. మరి ఈ యువ ప్రేమ కథ అభిమానులకు ఎంత వరకు రీచ్ అవుతుందో వేచి చూడాలి. -
ఆది లుక్ బాగుంది
‘‘నేను, సాయికుమార్ కలిసి సినిమాలు చేస్తున్నప్పుడు ఆది పుట్టాడు. ‘శశి’ టీజర్ చూస్తుంటే రగ్డ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆది లవర్ బాయ్లా కనిపించాడు. ఈ టీజర్లో తన ట్రాన్స్ఫర్మేషన్ని అభినందిస్తున్నా’’ అన్నారు చిరంజీవి. ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘శశి’. బుధవారం ఆది సాయికుమార్ బర్త్డే సందర్భంగా ‘శశి’ టీజర్ని చిరంజీవి విడుదల చేశారు. ‘‘శశి’ ఎమోషనల్ లవ్ స్టోరీ’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘ఆది తొలి సినిమా ‘ప్రేమ కావాలి’కి అన్నయ్య చిరంజీవి విషెస్ లభించాయి. ఇప్పుడు ‘శశి’ టీజర్ను ఆయన లాంచ్ చేసి, బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు సాయికుమార్. -
విజయదశమి.. కొత్త సినిమాలు గురూ
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్తో నిలిచిపోయిన షూటింగ్లు ఒక్కొక్కటి తిరిగి ట్రాక్ ఎక్కుతున్నాయి. పలు సినిమాలు చివరి షెడ్యూల్ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు విజయదశమి పురస్కరించుకొని ఆయా చిత్ర యూనిట్లు... తమ సినిమాల ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ల విడుదల చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానుల్లో దసరా పండుగ సంబరం రెట్టింపు అవుతోంది. ఆదివారం రిలీజ్ అయిన టీజర్లు, మూవీ పోస్టర్లు, ట్రైలర్లపై ఓ లుక్కేయండి.. ఆకట్టుకుంటున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ మూవీ టీజర్ వర్మ 'ఆర్జీవీ మిస్సింగ్' ట్రైలర్ విడుదల -
నాకు కాబోయేవాడు నా షూతో సమానం
సాక్షి, హైదరాబాద్: విజయదశమి పురస్కరించుకొని పలు సినిమాలకు సంబంధించిన ఫస్ట్లుక్, టీజర్, ట్రైలర్లను మూవీ యునిట్లు విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ మూవీ టీజర్ను ఆదివారం చిత్ర బృదం విడుదల చేసింది. బొమ్మరిల్లు ‘భాస్కర్’ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్నారు. ‘మీ మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఆశిసున్నారని హీరో అఖిల్ అడగ్గా.. కేరింగ్ భర్త, అన్ని పనులు షేర్ చేసుకోవాలని, నాకు ఉమ్మడి కుటుంబం అంటే చిరాకు. లవ్..లవ్..లవ్.. ఇంకేముంటుంది మ్యారీడ్ లైఫ్’ అని పూజా చెప్పే డైలాగ్తో ఈ టీజర్ మొదలవుతుంది. ‘కొంచం వైల్డ్గా ఆలోచించు డార్లింగ్ అని అఖిల్ అనగానే.. నాకు కాబోయేవాడు నా షూతో సమానం’ అని అంటుంది హిరోయిన్. ఇక మరో డైలాగ్..‘నీకు సూర్యోదయం ఇష్టమా, సూర్యాస్తమయం ఇష్టమా అని హీరోయిన్ పూజా అఖిల్ని అడగ్గా.. నాకు మాత్రం సూర్యాస్తమయం అంటేనే ఇష్టం. ఎందుకంటే దాని తర్వాతే రాత్రి వస్తుందని అంటాడు అఖిల్. సరికొత్త డైలాగ్లతో ఉన్న టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్లో బన్నీ వాసు, వాసూవర్మ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ మూవీని నిర్మిస్తున్నారు. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ ఇటీవల పూర్కొన్న విషయం తెలిసింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-టీజర్ నెటిజన్లను అకట్టుకుంటున్న విషయం తెలిసిందే. -
బాండ్ వస్తున్నాడు
చెప్పిన డేట్కి, చెప్పిన టైమ్కి, చెప్పిన చోటుకి రావడం బాండ్ స్టయిల్. బాండే కాదు బాండ్ సినిమా కూడా ఇదే స్టయిల్ను పాటిస్తుందని చిత్రబృందం అంటోంది. జేమ్స్ బాండ్ సిరీస్లో రానున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. బాండ్ పాత్రలో డేనియల్ క్రెగ్ నటిస్తున్నారు. కరోనా వల్ల ఈ చిత్రం విడుదలను నవంబర్కు వాయిదా వేశారు. ఇప్పుడు నవంబర్లో అయినా వస్తుందా? అని సందేహాలు ఉన్నాయి. కానీ నవంబర్లో బాండ్ రావడం పక్కా అని తెలుస్తోంది. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త టీజర్ను విడుదల చేయనున్నారు. అందులో నవంబర్లో రిలీజ్ అని డేట్ కూడా ప్రకటిస్తారట. ప్రపంచవ్యాప్తంగా కొన్నిచొట్లే థియేటర్స్ను తెరిచారు. మరి.. బిజినెస్ పరంగా బాండ్ ఎలా లాక్కొస్తాడో చూడాలి. -
ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. తాజాగా ‘రెడ్’ టీజర్ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడటం ఇదే ఫస్ట్ టైమ్’ అనే డైలాగ్తో ప్రారంభమైన చిత్ర టీజర్.. చివరివరకు ఇంట్రెస్టింగ్ సాగింది. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్.. క్లాస్, మాస్ లుక్స్లో అదరగొట్టినట్టుగా టీజర్ను చూస్తే తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్తో సత్తా చాటిన రామ్.. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ తర్వాత రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ‘రెడ్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. -
‘శశిలలిత’ నిర్మించడం అభినందనీయం
