Uniform Civil Code
-
అందుకు వెనుకాడుతున్న సహజీవన జంటలు..!
డెహ్రాడూన్:ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్కోడ్(యూసీసీ) జనవరి 27న అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా అన్ని మతాల్లోని వ్యక్తులకు వివాహం,ఆస్తిహక్కులు తదితర అంశాల్లో ఒకే రకమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏ మతంలోనూ బహుభార్యత్వాన్ని యూసీసీ అనుమతించదు. వీటికితోడు యూసీసీ కింద సహజీవనాలను సైతం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే జంటలు దరఖాస్తు చేసుకుని తమ సహజీవనాన్ని నమోదు చేసుకోవాలి. అయితే సహజీవనాల నమోదుకు ఇప్పటివరకు 5 దరఖాస్తులు రాగా కేవలం ఒక సహజీవనం మాత్రమే రిజిస్టర్ అయింది. అయితే సహజీవనాల నమోదుకు పెద్దగా స్పందన లేదన్న వాదన కొంత మంది వినిపిస్తున్నారు. దీనిని మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. చట్టంపై ప్రజల్లో అవగాహన రావడానికి సమయం పడుతుందంటున్నారు. సహజీవనాల నమోదుకు చాలా మంది ఇష్టపడడం లేదన్న వాదనా ఉంది. అయితే సహజీవనం నమోదు చేసుకోకపోతే యూసీసీ కింద జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సహజీవనాల నమోదును చాలా మంది వ్యతిరేకించినప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. శ్రద్దావాకర్ తరహా ఘటనలు పునరావృతం కావద్దంటే సహజీవనాల నమోదు తప్పనిసరన్న నిబంధనను తీసుకువచ్చింది. -
ప్రయోగాత్మక పౌరస్మృతి
దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో చట్టసభ ఆమోదించిన యూసీసీని ఉత్తరాఖండ్ ఆచరణలోకి తెచ్చింది. ఆ రాష్ట్ర సీఎం సోమవారం డెహ్రాడూన్లో యూసీసీ నియమావళి ప్రకటించి, పోర్టల్ను ప్రారంభించడంతో కొత్త కథ మొదలైంది. వివాదాస్పద యూసీసీ అమలు ‘దేవభూమి’ నుంచి ఆరంభమైందన్న మాటే కానీ, వివాదాల పెనుభూతం మాత్రం ఇప్పుడప్పుడే వదిలిపెట్టడం కష్టం. ఇదంతా చూపులకు... మతాలకు అతీతంగా అందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలుండేలా ప్రమాణీకరించే ఉద్దేశంతో చేపట్టిన ప్రయత్నంగా, సమానత్వం – సమన్యాయ సిద్ధాంతాలకు అనుగుణంగా గొప్పగా అనిపించవచ్చు. ఆధునిక విలువలకూ, లైంగిక సమానత్వ – న్యాయాలకూ జై కొట్టినట్టు కనిపించవచ్చు. కానీ, లోతుల్లోకి వెళితే – ఆచరణలో ఇది కీలకాంశాలను అందిపుచ్చుకోలేదు. అనేక లోటుపాట్లూ వెక్కిరిస్తాయి. ముఖ్యంగా... చట్టసభలో సమగ్ర చర్చ లేకుండానే, ఏకాభిప్రాయం సాధించకుండానే హడావిడిగా యూసీసీ తేవడం బీజేపీ పాలకుల తెర వెనుక ఉద్దేశాలకు ప్రతీకగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్లో ఇకపై పెళ్ళిళ్ళు, విడిపోవడాలు, భరణాలు లాంటివన్నిటికీ అన్ని మతాలకూ ఒకే చట్టం వర్తించనుంది. ఆ రాష్ట్రంలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. చేయకపోతే, జరిమానాతో పాటు, వివాహాల రిజిస్ట్రేషన్ కానివారు ప్రభుత్వ ప్రయోజనాలకు పూర్తిగా అనర్హులు. అలాగే, విడాకుల కేసుల్లో భార్యాభర్తలకు ఒకే నియమావళి వర్తిస్తుంది. బహుభార్యాత్వంపై నిషేధమూ విధించారు. అదే సమయంలో, భిన్న సంస్కృతి, సంప్రదాయాలను అంటిపెట్టుకొని ఉండే షెడ్యూల్డ్ ట్రైబ్లను మాత్రం నిషేధం నుంచి మినహాయించారు. ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలో కొన్ని అంశాలు నైతిక నిఘా అనిపిస్తున్నాయి. పెళ్ళి చేసుకున్నవారే కాదు, సహజీవనం చేస్తున్నవారూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనడం, అలా చేయకపోతే జైలుశిక్ష, జరిమానా అనడం బలవంతంగా అందరినీ దారికి తెచ్చుకోవడమే తప్ప, న్యాయపరిరక్షణ అనుకోలేం. అసలు విభిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో పెళ్ళి, విడాకులు, దత్తత, వారసత్వం, పిత్రార్జితం లాంటి అంశాల్లో అందరినీ ఒకే తాటిపైకి తీసుకు రావాలని సమష్టి వ్యక్తిగత చట్టాలు చేయడం సరైనదేనా అన్నది మౌలికమైన ప్రశ్న. ఎవరి మత ధర్మం వారికి ఉండగా, అందరినీ ఒకే గాటన కట్టి, మూకుమ్మడి పౌరస్మృతిని బలవంతాన రుద్దడ మేమిటని జమైత్ ఉలేమా ఇ–హింద్ లాంటివి అభ్యంతరం చెబుతున్నాయి. షరియాకూ, మతానికీ విరుద్ధమైన చట్టాన్ని ముస్లిమ్లు ఆమోదించలేరని కుండబద్దలు కొడుతున్నాయి. ఇలా ఉత్తరాఖండ్ యూసీసీపై ఒకపక్క దేశవ్యాప్తంగా వాడివేడి చర్చలు జరుగుతుండగానే, మరోపక్క గౌరవ ఉపరాష్ట్రపతి హోదాలోని వారు మాత్రం ‘ఇలాంటి చట్టం దేశమంతటా త్వరలోనే రావడం ఖాయమ’ని ఢంకా బజాయించడం విడ్డూరం. నిజానికి, ఉత్తరాఖండ్ యూసీసీలో లోటుపాట్లకు కొదవ లేదు. అందరూ సమానమే అంటున్నా, స్వలింగ వివాహాల ప్రస్తావన లేదేమని కొందరి విమర్శ. అలాగే, దత్తత చట్టాలపైనా యూసీసీ నోరు మెదపలేదని మరో నింద. అందరూ సమానం అంటూనే కొందర్ని కొన్ని నిబంధనల నుంచి మినహాయించడమేమిటని ప్రశ్న. ఎస్టీలకు సహేతుకంగా వర్తించే అదే మినహాయింపులు ఇతర వర్గాలకూ వర్తించాలిగా అన్న దానికి జవాబు లేదు. 44వ రాజ్యాంగం అధికరణం యూసీసీని ప్రస్తావించిందన్నది నిజమే. దీర్ఘకాలంగా యూసీసీపై అందరూ మాట్లాడుతున్నదీ నిజమే. కానీ, అది ఏ రకంగా ఉండాలి, లేదా ఉండకూడదన్న దానిపై ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు. పైగా, గందరగోళమే ఉందన్నదీ అంతే నిజం. ఆది నుంచి ఉమ్మడి పౌరస్మృతిని తారకనామంగా జపిస్తున్న కమలనాథులు ఇప్పుడు ఉత్తరాఖండ్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారనుకోవాలి. యూసీసీ వల్ల జరిగే మంచి మాట దేవుడెరుగు, అసలిది చేయగలిగిన పనే అని ప్రపంచానికి చాటాలనుకున్నారు. అయితే, ఈ ఉత్తరాఖండ్ యూసీసీ రాజ్యాంగబద్ధత పైనా సందేహాలున్నాయి. ఒక రాష్ట్ర చట్టసభలో చేసిన చట్టాలు ఆ రాష్ట్ర పరిధికే వర్తిస్తాయని 245వ రాజ్యాంగ అధికరణ ఉవాచ. కానీ, రాష్ట్రం వెలుపల ఉన్న ఉత్తరాఖండీయులకూ యూసీసీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది హాస్యాస్పదం. అలాగే, సహజీవనాల రిజిస్ట్రేషన్ తప్పదంటున్నారే తప్ప, అలా చేసుకుంటే చట్టపరంగా ఆ భాగస్వాముల పరస్పర హక్కులకు రక్షణ లాంటివేమీ కల్పించ లేదు. వారి ప్రైవేట్ బతుకులు వ్యవస్థలో నమోదై నడిబజారులో నిలవడమే తప్ప, నిజమైన ప్రయో జనమూ లేదు. పైగా 21వ అధికరణమిచ్చిన గోప్యత హక్కుకు విఘాతమే! నిజానికి, గోప్యత హక్కులో సమాచార గోప్యత, స్వతంత్ర నిర్ణయాధికారం కూడా ఉన్నాయని జస్టిస్ పుట్టస్వామి కేసులో తొమ్మండుగురు న్యాయమూర్తుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం ఏనాడో తేల్చి చెప్పింది. ఇప్పుడీ యూసీసీ నిబంధన అచ్చంగా దానికి విరుద్ధమే. అలాగే, కులాంతర, మతాంతర వివాహాలపై విచ్చుకత్తులతో విరుచుకుపడి, ప్రాణాలు తీసే స్వభావం నేటికీ మారని సమాజంలో ఈ తరహా నిబంధనలు ఏ వెలుగులకు దారి తీస్తాయి? వెరసి, ఉత్తరాఖండ్ సర్కారు వారి యూసీసీ పైకి పెను సంస్కరణగా కనిపించినా, ఆఖరికి వేర్వేరు చట్టాల్లోని అంశాల్ని అనాలోచితంగా కాపీ చేసి అతికించిన అతుకుల బొంతగా మిగిలింది. ఇది ఏకరూపత పేరిట ప్రభుత్వం బల ప్రయోగం చేయడమే అవుతుంది. ఉత్తరాఖండ్ బాటలోనే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలూ పయనించి, ఆఖరికి యూసీసీని దేశవ్యాప్తం చేస్తారన్న మాట వినిపిస్తున్నందున ఇకనైనా అర్థవంతమైన చర్చ అవసరం. -
ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి
డెహ్రాడూన్: మతాలకతీతంగా మహిళలకు నిజమైన సాధికారతే లక్ష్యంగా, పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు దఖలుపరిచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉమ్మడి పౌరస్మృతి చట్టం(యూసీసీ) ఉత్తరాఖండ్లో సోమవారం అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్టులకెక్కింది. అన్ని మతాల్లో లింగభేదం లేకుండా పౌరులందరికీ ఉమ్మడి చట్టం అమలుచేయడమే యూసీసీ ముఖ్యోద్దేశం. చట్టం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ, విడాకుల, ఆస్తుల చట్టాలు అమలవుతాయి. ఇస్లామ్ను ఆచరించే వారికి ఇకపై విడిగా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ లాంటివి చెల్లుబాటుకావు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ అంటూ ఏకపక్షంగా ఇచ్చే విడాకులు చెల్లవు. షెడ్యూల్ తెగలను మాత్రం యూసీసీ నుంచి మినహాయించారు. వాళ్ల గిరిజన సంప్రదాయాలు, కట్టుబాట్లను ప్రభుత్వం గుర్తించి విలువ ఇస్తుంది. సోమవారం యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని డెహ్రాడూన్లోని అధికార నివాసంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. కేబినెట్ మంత్రులు, నాటి యూసీసీ ముసాయిదా కమిటీ సభ్యుల సమక్షంలో ఆయన యూసీసీ పోర్టల్ను ప్రారంభించారు. వివాహాలు చేసుకున్నా, విడాకులు తీసుకున్నా, సహజీవనం చేసినా ప్రతీదీ ఈ పోర్టల్ ద్వారా ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం నమోదుచేసుకోవాల్సిందే. పెళ్లికాకుండా సహజీవనం కారణంగా పుట్టిన పిల్లలకూ వారసత్వ హక్కులు దక్కేలా యూసీసీ చట్టంలో మార్పులుచేసి అమల్లోకి తెచ్చారు. పోర్టల్ ద్వారా ముఖ్యమంత్రి ధామీ తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. పోర్టల్ ద్వారా జారీ అయిన తొలి డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా సీఎం ధామీకి అందజేశారు. ‘‘ మతాలకతీతంగా పౌరులందరికీ యూసీసీ ద్వారా సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. మూడేళ్ల క్రితం యూసీసీపై మాటిచ్చా. ఇన్నాళ్లకు ఇది సాకారమైంది. ఈ ఘనత రాష్ట్ర ప్రజలదే. విభిన్న ఆచార వ్యవహారాలు, జీవనం సాగించే ఎస్టీలను యూసీసీ పరిధిలోకి తెచ్చి వారిని ఇబ్బంది పెట్టొద్దని నిర్ణయించుకున్నాం. అందుకే వారిని యూసీసీ నుంచి మినహాయించాం’’ అని సీఎం స్పష్టంచేశారు. చట్టం ప్రకారం ఇకపై ఉత్తరాఖండ్లో అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వం విధానాన్ని నిషేధించారు. హలాల్ విధానాన్ని సైతం రద్దుచేశారు. ‘‘ యూసీసీ అమలుతో భారత రాజ్యాంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం’’ అని సీఎం అన్నారు. -
నేటి నుంచే ఒకే చట్టం.. ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో నేటి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు కాబోతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ప్రకటించారు. స్వతంత్ర భారతదేశంలో యూసీసీని అమల్లోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించబోతున్నట్లు తెలిపారాయన.ఉత్తరాఖండ్లో నేటి నుంచి యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించిన నిబంధనలను కేబినెట్ ఆమోదించినట్లు సీఎం ధామీ వెల్లడించారు. సమాజంలో ప్రజలందరి మధ్య సమానత్వం కోసం యూసీసీ అవసరమని ఉద్ఘాటించారు. దీంతో అందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు లభిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, సామరస్యం, స్వయం సమృద్ధితో కూడిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా యజ్ఞం చేస్తున్నారని, ఇందులో తమ వంతు పాత్రగా యూసీసీని అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల హామీ అమలుఅధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్న 2022 ఎన్నికల హామీని బీజేపీ నిలుపుకుంటోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో 2022 మే 27న నిపుణుల కమిటీ ఏర్పాటయ్యింది. 2024 ఫిబ్రవరి 2న ముసాయిదా ప్రతిని ప్రభుత్వానికి సమర్పించింది. ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. నెల తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది. యూసీసీ చట్టం అమలుపై నియమ నిబంధనలు రూపొందించడానికి ఏర్పాటైన కమిటీ నివేదిక అందజేసింది.దేశమంతటా యూసీసీ: ధామిసామరస్యపూర్వకమైన సమాజానికి ఉమ్మడి పౌరస్మృతి బలమైన పునాది అవుతుందని సీఎం ధామీ ఆదివారం పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ప్రజలకు ఇచ్చిన హామీని సోమవారం నుంచే అమలు చేయబోతున్నామని వెల్లడించారు. వివక్షకు తావులేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించాలన్నదే బీజేపీ ధ్యేయమని తెలిపారు. ఎన్నో గొప్ప నదులు ఉత్తరాఖండ్లో పుట్టాయని, అలాగే యూసీసీ గంగోత్రి కూడా దేశమంతటా ప్రవహించబోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కూడా ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు.యూసీసీపై ఉత్తరాఖండ్ మోడల్ బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో యూసీసీ అమల్లోకి వస్తుండడంతో మిగతా బీజేపీ పాలత రాష్ట్రాలూ అదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది. అస్సాం ఇప్పటికే యూసీసీ అమలుపై ఆసక్తి వ్యక్తంచేసింది. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం తదితర వ్యవహారాల్లో కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం వర్తించడమే ఉమ్మడి పౌరస్మృతి. యూసీసీతో బాహు భార్యత్వంపై నిషేధమూ అమల్లోకి వస్తుంది. అన్ని వర్గాల్లోని పురుషులు గానీ, స్త్రీలు గానీ ప్రభుత్వం నిర్దేశించిన వయసు కంటే ముందే పెళ్లి చేసుకోవడం నేరమవుతుంది. అన్ని రకాల పెళ్లిలు, సహజీవనాలను రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఆన్లైనలో రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పెళ్లి చేసుకోని జంటలకు జన్మించే బిడ్డలకు సైతం యూసీసీతో చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి. -
ఇది హిందుస్తాన్
ప్రయాగ్రాజ్: దేశంలో మెజారిటీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు మాత్రం సంకోచించనని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యా నించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆదివారం అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యం’’ అన్నారు. ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలను జడ్జి పరోక్షంగా విమర్శించారు. ‘‘ మా పర్సనల్ లా వీటికి అంగీకరిస్తోందని అది ఏమాత్రం ఆమోదనీయం కాదు. మన శాస్త్రాలు, వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు. నలుగురు భార్యలను కల్గి ఉంటాను, హలాలా, త్రిపుల్ తలాఖ్ను పాటిస్తానంటే కుదరదు. సామరస్యం, లింగ సమానత, సామ్యవాదమే యూసీసీ ధ్యేయం. అంతే తప్ప వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, హిందూయిజాలను అది ప్రోత్సహించదు’’ అన్నారు. -
వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అహ్మాదాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. జాతీయ ఐక్యతా దినోత్సవంతోపాటు దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ ప్రసంగించారు.‘‘దీపావళి పండగ.. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం వైట్హౌస్లో 600 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లతో దీపావళిని జరుపుకున్నారు. అనేక దేశాల్లో దీపావళి జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు. ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’ త్వరలో సాకారమవుతుంది. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్వహించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు త్వరలో లైన్ క్లియర్ అవుతుంది. ఈ ప్రతిపాదనకు ఈ ఏడాది ప్రారంభంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన సమర్పించనున్నాం.#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "...We are now working towards One Nation One Election, which will strengthen India's democracy, give optimum outcome of India's resources and the country will gain new momentum in achieving the dream of a… pic.twitter.com/vUku6ZCnVv— ANI (@ANI) October 31, 2024 మేం ప్రస్తుతం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశ వనరుల సరైన ఫలితాన్ని ఇస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించడంలో సాయపడుతుంది. భారతదేశం.. నేషన్ వన్ సివిల్ కోడ్, సెక్యులర్ సివిల్ కోడ్ కలిగి దేవంగా అవతరించనుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. దానిని శాశ్వతంగా పాతిపెట్టాం. రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేవారే ఎక్కువగా అవమానిస్తున్నారు’’ అని అన్నారు. -
PM Narendra Modi: లౌకిక పౌరస్మృతి!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మతపరమైన పౌరస్మృతి అమల్లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దాన్ని 75 ఏళ్లుగా భరిస్తున్నాం. ఆ స్మృతికి చరమగీతం పాడి దాని స్థానంలో దేశ ప్రజలందరికీ సమానంగా వర్తించే ‘లౌకిక’ పౌరస్మృతిని రూపొందించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే. దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ఉండాలని ఆదేశిక సూత్రాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ఆవశ్యకతను సుప్రీంకోర్టు కూడా పలుమార్లు నొక్కిచెప్పింది. ఆ మేరకు తీర్పులు వెలువరించింది’’ అని గుర్తు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం మోదీ ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఆయనకిది వరుసగా పదకొండోసారి కావడం విశేషం. బీజేపీ ఎజెండా అంశాల్లో, ప్రధాన ఎన్నికల ప్రచార నినాదాల్లో ఒకటైన యూసీసీని వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తామని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ‘‘ప్రస్తుత పౌరస్మృతి ఒకవిధంగా మతపరమైనదన్న అభిప్రాయం సమాజంలోని మెజారిటీ వర్గంలో ఉంది. అందులో వాస్తవముంది. ఎందుకంటే అది మతవివక్షతో కూడినది. అందుకే దాన్నుంచి లౌకిక స్మృతివైపు సాగాల్సి ఉంది. తద్వారా రాజ్యాంగ నిర్మాతల కలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అది తక్షణావసరం కూడా’’ అని పేర్కొన్నారు. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ కూడా దేశానికి చాలా అవసరమని మోదీ అన్నారు. ‘‘2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేసుకుందాం. అందుకు 140 కోట్ల పై చిలుకు భారతీయులంతా భుజం భుజం కలిపి కలసికట్టుగా సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. రంగాలవారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని 98 నిమిషాల పాటు వివరించారు. తద్వారా అత్యంత ఎక్కువ సమయం పాటు పంద్రాగస్టు ప్రసంగం చేసిన ప్రధానిగా సొంత రికార్డు (94 నిమిషాల)నే అధిగమించారు. కొత్తగా 75,000 వైద్య సీట్లు ‘‘వైద్య విద్య కోసం మన యువత విదేశీ బాట పడుతోంది. ఇందుకోసం మధ్యతరగతి తల్లిదండ్రులు లక్షలు, కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అనామక దేశాలకు కూడా వెళ్తున్నారు’’ అని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. వచ్చే ఐదేళ్లలో 75 వేల వైద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ‘‘ఉన్నత విద్య కోసం యువత భారీగా విదేశాలకు వెళ్తోంది. దీన్ని సమూలంగా మార్చేస్తాం. విదేశాల నుంచే విద్యార్థులు మన దగ్గరికొచ్చే స్థాయిలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. అలనాటి నలంద విశ్వవిద్యాలయ స్ఫూర్తితో 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతాం. నూతన విద్యా విధానానిది ఇందులో కీలక పాత్ర కానుంది.కిరాతకులకు వణుకు పుట్టాలి మహిళలపై హింసకు తక్షణం అడ్డుకట్ట వేయాల్సిందేనని మోదీ అన్నారు. ‘‘మహిళలపై అకృత్యాలకు తెగించేవారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. ఉరి తప్పదన్న భయం రావాలి. మహిళలను ముట్టుకోవాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి కలి్పంచడం చాలా ముఖ్యం. ఇలాంటి కేసుల్లో పడ్డ శిక్షల గురించి అందరికీ తెలిసేలా మీడియాలో విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. అప్పుడే ప్రజల్లో తిరిగి విశ్వాసం పాదుగొల్పగలం’’ అన్నారు. కోల్కతాలో వైద్యురాలిపై దారుణ హత్యాచారం దేశమంతటినీ కుదిపేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘మహిళల భద్రత బాధ్యత కేంద్రంపై, రాష్ట్రాలపై, ప్రజలందరిపై ఉంది. కోల్కతా ఘోరంపై దేశమంతా తీవ్రంగా ఆక్రోశిస్తున్న తీరును అర్థం చేసుకోగలను. నాదీ అదే మనఃస్థితి. నేనెంత బాధ పడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఆ కేసు విచారణను సత్వరం ముగించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నీచకృత్యాలు పదేపదే జరుగుతుండటం బాధాకరం’’ అన్నారు. బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరం కల్లోల బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో ఆందోళన నెలకొందని మోదీ అన్నారు. అక్కడ త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వెలిబుచ్చారు. అందుకు భారత్ అన్నివిధాలా సహకారం అందిస్తుందని చెప్పారు.లక్ష మంది యువత రాజకీయాల్లోకిరాజకీయ రంగంలో కుల, కుటుంబవాదాలకు అడ్డుకట్ట వేయాలని మోదీ అన్నారు. అందుకోసం ఏ రాజకీయ నేపథ్యమూ లేని లక్ష మంది యువతీ యువకులు ప్రజా జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. ‘‘వారికి నచి్చన పారీ్టలో చేరి అన్ని స్థాయిల్లోనూ ప్రజాప్రతినిధులుగా మారాలి. కొత్త ఆలోచనలతో కూడిన ఆ కొత్త రక్తం మన ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయగలదు’’ అన్నారు.ప్రతికూల శక్తులతో జాగ్రత్త దేశ ప్రగతిని కొందరు ఓర్వలేకపోతున్నారని విపక్షాలనుద్దేశించి మోదీ విమర్శించారు. ‘‘ప్రతిదాన్నీ ధ్వంసం చేయాలని వాళ్లు కలలుగంటున్నారు. అవినీతిని ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రతికూల శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’’ అన్నారు. అంతర్గతంగా, బయటి నుంచి భారత్ లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.రాజస్తానీ రంగుల తలపాగా ఎప్పట్లాగే ఈ పంద్రాగస్టు సందర్భంగా కూడా మోదీ ప్రత్యేక తలపాగాతో మెరిసిపోయారు. పసుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన రాజస్తానీ సంప్రదాయ లెహరియా తలపాగాతో ఆకట్టుకున్నారు. తెల్ల కుర్తా, చుడీదార్, నీలిరంగు బంద్గలా ధరించారు. -
మళ్లీ తెరపైకి పౌరస్మృతి
