tomorrow
-
రేపటి నుంచి మహాకుంభమేళా.. ఎటు చూసినా కోలాహలం (ఫోటోలు)
-
రేపటి నుంచి అలెక్సా పనిచేయదు! కానీ..
ఆధునిక కాలంలో అమెజాన్ అలెక్సా, యాపిల్ హే సిరి వంటి వాయిస్ అసిస్ట్ సర్వీకులు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. అయితే అలెక్సా త్వరలో కొన్ని డివైజ్లలో పనిచేయదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెజాన్ అలెక్సా సర్వీసుకు సంబంధించి సెర్చ్ ఇంజిన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇది గూగుల్ నెస్ట్ కిట్పై పనిచేయదని సమాచారం. రేపటి నుంచి (2023 సెప్టెంబర్ 29) గూగుల్ లెగసీ నెస్ట్ కిట్ ద్వారా అలెక్సా సేవలు నిలిచిపోతున్నాయి. అయితే ఈ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే కొత్త Google Nest స్కిల్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్లోని అలెక్సా యాప్ ఓపెన్ చేసి, ట్యాప్ మరి మీద క్లిక్ చేయాలి. తరువాత స్కిల్ అండ్ గేమ్స్ సెలక్ట్ చేసుకుని, ఫైండ్ యువర్ స్కిల్స్ ఎంచుకోవాలి. ఫైండ్ నెస్ట్ అలెక్సా స్కిల్ సెలక్ట్ చేసి డిసేబుల్ చేయాలి. * అలెక్సా యాప్లో ఉన్న నెస్ట్ డివైజెస్ అన్నీ రిమూవ్ చేయాలి. గూగుల్ హోమ్ యాప్లో న్యూ గూగుల్ నెస్ట్ అలెక్సా స్కిల్ ప్రారంభించడానికి, ముందుగా యాప్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి + గుర్తు మీద ట్యాప్ చేయాలి. అందులో సర్వీస్ ఎంచుకుని అందులో అమెజాన్ అలెక్సా స్కిల్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అలెక్సా యాప్ ఓపెన్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. అమెజాన్ ఎకో స్పీకర్ లేదా డిస్ప్లేను కలిగి ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు..
ఢిల్లీ: జీ20 సమావేశానికి హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తదితరులకు రెండు రోజుల పాటు దేశ రాజధానిలో అతిథ్యం ఇవ్వనున్నారు. భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే జీ20 కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కానున్న విషయం తెలిసిందే. రిషి సునాక్.. బ్రిటన్కు చెందిన తొలి భారత సంతతి ప్రధానమంత్రి రిషి సునక్ సెప్టెంబర్ 8న శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు. ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్లో రిషి సునాక్కు బస ఏర్పాట్లు చేశారు. జో బైడెన్.. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకుంటారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి VK సింగ్ స్వాగతం పలుకుతారు. జో బైడెన్కు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బస ఏర్పాట్లు చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన జీ20 సమావేశాలకు హాజరవుతారా..? లేదా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ బైడెన్కు కరోనా నెగటివ్ రావడంతో ఆయన భారత్కు రానున్నారు. జస్టిన్ ట్రూడో.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రేపు సాయంత్రం 7 గంటలకు భారత్కు చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు ఆహ్వానం పలుకుతారు. ట్రూడో ఢిల్లీలోని లలిత్ హోటల్లో బస చేస్తారు. కెనడాలో ఈ మధ్య ఖలిస్థానీ ఉగ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన భారత్కు రావడం ప్రధాన్యత సంతరించుకుంది. జపాన్ ప్రధాని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రేపు భారత్కు వస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పాలం ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగుతారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆహ్వానం పలుకుతారు. కిషిదా భారత్కు రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో భారత్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన.. ప్రధాని మోదీతో సమావేశమై భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇదీ చదవండి: Sanathana Dharma Row: అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. -
రేపు నితిన్ గడ్కరీ ప్రారంభించనున్న కొత్త ప్రోగ్రామ్ ఇదే..
Bharat NCAP: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (భారత్ ఎన్సీఏపీ) రేపు (మంగళవారం) ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్ ఎన్సీఏపీ భారతీయ ఆటోమొబైల్స్ భద్రతా ప్రమాణాలను పెంచడంతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ కార్ల ప్రతిష్టతను పెంచడానికి తోడ్పడుతుంది. తద్వారా రానున్న కొత్త ఉత్పత్తులు (కార్లు) మరింత పటిష్టమైన భద్రతను కలిగి ఉంటాయి. దీనికింద కార్లను క్రాష్ టెస్ట్ చేసి వాటికి సేఫ్టీ రేటింగ్ కూడా అందించడం జరుగుతుంది. సేఫ్టీ రేటింగ్ ఆధారంగా కారు భద్రతను నిర్థారిస్తారు. ఇది కార్ల కొనుగోలుదారులకు, భారత ఆర్థిక వ్యవస్థ పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మన దేశంలో తయారయ్యే కార్లు అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యత లేని కార్లుగా పరిగణించబడుతున్నాయి. దీనికి చెప్ పెట్టడానికి ఈ ప్రోగ్రామ్ ప్రారంభమవుతోంది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతయ్యే కార్ల సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 22 యాప్స్ అవుట్.. ఇవి మీ మొబైల్లో ఉన్నాయా? క్రాష్ టెస్టులో కారు పనితీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ పరీక్షించి రేటింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. అంటే కారు యువకులకు, పిల్లలకు ఏ విధమైన రక్షణ అందిస్తాయనేది ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. రేపు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం భారత్లో సేఫ్టీ సెన్సిటివ్ కార్ మార్కెట్ను అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు. భారత్ ఎన్సీఏపీ కార్యక్రమానికి మారుతీ సుజుకి, మహీంద్రా & మహీంద్రా, టయోటా వంటి వాహన తయారీ దారులు ఇప్పటికే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాయి. ఈ ప్రోగ్రామ్ ద్వారా తప్పకుండా కార్లు మరింత భద్రతా ఫీచర్స్ పొందనున్నట్లు భావిస్తున్నారు. దీంతో భారతదేశంలో ప్రమాదంలో మరణించే వారి సంఖ్య తప్పకుండా తగ్గుతుందని చెబుతున్నారు. -
అదే నా ఆస్తి – బ్రహ్మాజీ
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ. -
TS: పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి గురువారం బలహీనపడిందని... దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో గద్వాల జిల్లా జూరాలలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా ఖిలా ఘన్పూర్లో 4, నల్లగొండ జిల్లా దేవరకొండలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కొమురం భీం జిల్లా కుంచవెల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
నిన్న నేడు రేపు
నేడులో ఉన్న మనం నిన్నను దాటుకుని వచ్చాం. నేడునూ దాటుకుని మనం రేపులోకి వెళ్లాల్సి ఉంది. నిన్న, నేడులకన్నా మనకు రేపు ఎంతో ముఖ్యం. నిన్న, నేడుల్లో లాభం, నష్టం, సుఖం, శోకం, ప్రగతి, పతనం మనకు వచ్చి ఉంటాయి. వీటి ప్రాతిపదికన మనం రేపులోకి వెళ్లాల్సి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితి ఏదైనా మనం తప్పకుండా రేపు వైపు కదలాలి; కదులుదాం. నిన్నవైపు కాదు మన చూపు రేపు వైపు ఉండాలి. నేడులో ఉండిపోవడం కాదు మనం రేపువైపు నడవాలి. రేపువైపు చూపు వేసి మనం కదులుతూ ఉండాలి. మన చూపు నిండా, మన కదలిక నిండా చేవను మనం నింపుకోవాలి. మనలో నీరసం ఉంటుంది. దాన్ని నిన్న మరిచిపోయినా నేడు నేల రాసేసుకోవాలి. మనలో చెడ్డతనం ఉంటుంది. అది నిన్నటి నుంచి నేడులోకి వచ్చేసినా రేపులోకి రాకుండా దాన్ని కూలదోసుకోవాలి. మనలోని మూర్ఖత్వాన్ని నేడు తప్పకుండా విడిచి పెట్టెయ్యాలి. మన జాడ్యాలు మన రేపులోకి రాకుండా నేడు మనమే వాటిని మట్టు పెట్టుకోవాలి. నిన్న మనకు మనమే వేసుకున్న కుత్సితాల సంకెలల్ని నేడైనా తెంచేసుకోవాలి. నిన్న మనలోకి వచ్చి చేరి నిలిచి ఉన్న మత్సరభావాల విషాన్ని నేడు పూర్తిగా ఒంపేసుకోవాలి. నిన్నకు నేడు కొనసాగింపు కాకూడదు. నిన్నకు నేడు కొనసాగింపు అయి ఉంటే అది తప్పు అని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ తప్పు కొనసాగకుండా నేడు మనం జాగ్రత్తపడాలి. జాగరూకతతో మనం రేపును స్పృశించాలి. నిలిచి ఉండే చెలిమితోనూ, నిజమైన నైజంతోనూ, నిర్మలమైన హదయంతోనూ, చల్లటి ఆశయాలతోనూ, చక్కని ఆలోచనలతోనూ సత్ప్రవర్తనతోనూ మనం రేపులోకి వెళ్లాలి. మన నిన్నలో, నిన్న మనలో అవి లేకపోయినా రేపు అవి మనకు ఎంతో అవసరం అని నేడైనా గ్రహించి మనం రేపులోకి వెళ్లాలి. నిన్న మనం ఎలా ఉన్నా, నేడు మనం ఎలా ఉంటున్నా రేపు మాత్రం మనం గొప్పగా ఉండాలి; అధమపక్షం రేపు మనం బావుండాలి. అందుకు నేడు మనం సిద్ధపడాలి. రేపులో మనం మెరుగ్గానూ, మేలుగానూ ఉండేందుకు మనం నేడు తయారుగా ఉండాలి; మనల్ని మనం తయారు చేసుకోవాలి. అలవాటుపడ్డ సోమరితనానికి, అభిప్రాయాలకూ నేటితో స్వస్తి పలికి, ఉండాల్సిన ఉత్సాహానికి, అవగాహనకూ నేడైనా నాంది పలికి అభ్యున్నతికి ప్రస్తావన కలిగేందుకు, కల్పించుకునేందుకు రేపులోకి వెళ్లాలి మనం. పనిచేస్తూ ప్రయోజనాన్ని పొందే చేతులతో, మెరిసే తలపులు కలిగే మస్తిష్కంతో భేషజాల పరదాలు తొలగించుకుని, వేషాలు పోయే గుణాన్ని మరచిపోయి మనం రేపులోకి చేరాలి. పరుల బాధను పట్టించుకోవడం పాపం కాదు; తోటి వాడికి మంచి చెయ్యడం నేరం కాదు; సాటివాడికి చేయూతను ఇవ్వడం దోషం కాదు కాబట్టి వాటిని చేపట్టడానికి కూడా మనం రేపును వేదిక చేసుకోవాలి. రేపైనా మనల్ని మనం నరులం అని నిరూపించుకోవాలి. మన కోసం, మన రాక కోసం వేచి ఉన్నది సుమా రేపు అన్నది; లేచి వెళ్లి అందుకోవడానికే మనం ఉన్నది. మనంత మనంగా, మనం మనంగా నిజమైన మనుషులంగా జీవం ఉన్నవాళ్లంగా జీవించేందుకుగా మనం రేపును అందుకోవాలి. మన రాగం, మన యాగం, మన త్యాగాలతో గణనీయమైన మనుగడను సాధించేందుకు, ఆపై మన గానం, మన ధ్యానం, మన జ్ఞానాలతో స్మరణీయమైన మనుషులం అయ్యేందుకు మనం రేపును ఆవాహన చేసుకోవాలి. ‘బెదురు లేకుండా కదులుతూ ఎదురు వెళ్లి రేపులోకి ప్రవేశిద్దాం; ఏ మాత్రమూ చెదిరిపోకుండా ఎదిగేందుకు విఫలం అవకుండా రేపుకు ప్రయుక్తం అవుదాం‘. – రోచిష్మాన్ -
ఏపీ: రేపు రాష్ట్రవ్యాప్తంగా పెంచిన పెన్షన్ పంపిణీ
-
రేపు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ..