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడే కాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజల హృదయాలను గెలిచిన వ్యక్తి జయలలిత అని బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో ఆమె విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. జయలలిత జీవిత కథ ఆధారంగా జయం మూవీస్ పతాకంపై దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘శశిలలిత’ (ది స్ట్రోమ్) రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వర్షన్ ఫస్ట్లుక్, పోస్టర్, టీజర్ను సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జగదీశ్వర రెడ్డి శనివారం ఆవిష్కరించారు. శశిలలిత సినిమా వాస్తవాలకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తున్నట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. ‘శశిలలిత’ నిర్మించడం అభినందనీయమని ప్రశంసలు కురిపించారు. జయలలిత ముగిసిన చరిత్ర కాదని, ఆమె ప్రజల గుండెల్లో ఎప్పుడూ బతికి ఉంటారని చిత్ర దర్శకుడు జగదీశ్వరరెడ్డి అన్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా, నిజాల్ని ప్రేక్షకులకు చెప్పేందుకే సినిమా తీస్తున్నట్లు తెలిపారు. జయలలిత క్యారెక్టర్లో కాజల్ దేవ్గన్, శశికళ పాత్రలో అమలాపాల్ నటిస్తున్నారని వెల్లడించారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చిత్రం నిర్మిస్తున్నట్టు వివరించారు. వచ్చేనెలలో సినిమా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కో–డైరెక్టర్ శివకుమార్, రైటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్వయం వద’ టీజర్ ఆవిష్కరణ
ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా లక్ష్మి చలన చిత్ర పతాకంపై వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్రం `స్వయంవద`. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత సి. కళ్యాణ్ టీజర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మోషన్ పోస్టర్, టీజర్ బాగున్నాయి. ఇటీవల కాలంలో హారర్ జోనర్ సినిమాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. అలాగే ఇదే టీమ్ భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నా` అని అన్నారు. ‘స్వయం వద టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. టీజర్ చూస్తుంటే మేకింగ్ బాగుందనిపిస్తోంది. కెమెరా పనితనం బాగుంది. ప్రస్తుతం హారర్ కామెడీ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా చక్కని విజయం సాధించాలి` అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. హీరో ఆదిత్య అల్లూరి మాట్లాడుతూ.. ‘టీజర్ చూస్తే మా కష్టం కనిపిస్తుంది. దర్శక, నిర్మాతలిద్దరూ ఎక్కడా రాజీ పకుండా సినిమా చేసారు. స్టోరీ బేస్ట్ సినిమా ఇది. సీనియర్ నటులతో కలిసి పనిచేయడం మంచి ఎక్స్ పీరియన్స్ని ఇచ్చింది` అని అన్నారు. దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ.. ‘హారర్ , థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్ అంశాల చుట్టూ కథ నడుస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆరేళ్ల వయసున్నవారి నుంచి 60 ఏళ్ల వయసు గల వరకూ అందరూ కలిసి చూడదగ్గ సినిమా. అసభ్యకర సన్నివేశాలు ఎక్కడా ఉండవు. క్లీన్ ఎంటర్ టైనర్. కథను నమ్ముకుని చేసాం. మా ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు. ఈ చిత్రంలో అర్చనా కౌడ్లీ, పోసాని కృష్ణ మురళి, ధన్ రాజ్, సారికా రామచంద్రరావు, రాం జగన్, లోహిత్ కుమార్, ఆనంద చక్రపాణి, ఆర్తి మోహ్రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత కల్ప, సోనీ హేమంత్ మీనన్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష నటిస్తున్నారు. ఈ చిత్రానికి రమణ.జీవి సంగీతాన్ని అందిస్తున్నారు. -
‘అర్థవంతంగా కాకుండా.. అర్దాంతరంగా ముగించేస్తాడు’
ఒకప్పటి ప్రేమదేశం సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రయాంగల్ లవ్స్టోరీస్లో ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే ఈ మూవీ టైటిల్ కూడా అప్పటినుంచి అంతే ప్రత్యేకతను సంపాదించుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు ఇదే టైటిల్తో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను ప్రస్తుతం విడుదల చేశారు. మూడు జంటల ప్రేమకథల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ టీజర్లో ఒక జంట లవ్స్టోరీని మాత్రమే చూపించారు. రెండో కథకు సంబంధించిన టీజర్ను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మంచి ఫీల్ను కలిగిస్తున్న ఈ టీజర్లో ట్రయాంగిల్ లవ్స్టోరీ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ చివరన తనికెళ్ల భరణి చెప్పిన ‘అన్ని కథలు అర్థవంతంగా కాకుండా కొన్ని అర్ధాంతరంగా ముగించేస్తాడు’ అనే డైలాగ్ హైలెట్గా నిలిచింది. శ్రీకాంత్ సిద్దం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. -
నేను విన్నాను.. నేనున్నాను..