వరసగా మూడోసారి గద్దెనెక్కిన తర్వాత ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన తొలి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అందులో ప్రధానమైనది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ). ఇప్పుడున్న ‘మతతత్వ పౌరస్మృతి’ స్థానంలో ‘సెక్యులర్ పౌరస్మృతి’ రావా ల్సిన అవసరం ఉందన్నది మోదీ నిశ్చితాభిప్రాయం. నిజానికి ఇదేమీ కొత్త కాదు. ఇంతక్రితం సైతం పలు సందర్భాల్లో యూసీసీ గురించి ఆయన మాట్లాడారు. నిరుడు జూన్లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో దీనిపై ఆయన గొంతెత్తారు. ఆ మాటకొస్తే పూర్వపు జనసంఘ్ నుంచీ బీజేపీ దీన్ని తరచూ చెబుతోంది. కనుక ఇందులో కొత్త ఏమున్నదని అనిపించవచ్చు. అయితే గతంలో ప్రస్తావించటానికీ, ఇప్పుడు మాట్లాడటానికీ మధ్య మౌలికంగా వ్యత్యాస ముంది. గత పదేళ్ల నుంచి ఆయన ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నా బీజేపీకి సొంతంగానే పాలించగల సత్తా ఉండేది. ఇప్పుడు కూటమి పక్షాలపై ఆధారపడక తప్పనిస్థితి వచ్చింది. ప్రధాని తాజా ప్రసంగంలో ఇంకా అవినీతి, మహిళల భద్రత, ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు వంటివి కూడా చోటుచేసుకున్నాయి. నిజానికి ఎర్రకోట బురుజు ప్రసంగం లాంఛనమైన అర్థంలో విధాన ప్రకట నేమీ కాదు. కానీ రాగల అయిదేళ్ల కాలంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేయదల్చుకున్నదేమి టన్న విషయంలో ఆయన స్పష్టతతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మనం పూర్తి స్థాయి సెక్యులర్ దేశంగా మనుగడ సాగించాలని తొలి ప్రధాని నెహ్రూ మొదలు కొని స్వాతంత్య్రోద్యమ నాయకులందరూ భావించారు. యూసీసీ గురించి రాజ్యాంగ నిర్ణాయక సభలో లోతైన చర్చే జరిగింది. రాజ్యాంగసభ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం యూసీసీ ఉండితీరాలని కోరుకున్నారు. సభ్యుల్లో కొందరు వ్యతిరేకిస్తే... అనుకూలంగా మాట్లాడినవారిలో సైతం కొందరు ఇది అనువైన సమయం కాదన్నారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు భిన్నమై నవి. దేశ విభజన సమయంలో ఇరుపక్కలా మతోన్మాదులు చెలరేగిపోయారు. నెత్తురుటేర్లు పారించారు. పరస్పర అవిశ్వాసం, అపనమ్మకం ప్రబలటంతో ఇళ్లూ, వాకిళ్లూ, ఆస్తులూ అన్నీ వదిలి లక్షల కుటుంబాలు ఇటునుంచి అటు... అటునుంచి ఇటూ వలసబాట పట్టారు. అదే సమయంలో పాకి స్తాన్ ఆవిర్భావానికి కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా మరింత రెచ్చగొట్టే ప్రకటన చేశారు. భారత్లో ముస్లింలకు మనుగడ ఉండబోదని, వారిని అన్ని విధాలా అణిచేస్తారని దాని సారాంశం. అలాంటి సమయంలో యూసీసీని తీసుకొస్తే అనవసర అపోహలు బయల్దేరి పరిస్థితి మరింత జటిలమవుతుందని అందరూ అనుకున్నారు. అందువల్లే హక్కుల్లో భాగం కావాల్సిన యూసీసీ కాస్తా 44వ అధికరణ కింద ఆదేశిక సూత్రాల్లో చేరింది. ఆ సూత్రాలన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన అంశాలు. అయినా ఇతర అధికరణాల అమలు కోసం వెళ్లినట్టుగా కోర్టుకు పోయి వాటి అమలుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరటం సాధ్యం కాదు. అందువల్లే సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో యూసీసీని తీసుకురావలసిన అవసరాన్ని పాలకులకు గుర్తుచేసి ఊరుకుంది. చిత్రమేమంటే పర స్పర పూరకాలు కావలసిన హక్కులూ, ఆదేశిక సూత్రాలూ కొన్ని సందర్భాల్లో విభేదించుకుంటాయి. ఉదాహరణకు 25 నుంచి 28వ అధికరణ వరకూ పౌరులకుండే మత స్వేచ్ఛ గురించి మాట్లాడ తాయి. ఆదేశిక సూత్రాల్లో ఒకటైన యూసీసీపై చట్టం తెస్తే సహజంగానే అది మత స్వేచ్ఛను హరించినట్టవుతుంది. కనుక ఈ రెండింటి మధ్యా సమన్వయం సాధించాలి. గతంలో చాలా సందర్భాల్లో ఇలా చేయకతప్పలేదు. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ ప్రభావితం కాని రీతిలో ఆ పని చేయాలి. ఆ సంగతలా ఉంచి యూసీసీ తీసుకురాదల్చుకుంటే ఇస్లామ్ను అనుసరించేవారికి మాత్రమే కాదు... హిందూ, క్రైస్తవ, పార్సీ మతస్థులపైనా ప్రభావం పడుతుంది. కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చుగానీ దాదాపు అన్ని మతాలూ స్త్రీల విషయంలో వివక్షాపూరితంగానే ఉన్నాయి.ముఖ్యంగా వ్యక్తిగత (పర్సనల్) చట్టాలకొచ్చేసరికి ఇది బాహాటంగా కనబడుతుంది. వీటి మూలాలు వందలు, వేల ఏళ్ల నుంచి పరంపరగా వస్తూవున్న సంప్రదాయాల్లో ఉండటం, మారు తున్న కాలానికి అనుగుణంగా సవరించుకోవటానికి సిద్ధపడకపోవటం సమస్య. వివాహం, విడా కులు, పునర్వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు, బహుభార్యాత్వం వంటి అంశాల్లో స్త్రీలకు వివక్ష ఎదురవుతోంది. అయితే రాజ్యాంగం హామీ ఇచ్చిన లింగసమానత్వం లేని పక్షంలో అలాంటి చట్టా లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలున్నాయి. పార్శీల్లో అన్య మతస్థుణ్ణి పెళ్లాడిన మహిళలకు వారసత్వ ఆస్తిలో భాగం ఇవ్వరు. పార్శీ పురుషుడికి అది వర్తించదు. అన్ని అంశాలనూ సవివరంగా చర్చించేందుకూ... అన్ని మతాచారాల వివక్షను తొలగించటానికీ సిద్ధపడుతున్నారన్న అభిప్రాయం కలిగిస్తే యూసీసీ రూపకల్పన సమస్యేమీ కాదు. దానికి ముందు మైనారిటీల విశ్వాసం పొందాలి. కోల్కతాలో ఇటీవల మహిళా జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య నేపథ్యంలో మహిళల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ఇక భారత్లో అవినీతి పెచ్చుమీరిందని గణాంకాలు వెల్లడి స్తున్న నేపథ్యంలో కఠినంగా ఉంటామన్న సంకేతాలిచ్చారు. కానీ అలాంటి ఆరోపణలున్న నేతలు బీజేపీలోనో, దాని మిత్రపక్షంగానో ఉన్నప్పుడూ... వారిపై కేసుల దర్యాప్తు మందగిస్తున్నప్పుడూ దీన్ని జనం ఎంతవరకూ విశ్వసించగలరన్నది ఆలోచించుకోవాలి. మొత్తానికి యూసీసీ అంశాన్ని ప్రధాని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఎటువంటి స్పందన వస్తుందో, ఎన్డీయే కూటమిలోని ఇతర పక్షాల వైఖరి ఏ విధంగా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలు అవమానకరం: జైరాం రమేశ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 78వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ గురువారం ‘ఎక్స్’ వేదికగా మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘యూసీసీ గురించి మోదీ మాట్లాడుతూ ఇప్పటివరకు మనకు కమ్యూనల్ సివిల్ కోడ్ ఉందనటం చాలా అవమానకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మోదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానపరిచారు. చరిత్రను కించపర్చటంలో ప్రధాని మోదీకి ఎటువంటి హద్దు లేకుండా పోయింది. 1950లో అంబేద్కర్ హిందూ చట్టాల్లో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పుడు ఆ సంస్కరణలను ఆర్ఎస్ఎస్, జన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించాయి’అని అన్నారు. మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసగంలో.. ‘దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. తనం మతపరమైన సివిల్ కోడ్తో 75 ఏళ్లు జీవించాం. ఇప్పుడు మనం సెక్యులర్ సివిల్ కోడ్ వైపు వెళ్లాలి. అప్పుడే దేశంలో మతపరమైన వివక్ష అంతం అవుతుంది. దీంతో సామాన్య ప్రజల మధ్య విభజన పరిస్థితులు దూరం అవుతాయి’అని అన్నారు.మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం మీడియాతో మట్లాడారు. బీజేపీ ప్రభుత్వం విభజన ఆలోచనలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం మన దేశ బలమే తప్ప బలహీనత కాదు. మనకు స్వాతంత్య్రం తేలికగా వచ్చిందని కొందరు ప్రచారం చేస్తారు. కానీ, లక్షల మంది త్యాగాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది’’అని అన్నారు. -
యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ
నైనిటాల్: సహజీవనం చేస్తున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్పై ఉత్తరాఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) ఇంకా అమల్లో రాలేదు. అయినప్పటికీ ఈ చట్టం కింద 48 గంటల్లోగా రిజిస్టర్ చేసుకున్న పక్షంలో పిటిషన్దారుగా ఉన్న జంటకు ఆరు వారాలపాటు రక్షణ కల్పించాలంటూ పోలీసు శాఖను ఆదేశిస్తూ జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ, జస్టిస్ పంకజ్ పురోహిత్ల డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున జూనియర్ న్యాయవాది హాజరయ్యారు. రాష్ట్రంలో యూసీసీ అమలుపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదనే విషయం ఆయనకు తెలియదు. అవగాహనా లోపం వల్ల ఇలా జరిగింది. దీనిపై హైకోర్టులో రీ కాల్ పిటిషన్ వేస్తాం. హైకోర్టు ఈ తీర్పును సవరించి, మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తుంది’అని చెప్పారు. అదే సమయంలో, ఆ జంటకు పోలీసులు రక్షణ కల్పిస్తారని కూడా ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. వేర్వేరు మతాలకు చెందిన తమ కుటుంబాల నుంచి ముప్పుందంటూ సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల హిందూ మహిళ, 21 ఏళ్ల ముస్లిం యువకుడు వేసిన పిటిషన్ ఈ మొత్తం వ్యవహారానికి కారణమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిపాదించిన యూసీసీ ప్రకారం యువ జంటలు తాము సహజీవనం చేస్తున్న రోజు నుంచి నెల రోజుల్లోగా అధికారుల వద్ద నమోదు చేసుకోకుంటే జరిమానా విధించొచ్చు. -
కులగణనపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్రమంత్రి, ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్త కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కులగణన చేసి వాటి వివరాలు బహిర్గతం చేస్తే సమాజంలో విభజనకు దారి తీస్తుందని అన్నారు. కులగణన వివరాలు వెల్లడిస్తే జరిగే పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిరాగ్ పాశ్వాన్ పీటీఐ ఎడిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.లోక్సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన.. దేశంలో ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలపై ఎటువంటి చర్చలు ఎన్డీయే కూటమిలో జరగటం లేదని స్పష్టం చేశారు. ‘మా ముందుకు ఇప్పటికీ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ముసాయిదా రాలేదు. మేము ఆ ముసాయిదాను పరిశీలించాలి. ఎందుకంటే భారత్ భిన్నత్వం ఏకత్వం గల దేశం కావున, మాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భాష, సంస్కృతి, జీవనశైలిలో చాలా వ్యత్యాలు ఉంటాయి. అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటంపై నాకు ఆశ్చర్యం కలుగుతోంది. .. అయితే ఉమ్మడి పౌరస్మృతి అంశం చర్చకు వచ్చినప్రతిసారి హిందూ, ముస్లింల వ్యవహారంగా కనిస్తోంది. కానీ, ఇది అందరి మత విశ్వాసాలు, సంప్రదాయాలు, వివాహ పద్దతులకు సంబంధించింది. హిందు, ముస్లింలను వేరు చేసింది అస్సలే కాదు. ఇది అందరినీ ఏకం చేసేది మాత్రమే’ అని అన్నారు.మరోవైపు.. ‘ప్రభుత్వం కులాల వారీగా చేపట్టే సంక్షేమ పథకాలకు కులగణన ఎంతో ఉపయోగపడుతంది. కోర్టులు కూడా కులాల వారీ జనాభా డేటాను పలసార్లు ప్రస్తావించింది. అయితే ఈ డేటాను ప్రభుత్వం తన వద్దనే ఉంచుకోవాలి. బయటకు విడుదల చేయవద్దు. అయితే కులగణన డేటాను బహిర్గతం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆలా చేయటం వల్ల సమాజంలో కులాల మధ్య విభజనకు దారి తీస్తుందనే ఆందోళన కలుగుతోంది’ అని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. -
ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నా: మేఘ్వాల్
కోల్కతా: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా కొన్ని రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయని గుర్తుచేశారు. ఆదివారం కోల్కతాలో మాట్లాడారు. బీజేపీ మేనిఫెస్టోలో యూసీసీని ప్రస్తావించామని ఆయన గుర్తు చేశారు. -
Amit Shah: మేం అలాగే చేస్తాం
న్యూఢిల్లీ: విపక్షాల విమర్శలకు జడిసేదిలేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టంచేశారు. ఆరి్టకల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, ముస్లింలకు కోటాను వ్యతిరేకిస్తూ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మతం అంశాన్ని ముందుకు తెస్తోందని విపక్షాలు విమర్శించినాసరే తాము అలాగే చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఆదివారం పీటీఐతో ఇంటర్వ్యూలో షా వెల్లడించిన విషయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. మేం అప్పుడు ఓడిపోయాం కదా! ‘‘రాజ్యాంగంలో లేనివిధంగా మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు విపక్షాలు ఇస్తామంటే వ్యతిరేకిస్తున్నాం. ఆరి్టకల్ 370ని రద్దుచేశాం, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చాం. చేసిన పనులనే చెప్పుకుంటున్నాం. వద్దు అని విపక్షాలు అన్నాసరే మేం అలాగే చేస్తాం. కావాలనే పోలింగ్ శాతాలను ఈసీ ఆలస్యంగా వెల్లడిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు అంటున్నాయి. ఈవీఎంలను బీజేపీ తమకు అనుకూలంగా మార్చేస్తోందని విపక్షాల చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. తెలంగాణ, పశి్చమబెంగాల్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఈసీ ఇలాగే చేసింది. అప్పుడు ఆ రాష్ట్రాల్లో మేం ఓడిపోయాంకదా. ఆ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఈ ఎన్నికలు కూడా అంతే పారదర్శకంగా జరుగుతున్నట్లే లెక్క. ఓడిపోతానని రాహుల్ గాంధీ ఊహించారు. అందుకే ముందే ఏడ్చేసి, ఏవో కారణాలు చెప్పేసి విదేశాలకు వెళ్లిపోతారు. జూన్ 6న విదేశాలకు వెళ్తారేమో. అందుకే ఏదో ఒకటి చెప్తున్నారు’’ ‘400’ అనేది నినాదం కాదు ‘‘ మేం 399 సీట్లు సాధిస్తే ‘ మీకు 400 రాలేదుగా’ అని విపక్షాలు విమర్శిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తా. ఈసారి 400 సీట్లు గెలుస్తాం అనేది మా నినాదం కాదు. విజయావకాశాలను లెక్కగట్టి చెప్పిన సంఖ్య అది. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వల్లే మేం ఈసారి ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం. పేద కుటుంబమహిళకు ఏటా రూ.1 లక్ష ఇస్తామని కాంగ్రెస్ అమలుచేయలేని వాగ్దానాలిస్తోంది. 2–3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిస్తోంది. రూ.1 లక్ష సంగతి దేవుడెరుగు గతంలో హామీ ఇచి్చనట్లు(హిమాచల్ ప్రదేశ్లో) రూ.1,500 అయినా ఇస్తారేమో చూద్దాం. బెంగాల్, ఒడిశాలోనూ మాదే హవా ‘‘పశ్చిమబెంగాల్లో 24–30 సీట్లు, ఒడిశాలో 16–17 సీట్లు గెలుస్తాం. తమిళనాడులోనూ ఓటు షేర్ పెంచుకుంటాం. ఈసారి కేరళలో ఖాతా తెరుస్తాం. వచ్చే ఐదేళ్లలో దేశమంతటా ఉమ్మడి పౌరస్మతి అమలుచేస్తాం. మండే ఎండాకాలంలో కాకుండా వేరే కాలంలో ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అమలుచేస్తాం. సంబంధిత బిల్లునూ పార్లమెంట్లో ప్రవేశపెడతాం. ఆర్మీలో యువత కోసం అగి్నవీర్ను మించిన అద్భుత పథకం లేదు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత చక్కని ప్రతిభ కనబరిచిన వారికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఉంది కదా’’. -
‘తృణమూల్’ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే..
కలకత్తా: లోక్సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్లతో పాటు ఎన్ఆర్సీలను బెంగాల్లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు, రేషన్కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అస్సాంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తాం. మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్ క్యాంపుగా మార్చేసింది’అన్నారు. కాగా, బెంగాల్లో ఏప్రిల్ 19న తొలి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ 150 సీట్లకే పరిమితం.. రాహుల్ -
యూసీసీ అమలుపై 'పీయూష్ గోయల్' కీలక ప్రకటన
ముంబై: త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేయడానికి దేశంలోని చిన్నా, పెద్దా.. పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ అగ్రనేతలు కూడా రంగంలోకి దూకారు. ఈ తరుణంలో ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయడానికి సిద్దమైన 'పీయూష్ గోయల్' కీలక ప్రకటనలు చేశారు. దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. యూనిఫాం సివిల్ కోడ్ (UCC)అమలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను కూడా తోసిపుచ్చారు. యూనిఫాం సివిల్ కోడ్ అనేది భారతదేశంలో పౌరుల కోసం వ్యక్తిగత చట్టాలను రూపొందించి అమలు చేయడానికి అవసరమైన ఒక ప్రతిపాదన. ఇది వారి మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తిస్తుంది. ప్రస్తుతం, వివిధ సంఘాల వ్యక్తిగత చట్టాలు వారి మత గ్రంథాలచే నిర్వహించబడుతున్నాయి. దేశంలో యూసీసీని అమలు చేయాలని బీజేపీ నిర్చయించుకుందని, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తప్పకుండా అమలు చేస్తామని పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కసరత్తు చేసిందని కూడా పేర్కొన్నారు. అంతే కాకుండా వికసిత్ భారత్ కేవలం నరేంద్ర మోదీతోనే సాధ్యమని అన్నారు. -
Uttarakhand Ucc: ‘యూసీసీ’కి రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం(మార్చ్ 13) ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో యూసీసీ బిల్లు చట్టంగా మారింది. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు వంటి పర్సనల్ చట్టాలన్నింటిని ఒకే గొడుగుకు కిందకు తీసుకువచ్చి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించింది. తాజాగా ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించింది. యూసీసీ బిల్లు ముస్లింల సంప్రదాయ హక్కులను కాలరాసే విధంగా ఉందని, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. సీఎం స్టాలిన్కు ఆ అధికారం లేదు -
ఆ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చరిత్రాత్మక నిర్ణయానికి వేదికైంది. స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ బిల్లుకు ( UCC Bill Uttarakhand ) ఆ రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి సమక్షంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలంతా స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన.. ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇక నుంచి ఆ రాష్ట్రంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. సహ జీవనంలో పుట్టిన పిల్లలకు కూడా చట్టపరమైన గుర్తింపును కల్పించడం... సహ జీవనాన్ని రిజిస్టర్ చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష వంటి అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. అలాగే.. షెడ్యూల్డ్ తెగలను బిల్లు పరిధి నుంచి తప్పించారు. #WATCH | Dehradun: Uttarakhand Assembly MLAs celebrate and share sweets as the Uniform Civil Code 2024 Bill, introduced by Chief Minister Pushkar Singh Dhami-led state government was passed in the House today. pic.twitter.com/eDq6cZbf4H — ANI (@ANI) February 7, 2024 ఇదిలా ఉంటే.. యూసీసీ బిల్లు రూపకల్పనలో అక్కడి బీజేపీ ప్రభుత్వం రాజకీయ విమర్శలు ఎదుర్కొంది. విపక్షాల ఆందోళనల నడుమే మంగళవారం ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి దీన్ని ప్రవేశపెట్టారు. ఆపై గందరగోళ పరిస్థితుల నడుమ సభ వాయిదా పడగా.. చివరకు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. ఆమోదం లభించింది. స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. దేశంలో.. గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. #WATCH | Dehradun: In the Uttarakhand Assembly, CM Pushkar Singh Dhami speaks on UCC, "... After the independence, the makers of the Constitution gave the right under Article 44 that the states can also introduce the UCC at appropriate time... People have doubts regarding this.… pic.twitter.com/KDfLUdtBbG — ANI (@ANI) February 7, 2024 రెండేళ్ల కసరత్తు తర్వాత.. ఇదిలా ఉంటే.. యూసీసీని ఉత్తరాఖండ్ బీజేపీ 2022 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి రాగానే.. సీఎం పుష్కర్సింగ్ ధామి ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు సుదీర్ఘ కసరత్తులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా సమావేశాలు నిర్వహించి 60వేల మందితో మాట్లాడింది. ఆన్లైన్లో వచ్చిన 2.33లక్షల సలహాలు, సూచనలను పరిశీలించింది. అనంతరం ముసాయిదాను రూపొందించి ఇటీవల సీఎంకు సమర్పించింది. -
Uttarakhand Ucc Bill: యూసీసీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అక్కడి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) పూర్తిగా హిందూ కోడ్ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. ఈ విషయమై బుధవారం ఢిల్లీలో ఆయన స్పందించారు. హిందువుల కోడ్ అయిన యూసీసీని ముస్లింలతో పాటు ఇతర మతాల వాళ్లకు వర్తింపజేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. కోడ్లో హిందూ అవిభక్త ఫ్యామిలీ(హెచ్యూఎఫ్)ను ఎందుకు ముట్టుకోలేదని ప్రశ్నించారు. ఇతర మతాల వాళ్ల సంప్రదాయాలను ముస్లింలు ఆచరించాలని చట్టంలో పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు తమ మతాచారాలను ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నప్పుడు గిరిజనులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నపుడు అక్కడి సీఎం పుష్కర్ సింగ్ యూసీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి సమస్యను పక్కదారి పట్టించడంపై ఒవైసీ విమర్శలు గుప్పించారు. వదరలు వచ్చి రాష్ట్ర ప్రజలు చాలా సమస్యల్లో ఉంటే పుష్కర్ సింగ్కు యూసీసీ ఎందుకు ప్రాధాన్యత కలిగిన అంశంగా కనిపిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్లో ఈడీ రెయిడ్స్.. ఆ పార్టీ నేతే టార్గెట్ -
‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఎవరిపై ఎంత ప్రభావం?
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ).. అంటే ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉత్తరాఖండ్లోని ధామి ప్రభుత్వం అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బిల్లుకు స్వాగతం పలికారు. అయితే దీనిపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఇంకా చర్చల దశలోనే ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ ఏ మతంపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు ఉత్తరాఖండ్లో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలైన పక్షంలో హిందూ వివాహ చట్టం (1955), హిందూ వారసత్వ చట్టం (1956) తదితర ప్రస్తుత చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇది కాకుండా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్యూఎఫ్)పై కూడా దీని ప్రభావం పడనుంది. ముస్లింలు ప్రస్తుతం ముస్లిం పర్సనల్ (షరియత్) అప్లికేషన్ చట్టం 1937 ముస్లింలకు అమలువుతోంది. దీనిలో వివాహం, విడాకులు తదితర నియమాలు ఉన్నాయి. అయితే యూసీసీ అమలైతే బహుభార్యత్వం, హలాలా తదితర పద్ధతులకు ఆటకం ఏర్పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్లో ముస్లిం జనాభా 13.95 శాతం ఉంది. సిక్కు కమ్యూనిటీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్లో సిక్కు జనాభా 2.34%. ఆనంద్ వివాహ చట్టం 1909 సిక్కుల వివాహాలకు వర్తిస్తుంది. అయితే ఇందులో విడాకులకు ఎలాంటి నిబంధన లేదు. అటువంటి పరిస్థితిలో విడాకుల కోసం సిక్కులకు హిందూ వివాహ చట్టం వర్తిస్తుంది. అయితే యూసీసీ అమలులోకి వచ్చిన పక్షంలో అన్ని వర్గాలకు ఒకే చట్టం వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆనంద్ వివాహ చట్టం కనుమరుగు కావచ్చు. క్రైస్తవులు క్రైస్తవ సమాజానికి చెందిన ప్రజలు కూడా ఉత్తరాఖండ్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్టియన్ విడాకుల చట్టం 1869లోని సెక్షన్ 10A(1) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు భార్యాభర్తలు కనీసం రెండేళ్లపాటు విడిగా ఉండటం తప్పనిసరి. ఇది కాకుండా 1925 వారసత్వ చట్టం ప్రకారం క్రైస్తవ మతంలోని తల్లులకు వారి మరణించిన పిల్లల ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. అయితే యూసీసీ రాకలో ఈ నిబంధన ముగిసే అవకాశం ఉంది. ఆదివాసీ సముదాయం ఉత్తరాఖండ్లోని గిరిజనులపై యూసీసీ ప్రభావం ఉండదు. ఉత్తరాఖండ్లో అమలు కాబోయే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు.. ఇందులోని నిబంధనల నుండి గిరిజన జనాభాకు మినహాయింపు ఇచ్చింది. ఉత్తరాఖండ్లో గిరిజనుల జనాభా 2.9 శాతంగా ఉంది. -
Uttarakhand UCC Bill: ఆచరణ సాధ్యమేనా?!