-
సభా పర్వం : రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
-
Cabinet Meeting: రేపు కేంద్ర కేబినెట్ భేటీ
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ మీటింగ్లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, బుధవారం రోజున కొత్త కేంద్రమంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. కేబినెట్ విస్తరణ కోసం మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, కేంద్ర మంత్రుల పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేశారు. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్లో చోటు కల్పించారు. వీరంతా బుధవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. -
రేపు విశాఖ నగరానికి సీఎం జగన్ రాక
సాక్షి, ప్రతినిధి, విశాఖపట్నం: పాకిస్థాన్పై విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నిర్వహించే నౌకాదళ దినోత్సవానికి ఈ ఏడాది ముఖ్య అతి«థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. విశాఖ రామకృష్ణా బీచ్లో ఈసారి సీఎం సమక్షంలో నేవీ డే విన్యాసాలు నిర్వహించనున్నారు. తూర్పు నౌకాదళ(ఈఎన్సీ) చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఖరారైంది. ఆ మేరకు సీఎం కార్యాలయం నుంచి బుధవారం నాటి పర్యటన షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి ముఖ్యమంత్రి గన్నవరం ఎయిర్పోర్ట్కు బయలుదేరుతారు. 2.20 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. విమానంలో మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని 3.40 గంటలకు సర్క్యూట్ హౌస్కు విచ్చేస్తారు. సాయంత్రం 4 గంటలకు సర్క్యూట్ హౌస్ నుంచి నేవీ విన్యాసాలు జరిగే ఆర్కే బీచ్కు బయలుదేరుతారు. సాయంత్రం 5.30 గంటల వరకు అక్కడ జరిగే నేవీ డే విన్యాసాలు, ప్రదర్శనలను తిలకిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి సర్క్యూట్ హౌస్కు చేరుకుంటారు. 6.10 గంటలకు నేవీ హౌస్కు బయలుదేరతారు. 6.20 నుంచి 7 గంటల వరకు అక్కడ జరిగే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొంటారు. ఏడు గంటలకు నేవీ హౌస్ నుంచి నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్కు బయలుదేరుతారు. రాత్రి 7.30 గంటలకు విమానంలో బయలుదేరి 8.10 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8.40గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం చేరుకుంటారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైనట్టు జిల్లా కలెక్టర్ వినయ్చంద్ వెల్లడించారు సీఎం దంపతులకు ఆహ్వానం నేవీ డే ఉత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఈఎన్సీ చీఫ్ జైన్ కోరారు. ఇటీవల అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఉత్సవాలకు సీఎం దంపతులు విచ్చేయాలని ఈఎన్సీ చీఫ్ అభిలషించారు. -
రేపు విశాఖకు ఉప రాష్ట్రపతి రాక
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం నగరానికి రానున్నారు. ఉదయం 9.50 గంట లకు విశాఖ ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో వస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎన్ఎస్టీఎల్ చేరుకొని అక్కడ నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొం టారు. అక్కడి నుంచి 12 గంటలకు బయలు దేరి సాగరనగర్లోని తన స్నేహితుడు ఇంటికి వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు కిర్లంపూడి లే అవుట్లోని ఆయన నివాసానికి చేరుకొని రాత్రికి బస చేస్తారు. గురువారం ఉదయం 9 గంటలకు నివాసం నుం చి బయలదేరి రోడ్డు మార్గం ద్వారా గంభీ రం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్లో జరిగే సదస్సులో పాల్గొంటారు. అక్కడ నుంచి 12 గంట లకు ఎయిర్పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరితారు.. -
రేపు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
-
ఇడుపులపాయలో జోరందుకున్న ఏర్పాట్లు
-
రేపు వైఎస్ఆర్ ఎనిమిదో వర్ధంతి
-
రేపటి నుంచి నాటికల పోటీలు
కాకినాడ కల్చరల్ : కళాకారులను ప్రోత్సహిస్తూ, నాటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి బాబ్జి, పంపన దయానంద బాబు తెలిపారు. స్థానిక యంగ్మెన్స్ క్లబ్ సమావేశపు మందిరంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ, రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థల సౌజన్యంతో ఈ నెల 4 నుంచి 6 వరకూ స్థానిక సూర్యకళామందిర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కరప గ్రామంలోని శ్రీ నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. 4న గోవాడ క్రియేషన్స్ వారి ‘రచ్చబండ’ నాటిక, ఎస్ఎన్ఎం క్లబ్ వారి ‘గడి’ నాటిక, 5న గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక రూపకల్పన చేసిన ‘తేనేటీగలు పగపడతాయి’ నాటిక, మూర్తి కల్చరల్ అసోసియేషన్ వారి ‘అంతిమ తీర్పు’ నాటిక, 6న ఉషోదయ కళానికేతన్ వారి ‘గోవు మాలచ్చిమి’ నాటిక, శ్రీసాయి ఆర్ట్స్ వారి ‘చాలు–ఇకచాలు’ నాటిక, అభినయ ఆర్ట్స్ వారి ‘సరికొత్త మనుషులు’ నాటిక ప్రదర్శించనున్నట్టు వారు తెలిపారు. శ్రీనటరాజ కళామందిర్ కూచిపూడి, ఆంధ్ర నాట్య పాఠశాల నాట్యాచార్య ఆనెం ప్రసాద్ శిష్య బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రముఖ కవి, విమర్శకులు వి.ఎస్.ఆర్.ఎస్.సోమయాజులకు ‘సాహితీ కళాభిజ్ఞ’ పురస్కారం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు ‘సేవారత్న’ ఆత్మీయ పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో బాజిబోయిన వెంకటేష్ నాయుడు, భీమశంకర్, తురగా సూర్యారావు, టి.ఎల్.ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
బిగుస్తున్న బడుగు పిడికిళ్లు
-శ్రామికుల బతుకులతో బాబు సర్కారు చెలగాటం -వివిధ పథకాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్ట విధానాలు -నిరసనగా పోరుపథంలో కదం తొక్కుతున్న కార్మికులు -రేపు కలెక్టరేట్ ముట్టడి మానవ మనుగడకు, పురోగతికి మూలం శ్రమ. సమాజ పరిణామ క్రమంలో మనుషుల మధ్య అంతరాలకు ప్రధాన కారణం సంపద కొంత మంది వద్దే పోగుబడుతుండడంతో అత్యధికులు పేద, మధ్య తరగతులుగా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి వర్గాలకు ఎంతోకొంత ఊతంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు అమలు చేస్తున్నవే సంక్షేమ పథకాలు. ఆ కోవలోవే అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం, ఆశా వర్కర్ల వ్యవస్థ. అయితే..ఆ కనీస శ్రేయస్సుకు శ్రమించే వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి, ఆ వ్యవస్థల్లో పని చేసే శ్రామికుల జీవితాలను చీకటిలోకి నెట్టజూస్తోంది చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం. అలాగే ఎంవీ యాక్ట్లో సవరణల పేరుతో లక్షలాదిమంది ట్రాన్స్పోర్ట్ కార్మికులను వేధింపులకు గురిచేసే దిశగా అడుగులు వేస్తోంది. నిధుల మళ్లింపుతో భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సుకు భంగం కలిగిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల జీవితాలనూ ఊబిలోకి నెడుతోంది. సర్కారు కర్కశ వైఖరికి నిరసనగా బడుగుజనం పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏకమవుతున్న శ్రామిక శక్తి ఈ నెల మూడున చలో కలెక్టరేట్ పేరుతో ముట్టడికి పూనుకుంటోంది. ఈ నేపథ్యంలో వారి సమస్యలు, వేదనలు, డిమాండ్లపై ప్రత్యేక కథనం.. -కపిలేశ్వరపురం (మండపేట) వేలాదిమంది స్కీం వర్కర్లు.. జిల్లాలో ఆశ వర్కర్లు 4,000 మంది, సెకండ్ ఏఎన్ఎంలు 700 మంది, టీబీ కంట్రోల్ ప్రోగ్రాం సిబ్బంది 150 మంది, 24 గంటల పీహెచ్సీల్లో స్టాఫ్ నర్సులు, కంటింజెంట్ వర్కర్లు 140 మంది, హెచ్ఐవీ రోగులకు సేవలందించే ఏపీ సాక్స్లో కౌన్సిలర్లు, స్టాఫ్నర్సులుగా 100 మంది, అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణ నిమిత్తం కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరంలలోని ఎస్ఎన్ కేర్ యూనిట్స్, ఎన్ఆర్సీలలో స్టాఫ్ నర్సులు, సెక్యూరిటీ గార్డులుగా 100 మంది, ఆయుర్వేదం, యునానీ, హోమియో వైద్య సేవలందించే ఆయుష్ విభాగంలో 100 మంది, ఆర్బీఎస్కే పథకం వైద్యులు, స్టాఫ్నర్సులు, ఫిజియో థెరపిస్టులుగా 200 మంది, హెల్త్ మిషన్ కార్యాలయాల్లో ఉద్యోగులుగా పది మంది, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో 150 మంది, వైద్యాధికారులుగా 200 మంది, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులుగా 8,000 మంది, 5,200 అంగన్వాడీ కేంద్రాలున్న ఐసీడీఎస్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలుగా 10,500 మంది, మినీ వర్కర్లుగా 200 మంది సేవలందిస్తున్నారు. ప్రీ స్కూల్స్ పేరుతో అంగన్వాడీ కేంద్రాల మూసివేత దిశగా.. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఎత్తివేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. జిల్లాలోని కేంద్రాల్లో సుమారు 10,500 మంది కార్యకర్తలు, ఆయాలుగా పనిచేస్తున్నారు. తెలంగాణలో కార్యకర్తకు రూ.10 వేలు, ఆయాకు రూ.8 వేలు ఇస్తుండగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కార్యకర్తకు రూ.7 వేలు, ఆయాకు రూ.4 వేలు వేతనంగా ఇస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు, ఐదు నెలలుగా కేంద్రాల అద్దె బిల్లు, ఏడాదిగా పుల్లల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను ఎత్తేసి ప్రీ స్కూల్స్గా మార్చి కార్యకర్తలు, ఆయాలను క్రమ క్రమంగా తొలగించాలనే కుట్ర జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కేంద్రాలను మూసేశారు. రూ.4 వందలతో నెట్టుకొస్తున్న ఆశ వర్కర్లు జిల్లాలో సుమారు నాలుగు వేల మంది వరకూ ఉన్న ఆశ వర్కర్లను గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య, వైద్య సదుపాయాలను దగ్గర చేసేందుకు ఉనికిలోకి తీసుకొచ్చారు. తీరా వీరికి ప్రభుత్వం ఏ విధమైన వేతనాన్నీ ఇవ్వడంలేదు. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడల్లా కొంత సొమ్ము ముట్ట చెబుతుండటంతో నెలంతా కష్టపడినా వీరికి రూ.నాలుగు వందల నుంచి రూ. వెయ్యి వరకూ కూడా రాని దుస్థితి. తెలంగాణలో వీరికి రూ.ఆరువేల వేతనాన్ని చెల్లిస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల మెడపై వేలాడుతున్న కత్తి ప్రభుత్వం ఇచ్చేది అరకొరే అయినా అప్పు చేసో, అరువు తెచ్చో బడి పిల్లలకు అన్నంపెడుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల మెడపై ఏజెన్సీ ఎత్తివేత కత్తి వేలాడుతోంది. పాఠశాలల్లో వంట చేసి వడ్డించే పద్ధతికి బదులు 25,000 మంది పిల్లలకు ఒక కేంద్రంగా డివిజన్ స్థాయిలో వంటశాల ఏర్పాటు చేసి అక్కడే అన్నం వండి పాఠశాలలకు తీసుకెళ్లి వడ్డించే పద్ధతికి చంద్రబాబు తెరతీశారు. అలా చేస్తే జిల్లాలో ఏజెన్సీలను నిర్వహిస్తున్న సుమారు ఎనిమిది వేల మంది ఉపాధిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీరికి తమిళనాడులో రూ.ఐదు వేల వేతనాన్ని ఇస్తుండగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రూ.750, రాష్ట్ర ప్రభుత్వం రూ.250 వెరసి రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారు. నిధుల మళ్ళింపుతో సంక్షేమం కుదింపు భవన నిర్మాణానికి మట్టి తీసే కూలి నుంచి పూర్తయ్యాకా రంగు వేసే కార్మికుని వరకూ 33 రకాల పనులు చేసేవారు భవన నిర్మాణ కార్మికుల జాబితాలోకి వస్తారు. జిల్లాలో ఈ పనివారు సుమారు ఐదు లక్షల మంది ఉన్నారు. 318/2011 నంబరుగల కేసులో 2013 నవంబరులో సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని తీర్పు చెప్పినా చంద్రబాబు తన పేరుమీద పథకాలను ప్రవేశపెట్టి, వాటి నిర్వహణ కోసం ఈ నిధులను మళ్ళిస్తున్నారు. దీంతో భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాల్సిన క్లెయిమ్స్ పరిష్కారంలో తీవ్ర జాప్యమవుతోంది. మలినం ఎత్తిపోసే వారిపైనా కొరవడ్డ కనికరం.. జిల్లాలో 1100 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. వాటి పరిధిలో వేలాది మంది కార్మికులు క్షేత్ర స్థాయిలో విశేష సేలందిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది కాంట్రాక్టు, టెండరు, ఎన్ఎంఆర్ పద్ధతుల్లో పారిశుద్ధ్య, ట్యాంక్వాచర్, బిల్ కలెక్టరు, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరు రూ.వెయ్యి నుంచి రూ.ఏడు వేల లోపే జీతంగా అందుకుంటున్నారు. 2016 ఆగస్టులో జారీ చేసిన జీవో :151 ప్రకారం స్వీపర్లకు రూ.12 వేలు, ఇతర కార్మికులకు రూ.17 వేల వరకూ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా నెలలు తరబడి »బకాయిలు పెడుతున్నారు. ఆదాయం ప్రభుత్వానికి.. శిక్షలు డ్రైవర్లకి.. కేంద్ర ప్రభుత్వం మోటారు వెహికల్ చట్టంలో తీసుకొచ్చిన సవరణలు డ్రైవర్ల పాలిట సమ్మెటలుగా మారాయి. ట్రాన్స్పోర్టు రంగం ద్వారా సమకూరే రూ. కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లనే బాధ్యుల్ని చేస్తూ శిక్షలను తీవ్రతరం చేయడం ఈ సవరణల్లో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లాలోని వేలాది మంది డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారు. శ్రామికుల డిమాండ్లు ఇవే.. -వివిధ పథకాల నిర్వహణకు నిధులు కేటాయించి ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలి. -ప్రభుత్వ పథకాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, క్యాజువల్, డైలీ వేజ్, వర్క్చార్జ్,డ్ పార్ట్ టైం పద్ధతుల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పీఎఫ్, ఈఎస్ఐ, పింఛను సౌకర్యాలన్నీ కల్పించాలి. -పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలి. -మోటారు వెహికల్ చట్టంలోని ప్రమాదకర సవరణలను ఉపసంహరించుకోవాలి. -చంద్రన్న బీమా పథకానికి మళ్ళించిన రూ.241 కోట్లను భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు తిరిగి చెల్లించాలి. -భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను సత్వరం పరిష్కరించాలి. -అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల ఎత్తివేత ఆలోచనను మానుకోవాలి. -పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన సదుపాయాలు కల్పించి, శ్రమకు తగిన వేతనం చెల్లించాలి. చాకిరీ ఎక్కువ, జీతం తక్కువ.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి జీవనోపాధిని దెబ్బతీసే విధంగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. అందుకే చలో కలెక్టరేట్ ఉద్యమం పేరిట కలెక్టరేట్ను ముట్టడిస్తున్నాం. -జి.బేబిరాణి, శ్రామిక మహిళ సంఘం రాష్ట్ర నాయకురాలు, కాకినాడ చంద్రన్న పథకానికి మా నిధులు.. చంద్రబాబు తన సొంత పేరుతో రూపొందించిన చంద్రన్న బీమా పథకానికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు చెందిన నిధులను మళ్ళిస్తున్నారు. ఈన్ని ఆందోళనల ద్వారా ప్రజల్లోకెళ్ళి ప్రభుత్వ విధానాలను ఎండగడతాం. -చెక్కల రాజ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ -
రేపు నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్న ప్రిన్సిపాల్ పెద్దాపురం : జవహార్ నవోదయ విద్యాలయలో 9వ తరగతి ప్రవేశానికి ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాదుతూ జిల్లాలోని సుమారు 272 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా పెద్దాపురం నవోదయ విద్యాలయలోనే పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. హాల్ టిక్కెట్లు విద్యార్థులందరికీ పోస్టు ద్వారా పంపామని, ఏ కారణం చేతనైనా అందని విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రానికి ఒక అటెస్టెడ్ పాస్పోర్టు సైజు ఫోటో తీసుకుని 23 సాయంత్రం లోగా నవోదయ విద్యాలయలో సంప్రదించి డూప్లికేట్ హాల్ టికెట్ పొందాలని సూచించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రవేశ పరీక్షపై ఎటువంటి సమాచారం కోసమైనా 08852–241354 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మేళా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : జిల్లా వ్యాప్తంగా సబ్డివిజనల్ ఇంజనీర్ పరిధిలోని అన్ని ముఖ్య ప్రదేశాల్లో ఈ నెల 21వ తేదీ బుధవారం నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ రోడ్షో మేళా నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చల్లా శివభాస్కర్ సోమవారం తెలిపారు. ఈ మేళా 24వ తేదీవరకు నిర్వహిస్తామన్నారు. ఈ మేళాలో బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్ కనెక్షన్లు కూడా ఇస్తామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
రేపు డీఈఓ కార్యాలయ ముట్టడి
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన వెబ్కౌన్సెలింగ్, పర్ఫార్మెన్స్ పాయింట్లు, రేషలైజేషన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ఫ్యాప్టో, జాక్టో పిలుపుమేరకు ఈ బుధవారం తలపెట్టిన డీఈఓ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయాలని నాయకులు ఓ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు. పర్ఫార్మెన్స్ పాయింట్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదని, ఇప్పటిదాకా ఖాళీల సంఖ్య, వివరాలపై ఉపాధ్యాయులకు అవగాహన రాలేదని పేర్కొన్నారు. ప్ర భుత్వ తీరుకు నిరసనగా బుధవారం 9 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి డీఈఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయాన్ని దిగ్భందిస్తామని వివరించారు. -
రేపటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
జిల్లాలో నాలుగు హెల్ప్లైను కేంద్రాలు రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాలి రాజమహేంద్రవరం రూరల్: ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం గురువారం నుంచి ఈ నెల 22 వరకు ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు తెలిపారు. కాకినాడలో ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల, పాలిటెక్నిక్ మహిళా కళాశాల, జేఎన్టీయూ, బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని, అభ్యర్థులు ముందుగానే హెల్ప్లైను సెంటరుకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు ఏపీ ఎంసెట్ ర్యాంకు కార్డు, ఏపీ ఎంసెట్ హాల్ టిక్కెట్టు, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, పాస్ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఎస్ఎస్సీ లేదా తత్సమాన సర్టిఫికెట్టు, ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్, విద్యాసంస్థలో చదవని వారు పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువ పత్రం, ఆధార్ కార్డు, కుల ధ్రువీ కరణపత్రం ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్టీ రిజర్వేషన్ కల్గిన అభ్యర్థుకు కాకినాడలో ఆంధ్రాపాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600, బీసీ, ఓసీ అభ్యర్థులు రూ.1200 రిజిస్ట్రేషన్ ఫీజు ముందుగానే ఆన్లైన్లో చెల్లించాలన్నారు. ఏనీఈఎఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్ వెబ్సైట్లో క్రెడిట్కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ద్వారా ఫీజు చెల్లించవచ్చని సూచించారు. హెల్ప్ లైన్ సెంటర్లలో నగదు తీసుకోరని, అందుకు ముందుగానే అభ్యర్థులు ఆన్లైన్లో పీజులు చెల్లించి సంబంధిత రశీదును ఆయా హెల్ప్లైన్సెంటర్లలో అధికారులకు చూపించాలని కోరారు. సర్టిఫికెట్లు పరిశీలన తేదీలు ఇవే తేదీ ర్యాంకులు 08.06.17 1–8000 09.06.17 8001–16,000 10.06.17 16001–30,000 11.06.17 30,001–45,000 12.06.17 45,001–60,000 13.06.17 60,001–78,000 14.06.17 78,001–95,000 15.06.17 95,001–1,15,000 16.06.17 1,15,001– 1,30,000 17.06.17 1,30,001–చివరిర్యాంకు వరకు ఆప్షన్లు నమోదు తేదీలు ఇవే అభ్యర్ధులు సర్టిఫికెట్లు పరిశీలన అనంతరం తమకు కావాలసిన కోర్సులను, కళాశాలలను ఎంపికచేసుకోవాలి. సంబంధిత తేదీలలో హెల్ప్లైన్సెంటర్లలో లేక స్వయంగా నమోదు చేసుకోవచ్చు. తేదీలు ర్యాంకులు జూన్ 11,12 1–30,000 జూన్ 13,14 30,001–60,000 జూన్ 15,16 60,001–90,000 జూన్ 17,18 90,001–1,20,000 జూన్ 19,20 1,20,001–చివరి ర్యాంకు వరకు జూన్ 21, 22 ఆప్షన్లు నమోదులో మార్పులకు అవకాశం జూన్ 25 సీట్లు కేటాయింపు -
