Volatile Session
-
ఓలటైల్ సెషన్: లాభాల్లోనే సూచీలు
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ లాభాలనను కోల్పోయాయి. తీవ్ర ఓలటాలిటీ మధ్యసెన్సెక్స్ 145 పాయింట్లు ఎగిసి 57291 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 17048 వద్ద కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, పవర్ గగ్రిడ్, ఇండస్ ఇండ్, డా.రెడ్డీస్ లాభపడుతుండగా, హీరో మోటో కార్ప్, టాటా స్టీల్, టైటన్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్ భారీగా నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 29 పైసలు కుప్పకూలి 81.38 వద్ద కొనసాగుతోంది. సోమవారం డాలర్తో పోలిస్తే 81.66 కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి, చివరకు 63 పైసల నష్టంతో 81.62 దగ్గర క్లోజయిన సంగతి తెలిసిందే. -
ఆఖరి గంటలో అమ్మకాలు, హై నుంచి 800 పాయింట్లు పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.ఆరంభం లాభాలనుంచి మిడ్ సెషన్ తరువాత మరింత ఎగిసినప్పటికీ, ఆ తరువాత ఒక్కసారిగా అమ్మకాల వెల్లువ కురిసింది. ఫలితంగా డే హైనుంచి సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైన కుప్పకూలింది. చివర్లో కాస్త పుంజుకుని సెన్సెక్స్ 310 పాయింట్ల పతనమై 58774 వద్ద,నిఫ్టీ83 పాయింట్లు క్షీణించి 17522 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాల నష్టాలు ప్రభావితం చేశాయి. ఇండస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, కోటక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, అదానీ, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, సిప్లా, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్గా నిలిచాయి. శ్రీ సిమెంట్, దివీస్, హిందాల్కో, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. -
రోజంతా అలజడి: చివరికి లాభాల ముగింపు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మొత్తానికి లాభాల్లో ముగిసాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఒడిదుడుకులనెదుర్కొన్న సూచీలు చివరకు పాజిటివ్గా ముగిసాయి.సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 59085 వద్ద, నిఫ్టీ 27పాయింట్ల లాభంతో 17604 వద్ద స్థిరపడ్డాయి.తద్వారా కీలక మద్దతు స్థాయిల వద్ద బలంగా నిలబడటం విశేషం. అపోలో హాస్పిటల్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గ్రాసిం, లాభపడగా, టాటా స్టీల్, బీపీసీఎల్, దివీస్, టైటన్, ఐటీసీ నష్టపోయాయి. మరోవైపుడాలరు బలహీనత నేపథ్యంలో రూపాయి 8పైసలు ఎగిసి 79.80 వద్ద ముగిసింది. -
కొనసాగుతున్న వోలటాలిటీ, ఆదుకుంటున్న బ్యాంకులు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 60 పాయింట్ల లా భపడగా,నిఫ్టీ 20 పాయింట్లు ఎ గిసి 17597వద్ద ట్రేడ్ అయ్యాయి. అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. లాభనష్టాల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 50, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయాయి. ఐటీసీ, అపోలో హాస్పిటల్ సిప్లా,విప్రో, ఇండస్ బ్యాంక్ లాప్ విన్నర్స్గా కొనసాగుతున్నాయి. సెభారతి ఎయిర్టెల్, దివీస్, మారుతి గగ్రాసిం, టైటన్, రిలయన్స్ యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్షీణించాయి. -
రోజంతా ఊగిసలాడినా, చివరికి మద్దతు స్థాయిలపైకి
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాలకుపరిమితమైనాయి. వరుస లాభాలు, హై స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు ఆరంభంలో దాదాపు 300పాయింట్లు కుప్పకూలాయి. రోజంతా నష్టాలతో ఊగిసలాడాయి. కానీ చివరికి సెన్సెక్స్ 58 పాయింట్లు ఎగిసి 60298 వద్ద,నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17956 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 60వేల దిగువకు,నిఫ్టీ 17900ఎగువన ముగియం విశేషం. బ్యాంకింగ్, పవర్ రియాల్టీ షేర్ల లాభాలకుమార్కెట్లకుబలాన్నిచ్చాయి. మరోవైపు డాలరుమారకరంలో రూపాయి 22 పాయింట్లు నష్టంతో 79.67 వద్ద ముగిసింది. -
మార్కెట్ క్యాప్ ఢమాల్: బిలియన్ డాలర్ కంపెనీలు ఔట్
కొద్ది రోజులుగా గ్లోబల్ ట్రెండ్కు అనుగుణంగా దేశీ స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి తదుపరి ధరలు ఊపందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు బలపడుతున్నాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన లిక్విడిటీ విధానాలకు తెరతీయడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో దేశీయంగానూ పలు స్టాక్స్ బేర్మంటున్నాయి. 2021 అక్టోబర్లో చరిత్రాత్మక గరిష్టాలను తాకిన స్టాక్ మార్కెట్లు డీలా పడటంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు నేలచూపులకు పరిమితమవుతున్నాయి. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు చిల్లు పడుతోంది. రికార్డ్ స్థాయి నుంచి.. గతేడాది అక్టోబర్లో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 62,245 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో బిలియన్ డాలర్ల(అప్పట్లో సుమారు రూ. 7,500 కోట్లు) మార్కెట్ విలువను అందుకున్న కంపెనీలు 400కుపైగా నమోదయ్యాయి. అయితే తదుపరి ద్రవ్యోల్బణం ధాటికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్సహా, ఆర్బీఐవరకూ వడ్డీ రేట్ల పెంపు బాటను పట్టడంతో ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. దీనికితోడు రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం ముడిచమురు ధరలకు రెక్కలిచ్చింది. ఫలితంగా డాలరు భారీగా బలపడితే.. రూపాయి పతన బాట పట్టింది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో నిరవధిక అమ్మకాలు చేపడుతుండటంతో మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 53,235 పాయింట్ల స్థాయికి తిరోగమించింది. దీంతో లిస్టెడ్ కంపెనీల విలువలూ నీరసించాయి. గత 9 నెలల్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో 660 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52 లక్షల కోట్లు) ఆవిరైందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు! ప్రస్తుతం బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,45,23,834 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మధ్య, చిన్నతరహా కంపెనీలకు అమ్మకాల సెగ తగులుతోంది!! విలువల నేలచూపు మార్కెట్లతోపాటు ఇటీవల షేర్ల ధరలు సైతం కుదేలవుతున్నాయి. ఇది చాలదన్నట్లు మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 79కు చేరింది. ఫలితంగా బిలియన్ డాలర్ల(రూ. 7,900 కోట్లు) జాబితాకు రెండు వైపులా దెబ్బతగులుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. షేర్ల ధరలు తగ్గడానికితోడు రూపాయి విలువ నీరసించడంతో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ జాబితాలో కంపెనీల సంఖ్య క్షీణించింది. దీంతో వీటి సంఖ్య తాజాగా సుమారు 340కు చేరింది. జాబితాలో వీక్ గత 9 నెలల్లో కొన్ని కంపెనీల షేర్లు పతన బాటలో సాగాయి. దీంతో వీటి విలువకు భారీగా చిల్లు పడింది. ఈ జాబితాలో మణప్పురం ఫైనాన్స్, వెల్స్పన్ ఇండియా, హెచ్ఈజీ, నజారా టెక్నాలజీస్, జెన్సార్, లక్స్ ఇండస్ట్రీస్, ఆర్బీఎల్ బ్యాంక్, దిలీప్ బిల్డ్కాన్ 70–50 శాతం మధ్య కుప్పకూలాయి. ఈ బాటలో లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, మెట్రోపోలిస్ హెల్త్కేర్, ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్, ఇండిగో పెయింట్స్, వైభవ్ గ్లోబల్, ఇండియాబుల్స్ హౌసింగ్ తదితరాలు సైతం అత్యధికంగా క్షీణించాయి. ఇవన్నీ బిలియన్ డాలర్ విలువను కోల్పోవడం గమనార్హం! ఈ కాలంలో బీఎస్ఈలోని 1,100 షేర్లను పరిగణిస్తే 75 శాతంవరకూ నష్టాల బాటలోనే సాగాయి! లాభపడ్డవీ ఉన్నాయ్ కొద్ది రోజులుగా మార్కెట్లు డీలా పడినప్పటికీ జోరందుకున్న కంపెనీలూ ఉన్నాయి. దీంతో ఇదే కాలంలో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న జాబితాలో ఆటో, ఇండస్ట్రియల్ విడిభాగాల కంపెనీ ఎల్జీ ఎక్విప్మెంట్స్తోపాటు, శ్రీ రేణుకా షుగర్స్, జీఎన్ఎఫ్సీ, ఈజీ ట్రిప్ ప్లానర్స్, సుందరం క్లేటాన్, ఆర్హెచ్ఐ మెగ్నీసిటా, బోరోసిల్ రెనెవబుల్స్ చోటు సాధించాయి. ఈ షేర్లు 20–70 శాతం మధ్య జంప్చేయడం ఇందుకు సహకరించింది. -
లాభనష్టాల మధ్య మార్కెట్ ఊగిసలాట
ముంబై : క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు, వరుసగా వెలువడుతున్న క్యూ త్రీ ఫలితాల నడుమ స్టాక్ మార్కెట్లో అస్థిరత నెలకొంది. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా అమ్మకాలు, కొనుగోళ్లకు పాల్పడుతుండటంతో క్షణక్షణానికి లాభనష్టాల మధ్య మార్కెట్ ఊగిసలాడుతుంది. ప్రతీ పది నిమిషాలకు మార్కెట్లో పరిస్థితి తారుమారు అవుతోంది. అస్థిరంగా ఉన్న మార్కెట్లో ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉదయం 9:40 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 60,644 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 18,054 దగ్గర కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, విప్రో, ఇండస్ఇండ్బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, శ్రీసిమెంట్ షేర్లు నష్టపోగా ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. -
భారీ ఒడిదుడుకులు : 850 పాయింట్లు రికవరీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు చివరకు ఫ్లాట్గా ముగిసింది. రోజంతా కొనసాగిన తీవ్ర ఒడిదుడుకులు సామాన్య ట్రేడర్లను అయోమయంలో పడేశాయి. ఒక దశలో 600 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్ వెంటనే తేరుకుంది. చివరి గంటలో 120 పాయింట్ల మేర లాభపడింది.అంటేడే కనిష్టంనుంచి దాదాపు 850 పాయింట్లు మేర పుంజుకుంది. కానీ వారాంతంలో ఇన్వెస్టర్ల అమ్మకాలతో చివరికి సెన్సెక్స్ 21 పాయింట్ల లాభానికి పరిమితం కాగా, నిఫ్టీ 8 పాయింట్లు నష్టంతో ముగిసింది. ఎఫ్ఎంసీజీ తప్ప దాదాపు అన్నిరంగాల షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. ప్రధానంగా ఐటీ, మీడియా, ఫార్మా ,మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా సెన్సెక్స్ 52350కి దిగువన, నిఫ్టీ 15700కి దిగువన ముగిసింది. ఓఎన్జిసి, కోల్ ఇండియా, ఎన్టిపిసి, యుపిఎల్, జెఎస్డబ్ల్యు స్టీల్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అదానీ పోర్ట్స్ 7 శాతం లాభపడి టాప్ విన్నర్గా ఉంది. ఇంకా హెచ్యుఎల్,బజాజ్ ఆటో, భారతి ఎయిర్టెల్ మరియు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. డాలరుమారకంలో భారత రూపాయి ఇంట్రాడే నష్టాలనుంచి తేరుకుని డాలర్కు 22 పైసలు ఎగిసి 73.86 వద్ద ముగిసింది. గురువారం నాటి ముగింపు 74.08 తో పోలిస్తే శుక్రవారం 74.10 వద్ద ఫ్లాట్ ప్రారంభమైంది. -
తీవ్ర ఒడుదుడుకుల్లో సూచీలు
సాక్షి, ముంబై: ఆరంభంలో నష్టాల్లో ఉన్న మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో 250 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా ఎగిసింది. అలాగే నిఫ్టీ 14350 దిగువకు చేరింది. ఆ తరువాత మళ్లీ పుంజుకున్నప్పటిక భారీ ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. సెన్సెక్స్ 43పాయింట్ల ఫ్టీ మాత్రం 17 పాయింట్లు మైనస్లో ఉంది. అయితే సూచీలకు మద్దతు స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఆటో స్టాక్స్ కూడాలాభాల్లో ట్రేడవుతుండగా, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ స్టాక్స్ నష్టపోతున్నాయి. పవర్ గ్రిడ్ టాప్ నిఫ్టీ గెయినర్గా ఉంది. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ , ఎన్టిపిసి లాభపడుతుండగా, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్డిఎఫ్సి, నెస్లే ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుపిఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, విప్రో, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్ నష్టపోతున్నాయి. -