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టి దేశంలోనే ఆ దిశగా తొలి అడుగేసిన రాష్ట్రమైంది. ఉమ్మడి పౌరస్మృతిపై బీజేపీ ఆరాటం ఎవరికీ తెలియంది కాదు. ఆవిర్భావం నుంచీ బీజేపీ ఆ మాట చెబుతూ వస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో యూసీసీ ఆ పార్టీ వాగ్దానాల్లో కీలకాంశం. రాష్ట్రాల్లో అంతకుముందూ, ఆ తర్వాతా బీజేపీ అధికారం అందుకున్నా ఎక్కడా ఉమ్మడి పౌరస్మృతి ఇలా బిల్లు రూపంలో చట్టసభ ముందుకొచ్చిన వైనం లేదు. మధ్యప్రదేశ్, అస్సాం, గుజరాత్లలో బీజేపీ ప్రభుత్వాలే వున్నా ఈ విషయంలో పెద్దగా పురోగతి లేదు. ఆ రకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి ఇతరులకన్నా చాలా ముందున్నట్టు లెక్క. దేశంలో ప్రస్తుతం ఒక్క గోవాలో మాత్రమే యూసీసీ అమల్లో వుంది. అయితే అది 1867లో అప్పటి పోర్చుగీస్ పాలకులు తెచ్చిన చట్టం. రాజ్యాంగ నిర్ణాయక సభలో సైతం యూసీసీ గురించి చర్చ జరిగింది. దాన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని కొందరు సభ్యులు అభిప్రాయపడగా మైనా రిటీ వర్గాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించటంతో అంతకుమించి ముందుకు కదల్లేదు. చివరకది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో 44వ అధికరణ అయింది. దేశంలోని పౌరులందరికీ వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావటానికి రాజ్యం కృషి చేయాలని ఆ అధికరణ నిర్దేశించింది. ఆదేశిక సూత్రాలు రాజ్యం అమలు చేసి తీరాల్సినవి కాదు గనుక న్యాయస్థానాల తీర్పుల్లో ఉటంకించటానికి మాత్రమే ఆ అధికరణ పనికొచ్చింది. 1985లో షాబానో కేసులోనూ, 1995లో సరళా ముద్గల్ కేసు లోనూ వెలువరించిన తీర్పుల్లో ఉమ్మడి పౌరస్మృతి దేశ సమైక్యతకూ, సమగ్రతకూ తోడ్పడుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనాలు అభిప్రాయపడ్డాయి. 21వ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతిపై భిన్నవర్గాల అభిప్రాయాలు సేకరించి, న్యాయనిపుణులతో కొన్ని నెలలపాటు చర్చించి ‘ఈ దశలో అది అవసరమూ కాదు, వాంఛనీయమూ కాద’ని తేల్చింది. చిత్రమేమంటే ఆ తర్వాత ఏర్పడ్డ 22వ లా కమిషన్ యూసీసీపై ప్రజాభిప్రాయాన్ని తెలపాలంటూ ప్రకటనలు విడుదల చేసింది. అది జరిగి మూడేళ్లు గడిచింది కాబట్టి ప్రజల తాజా అభిప్రాయమేమిటో తెలుసుకోదల్చుకున్నామని లా కమిషన్ సమర్థించుకుంది. ఉమ్మడి పౌరస్మృతి చుట్టూ మొదటినుంచీ వివాదాలు అల్లుకుంటూనే వున్నాయి. దాన్ని తీసుకు రావటం, సజావుగా అమలు చేయటం భిన్న మతాల, సంస్కృతులకు నిలయమైన భారత్లో సాధ్యంకాదన్నది కొందరి అభిప్రాయం. ముఖ్యంగా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత తది తర వ్యవహారాలతో ముడిపడివుండే అంశాల్లో వేర్వేరు మతాలకు వేర్వేరు సంప్రదాయాలున్నాయి. దాదాపు అన్ని పర్సనల్ చట్టాలూ మహిళలపై వివక్ష ప్రదర్శిస్తున్నాయి. ఈ దశలో అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటం అంత సులభం కాదు. 50వ దశకంలో హిందువులకు వర్తించేలా అయిదు చట్టాలు– హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, హిందూ మైనర్ల సంరక్షకత్వ చట్టం, హిందూ దత్తత, మనోవర్తి చట్టం, హిందూ ఆస్తి స్వాధీనతా చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాలే సిక్కు, బౌద్ధ, జైన మతస్తులకు కూడా వర్తిస్తున్నాయి. ముస్లిం, క్రైస్తవ, పార్సీ మతస్తులకు వేర్వేరు పర్సనల్ చట్టాలున్నాయి. ఆ మతాల్లో కూడా కొన్ని అంశాల్లో ఏకరూపత లేదు. సంప్ర దాయాల పరంగా చూస్తే వివాహాలకు సంబంధించి హిందూమతంలోనే భిన్నమైన ఆచరణలు న్నాయి. అవిభాజ్య హిందూ కుటుంబాలకు వర్తించే పన్ను రాయితీల వంటివి వేరే మతస్తులకు వర్తించవు. ఇక ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, మిజోరంలలో స్థానిక సంప్రదాయాలను పరిరక్షించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. రాజ్యాంగంలోని 25వ అధికరణ పౌరులందరికీ ఏ మతా న్నయినా ఆచరించే, ప్రచారం చేసుకునే హక్కును ఇస్తున్నది. ఇన్ని అవరోధాలను దాటుకుని అందరికీ వర్తించే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావటం అంత సులభమేమీ కాదు. 2019లో కేంద్రం తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టానికి ఏమైందో మన కళ్లముందే వుంది. అందులోని కఠిన నిబంధనల కారణంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేయలేమని చేతులెత్తేశాయి. తమ అవసరాలకు తగినట్టు చట్టానికి సవరణలు తీసుకొచ్చాయి. వలస పాలకుల హయాంలో రూపొంది ఇంతవరకూ అమల్లోవున్న సాక్ష్యాధారాల చట్టం, కాంట్రాక్టు చట్టం, ఆస్తి బదలాయింపు చట్టం వగైరాలకు దాదాపు అన్ని రాష్ట్రాలూ వందల సవరణలు చేసుకున్నాయి. కనుక ‘ఒకే దేశం–ఒకే చట్టం’ ఆదర్శనీయమైనంతగా ఆచరణసాధ్యం కాదు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై చర్చ, ఆమోదం మంగళవారమే ఉంటాయని ప్రభుత్వం చెప్పినా మరింత సమయం అవసరమన్న విపక్షాల వినతితో అసెంబ్లీ స్పీకర్ దాన్ని సవరించారు. ఆ సంగ తలా వుంచితే ఒక్క ఆదివాసీలు మినహా అన్ని మతాలవారికీ వివాహం, విడాకులు, ఆస్తి హక్కు వగైరా అంశాల్లో ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని బిల్లు చెబుతోంది. ఆఖరికి సహజీవనం చేసే జంటలు సైతం తమ బంధాన్ని రిజిస్టర్ చేయించుకోవాల్సిందేనని బిల్లు నిర్దేశిస్తోంది. సహజీవనంలోకి వెళ్లిన నెలలోగా రిజిస్టర్ చేసుకోవాలనీ, అలా చేయకపోతే మూడునెలల కారాగారం తప్పదనీ హెచ్చరిస్తోంది. రిజిస్టర్ చేయించుకున్న సహజీవనం ద్వారా జన్మించే సంతానాన్ని మాత్రమే సక్రమ సంతానంగా గుర్తించటం సాధ్యమంటున్నది. ఉత్తరాఖండ్లో నివసించే వేరే రాష్ట్రాలవారికి సైతం ఇది వర్తిస్తుందని చెబుతోంది. ఇలా పౌరుల వ్యక్తిగత అంశాల్లోకి రాజ్యం చొరబడటం సబబేనా? అసలు దేశమంతటికీ వర్తించే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని 44వ అధికరణ నిర్దేశిస్తుండగా, ఒక రాష్ట్రం అలాంటి చట్టం తీసుకురావటం రాజ్యాంగబద్ధమేనా? -
రిజిస్ట్రేషన్ లేకుండా ‘లివ్ ఇన్’లో ఉంటే జైలుకే?
ఉత్తరాఖండ్.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసే తొలి రాష్ట్రం కానుంది. దీంతో ఆ రాష్ట్రంలో పలు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ‘లివ్-ఇన్’లో ఉంటూ, ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ జంటకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న జంట ఈ రిజిస్ట్రేషన్తో స్వీకరించే రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యాన్ని పొందగలుగుతారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటీవల సీఎం ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూసీసీ ముసాయిదాలో ఈ నిబంధన గురించి పేర్కొన్నారు. ‘యూసీసీ’లో ‘లివ్-ఇన్’ సంబంధం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీని ప్రకారం ఒక వయోజన పురుషుడు, ఒక వయోజన మహిళ మాత్రమే లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండగలుగుతారు. అలాంటివారు ఇప్పటికే వివాహం చేసుకోకూడదు లేదా మరొకరితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో లేదా నిషేధిత సంబంధాలలో ఉండకూడదు. లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇటువంటి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదుని అందజేస్తారు. ఆ రశీదు ఆధారంగా ఆ జంట ఇల్లు లేదా హాస్టల్ లేదా పీజీని అద్దెకు తీసుకోవచ్చు. అయితే ‘లివ్ ఇన్’ కోసం రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయించుకున్న జంట ఆ విషయాన్ని తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు. ‘లివ్-ఇన్’ రిలేషన్షిప్లో ఉంటున్నవారు విడిపోవాలనుకున్నా, తిరిగి ఆ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
అసెంబ్లీలో యూసీసీ బిల్లు.. విపక్షాల రగడ.. సభ వాయిదా!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లోని రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ‘వందేమాతరం, జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. దీనిపై పలు ప్రశ్నలు సంధించారు. యూనిఫాం సివిల్ కోడ్పై చర్చించేందుకు సభను మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి భూషణ్ అధ్యక్షతన జరిగిన వ్యాపార సలహా సమావేశంలో సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని నిర్ణయించారు. యూసీసీపై చర్చతోపాటు రాష్ట్ర ఆందోళనకారులకు రిజర్వేషన్లపై సెలెక్ట్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రీతమ్ సింగ్ వ్యాపార సలహా కమిటీకి రాజీనామా చేశారు. యూసీసీపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య మాట్లాడుతూ తాము యూసీసీ బిల్లును వ్యతిరేకించడం లేదని అన్నారు. అయితే రాజ్యాంగ ప్రక్రియ, నిబంధనల ప్రకారం సభ పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం ఆరుగురు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మృతికి సభలో నివాళులర్పించారు. -
UCC Bill: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. యూసీసీపై బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు (మంగళవారం) రెండవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పోర్చుగీస్ పాలనా కాలం నుండి గోవాలో యూసీసీ అమలులో ఉంది. యూసీసీ కింద వివాహం, విడాకులు, భరణం, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన చట్టాలు రాష్ట్రంలోని పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తాయి. మంగళవారం సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు. యూసీసీ గురించి ఇటీవల మాట్లాడిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీనివలన అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. బిల్లుపై సభలో సానుకూలంగా చర్చించాలని ఇతర పార్టీల సభ్యులను అభ్యర్థించారు. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం యూసీసీ ముసాయిదాను ఆమోదించి, ఫిబ్రవరి 6న బిల్లుగా సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. నాలుగు సంపుటాలలో 740 పేజీలతో కూడిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రికి సమర్పించింది. 2022లో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూసీసీపై చట్టం చేసి, రాష్ట్రంలో దానిని అమలు చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. 2000లో ఏర్పడిన ఉత్తరాఖంఢ్లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. 2022 మార్చిలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో యూసీసీ అమలుపై హామీనిచ్చింది. కాగా మంగళవారం అసెంబ్లీలో యూసీసీపై చర్చ జరగనున్న సందర్భంగా అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకుంటే, వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. -
యూసీసీ అమలుపై ఢిల్లీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూ ఢిల్లీ : యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుపై ఢిల్లీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యూసీసీని అమలు చేయాలని దాఖలైన పిటిషన్లను విచారించేందుకు కోర్టు తిరస్కరించింది. కొత్త చట్టాలు చేయడం, వాటిని అమలు చేయడం వంటి విషయాలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయని పిటిషన్ల తిరస్కరణ సందర్భంగా హై కోర్టు వ్యాఖ్యానించింది. యూసీసీ అమలు విషయంలో ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఢిల్లీ హై కోర్టు ఉటంకించింది. యూసీసీ అమలు చేయాలన్న పిటిషన్లను అప్పట్లో సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించేందుకు మాండమస్ రిట్ను జారీ చేయలేమని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో అమలవతున్న పర్సనల్ లా చట్టాలన్నింటిని కలిపి అందరికీ ఒకే చట్టంగా యూసీసీని తీసుకురావాలనేది బీజేపీ ఆలోచన. ఇదే విషయాన్ని పార్టీ తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంటూ వస్తోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో మత ఆచారాల ఆధారంగా పర్సనల్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇలా కాకుండా అందరికీ వర్తించేలా ప్రతిపాదనలో ఉన్న చట్టమే యూసీసీ. ఇదీచదవండి..బిగ్బాస్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయితే: నాపై ట్రోలింగ్, బెదిరింపులు -
రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) అమలు చేస్తామనే హామీని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచనున్నట్టు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. రోహింగ్యాలు, అక్రమ వలస దారులను వెనక్కి పంపడం, అన్ని పంటలకూ బీమా, ప్రీమియం సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేత, ఐదేళ్లలో మహిళలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన, వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం వంటి అంశాలను ఇందులో ప్రస్తావించనున్నట్టు తెలిసింది. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దీనిని విడుదల చేయనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు, తెలంగాణలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, 5 ఏళ్లకు రూ.లక్ష కోట్లతో బీసీ అభివృద్ధి నిధి ఏర్పాటు, ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 ఏళ్లు వచ్చే సరికి రూ. 2 లక్షలు ఇచ్చే ఏర్పాటు, మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు, ఫీజుల నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ వంటి అంశాలను దశ(పది) దిశ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో మరికొన్ని ఇలా... ♦ ధరణి స్థానం లో మీ భూమి యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, ♦ సబ్సిడీ పై విత్తనాలు, వరి పై బోనస్, ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి రూ.2 లక్షల ఇచ్చే ఏర్పాటు, ఉజ్వల గ్యాస్ లబ్దిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్ లు అందజేత, బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మినహాయింపులు, ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, పీఆర్సీపై సమీక్ష, అయిదేళ్లకోసారి పీఆర్సీ ఏర్పాటు, జీఓ 317 పై పునః సమీక్ష, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ల ఏర్పాటు, ♦ అన్ని పంటలకు బీమా. -
UCC CODE: ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చల్లో నిలుస్తూ వస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ)ని హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ త్వరలో అమలు చేయనున్నట్టు సమాచారం. వచ్చే వారమే ఈ దిశగా చర్యలు చేపట్టబోతోందని తెలుస్తోంది. తద్వారా దేశంలో యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా అది నిలవనుంది. యూసీసీపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఒకట్రెండు రోజుల్లో సీఎం పుష్కర్సింగ్ ధామికి నివేదిక సమరి్పంచనుంది. దీపావళి అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై యూసీసీ బిల్లును ఆమోదించనుంది. తద్వారా దానికి చట్టబద్ధత కలి్పంచనుంది. ఎన్నికల వాగ్దానం: ఉత్తరాఖండ్లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఎన్నికల వాగ్దానాల్లో యూసీసీ అమలు ప్రధానమైనది. ఆ మేరకు జస్టిస్ దేశాయ్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి కేబినెట్ భేటీలోనే సీఎం ధామీ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ తయారీ కోసం రాష్ట్రంలో దాదాపు 2.3 లక్షల మందితో కమిటీ చర్చలు జరిపింది. యూసీసీ డ్రాఫ్ట్ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు. ఏమిటీ ఉమ్మడి పౌర స్మృతి? ► కులం, మతం, ఆడ–మగ వంటి తేడాలు, లైంగిక ప్రవృత్తులతో నిమిత్తం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయడం ఉమ్మడి పౌర స్మృతి ప్రధానోద్దేశం. ► ఇది అమలైతే ప్రస్తుతం అమల్లో ఉన్న పలు మత, ఆచార, సంప్రదాయ ఆధారిత వ్యక్తిగత చట్టాలన్నీ రద్దవుతాయి. ► వివాహాలు, విడాకులు, వారసత్వం, దత్తత తదితరాలతో పాలు పలు ఇతర వ్యక్తిగత అంశాలు కూడా యూసీసీ పరిధిలోకి వస్తాయి. ► రాజ్యాంగంలోని 44వ అధికరణం ఆధారంగా దీన్ని తెరపైకి తెచ్చారు. ► 2024 లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత గుజరాత్ కూడా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనుందని చెబుతున్నారు! ► గోవాలో ఇప్పటికే గోవా పౌర స్మృతి అమల్లో ఉంది. ఇది చాలా రకాలుగా యూసీసీని పోలి ఉంటుంది. రాజ్యాంగం ఏమంటోంది? ‘‘దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలి’’ అని రాజ్యాంగంలోని 4వ భాగం స్పష్టంగా నిర్దేశిస్తోంది. అయితే దీన్ని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో భాగంగా పేర్కొన్నారు. కనుక దీని అమలు తప్పనిసరి కాదు. ఆ దృష్ట్యా యూసీసీ అమలుకు కోర్టులు ఆదేశించజాలవు. సుప్రీంకోర్టు కూడా... అత్యున్నత న్యాయస్థానం కూడా పలు తీర్పుల సందర్భంగా యూసీసీ అమలు ఆవశ్యకతను నొక్కిచెప్పింది. అయితే 2018లో మోదీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యూసీసీపై లోతుగా పరిశీలించిన కేంద్ర లా కమిషన్ మాత్రం భిన్నాభిప్రాయం వెలిబుచ్చడం విశేషం. ‘‘ఈ దశలో దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమూ లేదు. అభిలషణీయమూ కాదు’’ అంటూ కేంద్రానికి ఏకంగా 185 పేజీల నివేదిక సమరి్పంచింది! పారీ్టల్లో భిన్నాభిప్రాయాలు... యూసీసీ అమలుపై రాజకీయ పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీ దీన్ని గట్టిగా సమరి్థంచడమే గాక అధికారంలోకి వస్తే దేశమంతటా యూసీసీని కచి్చతంగా అమలు చేస్తా మని 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో హా మీ కూడా ఇచ్చింది. ఇక కాంగ్రెస్, మజ్లిస్ తదితర పక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి... ► ప్రధాని మోదీ తొలినుంచీ యూసీసీ అమలును గట్టిగా సమరి్థస్తూ వస్తున్నారు. రెండు రకాల చట్టాలతో దేశం ఎలా నడుస్తుందని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రశ్నించారు. ► ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ తదితరులు కూడా పలు సందర్భాల్లో యూసీసీని సమరి్థంచారు. ‘‘దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఉండాలన్నదే మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం కూడా. దాని అమలుకు ఇదే సమయం’’ అని ధన్ఖడ్ అభిప్రాయపడ్డారు. ► యూసీసీ పేరుతో ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి పెను సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే మోదీ లక్ష్యమని కాంగ్రెస్ దుయ్యబడు తోంది. ► రాజ్యాంగంలోని 29వ అధికరణానికి యూసీసీ విరుద్ధమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. ‘‘బహుళత్వం, వైవిధ్యమే మన దేశ సంపద. యూసీసీ పేరుతో వాటికి తూట్లు పొడిచేందుకు మోదీ ప్రయ తి్నస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ► యూసీసీ వస్తే తమ సాంప్రదాయిక ఆచారాలకు అడ్డుకట్ట పడుతుందేమోనని దేశవ్యాప్తంగా 30 పై చిలుకు గిరిజన సంఘాలు కూడా ఇప్పటికే సందేహం వెలిబుచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Uttarakhand: యూసీసీకి సిద్ధం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) అమలు విషయంలో చర్యలు వేగవంతం చేసింది. సివిల్ కోడ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రూపొందించిన నివేదిక (ముసాయిదా) అతిత్వరలో ప్రభుత్వానికి చేరనుంది. తద్వారా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ బిల్లుకు చట్ట రూపం తేవాలని పుష్కర్సింగ్ దామీ సర్కార్ యోచిస్తోంది. దేశంలోనే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయబోయే తొలి రాష్ట్రంగా నిలిచేందుకు ఉత్తరాఖండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని సివిల్ కోడ్ రూపకల్పన కోసం ఏర్పాటు చేసింది దామీ సర్కార్. ఈ కమిటీ రెండు లక్షల మందికి పైగా పౌరుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మరో మూడు నాలుగు రోజుల్లో నివేదిక ప్రభుత్వాన్ని చేరనుందని సమాచారం. నివేదిక రాగానే.. యూసీసీని అమలులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తామని సీఎం పుష్కర్సింగ్ ఇదివరకే ప్రకటించారు. వచ్చే వారం ముసాయిదా (డ్రాఫ్ట్) కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. బిల్లులో బహుభార్యత్వం రద్దు ప్రధానాంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సహజీవనం కొనసాగించాలనుకునే జంట తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధన కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కిందటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల హామీగా యూసీసీని చేర్చింది బీజేపీ. -
తినే హక్కు గురించి కదా అడగాలి?