రేపు రాష్ట్ర రజక సహకార సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ రాక
కాకినాడ సిటీ : రాష్ట్ర రజక సహకార సొసైటీ ఫెడరేష¯ŒS చైర్మ¯ŒS రాజమండ్రి నారాయణ గురువారం జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు కాకినాడ చేరుకుని బీసీ కార్పొరేష¯ŒS ఈడీతో రజక సంక్షేమ అంశాలపై చర్చిస్తారు. అనంతరం కలెక్టర్తో సమావేశమవుతారు. సాయంత్రం 4గంటలకు జిల్లాలని రజక సంక్షేమ సంఘాల ప్రతినిధులను కలుస్తారు. -
రేపు తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య రాక
కాకినాడ సిటీ : తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య సోమవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి గౌతమీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి సోమవారం ఉదయం 7.30 గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక సరోవర్ పోర్టికోలో బస చేస్తారు. అనంతరం 11 గంటలకు కాకినాడ ఏడీబీ రోడ్డులోని ఉండూరు సెంటర్లో జువెల్ సిటీ ఫేజ్–2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి రాత్రి గౌతమీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి హైదరాబాద్ వెళతారు. -
రేపు తెలుగు నాటక రంగ దినోత్సవం
కాకినాడ కల్చరల్ : స్థానిక దంటు కళాక్షేత్రంలో ది యంగ్మె¯Œ్స హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం తెలుగు నాటక రంగ దినోత్సవ సభ నిర్వహించనున్నట్టు క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ఈ సభలో ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, ప్రయోక్త, గాయకుడు కెర్ల వెంకటేశ్వరరావు(విశాఖపట్టణం)కు క్లబ్ వ్యవస్థాపకుడు స్వర్గీయ దంటు సూర్యారావు స్మారక జీవితకాల నట పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ హాజరవుతారని తెలిపారు. -
రేపు వికాసలో ఇంటర్వ్యూలు
కాకినాడ సిటీ : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా వికాస సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్నట్టు వికాస పీడీ వీఎ¯ŒS.రావు ఒక ప్రకటనలో తెలిపారు. నక్కపల్లిలోని హెటెరో డ్రగ్స్ కంపెనీలో పనిచేందుకు ప్రొడక్షన్, ఆర్అండ్డీ, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అనలిస్ట్, నర్శింగ్, టెక్నికల్ సర్వీస్ పోస్టులకు ఇంటర్వూ్యలు ఉంటాయన్నారు. ఎం.ఎస్.సి(ఆర్గానిక్/అనలిటికల్ కెమిస్ట్రీ), బీఎస్సీ(కెవిుస్ట్రీ), ఎం.ఫార్మసీ, బి.ఫార్మసీ, బీఎస్సీ (నర్సింగ్) చదివిన 27 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పురుష అభ్యర్థులు అర్హులన్నారు. బి.టెక్ (కెమికల్ ఇంజనీర్), డిప్లమా (కెమికల్ ఇంజనీర్) చదివిన 27 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ ఇంటర్వూ్యకు అర్హులని, ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.1.75 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు జీతం ఇస్తారన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ శనివారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయంలో బయోడేటా జెరాక్స్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలన్నారు. -
అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా!
రాష్ట్ర సరిహద్దుల్లో మొదలైన రాములోరి పెళ్లి సందడి విద్యుదీపకాంతులీనుతున్న భద్రాద్రి రామాలయం రేపే సీతారాముల కల్యాణం 6నశ్రీరామ పట్టాభిషేకం స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం నెల్లిపాక : రాష్ట్ర సరిహద్దున ఉన్న భద్రాద్రిలో శ్రీసీతారాములవారి పెళ్లి సందడి నెలకొంది. ఈనెల ఐదో తేదీన శ్రీరామనవమి రోజున స్వామి వారి కల్యాణం, 6న శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిగో భద్రాద్రి.. గౌతమి అదిగో చూడండి...అంటూ శ్రీరామదాసు పిలుపునందుకుని శ్రీసీతారాముల కల్యాణానికి భక్తులు తరలిరానున్నారు. శ్రీరామనవమి అంటే చాలు భక్తిపారవశ్యంతో పులకించే ఉభయగోదావరి జిల్లాల నుంచే వేలాది మంది భక్తులు భద్రాద్రికి ఏటా వస్తుంటారు. రామయ్య పెళ్లి వేడుకల్లో అన్నీ తామై ముందుంటారు. గోటితో వలిచిన తలంబ్రాల తయారీ, పెండ్లి తంతులో ఉపయోగించే కొబ్బరి బొండాలు భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణానికి భక్తులు ఉభయగోదావరి జిల్లాల నుంచే తీసుకొస్తుంటారు. సర్వాంగసుందరంగా భద్రాచలం.. ఈ ఏడాది జరిగే వేడుకలకు భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి కల్యాణానికి లక్షకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. మిథిలా స్టేడియాన్ని సుందరంగ అలంకరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల్లో వందలాది ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇప్పటికే వందలాది మంది భక్తులు పాదయాత్రతో భద్రాద్రి చేరుకున్నారు. వేగంగా లడ్డూ ప్రసాద తయారీ శ్రీరామనవవిుకు 1.50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావించి వారందరికీ మూడు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు గాను లడ్డూల తయారీ స్థానిక చిత్రకూట మండపంలో వేగంగా జరుగుతోంది. శ్రీరామనవమి నాటికి మూడు లక్షల లడ్డూలతో పాటు ముత్యాల తలంబ్రాలను తయారీను అధికారులు వేగవంతం చేశారు. లడ్డూలు, తలంబ్రాలకు ప్రత్యేక కౌంటర్లు ఈ ఏడాది భద్రాచలం వచ్చిన ప్రతి భక్తునికీ లడ్డూలతో పాటు స్వామి వారి తలంబ్రాలను అందించాలని ఆ రాష్ట్ర మంత్రి తుమ్మల, జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేక తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కోర్టు ప్రాంగణం, కాపా లక్ష్మమ్మ సొసైటీ స్థలంతో పాటు పలు చోట్ల ఈ కౌంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. -
జీఎస్టీ బిల్లు రేపు లోక్సభలో
న్యూఢిల్లీ: కీలకమైన వస్తు సేవలపన్ను(జీఎస్టీ) బిల్లు లోక్సభకు రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లును రేపు (శుక్రవారం)లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ ఈ సోమవారం ఈబిల్లుకు ఆమోద ముద్ర వేసింది. అంతకుముందు ఈ బిల్లులో కీలకమైన అయిదు ముసాయిదా చట్టాలకు జీఎస్ టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అనంతరం దీన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్సభ లో ఆమోదం కోసం రేపు సభముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ బిల్లుపై హాట్ హాట్ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీని సాధ్యమైనంత త్వరగా అమలులోకి త్వరగా అమల్లోకి తీసుకురావాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో జులై 1, 2017 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నసంగతి తెలిసిందే. -
రేపు ‘సంగీత గేయధార’
రాజమహేంద్రవరం కల్చరల్ (రాజమహేంద్రవరం సిటీ) : సాహిత్య సంస్థ ప్రసంగ తరంగిణి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు సంగీత గేయధార పేరిట వినూత్న సంగీత ప్రక్రియను అందించనున్నట్టు ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు, వాస్తు జ్యోతిష పండితుడు డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ తెలిపారు. ఆనం రోటరీ హాలులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఘంటసాల జీవితంపై పరిశోధన చేసిన డాక్టర్ టి.శరత్చంద్ర ‘ఘంటసాల అమృత గానలహరి ’పేరిట ఆయన పాటలు ఆలపిస్తారన్నారు. ‘సంగీత సాహిత్య నిధి’డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర (వెంకట గిరిరాజా) సంగీత గేయధార చేస్తారని తెలిపారు. నటుడు, గాయకుడు జిత్మోహ¯ŒS మిత్రా, డాక్టర్ టి.శరత్చంద్ర, డాక్టర్ బిక్కిన రామమనోహర్ ఘంటసాల స్వర మనోహర ఝరి నిర్వహిస్తారన్నారు. జిత్మోహ¯ŒS మిత్రా, ప్రసంగ తరంగిణి అధ్యక్షుడు డాక్టర్ బిక్కిన రామమనోహర్, డాక్టర్. టి.శరత్చంద్ర, కొప్పర్తి రామకృష్ణ, జగపతి, చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
రేపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆరో దశ ఎన్నికలు
-
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
రేపు కాజల్ అగర్వాల్ రాక