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత వైఎస్ రాజశెఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వైఎస్సార్ చేసిన పాదయాత్రను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. కాగా, వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టీజర్ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఓ రైతు తను పడుతున్న కష్టాలను మహానేత దృష్టికి తీసుకువచ్చే సన్నివేశాన్ని ప్రధానంగా ట్రైలర్లో చూపించారు. ‘నీళ్లు ఉంటే కరెంట్ ఉండదు.. కరెంట్ ఉంటే నీళ్లు ఉండవు.. రెండు ఉండి పంట చేతికస్తే సరైన ధర ఉండదు.. అందరు రైతే రాజు అంటారు.. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్య.. మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి’ అంటూ రైతు తన ఆవేదనను మహానేతతో పంచుకుంటారు. ట్రైలర్ చివర్లో మమ్ముట్టీ పలికే.. ‘నేను విన్నాను.. నేనున్నాను’ మాటలు వింటే.. ఆయన వైఎస్సార్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తుంది. ఈ చిత్రం 2019 ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, గతంలో విడుదల చేసిన టీజర్కు, ఫస్ట్ లుక్కు తెలుగు రాష్ట్రాలోని ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్ను నిర్మిస్తున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. -
‘నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుపోతూ ఉంటా..’
ఖాకీ చిత్రంతో హిట్ పెయిర్గా నిలిచిన కార్తీ, రకుల్ ప్రీత్ల తాజా చిత్రం ‘దేవ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్లుక్ అభిమానుల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి కానుకగా ఈరోజు(సోమవారం) చిత్ర బృందం టీజర్ను విడుదల చేసింది. లవ్.. యాక్షన్.. రొమాన్స్ సీన్స్తో కూడిన ఈ టీజర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి.. ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి.. ఇష్టం లేని ఉద్యోగం చేసి.. ముక్కు మొహం తెలియని నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పడి పనిచేసి.. ఈగో, ప్రెషర్.. కాంపిటేషన్లో ఇరుక్కుని.. అంటీ అంటనట్టు లవ్ చేసి.. ఏం జరుగుతుందో అర్థం కాకుండా బతకడం ఓ దారి. ఇంకోదారి ఉంది..’ అంటూ కార్తీ వాయిస్ ఓవర్తో టీజర్ సాగింది. చివర్లో ‘నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుపోతూ ఉంటా..’ కార్తీ తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. టీజర్లో కార్తీ చాలా స్టైలిష్గా కనిపించారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని దర్శకుడు రజత్ రవిశంకర్ తెరకెక్కిస్తున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. -
ఒక్కరు కాదు ముగ్గురు