ఊగిసలాట: లాభాల్లోకి సూచీలు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో వరుసగా మూడో సెషన్లో కూడా నష్టపోయింది. అటు నిఫ్టీ 15100 దిగువకు చేరింది. అయితే ఆరంభంలో 260 పాయింట్లకుపైగా కుప్పకూలిన సెన్సెక్స్ ఆ తరువాత భారీగా పుంజుకుని లాభాల్లోకి మళ్లింది. లాభనష్టాల మధ్య కదలాడుతున్నసెన్సెక్స్ సెన్సెక్స్ 66 పాయింట్ల ఎగిసి 51385 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో ఫ్లాట్గా ట్రేడవుతోంది. మెటల్స్, ఆటో కౌంటర్లకు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండగా, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ కౌంటర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్గ్రిడ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, హీరోమోటోకార్ప్, ఐషర్ మోటార్స్ నష్టపోతున్నాయి. మరోవైపు టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, గెయిల్, బజాజ్ ఫైనాన్స్లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్గా ఉన్నాయి. గెయిల్, యూపీఎల్ ,హెచ్యూఎల్ , అదాని పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభపడుతున్నాయి. -
లాభనష్టాల ఊగిసలాట : నష్టాల్లో మార్కెట్
సాక్షి, ముంబై: వరుస భారీ లాభాల అనంతరం దేశీయ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల సెగతో నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి పుంజుకున్నా..మళ్లీ అదే ధోరణి. ఇలా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు క్షీణించి 51127 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్ల నష్టంత 15053 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా అమ్మకాల ఒత్తిడితోభారీగా నష్టపోతోంది. టాటా స్టీల్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, గ్రాసీం, హెచ్డీఎఫ్సీ లైఫ్, గెయిల్ లాభాల్లోనూ, అదాని పోర్ట్స్ యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ నష్టంతోనూ ట్రేడ్ అవుతున్నాయి. -
కన్సాలిడేషన్లో- మళ్లీ ఐటీ జోరు
ముంబై, సాక్షి: స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 72 పాయింట్లు పెరిగి 46,079కు చేరగా.. నిఫ్టీ 18 పాయింట్లు బలపడి 13,484 వద్ద ట్రేడవుతోంది. సోమవారం నమోదైన భారీ పతనం నుంచి మార్కెట్లు తిరిగి మంగళవారం కోలుకున్న సంగతి తెలిసిందే. కాగా.. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో మంగళవారం యూఎస్ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 46,191- 45,899 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,517-13,432 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. ప్రయివేట్ బ్యాంక్స్ డౌన్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ, రియల్టీ రంగాలు 1.5 శాతం చొప్పున పుంజుకోగా.. మెటల్ 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, మారుతీ, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, నెస్లే, టీసీఎస్, టైటన్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఓఎన్జీసీ, దివీస్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐవోసీ, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్, ఐసీఐసీఐ 1.6-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్లస్ డెరివేటివ్ స్టాక్స్లో గోద్రెజ్ ప్రాపర్టీస్, పిరమల్, జూబిలెంట్ ఫుడ్, ఎస్కార్ట్స్, పిడిలైట్, అశోక్ లేలాండ్, అపోలో హాస్పిటల్స్, మెక్డోవెల్, మ్యాక్స్ ఫైనాన్స్, టాటా పవర్ 4-1.4 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. పీఎన్బీ, అంబుజా, ఎన్ఎండీసీ, ఇండస్ టవర్, ఏసీసీ, జీ, ఐజీఎల్, జిందాల్ స్టీల్ 3-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,428 లాభపడగా.. 487 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,153 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 662 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
లాభాలతో మొదలై పతన బాటలోకి..
ముంబై, సాక్షి: ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకుని స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే వెనువెంటనే మళ్లీ అమ్మకాలు తలెత్తడంతో నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 396 పాయింట్లు పతనమై 45,158కు చేరగా.. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 13,197 వద్ద ట్రేడవుతోంది. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా సోమవారం సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 45,938- 45,141 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,447-13,194 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. (మార్కెట్లను ముంచిన కరోనా సునామీ) ఐటీ మాత్రమే ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, ఫార్మా 3- 1 శాతం మధ్య నీరసించాయి. ఐటీ మాత్రమే(0.2 శాతం) ఎదురీదుతోంది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఆర్ఐఎల్, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, బీపీసీఎల్, ఐటీసీ 3.3-2.3 శాతం మధ్య డీలాపడ్డాయి. బ్లూచిప్స్లో కేవలం హెచ్సీఎల్ టెక్, దివీస్, టీసీఎస్, పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ 0.5-0.2 శాతం మధ్య బలపడ్డాయి. నేలచూపులో డెరివేటి స్టాక్స్లో పీవీఆర్, భెల్, పీఎన్బీ, ఐబీ హౌసింగ్, జీ, బీఈఎల్, ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, ఎస్కార్ట్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 8.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క బంధన్ బ్యాంక్, మైండ్ట్రీ, ఐజీఎల్ మాత్రమే అదికూడా 1-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,928 నష్టపోగా.. 321 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల వెనకడుగు నగదు విభాగంలో ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్నవిదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) సోమవారం దాదాపు రూ. 324 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,425 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నేలచూపులతో- మెటల్, రియల్టీ ప్లస్
ముంబై, సాక్షి: జీడీపీ జోష్తో ముందురోజు హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ స్వల్పంగా 35 పాయింట్లు క్షీణించి 44,621కు చేరింది. నిఫ్టీ నామమాత్రంగా 6 పాయింట్లు బలహీనపడి 13,103 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో మంగళవారం మార్కెట్లు దూకుడు చూపిన విషయం విదితమే. దీంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730 వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,561 దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 13,128-13,088 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. మీడియా లాభాల్లో ఎన్ఎస్ఈలో మెటల్, రియల్టీ, మీడియా, ఆటో, ఫార్మా రంగాలు 1.7-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, టాటా మోటార్స్, హిందాల్కో, యూపీఎల్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, టైటన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, కోల్ ఇండియా 3.2-1.1 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్ మహీంద్రా, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, శ్రీ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే 1.6-0.5 శాతం మధ్య నష్టపోయాయి. నాల్కో అప్ డెరివేటివ్ కౌంటర్లలో నాల్కో, హెచ్పీసీఎల్, ఐసీఐసీఐ లంబార్డ్, ఎన్ఎండీసీ, వేదాంతా, టాటా కెమ్, ఎక్సైడ్ 4-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క నౌకరీ, మదర్సన్, ఐజీఎల్, ముత్తూట్, బాలకృష్ణ, సన్ టీవీ, సీమెన్స్, అరబిందో, మెక్డోవెల్ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,340 లాభపడగా.. 646 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
కన్సాలిడేషన్లో మార్కెట్లు- ఆటో స్పీడ్
ముంబై, సాక్షి: డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు క్షీణించి 44,142 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 27 పాయింట్లు తక్కువగా 12,960 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,124 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,957 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, రియల్టీ, మీడియా, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్ 1.6-0.5 శాతం మధ్య బలపడగా.. మెటల్ 0.35 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఐషర్, గెయిల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, టెక్ మహీంద్రా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్ 4-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్గ్రిడ్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆర్ఐఎల్, యాక్సిస్, శ్రీ సిమెంట్, టీసీఎస్, టాటా స్టీల్, ఎయిర్టెల్ 2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐజీఎల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఐజీఎల్ 11 శాతం దూసుకెళ్లగా.. ఎంజీఎల్, భెల్, కేడిలా హెల్త్కేర్, బాలకృష్ణ, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్, అపోలో టైర్, గోద్రెజ్ సీపీ 9-2.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు బాష్, ఐసీఐసీఐ లంబార్డ్, ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్ 1.4-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,276 లాభపడగా.. 556 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
ఆటుపోట్ల మధ్య మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: ముందురోజు నమోదైన పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో కోలుకున్నప్పటికీ తదుపరి ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. వెరసి లాభనష్టాల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 142 పాయింట్లు క్షీణించి 43,689 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 34 పాయింట్లు తక్కువగా 12,824 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,023 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,683 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీలో 12,917-12,816 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. నేడు నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తారని, దీంతో ఆటుపోట్లకు అవకాశమున్నదని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బుధవారం ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలతో రికార్డుల ర్యాలీకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఫార్మా మాత్రమే ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలన్నీ0.6-0.2 శాతం మధ్య బలహీనపడగా.. ఫార్మా 0.15 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్, టైటన్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, శ్రీ సిమెంట్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, ఎంఅండ్ఎం, దివీస్ 1.2-0.25 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇండస్ఇండ్, ఐషర్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, మారుతీ, బీపీసీఎల్, బ్రిటానియా, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, ఐవొసీ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. చిన్న షేర్లు వీక్ డెరివేటివ్ కౌంటర్లలో సీమెన్స్ 7 శాతం జంప్చేయగా.. భారత్ ఫోర్జ్, ఐసీఐసీఐ లంబార్డ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూబీఎల్, మదర్సన్, అపోలో హాస్పిటల్స్, ఆర్ఈసీ, భెల్ 3-1.6 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, బాష్, ఎస్కార్ట్స్ 4-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 948 లాభపడగా.. 1,023 నష్టాలతో ట్రేడవుతున్నాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. డీఐఐలు రూ. 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రికార్డ్ స్థాయి నుంచి కుప్పకూలిన మార్కెట్లు