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వెంటనే రావాలనే వైపుంటారా, వ్యతిరేకంగా ఉంటారా అని లెక్కలు ఎందుకు? యూసీసీ కావాలా, వద్దా అనే పోటీ పెట్టి, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది సమాధానం కాదు. ఫేస్ బుక్లో, సామాజిక మీడియాలో, ఆలోచించే వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు, యూదులు, ఇతర మతాల వారు, ముఠాల వారు, అనేక రకాల వర్ణాల వారు, కులాల వారు, అటూ ఇటూ చీలిపోవడం న్యాయం కాదు. ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడం అత్యవసరమైపోయింది. కొన్ని పార్టీలు ఓడిపోయేందుకు సిద్ధం. వందల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ఇస్తున్నారంటే అనేక పార్టీలు ఓడిపోవ డానికీ, ఓట్లు చీల్చడానికీ సిద్ధం. అందుకే రాజకీయ అవస రాలతో సంస్కరణ చేయాలనడం దారుణం. పర్సనల్ లా అంటే ‘వ్యక్తిగతమైన’ అని అర్థం కాదు. ఒక మతానికి చెందిన చట్టాల ప్రకారం అని అర్థం. వివాహం, ఆస్తుల వారసత్వం ఇందులోని అంశాలు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో ముందు సమానత్వం, దాంతో మొత్తం మీద భారతదేశానికి ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు సలహాలు ఇచ్చాయే గానీ స్పష్టమైన తీర్పులు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’ కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. ఇటువంటి సంక్లి ష్టమైన యూసీసీ విషయంలో పార్లమెంట్ చట్టం చేయా ల్సిందే కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కావాలని స్పష్టం చేయడం సాధ్యం కాదు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు వర్తించే విభిన్న చట్టాలున్నాయి. భారత రాజ్యాంగం కింద ఈ మతాలలో అమలు చేసుకునే హక్కులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం మైనారీలకున్న ఈ హక్కులను ఉల్లంఘించి పార్లమెంటులో చట్టం చేస్తుంది కావచ్చు. కొన్ని సంవత్సరాల తరు వాత దాన్ని సవరించి కొట్టివేసేదాకా జనం ఎన్నికల్లో తమను సమర్థించాలనే ఆలోచన కూడా ఉండవచ్చు. అనేక చట్టాలు అందరికీ వర్తించేలా ఉంటాయి. ఉదాహరణ: ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్. గృహ హింస నిరోధక చట్టం! ఈ చట్టం అన్ని మతాల వారికీ ఉపయోగమే. అందులో ‘వయొలెన్స్’ అన్నంత మాత్రాన దాన్ని క్రిమినల్ చట్టం అనుకుంటారు. కానీ అది సివిల్ కేసు. అవన్నీ సివిల్ కోర్టులో విచారణ చేస్తారు. క్రిమినల్ కేసులు కూడా అన్ని మతాల వారికీ ఉప యోగపడేవి. వీటిని ఎక్కువగా వాడుకునేది హిందువులే. వారితోపాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా వినియోగిస్తున్నారనడం నిజం. చాలామంది దుర్వినియోగం అంటారు. దానికి కారణం ఎక్కువమంది అబద్ధాలు ఆడతారు. భార్యలైనా భర్తలైనా లేదా వారి బంధువులైనా అబద్ధాలు విపరీతంగా చెబుతూ అంటారు. లాయర్లని బద్నాం చేస్తాం గానీ, అబద్ధాలు ఆడని వారెవరు? ఎవరూ కోరని యూసీసీ ఇప్పుడెందుకు? తినే హక్కు గురించి ఎవరూ అడగడం లేదు. సంపాదించుకున్న ప్రకారం వండుకొని తినే హక్కు, ఇష్టమైన వస్త్రాలు వేసుకునే హక్కు, నచ్చిన భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదువుకుని, పాడుకునే హక్కు ఉన్నాయి. ఇవి యూసీసీకి అతీతమైనవి కదా! రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలనే శాసనం, లేదా చట్టం ఉండనవసరం లేదు. అది స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం. టమాటా ధరలను నియంత్రించే చట్టం ప్రభుత్వాలు చేయగలవా? దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంటుంది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా,మహీంద్రా యూనివర్సిటీ -
పార్లమెంట్ 'ప్రత్యేక' భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల్లో ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 దాకా ఈ సమావేశాలు (17వ లోక్సభకు 13వ సెషన్, రాజ్యసభకు 261వ సెషన్) జరుగుతాయని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత అమృతకాలంలో పార్లమెంట్లో అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ ప్రత్యేక భేటీల ఎజెండా ఏమిటన్నది ప్రభుత్వం బయట పెట్టలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. కూటమి దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జీ20 సదస్సు తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఆ మరుసటి రోజే ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడం విశేషం. కొత్త భవనంలోనే సమావేశాలు ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలోనే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మే 28న ఈ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతిఏటా మూడుసార్లు (బడ్జెట్, వర్షాకాల, శీతాకాల) పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈసారి ప్రత్యేక సమావేశాల వెనుక కారణంగా ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం.. ఏడాదిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్ను సమావేశపరచాల్సి ఉంటుంది. రెండు భేటీల మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదు. దానికి అనుగుణంగానే ప్రతిఏటా ఫిబ్రవరి–మే నెలల మధ్యలో బడ్జెట్, జూలై–ఆగస్టు మధ్య వర్షాకాల, నవంబర్–డిసెంబర్ల మధ్య శీతాకాల సమావేశాలను నిర్వహిస్తారు. ఈసారి ఏకంగా ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిపోయింది. పెండింగ్లో ఉన్న బిల్లుకు మోక్షం! మరోవైపు సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, రాజకీయ అవసరాల కోసమే బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తెరపైకి తీసుకొస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కూడా ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉండిపోయింది. వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రయాన్–3 మిషన్ చరిత్ర సృష్టించడం, ‘అమృతకాలం’లో భారతదేశ లక్ష్యాలతోపాటు ఇతర ముఖ్యమైన అంశాలపైనా ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే: జైరామ్ రమేశ్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశాలు, అదానీ గ్రూప్లో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల పేరిట మోదీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సమావేశాల వార్తలకు మీడియాలో ప్రాధాన్యం లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వారాల క్రితమే ముగిశాయని, ఇంతలోనే మళ్లీ భేటీ కావడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలంటూ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని జైరామ్ రమేశ్ చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగే సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ఆ బిల్లుల ఆమోదానికేనా? వన్ నేషన్–వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, ఉమ్మ డి పౌరస్మృతి(యూసీసీ) బిల్లులను మోదీ ప్రభు త్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుందని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఇందులో వన్ నేషన్–వన్ ఎలక్షన్ బిల్లు అత్యంత ముఖ్యమైనది. దీన్ని ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం వచ్చే ఏడాది జరిగే సార్వ త్రిక ఎన్నికలను ముందుకు జరపడమేనని రాజకీ య పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లో తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలన్న ప్రతిపాదనపై బలమైన చర్చ జరుగుతోంది. కేంద్రం ముందస్తుకు వెళ్లే యత్నాల్లో ఉందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ విధానమే మార్గమని బీజే పీ నాయకులు అంటున్నారు. దేశమంతటా లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ అమలుకు కనీసం 5 కీలక రాజ్యాంగ సవరణలు చేయాలి. అందుకు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశం జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యా య శాఖ మంత్రి మేఘ్వాల్ గతంలోనే చెప్పారు. ప్రత్యేక సమావేశాలు కొత్తేమీ కాదు పార్లమెంట్ బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు కాకుండా, ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం అసాధారణమేమీ కాదు. 2017 జూన్ 30న అర్ధరాత్రి పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపర్చారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. కానీ, ఇది లోక్సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశం. 50వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 1997 ఆగస్టులో ఆరు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. క్విట్ ఇండియా ఉద్యమానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1992 ఆగస్టు 9న, స్వాతంత్య్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 1972 ఆగస్టు 14–15న అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్.. AICC కీలక నిర్ణయం -
ఉమ్మడి బాటలో భిన్నాభిప్రాయాలు
ఆదేశిక సూత్రాలకే పరిమితమైన ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) అంశం మళ్లీ తెరమీదికొచ్చింది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, పోషణ, భరణం వంటి కుటుంబ, వ్యక్తిగత అంశాల్లో ఒకే పౌర నియమాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదేశిక సూత్రాలలో చేర్చడమంటే ఒక విస్తృత ప్రయోజనమున్న చట్టాన్ని బీరువాలకు పరిమితం చేయడం కాదనీ, దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలన్నది ప్రజాస్వామిక వ్యవస్థకు గీటురాయనీ ఒక వాదన. అదే ఆదేశిక సూత్రాలలో ఉన్న సమానత్వం, విద్య, వైద్యం, ఉపాధి వగైరా లాంటి అంశాలకు చట్టాలు ఎందుకు చేయరనీ, ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడ మాత్రమేననీ మరొక వాదన. సమానత్వ సిద్ధాంతం మిగిలిన చట్టాల మాదిరిగానే ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) కూడా 1948 లోనే రాజ్యాంగంలో ఒక చట్టంగా చోటు చేసుకోకపోవడానికి ప్రధాన కారణం, ఆనాటి పరిస్థితులు. అందరికీ మానసిక సంసిద్ధత సమకూరిన తరువాతనే దానిని తెచ్చే ఆలోచన చేయడం మంచిదన్నది ఒక దశలో రాజ్యాంగ పరిషత్ అనివార్యంగా తీసుకున్న నిర్ణయం. ఫలితంగానే ఆ ఆలోచన ఆదేశిక సూత్రాలకు (44వ అధిక రణ) పరిమితమైంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత హింసాత్మక, విషాద ఘట్టంగా చెప్పుకొనే భారతదేశ విభజన, నాటి మత ఉద్రిక్తతలు రాజ్యాంగ పరిషత్ పెద్దలను అలాంటి వాయిదా నిర్ణయానికి పురిగొల్పాయి. ఆదేశిక సూత్రాలలో చేర్చడమంటే ఒక విస్తృత ప్రయోజనమున్న చట్టాన్ని బీరువాలకు పరిమితం చేయడమైతే కాదు. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలన్నది ప్రజాస్వామిక వ్యవస్థకు గీటురాయి. మతసూత్రాల ఆధారంగా పర్సనల్ లా చెల్లుబాటు అయితే రాజ్యాంగమే చెబుతున్న సెక్యులరిస్టు వ్యవస్థలో ఆ భావనకే భంగపాటు. షాబానో విడాకుల కేసు, మనోవర్తి వివాదం మొదలు (1985) ఇటీవలి కాలం వరకు సుప్రీంకోర్టు కూడా ఉమ్మడి పౌర స్మృతి గురించి కేంద్రానికి గుర్తు చేయడమే కాదు, ఒక సందర్భంలో నిష్టూరమాడింది కూడా. రాజకీయ చర్చలు, చట్టసభలలో వాగ్యుద్ధాల స్థాయి నుంచి ఎన్నికల హామీ వరకు ఉమ్మడి పౌరస్మృతి ప్రయాణించింది. స్వాతంత్య్రం వచ్చిన తరు వాత 1948 నవంబర్ 23న తొలిసారి దీని రూప కల్పన ఆలోచన తెరమీదకు వచ్చింది. రాజ్యాంగ పరిషత్లో ఈ ప్రస్తావన తెచ్చినవారు కాంగ్రెస్ సభ్యుడు మీను మసానీ. ఇప్పుడు ఆ పార్టీ ఈ అంశం మీద నీళ్లు నమలడం ఒక వైచిత్రి. అంబేడ్కర్, నెహ్రూ, పటేల్, కృపలానీ వంటి వారంతా దీనిని సమర్థించారు. దీని గురించి ప్రతికూల వైఖరి తీసు కుంటున్నవారు ఈ చట్టం ద్వారా మేలు పొందేది మహిళలే అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. రాజ్యాంగ పరిషత్లో హన్సా మెహతా సహా 15 మంది మహిళలు దీని కోసం తపించారు. ఈ స్ఫూర్తి బుజ్జగింపు ధోరణిలో కొట్టుకుపోకుండా చూసు కోవలసిన బాధ్యత ఇవాళ్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానిదే. ఉమ్మడి పౌర స్మృతితో దేశం సంత రించుకునే అంశాలుగా చెప్పినవి: స్త్రీ పురుష సమానత్వం, జాతీయ సమైక్యత, సమగ్రత, లౌకికవాదం, వ్యక్తిగత హక్కుల రక్షణ, న్యాయవ్యవస్థ ఆధునీకరణ, భిన్న ఆచారాల సమన్వయం. ఇవన్నీ స్వాతంత్య్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాలకు కూడా పౌరులందరికీ సమానంగా లేక పోవడం ఒక దుఃస్థితిని సూచిస్తుంది. మద్రాస్ నుంచి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన మహమ్మద్ ఇస్మాయిల్ దీన్ని వ్యతిరేకించినవారిలో మొదటివారు. నజీరుద్దీన్ అహ్మద్, మెహబూబ్ అలీ బేగ్, బి.పొకార్ సాహెబ్, అహమ్మద్ ఇబ్రహీం, హస్రత్ మొహానీ ఆయన వెనుక నిలిచారు. ఈ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి వారు ఎన్నుకున్న నినాదం ‘ఇంక్విలాబ్ జిందాబాద్’. ఇది కూడా ఒక చారిత్రక వైచిత్రి. వీరి వాదనలోని అంశాలు తమ మత,సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకోవడం, ఉమ్మడి పౌర స్మృతి వస్తే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పడం. ఇప్పుడు కూడా అవే కారణాలు వినిపిస్తున్నాయి. అందుకే దీని మీద చర్చ అనివార్యం. ఇందుకు దోహదం చేస్తున్నదే 22వ లా కమిషన్ పిలుపు.ఏదో ఒక కాలంలో ప్రతి మతం స్త్రీని చిన్నచూపు చూసిన మాట వాస్తవం. ఒకనాడు హిందూధర్మం కూడా ఇలాంటి బంధనాలలోనే ఉన్నా, హిందూ కోడ్తో చాలావరకు ఆ దుఃస్థితి నుంచి మహిళకు రక్షణ దొరికింది. ఇలాంటి రక్షణ ఏ మతం వారికైనా లభించాల్సిందే. విడాకులు, వివాహం వంటి వ్యక్తిగతఅంశాల్లో దేశ పౌరులందరికీ ఒకే న్యాయం అందించాలన్నదే యూసీసీ ధ్యేయం. విడాకులు పొందిన మహిళ ఎలాంటి ఆంక్షలు లేకుండా పునర్ వివాహం చేసుకునే వెసులుబాటు, దత్తత చట్టం అందరికీ ఒకే విధంగా ఉండడం కూడా ఇందులో భాగమే. ఆస్తిహక్కుకు, వివాహ వయసు 21 సంవత్సరాలు వంటి నియమాలకు మత, వర్గ, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా యూసీసీ పాటు పడుతుంది. ఇవన్నీ స్వాగతించవలసిన అంశాలు. 13వ శతాబ్దానికి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా ఢిల్లీ మత పెద్దను కాదని షరియాలో మార్పులు తెచ్చాడు. 1937 నుంచి మాత్రమే భారతీయ ముస్లింలు అమలు చేసుకుంటున్న ముస్లిం పర్సనల్ లా విషయంలో ఇంత రాద్ధాంతం చేయడంలో అర్థం కనిపించదు. అలా అని ఆ పర్సనల్ లా యథాతథంగా అమలు చేయగలిగే శక్తి, కాఠిన్యం ఇవాళ వారిలోనూ లేవు. పాకిస్తాన్, ఈజిప్ట్, ట్యునీషియా వంటి దేశాల అనుభవాలు కూడా పర్సనల్ లా శిలాశాసనం కాదనే రుజువు చేస్తున్నాయి. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇటీవలనే హదిత్ (ముస్లిం న్యాయసూత్రాలు) పునర్ నిర్మాణానికి ఒక సంఘాన్ని నియమించారు. ఈ న్యాయసూత్రాలు ఉగ్రవాదానికి తోడ్పడకుండా ఉండేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. యూసీసీని బీజేపీ తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి అది హిందువుల కోసమేనని చెప్పడం ఆత్మవంచన. రాజ్యాంగ చరిత్ర ఒక మలుపు తీసుకుంటున్న సమయంలో మోకాలడ్డే ప్రయత్నం సరికాదు. పి. వేణుగోపాల్ రెడ్డి,వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ వ్యవస్థాపక ఛైర్మన్ pvg2020@gmail.com ఎన్నికల రాద్ధాంతం ‘‘ఒక ఇంట్లో ఒకరికి ఒక చట్టం, మరొకరికి మరొక చట్టం ఉంటే ఆ ఇల్లు నడుస్తుందా? అలాంటి కపట వ్యవస్థతో దేశం ఎలా పనిచేస్తుంది?’’ అన్నారు బీజేపీ ఎన్నికల కార్యకర్తల సభలో ప్రధాని మోదీ. ఈ చర్చ సరైన వేదికపై చేయాలి. ప్రజలను రెచ్చగొట్టరాదు. ప్రశాంత జీవనానికీ, భిన్న కుల, మత, జాతి, సంస్కృతుల మధ్య భారతీయతకూ ‘భిన్నత్వంలో ఏకత్వం’ కారణం. ఈ భిన్నత్వం స్థానంలో వైదిక ఏకత్వాన్ని రుద్దాలన్నది ‘సంఘ్’ ఆకాంక్ష. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) చట్టాన్ని తేవాలన్నది మోదీ ఆలోచన. ఎన్నికలకు ముందు ముస్లిం మహిళల న్యాయసాధనకు పూనుకుంటారాయన. హిందూ స్త్రీలను పట్టించుకోరు. సాధికా రితకు మహిళా రిజర్వేషన్ చట్టం చేయరు. యూసీసీని అమలు చేయమని సుప్రీంకోర్టు అనేక సంద ర్భాలలో ఆదేశించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2024 ఎన్నికల లబ్ధికి ఇప్పుడు ఈ చట్టాన్నిముందుకుతెచ్చారు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, పోషణ, భరణం వంటి కుటుంబ, వ్యక్తిగత అంశాల్లో ఒకే పౌర నియమాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మతాల ప్రజలు తరతరాలుగా ఆచరిస్తున్న పద్ధతులు, సంప్రదాయాలు అనేకం ఉన్నాయి. భార్యాభర్తలకు, కూతురు కొడుకులకు వేరువేరు దుస్సంప్రదాయాలున్నాయి. అయితే భావజాలం కుదరని చోట చట్టాలతో, చట్టాలు పనిచేయనిచోట భావజాలంతో వీటిని సరిదిద్దాలి. ఏకరీతి పౌరసూత్రాల ప్రస్తావన ప్రాథమిక హక్కుల్లో లేదు. రాజ్య విధానాల ఆదేశిక సూత్రాలు ఆసక్తికరమైనవి. వీటి ప్రకారం ప్రభుత్వం శాసన, కార్యనిర్వాహక విధులు నిర్వహించాలి. ఇవి మార్గదర్శకాలే. వీటిని న్యాయవ్యవస్థ ద్వారా అమలుచేయలేము. వీటిని న్యాయస్థానాలలో సవాలు చేయగల చట్టాలను చేయరాదు. సంస్క రణల ద్వారా ఈ సూత్రాలను సాధించాలి. దేశ పౌరులకు ఏకరీతి పౌర నియమావళిని పదిలపర్చే పని రాజ్యం చేయాలని ఆదేశిక సూత్రం 44 చెప్పింది. ఒకేసారి చట్టం చేయరాదనీ, సంస్కరణలతో సాధించాలనీ వివరించింది. ఆదేశిక ఆదేశాలలో సమానత్వం, విద్య, వైద్యం, ఉపాధి, జీవన వేతనాలు, పోషకాహార సరఫరా వగైరా చాలా అంశాలున్నాయి. వీటి అమలుకు మాత్రం చట్టాలు చేయరు. యూసీసీ అమలులో చిక్కులున్నాయి. దీనిపై ఇప్పటి వరకు జరిగిన రాజ్యాంగ, శాసన చర్చలను పరిగణించాలి. విభిన్న జాతుల, మతాల దేశంలో ఇది ఆచరణ సాధ్యం కాదని తేల్చింది. ఇది కోరదగ్గదే కాని ఐచ్ఛికంగా ఉండాలన్నారు రాజ్యాంగ ముసాయిదా సభ అధ్యక్షులు అంబేడ్కర్. యూసీసీ కంటే వివిధ కుటుంబ సంస్కరణలు స్త్రీ, శిశువుల శ్రేయస్సుకు హామీనివ్వగలవు. యూసీసీ ముస్లింల పైనేకాదు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలపై, గిరిజనులపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. ఇది అనవసరం, అవాంఛనీయం అని 21వ లా కమిషన్ చెప్పింది. అయినా మరలా 22వ లా కమిషన్కు నివేదించడం, అదీ 30 రోజుల స్వల్ప వ్యవధిలో ప్రభావితుల అభిప్రాయాలు కోరడం ఆశ్చర్యం. అన్ని మతాల వ్యక్తిగత చట్టాలు మధ్యయుగ మహిళా ద్వేషాలే. ఈ విషయంపై చర్చ జరగదు.‘సంఘ్’ ముస్లిం వ్యక్తి చట్టాలనే విమర్శిస్తుంది. వైదికమత నియంతృత్వాన్ని స్థాపిస్తుంది. మత స్వేచ్ఛ హక్కునిచ్చే అధికరణ 25, మత సంస్థల స్థాపన, నిర్వహణ హక్కులను కల్పించే అధికరణ 26, మత మైనారిటీలకు ప్రత్యేక హక్కులనిచ్చిన అధికరణ 29లను యూసీసీ బలహీనపరుస్తుంది. ఉన్న చట్టాలను అమలుచేస్తూనే ఏకీకృతాన్ని సాధించవచ్చు. హిందువులకు కులరహిత ఏకరీతి సూత్రాలను శాసించాలి. ఆ తర్వాతే ఆదేశిక సూత్రాల జోలికి పోవాలి. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య విలువలను, దేశ సమాఖ్య తత్వాన్ని, సమానత్వ అధికరణలను తుంగలో తొక్కింది. అధికరణ 47 ప్రకారం ప్రజారోగ్యానికి పోషకాహార స్థాయి, జీవన ప్రమాణాలను పెంచాలి. ఆరోగ్యానికి హానికరమైన మత్తుపానీయాలను, మాదక ద్రవ్యాలను నిషేధించాలి. యూసీసీకంటే ఇవి చాలా ముఖ్యం. సంఘ్కు ముస్లింల గుంపు కావాలి. వారిని చూపి హిందుత్వవాదులను రెచ్చగొట్టాలి. అయితే ప్రతిపక్షాలు దీనికి లౌకిక పౌర ప్రత్యామ్నాయ విరుగుడు పద్ధతులను చేపట్టలేదు. ఇప్పుడు విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. యూసీసీ వద్దంటే ముస్లింవాదులనీ, వైదిక వ్యతిరేకులనీ నింద. సమర్థిస్తే ముస్లిం వ్యతిరేకులనీ, వైదికవాదులనీ ముద్ర. చట్టసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టే ముందు దాని ముసాయిదాను సమర్పించాలి. ఆ అంశంలో వాస్తవ పరిస్థితిని తెలపాలి. సంబంధిత గణాంకాలను జోడించాలి. ఆ చట్ట ప్రయోజనాలను వివరించాలి. మోదీ ప్రభుత్వం ఏ చట్టంలోనూ రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసిన ఈ వివరాలను బిల్లుకు జోడించలేదు. ఇల్లు, దేశం ఒకటి కావనీ; రాజ్యాంగ సమానత్వ అమలే ప్రజాస్వామ్యమనీ, పాలకవర్గ కపటమే దేశాన్ని దిగజార్చిందనీ ప్రధాని గ్రహించాలి. కుటుంబ అంశాల్లో ప్రతి మతం పురుషాధిక్య రాజ్యమే. దీన్ని మతాలన్నీ సరిదిద్దుకోవాలి. ఎన్నికల్లో యూసీసీ ప్రభావం లేకుండా చేయాలి. హనుమంత రెడ్డి, వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి మొబైల్: 949020 4545 సంగిరెడ్డి -
ఇది మీ ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని.. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ వ్యవహరించదని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి డ్రాఫ్ట్ రాలేదని, అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదన్నారు. అయితే మీడియాలో, పలుచోట్ల విపరీతంగా చర్చ నడుస్తోందని, అది చూసి ముస్లింలు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బుధవారం ఆయన ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి పాలకుడిగా, సీఎం స్థాయిలో తాను ఉన్నానని, ఇలాంటి పరిస్థితుల్లో మీ రే ఉంటే ఏం చేసేవారో ఆలోచించి సలహాలు ఇ వ్వాలని కోరారు. ముస్లిం ఆడబిడ్డల హక్కుల పరిరక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం నడుస్తోందని, ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలని సూచించారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏతండ్రి, తల్లి అయినా ఎందుకు భేద భావాలు చూపుతారని, మ హిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీ లేదనే విషయాన్ని మనందరం స్పష్టం చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. అపార్థాలకు తావివ్వరాదు భారత్ చాలా విభిన్నమైనది. ఇక్కడ అనేక మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న ప లు కులాలు, వర్గాలకూ పలు రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలున్నాయి. వారి వారి మత గ్రంథాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్ లా బోర్డులున్నాయి. ఏ నియమమైనా, ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారానే చేయాలి. ఎందుకంటే వాటి మీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి. అప్పుడే అపార్థాలకు తావుండదు. మార్పులు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు, లా కమిషన్, కేంద్రం.. అందరూ కలిసి, మతాలకు చెందిన సంస్థలు, వారి పర్సనల్ లా బోర్డ్స్తో మమేకమై ముందుకు సాగాలి. ఇలా కాకుండా వేరే పద్ధతిలో జరిగితే, అది ఇంత భిన్నత్వం ఉన్న భారత్లో తగదు. ముస్లింలకు సీఎం అండగా ఉంటానన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీతో పౌరస్మృతి విషయంలో ముస్లిం మైనార్టీలకు భరోసా లభించిందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నామని చెప్పారు. మూడు గంటల పాటు సీఎంతో సమావేశమై చర్చించామని తెలిపారు. యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్) ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి మత పెద్దలు సీఎంకు వివరించారన్నారు. ముస్లింలకు నష్టం జరగకుండా తాను ముందుండి పోరాడతానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ముస్లింలకు నష్టం కలిగేలా ఉంటే పార్లమెంట్లో యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారని తెలిపారు. సీఎం నిర్ణయంతో మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రూఫుల్లా, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ ఇసాక్ బాషా పాల్గొన్నారు. -
చెయ్యాల్సింది వదిలి ఇంకేదో చేస్తున్నారు!