కాకినాడ : సినీ హీరోయి¯ŒS కాజల్ అగర్వాల్ ఈ నెల 4న కాకినాడ వస్తున్నారు. ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పటల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఉదయం 7 గంటలకు భానుగుడి జంక్ష¯ŒSలోని చార్మినార్ టీ సెంటర్ నుంచి జేఎ¯ŒSటీయూ వరకు జరిగే కేన్సర్ అవగాహన ర్యాలీలో ఆమెతో పాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని హాస్పటల్ చైర్మ¯ŒS డాక్టర్ బీహెచ్పీఎస్ వీర్రాజు గురువారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. ర్యాలీ అనంతరం జేఎ¯ŒSటీయూ సమీపంలోని ఎగ్జిబిష¯ŒS గ్రౌండ్స్లో జరిగే కేన్సర్ వ్యాధి అవగాహన సదస్సులో కేన్సర్ వ్యాధి చికిత్స నిపుణులతోపాటు కాజల్ అగర్వాల్ కూడా ప్రసంగిస్తారన్నారు. కేన్సర్కు వైద్యం చేయించుకుని పదేళ్ళ తరువాత కూడా ఆనందమయజీవితం గడుపుతున్న వారి అనుభవాలను అదే వేదికపై తెలుసుకుంటారన్నారు. అనంతరం మాధవపట్నంలో సూర్య గ్లోబల్ హాస్పటల్లో కేన్సర్ వ్యాధిగ్రస్తులను కాజల్ పరామర్శించి పండ్లు పంపిణీ చేస్తారని చెప్పారు. -
రేపటి నుంచి ఇంటర్ప్రాక్టికల్స్
ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ పరీక్షలకు సర్వసిద్ధం చేసిన జిల్లా ఇంటర్బోర్డు అధికారులు జిల్లాలో హాజరుకానున్న 33,594 మంది విద్యార్థులు ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ కంబాలచెరువు : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వసిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఈ పరీక్షలకు జిల్లా ఇంటర్బోర్డు అధికారులు సమయాత్తమయ్యారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 96 కళాశాలల్లో.. ఈనెల మూడోతేదీ నుంచి 22 వరకు ఈ పరీక్షలు జిల్లావ్యాప్తంగా మొత్తం 96 కళాశాలల్లో జరగనున్నాయి. వీటికి మొత్తం 33,594 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మ«ధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లుగా వీటిని నిర్వహించనున్నారు. నాలుగు స్పెల్స్లో జరిగే ఈ పరీక్షలు ప్రథమ స్పెల్గా 43 కళాశాలలు, రెండో స్పెల్లో 48 కళాశాలలు, మూడో స్పెల్లో 51 కళాశాలలు, నాలుగో స్పెల్స్లో 43 కళాశాలల్లో జరగనున్నాయి. సైన్స్ విద్యార్థులకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో, ఒకేషనల్ విద్యార్థులకు 19 రకాల సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రైవేట్ కళాశాలల్లో జరిగే ప్రాక్టికల్స్కి 32 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. అలాగే నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్, కలెక్టర్తో ఉండే హైపవర్ కమిటీలో అధికారిగా జిల్లా ఆర్ఐవోగా పనిచేసిన వెళ్లిన కేపీ దాశరథి వ్యహరించనున్నారు. వీరితో పాటు రెవెన్యూ స్క్వాడ్, పోలీస్శాఖ ఉంటుంది. ఆర్జేడీ ఎ.అన్నమ్మ, ఆర్ఐఓ ఎ.వెంకటేష్, డీవీఈవో కె.హెప్సీరాణి ఆధర్యంలో ఈనెల 24న సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాక్టికల్స్, మార్చిలో జరిగే పరీక్షలకు సంబంధించి ఎటువంటి అవాంతరాలు రాకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్శాఖ వి««ధులపై ఆ శాఖాధికారితో, ఆరోగ్య సమస్యలపై మెడికల్ అధికారులతో, పరీక్ష సమయంలో విద్యుత్ అవాంతరాలు రాకుండా విద్యుత్ అధికారులతో సమీక్షించారు. పరీక్షా కేంద్రంలోకి విధులు నిర్వర్తించే డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో సహా ఎవరూ సెల్ఫోన్ వాడరాదని ఉత్తర్వులు జారీచేశారు. -
రేపు వైఎస్ జగన్ కృష్ణ జిల్లా పర్యటన
-
రేపు పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
రేపు బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక
అమలాపురం టౌన్ : అమలాపురంలోని సత్య సాయి కళ్యాణ మండపంలో శనివారం గాయత్రీ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆ ట్రస్టు అధ్యక్షుడు ప్రభల మల్లికార్జునరావు, కన్వీనర్ గరిమెళ్ల గోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వివాహం కావాల్సిన అన్ని శాఖల వారు, అన్ని వయసుల వారు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవచ్చని వారు సూచించారు. వివరాలకు 9493279726, 9848323159 ఫో¯ŒS నెంబర్లలో సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
ప్రత్యేక హోదా కోసం రేపు కొవ్వొత్తుల ప్రదర్శన
కాకినాడ రూరల్ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26 సాయంత్రం 5.30 గంటలకు కాకినాడ నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. మంగళవారం సాయంత్ర రమణయ్యపేటలోని తన నివాస గృహంలో విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలంతా కేంద్రాన్ని ఒప్పించే విధంగా పార్టీలకతీతంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు యువతీ, యువకులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు మద్దతు తెలిపి కొవ్వొత్తుల ప్రదర్శనలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు వైఎస్సార్ బ్రిడ్జి వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీగా భానుగుడి జంక్ష¯ŒSకు చేరుకొని ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. రంపచోడవరం : గురువారం కాకినాడ లో జరగనున్న కొవ్వొత్తుల ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని వైఎస్సార్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు అనంతబాబు పిలుపునిచ్చారు. -
రేపు కాకినాడలో ఆర్ఆర్బీ మోడల్ పరీక్ష
బాలాజీచెరువు(కాకినాడ) : రాజీవ్గాంధీ డిగ్రీ కళాశాలలో మంగళవారం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లోకోపైలట్ మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కుసుమశాంతి ఆదివారం తెలిపారు. ప్రతిభ ఎడ్యుకేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఐటీఐలో ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ ఉత్తీర్ణులతో పాటు ఆ విభాగాల బీటెక్ అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల వారు సోమవారం సాయంత్రంలోగా రాజీవ్గాంధీ కళాశాలలో పేర్లు నమోదు చేయించుకోవాలని, ఇతర వివరాలకు 85229 86347లో సంప్రదించాలని సూచించారు. -
రేపు ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
రేపు డీజీపీ సాంబశివరావు రాక
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) : రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు గురువారం రాజమహేంద్రవరం పోలీసు అర్బ¯ŒS జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక లాహాస్పి¯ŒS హోటల్లో కోస్తా కోస్టల్ రీజియ¯ŒS పోలీసు ఉన్నతాధికారులతో ఎ¯ŒSడీ యాక్ట్పై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం లాలాచెరువులో ఇటీవల నిర్మాణం చేపట్టిన పోలీసు అర్బ¯ŒS జిల్లా కార్యాలయాలను పరిశీలిస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన నేపథ్యంలో డీజీపీ ఏ పోలీస్స్టేçÙనైనా తనిఖీ చేస్తారన్న ఉద్ధేశంలో అన్ని పోలీస్స్టేçÙన్లను శుభ్రం చేయిస్తున్నారు. ఆవరణలో మొక్కలు నాటిస్తున్నారు. -
రేపు సీఎం రాక
కాకినాడ సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గు రువారం జిల్లా పర్యటనకు రానున్నా రు. ఆ రోజు ఉదయం 9 గంటలకు విజయవా డ నుంచి హెలికాప్టర్లో బయలుదేరే సీఎం 9. 55 గంటలకు రామచంద్రపురం చేరుకుంటారు. 10 గంటలకు ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని, కొత్తగా నిర్మించిన కార్యాలయ భవనం, క్యాంపు కార్యాలయం, స్త్రీశక్తి భవనాలను ప్రారంభిస్తారు. కాజులూరు మండలం జగన్నాథగిరివద్ద కోరంగి కెనాల్పై నిర్మించిన వంతెనను, రెండు పంచాయతీరాజ్ రోడ్లను, పట్టణంలోని చప్పిడివారి సావరంలో నిర్మించి న మున్సిపల్ ఓపె¯ŒS ఆడిటోరియాలను ప్రా రంభిస్తారు. 10.55 గంటలకు వీఎస్ఎం కళాశాలకు చేరుకుని, 19వ వార్డు జన్మభూమి గ్రా మసభలో పాల్గొంటారు. 1.10 గంటలకు బైపాస్ రోడ్డులోని హెలిప్యాడ్కు చేరుకుం టారు. 1.40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటలకు పిఠాపురం చేరుకుం టారు. 2.15 గంటలకు పాదగయ సమీపంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన స్థూపాన్ని ఆవిష్కరించి, శంకుస్థాపన చేస్తారు. 5 గంటల వరకూ జరిగే సభలో పాల్గొంటారు. 5.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళతారు. -
రేపు సీఎం చంద్రబాబు రాక
అనంతపురం టౌన్ : ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు లేదా బుక్కపట్నం మండలాల్లో ఏర్పాటు చేసే సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. సీఎం పాల్గొనే గ్రామాన్ని మంగళవారం ఖరారు చేయనున్నారు. -
పవన్ కల్యాణ్ - అయిదు ప్రశ్నలు
హైదరాబాద్: జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నించేందుకే నేను ఉన్నానని తరచూ చెప్పుకునే పవర్ స్టార్ తాజాగా ట్విట్టర్ లో్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తన ట్విట్టర్ ద్వారా బీజేపీ ముందు ఐదు ప్రశ్నలు అడగదల్చుకున్నట్టు గురువారం వెల్లడించారు. సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, ఇంకా వివిధ వర్గాల ప్రజలనుంచి ఈ కీలక సమాచారాన్ని సేకరించినట్టు చెప్పారు. ముఖ్యంగా బీజేపీని నమ్మి ఓట్లేసిన వారిని నుంచి సేకరించానని పేర్కొన్నారు. బీజేపీ-టీడీపీ కూటమికి ఏపీ, తెలంగాణా, కర్ణాటకలో జనసేన మద్దుతిచ్చిందని గుర్తు చేసిన పవన్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తాను అయిదు ప్రశ్నలు అడగనున్నట్టు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోనే సపోర్ట్ చేయలేదని కర్ణాటకలో కూడా వారి తరఫున ప్రచారం చేశానన్నారు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాలని కోరారు. గోవధ నిషేధంపై బీజేపీకి చిత్త శుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధించవచ్చు కదా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఈ అంశం నిజాయతీగా ఉంటే లెదర్ తో తయారు చేసిన పాదరక్షలు, బెల్టులను వాడకూడదని తమ కార్యకర్తలకు సూచించాలని అన్నారు. గోవులను రక్షించాలంటే ప్రతీ బీజేపీ కార్యకర్త ఒక్కో ఆవుని పెంచుకోవాలని సూచించారు. విభజన రాజకీయాల ద్వారా గోమాంసం తినే ప్రజల్లో భయాందోళలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గోవులను పూజించే ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొడుతోందని పవన్ వ్యాఖ్యానించారు. గోవధ, వేముల రోహిత్ ఆత్మహత్య, దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదాల అంశాలపై తన ట్విట్టర్ ద్వారా వరుసగా ప్రశ్నించనున్న అంశాలని తెలిపారు. ఈ క్రమంలో రోహిత్ వేముల ఆత్మహత్యపై రేపు ప్రశ్నిస్తానంటూ ట్వీట్ చేశారు. pic.twitter.com/f63aZBvMeT — Pawan Kalyan (@PawanKalyan) December 15, 2016 -