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూకుడు చూపుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి బోర్లా పడ్డాయి. అయితే తొలుత యథావిధిగా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నప్పటికీ తదుపరి అమ్మకాలు పెరగడంతో వెనకడుగు వేశాయి. మిడ్సెషన్ నుంచీ అమ్మకాలు ఉధృతంకావడంతో చివరికి పతనంతో నిలిచాయి. సెన్సెక్స్ 695 పాయింట్లు కోల్పోయి 43,828 వద్ద ముగిసింది. నిఫ్టీ 197 పాయింట్లు వొదులుకుని 12,858 వద్ద స్థిరపడింది. తొలుత సెన్సెక్స్ 44,825 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. తదుపరి 43,758 వరకూ జారింది. వెరసి ఇంట్రాడే గరిష్టం నుంచి 1,050 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ సైతం 13,146 వద్ద గరిష్టాన్ని తాకగా.. 12,834 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. గురువారం(26న) నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం దెబ్బతీసినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. తొలుత ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 30,000 పాయింట్ల మార్క్ను దాటేసింది. 30,198కు చేరి రికార్డ్ నెలకొల్పింది. పీఎస్యూ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలన్నీ2.5-1 శాతం మధ్య క్షీణించగా.. ప్రభుత్వ రంగ బ్యాంక్స్ 1.7 శాతం ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ 6 శాతం జంప్చేయగా.. గెయిల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా మాత్రమే అదికూడా 1.7-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఐషర్, యాక్సిస్, కొటక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, శ్రీ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటో, యూపీఎల్, సిప్లా, ఎయిర్టెల్ 4-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. చిన్న షేర్లు వీక్ డెరివేటివ్ కౌంటర్లలో బీవోబీ, శ్రీరామ్ ట్రాన్స్, కెనరా బ్యాంక్, పీఎన్బీ, మణప్పురం, టాటా పవర్, బంధన్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, పీవీఆర్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 4.5-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, జూబిలెంట్ ఫుడ్, ఎస్ఆర్ఎఫ్, డీఎల్ఎఫ్, ఇండిగో, జిందాల్ స్టీల్, ఎంఆర్ఎఫ్, కాల్గేట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.4-3.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.7-1 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,126 లాభపడగా.. 1,660 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
హుషారుగా మొదలై.. నష్టాల్లోకి
ఆసియా మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తొలుత సెన్సెక్స్ లాభాల సెంచరీ చేసింది. అయితే ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 132 పాయింట్లు క్షీణించి 39,482కు చేరింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,612 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్ 39,880 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 39,407 వరకూ నీరసించింది. ఈ బాటలో నిఫ్టీ 11,697- 11,581 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. సెకండ్ వేవ్లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు దేశాలలో మళ్లీ లాక్డవున్లు విధించడంతో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలను పెంచుతున్నట్లు తెలియజేశారు. ఫార్మా సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంక్ ఇండెక్స్ 1.2 శాతం పుంజుకోగా.. మీడియా, మెటల్, ఐటీ, ఫార్మా 1.6-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్ఐఎల్, యూపీఎల్, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్, ఐవోసీ, టీసీఎస్, ఐషర్, విప్రో, బ్రిటానియా, బీపీసీఎల్ 4-1.2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం జంప్చేయగా.. ఇండస్ఇండ్, హీరో మోటో, ఎయిర్టెల్, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, యాక్సిస్, సిప్లా, ఎస్బీఐ 3-1 శాతం మధ్య ఎగశాయి. మీడియా వీక్ డెరివేటివ్ కౌంటర్లలో జీ, ఐడియా, ఇన్ఫ్రాటెల్, పేజ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ 2.6-1.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, హావెల్స్, బీవోబీ, మారికో 4-1.5 శాతం మధ్య వృద్ధి చూపాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 855 నష్టపోగా.. 811 లాభాలతో కదులుతున్నాయి. -
చివరికి నష్టాలే- రియల్టీ, మెటల్ జోరు
ఆటుపోట్ల మధ్య నవంబర్ డెరివేటివ్ సిరీస్ తొలి రోజు నీరసంగా ముగిసింది. సెన్సెక్స్ 136 పాయింట్లు క్షీణించి 39,614 వద్ద నిలవగా.. నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 11,642 వద్ద స్థిరపడింది. తొలుత స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన సెన్సెక్స్ 39,988 వరకూ ఎగసింది. మిడ్సెషన్కల్లా 39,242కు వెనకడుగు వేసింది. వెరసి ఇంట్రాడేలో 750 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. ఇక నిఫ్టీ సైతం 11,749- 11,535 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తిరిగి పెరుగుతుండటం, యూఎస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆటో డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు 1.2-0.8 శాతం మధ్య బలహీనపడ్డాయి. రియల్టీ 2.2 శాతం పుంజుకోగా.. మెటల్, మీడియా 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఐటీ, ఫార్మా 0.2 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్టెల్, హీరో మోటో, మారుతీ, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్యూఎల్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ, బ్రిటానియా, బజాజ్ ఆటో 4-1.5 శాతం మధ్య నష్టపోయాయి. అయితే అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హిందాల్కో, ఆర్ఐఎల్, టాటా స్టీల్, గెయిల్, నెస్లే 4.5-1.7 శాతం మధ్య ఎగశాయి. చోళమండలం జోరు డెరివేటివ్ కౌంటర్లలో ఎంఆర్ఎఫ్, బీవోబీ, గోద్రెజ్ సీపీ, అపోలో టైర్, ఇండిగో, జూబిలెంట్ ఫుడ్, లుపిన్, కమిన్స్, మారికో, నౌకరీ. టాటా కెమికల్స్ 3.5-1.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కాగా.. మరోవైపు చోళమండలం, టీవీఎస్ మోటార్, ఐడియా, హెచ్పీసీఎల్, జీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, పిరమల్, అమరరాజా, పీఎఫ్సీ, ఆర్ఈసీ 8.5-2.5 శాతం మధ్య జంప్చేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,338 లాభపడగా.. 1,240 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 1,131 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు సైలంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 3,515 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి -
నష్టాలతో మొదలై లాభాల్లోకి మార్కెట్లు
స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 69 పాయింట్లు పుంజుకుని 40,591కు చేరగా.. నిఫ్టీ 22 పాయింట్లు బలపడి 11,911 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,664 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,406 వద్ద కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 11,929- 11,858 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మంగళవారం యూఎస్ మార్కెట్లు అటూఇటూ అన్నట్లు ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో బలహీన ధోరణి కనిపిస్తోంది. గురువారం అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనున్న కారణంగా మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు 0.5-0.2 శాతం మధ్య నీరసించగా.. ఐటీ, ఫార్మా, ఆటో, మీడియా 0.7-0.2 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్టెల్ 8 శాతం జంప్ చేయగా.. హీరో మోటో, ఎంఅండ్ఎం, యాక్సిస్, యూపీఎల్, దివీస్, టాటా మోటార్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ 3-1 శాతం మధ్య పెరిగాయి. అయితే కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, నెస్లే, అల్ట్రాటెక్, టైటన్, హెచ్సీఎల్ టెక్, ఐవోసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, టాటా స్టీల్ 2-0.4 శాతంమధ్య బలహీనపడ్డాయి. ఐడియా అప్ ఎఫ్అండ్వో కౌంటర్లలో వేదాంతా, ఐడియా, భారత్ ఫోర్జ్, ఎస్కార్ట్స్, జిందాల్ స్టీల్, వోల్టాస్, బాటా, బెర్జర్ పెయింట్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 4-1.4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. శ్రీరామ్ ట్రాన్స్, జీ, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్, డీఎల్ఎఫ్, భెల్, పీవీఆర్, అశోక్ లేలాండ్, అంబుజా, పెట్రోనెట్, పీఎఫ్సీ 2.3-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం స్థాయిలో ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 978 లాభపడగా.. 646 నష్టాలతో కదులుతున్నాయి. -
ఒడిదొడుకుల మధ్య- ఎఫ్ఎంసీజీ అప్
ముందురోజు నమొదైన భారీ అమ్మకాల నుంచి కోలుకుంటూ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే తదుపరి అమ్మకాలు తలెత్తడంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 97 పాయింట్లు తక్కువగా 40,048కు చేరగా.. నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 11,747 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,291- 39,978 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటం, సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్లో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో సోమవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియాలోనూ ట్రెండ్ బలహీనంగా కనిపిస్తోంది. గురువారం అక్టోబర్ సిరీస్ ముగియనున్న కారణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్స్, రియల్టీ డౌన్ ఎన్ఎస్ఈలో ఎఫ్ఎంసీజీ 0.4 శాతం పుంజుకోగా.. మిగిలిన అన్ని రంగాలూ నీరసించాయి. ప్రధానంగా రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, మెటల్ 1.4- 0.6 శాతం మధ్య డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, ఓఎన్జీసీ, ఐవోసీ, ఎస్బీఐ, గెయిల్, టాటా మోటార్స్, యాక్సిస్, ఇన్ఫోసిస్ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే కొటక్ బ్యాంక్ 6 శాతం జంప్చేయగా.. ఎన్టీపీసీ, శ్రీసిమెంట్, నెస్లే, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 2-0.7 శాతం మధ్య బలపడ్డాయి. డెరివేటివ్స్ తీరిలా ఎఫ్అండ్వో కౌంటర్లలో ఆర్బీఎల్ బ్యాంక్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, టొరంట్ పార్మా, బంధన్ బ్యాంక్, జిందాల్ స్టీల్, ఐడియా, బీవోబీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎల్ఐసీ హౌసింగ్, పీఎన్బీ, అపోలో టైర్, పీవీఆర్ 3.3-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. ఏసీసీ, జీ, ఇన్ఫ్రాటెల్, కాల్గేట్, ఎంఆర్ఎఫ్, కోఫోర్జ్, పిడిలైట్ 3-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3-0.6 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,072 నష్టపోగా.. 639 లాభాలతో కదులుతున్నాయి. -
ఆద్యంతం ఆటుపోట్లు- చివరికి అక్కడక్కడే