‘‘భారత రాజ్యాంగంలో కీలకమైన 44వ అధికరణ ప్రకారం దేశానికంతకూ కలిపి ఒకే ఒక పౌర స్మృతి అమలులో ఉండాలి. ఇది లేనందుననే దేశంలోని సామాజికులలో ఐక్యత, అమలు జరగాల్సిన ఆర్థిక న్యాయం కుంటుపడి పోతున్నాయి’’ – ఎం. వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ప్రకటన (7.7.2023) వెనకటికొకడు ‘తాడి చెట్టు ఎందుకెక్కావురా’ అంటే, కల్లు కోసమనే రీతిగా సమాధానం చెప్పకుండా ‘దూడ మేత కోసం’ అని సమాధానం చెప్పాడట. ‘ఒకే దేశం ఒకే జాతి’ అనే బీజేపీ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ‘ఉమ్మడి పౌర స్మృతి’ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందనేది బహిరంగ రహస్యమే. అసమానతలను రూపు మాపుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. కానీ ఆ విషయాన్ని మరచి అందుకు పూర్తిగా భిన్నమైన భూస్వామ్య, పెట్టు బడిదారీ వ్యవస్థల మూలాలు చెక్కు చెదరకుండా భారత కాంగ్రెస్, బీజేపీ పాలకులు సంపూర్ణ మంత్రి వర్గాల పేరుతోనో, సంకీర్ణ ప్రభుత్వాల నాటకంతోనో ఇంతకాలం కాలక్షేపం చేస్తూ వచ్చారు. కుల, మత, వర్గ విభేదాలు ప్రజల మధ్య పెరగ డానికి, పాక్షిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుని తాత్కాలికంగా గట్టెక్కడానికి ఎత్తులు, పైఎత్తులతో కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. అటువంటి ఒక ఎత్తుగడే ‘ఉమ్మడి పౌర స్మృతి.’ తమ స్వార్థ రాజకీయాలను వివిధ అణగారిన ప్రజా శక్తులు ఆందోళనల ద్వారా, సమ్మెల ద్వారా, ఉధృత స్థాయిలో ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటూ వస్తూండటంతో పాలక వర్గాలు అరెస్టులు, కాల్పులు, నిర్బంధ విధానాల ద్వారా ప్రజా శక్తుల్ని అణచ జూస్తు న్నారు. ఈ సందర్భంగా, ప్రజలపై నిర్బంధ విధానాన్ని అమలు జరపడం ద్వారా పాలకులు అనుసరించే ఎత్తుగడలకు విచిత్రమైన రెండు ఘటనలను చరిత్రనుంచి ఉదహరించుకుందాం: ముందుగా పాత సోవియెట్ యూనియన్లో చోటుచేసుకున్న సంఘటన. పంటలు పండించడంలో ఆరితేరిన ఒక రైతు ఒక మార్కెట్ స్క్వేర్లో నిలబడి, ‘మన వ్యవసాయ మంత్రి ఒక తెలివితక్కువ దద్దమ్మ (ఫూల్) అని అరిచాడట. అంతే ఆ రైతును అరెస్టు చేసి 10 సంవత్సరాల ఒక మాసం పాటు జైల్లో నిర్బంధించారు. అందులో ఆ రైతు, మంత్రి గారిని ‘ఫూల్’ అని అగౌరవ పరచినందుకు ఒక మాసం పాటు, ప్రభుత్వ గుట్టును రట్టు చేసినందుకు 10 ఏళ్ళూ శిక్ష విధించారు. ఇంతకూ అసలు రహస్యం – ఆ రైతు పెద్ద మంత్రిని ఎద్దేవా చేసినందుకు విధించిన జరిమానా చిన్నదే, కానీ మంత్రిని ‘పనికిమాలిన దద్దమ్మ’ అన్న విమర్శ ప్రజల మనస్సుల్ని బాగా ప్రభావితం చేసినందుకు బారీ పెనాల్టీ విధించడం జరిగిందట! అలాగే మన దేశంలో జరిగిన మరో సంఘటన చూద్దాం. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ... వీళ్లందరి ఇంటిపేర్లుగా మోదీ ఎలా వచ్చింది? దొంగలందరి ఇంటిపేరుగా మోదీ ఎలా వచ్చింది’ అన్న రాహుల్ గాంధీ ‘జోక్’ కూడా క్రిమినల్ కేసులో చేరిపోయింది. దీనిపైన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే వ్యాఖ్యా నిస్తూ ‘జోక్ను, విమర్శను పరువు నష్టం కింద భావించి ఒక వ్యక్తిని అమెరికాలో జైలులో నిర్బంధించరు. ‘ఏలిననాటి శని’ లాంటి వలస చట్టం వల్ల ఇది ఇక్కడ సాధ్యమయింద’న్నారు. ‘ఏదో ఒక మోదీని అవమానించారని కాదు, మోదీలందరినీ ఉద్దేశించి అన్న సాధారణ అర్థంలో రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కోర్ట్ శిక్ష విధించింది’ అని ఆయన వివరించారు. పలువురు వ్యక్తులను సంబోధించే క్రమంలో ఇంటి పేర్లు, వంశనామాలు పెట్టి పిలిచినంత మాత్రాన ‘పరువు నష్టం’ కింద జమ కట్టడానికి వీలు కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన హోమీ మోదీ, లాలా మోదీ, సయెద్ మోదీ, పూర్ణేందు మోదీ వంటి పేర్లను ప్రస్తావించారు. భారత రాజ్యాంగానికి విశిష్టమైన వ్యాఖ్యాన పరంపర అందించిన సుప్రసిద్ధ మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమ నేతల్లో అగ్రజుడైన ఉన్నత న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దేశంలోని పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తల్ని భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టులు చేసి, నిరా ధారమైన ఆరోపణలతో జైళ్లపాలు చేసినప్పుడు నిద్రాహారాలు లెక్క చేయ కుండా వారికి లీగల్ సహాయం అందించి విడుదలయ్యేటట్టు చేశారు. నక్సలైట్ ఖైదీల విడుదల కోసం ఏర్పడిన రక్షణ కమిటీకి కన్వీనర్గా పనిచేశారు. దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరును ప్రస్తావిస్తూ కన్నాభిరాన్, న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న తీరును ప్రస్తావించి ఇలా వ్యాఖ్యానించారు: ‘‘దేశంలోని కోర్టులు అధికార, అనధికార స్థానాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న బలవంతులైన వారిని దుర్మార్గపు పరిణామాలకు బాధ్యుల్ని చేసి శిక్షించలేక పోతున్నాయి. చివరికి అణగారిన కార్మికులు ఆత్మగౌరవం కోసం పోరాడు తున్న సందర్భాల్లో కూడా అలాంటి వారి రక్షణకు కొన్ని కోర్టులు ముందుకు రావడం లేదు’’! చివరగా... చరిత్రలో కొందరు పాలకులు ప్రజలపైన, చివరికి, ప్రసిద్ధ చరిత్రకారులపైన ఎన్ని కిరాతకమైన ఆంక్షలు విధిస్తారో, దుర్మార్గాలకు పాల్పడుతుంటారో తెలియచేసే ఉదాహరణ ఒకటి చూద్దాం. చైనా చరిత్రలో ‘సీమా కియాన్’ అనే ప్రసిద్ధ చరిత్రకారుడు చక్రవర్తిని విమర్శించి ప్రజల ముందు అభాసుపాలు చేశాడు. అందుకు ఆ చక్రవర్తి ఒక దుర్మార్గమైన ‘ఆఫర్’ ఇచ్చాడు. చేసిన నేరానికి ‘ఉరిశిక్ష కావాలా లేక ఆ స్థానంలో నపుంస కుడిగా మారి పోతావా’ అని అడిగాడు. మరి తాను చరిత్రకారుడు కాబట్టి నపుంసకుడిగా ఉండిపోయి అయినా తాను ప్రారంభించిన చరిత్ర రచనను పూర్తిచేయాలనుకున్న కియాన్ నపుంసకునిగా మారడానికే మొగ్గాడు. (సైమన్ సీబాగ్ మాంటిఫియోర్ ‘ది వరల్డ్: ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హుమా నిటీ’). బహుశా కారల్ మార్క్స్ మహనీయుడు అందుకే అని ఉంటాడు: ‘‘మనుషులు తమ చరిత్రను తామే లిఖించుకుంటారు. కానీ, తమ ఇష్టా ఇష్టానుసారంగా రాసుకుంటూ పోలేరు. ఎవరికి వారు తమకు తామై ఎంచు కునే సందర్భాల ప్రకారమూ రాసుకోలేరు. మరి ఏ పునాది ఆధారంగా రాస్తారు – సిద్ధాన్నంలాగా అప్ప టికే ఉన్న పరిస్థితులు ఆధారంగా, గతం నుంచి సంక్రమించిన పరిస్థితులు ఆసరాగా తప్ప మరొక మార్గం లేదు’’! అవును కదా మరి – ‘‘భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వంబు తానేను’’! abkprasad2006@yahoo.co.in -
విపక్షాల కూటమికి ఒవైసీ పంచ్.. ‘చౌదరీ’ల క్లబ్లా తయారైందంటూ..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, యూసీసీ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టేందుకు అటు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. యూసీసీని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇక, తాజాగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. హిందూ వివాహ చట్టాన్ని పూర్తిగా మార్చలేని వారు, యూసీసీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీజేపీని ఓడించాలనుకుంటున్న విపక్ష పార్టీలు.. భిన్నమైన ఎజెండాతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో విపక్ష పార్టీల కూటమికి సెటైరికల్ పంచ్ ఇచ్చారు. విపక్ష పార్టీల కూటమి చౌదరీల క్లబ్లా తయారైందన్నారు. విపక్ష పార్టీల భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు అని, దేశ రాజకీయాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. #WATCH | Our party will oppose UCC...If you (opposition parties) want to defeat BJP then you have to show the difference that you will not follow the agenda set by BJP. They (opposition parties) are a club of big 'Chaudharis'. You have not invited our Telangana CM to the meeting.… pic.twitter.com/ABGOvfPbVV — ANI (@ANI) July 15, 2023 ఇదిలా ఉండగా, అంతకుముందకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం వ్యాపారుల వల్లనే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని శర్మ చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారైంది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి ముస్లింలు(అసోంలో మియాలు) కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. ఇదే క్రమంలో మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా.. మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. क्या Assam के CM Himanta Sarma UCC Bill को अदिवासियों पर लागू करेंगे, वह सिर्फ एक आंख से देख रहे हैं बस और उस आंख में मुसलमानों को लेकर Hatred (नफ़रत) भरी हुई है : Barrister Asaduddin Owaisi#ucc #ManipurBurning #UCCDividesIndia #IndiaAgainstUCC #aimim #owaisi pic.twitter.com/3OJHPYO2Sg — Mohammad shahnshah (@shahnshah_aimim) July 15, 2023 ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్లో మరో ట్విస్ట్? -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే యూసీసీ
సాక్షి, హైదరాబాద్: పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, చైనా చొరబాటు లాంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఉమ్మ డి పౌరస్మృతి (యూసీసీ) అమలు ప్రతిపాదన తెచ్చారని హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్–ఏ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. శుక్రవారం మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూసీసీ అమలు గురించి తెలంగాణలోని ఆదిలాబాద్కు వచ్చి గోండు సామాజిక వర్గానికి చెప్పాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. గతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తిందని, వచ్చే 2024 ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడమే దాని లక్ష్యమని ఒవైసీ ధ్వజమెత్తారు. కామన్ లా కోడ్పై సూచనల కోసం అప్పీల్ చేసిన లా కమిషన్కు యూసీసీపై తమ పార్టీ స్పందనను పంపామని వివరించారు. ఇటీవల, భోపాల్లో ప్రధాని మోదీ యూసీసీపై ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాఖ్యానించారని, ‘ఒక ఇంట్లో ఒక సభ్యునికి ఒక చట్టం, మరొకరికి మరొక చట్టం ఉంటే ఆ ఇంటిని నడపగలమా? అని ప్రశ్నించారు. యూనిఫాం సివిల్ కోడ్పై కేరళ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ను కలుస్తా ఏపీ సీఎం జగన్ తనకు మిత్రుడని, త్వరలో ఆయనను యూసీసీ అంశంపై కలుస్తామని అ సదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ఇప్పటికే ఆయన తనను లంచ్కు ఆహ్వానించారని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో సమావేశమై యూసీసీకి వ్యతిరేకంగా మద్దతు కోరగా, ఆయ న సానుకూలంగా స్పందించడంతో పాటు భావస్వారూప్య పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. -
అసలు కావలిసింది ‘ఉమ్మడి ఆర్థిక స్మృతి!’
దేశ పౌరుల్లో కొందరికి భారీ ఆస్తులున్నాయి! కొందరికి రెక్కల కష్టం తప్ప వేరే మార్గం లేదు. దేశంలో భూములు ఎన్ని? అవి ఉమ్మడిగానే ఉంటున్నాయా? దేశంలో, ఉత్పత్తి రాసుల్ని కురిపించే పరిశ్రమల్లో పౌరులందరూ సమానులేనా? సమస్త రవాణా సాధనాలనూ నిర్మించడానికీ, నడపడానికీ, కోట్ల కోట్ల డబ్బు రాసుల రాబడులకూ కారకులు ఎవరు? వాటి యాజమాన్యాలు ఎవరివి? ఆస్తి హక్కులకు కారణాలు ఏమిటి? పాకీ దొడ్లు తుడిచే అట్టడుగు కులాల శ్రామికులకు దేని మీద యాజమాన్యం ఉంది? దేశంలో, నిత్యం 24 గంటలూ ఉత్పత్తుల కార్యాలలో మునిగి బ్రతికే శ్రామికులకు సుఖ శాంతుల్లో ఉమ్మడితనం ఉందా? ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది నిజంగా ఎప్పుడు సాధ్యం? ‘ఉమ్మడి ఆర్థిక స్మృతి’ అనేది ఉన్నప్పుడు మాత్రమే! ‘ఒకే ఇంట్లో వున్న ఇద్దరు వ్యక్తులకు రెండు వేరు వేరు చట్టాలు వుంటే, ఆ కుటుంబం సవ్యంగా సాగుతుందా, చెప్పండి?’ అని ప్రధాని మోదీ, బీజేపీ కార్యకర్తల్ని అడిగిన వార్త, పది రోజులుగా ఒక చర్చనీయాంశం అయింది! అన్ని మతాల వారినీ ఒకే రకపు పౌరులుగా చేయాలనే ప్రయత్నంతో, ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనే విధానం ఎంత అవసరమో చెప్పడానికి మోదీ తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఉపన్యాసం అది! దేశంలో, ఐదు రాష్ట్రాలలో, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, అన్న బోధనగా ఆ మాటల్ని అర్ధం చేసుకోవచ్చు. ముస్లిం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఎలానూ రావని ఆ పార్టీకి తెలుసు. కాబట్టి, హిందూ ఓటర్లలో అత్యధికుల్ని తన వైపు తిప్పుకోవడానికే బీజేపీ చేసే ప్రయత్నం అది. ఆ విధంగా భారత దేశ ప్రజలందర్నీ పౌరులుగా కాక, హిందువులుగా, ముస్లిములుగా, విభజించడానికే మోదీ వేసిన ఎత్తుగడ అది– అని కొన్ని ప్రతిపక్షాలు సరిగానే విమర్శిస్తున్నాయి. ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనే విధానపు మంచి చెడ్డల గురించి చెప్పుకోవాలంటే, ముందు అది ఏమిటో కనీసంగా తెలియాలి. ఒక దేశంలోనే కాదు, ప్రపంచం లోనే వున్న ఆడా, మగా పౌరులందరికీ, మతం, కులం, ప్రాంతం వంటి తేడాలు లేకుండా, పౌరుల వ్యక్తిగత జీవితాల్నీ, కుటుంబ జీవితాల్నీ శాసించే, ఒకే రకమైన చట్టం (‘స్మృతి’) ఉండవలిసిందే! ఎందుకంటే, ఉదాహరణకి, ఒకటి రెండు మతాల్లో, పురుషులకు ఎక్కువ మంది స్త్రీలతో పెళ్ళిళ్ళు! ఇంకో మతంలో, పెళ్ళయిన వాళ్ళు విడిపోవడంలో స్త్రీలకే కాదు, పురుషులకు కూడా అసాధ్యమైనంత కష్టం! మతాల్లో, ఆస్తి హక్కులు ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ వేరు వేరుగా! మొగవాడి దృష్టిలో ఆడది తక్కువ! ఆడదాని దృష్టిలో మొగవాడు ఎక్కువ! ఈ విధంగా, పెళ్ళీ, విడాకులూ, దత్తతా, ఆస్తి హక్కూ, వంటి విషయాల్లో, వేరు వేరు మతస్తుల ఆచారాలూ, నియమాలూ, వేరు వేరే! ఎందుకూ? భారత్లో, మతాల గురించీ, కులాల గురించీ, సమానత్వాల బోధనలతో మాట్లాడే వాళ్ళు, అసలు బ్రతుకు తెరువుకి పునాది కారణం అయిన ఆదాయాల్లో తేడాల గురించి ఎందుకు ఎత్తరు? ‘ఉమ్మడి పౌర స్మృతి’ కోసం ప్రయత్నించాలని, భారత రాజ్యాంగంలో కూడా ఒక చోట చెప్పారని తెలుస్తుంది! కానీ, దాన్ని సాధించడానికి సరైన పునాదిగా ఏ పరిస్థితులు ఏర్పడాలో భారత రాజ్యాంగం చెప్పదు! ఎవరి మతాచారాల్ని వారు ఆచరించే హక్కులు ఉండవచ్చని ఒక వేపు చెపుతూనే, ‘మతాలతో నిమిత్తం లేకుండా’ పౌరులందరికీ, వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు సంబంధించి ఒకే చట్టం ఉండాలని ఇంకో పక్క సూచిస్తుంది. ఎంత గడుసు రాజ్యాంగం! ఒకటి ‘ప్రాధమికమైన హక్కూ’! రెండోది కేవలం ‘సూచన’! సూచన, నిబంధనగా ఎప్పటికీ అవదు. ఉమ్మడి పౌర స్మృతి కూడా నిజానికి సూచన వంటిదే! కానీ, దాన్ని చట్టంగా నిలబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు. మోదీని, బీజేపీ కార్యకర్తలు ఈ తర్కంతో అడగాలి: అయ్యా! తమరు ఉమ్మడి పౌర స్మృతి పేరుతో పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలంటున్నారు! ఆ స్మృతి, కేవలం వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు మాత్రమే కదా? మరి, పౌరులందరూ ఆర్ధికంగా ఒకే స్తితిలో లేరు! ‘ఆర్ధికంగా’ అంటే, ‘రూపాయి నోట్ల’ పరంగా కాదు, శ్రమలు చేయడాల పరంగా, ఉత్పత్తి కార్యాల పరంగా! దేశ పౌరుల్లో, కొందరికి భారీ భారీ ఆస్తులున్నాయి! కొందరికి రెక్కల కష్టం తప్ప వేరే మార్గం లేదు. దేశంలో భూములు ఎన్ని? అవి ఉమ్మడిగానే వుంటున్నాయా? దేశంలో, ఉత్పత్తి రాసుల్ని కురిపించే పరిశ్రమల్లో పౌరులందరూ సమానులేనా? సమస్త రవాణా సాధనాలనూ నిర్మించడానికీ, నడపడానికీ, కోట్ల కోట్ల డబ్బు రాసుల రాబడులకూ కారకులు ఎవరు? వాటి యాజమాన్యాలు ఎవరివి? ఆస్తి హక్కులకు కారణాలు ఏమిటి? పాకీ దొడ్లు తుడిచే అట్టడుగు కులాల శ్రామికులకు దేనిమీద యాజమాన్యం వుంది? దేశంలో, నిత్యం, 24 గంటలూ, ఉత్పత్తుల కార్యాలలో మునిగి బ్రతికే శ్రామికులకు, సుఖ శాంతుల్లో ఉమ్మడితనం వుందా? ఆడవాళ్ళ గృహ కార్యాలలో, పిల్లల పెంపకాల్లో, వృద్ధుల సంరక్షణల్లో, పురుషుల ఉమ్మడి పాత్ర వుందా? శ్రామిక జనంలో, మేధా శ్రామికులు వేరూ, శారీరక శ్రమల వారు వేరూ! శ్రమలు చేయడాల్లో ఉమ్మడితనం లేకపోతే, పౌరులుగా సమానులా? ఈ రకంగా ఆర్ధిక అసమానతల గురించి స్పష్టంగా గ్రహిస్తూ, మోదీ వంటి నాయకుల్ని అడగవలిసిన ప్రశ్న ఏమిటి? వ్యవసాయంలో, పరిశ్రమల్లో, రవాణాల్లో, సమస్త శ్రమల్లోనూ కాదా; ఏ ఒక్క శ్రమలో అయినా వేలు పెట్టని పౌరులకూ, రాత్రింబవళ్ళూ డ్యూటీలతో సతమతమయ్యే పౌరులకూ మధ్య ఉమ్మడితనం ఉన్నట్టా? ఇది వుందో లేదో ప్రశ్న లేకుండా, పెళ్ళికో, విడాకులకో, దత్తతకో, దీనికో, దానికో ఉమ్మడి చట్టాలా? హక్కులే సమానంగా, ఉమ్మడిగా లేనప్పుడు, ఉమ్మడి పౌర çస్మృతి గురించి ఉపన్యాసం ఇస్తున్నారేమీ మహాశయా?– అని మోదీని ప్రజలందరూ ప్రశ్నించలేరా? ఎన్నికల ముచ్చట్లలోనూ, నాయకుల ఆరాధనల్లోనూ మునిగిపోయిన ఏ పార్టీ ప్రజలకైనా, ఏ ప్రశ్నలూ రావు. ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది నిజంగా ఎప్పుడు సాధ్యం? ‘ఉమ్మడి ఆర్ధిక స్మృతి’ అనేది ఉన్నప్పుడు! ఉమ్మడి ఆర్ధిక స్మృతి అంటే: మానవుల మనుగడకు ఆధారమైన భూములూ, గనులూ, అడవులూ, పరిశ్రమలూ, రవాణా సాధనాలూ వంటి ఉత్పత్తి సాధనాలు, పౌరులందరి ఉమ్మడి ఆస్తిగా, అంటే, ‘సమాజపు ఆస్తి’ గా ఉన్నప్పుడు! అలా ఉంచే చట్టమే ఉమ్మడి ఆర్ధిక స్మృతి! చిన్న పిల్లలూ, వృద్ధులూ, అనారోగ్యంతో వున్నవారూ తప్ప, ఇతర స్త్రీ–పురుషులందరూ, వేరు వేరు విలువలు కలిగిన, ఉత్పత్తి కార్యాలలో బాధ్యతలు కలిగి వుండే విధానమే ఉమ్మడి ఆర్ధిక స్మృతి! ఆ విధానమే ఉమ్మడి పౌర స్మృతికి దారితీయగలదు! శ్రమ దోపిడీని అనుమతించే వర్గ భేదాల రాజ్యాంగ పాలన వున్న చోట, తర్క రహిత మతాచారాలు జీవితాల్ని శాసిస్తూ వుంటాయి. సమానత్వం లేని శ్రమ విభజన వల్ల తలెత్తిన కుల వ్యవస్త ఉన్నంతవరకూ, కుల కట్టుబాట్లూ, కులాచారాలూ, సమస్త కులాల పౌరుల్నీ ఎంతగానో లొంగదీస్తాయి! ఉమ్మడి ఆర్ధిక వ్యవస్త లేని సమాజంలో, దుర్భరమైన దారిద్య్రం కారణంగా, స్త్రీలని భోగ్య వస్తువులుగా కొనడాలూ, అమ్మడాలూ వంటి ‘వృత్తులు’ పుట్టుకొచ్చి సాగుతున్నాయి. కేవలం ఉమ్మడి పౌర çస్మృతి వల్ల, మతం గానీ, కులం గానీ, వ్యభిచారం వంటి ‘వృత్తులు’ గానీ మాయం అవుతాయా? ఉన్న అసమానతల మీద సంస్కరణలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. నిజమే! కానీ, మౌలికమైన మార్పులు అత్యవసరమైన సమాజంలో, చిట్టి పొట్టి సంస్కరణలు స్తిరపడతాయా? ‘ఉమ్మడి పౌర స్మృతి’ని వ్యతిరేకించే వారు, ముస్లిం ఆడకూతుర్లకూ (‘ముసల్మాన్ బేటియా’), ముస్లింలలో వెనకబడ్డ ‘పాస్మండా’ కులాలకూ ద్రోహం చేస్తున్నారు– అని వాపోయింది ప్రధాని కరుణా హృదయం! మరి, మొన్న బిల్కిస్ బానోనీ, ఇతర ముస్లిం స్త్రీలనీ అత్యాచారాలకు గురిచేసిన నేరస్తుల్ని, బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడం ‘ముస్లిం బేటీయా’లకు ద్రోహం చేయడం అవలేదా? రంగనాయకమ్మ వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత్రి -
ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకం.. తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరుతో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతోందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు. విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహా రాలు, సంస్కృతులు కలిగి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని తేల్చిచెప్పారు. అందులో భాగంగా యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. యూసీసీ బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూ మతాన్ని ఆచరించే ప్రజలూ అయోమయానికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమైంది. యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేసింది. దేశ ప్రజల అస్థిత్వానికి, వారి తరతరాల సాంప్రదాయ, సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు గొడ్డలిపెట్టుగా కేంద్ర ప్రభుత్వం మారిందని ఆరోపించింది. ఈ సమావేశంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, కె.తారకరామారావు పాల్గొన్నారు. పార్లమెంట్లో వ్యతిరేకిస్తాం... ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా, బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతోంది. అందుకే యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’అని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొనిపోతూ యూసీసీ బిల్లుపై పోరాడతామని చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావుకు సూచించారు. కాగా దేశంలోని గంగా జమున తహజీబ్ను రక్షించేందుకు ముందుకు రావాలనే తమ అభ్యర్థనను అర్థం చేసుకుని ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు గాను సీఎం కేసీఆర్కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ధన్యవాదాలు తెలిపింది. ఏపీ సీఎంకు కూడా విజ్ఞప్తి చేస్తాం: అసదుద్దీన్ ఉమ్మడి పౌర స్మృతి వస్తే అన్ని వర్గాలకూ నష్టం జరుగుతుందని మజ్లిస్ అధినేత, అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలు, గిరిజనులతో పాటు హిందూవులకు కూడా మంచిది కాదని చెప్పారు. హిందూ వివాహ చట్టం రద్దు అవుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ లౌకికవాదాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ఈ పరిస్థితుల్లో కేంద్రం యూసీసీ బిల్లు తెస్తే వ్యతిరేకించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఏపీ సీఎంకు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. -
యూసీసీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు రూపకల్పన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంద. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నాయి. ఇక, తాజాగా ఉమ్మడి పౌరస్మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ కేంద్రంపై సంచలన కామెంట్స్ చేశారు. అయితే, యూనిఫామ్ సివిల్ కోడ్పై సోమవారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, బోర్డు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమౌతున్నది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా గత తొమ్మిదేండ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది బీజేపీ ప్రభుత్వం. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. అందుకే బీజేపీ తీసుకోవాలనుకుంటున్న యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. యూసీసీతో అందరికీ ఇబ్బందులే: ఒవైసీ మరోవైపు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్ తెస్తామన్న యూసీసీని వ్యతిరేకించాలని కేసీఆర్ను కోరాం. సీఏఏను వ్యతిరేకిస్తూ టీఎస్ అసెంబ్లీలో మొదటగా తీర్మానం చేసింది. యూసీసీ తీసుకురావడం ద్వారా దేశంలోని భిన్నత్వాన్ని దెబ్బతీయాలని మోదీ కుట్ర చేస్తున్నారు. యూసీసీ కేవలం ముస్లింలకే కాదు.. హిందువులతో పాటుగా క్రిస్టియన్లు, వివిధ ఆదివాసీ వర్గాలకు ఇబ్బంది. దేశంలో భిన్నత్వం ఉండటం మోదీకి ఇష్టం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ కొడుకు హిమాన్షు పెద్ద మనస్సు.. ప్రశంసల వర్షం -
ఉమ్మడి పౌరస్మృతి ఆలోచనే వద్దు: ఆజాద్
శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు రూపకల్పన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ.. కశ్మీరీ సీనియర్ నేత.. డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ చైర్మన్ గులాంనబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఆలోచనే చేయొద్దంటూ కేంద్రంలోని బీజేపీకి సూచించారాయన. యూసీసీ అనేది చాలా సంక్లిష్టమైన అంశం. ఆర్టికల్ 370(జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించి..) రద్దు చేసినంతలా సులువు కాదు. ఎందుకంటే.. ఇది కేవలం ముస్లింలతో ముడిపడిన అంశం కాదు. క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, గిరిజనులు.. ఇలా అందరితో ముడిపడి ఉంది. అన్ని మతాలకు, వర్గాలకు ఆగ్రహం తెప్పించే అంశం ఇది. ఏ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. అలాగే కేంద్రంలోని బీజేపీకి కూడా. కాబట్టి.. అసలు ఉమ్మడి పౌర స్మృతి ముందడుగు వద్దని.. అసలు ఆ ఆలోచనే వద్దని కేంద్రానికి సూచించారాయన. ఆపై దేశంలో తాజా రాజకీయ పరిణామాలపైనా ఆయన స్పందిస్తూ.. ముఖ్యంగా ఎన్సీపీ సంక్షోభం తనను బాధించిందని చెప్పారు. కిందటి ఏడాది సెప్టెంబర్లో యాభై ఏళ్ల కాంగ్రెస్తో అనుబంధాన్ని తెంచుకుని.. సొంత పార్టీ ద్వారా కశ్మీర్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు ఆజాద్. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా! -
యూనిఫామ్ సివిల్ కోడ్: తొలి అడుగు వేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిని గురించిన ప్రస్తావన చేసి సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. ప్రకటన చేసినంతలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలులో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది కేంద్రం. మత ప్రాతిపదికన అందరికీ ఒకే రీతిలో చట్టాలు ఉండాలన్న ఆలోచనతో ఉమ్మడి పౌరస్మృతిని ఆచరణలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుకిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఇది కీలకాంశం కావడంతో వచ్చే ఎన్నికలలోపే దీన్ని అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టనుంది కేంద్రం. ఈ ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గిరిజనుల వ్యవహారాలను పరిశీలించేందుకు, మహిళల హక్కులను పరిశీలించేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సమీక్షించేందుకు పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని, చట్టపరమైన అంశాలను పరిశీలించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఉమ్మడి పౌరస్మృతి అమలుచేసే విషయమై ఎదురయ్యే చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసే క్రమంలో ఈ మంత్రుల ప్యానెల్ బుధవారం మొదటిసారి సమావేశమయ్యింది. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని సునిశితంగా అధ్యయనం చేసి జులై మూడో వారం లోపే ఈ ప్యానెల్ ప్రధానమంత్రికి పూర్తి నివేదికను సమర్పించనున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని లేవనెత్తగానే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేసిన విషయం తెలిసిందే. దేశంలో ప్రజలు ఎదురుంటున్న ప్రధాన సమస్యల నుండి వారి దృష్టిని మళ్లించడానికే ప్రధాని ఈ ప్రస్తావన చేసినట్లు ఆరోపించాయి. ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు -
20 నుంచి పార్లమెంట్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో సభా వ్యవహారాలు, వివిధ అంశాలపై ఫలప్రదమైన చర్చలకు సహకరించాలని అన్ని పారీ్టలను కోరుతున్నా’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మొత్తం 17 రోజులపాటు పార్లమెంట్ సమావేశం కానుంది. సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో కొత్త భవనానికి మారుతాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఐక్య ఫ్రంట్ను ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయతి్నస్తున్న వేళ ఈ సమావేశాలు వాడీవేడిగా సాగుతాయని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి( యూసీసీ)బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రధాని మోదీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెడుతూ ఢిల్లీలో పరిపాలనాధికారాలపై పట్టుబిగించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అదేవిధంగా, ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ నూతన భవనాన్ని మే 28న ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
యూసీసీ బిల్లు.. కేంద్రం వడివడి అడుగులు
ఢిల్లీ: ఒకే దేశం.. ఒకే చట్టం నినాదంతో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) బిల్లును వీలైనంత త్వరగా చట్ట రూపంలోకి తేవాలని తేవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు యూసీసీ(Uniform Civil Code) బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు స్పష్టమవుతోంది. జులై 17వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే అభిప్రాయసేకరణలో భాగంగా లా కమిషన్ ఒక నోటీసు జారీ చేసింది. మరోవైపు ఈ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేసి.. అభిప్రాయసేకరణ ద్వారా వీలైనంత త్వరగా బిల్లు ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ► బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అధ్యక్షతన 31 సభ్యులతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యేందుకు సిద్ధమైంది. అఖిలపక్ష అభిప్రాయం కోసం జులై 3వ తేదీన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల UCC గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ► ఉమ్మడి పౌర స్మృతి అంశంపై భోపాల్లో తాజాగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూనే.. ఇంతా నెలరోజుల గడువులోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. యూసీసీ బిల్లు కోసం కేంద్రం వేగం పెంచింది. మరోవైపు జూన్ 14వ తేదీనే లా కమిషన్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మత సంస్థల అభిప్రాయ సేకరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తద్వారా సమగ్ర పద్ధతిలో తాము ముందుకెళ్తున్నట్లు కమిషన్ దేశానికి చాటి చెబుతోంది. అదే సమయంలో.. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటుకు సమర్పించి, అనంతరం దానిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించే అవకాశం ఉందని, వివిధ వర్గాల వాదనలను ఆ కమిటీ స్వీకరిస్తుందని తెలుస్తోంది. ► బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో యూసీసీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రాజ్యాంగంలోని అధికరణ 44 కూడా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని చెప్తోంది. అయితే.. ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్కు ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలుపగా, కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింసాకాండ వంటి సమస్యలు ఉన్నాయని, అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ యూసీసీ అంశాన్ని లేవనెత్తుతున్నారని దుయ్యబడుతున్నాయి. ఒకే రకమైన చట్టం ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి.. దేశం మొత్తం పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. మత చట్టాలు పక్కనపడిపోతాయి. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు అమలవుతున్నాయి. అయితే యూసీసీపై పలు అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం.. ఆ కేసుతోనే మలుపు! -
UCC: అర్ధరాత్రి హడావిడిగా భేటీ
ఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన రావడంతో.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అప్రమత్తమైంది. మంగళవారం అర్ధరాత్రి హడావిడిగా సమావేశమైంది. ఈ భేటీలో ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బోర్డు.. ఇందుకు సంబంధించిన ఓ కీలక నిర్ణయం సైతం తీసుకుంది. ముస్లిం లా బోర్డు ప్రెసిడెంట్ సైఫుల్లా రెహమానీ అధ్యక్షతన.. ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగీ మహాలీ, ముస్లిం లా బోర్డు ఇతర సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. వర్చువల్గానే జరిగిన ఈ భేటీ మూడు గంటలపాటు సాగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. భోపాల్ వేదికగా ప్రధాని చేసిన ప్రంసగంతో ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో మళ్లీ చర్చ ఊపందుకుంది. ఒక దేశానికి రెండు చట్టాలు కావాలా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగానే ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఉండే ఇద్దరు వ్యక్తులకి రెండు నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళుతుందని నిలదీశారు. ఇప్పటికే 22వ లా కమిషన్ను ఏర్పాటు చేసినట్లు.. దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను 30 రోజుల్లోగా తీసుకోవాలని గడువు విధించారు. ఈ నేపథ్యంలో.. వర్చువల్గానే ముస్లిం లాబోర్డు భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలనే ప్రధానాంశంగా చర్చించి.. యూనిఫామ్ సివిల్ కోడ్ను మరింత గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు లా కమిషన్కు ఓ డ్రాఫ్ట్ను సమర్పించేందుకు ముస్లిం బోర్డు సిద్ధమవుతోంది. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా! -
ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా!
ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో మళ్లీ చర్చ ఊపందుకుంది.ఒక దేశానికి రెండు చట్టాలు కావాలా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగానే ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఉండే ఇద్దరు వ్యక్తులకి రెండు నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళుతుందని నిలదీశారు. ఇప్పటికే 22వ లా కమిషన్ను ఏర్పాటు చేసి దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను 30 రోజుల్లోగా తీసుకోవాలని గడువు విధించారు. ఈ పరిణామాలతో అసలు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి ? అది అమలు చేయడం వల్ల ఏమవుతుంది ? అనుకూల వర్గం ఏమంటోంది? ప్రతికూలుర వాదనలు ఏంటి ? వంటి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఒకే దేశం.. ఒకే చట్టం.. ఇదే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ముందున్న లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అయోధ్య రామ మందిర నిర్మాణం, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిపైనే దృష్టి సారించింది. ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశవ్యాప్తంగా ఒకే పౌర చట్టం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో వివాహం, విడాకులు, దత్తత, భరణం, సంరక్షణ, వారసత్వం తదితర వ్యక్తిగత అంశాల్లో మతాలవారీగా చట్టాలు అమల్లో ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్ క్రిస్టియన్లు, పార్సీలు ఎవరికి వారు తమ మత చట్టాలనే అనుసరిస్తారు. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకువస్తే ఈ వ్యక్తిగత చట్టాలన్నీ రద్దయి అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లు యూసీసీని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ హక్కులు వర్సెస్ ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 37 ప్రకారం ఆదేశిక సూత్రాలలో ఉన్న నిబంధనలు దేశ పరిపాలనలో ప్రాథమికమైనవి. ఈ సూత్రాలను వర్తింప జేయడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది. అయితే యూసీసీ అనేది ఆదేశిక సూత్రాల్లో ఒకటిగా ఉంది తప్ప రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు. అందుకే స్వాతంత్య్రానంతరం యూసీసీ అమలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా అమల్లోకి రాలేదు. పర్సనల్ లా అనేది మత సంప్రదాయాలు, విశ్వాసాలకు సంబంధించినది కావడంతో వారి మనోభావాలు దెబ్బ తీసేలా యూసీసీ తీసుకురావడం అంత సులభం కాదన్న వాదనలు ఉన్నాయి. షాబానో కేసుతో మలుపు రాజ్యాంగాన్ని రచించిన సమయంలోనే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అప్పటి నాయకులు గుర్తించారు. భవిష్యత్లోనైనా దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావాలని అయితే ఇది నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా అమల్లోకి వస్తే బాగుంటుందని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. మైనార్టీలు తిరుగుబాటు చేసే విధంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని ఆయన అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత యూసీసీని తీసుకురావాలని ప్రభుత్వం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. 1985లో షా బానో కేసుతో యూసీసీ ఆవశ్యకత ఉందన్న అభిప్రాయం బలంగా వచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన షాబానో అనే ముస్లిం మహిళ 40 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత మూడు సార్లు తలాక్ చెప్పి తనకు విడాకులిచ్చిన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టుకెక్కారు. సుప్రీం కోర్టు కూడా ఆమెకు జీవనభృతి చెల్లించాలని తీర్పు చెప్పింది. అయితే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజీవ్ గాంధీ సర్కార్ ముస్లిం మహిళల చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చినా భర్త భరణం ఇవ్వక్కర్లేదు. ఇలా పర్సనల్ చట్టాల్లోని సంక్లిష్టత, వివక్షను ఆయుధాలుగా చేసుకొని బీజేపీ ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. మన దేశంలో గోవాలో మాత్రమే ఒకే చట్టం అమలవుతోంది. 1867లో పోర్చుగల్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మాత్రమే అన్ని మతాలకు ఒకే చట్టం అమల్లో ఉంది. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తేవడంలో ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అన్నే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. దేశంలో ముస్లింలలో అభద్రతా భావం పెరిగిపోతుందన్నది ప్రధాన ఆందోళన. అటు హిందువుల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయనే అనుమానాలున్నాయి. ఎందుకంటే నాగాలాండ్, మేఘాలయ, మిజోరం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో హిందూ చట్టాల్లో కూడా తేడాలున్నాయి. 200కి పైగా ఆదివాసీ తెగలు తమ సొంత సంప్రదాయ చట్టాలనే అనుసరిస్తాయి. అనుకూలం ♦ రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి అనుకూలంగా కులం, మతం, ప్రాంతం, వర్గం లింగ భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే చట్టం అమలై జాతి సమగ్రతకు దోహదçపడుతుంది. ♦ ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న మతపరమైన పర్సనల్ చట్టాలు కాలం చెల్లిపోయినవి. ఉమ్మడి పౌర స్మృతి వస్తే అవన్నీ రద్దవుతాయి ♦ పర్సనల్ చట్టాల్లో స్త్రీ, పురుష వివక్ష ఎక్కువగా ఉంది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. యూసీసీ వస్తే ఇలాంటి వివక్ష పోయి స్త్రీ, పురుష సమానత్వం సాధ్యపడుతుంది. ♦ చైనాను దాటేసి ప్రపంచ జనాభాలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాం. జనాభా పెరుగుదల వల్ల కలిగే దు్రష్పభావాలను అరికట్టడానికి, అన్ని మతాల్లోనూ చిన్న కుటుంబాలను ప్రోత్సహించడానికి వీలవుతుంది ♦సుప్రీం కోర్టులో తీర్పులు చెప్పడం సులభమవుతుంది. భిన్న మతాచారాలకు సంబంధించిన కేసులు వస్తున్నప్పుడు తీర్పుల్లో విపరీతమైన గందరగోళం నెలకొంటోందని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేసింది. యూసీసీ ఆవశ్యకత గురించి పలు మార్లు వ్యాఖ్యలు చేసింది. దీనిని వీలైనంత తర్వగా తీసుకురావాలని కేంద్రానికి పలు కేసుల సందర్భంగా సూచించింది. ప్రతికూలం ♦ ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిం సమాజంతీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ మీద జరిగే మత, సాంస్కృతిక దాడిగా భావిస్తోంది. బీజేపీ మైనార్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్న భావన ఇప్పటికే ఉంది. యూసీసీని కూడా తీసుకువస్తే దేశంలో ఘర్షణలకు దారి తీసే అవకాశాలున్నాయి ♦ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించడంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. పెళ్లి, విడాకులు, ఆస్తి, హక్కులు, భరణాలు వంటి వాటిపై ఏ మత ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటారన్నది అతి పెద్ద సమస్యగా మేధోవర్గం భావిస్తోంది. ♦ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావడం కోసం 2016లో మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అప్పట్లో ఏర్పాటు చేసిన 21వ లా కమిషన్ దీనిని తీసుకురావడం ఏ మాత్రం వాంఛనీయం కాదని నివేదిక ఇచ్చింది. అప్పుడున్న పరిస్థితులకి, ఇప్పటికి పెద్ద తేడా ఏమీ రాలేదు. ♦ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛ, మైనార్టీ హక్కుల్ని పరిరక్షించే ఆర్టికల్ 29కి యూసీసీ అడ్డంకిగా మారుతుంది బ్రిటిష్ పాలకుల్ని కూడా అబ్బురపరిచిన భిన్నత్వంలో ఏకత్వం మన దేశం సొంతం. యూసీసీని తీసుకువస్తే సమాజంలో ఆ వైవిధ్యం దెబ్బ తింటుందన్న ఆందోళనలు ఉన్నాయి. - సాక్షి, నేషనల్ డెస్క్ -
'ఒకే దేశంలో రెండు చట్టాలా..?' ప్రతిపక్షాలకు ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్..
భోపాల్: భోపాల్ సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెరమీదకు తెచ్చారు. ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో మనిషికో చట్టం ఉండటం సబబు కాదని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని గుర్తు చేశారు. భోపాల్లో నిర్వహించిన 'మేరే బూత్ సబ్సే మజ్బూత్' కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో మాట్లాడారు. సమావేశంలో భాగంగా ట్రిపుల్ తలాక్పై కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో ఎవరి ప్రయోజనం కోసం ఇన్నాళ్లు ట్రిపుల్ తలాక్ను కొనసాగించారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈజిప్టు, ఇండోనేషియా, ఖతార్, జోర్డన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి ముస్లిం దేశాల్లో తలాక్ ఆచారాన్ని ఎప్పుడో రద్దు చేశారని గుర్తుచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రిపుల్ తలాక్ను కొనసాగించారని ప్రధాని దుయ్యబట్టారు. తలాక్ రద్దు చట్టం తేవడంతో ముస్లిం స్త్రీలకు స్వేచ్ఛ కల్పించినట్లు పేర్కొన్నారు. అందుకే ఎక్కడకు వెళ్లినా బీజేపీకి ముస్లిం మహిళలు అండగా ఉంటున్నారని చెప్పారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ముస్లింలను రెచ్చగొడుతున్నారని ప్రధాని ఆరోపించారు. అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలని అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ను ఉద్దేశిస్తూ.. దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం అవసరాన్ని రాజ్యాంగం కూడా తెలిపిందని ప్రధాని చెప్పారు. మతాలకతీతంగా అందరికీ ఒకే చట్టాలు అందుబాటులో ఉండేలా ఉమ్మడి పౌరస్మృతి సూచిస్తుంది. ఉత్తరఖండ్ ఇప్పటికే ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. లా కమిషన్ కూడా ఇటీవల ఈ చట్టంపై పనిచేస్తోంది. దేశంలో పలు మత సంస్థలను, ప్రముఖ వ్యక్తులను ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతిపై సూచనలను కోరింది. ఇదీ చదవండి: కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. -
ఉమ్మడి పౌరస్మృతిపై ప్రశ్న..వేడిగా ఉందంటూ దాటవేసిన నితీష్..
బిహార్:ఉమ్మడి పౌరస్మృతిపై ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తోంది. ఈ అంశంలో లా కమిషన్ కూడా ఇప్పటికే వివిధ మత సంస్థల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో యునిఫామ్ సివిల్ కోడ్పై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తప్పించుకున్నారు.'ఎండలు బాగా కొడుతున్నాయ్.. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం'..అంటూ సింపుల్గా దాటవేశారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్యాయంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని నితీష్ నేతృత్వంలో ప్రముఖ నేతలు జూన్ 23న సమావేశం కానున్నారు. మూడో కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశాలను అందులో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్పై తన అభిప్రాయాన్ని నితీష్ కుమార్ చెప్పకుండా దాటవేశారు. కేంద్ర న్యాయ శాఖ సిఫారసుల మేరకు 22వ లా కమిషన్ యూనిఫామ్ సివిల్ కోడ్ను పరిశీలిస్తోంది. జూన్ 14న ఈ మేరకు ప్రముఖ మత సంస్థల అభిప్రాయాన్ని కూడా కమిషన్ కోరింది. అయితే బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. 21వ లా కమిషన్ ఇచ్చిన సిఫారసుల మేరకు యూనిఫామ్ సివిల్ కోడ్ దేశానికి ఇప్పుడే అవసరం లేదని పేర్కొన్నట్లు కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ తెలిపారు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా దేశ అవసరాలు ఉండవని అన్నారు. ఇదీ చదవండి:నితీష్ కుమార్ సర్కార్కు ఎదురుదెబ్బ ..మద్దతు ఉపసంహరించుకున్న జితన్ మాంఝీ పార్టీ -
‘ఉమ్మడి’పై న్యాయ కమిషన్ సంప్రదింపులు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై 22వ న్యాయ కమిషన్ బుధవారం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించింది. ప్రజలతోపాటు గుర్తింపు పొందిన మత సంస్థల అభిప్రాయాలను సేకరిస్తోంది. 21వ న్యాయ కమిషన్ గతంలో సంప్రదింపులు జరిపింది. ఈ కమిషన్ కాలపరిమితి 2018 ఆగస్టులో ముగిసింది. ఉమ్మడి పౌర స్మృతి అనేది అత్యంత సున్నితమైన అంశం కావడంతో తాజాగా మరోసారి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలన్ని నిర్ణయానికి 22వ న్యాయ కమిషన్ వచ్చింది. -
‘ఉమ్మడి స్మృతి’పై రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతిని సిద్ధం చేసేందుకు ఓ ప్యానల్ ఏర్పాటు చేయాలని కోరుతూ వివాదాస్పద ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం రాజ్యసభ ముందుకొచ్చింది. విపక్ష సభ్యుల తీవ్ర అభ్యంతరాల మధ్య బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా దీన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్వాదీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ తదితర విపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉమ్మడి స్మృతి దేశ సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తుందంటూ ఆందోళన వెలిబుచ్చాయి. ‘‘ఆరెస్సెస్ అజెండాను అమలు చేసేందుకు పాలక బీజేపీ ప్రయత్నిస్తోంది. కశ్మీర్ అంశాన్ని ముగించేశారు. ఇప్పుడిక ఉమ్మడి స్మృతిపై పడ్డారు. ఈ బిల్లు పూర్తిగా అనైతికం. ప్రజా వ్యతిరేకం. రాజ్యాంగవిరుద్ధం. దీన్ని తక్షణం ఉపసంహరించాలి’’ అంటూ విపక్ష సభ్యులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. దాంతో చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ఓటింగ్ నిర్వహించారు. 63–23 తేడాతో బిల్లును ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ విపక్షాల అభ్యంతరాలు, ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘ఏ అంశాన్నైనా లేవనెత్తడం సభ్యుని హక్కు. ఉమ్మడి స్మృతిపై సభలో చర్చ జరగనిద్దాం’’ అని సూచించారు. ఉమ్మడి స్మృతిపై గతంలోనే బిల్లును లిస్ట్ చేసినా సభ దాకా రాలేదు. గవర్నర్ పాత్రపై సీపీఎం బిల్లు గవర్నర్ పాత్ర, అధికారులు, విధులను స్పష్టంగా నిర్వచిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ వి.సదాశివన్ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో తన అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దారుణంగా దుర్వినియోగం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ‘‘చరిత్రే ఇందుకు సాక్ష్యం. గవర్నర్ పదవి వలస పాలన సమయంలో భారతీయులను అణచేసేందుకు సృష్టించినది. గవర్నర్లు చాలావరకు ఇప్పటికీ అదే వలసవాద భావజాలంతో పని చేస్తున్నారు’’ అని విమర్శించారు. గవర్నర్ను కేంద్రమే నియమించేట్టయితే సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రికి మూడు పేర్లు ప్రతిపాదించి ఆయన సూచన మేరకు నడచుకోవాలన్నారు. ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్ -
Times Now Sumit 2022: ఉమ్మడి పౌరస్మృతికి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) తీసుకొచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. అయితే, అన్ని రకాల ప్రజాస్వామిర ప్రక్రియలను అనురించడంతోపాటు సంప్రదింపుల తర్వాతే తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కులతత్వం, వారసత్వం, బుజ్జగింపు వంటి జాడ్యాల నుంచి దేశ రాజకీయాలకు విముక్తి కలిగించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం పుట్టుక, కులం, ఇతరులను బుజ్జగించే తత్వం ఆధారంగా ఎన్నికల్లో నెగ్గే రోజులు పోయాయని స్పష్టం చేశారు. మతం ఆధారంగా చట్టాలా? బీజేపీ భారతీయ జనసంఘ్గా ఉన్నప్పటి నుంచే ఉమ్మడి పౌరస్మృతిపై దేశ ప్రజలకు హామీ ఇచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు. బీజేపీ మాత్రమే కాదు రాజ్యాంగ సభ కూడా సరైన సమయంలో యూసీసీని తీసుకురావాలని పార్లమెంట్కు, రాష్ట్రాలకు సూచించిందని వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు అనేవి మతం ఆధారంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లేదా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించిన ఒకే ఒక ఉమ్మడి చట్టం ఉండాలని చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ తప్ప ఇతర పార్టీలేవీ ఉమ్మడి పౌరస్మృతి పట్ల అనుకూలంగా లేవని అమిత్ షా పేర్కొన్నారు. దానిపై కనీసం మాట్లాడడం లేదన్నారు. మాట్లాడే ధైర్యం లేకపోతే వ్యతిరేకించవద్దని హితవు పలికారు. ‘మీరు అమలు చేస్తే మేము మీ వెంటనే ఉంటాం’ అని కూడా ప్రతిపక్షాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఆరోగ్యకరమైన, బహిరంగ చర్చ జరగాలని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అంటే.. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) గురించి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించారు. ఈ పౌరస్మృతిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాల శాసన సభలకు కూడా ఉంది. ప్రస్తుతం గోవాలో యూసీసీ అమలవుతోంది. యూసీసీకి మరో అర్థం.. ఒకే దేశం, ఒకే చట్టం. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమానంగా వర్తించే ఒకే చట్టమే ఉమ్మడి పౌరస్మృతి. భారత్లో వేర్వేరు మతస్తులకు, జాతులకు వారి మతగ్రంథాలు, అందులోని బోధనల ఆధారంగా వేర్వేరు వ్యక్తిగత(పర్సనల్) చట్టాలు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఓ వర్గం పురుషులు ఒక్కరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. అందుకు వారి ‘పర్సనల్ లా’ అనుమతిస్తుంది. మరో మతంలో అలాంటి వివాహాలకు అనుమతి లేదు. ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా వామపక్షాలు, ఇస్లామిక్ సంస్థలు, కొన్ని జాతులు, తెగలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
కాంగ్రెస్ పాలన స్కాములమయం
సులాహ్: హిమాచల్ప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. విశ్వసనీయత లేని వారి హామీలను ప్రజలను నమ్మరంటూ కాంగ్రెస్ ప్రకటించిన 10 హామీలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన గురువారం కంగ్రా జిల్లా సులాహ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలు లెక్కకు మిక్కిలి ఉండగా, బీజేపీ హయాంలో 2014 నుంచి ఒక్క స్కాము కూడా కనిపించదని చెప్పారు. 2004–14 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో రూ.12 లక్షల కోట్ల మేర కుంభకోణాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ వంటి పార్టీలిచ్చే ఎన్నికల హామీలను హిమాచల్ ప్రజలు నమ్మరని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం జైరాం ఠాకూర్లు కలిసి హిమాచల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. -
ఒకే దేశం, ఒకే చట్టం... సాధ్యమయ్యేనా?
ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ) మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే దేశం ఒకే చట్టం ఎజెండాతో గతంలో ఉత్తరాఖండ్ ఎన్నికలప్పుడు యూసీసీ అమలుకు బీజేపీ సర్కారు కమిటీ వేయడం తెలిసిందే. తాజాగా గుజరాత్ కూడా అదే బాట పట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలా వరసగా యూసీసీ అమలుకు సై అంటూ ఉండడంపై చర్చ మొదలైంది. విభిన్న పరిస్థితులున్న దేశంలో ఒకే చట్టం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి... కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి. ఇది అమల్లోకి వస్తే పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వ హక్కులు, జనన మరణాలు, దత్తత ప్రక్రియకు సంబంధించి పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, అప్పుడే సమానత్వ హోదా దక్కుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా చెబుతోంది. హిందూత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిని ఎన్నడో తన మేనిఫెస్టోలో చేర్చింది. తన రాజకీయ ఎజెండాలో ఆగ్రభాగాన ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేసింది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయకుండా ముందు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి మొదలు పెట్టే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ పాలిత యూపీ, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్ యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అనుమానాలూ లేకపోలేదు... అయితే యూసీసీపై హిందువుల్లోనే కాస్త వ్యతిరేకత వచ్చే ఆస్కారముందా అన్న అనుమానాలూ లేకపోలేదు. ‘‘భిన్న మతాలకు చెందిన వారికి వేర్వేరు లా బోర్డులున్నాయి. హిందూ మతానికి చెందినవారు కూడా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఆచారాలు పాటిస్తున్నారు. వాటన్నింటికీ ఏకరూపత ఎలా సాధ్యం?’’ అన్నది ఒక వాదన. కేవలం మెజార్టీ ఓటు బ్యాంకును ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకేనని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇది బీజేపీ ఎన్నికల స్టంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు అంటున్నారు. అందరికీ ఒకే చట్టాల్లేవా...? ప్రస్తుతం దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలకు వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యక్తిగత చట్టాలున్నాయి. ముస్లింలకు షరియా చట్టాలకు అనుగుణంగా ముస్లిం పర్సనల్ లా అమలవుతోంది. దాని ప్రకారం ముస్లిం పురుషులకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. వేరే మతస్తులకు మాత్రం చట్టప్రకారం ఒక్క భార్యే ఉండాలి. సివిల్ అంశాల్లో కాంట్రాక్ట్ చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ వంటి అనేకానేక ఉమ్మడి చట్టాలనూ పలు రాష్ట్రాల్లో భారీగా సవరించారు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నా అక్కడా కేథలిక్కులకు, ఇతర మతాలకు భిన్నమైన నియమాలు పాటిస్తున్నారు. నాగాలాండ్, మిజోర, మేఘాలయాల్లోనైతే హిందూ చట్టాల్లో కూడా భిన్నత్వం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్లోనే ఎందుకు.. దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చు కదా?
గాంధీనగర్: గుజరాత్లో అధికార బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమలుపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన మరునాడే దీనిపై స్పందించారు. యూసీసీని దేశవ్యాప్తంగా కాకుండా గుజరాత్లోనే అమలు చేస్తామని చెప్పడంలో బీజేపీ ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు గిమ్మిక్కుగా దీన్ని అభివర్ణించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇదే ప్రశ్నలేవనెత్తారు. యూసీసీని అమలు చేయాలనుకుంటే దేశవాప్తంగా తీసుకురావాలన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఇలాగే హడావిడి చేసిందని కేజ్రీవాల్ గుర్తు చేశారు. యూసీసీ అమలుకు కమిటీని ఏర్పాటు చేసిందని, కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాని ఊసే ఎత్తలేదని విమర్శించారు. ఇప్పుడు కూడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే అదే అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు. ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటాలని భావిస్తున్న కేజ్రీవాల్ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ పర్యటనలకు వెళ్తున్నారు. ఆదివారం కూడా పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి భావ్నగర్, రాజ్కోట్ జిల్లాల్లో ర్యాలీల్లో పాల్గొననున్నారు. చదవండి: శాసనసభ ఎన్నికల వేళ గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం -
శాసనసభ ఎన్నికల వేళ గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యునిఫామ్ సివిల్ కోడ్ -యూసీసీ)ని అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యూసీసీ ప్యానల్లో సభ్యుల వివరాలను గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి వెల్లడించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కేబినెట్ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ‘కేబినెట్ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని పరిశీలించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని యూసీసీపై ముసాయిదాను సిద్ధం చేస్తుంది’ అని భూపేంద్ర పటేల్ తెలిపారు. గత మే నెలలో యూసీసీని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాజపా ఈ హామీని ప్రకటించింది. అన్నట్లుగానే పుష్కర్ సింగ్ ధామీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే యూసీసీని అమలు చేసేందుకు నిపుణులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. అదే నెలలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సైతం యూసీసీ అమలు చేస్తామని వెల్లడించారు. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ సైతం ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: 7 నెలలగా అచేతన స్థితిలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ -
ఉమ్మడి పౌర స్మృతిపై కమిటీ వేయలేదు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)అమలుపై ప్రత్యేకంగా కమిటీని వేయాలన్న ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్రం తెలిపింది. అయితే, ఈ అంశానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని న్యాయశాఖను కోరినట్లు వెల్లడించింది. న్యాయ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకువచ్చే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్–44 ద్వారా కేంద్రానికి ఉందన్నారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంటూ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. -
భిన్న మతాలున్న భారత్లో ఉమ్మడి పౌరస్మృతి వీలుకాదు
కాన్పూర్: భిన్న మతాలకు నెలవైన భారత సమాజానికి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అనువైనది కాదని, ఉపయుక్తకరం కూడా కాదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. నచ్చిన మతాన్ని అనుసరించొచ్చని రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుకు ఉమ్మడి పౌరస్మృతి విరుద్ధమని (భంగకరమని) అభిప్రాయపడింది. ‘‘భారత్ బహుళా విశ్వాసాలను ఆచరించే దేశం. ఏ విశ్వాసాలనైనా నమ్మే, ఏ మతాన్నైనా ఆచరించే, ప్రచారం చేసుకొనే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. యూసీసీ దిశగా ఏ ప్రయత్నం జరిగినా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమే’’ అని ఆదివారం ముగిసిన తమ 27వ సదస్సులో ముస్లిం బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. ఉమ్మడి పౌరస్మృతిని రుద్దే ప్రయత్నం ప్రత్యక్షంగా, పరోక్షంగా... పాక్షికంగా, సంపూర్ణంగా ఇలా ఏరూపంలో చేసినా అది తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాబోదని తెలిపింది. ఏఐఎంపీఎల్బీ అధ్యక్షుడిగా మౌలానా రబే హసన్ నద్వీ బోర్డు ఛైర్మన్గా తిరిగి ఎన్నికయ్యారు. -
జనాభా నియంత్రణ.. యూసీసీపై ప్రైవేటు బిల్లులు!
న్యూఢిల్లీ: రాబోయే వర్షాకాల సమావేశాల్లో జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్ కోడ్(యూసీసీ)పై ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఈమేరకు వారు యత్నిస్తున్న విషయాన్ని పార్లమెంట్ సెక్రటేరియట్లకు ఇద్దరు ఎంపీలు వెల్లడించారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును తెచ్చింది. అసోం సైతం ఇలాంటి బిల్లు తెచ్చే యోచనలో ఉంది. ఇదే బాటలో దేశవ్యాప్తంగా అమలయ్యేలా జనాభా నియంత్రణ బిల్లు తెచ్చేందుకు బీజేపీ ఎంపీలు యత్నిస్తున్నారు. యూపీకే చెందిన లోక్సభ ఎంపీ రవికిషన్ జనాభా నియంత్రణ బిల్లును, రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్న కిరోరి లాల్ మీనాలు యూసీసీ బిల్లును సమావేశాల జూలై 24న ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మరి కొందరు ఎంపీలు సైతం ఈ బిల్లుల కోసం నోటీసులు ఇచ్చారు. మంత్రులు కాకుండా సాధారణ సభ్యులు ప్రవేశపెట్టే బిల్లులను ప్రైవేట్ బిల్లులంటారు. వీటికి సంపూర్ణ ఆమోదం లభించకుండా చట్టరూపం దాల్చలేవు. అయితే ఈ బిల్లులు బీజేపీ ఎజెండాలో భాగం కనుక వీటిపై జరిగే చర్చలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇవన్నీ ఒక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్న యత్నాలంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.ఈ బిల్లులోని ఏక సంతాన నిబంధనను విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకిస్తోంది. ఈ నిబంధనతో ఇప్పటికే హిందూ, ముస్లిం జనాభా అసమతుల్యత మరింత పెరుగుతుందని అభ్యంతరాలు చెబుతోంది. బిల్లు ఉద్దేశాన్ని వ్యతిరేకించడం లేదని, బిల్లులో కొన్ని క్లాజులపై అభ్యంతరాలున్నాయని సంస్థ ప్రతినిధి అలోక్ కుమార్ యూపీ లాకమిషన్కు లేఖ రాశారు. 1970 తర్వాత ఇంతవరకు ఒక్క ప్రైవేట్ బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందలేదు. -
అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ 18 ఏళ్లు చాలు!!
సాక్షి, న్యూఢిల్లీ : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పదే పదే చెబుతున్నా ఆ దురాచారం మాత్రం కనుమరుగవడం లేదు. పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియని వయసులోనే బాల్యం ‘ముళ్ల’ బారిన పడుతోంది. ఈ నేపథ్యంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు, అసమానతలు తొలగించేందుకు లా కమిషన్ సరికొత్త ప్రతిపాదనలు రూపొందించింది. మతాలకతీతంగా యువతీ, యువకులిద్దరికీ కనీస వివాహ వయస్సును 18 సంవత్సరాలుగా నిర్ణయించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు పర్సనల్ లాలో చేపట్టాల్సిన సంస్కరణల ఆవశ్యకతను వివరిస్తూ... కన్సల్టేషన్ పేపర్ను శుక్రవారం విడుదల చేసింది. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే సామర్థ్యం ఉన్నపుడు... ‘ స్త్రీ పురుష భేదం లేకుండా.. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు కల్పించింది. మరి ఆ వయసులో ప్రభుత్వాన్ని ఎన్నుకునే సామర్థ్యం ఉన్నపుడు జీవిత భాగస్వామిని ఎన్నుకునే సామర్థ్యం ఉన్నట్టేగా. లింగ భేదం లేకుండా అన్ని విషయాల్లో స్త్రీ పురుషులిద్దరికీ హక్కులు కల్పించినపుడే సమానత్వ హక్కు పరిపూర్ణం అవుతుందని’ లా కమిషన్ పేర్కొంది. ‘అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు వివాహ వయస్సుగా నిర్ణయించడం ద్వారా భర్తల కంటే భార్యలు ఎప్పుడూ చిన్న వయస్సులోనే ఉండాలనే భావన బలంగా నాటుకుపోయింది. తద్వారా స్త్రీ, పురుష సమానత్వానికి భంగం కలిగినట్లే కదా’ అని కమిషన్ నివేదించింది. బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నట్లే కదా... సమానత్వ భావన ఆవశ్యకతను వివరిస్తూ...‘ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్- 1954 ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాలి. కానీ ఈ చట్టంలోని 11, 12 సెక్షన్ల ప్రకారం భార్యాభర్తల్లో ఒకరికి వివాహానికి కనీస వయస్సు లేకపోయినా ఆ వివాహం చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. అదే విధంగా గార్డియన్షిప్ చట్టాల ప్రకారం భార్యకు గార్డియన్గా భర్తే ఉండాలి. మరి అటువంటి సమయంలో భర్త మైనర్ అయితే పరిస్థితి ఏంటి?. అలాగే గర్భవిచ్ఛిత్తి చట్టం- 1972లోని సెక్షన్ 3లో.. తప్పని పరిస్థితుల్లో గర్భవిచ్ఛిత్తి చేయవలసి వచ్చినపుడు భార్య మైనర్ అయితే భర్త అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు’ ... ఈ చట్టాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నారా అనే భావన కలుగుతోంది. కాబట్టి వీటన్నింటిలో సవరణలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని లా కమిషన్ పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ఉమ్మడి పౌర స్మృతిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ గుర్తుచేసింది. -
‘ప్రతి హిందువు.. నలుగురు పిల్లల్ని కనాలి’
సాక్షి, ఉడిపి : ప్రతి హిందువు నలుగురు పిల్లలను కనాలంటూ హరిద్వార్ పీఠాధిపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని ఉడిపి క్షేత్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్మ సన్సద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చే వరకు.. ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలని.. హరిద్వార్ పీఠాధిపతి స్వామీ గోవింద్దేవ్ గిరిరాజ్ మహరాజ్ శనివారం పిలుపునిచ్చారు. అలా చేయడం వల్లే జనాభాను సమతుల్యంగా ఉంచడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఇద్దరు పిల్లల విధానం వల్ల హిందువుల జనాభా దేశంలో తగ్గు ముఖం పడుతోందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఇద్దరు పిల్లల విధానాన్ని అందరికీ వర్తింపచేయాలని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడైతే హిందువుల జనాభా తగ్గిందో.. ఆ ప్రాంతాన్ని భారత్ కోల్పోయిందని, ఇందుకు జనాభా అసమతుల్యతే కారణమని ఆయన చెప్పారు. గోవులను రక్షించుకోవడం హిందువుల బాధ్యత అని ఆయన చెప్పారు. అదే సమయంలో గోవుల రక్షణ కోసం శ్రమిస్తున్న గో రక్షక్లను ఆయన కొనియాడారు. నేడు కొంతమంది గో రక్షక్లను నేరస్తులుగా చూస్తున్నారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గో రక్షక్లు అత్యంత శాంతి ప్రియులని చెప్పారు. -
'జల్లికట్టు'.. 'హిందుత్వ'కు చెంపపెట్టు: అసదుద్దీన్
హైదరాబాద్: జల్లికట్టు ఆందోళనల నేపథ్యంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సంప్రదాయ క్రీడపై నిషేధాన్ని ఎత్తేయాలని తమిళులు చేస్తోన్న ఆందోళన హిందూత్వ శక్తులకు చెంపపెట్టు లాంటిదని ఒవైసీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని, రకరకాల జాతులు, మతాలకు చెందినవారు తమతమ సంప్రదాయాలు పాటిస్తారని, అయితే ఈ స్ఫూర్తికి భిన్నంగా హిందుత్వ శక్తులు ఉమ్మడి పౌరస్మృతిని తేవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జల్లికట్టు కోసం తమిళ ప్రజలు చేస్తోన్న ఆందోళన.. ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఎన్నటికీ సాధ్యం కాదనే వాదనకు బలం చేకూర్చుతుందని అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. జల్లికట్టును, దానిని పాటించే తమిళ ప్రజలను పరిగణలోకి తీసుకోకుండా చట్టాలు అమలుచేసినట్లే.. ముస్లింల జీవనవిధానంపైనా బలవంతపు చట్టాలు రుద్దుతున్నారని, ఇలాంటి చర్యలు దేశానికి మంచివి కావని ఒవైసీ వ్యాఖ్యానించారు. జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేయాలని తమిళనాడు వ్యాప్తంగా చేస్తోన్న ఆందోళనలు శుక్రవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. పలు రాజకీయ, సినీ ప్రముఖులు ఆందోళనకు మద్దతు పలుకుతున్నారు. #Jallikattuprotest Lesson for Hindutva forces,Uniform Civil Code cannot be "imposed"this nation cannot have one CULTURE we celebrate all — Asaduddin Owaisi (@asadowaisi) 20 January 2017 చెరఖాను ఎలా తిప్పుతారు? ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతోన్న అసదుద్దీన్.. గురువారం షహరాన్పూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ఖాదీ క్యాలెండర్పై మోదీ ఫొటోను గురించి మాట్లాడుతూ.. 'సాధారణంగా చెరఖాను రెండు చేతులు ఉపయోగించి తిప్పుతారు. కానీ మన మోదీ మాత్రం ఒక్కచేత్తో చెరఖాను తిప్పేస్తున్నారు. ఇదీ.. చెరఖా వాడకంపట్ల అతనికున్న జ్ఞానం! మన అదృష్టం ఏంటంటే.. ఎర్రకోట, తాజ్మహల్లు శతాబ్దాల కిందటే నిర్మాణమయ్యాయి. అవిగానీ నిన్నో, మొన్నో నిర్మించనవైతే, వాటిని కూడా నేనే కట్టానని మోదీ గప్పాలు చెప్పుకునేవారు'అని విమర్శించారు. బీజేపీ, సమాజ్వాదీ పార్టీలు ఒక నాణేనికి రెండు వైపుల లాంటివని, ఇద్దరివీ పేదలు, ముస్లిం వ్యతిరేక విధానాలేనని అన్నారు. -
తలాక్ రద్దుకు వ్యతిరేకం: ఏఐఎంపీఎల్బీ
కోల్కతా: ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌర స్మృతిపై కేంద్రం ప్రతిపాదించిన చర్యలను వ్యతిరేకించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు(ఏఐఎంపీఎల్బీ) నిర్ణయించింది. ఇక్కడ జరుగుతున్న ఏఐఎంపీఎల్బీ మూడు రోజుల సమావేశాల్లో రెండో రోజైన శనివారం ఈ మేరకు తీర్మానించారు. త్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరస్మృతి, ఇతర మత సంబంధ విషయాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ‘త్రిపుల్ తలాక్ కొనసాగింపుపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తరతరాలుగా ఉన్న ఈ సంప్రదాయం ముస్లిం మతహక్కుల్లో భాగమైంది. ఉమ్మడి పౌర స్మృతి అమలును కూడా వ్యతిరేకిస్తున్నాం’ అని ఏఐఎంపీఎల్బీ రిసెప్షన్ కమిటీ చైర్మన్, టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ చెప్పారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఏఐఎంపీఎల్బీ ప్రారంభించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి సుమారు 10 కోట్ల మంది ముస్లిం మహిళలు మద్దతు పలికారు. ముస్లిం యువతను అనవసరంగా వేధించే అజెండాను కేంద్రం చేపట్టిందని సమావేశంలో ముక్తకంఠంతో దుయ్యబట్టారు. ముస్లింలను ప్రభుత్వం జాతి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోందని ఓ సభ్యుడు ఆరోపించారు. ముస్లింల మతహక్కుల్లోకి చొరబడేందుకు బీజీపీ యత్నిస్తోందని దీన్ని ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. -
యూనిఫామ్ సివిల్ కోడ్ జాతీయ ఐక్యతకు ప్రమాదం
మతతత్వ ఎజెండాను బీజేపీ వీడాలి – బహిరంగ సభలో ఎన్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు తాహెరున్నిసా కర్నూలు (ఓల్డ్సిటీ): యూనిఫామ్ సివిల్కోడ్ జాతీయ ఐక్యతకు ప్రమాదకరమని, తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్ (ఎన్డబ్లూ్యఎఫ్) రాష్ట్ర అధ్యక్షురాలు తాహెరున్నిసా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు పాతబస్తీలో ఫ్లెక్సీలు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇస్లామియా జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ముస్లింలపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనిఫామ్ సివిల్కోడ్ పేరుతో ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. మతతత్వ ఎజెండాను తమపై రుద్దితే సహించమని, దాన్ని బీజేపీ వీడాలని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎస్డీపీఐ జాతీయ కార్యదర్శి అబ్దుల్వారిస్, ఎన్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఫాత్ సుల్తానా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
హిందుత్వ అమ్ముల పొదిలో ఉమ్మడి పౌర స్మృతి