‘హృదయ కాలేయం’ ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఇషికా సింగ్, గీతాంజలి కథానాయికలు. ఆది కుంభగిరి, సాయిరాజేష్ నీలం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతోంది. ఈ చిత్రం సాంగ్ టీజర్ను ‘బిగ్ బాస్ 1’ కంటెస్టెంట్ల మధ్య హైదరాబాద్లో విడుదల చేశారు. డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్ మాట్లాడుతూ– ‘‘కొబ్బరిమట్ట’ చిత్రం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక సంపూర్ణేష్ని చూస్తేనే కామెడీ ఎంత ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇందులో ముగ్గురు సంపూర్ణేష్లుంటారు’’ అన్నారు. ‘‘కొబ్బరిమట్ట’ సినిమా రిలీజ్ రోజున సంపూర్ణేష్బాబు, సాయిరాజేశ్తో ‘సంపూ ఇన్ అమెరికా’ అని ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు కృష్ణారావు.‘‘హృదయ కాలేయం’ సినిమా టైమ్లో మేం ఎదగాలని అందరూ సపోర్ట్ చేశారు. అయితే ‘కొబ్బరిమట్ట’ చిత్రానికి మూడేళ్ల పాటు చాలా సమస్యలు ఎదుర్కొని అధిగమించాం’’ అన్నారు నిర్మాత సాయి రాజేష్. ‘‘మిట్టపల్లె అనే చిన్న ఊరు నుంచి నన్ను తీసుకొచ్చి రాజేష్ అన్న ‘హృదయ కాలేయం’ సినిమా చేశాడు. ఇప్పుడు ‘కొబ్బరి మట్ట’ సినిమాకి కూడా తనే నిర్మాత. ఆయన వెనక నిలబడి ఎన్ని రోజులైనా సపోర్ట్ అందిస్తాను’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. భరత్, అజయ్, కత్తి కార్తీక, సమీర్, ముమైత్ ఖాన్, మధుప్రియ, రైటర్ కిట్టు, అనురాగ్, సౌమ్య వేణుగోపాల్, శ్రవణ్, సాయిబాలాజీ, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు బిల్డప్ కృష్ణ
‘‘బిల్డప్ కృష్ణ’ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర చేశా. అప్పట్లో కొన్ని సినిమాల్లో ఐదారు కుటుంబాల మధ్యలో ముఖ్యమైన పాత్రలో గొల్లపూడి మారుతీరావుగారు ఎలా నటించేవారో.. ఈ సినిమాలో నాది అలాంటి పాత్ర’’ అని నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. సరీష్, గీత జంటగా పోసాని కృష్ణ్ణమురళి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బిల్డప్ కృష్ణ’. విన్సెంట్ సెల్వ దర్శకత్వంలో లక్ష్మీ టాకీస్ సమర్పణలో నిర్మించిన ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘ఇప్ప టి వరకు ఎన్నో పాత్రలు చేశాను. ‘బిల్డప్ కృష్ణ’లో ఏడ్చే పాత్ర చేశా. సన్నివేశాలు చూసి నేనే కన్నీళ్లు పెట్టుకున్నా.ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు కూడా కన్నీళ్లు వస్తాయి. విన్సెంట్ నాకు మంచి పాత్ర ఇచ్చారు. అందుకే టైటిల్ కూడా ‘బిల్డప్ కృష్ణ’ అని పెట్టాం. రైటర్గా ఉన్నప్పుడు కూడా నాకు నేను ఇలాంటి పాత్ర రాసుకోలేకపోయా, ఎవరికీ రాయలేకపోయా. ఈ సినిమాలో నా పాత్ర చూస్తుంటే గొల్లపూడి మారుతీరావుగారే కనిపిస్తారు’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. పోసానిగారితో చేయడం సంతోషాన్నిచ్చింది’’ అన్నారు విన్సెంట్ సెల్వ. ‘‘నా మొదటి చిత్రంతోనే పోసానిగారితో కలిసి నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా’’ అని సరీష్ అన్నారు. -
వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ టీజర్ రిలీజ్
-
యాత్ర టీజర్.. గడప కష్టాలు వినేందుకు రాజన్న...