ఆద్యంతం ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్)గా ముగిశాయి. సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 37,973 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 5 పాయింట్లు తగ్గి 11,222 వద్ద స్థిరపడింది. అయితే వరుసగా మూడో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్చేసి 38,236ను తాకగా.. నిఫ్టీ 11,305 వరకూ ఎగసింది. అయితే ఆపై అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ 37,831 వద్ద, నిఫ్టీ 11,181 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చవిచూశాయి. చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ, ఫార్మా 2.2-0.7 శాతం మధ్య నీరసించగా.. మెటల్ 2 శాతం ఎగసింది. ఈ బాటలో ఆటో, ఐటీ 0.3 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కొ, అల్ట్రాటెక్, హీరో మోటో, టైటన్, టీసీఎస్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, శ్రీ సిమెంట్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5.3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యూపీఎల్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, పవర్గ్రిడ్, యాక్సిస్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫిన్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, గ్రాసిమ్, ఐటీసీ, టెక్ మహీంద్రా, సిప్లా, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ 3.5-1.3 శాతం మధ్య డీలా పడ్డాయి. ఐడియా పతనం డెరివేటివ్ కౌంటర్లలో జిందాల్ స్టీల్, పేజ్, మైండ్ట్రీ, ముత్తూట్, మదర్సన్, బాలకృష్ణ, అంబుజా, ఎస్కార్ట్స్, అపోలో హాస్పిటల్స్, అపోలో టైర్, సీమెన్స్ 4.5-1.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఐడియా, భెల్, బీవోబీ, ఇన్ఫ్రాటెల్, పీఎన్బీ, జీఎంఆర్, మెక్డోవెల్, ఇండిగో, ఐజీఎల్, టాటా కన్జూమర్, మ్యాక్స్ ఫైనాన్స్, పిరమల్, హావెల్స్, ఫెడరల్ బ్యాంక్ 6-2.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,178 లాభపడగా.. 1,436 నష్టాలతో నిలిచాయి. డీఐఐల పెట్టుబడులు నగదు విభాగంలో సోమవారంవిదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నామమాత్రంగా రూ. 27 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 542 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 2,080 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2,071 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
ఆటుపోట్లలోనూ ఈ చిన్న షేర్లు జూమ్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో మూడో రోజూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం లాభాలు పోగొట్టుకుని స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. తద్వారా భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం ఊపందుకోగా.. కొన్నిటిలో తగ్గింది. జాబితాలో డెల్టా కార్ప్ లిమిటెడ్, కజారియా సిరామిక్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, బ్లిస్ జీవీఎస్ ఫార్మా, గ్యూఫిక్ బయోసైన్స్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. డెల్టా కార్ప్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.5 శాతం జంప్చేసి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.06 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.07 లక్షల షేర్లు చేతులు మారాయి. కజారియా సిరామిక్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.6 శాతం దూసుకెళ్లి రూ. 550 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 556 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 48,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 21,000 షేర్లు చేతులు మారాయి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.4 శాతం ర్యాలీ చేసి రూ. 107 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 63,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.34 లక్షల షేర్లు చేతులు మారాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 714 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.6 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 81,000 షేర్లు చేతులు మారాయి. బ్లిస్ జీవీఎస్ ఫార్మా బీఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 4.7 శాతం పెరిగి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.35 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.21 లక్షల షేర్లు చేతులు మారాయి. గ్యూఫిక్ బయోసైన్సెస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ఎగసి రూ. 91 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 96 వరకూ లాభపడింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 23,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.38 లక్షల షేర్లు చేతులు మారాయి. -
భారీ ఆటుపోట్లు- చివరికి స్వల్ప నష్టాలు
వరుస నష్టాలకు చెక్ పెడుతూ తొలుత హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు క్షీణించి 37,668 వద్ద నిలవగా.. నిఫ్టీ 22 పాయింట్లు తక్కువగా 11,132 వద్ద స్థిరపడింది. అయితే తొలుత సెన్సెక్స్ 400 పాయింట్లు ఎగసి 38,140ను తాకింది. మిడ్సెషన్కల్లా అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలు పోగొట్టుకోవడంతోపాటు.. 400 పాయింట్లు పతనమైంది. వెరసి 37,313కు చేరింది. ఇదే విధంగా ఇంట్రాడేలో నిఫ్టీ 11,260 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,024 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇటీవల పతన బాటలో సాగిన దేశీ మార్కెట్లలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్కు దిగడంతో తొలుత ఇండెక్సులు ఊపందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ గురువారం ముగియనుండటం ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. అయితే అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగా ఉండటంతో చివర్లో అమ్మకాలదే పైచేయిగా నిలిచినట్లు అభిప్రాయపడ్డారు. ప్రయివేట్ బ్యాంక్స్ ఓకే ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్ 2.4-1.5 శాతం మధ్య క్షీణించగా.. రియల్టీ 0.8 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 0.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, నెస్లే, బ్రిటానియా, టైటన్, ఆర్ఐఎల్, మారుతీ, హిందాల్కో, విప్రో, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐషర్, ఎల్అండ్టీ, యూపీఎల్ 2.5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్ఫ్రాటెల్, ఎయిర్టెల్ 8.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో టాటా స్టీల్, జీ, ఇండస్ఇండ్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, టీసీఎస్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఎస్బీఐ 3.5-1 శాతం వెనకడుగు వేశాయి. టాటా కెమ్ అప్ డెరివేటివ్ కౌంటర్లలో టాటా కెమ్, పేజ్, టాటా పవర్, ముత్తూట్, జిందాల్ స్టీల్, ఇండిగో, కోఫోర్జ్, బాష్, గ్లెన్మార్క్, బాలకృష్ణ, వేదాంతా, రామ్కో సిమెంట్ 7.3-2.4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఐడియా, సన్ టీవీ, శ్రీరామ్ ట్రాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, భెల్, మదర్సన్, టాటా కన్జూమర్, టొరంట్ ఫార్మా, లుపిన్, మారికో, అరబిందో, ఐబీ హౌసింగ్, కేడిలా 11-2.4 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం డీలా పడింది. ట్రేడైన షేర్లలో 1,217లాభపడగా.. 1,416 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,073 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 879 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 540 కోట్లు, డీఐఐలు రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఆటుపోట్లలోనూ ఈ మిడ్ క్యాప్స్ జోరు
తొలుత నమోదైన భారీ నష్టాల నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గుల నడుమ కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్ క్యాప్ షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో బలహీన మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో కేపీఐటీ టెక్నాలజీస్, వైభవ్ గ్లోబల్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. కేపీఐటీ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 110 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 113 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.67 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3.02 లక్షల షేర్లు చేతులు మారాయి. వైభవ్ గ్లోబల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం జంప్చేసి రూ. 1,839 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,878 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,200 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,200 షేర్లు చేతులు మారాయి. సెంట్రల్ బ్యాంక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ర్యాలీ చేసి రూ. 16.75 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.19 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.31 లక్షల షేర్లు చేతులు మారాయి. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3.5 శాతం లాభపడి రూ. 683 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 688 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో లక్ష షేర్లు చేతులు మారాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం ఎగసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.55 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.18 లక్షల షేర్లు చేతులు మారాయి. -
నేడు మార్కెట్లు బౌన్స్బ్యాక్?!
నేడు(22న) దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 52 పాయింట్లు ఎగసి 11,278 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,226 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్యాకేజీపై ప్రతిష్టంభన, బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలపై ఆరోపణల నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు సోమవారం యూఎస్ మార్కెట్లు 2-0.25 శాతం మధ్య డీలాపడ్డాయి. యూరోపియన్ దేశాలలో లాక్డవున్ల నేపథ్యంలో ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. గురువారం సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనున్న కారణంగా దేశీ మార్కెట్లు నేడు ఆటుపోట్ల మధ్య ట్రేడ్కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 812 పాయింట్లు డౌన్ ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. వెరసి గత ఆరు నెలల్లోలేని విధంగా మార్కెట్లు బోర్లా పడ్డాయి.సెన్సెక్స్ 812 పాయింట్లు పడిపోయి 38,034 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 255 పాయింట్లు పతనమై 11,250 వద్ద నిలిచింది. మిడ్సెషన్ నుంచీ అమ్మకాలు పెరగడంతో 38,991 పాయింట్ల గరిష్టం నుంచి సెన్సెక్స్ ఒక దశలో 37,946 వరకూ జారింది. ఇక నిఫ్టీ 11,535- 11,219 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,134 పాయింట్ల వద్ద, తదుపరి 11,018 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,451 పాయింట్ల వద్ద, ఆపై 11,651 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,061 పాయింట్ల వద్ద, తదుపరి 20,755 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,886 పాయింట్ల వద్ద, తదుపరి 22,404 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. అమ్మకాలవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 540 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. వారాంతాన ఎఫ్పీఐలు రూ. 205 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
స్వల్ప లాభాలతో- ఐటీ, ఫార్మా అండ
సరిహద్దువద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 45 పాయింట్లు బలపడి 38,891ను తాకగా.. 14 పాయింట్ల లాభంతో 11,519 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,940- 38,803 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,529- 11,492 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు శుక్రవారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. ఐటీ స్పీడ్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా ఐటీ, ఫార్మా 1.3-0.7 శాతం మధ్య బలపడగా.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్సీఎల్ టెక్ 4 శాతం జంప్చేయగా.. టీసీఎస్, జీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, కొటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్ 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే బజాజ్ ఆటో, సిప్లా, నెస్లే, గెయిల్, ఐసీఐసీఐ, ఓఎన్జీసీ, ఇన్ఫ్రాటెల్, పవర్గ్రిడ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్, ఐవోసీ, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్ 1.5-0.75 శాతం మధ్య నీరసించాయి. డెరివేటివ్స్లో.. డెరివేటివ్ కౌంటర్లలో బాలకృష్ణ, సన్ టీవీ, మణప్పురం, మైండ్ట్రీ, అరబిందో, కోఫోర్జ్, అపోలో హాస్పిటల్స్, వేదాంతా, ఇండిగో, అశోక్ లేలాండ్ 2.5-1.25 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క జిందాల్ స్టీల్, ఫెడరల్ బ్యాంక్, బీవోబీ, బయోకాన్, బంధన్ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, లుపిన్, ఎన్ఎండీసీ, ఆర్ఈసీ, పిరమల్, ఐడీఎఫ్సీ ఫస్డ్, ఎక్సైడ్, పీఎన్బీ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 938 లాభపడగా.. 850 నష్టాలతో కదులుతున్నాయి. -