నేడు రేపు జిల్లాలో జగన్ పర్యటన
వ్యాధులతో సతమతం ... పెద్దాసుపత్రికి వెళ్లినా ఆగని మరణాలు ... ఆ వ్యాధి ఎందుకు సోకుతుందో వైద్యులకే అంతబట్టని వైనం... కాళ్లవాపుతో కొందరు ... పురిటిలోనే వసివాడని పసి పిల్లలకు కూడా నిండూ నూరేళ్లు నిండిపోతున్న విషాదం... ఆదుకోవల్సిన వారు కాళ్ల వాపుతో కన్నుమూత... ఇదీ తూర్పు మన్యంలో దయనీయ దుస్థితి. మన్యం వాసుల్లో మనోధైర్యం నింపి... పోలవరం నిర్వాసితులతో ముఖాముఖీ కాళ్లవాపు మృతులు, శిశు మరణాల కుటుంబాలకు ఓదార్పు రేఖపల్లిలో బహిరంగ సభ సాక్షిప్రతినిధి, కాకినాడ : పాలకుల నిర్లక్ష్యం కారణంగా ’తూర్పు’మన్యంలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు బుధవారం రానున్నారు. ఇటు దేవీపట్నం మండలం, అటు నాలుగు విలీన మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచేందుకు ఆయన వస్తున్నారు. ప్యాకేజీ, కోల్పోయిన భూములకు నష్టపరిహారం పెంపు, భూమికి భూమి, ఇళ్ల నిర్మాణం తదితర సమస్యలపై నిర్వాసితులతో కలిసి జగన్ మాట్లాడతారు. పౌష్టికాహార లోపం కారణంగా రాజవొమ్మంగి మండలంలోని పలు గ్రామాల్లో 13 మంది నవజాత శిశువులు, బాలింత మృతి చెందారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పార్టీ జిల్లా నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జగన్ మోహన్రెడ్డి ఆ కుటుంబాలను పలకరిస్తారు. కాళ్లవాపు వ్యాధి మృతుల కుటుంబాలతో... కాళ్లవాపు వ్యాధితో మన్యంలో 14 మంది మృతి చెందినా ... వ్యాధికి కారణాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకూ గుర్తించ లేకపోయింది. మృతులంతా విలీన మండలానికి చెందిన వారే కావడంతో రెండో రోజు గురువారం పర్యటనలో వరా రామచంద్రాపురంలో మృతుల కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. నాలుగు విలీన మండలాల్లో వేలాది మంది రైతులు, పోలవరం నిర్వాసితులు రెండున్నరేళ్లుగా పరిష్కారం కాకుండా వేధిస్తున్న పలు సమస్యలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అనంతరం రేఖపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. చురుకుగా ఏర్పాట్లు... గడచిన మూడు రోజులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ తదితర నేతలు జగన్ రెండు రోజుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం రాత్రి పర్యటన షెడ్యూల్ను కాకినాడలో కన్నబాబు విలేకర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కాంట్రాక్టర్లకు రేట్లు పెంచడానికి చూపిస్తున్న శ్రద్ధ ముంపు బాధితుల పునరావాసం తదితర అంశాలపై చూపడంలేదని విమర్శించారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు.ఈ విషయాన్ని తెలియచేసేందుకు ముంపు బాధితుల్లో ధైర్యాన్ని నింపేందుకు జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్నారని చెప్పారు. –బుధవారం ఉదయం 10 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడి సమీపంలో గుమ్ములూరు గ్రామం సందర్శన –గుమ్ములూరు నుంచి గోకవరం మీదుగా రంపచోడవరం చేరుకుంటారు. –రంపచోడవరంలో దేవీపట్నం మండలానికి చెందిన పోలవరం ముంపు రైతులతో ముఖాముఖీలో పాల్గొంటారు. –అక్కడే పౌష్టికాహార లోపంతో మృతిచెందిన నవ జాతశిశువుల కుటుంబాలను పరామర్శిస్తారు. –పెదగెద్దాడ మీదుగా మారేడుమిల్లి చేరుకుని ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో బుధవారం రాత్రి బస చేస్తారు. –గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరి చింతూరు మీదుగా వరా‡ రామచంద్రపురం మండలం చేరుకుంటారు. –కాళ్ల వాపు వ్యాధితో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. –పోలవరం నిర్వాసితుల సమస్యలపై రేఖపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -బహిరంగ సభ అనంతరం విజయవాడ వెళ్తారు. -
మోదీ లేరంటూ గందరగోళం.. రాజ్యసభ వాయిదా
-
నేడు, రేపు సాక్షి మెగా ఆటో షో
సాక్షి, రాజమహేంద్రవరం : వాహన కొనుగోలుదారులు, ప్రముఖ ఆటో కంపెనీల ఆసక్తి మేరకు ‘సాక్షి’ మెగా ఆటో షో శని, ఆదివారాల్లో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు రోజులపాటు జరగనున్న ఈ మెగా ఆటో షోను వాహన ప్రియులు సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్, నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీశేషసాయి పాల్గొంటారు. యమహా సిరి మోటార్స్, శ్రీ సిరి ఆటోమొబైల్స్, ఎస్బీ మోటార్స్, ట్రైస్టార్ ఫోర్డ్, కంటిపూడి నిస్సాన్, కంటిపూడి డాట్సన్, కంటిపూటి సుజుకి, రెడ్డి బాబు హీరో, సీపీ రెడ్డి హీరో, శ్రీఆర్కే హోండా, టర్బో ఫియట్, చవర్లెట్ ఆరెంజ్ ఆటోమెబైల్స్, టాటా శ్రీ కోడూరి ఆటోమొబైల్స్, లీలాకృష్ణ టయోట, రేనాల్ట్ విశ్వరూప ఆటోమోటివ్స్, ఎలైట్ హోండా, లక్ష్మి హూండాయ్, గోకుల్ టీవీఎస్ టూ వీలర్, కోడూరి పియోజియో త్రీవీలర్ ఆటో, మహీంద్ర ఎంఅండ్ఎం మోటార్స్, దాక్షాయిని టీవీఎస్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నింటినీ ఒకే వేదికపైకి ’సాక్షి’ తీసుకువస్తోంది. వందలాది సరికొత్త, ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వాహనాలు ఈ మెగా ఆటో ఎక్స్పోలో కొలువుదీరనున్నాయి. నచ్చేకలర్ ఒకచోట, మోడల్ మరోచోట, ఫైనా¯Œ్స ఇంకోచోట ఇలా వాహనం కొనేంతవరకు వినియోగదారుల అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ శ్రమ అవసరం లేకుండా అన్నీ ఒకే వేదికపై ఈ మెగా షోలో లభించనున్నాయి. అన్నిరకాల వాహనాలను స్టాల్స్లో ప్రదర్శించడంతోపాటు వాటి ప్రత్యేకతలను నిపుణులు వివరిస్తారు. ఫలితంగా వినియోగదారులకు సమయం వృథా కాకుండా ఉంటుంది. పత్రికలు, టీవీల్లో ఇచ్చే వాహనాల సమాచారం కన్నా మరింత ఎక్కువగా పొందడమే కాకుండా, వాహనాన్ని నేరుగా పరిశీలించే వెసులుబాటు లభిస్తుంది. రుణ సదుపాయం నచ్చిన వాహనాన్ని వెంటనే వినియోగదారుడు సొంతం చేసుకోవచ్చు. బ్యాంకర్ల ద్వారా సులభతరమైన వాయిదా పద్ధతులు, తక్షణ రుణ సదుపాయాన్ని (స్పాట్ ఫైనా¯Œ్స) పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సదుపాయాలు అందిస్తోంది. యమహా ఫ్యాసినో సొంతం చేసుకోండి ’సాక్షి’ మెగా ఆటో షోలో వాహనం బుక్ చేసుకున్నవారికి బంపర్ ఆఫర్ డ్రాలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సిరి మోటార్స్ సౌజన్యంతో బంపర్ డ్రాలో యమహా ఫ్యాసినో బహుమతిగా గెలుసుకోవచ్చు. యమహా స్కూటర్ కొనుగోలు చేసిన మొదటి 10 మందికి ఉచితంగా యాక్ససరీస్ అందజేస్తారు. ప్రతి గంటకు గిఫ్ట్ కూప¯ŒS ఆటో షోలో వాహన ప్రియులు కుటుంబ సమేతంగా పాల్గొని, ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. చందన రమేష్ గ్రూప్వారి సౌజన్యంతో సందర్శకులకు గంట గంటకు ఉచిత గిఫ్ట్ కూప¯ŒS ఇవ్వనున్నారు. 93.5 రెడ్ ఎఫ్ఎం రేడియో, సాక్షి, టీవీ న్యూస్ చానల్ పార్టనర్గా వ్యవహరిస్తున్నాయి. -
రేపు విజయవాడలో కాంట్రాక్టు లెక్చరర్ల సదస్సు
కొత్తపేట : ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలనే డిమాండ్పై కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఈ నెల 6న విజయవాడలో రాష్ట్ర వ్యాప్త ప్రతినిధుల సదస్సు నిర్వహిస్తున్నట్టు జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేష¯ŒS ఉపాధ్యక్షుడు చిక్కాల నరసింహం తెలిపారు.శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజ యవాడ రాఘవయ్య పార్కు సమీపంలో గల ఎంబీ భవ¯ŒSలో 13 జిల్లాల అసోసియేషన్ల ఆధ్వర్యంలో లెక్చరర్లు పాల్గొంటారని తెలిపారు. క్రమబద్ధీకరణతో పాటు పదో పీఆర్సీ ప్రకారం జీతాల చెల్లింపు, జీఓ : 197 అమలు, గత నెల 26 నాటి సుప్రీం కోర్టు తీర్పు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు హాజరు కావాలని కోరారు. -
అక్టోబరు 14th నాగాభరణం రిలీజ్
-
జాతీయ భద్రతపై రేపు సదస్సు
న్యూశాయంపేట : ‘జాతీయ భద్రత– పౌరు ల బాధ్యత’ అంశంపై హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో బుధవారం సదస్సు ఏర్పాటు చేసినట్లు స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ జి.రవీందర్ తెలిపారు. హన్మకొండ ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం 6గంటలకు ప్రారం భమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో కంది శ్రీనివాస్రెడ్డి, రాఘవరెడ్డి, రాకేష్కుమార్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి శిరోముండన కేసు విచారణ
బోట్క్లబ్ (కాకినాడ) : వెంకటాయపాలెం శిరోముండనం కేసు విచారణ ఈ నెల 26 నుంచి ప్రారం¿¶ మవుతుందని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు షెడ్యూల్ విడుదల చేసిందని రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో శిరోముండనం సంఘటన 1996 డిసెంబర్లో జరిగిందన్నారు. అప్పట్లో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రధాన ముద్దాయిగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. -
నేడు, రేపు భారీ వర్షాలు.