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ టీజర్ రిలీజ్ అయ్యింది. మళయాళ మెగాస్టార్ మమ్ముటీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి వీ రాఘవ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా యాత్రను మహి రూపొందిస్తున్నారు. టీజర్ విషయానికొస్తే... పాదయాత్ర ప్రారంభించే ముందు వైఎస్సార్ మాటల్ని గుర్తు చేస్తూ టీజర్ ప్రారంభమైంది. ‘తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో... చరిత్రే నిర్ణయించుకోని’ అంటూ బ్యాక్ గ్రౌండ్లో డైలాగులు వినిపించాయి. పంచెకట్టులో రాజన్నను తలపిస్తూ.. అదే దరహాసం.. అదే తరహా అభివాదం ఓవరాల్గా మమ్ముట్టి.. లుక్ ఆకర్షించింది. ‘కే’ అందించిన బ్యాక్ గ్రౌడ్ స్కోర్ గూస్బమ్స్ తెప్పించేదిలా ఉంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. అతిత్వరలో యాత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. -
సన్నిలియోన్ బయోపిక్ వచ్చేస్తోంది
సాధారణ అమ్మాయి నుంచి పోర్న్ స్టార్గా తరువాత బాలీవుడ్ నటిగా మారిన సన్నీలియోన్ జీవితం తెర మీదకు రానుంది. కానీ ఇది వెండి తెర మీద కాదు, వెబ్ సిరీస్గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వెబ్సిరీస్ల హవా నడుస్తోంది. బాలీవుడ్లో వెబ్సిరీస్లు ఇప్పటికే విజయవంతమయ్యాయి. కొన్ని విషయాలు సినిమాగా తెరకెక్కిస్తే సెన్సార్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే దర్శక నిర్మాతలు వెబ్ సీరీస్ వైపు మొగ్గుచూపుతున్నారు. సన్నీలియోన్ జీవితం ఆధారంగా చిత్రం అంటే... అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది. వీటికి సెన్సార్ కత్తెరలు పడతాయని, అందుకే వెబ్సిరీస్ల ద్వారా ఈ బయోపిక్ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. సన్ని లియోనే బయోపిక్లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ వెబ్సిరీస్కు సంబంధించిన టీజర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ బయోపిక్ను చూడాలంటే నిర్ణీత సొమ్మును వసూలు చేస్తారట. ‘కరణ్జీత్ కౌర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ గా రూపొందుతున్న ఈ సిరీస్లో... సన్నీకి చిన్నతనంలో ఎదురైన అనుభవాలు, పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం, పోర్న్ స్టార్గా ఎదగడం, అవన్ని వదిలిపెట్టి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం, ఇక్కడ తన హవా కొనసాగించడం లాంటివి చూపించనున్నట్లు తెలుస్తోంది. కరణ్ జీత్ కౌర్ వోహ్రా అనేది సన్నిలియోన్ అసలు పేరు. -
ప్రభుదేవా ఫేస్ ఆఫ్ ఇండియా
తమిళసినిమా: ప్రభుదేవా ఈ పేరు వింటే యువతలో ఉత్సాహం పొంగుతుంది. తామూ సాధించాలనే తపన ఉరకలు వేస్తుంది. 20 ఏళ్లుగా తనదైన నటన, డాన్స్తో యువతను ఉర్రూతలూగిస్తున్న ప్రభుదేవా, దర్శక, నిర్మాతగానూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈయన తాజాగా ఒక సంగీత ఆల్బమ్ను రూపొందించారు. దాని పేరే ఫేస్ ఆఫ్ ఇండియా. వేల్స్ యూనివర్సిటీ అధినేత కే.గణేశ్తో కలిసి ప్రభుదేవా రూపొందించిన ఈ సంగీత ఆల్బమ్కు ఏజే దర్శకత్వం వహించారు. దీని గురించి యూనిట్ వర్గాలు తెలుపుతూ గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ మూజికల్ ఆల్బమ్ గ్రామీణ పాటలతో మన దేశంలోని భిన్న సంస్కృతులను, భాషల ప్రాముఖ్యతలను ఆవిష్కరించేదిగా ఉంటుందన్నారు. తరుణ్, వికాశ్, వినోద్, అంజలి జయప్రకాశ్ నటించిన ఈ ఆల్బమ్కు దీపక్కుమార్పదీ ఛాయాగ్రహణం అందించారని చెప్పారు. ఈ ఆల్బమ్ ఫస్ట్లుక్ పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు. అదే విధంగా ఆల్బమ్ టీజర్ను నటుడు ఆర్జే.బాలాజీ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. -
మోత మోగిపోద్ది
అందరికీ సౌండ్ వినపడుతుంది. కానీ నాకు మాత్రం కనపడుతుందండి అంటున్నాడు చిట్టిబాబు. అదేనండీ.. తనకు వినికిడి లోపం ఉన్న విషయాన్ని స్టైలిష్గా చెబుతున్నాడు. అంతేకాదండోయ్.. ఆ ఊరికి చిట్టిబాబే ఇంజనీర్. అందుకే అందరూ చిట్టిబాబును సౌండ్ ఇంజనీర్ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఇదంతా ఓకే కానీ.. చిట్టిబాబుకు సౌండ్ వినిపించకపోయినా లిప్ మూమెంట్లో తేడా కనిపించిందో అంతే.. రీసౌండ్ మోత మోగిపోతుంది. అది ఏ రేంజ్లో అనేది తెరపై చూడండి అంటున్నారు ‘రంగస్థలం’ చిత్రబృందం. రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రంగస్థలం’ టీజర్ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్రాజ్, అనసూయ కీలకపాత్రలు చేస్తున్నారు. ‘‘యూనిక్ క్యారెక్టరైజేషన్ను తెరకెక్కిస్తున్న దర్శకుడు సుకుమార్కి థ్యాంక్స్. షూటింగ్లో ప్రతి సీన్ను ఎంజాయ్ చేస్తున్నాం’’ అని హీరో రామ్చరణ్ టీజర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. టీజర్లో రామ్చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని కొందరు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. గోదావరి యాసలో రామ్చరణ్ చెప్పిన డైలాగ్స్ సూపర్గా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. టీజర్ రిలీజైన ఆరు గంటల్లోపు 40 లక్షలు డిజిటల్ వ్యూస్ వచ్చాయని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. -
ఒక్క క్షణం టీజర్.. చాలా కొత్తగా ఉందే!