చివర్లో అమ్మకాలు- ఫార్మా ధూమ్ధామ్
తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లను చివరి గంటలో పెరిగిన అమ్మకాలు దెబ్బతీశాయి. వెరసి నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 134 పాయింట్లు క్షీణించి 38,846 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ స్వల్పంగా 11 పాయింట్ల వెనకడుగుతో 11,505 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో సెన్సెక్స్ 39,200 వద్ద గరిష్టాన్ని తాకగా.. చివర్లో 38,636 పాయింట్ల దిగువకు సైతం చేరింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 11,584- 11,446 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. అయితే తొలి నుంచీ ఇన్వెస్టర్లు ఫార్మా కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో బీఎస్ఈలో హెల్త్కేర్ ఇండెక్స్ 20,689 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఫార్మా జోరు ఎన్ఎస్ఈలో ఫార్మా రంగం 5 శాతం జంప్చేయగా.. రియల్టీ 2 శాతం, ఆటో 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం, ఎఫ్ఎంసీజీ 0.6 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ 10 శాతం, సిప్లా 7 శాతం చొప్పున దూసుకెళ్లగా.. అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హిందాల్కో, విప్రో, పవర్గ్రిడ్, హీరో మోటో, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్ 3.7-1.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్, మారుతీ, టైటన్, హెచ్యూఎల్, ఎస్బీఐ, ఐవోసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ 2.2-0.75 శాతం మధ్య క్షీణించాయి. డెరివేటివ్స్లోనూ.. డెరివేటివ్ కౌంటర్లలో లుపిన్, దివీస్, కేడిలా, గ్లెన్మార్క్, అపోలో హాస్పిటల్స్, అరబిందో, డీఎల్ఎఫ్, బయోకాన్, సన్ టీవీ 4.5-2.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క టాటా కెమ్, అపోలో టైర్, పెట్రోనెట్, బంధన్ బ్యాంక్, టొరంట్ పవర్, ఐడీఎఫ్సీ ఫస్ట్, పిరమల్, వోల్టాస్, కోఫోర్జ్, అమరరాజా, జూబిలెంట్ ఫుడ్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పీఎన్బీ, జిందాల్ స్టీల్, కమిన్స్ 3.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.25 శాతం పుంజుకోగా, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1308 లాభపడగా.. 1431 నష్టాలతో నిలిచాయి. అమ్మకాలవైపు.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 250 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఊగిసలాటతో షురూ- చిన్న షేర్లు ప్లస్
స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 48 పాయింట్లు బలపడి 39,092ను తాకగా.. నిఫ్టీ 12 పాయింట్లు పుంజుకుని 11,534 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,161- 39,052 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11546- 11517 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా, ఆటో రంగాలు బలపడగా.. బ్యాంక్స్, ఐటీ డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, బ్రిటానియా, గ్రాసిమ్, ఎల్అండ్టీ, బజాజ్ ఆటో, ఐషర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, ఎయిర్టెల్, టైటన్, మారుతీ, నెస్లే 1.4-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, యాక్సిస్, పవర్గ్రిడ్ 0.7-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. అపోలో ప్లస్ డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్, అరబిందో, బయోకాన్, ఐబీ హౌసింగ్, పిరమల్, రామ్కో సిమెంట్, మదర్సన్, టీవీఎస్ మోటార్, భారత్ ఫోర్జ్, కేడిలా హెల్త్, ఎస్కార్ట్స్ 4-1.3 శాతం మధ్య ఎగశాయి. కాగా మరోవైపు సన్ టీవీ, టాటా కెమ్, ఐడియా, ఐజీఎల్, పీవీఆర్, కంకార్, అమరరాజా, ఇండిగో, ఫెడరల్ బ్యాంక్ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.35 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 932 లాభపడగా., 552 నష్టాలతో కదులుతున్నాయి. -
కన్సాలిడేషన్ బాటలో- చిన్న షేర్లు ఓకే
దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. వెరసి ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 43 పాయింట్లు క్షీణించి 38,374కు చేరగా.. నిఫ్టీ 8 పాయింట్లు నీరసించి 11,347 వద్ద ట్రేడవుతోంది. 38,498 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 38,507 ఎగువన గరిష్టాన్నీ, 38,332 వద్ద కనిష్టాన్నీ చేరింది. విదేశీ సంకేతాలు సానుకూలంగానే ఉన్నప్పటికీ చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాల కారణంగా మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బ్లూచిప్స్ తీరిలా ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, మెటల్, ఆటో 0.4 శాతం స్థాయిలో డీలాపడగా.. ఐటీ, ఫార్మా 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, బీపీసీఎల్, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, హీరో మోటో, విప్రొ, యాక్సిస్, అదానీ పోర్ట్స్ 1.3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ, జీ, హిందాల్కో, టైటన్, పవర్గ్రిడ్, నెస్లే, ఎన్టీపీసీ 2.4-0.7 శాతం మధ్య క్షీణించాయి. ఐడియా వీక్ డెరివేటివ్స్లో ఐడియా 4 శాతం పతనంకాగా.. ఆర్బీఎల్ బ్యాంక్, పీవీఆర్, శ్రీరామ్ ట్రాన్స్, మణప్పురం, బీవోబీ, నాల్కో, ఏసీసీ 2.8-1.2 శాతం మధ్య నీరసించాయి. కాగా.. ఇండిగో, నౌకరీ, పిరమల్, పెట్రోనెట్, గ్లెన్మార్క్, అదానీ ఎంటర్, అరబిందో 3-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 847 లాభపడగా.. 624 నష్టాలతో కదులుతున్నాయి. -
ఈ మిడ్ క్యాప్ షేర్లపై అమ్మకాల దెబ్బ
ఆటుపోట్ల మధ్య కదులుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. దీంతో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకగా.. ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, గుడ్ఇయర్ ఇండియా.. పతన బాటలో సాగుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం పుంజుకోగా.. మరికొన్ని కౌంటర్లలో లావాదేవీలు నీరసించాయి. వివరాలు చూద్దాం.. ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం పతనమై రూ. 525 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 23,500 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్సెషన్కల్లా 25,000 షేర్లు చేతులు మారాయి. గుడ్ఇయర్ ఇండియా బీఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం కుప్పకూలి రూ. 943 దిగువన ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,000 షేర్లు కాగా.. ఈ కౌంటర్లో మిడ్సెషన్కల్లా 36,000 షేర్లు చేతులు మారాయి. ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం దిగజారి రూ. 121 దిగువన ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 66,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్సెషన్కల్లా కేవలం 10,000 షేర్లు చేతులు మారాయి. ఫ్యూచర్ రిటైల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం క్షీణించి రూ. 107 దిగువన ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 19.75 లక్షల షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 4.13 లక్షల షేర్లు మాత్రమే చేతులు మారాయి. ఫ్యూచర్ కన్జూమర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం కోల్పోయి రూ. 10.40 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 54.45 లక్షల షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 34.80 లక్షల షేర్లు మాత్రమే చేతులు మారాయి. -
ఆటుపోట్ల మధ్య నష్టాలతో- చిన్న షేర్లు డీలా
ప్రతికూల విదేశీ సంకేతాలతో నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 152 పాయింట్లు క్షీణించి 38,205కు చేరగా.. నిఫ్టీ 31 పాయింట్లు నీరసించి 11,303 వద్ద ట్రేడవుతోంది. 38,285 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 38,454 ఎగువన గరిష్టాన్నీ, 38,196 వద్ద కనిష్టాన్నీ చేరింది. టెక్ దిగ్గజాలలో అమ్మకాలతో వరుసగా రెండు రోజు శుక్రవారం యూఎస్ మార్కెట్లు పతనంకావడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాల కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రయివేట్ బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ 0.4 శాతం చొప్పున క్షీణించగా.. మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ప్రాటెల్, టాటా మోటార్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఐషర్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఐవోసీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఎస్బీఐ, కోల్ ఇండియా, మారుతీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్, ఓఎన్జీసీ 3-0.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో ఎంఅండ్ఎం, కొటక్ బ్యాంక్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జీ 1-0.5 శాతం మధ్య నీరసించాయి. ఐడియా జోరు డెరివేటివ్స్లో ఐడియా 5 శాతం జంప్చేయగా.. ఎన్ఎండీసీ, ఎస్కార్ట్స్, వేదాంతా, హెచ్పీసీఎల్, పెట్రోనెట్, అశోక్ లేలాండ్, సెయిల్, అదానీ ఎంటర్, బాష్, మదర్సన్, అపోలో టైర్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, టాటా కన్జూమర్, పీవీఆర్, బీవోబీ, టాటా పవర్, కాల్గేట్ 3-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 965 నష్టపోగా.. 862 లాభాలతో కదులుతున్నాయి. -
లాభాలతో మొదలై నష్టాలతో నిలిచి!
తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి యధాప్రకారం ఆటుపోట్లకు లోనయ్యాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు క్షీణించి 38,991 వద్ద నిలవగా.. నిఫ్టీ 8 పాయింట్లు తక్కువగా 11,527 వద్ద స్థిరపడింది. బుధవారం అమెరికా ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. అయితే చైనాతో సైనిక వివాదాల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,236- 38,943 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 11,585 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,508 దిగువన కనిష్టానికి చేరింది. ఇన్ఫ్రాటెల్ జూమ్ ఎన్ఎస్ఈలో ఐటీ, ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ 1.5-0.8 శాతం మధ్య పుంజుకోగా.. బ్యాంకింగ్, మెటల్ 1.5-0.6 శాతం బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫ్రాటెల్ 11 శాతం దూసుకెళ్లగా.. గ్రాసిమ్, టైటన్, యూపీఎల్, విప్రో, టెక్ మహీంద్రా, నెస్లే, ఐషర్, మారుతీ, అదానీ పోర్ట్స్ ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గెయల్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, టాటా మోటార్స్ 7-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, యాక్సిస్, హిందాల్కో, పవర్గ్రిడ్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బ్రిటానియా, ఇండస్ఇండ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్ 2-0.7 శాతం మధ్య డీలాపడ్దాయి. ఐడియా హైజంప్ ఎఫ్అండ్వో కౌంటర్లలో ఐడియా 30 శాతం దూసుకెళ్లగా.. యూబీఎల్, టాటా కన్జూమర్, బయోకాన్, బాటా, మ్యాక్స్ ఫైనాన్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, హావెల్స్, పిడిలైట్, వోల్టాస్, భెల్, ఇండిగో, ఎస్ఆర్ఎఫ్, గోద్రెజ్ సీపీ, జూబిలెంట్ ఫుడ్, ఐజీఎల్ 7.5-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క పేజ్, ఐబీ హౌసింగ్, వేదాంతా, ఆర్బీఎల్, దివీస్, భారత్ ఫోర్జ్, నౌకరీ, జీఎంఆర్ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1481 లాభపడగా.. 1204 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 991 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 657 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 486 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 775 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
మార్కెట్లలో నేడు మళ్లీ ఆటుపోట్లు?!