-
నేడు, రేపు భారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో నగరంతో పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. గత 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా హకీంపేటలో ఏకంగా 17 సెంటీమీటర్ల కుండపోత కురిసింది. వరంగల్ జిల్లా ఘన్పూర్, పాలకుర్తి, ఖమ్మం జిల్లా ములకలపల్లిలలో 15, రంగారెడ్డి జిల్లా శామీర్పేటలో 13, హైదరాబాద్లోని కూకట్పల్లిలో 12, జనగాం, మేడ్చల్లలో 11, ధర్మసాగర్, కొత్తగూడెంలలో 10, గూడూరు, హైదరాబాద్లలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక ఖానాపూర్, గోల్కొండ, శాయంపేట, బయ్యారం, సూర్యాపేట, పర్వతగిరిల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. మరో 10 రోజులు నైరుతి రుతుపవనాలు! సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ ఈ నెలాఖరుతోనే ముగిసిపోవాలి. కానీ ఈసారి మరో పది రోజులు అదనంగా ప్రభావం చూపే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. వచ్చే నెల 10 వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందని, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలా జరుగుతుందన్నారు. నైరుతి రుతుపవనాల వల్ల వచ్చే నెల మొదటి వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపారు. ఇక లానినా ట్రెండ్ మొదలైనా పూర్తిస్థాయిలో ఏర్పడలేదని... అది ఏర్పడితే రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. -
రేపు సాక్షి మీడియా ఆధ్వర్యంలో...‘చైతన్యపథం’
సమయం: బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మ«ధ్యాహ్నం 1.30 గంటల వరకు వేదిక: రాజమహేంద్రవరంలోని గంటా గనిరాజు కల్యాణ మండపం, మున్సిపల్ స్టేడియం వెనుక విషయం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరంపై ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో చైతన్యపధం కార్యక్రమం జరగనుంది. ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే ఈ చర్చా వేదికలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. ఆం«ధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఆకాంక్షించే వారంతా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. -
రేపు ప్రత్తిపాడులో జిల్లా స్థాయి ఉపాధ్యాయ సదస్సు
ప్రత్తిపాడు : ప్రత్తిపాడులోని ఆర్సీఎం పాఠశాల ఆవరణలో ఈనెల 21వ తేదీ బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ సదస్సు ఏర్పాటు చేసినట్టు ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. సామాజిక భద్రత లేని కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంపై ఈ సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గోరస దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సభలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి పాండురంగ వరప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజగోపాల్, జిల్లా అధ్యక్షుడు వై.వెంకట్రాజు, ఉపాధ్యక్షుడు జె.మోహన్రావు, కార్యదర్శి బి.రామయ్య చౌదరి, ప్రత్తిపాడు తాలూకా జేఏసీ అధ్యక్షుడు రామిశెట్టి రాంబాబు తదితరులు ప్రసంగిస్తారని చెప్పారు. ఈ సదస్సుకు జిల్లాలోని ఉపాధ్యాయులంతా హాజరుకావల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
వెయిట్లిఫ్టింగ్ ఎంపికలు
నిజామాబాద్ నాగారం : జిల్లా వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యం లో గురువారం జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు గడుగు గంగాధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొబ్బిలి నర్స య్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–20, అండర్–17 విభాగాలలో బాలబాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. కలెక్టరేట్ మైదానంలో ఉదయం 10.30 గంటలకు ఎంపిక పోటీలు ప్రా రంభమవుతాయని, ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు. -
రేపు వీఆర్ఓల అత్యవసర సమావేశం
వీరన్నపేట (మహబూబ్నగర్) : వీఆర్ఓలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆ««దl్వర్యంలో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎస్ పెన్షన్ సౌకర్యం రద్దు, కొత్త జిల్లాలకు వీఆర్ఓల కేటాయింపు, పదోన్నతులు తదితర వాటిపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బానాల రాంరెడ్డి సమావేశానికి విచ్చేస్తున్నారని, జిల్లాలోని వీఆర్ఓలు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. -
రేపు జిల్లాస్థాయి బాలికల వాలీబాల్ టోర్నీ
మహబూబ్నగర్ క్రీడలు: జడ్చర్ల పట్టణంలోని విద్యాధర్ వాలీబాల్ అకాడమీలో ఈనెల 9న జిల్లా పాఠశాలస్థాయి బాలికల వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న జట్లు నేడు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మిగతా వివరాలకు సెల్ నెం. 9440311067, 8125849434 లను సంప్రదించాలని ఆయన కోరారు. -
రేపు జిల్లాస్థాయి బాలికల వాలీబాల్ టోర్నీ
మహబూబ్నగర్ క్రీడలు: జడ్చర్ల పట్టణంలోని విద్యాధర్ వాలీబాల్ అకాడమీలో ఈనెల 9న జిల్లా పాఠశాలస్థాయి బాలికల వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న జట్లు నేడు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మిగతా వివరాలకు సెల్ నెం. 9440311067, 8125849434 లను సంప్రదించాలని ఆయన కోరారు. -
విద్యారంగానికి రూ.28 వేల కోట్లు కేటాయింపు
ఏలూరు (ఆర్ఆర్ పేట): రాష్ట్రంలో విద్యారంగానికి రూ.28 వేల కోట్లు కేటాయించి ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి పీతల సుజాత చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక శనివారపుపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీచర్గా పనిచేసి మంత్రి పదవిని చేపట్టిన సుజాతను డీఈవో మధుసూదనరావు సత్కరించారు. ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు ఏ రంగంలోనైనా రాణిస్తారనడానికి మంత్రి సుజాత నిదర్శనమని డీఈవో అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సుజాత చెప్పారు. రూ.10 కోట్లతో 634 కిచెన్ షెడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. కామవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడు గంటా సుధీర్బాబు, జంగారెడ్డిగూడెం ఎంపీడీవో సుజాత తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఐసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
పోచమ్మమైదాన్ :ఐసెట్లో అర్హత సాధించిన వారు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 26 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. జిల్లాలో రెండు హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వరంగల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పీహెచ్సీ, స్పోర్ట్స్, ఎన్సీసీ, అంగ్లో ఇండియన్ విద్యార్థులు హైదారాబాద్లోని మాసబ్ ట్యాంక్ సమీపంలో గల సాంకేతిక విద్యా భవన్లో హాజరుకావాలి. అలాగే జిల్లాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులు వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. విద్యార్థులు ఇవి తీసుకురావాలి... ఐసెట్ హాల్ టికెట్, ఒరిజినల్ ర్యాంక్ కార్డ్ ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్ మెమోలు స్టడీ, కుల, ఆదాయ సర్టిఫికెట్లు, టీసీ ఓసీ, బీసీలు రూ1000, ఎస్సీ, ఎస్టీలు రూ.500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. పాలిటెక్నిక్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 26న ఉదయం 1 నుంచి–3వేలు 3001 నుంచి 6వేల వరకు మధ్యాహ్నం 6001 నుంచి 9 వేలు 9001 నుంచి 12 వేలు 27న ఉదయం 12001 నుంచి 15వేలు 15001 నుంచి 18 వేలు మధ్యాహ్నం 18001 నుంచి 21వేలు 21001 నుంచి 24 వేలు 28న ఉదయం 24001 నుంచి 27000 27001 నుంచి 30వేలు మధ్యాహ్నం 30001 నుంచి 33వేలు 33001 నుంచి 36 వేలు 29న ఉదయం 36001 నుంచి 39500 39501 నుంచి 43 వేలు మధ్యాహ్నం 43001 నుంచి 46500 46501 నుంచి 50 వేలు 30న ఉదయం 50001 నుంచి 53500 53501 నుంచి 57వేలు మధ్యాహ్నం 57001 నుంచి 60500 60501 నుంచి చివరి ర్యాంక్ -
బాటనీ అధ్యాపకులకు రేపు ఓరియెంటేషన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి డిగ్రీ కళాశాలల్లోని బాటనీ అధ్యాపకులకు శనివారం ఓరియెంటేషన్ నిర్వహించనున్నట్లు బాటనీ విభాగం అధిపతి డాక్టర్ వి.కృష్ణారెడ్డి గురువారం తెలిపారు. ఉదయం 10–30 గంటలకు క్యాంపస్లోని బాటనీ సెమినార్ హాల్లో కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. సీబీసీఎస్ సెమిస్టర్ విధానం, నూతన సిలబస్పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. డిగ్రీ కళాశాలల నుంచి 150 మంది బాటనీ అధ్యాపకులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. -
రేపు ఎస్జీఎఫ్ఐ జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో అండర్–19 జిల్లా స్థాయి జూనియర్ కళాశాలల బాలబాలికలకు ఈనెల 19వ తేదీన వివిధ క్రీడాంశాల్లో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా నిర్వహణ కార్యదర్శి కోట సతీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు ఉదయం 9 గంటలకు పదో తరగతి మెమో, కాలేజీ ఐడీతో హాజరుకావాలన్నారు. ఖోఖో, క్యారమ్స్, రెజ్లింగ్, ఫుట్బాల్, టెన్నిస్బాల్, క్రికెట్, సర్కిల్ కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, రైల్ షూటింగ్, సూపర్సెవెన్ క్రికెట్, టెన్నిస్ క్రీడల్లో ఎంపికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. -
నేడు, రేపు విధుల్లో ఉండాల్సిందే
అనంతపురం సిటీ :జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఉద్యోగులు నేడు, రేపు విధుల్లో ఉండాల్సిందేనని, ఆదివారం కూడా సెలవు ఉండదని వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. శనివారం కార్యాలయంలోని ప్రతి విభాగాన్నీ ఆయన పరిశీలించారు. జిల్లాకు రాష్ట్ర ఉన్నతాధికారులు రానున్నారని, అన్ని రికార్డులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ముగిసిన దరఖాస్తు గడువు : వైద్యులు, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సులతో పాటు పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 6 గంటలకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు కావడంతో కార్యాలయం అభ్యర్థులతో కిటకిట లాడింది. ఎన్ని దర ఖాస్తులుఅందాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. -
నేడు, రేపు జనగామ బంద్
స్పీకర్ కాన్వాయ్ని అడ్డుకునేందుకు జేఏసీ నేతల యత్నం అడ్డుకుని, అదుపులోకి తీసుకున్న పోలీసులు జనగామ : జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జనగామలో శనివారం నుంచి 48 గంటల బం ద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్కు అన్ని వర్గాల వారు మద్దతు ప్రకటించాలని జేఏ సీ చైర్మెన్ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపునిచ్చా రు. జిల్లా సాధన పోరు తుదిదశకు చేరుకోవడంతో జేఏసీ నాయకులు ఉద్యమాన్ని ఉ«దృతం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళుతున్న శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి వాహనాని కి అడ్డుపడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు గండి నాగరాజు, ఇరుగు రమేష్ చౌరస్తాలోని అంబేద్కర్ కళ్లకు నల్లరిబ్బన్ కట్టి నిరసన తెలిపారు. జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళ్లపల్లి రాజు విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేసే ప్రయత్నంలో ఉండగా పోలీసులు అడ్డుకుని రాజుతో పాటు నాగరాజు, రమేష్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. -
సార్వత్రిక సమ్మెపై రేపు సదస్సు
అనంతపురం అర్బన్ : జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబరు 2న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేసే భాగంలో సన్నాహకంగా శనివారం స్థానిక ఐఎన్టీయూసీ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. గురువారం స్థానిక గణేనాయక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె ఉద్దేశాన్ని కార్మికులకు తెలియజేసినా వారిని చైతన్యపర్చడంలో భాగంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి హరికష్ణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ నరసింహరావు, వైఎస్సార్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుసేన్పీరా హాజరై సార్వత్రిక సమ్మె ప్రాధాన్యం గురించి కార్మికులకు వివరిస్తారని చెప్పారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్, ఈఎస్ వెంకటేశ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ, ఐఎఫ్టీయూ నాయకులు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రేపు జిల్లాకు సీఎం రాక