-
ఒక్క క్షణం టీజర్.. చాలా కొత్తగా ఉందే!
సాక్షి, సినిమా : టాలీవుడ్లో మరో ఆసక్తికర సబ్జెక్టుతో ఓ చిత్రం రాబోతుంది. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన హీరో అల్లు శిరీష్.. ఎక్కడికి పోతావు చిన్నివాడా మరి గుర్తింపు పొందిన దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఒక్క క్షణం. ఈ చిత్ర టీజర్ కాసేపటి క్రితం విడుదలయ్యింది. ఫేట్ వర్సెస్ డెస్టినీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా టీజర్ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. రెండు సమకాలీన జీవితాలు, ఒకరి ఫాస్ట్.. మరోకరి ఫ్యూఛర్ మీద ఆధారపడి ఉండటం అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థమౌతోంది. సస్పెన్స్తో కూడిన ఎలిమెంట్లు చూపించగా.. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి వెనకాడని యువకుడి పాత్రలో శిరీష్ నటించాడు. సురభి, సీరత్ కపూర్లు హీరోయిన్లుగా, అవసరాల శ్రీనివాస్, జయప్రకాశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక్క క్షణం డిసెంబర్ చివర్లో విడుదల కానుంది. Presenting the teaser of Okka Kshanam. Wondering if you also might be having a "parallel life" with someone? #OkkaKshanam https://t.co/SlpFoZtPnj — Allu Sirish (@AlluSirish) December 3, 2017 -
శివన్న కొత్త టీజర్ ఊపేస్తోంది
-
శివన్న కొత్త టీజర్ ఊపేస్తోంది
సాక్షి, సినిమా : కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొత్త సినిమా తగరు టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రం ద్వారా శివరాజ్కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నేరమూ-శిక్ష కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి దునియా సూరీ దర్శకత్వం వహించగా.. భావన, మన్వితాలు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రతీకార నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు టీజర్ను చూస్తే అర్థమౌతోంది. కత్తి.. రక్తపు మరకలు.. పగతో రగిలిపోయే హీరో.. క్రూరమైన విలన్, వరుస హత్యలు... ఇలా టీజర్ ను కట్ చేశారు. ఈ మధ్య సాఫ్ట్ చిత్రాలలో నటిస్తున్న శివన్నను ఒకేసారి మాస్ రోల్లో చూసే సరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి శివరాజ్ సోదరుడు పునీత్తోపాటు తెలుగు హీరో అల్లు శిరీష్ కూడా హాజరు కావటం విశేషం. ఈ మేరకు శిరీష్ తన ట్విట్టర్లో ఫోటోలను పోస్ట్ చేశాడు. తగరుతోపాటు శివరాజ్ కుమార్ మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి నార్తన్ డైరెక్షన్ లో తెరకెక్కే ముఫ్తీ కాగా, మరోకటి ప్రేమ్ దర్శకత్వంలో మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న ది విలన్. ఇందులో కిచ్ఛా సుదీప్(ఈగ ఫేమ్)తోపాటు బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, అమీజాక్సన్ నటిస్తున్నారు. -
అది యాక్సిడెంట్ కాదు సార్.. మర్డర్!