దేశీ స్టాక్ మార్కెట్లు నేడు (2న) ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 24 పాయింట్లు క్షీణించి 11,504 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,528 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. జీడీపీ పతనం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల నేపథ్యంలో ముందురోజు మార్కెట్లు బౌన్స్బ్యాక్ అయినప్పటికీ తిరిగి నేడు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. మంగళవారం యూఎస్ మార్కెట్లు తిరిగి చరిత్రాత్మక గరిష్టాలను అందుకోగా.. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. లాభాల్లోనే మంగళవారం ఒడిదొడుకుల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 273 పాయింట్లు జంప్చేసి 38,901 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు బలపడి 11,470 వద్ద ముగిసింది. ఒక దశలో 600 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ 39,227 వద్ద గరిష్టాన్ని తాకగా 38,542 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక ఇంట్రాడేలో నిఫ్టీ 11,554- 11,367 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,374 పాయింట్ల వద్ద, తదుపరి 11,277 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,560 పాయింట్ల వద్ద, ఆపై 11,650 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,457 పాయింట్ల వద్ద, తదుపరి 23,102 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,183 పాయింట్ల వద్ద, తదుపరి 24,555 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 486 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 775 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
తీవ్ర ఆటుపోట్ల మధ్య ట్రిపుల్ సెంచరీ
ముందురోజు నమోదైన భారీ పతనం నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ అయ్యాయి. అయితే దేశీ జీడీపీ అనూహ్య క్షీణత, చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో తీవ్ర ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. తొలుత లాభాల డబుల్ సెంచరీ చేసిన సెన్సెక్స్ వెనువెంటనే నష్టాలలోకి ప్రవేశించింది. తిరిగి లాభాల బాట పట్టింది. ప్రస్తుతం 324 పాయింట్లు జంప్చేసి 38,952 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో నిఫ్టీ 109 పాయింట్లు ఎగసి 11,496 వద్ద కదులుతోంది. సోమవారం అమెరికా ఇండెక్సులు రికార్డు గరిష్టాల నుంచి వెనకడుగు వేయగా.. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి వ్యక్త మవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,037 వద్ద గరిష్టాన్ని తాకగా.. 38,563 వద్ద కనిష్టానికీ చేరడం గమనార్హం! ప్రధాన రంగాలన్నీ ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలన్నీ 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, ఇన్ఫ్రాటెల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ 4-2 శాతం మధ్య జంప్చేశాయి. అయితే ఓఎన్జీసీ 3 శాతం క్షీణించగా, గెయిల్, ఐటీసీ, బీపీసీఎల్, ఐవోసీ, ఇన్ఫోసిస్ 1-0.3 శాతం మధ్య డీలాపడ్దాయి. ఎస్కార్ట్స్ ప్లస్ ఎఫ్అండ్వో కౌంటర్లలో ఎస్కార్ట్స్, ఐడియా, ఆర్ఈసీ, సెయిల్, బయోకాన్, జిందాల్ స్టీల్, పీఎఫ్సీ, పీవీఆర్ 5-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎంజీఎల్, హెచ్పీసీఎల్ 1.2-0.2 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు1.4-1 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1090 లాభపడగా.. 702 నష్టాలతో కదులుతున్నాయి. -
మూడో రోజూ సానుకూల ఓపెనింగ్!
నేడు (26న) వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 26 పాయింట్లు బలపడి 11,498 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,472 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్ దిగ్గజాల అండతో వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్ ఇండెక్సులు ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. దేశీయంగా జీడీపీ గణాంకాలు వెల్లడికానుండగా... గురువారం ఎఫ్అండ్వో ముగింపు కారణంగా మార్కెట్లలో కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. స్వల్ప లాభాలతో సరి మంగళవారం హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు పుంజుకుని 38,844 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 11,472 వద్ద స్థిరపడింది. అయితే తొలి సెషన్లో సెన్సెక్స్ 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తదుపరి 38,680 దిగువన కనిష్టానికి చేరింది. మరోవైపు నిఫ్టీ ఇంట్రాడేలో 11,526 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,423 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది. . నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,422 పాయింట్ల వద్ద, తదుపరి 11,372 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,524 పాయింట్ల వద్ద, ఆపై 11,576 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,907 పాయింట్ల వద్ద, తదుపరి 22,721 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,229 పాయింట్ల వద్ద, తదుపరి 23,366 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,481 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 173 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం సోమవారం ఎఫ్పీఐలు రూ. 219 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 336 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
స్వల్ప లాభాలతో సరి- తొలుత 39,000కు
తొలుత హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 45 పాయింట్లు పుంజుకుని 38,844 వద్ద నిలిచింది. నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 11,472 వద్ద స్థిరపడింది. అయితే విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలి సెషన్లోనే సెన్సెక్స్ సాంకేతికంగా కీలకమైన 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో లాభాలు పోగొట్టుకోవడంతోపాటు నష్దాల బాట పట్టింది. వెరసి 38,680 దిగువన కనిష్టానికి చేరింది. మరోవైపు నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 11,526 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,423 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది. ఆగస్ట్ డెరివేటివ్ సిరీస్ ముగింపు ముందున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టినట్లు నిపుణులు తెలియజేశారు. ఆటో, మీడియా అప్ ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 1.2 శాతం బలపడగా.. ఆటో, మీడియా 0.35 శాతం స్థాయిలో లాభపడ్డాయి. రియల్టీ 2.2 శాతం డీలాపడగా.. మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ 0.8-0.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఐషర్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్, ఇండస్ఇండ్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ బ్యాంక్, టైటన్ 5.3-1 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో గెయిల్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, శ్రీ సిమెంట్, ఎల్అండ్టీ, నెస్లే, అదానీ పోర్ట్స్, విప్రో, యూపీఎల్, హీరో మోటో, ఇన్ఫోసిస్ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోరు ఎఫ్అండ్వో కౌంటర్లలో అదానీ ఎంటర్ప్రైజెస్ 21 శాతం దూసుకెళ్లగా.. మ్యాక్స్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, చోళమండలం, టాటా కెమ్, హావెల్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, కెనరా బ్యాంక్, ఐబీ హౌసింగ్, ఆర్బీఎల్ బ్యాంక్, అశోక్ లేలాండ్, సన్ టీవీ 13-2.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క బీహెచ్ఈఎల్, పేజ్, జిందాల్ స్టీల్, ఎంజీఎల్, బీఈఎల్, నాల్కో, కేడిలా హెల్త్, ఎన్ఎండీసీ, సెంచురీ టెక్స్, ఎస్బీఐ లైఫ్, అపోలో టైర్, బాటా, జీఎంఆర్ 2.5-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.5 శాతం బలపడింది. ట్రేడైన షేర్లలో 1353 లాభపడగా.. 1474 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 219 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 336 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 410 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 251 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్లు అక్కడక్కడే- చిన్న షేర్ల హవా
ఆద్యంతం స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్)గా ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 38,040 వద్ద నిలవగా.. నిఫ్టీ 14 పాయింట్లు బలపడి 11,214 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,110 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,787 వద్ద కనిష్టాన్ని చేరింది. ఇదే విధంగా నిఫ్టీ 11,232- 11,142 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం, ట్రేడర్ల లాభాల స్వీకరణ, వారాంతం కావడం వంటి అంశాలు ట్రేడింగ్ను ప్రభావితం చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఐటీ, ఫార్మా డౌన్ ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఐటీ 1 శాతం, ఫార్మా 0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, బజాజ్ ఫిన్, ఇండస్ఇండ్, బీపీసీఎల్, బ్రిటానియా, టాటా మోటార్స్, మారుతీ 5-2 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు టైటన్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, ఐవోసీ, ఎల్అండ్టీ, విప్రొ, అల్ట్రాటెక్, టీసీఎస్, హెచ్యూఎల్ 2.5-0.5 శాతం మధ్య క్షీణించాయి. ఆర్బీఎల్ జోరు డెరివేటివ్స్లో ఆర్బీఎల్ బ్యాంక్ 9.3 శాతం దూసుకెళ్లగా.. ఐడియా, టాటా కన్జూమర్, ఎస్ఆర్ఎఫ్, అపోలో టైర్, సెంచురీ టెక్స్, బెర్జర్ పెయింట్స్, బీవోబీ, ఐడీఎఫ్సీ ఫస్ట్, మణప్పురం, ఫెడరల్ బ్యాంక్ 7-4.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. లుపిన్, పేజ్, బయోకాన్, నిట్ టెక్, ఎంజీఎల్, గ్లెన్మార్క్, వోల్టాస్, అంబుజా, టొరంట్ ఫార్మా 6-1.3 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5-0.8 శాతం మధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,666 లాభపడగా.. 1,039 నష్టపోయాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 468 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 60 కోట్లు, డీఐఐలు రూ. 426 కోట్ల చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. ఇక మంగళవారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 704 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 666 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. -
చివరికి అటూఇటుగా- మెటల్, ఆటో జోరు
వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి ఒడిదొడుకులకు లోనయ్యాయి. చివరికి అటూఇటుగా ముగిశాయి. సెన్సెక్స్ 25 పాయింట్ల స్వల్ప నష్టంతో 37,663 వద్ద నిలిచింది. నిఫ్టీ నామమాత్రంగా 6 పాయింట్లు బలపడి 11,102 వద్ద స్థిరపడింది. అయితే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా జంప్చేసింది. 38,140 వద్ద గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం నుంచీ ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఆటుపోట్లను చవిచూసింది. 37,551 పాయింట్ల దిగువన కనిష్టాన్ని తాకింది. ఇదే విధంగా నిఫ్టీ 11,226- 11,064 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మీడియా సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్ ఇండెక్స్ 4.25 శాతం జంప్చేయగా, ఆటో 2.2 శాతం ఎగసింది. మీడియా 1 శాతం లాభపడగా.. ఫార్మా 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్, ఐషర్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటన్, ఎంఅండ్ఎం, మారుతీ, శ్రీ సిమెంట్, ఎయిర్టెల్ 9-2 శాతం మధ్య పురోగమించాయి. ఇతర బ్లూచిప్స్లో యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఆర్ఐఎల్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డస్, టెక్ మహీంద్రా, నెస్లే, ఇన్ఫోసిస్, ఐటీసీ 1.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. సెయిల్ జూమ్ ఎఫ్అండ్వో కౌంటర్లలో సెయిల్, నౌకరీ, నాల్కో, బాటా, ఆర్బీఎల్, పీవీఆర్, హావెల్స్, టీవీఎస్, ఐబీ హౌసింగ్ 9-3 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోవైపు ఐడియా, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ సీపీ, పిడిలైట్, ముత్తూట్, శ్రీరామ్ ట్రాన్స్, కేడిలా హెల్త్, పిరమల్, ఎస్బీఐ లైఫ్ 3.5-1.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1621 లాభపడగా.. 1012 మాత్రమే డీలాపడ్డాయి. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 704 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 666 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 7818 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. వీటిలో బంధన్ బ్యాంకులో వాటా కొనుగోలు పెట్టుబడులు కలసి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. డీఐఐలు దాదాపు రూ. 136 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. -
చివరికి నేలచూపులే- ఫార్మా భేష్
ఆగస్ట్ డెరివేటివ్ సిరీస్ తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఆద్యంతం హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్ 129 పాయింట్లు క్షీణించి 37,607 వద్ద నిలిచింది. నిఫ్టీ 29 పాయింట్లు తక్కువగా 11,073 వద్ద ముగిసింది. అమెరికన్ టెక్ దిగ్గజాలు అమెజాన్, యాపిల్, ఫేస్బుక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫ్యూచర్స్లో ఈ షేర్లన్నీ హైజంప్ చేశాయి. అయినప్పటికీ దేశీయంగా మార్కెట్లు ఒడిదొడుకుల మధ్యే ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 37,898 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,432 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. నిఫ్టీ 11,150-11,027 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా 3.6 శాతం జంప్చేయగా.. పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్ సైతం 0.6 శాతం చొప్పున బలపడటం గమనార్హం. మీడియా మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.9 శాతం బలహీనపడగా.. ప్రయివేట్ బ్యాంక్స్ 0.3 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్ ఫార్మా, సిప్లా, గ్రాసిమ్ 5 శాతం చొప్పున జంప్చేశాయి. ఈ బాటలో జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, యాక్సిస్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్ 3-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐషర్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, హీరో మోటో 3-1.5 శాతం మధ్య క్షీణించడంతో మార్కెట్లు తిరోగమించాయి. ఫార్మా జోరు డెరివేటివ్ కౌంటర్లలో టొరంట్ ఫార్మా, పిరమల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, అరబిందో, కేడిలా హెల్త్, ఐడియా, బాలకృష్ణ, ఇండిగో, డాబర్, లుపిన్ 9-4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క చోళమండలం, ఐబీ హౌసింగ్, హెచ్పీసీఎల్, ఎన్ఎండీసీ, టీవీఎస్, మణప్పురం, ఈక్విటాస్, ముత్తూట్, జూబిలెంట్ ఫుడ్, అపోలో హాస్పిటల్స్ 5.3-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1430 నష్టపోగా.. 1232 లాభపడ్డాయి. డీఐఐల అమ్మకాలు.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 387 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 353 కోట్లు, డీఐఐలు రూ. 506 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
తొలుత లాభాలు- తుదకు నష్టాలు
జులై ఎఫ్అండ్వో సిరీస్ చివరి రోజు దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 335 పాయింట్లు పతనమై 37,736వద్ద ముగిసింది. వెరసి 38,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ సైతం 101 పాయింట్లు కోల్పోయి 11,102 వద్ద స్థిరపడింది. ఆర్థిక వ్యవస్థకు అన్నిరకాలుగా అండగా నిలవనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ హామీ ఇవ్వడంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి యథాప్రకారం అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ట్రేడర్లు పొజిషన్లను ఆగస్ట్ సిరీస్కు రోలోవర్ చేసుకునే బాటలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సెన్సెక్స్ 38,414 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,678 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. నిఫ్టీ 11,300- 11,085 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మీడియా బోర్లా ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ, మీడియా 2 శాతం స్థాయిలో బోర్లా పడగా.. మెటల్ 1.2 శాతం, ఆటో 0.6 శాతం చొప్పున నీరసించాయి. అయితే ఫార్మా 3 శాతం ఎగసింది. ఐటీ 0.7 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, విప్రో, వేదాంతా, మారుతీ, ఇన్ఫోసిస్, సిప్లా, బ్రిటానియా 5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క బీపీసీఎల్, ఇండస్ఇండ్, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎయిర్టెల్, పవర్గ్రిడ్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్, గెయిల్ 8-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్స్లో దివీస్, అపోలో హాస్పిటల్స్, జూబిలెండ్ ఫుడ్, నిట్ టెక్, గ్లెన్మార్క్, ఎస్బీఐ లైఫ్, లుపిన్, ఇండిగో, అమరరాజా 6-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మణప్పురం, ఐబీ హౌసింగ్, శ్రీరామ్ ట్రాన్స్, పీవీఆర్, ఎస్ఆర్ఎఫ్, ఆర్బీఎల్, ఉజ్జీవన్, పిరమల్, భెల్, ఈక్విటాస్ 10-4 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1584 నష్టపోగా.. 1060 మాత్రమే లాభపడ్డాయి. అమ్మకాలవైపు.. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 353 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 506 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 246 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
వచ్చే వారం మార్కెట్లలో భారీ ఆటుపోట్లు!
వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా భారీ హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని మార్కెట్ విశ్లేషకులు ఊహిస్తున్నారు. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపగల అమెరికన్ కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. మంగళవారం ప్రారంభంకానున్న పరపతి సమావేశాలు బుధవారం(29న) ముగియనున్నాయి. మరోవైపు జులై ఎఫ్అండ్వో సిరీస్ గడువు గురువారం(30న) ముగియనుంది. దేశీయంగా నేడు(25న) ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనుంది. ఈ అంశాల నేపథ్యంలో వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సంచరించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్పై కన్ను ఇప్పటికే ప్రపంచ దేశాలన్నిటా పాకిన కోవిడ్-19.. కొద్ది రోజులుగా అమెరికాలోని పలు రాష్ట్రాలలో మరింత వేగంగా విస్తరిస్తోంది. 50 రాష్ట్రాలలో 42 రాష్ట్రాలు కరోనా వైరస్తో వణుకుతున్నాయి. దీంతో వాషింగ్టన్ ప్రభుత్వం మరో భారీ ప్యాకేజీని ప్రకటించవచ్చన్న అంచనాలు ఇటీవల పెరిగాయి. జులైలో నిరుద్యోగిత పెరగడంతో ప్రజలకు ప్రత్యక్షంగా నగదు చెల్లించే పథకాన్ని సెనేట్ రిపబ్లికన్స్ ప్రతిపాదించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా, చైనా మధ్య తాజాగా వివాదాలు చెలరేగిన విషయం విదితమే. దీంతో దేశ ఆర్థిక వృద్ధిపై ఫెడ్ అంచనాలు స్టాక్, ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగలవని నిపుణులు చెబుతున్నారు. రోలోవర్స్ జులై ఎఫ్అండ్వో కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్న కారణంగా ట్రేడర్లు ఆగస్ట్ సిరీస్కు పొజిషన్లను రోలోవర్ చేసుకునే అవకాశముంది. దీనికితోడు పలు దిగ్గజాలు వచ్చే వారం క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాల ప్రభావం షేరుపై సోమవారం(27న) ప్రతిఫలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బాటలో బ్లూచిప్ కంపెనీలు టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్ 27న ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇదే విధంగా అల్ట్రాటెక్ సిమెంట్ 28న, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీఎస్కే ఫార్మా, మారుతీ సుజుకీ 29న క్యూ1 పనితీరు వెల్లడించనున్నాయి. ఇతర దిగ్గజాలలో ఆర్ఐఎల్, హెచ్ఢీఎఫ్సీ 30న, ఐవోసీ 31న ఫలితాలు తెలియజేయనున్నాయి. ఇదే రోజు జూన్ నెలకు మౌలిక సదుపాయాల గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇతర అంశాలూ ఫెడ్ పాలసీ, ఎఫ్అండ్వో గడువు ముగియడం, బ్లూచిప్స్ ఫలితాలకుతోడు.. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు తదితర పలు అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని నిపుణులు వివరించారు. ఇటీవల కోవిడ్-19 కట్టడికి రూపొందుతున్న పలు కంపెనీల వ్యాక్సిన్ల పురోగతి వార్తలు సైతం మార్కెట్లను నడిపిస్తున్నట్లు తెలియజేశారు. -
హెచ్చుతగ్గుల మధ్య లాభాల్లోకి మార్కెట్లు
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 75 పాయింట్లు పుంజుకుని 37,946కు చేరగా.. నిఫ్టీ 26 పాయింట్లు బలపడి 11,158 వద్ద ట్రేడవుతోంది. ప్రభుత్వ ప్యాకేజీపై ఆశలతో బుధవారం యూఎస్ మార్కెట్లు లాభపడగా.. యూఎస్, చైనా మధ్య తాజా వివాదాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. 37,815 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 37,739 దిగువన కనిష్టాన్ని తాకగా.. 37,995 వద్ద గరిష్టానికీ చేరింది. మీడియా జోరు ఎన్ఎస్ఈలో మీడియా 2 శాతం పుంజుకోగా.. ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్టీ, ఫార్మా 0.5 శాతం స్థాయిలో లాభపడ్డాయి. ఐటీ ఇదే స్థాయిలో వెనకడుగు వేసింది. నిఫ్టీ దిగ్గజాలలో జీ, యూపీఎల్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, గెయిల్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ, ఐవోసీ, ఎల్అండ్టీ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే యాక్సిస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. గ్లెన్మార్క్ అప్ డెరివేటివ్ కౌంటర్లలో గ్లెన్మార్క్, పీవీఆర్, సెంచురీ టెక్స్, శ్రీరామ్ ట్రాన్స్, హెచ్పీసీఎల్, మణప్పురం 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా మరోపక్క అదానీ ఎంటర్, ఎస్కార్ట్స్, జీఎంఆర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, బయోకాన్, నౌకరీ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో 1026 షేర్లు లాభపడగా.. 500 నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
నేడు ఒడిదొడుకుల ఓపెనింగ్- తదుపరి!?