రాజమహేంద్రవరంలో పుష్కరుడికి వీడ్కోలు నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న చంద్రబాబు సాక్షి, రాజమహేంద్రవరం : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయడు గురువారం జిల్లా పర్యటనకు రానున్నారని సమచార, పౌర సంబంధాల శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. సీఎం విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు మధురపూడి విమానశ్రయానికి చేరుకుంటారు. 3:25 గంటలకు రాజమహేంద్రవరం తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డులోని దేవాదాయ శాఖ స్థలంలో నిర్మించిన వాంబే గృహాలను లబ్ధిదారులకు అందించి వారినుద్దేశించి ప్రసంగిస్తారు. 4:5కు హుకుంటపేట హైస్కూల్కు చేరుకుని బహిరంగ మల విసర్జనలేని గ్రామంగా ఎంపికైన ఆ గ్రామ పంచాయతీ జన్మభూమి కమిటీ సభ్యులకు రూ.5 లక్షల ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి దీపాలను ప్రారంభిస్తారు. 4:30కు చెరుకూరి కల్యాణ మండపంలో జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. 5:45 నుంచి 6:45 వరకు పుష్కరఘాట్లో హారతి కార్యక్రమంలో పాల్గొని పుష్కరుడికి వీడ్కోలు పలుకుతారు. 7:05 గంటలకు మధురపూడి విమానాశ్రయంకు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ వెళతారు. -
రేపు జాబ్మేళా
మర్రిపాలెం: ప్రభుత్వ పాత ఐటీఐలో సోమవారం విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం అభ్యర్థులను ఎంపిక చేస్తామని జిల్లా ఉపాధి అధికారి (క్లరికల్) ఇ.వెంకటరత్నం తెలియజేశారు. హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ ఓంక్యాప్ నేతత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దుబాయి, యూఏఈ దేశంలోని జజీరా ఎమిరెడ్స్ పవర్ కంపెనీలో పలు ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, అసిస్టెంట్ ఫిట్టర్ ఉద్యోగాలకు ఐటీఐలో శిక్షణ పూర్తిచేసి ఉండాలన్నారు. హెల్పర్ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హత కలగినవారు అర్హులన్నారు. పై అన్ని ఉద్యోగాలకు రెండు నుంచి మూడేళ్ల అనుభవం కలిగివుండాలన్నారు. వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతితోపాటు యూఏఈ లైసెన్స్ తప్పక కలిగివుండాలని సూచించారు. మొత్తం ఖాళీలు 100 ఉన్నాయన్నారు. అభ్యర్థి పాస్పోర్టు కలిగిఉండాలని, ఉచిత వసతి, రవాణా సౌకర్యం సంస్థ ఏర్పాటు చేస్తుందన్నారు. ఆసక్తి గల పురుష అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన బయోడేటా, పాస్పోర్టు, ఒరిజినల్ సర్టిఫికెట్, రెండు పాస్పోర్టు ఫొటోలతో ప్రభుత్వ పాత ఐటీఐ ఉదయం 10 గంటలకు నేరుగా హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8179204289, 7075340904 నెంబర్లను సంప్రదించవచ్చు. -
రేపు జయశంకర్ విగ్రహావిష్కరణ
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ పక్కన ఉన్న పార్కులో తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్సార్ విగ్రహాన్ని ఈనెల 6న సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నట్లు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు విద్యాసాగర్, జవహర్, జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మహోన్నత తెలంగాణ ఉద్యమానికి దారిచూపిన దివిటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్సార్ అని కొనియాడారు. అంతటి మహనీయుడు విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో స్థాపించుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకంట్ల కవిత, మంత్రి జగదీశ్రెడ్డి, శాసన మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ విప్ సునీత, జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహావిష్కరణ, బహిరంగ సభ ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఉపేందర్రావు, శ్రీని వాసాచారి, టి.వెంకట్, రంజిత్గౌడ్, సాయినిఖిల్, రవితేజ పాల్గొన్నారు. -
రేపు అధికారికంగా జయశంకర్ జయంతి
రాంనగర్ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఈనెల 6వ తేదీన జిల్లాస్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. -
రేపు ఏపీ కేబినెట్ సమావేశం
-
రేపు ‘హరితహారం’పై కవి సమ్మేళనం
మహబూబ్నగర్ కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం పథకంపై జిల్లా స్థాయిలో ఆగస్టు 2న కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్,సర్వే సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.విజయకుమార్, ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే కవిసమ్మేళన ంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డైట్ కళాశాలల విద్యార్థులు పాల్గొనాలని కోరారు. వివరాలకు నెం.9032844017 ను సంప్రదించాలన్నారు. -
రేపు, ఎల్లుండి బ్యాంకుల బంద్
-
రేపు పశ్చిమగోదావరిలో వైఎస్ జగన్ పర్యటన
-
నగరంలో రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్సిటీ: గ్రీన్ల్యాండ్స్ సబ్డివిజన్ ఆల్విన్, ఐడీపీఎల్, కుందన్బాగ్, హెచ్పీఎస్ విద్యుత్ ఫీడర్ లైన్ల మరమ్మతుల కారణంగా సోమవారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ మహేష్కుమార్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సనత్నగర్ ఎస్ఆర్టీ, 2ఆర్టీ, 3ఆర్టీ క్వార్టర్స్, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, అశోక్ లేబర్ కాలనీ, డీఎన్ఎం కాలనీ, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, సనత్నగర్, ఆంధ్రాబ్యాంక్ లేన్, టయోటా షోరూం ఏరియా, సనత్నగర్ మెయిన్రోడ్డు, టోపాజ్ బిల్డింగ్, మా టీవీ లేన్, పంజగుట్ట ఐఏఎస్ క్వార్టర్స్, బేగంపేట్ ఆర్బీఐ క్వార్టర్స్, మూసాపేట్ హెచ్పీ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు. -
మరో 37 దేశాలకు ఇ-వీసాలు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించి, పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఎలక్ట్రానిక్ వీసా ప్రోగ్రామ్లో మరో కీలక అడుగు పడింది. మరో 37 దేశాలకు ఈ-వీసా సౌకర్యాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం, అల్బేనియా, ఆస్ట్రియా, ఘనా, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జాంబియా, జింబాబ్వే సహా మొత్తం 37 దేశాలకు ఈ- వీసా కల్పించారు. దీంతో ఈ సౌకర్యాన్ని పొందిన మొత్తం దేశాల సంఖ్య 150 కు చేరినట్టయింది. ప్రస్తుతం దీని ద్వారా రోజుకు సగటున 3,500 టూరిస్ట్ వీసాలను జారీచేస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఏడున్నర లక్షల వీసాలను ప్రాసెస్ చేసినట్టు తెలిపింది. 2014 నవంబర్లో లాంచ్ చేసిన ఈ ప్రతిష్టాత్మక పథకంలో మొదటిదశలో అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్తోపాటు 43 దేశాలకు చెందిన పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యం కల్పించారు. భారత్లో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్నదే తమ ఏకైక లక్ష్యమని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇ - వీసా కోసం విదేశీ పర్యాటకులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లోగా టూరిస్ట్ వీసా అందిస్తామని, కొన్ని ‘ప్రమాదకర’ దేశాలు మినహా అన్ని దేశాల పర్యాటకులకు దశలవారీగా ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తామని కేంద్రమంత్రి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రేపు దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష
♦ ఉద్యమం ఉధృతం చేస్తాం: హెచ్సీయూ విద్యార్థి జేఏసీ ♦ ఇన్చార్జి వీసీ శ్రీవాస్తవ మాట్లాడేవన్నీ అవాస్తవాలేనంటూ మండిపాటు ♦ శుక్రవారం రాత్రి దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీకి పిలుపు ♦ కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల రిలే దీక్షలు ♦ న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి వంద మంది అధ్యాపకుల లేఖ సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూలో కొనసాగుతున్న ఉద్యమాన్ని అఖిల భారత స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ పుట్టినరోజైన ఈనెల 30వ తేదీ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావిస్తోంది. రోహిత్ ఆత్మహత్యకు సంతాపంగా, సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ... శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక రోజు మహాదీక్ష నిర్వహించనున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్, అర్పిత గురువారం ప్రకటించారు. రోహిత్తోపాటు సస్పెండైన విద్యార్థులు ప్రశాంత్, విజయ్, సుంకన్న, శేషయ్యలు శుక్రవారం రాత్రి నుంచి ఆమరణ దీక్షను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రోహిత్ మృతికి సంతాపంగా శుక్రవారం రాత్రి 11 గంటలకు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇన్చార్జి వీసీవన్నీ అబద్ధాలే.. హెచ్సీయూ ఇన్చార్జి వీసీ శ్రీవాస్తవ చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని విద్యార్థి జేఏసీ నేతలు, ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్ ఆరోపించారు. తమతో చర్చించేందుకు వచ్చిన వర్సిటీ అధికారులను తమ డిమాండ్లపై నిలదీయగా... మళ్లీ వస్తామంటూ వెళ్లి, ప్రెస్క్లబ్లో అవాస్తవాలు చెప్పి తప్పించుకున్నారని మండిపడ్డారు. తరగతులు నిర్వహించేందుకు తాము అంగీకరించలేదని, కానీ తాము అంగీకరించినట్లు ఇన్చార్జి వీసీ అబద్ధం చెప్పారన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో గందరగోళం రేపేందుకు, వారిని చీల్చేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. సైన్స్ విద్యార్థులు మాత్రం వీసీకి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి ల్యాబ్లకు హాజరవుతారని, తరగతులు జరిపేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. కాగా.. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని, వీసీ అప్పారావును, ఇన్చార్జి వీసీని తొలగించాలని కోరుతూ వంద మంది అధ్యాపకులు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు ప్రొఫెసర్ వి.కృష్ణ తెలిపారు. గురువారం నెల్లూరు నుంచి వచ్చిన బహుజన టీచర్స్ హెచ్సీయూలో ఒకరోజు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ అధ్యాపక బృందం రిలే దీక్షలను కొనసాగిస్తోంది. శుక్రవారం నుంచి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు సైతం దీక్షలో పాల్గొననున్నారు. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో చలో ఢిల్లీ, జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను యథాతథంగా నిర్వహిస్తామని విద్యార్థి జేఏసీ నేతలు ఉదయభాను, ప్రశాంత్, ధనుంజయ్, చరణ్, సంజయ్ పేర్కొన్నారు. హెచ్సీయూ ఘటనపై ఏకసభ్య కమిషన్ సాక్షి, న్యూఢిల్లీ: హెచ్సీయూలో రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర న్యాయ విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఏకసభ్య విచారణ కమిషన్ను నియమించింది. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ రూపన్వాల్ నేతృత్వంలో ఈ కమిషన్ను ఏర్పాటు చేస్తూ... మూడు నెలల్లో నివేదిక అందించాలని కోరింది. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనల క్రమం, వాస్తవాలను గుర్తించి... తగు విధంగా దిద్దుబాటు చర్యలను ఈ కమిషన్ నివేదిస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ వర్గాలు తెలిపాయి. హెచ్సీయూలో పార్లమెంటరీ కమిటీ పర్యటన! రోహిత్ ఆత్మహత్య ఘటనపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలన జరపనుంది. దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని, వారికి అన్యాయం జరుగుతోందనే ఫిర్యాదుల నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై బీజేపీ ఎంపీ ఫగ్గన్సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన జేపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్సీయూతోపాటు, చెన్నై ఐఐటీలోనూ విద్యార్థులు, ప్రొఫెసర్లతో మాట్లాడి, పార్లమెంటు ఉభయ సభలకు నివేదిక సమర్పించనుంది. -
రేపు అఖిల పక్ష సమావేశం: కేంద్రం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రతిష్టంభణను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది. పార్లమెంట్లో లేవనెత్తుతున్న అంశాలకు సంబంధించి అభిప్రాయాలు వెల్లడించడానికి ప్రతిపక్షాలకు తగిన సమయం ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. లలిత్ గేట్ సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాలు పార్లమెంట్ను స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. -
రేపు జేఈఈ అడ్వాన్స్డ్
హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి ఈనె ల 24న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. ఇందుకోసం ఐఐటీ ముంబై ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ వ్యాప్తంగా 1.20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 20 వేల మంది వరకు హాజరుకానున్నట్లు అంచనా. పరీక్ష ఫలితాలను జూన్ 18న ప్రకటిస్తారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ప్రవేశాల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టును (ఏఏటీ) జూన్ 21న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇవీ పరీక్ష కేంద్రాలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐఐటీ ఖరగ్పూర్ పరిధిలోని విశాఖపట్నం, ఐఐటీ మద్రాసు పరిధిలోని నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. -
రేపు 'మా' ఓట్ల లెక్కింపు