...ఈ డైలాగుతో ప్రారంభమయ్యే ‘దృష్టి’ టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది! ‘ఎందుకురా... మర్డర్ చేశావ్!’, ‘ఏ మాట్లాడుతున్నారు సార్... ప్రూఫ్ లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు’... వంటి డైలాగుల్ని బట్టి చూస్తే సినిమా హత్య నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్, పావనీ గంగిరెడ్డి జంటగా, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘దృష్టి’. శ్రీనివాస్ మోతుకూరి సమర్పణలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మోహన్ నిర్మిసున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్ను గాయని, రాహుల్ సతీమణి చిన్మయి విడుదల చేశారు. రామ్ అబ్బరాజు మాట్లాడుతూ– ‘‘ఇలాంటి కథలు ఒప్పుకోవడానికి హీరోలకు ధైర్యం ఉండాలి. ఆ విషయంలో రాహుల్కు థ్యాంక్స్ చెప్పాలి’’ అన్నారు. ‘‘నేనెప్పటి నుంచో కొత్తగా సినిమా చేయాలనుకుంటున్న టైమ్లో రామ్ నాకు ‘దృష్టి’ కథ చెప్పాడు. నచ్చడంతో ఓకే చెప్పేశా’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రీ–రిలీజ్ ఫంక్షన్ జరిపి, సినిమా రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు మోహన్. -
మాస్ పోలీస్
‘‘గతంలో దీక్ష, శనిదేవుడు వంటి చిత్రాలు డైరెక్ట్ చేశా. పక్కా మాస్, కమర్షియల్ సినిమా చేయాలని ‘పోలీస్ పవర్’ కథ రాసుకున్నా. కాల్మనీ నేపథ్యంలో సాగుతుందీ చిత్రం’’ అని శివ జొన్నలగడ్డ అన్నారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీస్ పవర్’. నందినీ కపూర్ కథానాయిక. గుద్దేటి బసవయ్య నిర్మించిన ఈ చిత్రం బ్యానర్, టైటిల్ లోగోను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, టీజర్ను ‘లయన్’ సాయివెంకట్ విడుదల చేశారు. ‘‘గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేశా. ‘దొరతనం మాకొద్దు’, ‘శనిదేవుడు’ వంటి చిత్రాలు నిర్మించాను. శివగారు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ చిత్రం తీశా. ఈనెలలోనే పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్. కుమార్, బాపు.జి, సంగీతం: శివ జొన్నలగడ్డ. -
నాన్న... బాయ్ఫ్రెండ్స్.. ఓ అమ్మాయి!
‘‘నా దగ్గర అసోసియేట్గా పనిచేసిన భాస్కర్ నా కుటుంబ సభ్యుడిలాంటి వాడు. తను ఈ చిత్రకథ చెప్పగానే వేణుగోపాల్కి నేనే ఫోన్ చేశా. ‘దిల్’రాజు ఈ చిత్రంలోకి ఎంటరయ్యాక మరింత గ్లామర్ వచ్చింది. ఆయన సినిమా టేకప్ చేశారంటే బావున్నట్టే లెక్క’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ ప్రధానపాత్రల్లో భాస్కర్ బండిని దర్శకునిగా పరిచయం చేస్తూ బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మించిన చిత్రం ‘నాన్న... నేను... నా బాయ్ఫ్రెండ్స్’. ఈ సినిమా టీజర్ను వినాయక్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘తండ్రి, కూతురు మధ్య సాగే కథ ఇది. కూతురున్న ప్రతి తండ్రికి, ఆ కుటుంబానికి బాగా నచ్చుతుంది. తొలుత ఈ చిత్రానికి ‘నేను నా బాయ్ఫ్రెండ్స్’ టైటిల్ అనుకున్నారు. కథ విన్నాక ‘నాన్న... నేను... నా బాయ్ఫ్రెండ్స్’ కరెక్ట్గా ఉంటుందని చెప్పా. ఈ చిత్రాన్ని మా బ్యానర్లో విడుదల చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. భాస్కర్ చక్కగా తీర్చిదిద్దాడు. త్వరలో పాటలు రిలీజ్ చేసి, డిసెంబర్ 9న ఈ చిత్రం విడుదల చేస్తాం’’ అని తెలిపారు. బెక్కం వేణుగోపాల్, భాస్కర్ బండి, హెబ్బా పటేల్, తేజస్వి, అశ్విన్, పార్వతీశం, నోయెల్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: ఛోటా కె.నాయుడు. -
విజయ్ అభిమానులకు దీపావళి ధమాకా
తమిళ ఇళయదళపతి అభిమానులిప్పుడు పుల్ జోష్లో ఉన్నారు. విజయ్ తన 60వ చిత్రం భైరవా టీజర్ను గురువారం విడుదల చేసి అభిమానులకు దీపావళి కానుకగా అందించారు. ఈ టీజర్ వారిని యమ ఖుషీ పరుస్తోంది. విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భైరవా. ఇంతకు ముందు విజయ్ హీరోగా అళగీయతమిళ్మగన్ చిత్రాన్ని తెరకెక్కించిన భరతన్ ఈ భైరవా చిత్రానికి దర్శకుడు.ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స పతారంపై బి.