అవలోకనం నేడు దేశానికి నేతృత్వం వహిస్తున్న పార్టీ హిందుత్వ అని పిలిచే భావజాలాన్ని కలిగిన పార్టీ. ఆ భావజాలం డిమాండ్లు మూడు. ఒకటి భారత రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం. రెండు అయోధ్యలో రామ జన్మ భూమి ఆలయాన్ని నిర్మించడం. మూడు ఉమ్మడి పౌర స్మృతిని అమలుపరచడం. ఈ మూడు డిమాండ్లూ మైనారిటీ మతస్తులు ఎంతో కొంత వదులుకోవాలని కోరు తున్నవే. కశ్మీర్లో మెజారిటీగా ఉన్న ముస్లింలు రాజ్యాంగబద్ధమైన తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని వదులుకోవాల్సి వస్తుంది. ఆలయానికి వస్తే, ముస్లింలు తమ మసీదును వదులుకోవాల్సి ఉంటుంది. ఇక ఉమ్మడి పౌర స్మృతి కోసం వారు తమ సొంత పౌర స్మృతిని విడనాడాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఈ డిమాండ్లు సానుకూలమైనవి కావనీ, ప్రతికూలాత్మక మైన అధిక సంఖ్యాకవాదం నుంచి పుట్టుకొచ్చినవనీ భావించడం సాధ్యం అవు తోంది. అంటే పైకి కనిపిస్తున్న దానికి భిన్నంగా ఆ మార్పులు సదుద్దేశాలతో కూడినవి కావని అనిపిస్తోంది. హిందుత్వ శక్తులు అయోధ్యలోని మసీదును కూల గొట్టడంతోనే ఆలయ నిర్మాణ ఉద్యమానికి ఏ గతి పట్టిందనేదే ఈ వాదనకు విశ్వ సనీయతను కల్పించింది. ఆలయ ఉద్యమం మరింత ఎక్కువ ప్రతికూలాత్మక మైనది కావడంతో కుప్పకూలింది. అంటే ఆ ఉద్యమం ఆలయ నిర్మాణానికి అనుకూలమైనదిగా కంటే ఎక్కువగా మసీదుకు వ్యతిరేకమైనదని అనిపించింది. అధికరణం 370కి సంబంధించి... జమ్మూకశ్మీర్ను పూర్తిగా విలీనం చేసే విష యంలో న్యాయపరమైన సమస్యలెన్నో ఉన్నాయి. అయినా అధికార భావజాలం అసలు ఉద్దేశమేమిటో నేటి కశ్మీర్ పరిస్థితిలో బహుశా చూచాయిగా గ్రహించ వచ్చు. పాకిస్తాన్లో మన సైనిక చర్యపై అతి జాతీయాభిమాన ప్రదర్శనలోని ప్రస్తుత ఘట్టం కశ్మీర్ ఘటనలను కప్పేసింది. కానీ ఆలస్యంగానైనా అక్కడి పరిస్థితిని ఎలా సంబాళించుకు రావాలనే దానిపై మనం దృష్టి సారించక తప్పదు. ఉమ్మడి శిక్షా స్మృతి డిమాండు ఇప్పుడు ఊపందుకుంటోంది. రెండు దశలుగా అది జరుగుతోంది. అందులో మొదటిది పురుషులు ఆధిపత్యం వహించే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కొనసాగాలని కోరుతున్న మూడు తలాక్ల వ్యతిరేక కార్యా చరణ. మూడుసార్లు తలాక్ అనడమనే ఈ పద్ధతి అతి త్వరితంగా విడాకులు తీసుకోడానికి మగాళ్లను అనుమతించే పద్ధతి. పాకిస్తాన్ సహా చాలా ముస్లిం దేశాలు దీన్ని అనుమతించవు. ప్రభుత్వం దాన్ని చట్ట విరుద్ధమైనదిగా చేయాలని అనుకుంటోంది, కోర్టులు దాని పక్షానే ఉన్నాయి. అదే జరిగితే, పెద్ద సంఖ్యలో అరెస్టులు జరగడాన్ని చూడాల్సి ఉంటుంది. ఇక రెండవది బహు భార్యత్వం సమస్య. హిందుత్వ అసలు ప్రయోజనం అందులోనే ఇమిడి ఉంది. హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ వేగంగా పునరుత్పత్తి చేస్తున్నారని, ఆ కారణంగా ఎప్పుడో ఒకప్పుడు వారు మెజారిటీగా మారిపోతారని అది భావిస్తోంది. నిజానికి బహు భార్యత్వం ముస్లింలలో కంటే హిందువులలోనే ఎక్కువని గణాంక సమా చారం తెలుపుతోంది. కానీ, ఉమ్మడి పౌర స్మృతి డిమాండ్ను ముందుకు నెట్టేంత ప్రబలంగా ఈ భావన హిందుత్వలో వేళ్లూనుకుని ఉంది. చరిత్రకారుడు రామచంద్ర గుహ కొంత కాలం క్రితం... ఉదారవాదులు, వామపక్షవాదులు ఉమ్మడి పౌర స్మృతికి ఎందుకు మద్దతు పలకాలో, బహు భార్యత్వాన్ని ఎందుకు వ్యతిరేకించాలో పేర్కొన్నారు. ఈ హిందుత్వ డిమాండు పట్ల వామపక్షవాదుల వ్యతిరేకతకు కారణం ఈ ఏడు అంశాలలో ఒకటన్నారు: 1. 1950లలో హిందూ పౌర స్మృతికి చేసిన సంస్కరణలు చెప్పుకున్నంత ప్రగతిశీలమైనవేమీ కావు. 2. నేటి హిందువులు రివాజుగా పాటిస్తున్న నియ మాలు, ఆచారాలు తరచుగా ప్రతీఘాతుకమైనవి. ఉదాహరణకు ఖాప్ పంచాయ తీలు. 3. సంస్కరణలు జరగని ముస్లిం పౌర స్మృతిలోని చట్టాలు చెబుతున్నంతగా ప్రతీఘాతుకమైనవి కావు. 4. ముస్లింలు పాటించే ఆచారాలు చెబుతున్నంత చెడ్డవేమీ కావు. కాబట్టే హిందూ బహు భార్యత్వంలో వలే ముస్లింల బహు భార్యత్వం రెండవ లేదా మూడవ భార్య పట్ల వివక్ష చూపదు. 5. ఉమ్మడి పౌర స్మృతి డిమాండు బీజేపీ రాజకీయ ఎజెండాతో ప్రేరేపితమైనది. 6. ఉమ్మడి పౌర స్మృతిని కోరే అధికరణం 44... మత ప్రచార స్వేచ్ఛకు హామీనిచ్చే అధికరణం 25తో ఘర్షిస్తుంది. 7. రాజ్యాంగంలోని ఎన్నో అధికరణాలు పరిపూర్తి కాకుండానే ఉండిపోగా, దీనిపైనే ఎందుకు ఇంత రభస చేస్తున్నారు? గుహ ఒక అంశాన్ని, అదీ ఒక ముఖ్య అంశాన్ని విస్మరించారని నా అభి ప్రాయం. అది, కొందరు ఉదారవాదులు (వ్యక్తుల హక్కుల కోసం ఉద్యమించే వారు) ఈ సంస్కరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది. అది, రెండో భార్యగా లేదా రెండో భర్తగా ఉండటానికి (బహు భర్తృత్వం మన దేశంలో కొన్ని జాతులలో అమలులో ఉంది) స్త్రీకి లేదా పురుషునికి ఉండే హక్కు కాబట్టి. 90 శాతం ముస్లిం మహిళలు బహు భార్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న మాట నిజమే. అయితే 90 శాతం ముస్లిం మహిళలు ఏక పత్నీ వివాహ బంధాలలోనే జీవిస్తున్నారు కూడా. కాబట్టి బహు భార్యత్వ వివాహ బంధంలో ఉన్నవారు ఈ ఆచారాన్ని ఎలా చూస్తున్నారనే అంశంపై జరిపే అధ్యయనం ఆసక్తికరంగా ఉంటుంది. గుహ, బహు భార్యత్వం ‘‘హేయమైనది,’’ తప్పక ‘‘నిషేధించాల్సినది’’ అంటున్నారు. ఇది నైతికపరమైన తీర్పని నా అభిప్రాయం. స్వలింగ సంపర్కం గురించి భారత చట్టం, వరుసగా వచ్చిన వివిధ ప్రభుత్వాలు అదే విషయాన్ని చెబుతూ వచ్చాయి. కానీ ఉదారవాదులు ఈ సందర్భంలో కూడా వ్యక్తి స్వతంత్రా నికి మద్దతుగా నిలుస్తారు. ఇదంతా చెప్పిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం... ప్రస్తుతం ఈ సమస్యపైకి హిందుత్వ దృష్టి కేంద్రీకరణ మరలింది. ఇక తదుపరి హిందుత్వ తన పునాదిని పటిష్టం చేసుకోడానికి బరిలోకి దిగేది మూడు తలాక్లు, బహు భార్యత్వాలపైనే అని నా అంచనా. గతంలో ఇలా జరిగిన ఇతర సమస్య ల్లాగే ఈ విషయంలోనూ మనం సమస్య తలెత్తనున్నదనే ముందు చూపుతో ఉండాలి. వ్యాసకర్త: ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
మోదీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టిస్తున్నారు
-
మోదీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టిస్తున్నారు
ఉమ్మడి పౌరస్మృతిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు మండిపాటు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై దేశంలోని అత్యున్నత ముస్లిం సంస్థ ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భగ్గుమంది. ఇస్లామిక్ చట్టాన్ని రద్దుచేసి.. ఆ స్థానంలో ఉమ్మడి పౌరస్మృతిని తేవడానికి, దేశంలోని విభిన్న సంస్కృతులను ధ్వంసం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విరుచుకుపడింది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ప్రశ్నావళిని లాబోర్డ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దేశంలోని బహుళ సంస్కృతిని ప్రభుత్వం గౌరవించాలని సూచించింది. 'మోదీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ముస్లింలదరూ దీనిపై పెద్దసంఖ్యలో స్పందిస్తారు. భారత్లో ఒకే భావజాలాన్ని రుద్దలేరు' అని ముస్లిం లా బోర్డు పేర్కొంది. ముస్లిం ప్రజల్లోని ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం వంటి సంప్రదాయాలను తాము వ్యతిరేకిస్తున్నామని, రాజ్యాంగం మౌలిక లక్షణమైన లింగ సమనత్వం విషయంలో ఎలాంటి సంప్రదింపులకు తావులేదని సుప్రీంకోర్టుకు గతవారం కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ చట్టమైన షరియా ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వొచ్చు. అంతేకాకుండా ముస్లిం వ్యక్తి నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. అయితే, ఈ విధానాలు స్త్రీల పట్ల వివక్ష చూపడమేనని ముస్లిం మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదాస్పద అంశాలపై తొలిసారి కేంద్రం తన వైఖరిని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే దేశమంతటా ఒకే చట్టబద్ధమైన విధానం ఉండేలా ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ ప్రశ్నావళిని రూపొందించిదన్న వార్తలపై ముస్లిం లా బోర్డ్ భగ్గుమంటోంది. త్రిపుల్ తలాక్ ఉండాల్సిందేనని, ఉమ్మడి పౌరస్మృతి ప్రమాదకరమని పేర్కొంటున్నది. -
ఏకరూపతతో దేశాభివృద్ధికి విఘాతం : రాష్ట్రపతి ప్రణబ్
డార్జిలింగ్ : ఏకరూపత దేశాభివృద్ధికి విఘాతం కాగలదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తెచ్చే అంశంపై చర్చ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నేపాలీ కవి భానుభక్త ఆచార్య 202వ జయంత్యుత్సవంలో ఆయన ప్రసంగించారు. దేశంలో ఏకరూపత తెచ్చేందుకు ప్రయత్నిస్తే అది మన సామాజికాభివృద్ధికి పెనువిఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలం అన్నారు. నేపాల్తో భారత్కు సత్సంబందాలున్నాని చెప్పారు. భానుభక్త నేపాలీలో రచించినప్పటికీ, ఆయన సందేశం మొత్తం మానవాళికి వర్తిస్తుందన్నారు. -
‘చాలా చట్టాల్లో ఉమ్మడి పౌర స్మృతి’
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసే అంశంపై వాడివేడిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. చాలా చట్టాల్లో ఏకరూప పౌర స్మృతి ఉందని, అయితే మతంతో దానికి సంబంధం లేదని న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ బి.ఎస్.చౌహాన్ పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతి అమలు అంశాన్ని పరిశీలించాలని మోదీ సర్కారు ఇటీవల న్యాయ కమిషన్కు సూచించింది. జస్టిస్ చౌహాన్ దీనిపై స్పందిస్తూ.. ‘ఐపీసీ, సీఆర్పీసీ, సాక్ష్యాల చట్టం, యూపీ జమీందారీ రద్దు వంటి చాలాచట్టాలు మతంతో నిమిత్తం లేకుండా అందరికీ ఒకేలా వర్తిస్తాయి. వీటిని ఏళ్ల తరబడి అమలు చేస్తున్నా ఎవరూ అభ్యంతరం చెప్పలేద’న్నారు. -
నలుగురు భర్తలు ఎందుకు ఉండకూడదు?
‘ముస్లిం పర్సనల్ లా’ను మార్చాలన్న కేరళ జడ్జి కోజికోడ్: ‘ముస్లిం పురుషుడికి నలుగురు భార్యలు ఉండవచ్చని చెప్పినప్పుడు.. మహిళలకు ఎందుకు నలుగురు భర్తలు ఉండకూడదు?’ అంటూ కేరళ హైకోర్టు జడ్జి బి.కెమల్ పాషా కోజికోడ్లో ఆదివారం జరిగిన ముస్లిం మహిళా సమాఖ్య సభలో ప్రశ్నించారు. అర్థవంత జీవితం గడిపేందుకు పురుషుడికైనా, మహిళకైనా ఒక భాగస్వామి చాలన్నారు. క ట్నం, విడాకులు వంటి అంశాల్లో మహిళలపై ముస్లిం పర్సనల్ లా వివక్ష చూపుతుందని, ఖురాన్ చెపుతున్న దానికి అవి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించడంలో వివక్ష సృష్టించిన మతనేతలు భయపడకూడదని, పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని అన్నారు. ముస్లిం మహిళలు విడాకులు పొందేందుకు ఖురాన్లోని ‘ఫసఖ్’ హక్కు కల్పిస్తున్నా... ‘లా’ ఆ హక్కు కల్పించడం లేదన్నారు. అన్ని న్యాయసూత్రాలు రాజ్యాంగంలోని సమానత్వం, గౌరవంగా జీవించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 14, 21కు లోబడి ఉండాల్సిందేనని తెలిపారు. ప్రస్తుత న్యాయం ఖురాన్కు అనుగుణంగా లేదని, పర్సనల్ లాలో మార్పులు రావాలన్నారు. -
ఉమ్మడి పౌరస్మృతిపై వైఖరేంటి?
కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తేవాలనుకుంటున్నారా? లేదా? ఈ అంశంపై మీ వైఖరేమిటో చెప్పండని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని నిలదీసింది. విడాకుల చట్టాన్ని సవరించే ప్రతిపాదనతో మూడువారాల్లో తమ ముందుకు రావాలని, ఆలోగా ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్రప్రభుత్వ వైఖరినీ కూడా స్పష్టంగా తమకు చెప్పాలని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన అల్బర్ట్ ఆంథోనీ విడాకుల చట్టం 10ఏ లోని సెక్షన్ (1)ను ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సవాల్ చేశారు. ఇతర మతస్తులైతే... దంపతులిద్దరూ ఏడాదిపాటు విడిగా ఉన్నాక విడాకులు కోరవచ్చని ఈ చట్టం చెబుతోందని, అదే క్రైస్తవులైతే దంపతులు రెండేళ్లు ఒకరికొకరు దూరంగా ఉన్నాకే విడాకులు కోరడానికి వీలు కల్పిస్తోందని ఆంథోనీ అభ్యంతరం లేవనెత్తారు. ఇది క్రైస్తవుల పట్ల వివక్ష చూపడమేనన్నారు. జులైలో ఈ పిటిషన్ దాఖలు కాగా... సమాధానం ఇవ్వాలని న్యాయశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. అలాగే ‘10ఏ’లోని సెక్షన్ (1)కు సవరణ తెచ్చే అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ పిటిషన్ మంగళవారం మళ్లీ విచారణకు రాగా.. ‘అంతా గందరగోళంగా ఉంది. ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి పెట్టాల్సిందే. ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తేవాలనుకుంటే... తెచ్చి అమలులో పెట్టండి. ఈ దిశగా చర్యలెందుకు లేవు’ అని జస్టిస్ విక్రమ్జిత్ సేన్, జస్టిస్ శివకీర్తి సింగ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు కేంద్రానికి మూడు వారాల సమయమిస్తూ పిటిషన్ను వాయిదా వేసింది. ఉమ్మడి పౌరస్మృతి అవసరమే.. కానీ.. ‘జాతి సమైక్యతకు ఉమ్మడి పౌరస్మృతి అవసరమే. అయితే దీన్ని తీసుకొచ్చే అంశంపై విస్తృత సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకోవాలి’ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారమిక్కడ అన్నారు. రాజ్యాంగ ప్రవేశిక, 44వ అధికరణలు కూడా దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని చెబుతున్నాయని పేర్కొన్నారు. -
ఓ రామ మందిరం... 100 స్మార్ట్ సిటీలు
-
ఓ రామ మందిరం... 100 స్మార్ట్ సిటీలు
* బీజేపీ మేనిఫెస్టో విడుదల * అభివృద్ధి మంత్రంతోపాటు హిందుత్వ జపం * విధాన పక్షవాతాన్ని, పన్ను ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం * ఉమ్మడి పౌరస్మృతిని తెస్తాం.. ఆర్టికల్ 370ని తొలగిస్తాం * ‘రిటైల్’లో మినహా అన్ని రంగాల్లో ఎఫ్డీఐని ఆహ్వానిస్తాం * చవకైన సార్వజనీన జాతీయ ఆరోగ్య హామీ మిషన్ తెస్తాం * నల్లధనం వెనక్కు తేవటానికి టాస్క్ఫోర్సు ఏర్పాటుచేస్తాం * దేశమంతా ‘ఈ-గ్రామ్, విశ్వ గ్రామ్’ పథకం అమలుచేస్తాం * ‘అణు’ విధానాన్ని సమీక్షించి.. అనుగుణంగా సవరిస్తాం * లోక్సభ తొలి దశ ఎన్నికల రోజున మేనిఫెస్టో సాక్షి, న్యూఢిల్లీ: విధాన పక్షవాతాన్ని, అవినీతిని, పన్ను ఉగ్రవాదాన్ని రూపుమాపి.. సుపరిపాలన, అభివృద్ధిని అందిస్తామంటూనే.. రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావటం, ఆర్టికల్ 370 తొలగింపు వంటి తమ మూల ఎజెండానూ ప్రతిపక్ష బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 100 కొత్త స్మార్ట్ నగరాల ఏర్పాటు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ఒక్కటే జాతీయ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతానికి పెంచటం వంటి పలు హామీలను ఈ ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. యూపీఏ పాలనలో దేశం దశాబ్ద కాలం పాటు లోపభూయిష్ట పరిపాలనకు గురైందని, నిర్ణయాలు, విధానాలు మంచమెక్కాయని ఈ మేనిఫెస్టో విమర్శించింది. ఈ పరిస్థితిని మారుస్తామని, ప్రభుత్వమనే ఇంజిన్ను బలమైన సంకల్ప బలంతో, ప్రజా ప్రయోజనాలకు కట్టుబాటుతో నడిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పారదర్శకమైన, సమర్థవంతమైన, భాగస్వామ్యయుతమైన, ప్రోత్సాహకరమైన సుపరిపాలనను అందిస్తామని.. పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు, ఎన్నికల సంస్కరణలను తీసుకువస్తామని పేర్కొంది. ప్రజలను చైతన్యం చేయటం, ఈ-పరిపాలన వంటి చర్యలతో అవినీతికి అవకాశాలు లేని వ్యవస్థను నెలకొల్పుతామని చెప్పింది. ఆర్థిక పునరుద్ధరణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి మార్గదర్శక పత్రమంటూ.. బీజేపీ 42 పేజీలతో కూడిన తన ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించింది. దాదాపు వారం రోజుల కిందటే జరగాల్సిన బీజేపీ మేనిఫెస్టో విడుదల.. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ రోజు వరకూ వాయిదా పడటానికి కారణం.. హిందుత్వ అంశాలను చేర్చే విషయమై పార్టీ అగ్రనేతల మధ్య భిన్నాభిప్రాయాలేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మురళీ మనోహర్జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి అమెరికా వరకు లక్ష కన్నా ఎక్కువ సూచనలు అందాయని.. దేశంలోని అన్ని వర్గాల వారి నుంచి సమాచారాన్ని తీసుకుని మేనిఫెస్టోలో పొందుపరిచామని జోషి చెప్పారు. అమృత్సర్లో నామినేషన్ దాఖలు చేయడం వల్ల సీనియర్ నేత అరుణ్జైట్లీ, ఎన్నికల ప్రచారాల్లో ఉండటం వల్ల మాజీ అధ్యక్షులు ఎం.వెంకయ్యనాయుడు, నితిన్గడ్కారీలు రాలేకపోయారని వివరించారు. సీమాంధ్రకు పూర్తి న్యాయం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు పూర్తి న్యాయం చేస్తామని, సీమాంధ్రతో పాటు తెలంగాణలో అభివృద్ధి, పాలన సమస్యల పరిష్కారానికి బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీమాంధ్రకు పూర్తి న్యాయం చేయడానికి నిబద్ధతతో ఉన్నాం. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను అభివృద్ధి చేయడం, పాలనకు సంబంధించిన అన్ని అంశాలకు పరిష్కారాన్ని చూపిస్తాం’ అని పేర్కొంది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ... * అణు విధానాన్ని సమీక్షించటం, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించటం * అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణానికి రాజ్యాంగ పరిధిలో గల అన్ని అవకాశాలనూ పరిశీలించటం * లింగ సమానత్వం కోసం ఏకీకృత పౌర స్మృతితేవటం. * జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణ తొలగించటం * ఉద్యోగాలను సృష్టించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు.. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో మినహా అన్ని రంగాల్లోనూ ఆహ్వానం * పెట్టుబడిదారులను ఆకర్షించటానికి పన్ను విధానంలో సంస్కరణలపై దృష్టి, జాతీయ సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ) తేవటం. * సార్వజనీనమైన అందుబాటులో ఉన్న, చవకౌన, సమర్థవంతమై న ఆరోగ్య సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య హామీ మిషన్ * ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా సంస్థను నెలకొల్పటం * నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటం కోసం టాస్క్ ఫోర్సు * ప్రధాని సహా ముఖ్యమంత్రులు, ఇతర అధికారులను టీం ఇండియాలో భాగస్వాములను చేస్తాం * అత్యంత వెనకబడిన 100 జిల్లాల్లో సమీకృత అభివృద్ధి * దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యే సరికి.. దేశంలో ప్రతి కుటుంబానికీ తక్కువ ధరతో పక్కా ఇల్లు నిర్మాణం * గ్రామీణ పునరుద్ధరణకు పూర్తిస్థాయి కార్యక్రమం. గ్రామీణ ఉపాధి పథకాలను సంపద సృష్టికి అనుసంధానించటం * గుజరాత్లో అమలుచేస్తున్న ‘ఈ-గ్రామ్, విశ్వ గ్రామ్’ పథకాన్ని దేశమంతా అమలుచేయటం. * ప్రతి గ్రామానికీ నీరు, ప్రతి పొలానికీ నీరు దేశాన్ని గట్టెక్కించే మార్గదర్శి: మోడీ ‘‘దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మా పార్టీ మేనిఫెస్టో ప్రతిబింబిస్తోంది. సుపరిపాలన, అభివృద్ధితో పాటు కేంద్రంలో బలమైన ప్రభుత్వం అన్నదే మా ప్రాధాన్యం. మాకు 60 నెలలు అధికారం ఇవ్వండి. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అంతటా నిరాశావాదం నిండివుంది. ఈ పరిస్థితిని బాగుచేసేందుకు దిశ, లక్ష్యం, నిబద్ధతను మా మేనిఫెస్టో వివరిస్తోంది. పేదలు, అణగారినవారి అవసరాలను తీర్చే ప్రధాన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మా లక్ష్యం ఒక భారత్.. ఉన్నత భారత్. అందరినీ కలుపుకు పోవడం - అందరినీ అభివృద్ధి చేయడం. ఈ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. పార్టీ నాపై ఒక బాధ్యతను ఉంచింది. నేను వ్యక్తిగతంగా మూడు హామీలు ఇవ్వాలనుకుంటున్నా. నేను కష్టపడి పనిచేయటంలో ఎన్నడూ లోటు కనిపించదు. నా కోసం ఎప్పుడూ ఏదీ చేయను. దురుద్దేశంతో ఎన్నడూ ఏ పనీ చేయను.’’ దోషాలు లేని మేనిఫెస్టో: అద్వానీ ‘‘ఇది వెతికినా లోపాలు దొరకని మేనిఫెస్టో. 1952 నుంచి ఎన్నికలను చూస్తున్నా. ఈ 16వ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరణ, ప్రచార స్వరూపం, పార్టీ భూమిక అపూర్వం. అప్పటి రాజకీయాలు వేరు. ఇప్పుడు మోడీ నేతృత్వంలో రాజకీయాలు చూస్తే అనందానుభూతి కలుగుతోంది. పార్టీ ప్రధాని అభ్యర్ధి ప్రకటన తరువాత జరిగిన ప్రచారం గత ఎన్నికల్లో ఎప్పుడూ జరగలేదు. అధికార బాధ్యత ఇస్తే రానున్న ఐదేళ్లలో దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించి చూపిస్తాం.’’ హామీలన్నీ నెరవేరుస్తాం: రాజ్నాథ్ ‘‘మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక మేనిఫెస్టోలోని అంశాలే కాకుండా దేశంలోని సమస్యలు, సవాళ్లను పరిష్కరిస్తాం. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే దేశం విశ్వశక్తిగా ఎదిగేది. దేశంలో సమగ్ర సమీకృత అభివృద్ధి జరగాలి.’’ దేశాన్ని పరుగెత్తిస్తాం: సుష్మాస్వరాజ్ ‘‘దేశాన్ని వర్తమాన స్థితి నుంచి గట్టెక్కించేందుకు ఒక మార్గాన్ని చూపించే పత్రం ఈ మేనిఫెస్టో. దేశంలో పాలన స్థంభించిపోయింది. అధికారంలోకి వచ్చాక స్థంభించిన ప్రభుత్వాన్ని నిల్చొబెడతాం. నడిపిస్తాం. కొద్ది రోజుల్లో పరుగెత్తిస్తాం.’’