నాగిరెడ్డి దివ్యాశీస్సులతో బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో విజయ్కు జంటగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గురువారం విడుదల చేసిన చిత్ర టీజర్కు సినీ ప్రేక్షకులు, విజయ్ అభిమానుల మధ్య అనూహ్య స్పందన వస్తోంది. ఫుల్ యాక్షన్, పంచ్డైలాగ్సతో కూడిన ఈ టీజర్లో విజయ్ నీటితో ఉన్న భూమిపై అడుగు పెట్టే సన్నివేశంతో మొదలై రౌడీని ఎత్తి గాలిలో తిప్పి కిందపడేసే దృశ్యం. అది చూసిన జగపతిబాబు యార్డా అవన్(ఎవడురా అతను)అని ఆవేశంగా గర్జించే దృశ్యం, తెరింజ ఎదిరియై విడ తెరియాద ఎదిరిక్కుదాన్ ఆళు అధికమాగ ఇరుక్కమ్(తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువుకే మంది ఎక్కువగా ఉంటారు), నెరియపేరుకిట్ట ఇల్లాద కెట్ట పళక్కం ఎన్కిట్ట ఉరుక్కు( చాలా మందికి లేని చెడ్డ గుణం నాకు ఉంది) లాంటి పంచ్ డైలాగ్సతో కూడిన భైరవా టీజర్కు విశేష స్పందన వస్తోంది. ఈ టీజర్ను 20 గంటల్లోనే 22 లక్షల మంది తిలకించారని, 1.53 లక్షల మంది లైక్ చేశారని నెటిజన్లు గణాంకాలు చెబుతున్నారు. అంతే కాదు 24 గంటల్లో మూడు మిలియన్లు దాటే అవకాశం ఉందంటున్నారు. దీంతో విజయ్ అభిమానుల ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంతో ఫుల్జాయ్లో ఉన్నారు. -
నాన్నకు ప్రేమతో.. టీజర్ విడుదల
సుదీర్ఘ విరామం తర్వాత సరికొత్త లుక్తో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో..' సినిమా టీజర్ విడుదలైంది. ముందునుంచి అన్నట్లుగానే దసరా కానుకగా బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ టీజర్ను విడుదల చేశారు. 'ఐ వాంట్ టు ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు' అనే పాటతో కూడిన ఈ టీజర్ను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు. తారక్ నటిస్తున్న 25వ సినిమా కావడం, విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దీనికి దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై అంచనాలు బాగా పెరిగాయి. దేవిశ్రీ ప్రసాద్ మార్కు సంగీతం ఈ టీజర్లో కనిపిస్తోంది. టెంపర్ సక్సెస్తో మంచి ఫాంలో ఉన్న జూనియర్ ఈ సినిమా కోసం పూర్తి డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. 'వన్' ఫెయిల్యూర్ తరువాత డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న సినిమా కావటం కూడా మూవీపై అంచనాలు పెంచేసింది. హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్ను సరికొత్తగా చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నెగెటివ్ రోల్లో అలరించనున్నాడు. -
సైజ్ జీరో టీజర్ విడుదల
-
సైజ్ జీరో టీజర్ విడుదల
టాలీవుడ్తో పాటు అన్నిభాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైజ్ జీరో' సినిమా టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్వీటీ అనుష్క బాగా లావుగా కనిపించే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లింకును అగ్రహీరో నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అనుష్క ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉందని, ఇది అమోఘమని ఆయన అన్నారు. ఇక ఈ టీజర్లో పక్క పక్క సీట్లలో ఒక కుక్కతో లావుగా కనిపించే అనుష్క, కూల్డ్రింకు తాగుతూ.. చిరుతిళ్లు తింటూ.. హీల్స్తో నడవడానికి అష్టకష్టాలు పడుతూ ఉంటే ఆ పక్కనే ఉండే ఆర్య ఆమె కష్టాలు చూసి తెగ నవ్వుతుంటాడు. అలాగే, కుర్చీలో కూర్చోబోతుంటే అది కాస్తా విరిగిపోతుంది. అంతా అయిన తర్వాత.. కాస్త సన్నబడ్డ అనుష్క.. వేయింగ్ మిషన్లో బరువు చూసుకుని ఆనందంతో గెంతులు వేస్తుంది. మొత్తమ్మీద టీజర్ చూస్తేనే సినిమా ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అర్థమైపోతోంది. #SizeZero The incredible Anushka,Amazing!!http://t.co/lOlVyBAz00 — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 31, 2015 -
విజయ్ ’పులి’ టీజర్ రిలీజ్
-
డ్రాగన్ హంగామా
బొమ్మలు తెరపై మాట్లాడి, ఆడి పాడే 2డి యానిమేషన్ చిత్రాల అనుభూతిని మళ్లీ రుచి చూపించడానికి వస్తున్న చిత్రం ‘లిటిల్ డ్రాగన్’. గోలి శ్యామల స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ టీజర్ను విడుదల చేశారు. జపాన్, భారత్ సంప్రదాయాల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కడుపుబ్బా న వ్విస్తుందని శ్యామల తెలిపారు. -
మహేష్ 'ఆగడు' టీజర్