నేడు (23న) దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 14 పాయింట్లు బలహీనపడి 11,112 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 11,126 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాలిఫోర్నియా, ఫ్లోరిడా తదితర పలు రాష్ట్రాలలో కోవిడ్-19 మరింత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం మరోసారి భారీ ప్యాకేజీని తీసుకురానున్నదన్న అంచనాలు బుధవారం యూఎస్ మార్కెట్లకు బలాన్నిచ్చాయి. దీంతో ఆటుపోట్ల మధ్య ఇండెక్సులు 0.6-0.3 శాతం స్థాయిలో బలపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు మాత్రం 1.3-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. తైవాన్, కొరియా, చైనా 0.6 శాతం స్థాయిలో బలహీనపడగా.. ఇండొనేసియా, హాంకాంగ్, సింగపూర్ అదే స్థాయిలో పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత ఒడిదొడుకులతో ప్రారంభంకావచ్చని, తదుపరి ఆటుపోట్లు చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కన్సాలిడేషన్లో.. ఐదు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు బుధవారం కన్సాలిడేషన్ బాట పట్టాయి. ఒడిదొడుకుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 59 పాయింట్లు క్షీణించి 37,871 వద్ద నిలవగా.. నిఫ్టీ 30 పాయింట్లు తక్కువగా 11,132 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,238- 11,057 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,047 పాయింట్ల వద్ద, తదుపరి 10,961 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,228 పాయింట్ల వద్ద, ఆపై 11,324 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,623 పాయింట్ల వద్ద, తదుపరి 22,364 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,177 పాయింట్ల వద్ద, తదుపరి 23,470 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఎఫ్పీఐలు భళా.. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2266 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 727 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
లాభనష్టాల మధ్య సూచీలు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి దాదాపు 500 పాయింట్లు కుప్పకూలిన కీలక సూచీలు అనంతరం 100 పాయింట్ల నష్టాలకు పరిమితమయ్యాయి. కానీ మిడ్ సెషన్ నుంచి అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా సె న్సెక్స్ 390 పాయింట్లు పతనమై 34780 వద్ద, నిఫ్టీ 122 పాయింట్ల నష్టతో 10260 వద్ద కొనసాగుతోంది. మెటల్, రియల్టీ, బ్యాంకింగ్, ఫార్మ సహా దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రేటింగ్ డౌన్ గ్రేడ్ కారణంగా యాక్సిస్ బ్యాంకు 5 శాతం కుప్పకూలింది. కోల్ ఇండియా, నాల్కో, హిందాల్కో, జేఎస్డబ్ల్యు స్టీల్ నష్టపోతున్నాయి. అలాగే ఎల్ అండ్ టీ, ఎస్ బీఐ, భారత్ ఫోర్జ్, బ్యాంకు ఆఫ్ బరోడా , ఇండస్ ఇండ్ టాప్ లూజర్స్ గాఉన్నాయి. (కరోనా వేవ్స్ : బంగారం పరుగు) కేంద్ర మద్దతు కోసం మద్దతుకోసం ఎదురు చూడవద్దని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యలతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 4 శాతం నష్టపోగా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఒక్కొక్కటి 3శాతానికి పైగా, డీఎల్ఎఫ్, ఒబెరాయ్ రియాల్టీ, శోభా, సుంటెక్ రియాల్టీ ఇతర షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో కొన సాగుతున్నాయి. ఫలితాల ప్రభావంతో ఐటీసీ లాభాల్లో ఉంది. బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, హిందూస్తాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి. -
రోలర్ కోస్టర్ రైడ్- చివరికి నష్టాలే
రోజు మొత్తం హెచ్చుతగ్గుల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 27 పాయింట్లు క్షీణించి 34,842 వద్ద నిలవగా.. నిఫ్టీ 16 పాయింట్ల వెనకడుగుతో 10,289 వద్ద స్థిరపడింది. రెండో దశ కోవిడ్-19 కేసుల ఆందోళనలతో బుధవారం అమెరికా మార్కెట్లు పతనంకాగా.. దేశీయంగానూ ట్రేడింగ్ ప్రారంభంలోనే అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ తొలుత 34,500 వద్ద కనిష్టాన్ని తాకగా.. తదుపరి 35,082 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఇదే విధంగా నిఫ్టీ 10,362- 10,195 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020లో 5 శాతం క్షీణత చవిచూడనున్నట్లు ఐఎంఎఫ్ తాజాగా వేసిన అంచనాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడంతో మార్కెట్లు ఒడిదొడులను ఎదుర్కొన్నట్లు తెలియజేశారు. ఎఫ్ఎంసీజీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఎఫ్ఎంసీజీ 2 శాతం పుంజుకోగా.. ఫార్మా 0.8 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ఐటీ, రియల్టీ, మెటల్, పీఎస్యూ బ్యాంక్స్ 1.2-0.5 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, ఐవోసీ, ఐషర్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, శ్రీ సిమెంట్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఎన్టీపీసీ 3-2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్లో ఐటీసీ 6 శాతం జంప్చేయగా.. హీరో మోటో, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్, గెయిల్, వేదాంతా, హెచ్యూఎల్, సిప్లా, ఐసీఐసీఐ, ఎస్బీఐ 3-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. ఐబీ హౌసింగ్ జోరు డెరివేటివ్స్లో కెనరా బ్యాంక్, బెర్జర్ పెయింట్స్, ఎన్ఎండీసీ, హెచ్పీసీఎల్, అమరరాజా, పేజ్ ఇండస్ట్రీస్ 4-2 శాతం మధ్య పతనంకాగా.. ఐబీ హౌసింగ్, పిరమల్, ఉజ్జీవన్, నాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్, మ్యాక్స్ ఫైనాన్స్, మణప్పురం, చోళమండలం, సన్ టీవీ 9.2- 4.6 శాతం మధ్య జంప్చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1534 లాభపడగా.. 1166 నష్టపోయాయి. ఎఫ్పీఐలు భేష్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1767 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1525 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 169 కోట్లు, డీఐఐలు రూ. 454 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 424 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 1,288 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
నష్టాల ప్రారంభం : లాభాల్లోకి సూచీలు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత బలహీనపడ్డాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, సరిహద్దులో పెరుగుతున్నఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్ 241 పాయింట్ల నష్టంతో 33363 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 9845 వద్ద ట్రేడ్ అయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు నష్ట పోతున్నాయి. కోటక్ మహీంద్ర, ఎస్ బీఐ, ఇండస్ ఇండ్ బాగా నష్టపోతున్నాయి. దీంతో బ్యాంకు నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. మరోవైపు ఫార్మ ,ఐటీ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 79 పాయింట్లు పుంజుకోగా, నిఫ్టీ 22 పాయింట్లు ఎగిసి 9950 ఎగువకు చేరింది. కీలక సూచీల్లో ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం కారణంగా ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగనుందని నిపుణులు భావిస్తున్నారు. చదవండి : నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్! -
ఈ చిన్న షేర్లకు స్పీడ్ లిమిట్ లేదు!
సానుకూల ప్రపంచ సంకేతాలతో మూడో రోజూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్సెషన్ నుంచీ ఒడిదొడుకులను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 40 పాయింట్ల స్వల్ప లాభంతో 34,411కు చేరగా.. నిఫ్టీ 10 పాయింట్లు బలపడి 10,177 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన చిన్న షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో ఐటీడీసీ లిమిటెడ్, ఎస్ఎంఎస్ లైఫ్సైన్సెస్, మురుడేశ్వర్ సిరామిక్స్, హిందుస్తాన్ నేషనల్ గ్లాస్, అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ చోటు సాధించాయి. ఐటీడీసీ లిమిటెడ్ టూరిజం డెవలప్మెంట్ రంగ ఈ పీఎస్యూ షేరు అమ్మేవాళ్లు తక్కువకాగా.. కొనేవాళ్లు అధికమై ఎన్ఎస్ఈలో 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 21 ఎగసి రూ. 227 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 1,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి. ఐబీ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఇండియాబుల్స్ గ్రూప్లోని ఈ కంపెనీ షేరు అమ్మేవాళ్లు తక్కువకాగా..ఎన్ఎస్ఈలో కొనేవాళ్లు అధికమై 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 4 ఎగసి రూ. 43 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 39,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 40,500 షేర్లు ట్రేడయ్యాయి. ఎస్ఎంఎస్ లైఫ్సైన్సెస్ హెల్త్కేర్ రంగ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో అమ్మేవాళ్లు తక్కువకాగా.. కొనేవాళ్లు అధికమై 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 55 ఎగసి రూ. 332 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 700 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 3,500 షేర్లు చేతులు మారాయి. మురుడేశ్వర్ సిరామిక్స్ సిరామిక్స్, విట్రిఫైడ్ టైల్స్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో అమ్మేవాళ్లు తక్కువకాగా.. కొనేవాళ్లు అధికమై 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 3.4 ఎగసి రూ. 20.5 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 14,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 2.63 లక్షల షేర్లు చేతులు మారాయి. హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ గ్లాస్ కంటెయినర్స్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో అమ్మేవాళ్లు తక్కువకాగా.. కొనేవాళ్లు అధికమై 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 7.7 ఎగసి రూ. 46.3 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 2,100 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 17,500 షేర్లు చేతులు మారాయి. -
ఆరంభ లాభాలు ఆవిరి : తీవ్ర ఒడిదుడుకులు
సాక్షి, ముంబై : అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. అయితే ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభంలో 150 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 23 పాయింట్లు లాభాలకు పరిమితమై 34411 వద్ద ఉంది. 10300 స్థాయిని అధిగమించిన నిఫ్టీ కూడా 11 పాయింట్ల లాభంతో 10178 వద్ద కొనసాగుతోంది. వరుస లాభాలనుంచి ట్రేడర్ల లాభాల స్వీకరణతో బ్యాంకు నిఫ్టీ కూడా నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. వొడాఫోన్, టైటన్, ఎస్బీఐ, హెచ్ డీఎఫ్ స , గెయిల్ నష్ట పోతున్నాయి. -
6 రోజుల ర్యాలీకి బ్రేక్- చివరికి నష్టాలే
చిట్టచివరికి ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 129 పాయింట్లు క్షీణించి 33,981 వద్ద నిలవగా.. 32 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 10,029 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ 34,000 పాయింట్ల మైలురాయి దిగువన స్థిరపడింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందినప్పటికీ ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు మిడ్సెషన్ నుంచీ నేలచూపులకే పరిమితమయ్యాయి. ఎంపిక చేసిన కౌంటర్లలో తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. వెరసి సెన్సెక్స్ ఇంట్రాడేలో 34,310 వద్ద గరిష్టాన్ని, 33,711 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 10,124- 9944 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. పీఎస్యూ బ్యాంక్స్ ప్లస్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ఫార్మా, ఐటీ, పీఎస్యూ బ్యాంక్స్ 4-1 శాతం మధ్య పుంజుకోగా.. ప్రయివేట్ బ్యాంక్స్ 3 శాతం, రియల్టీ 2 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, కొటక్ మహీంద్రా, యాక్సిస్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్సర్వ్ 4.7-2.4 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే వేదాంతా, ఎయిర్టెల్, జీ, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, విప్రో, సిప్లా, హెచ్సీఎల్ టెక్, పవర్గ్రిడ్, టీసీఎస్ 7.7-2.4 శాతం మధ్య జంప్చేశాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్స్లో చోళమండలం, బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఉజ్జీవన్, పిరమల్, అపోలో టైర్ 8.3-4 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. ఐడియా, ఇండిగో, జిందాల్ స్టీల్, పీవీఆర్, ఎస్ఆర్ఎఫ్, లుపిన్ 10-5 శాతం మధ్య జంప్చేశాయి. బీఎస్ఈలో 1304 షేర్లు లాభపడగా.. 1148 నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,851 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 782 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. -
బ్యాంక్ నిఫ్టీ వీక్- ఈ చిన్న బ్యాంకులు భేష్
ఆటుపోట్ల మధ్య స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. అయితే తొలుత అమ్మకాల ఒత్తిడికి లోనైన ప్రభుత్వ రంగ బ్యాంక్ కౌంటర్లు టర్న్అరౌండ్ అయ్యాయి. అయినప్పటికీ ప్రయివేట్ రంగ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాల కారణంగా ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 2 శాతం క్షీణించింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు పీఎస్యూ బ్యాంక్ కౌంటర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ట్రేడింగ్ పరిమాణం ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్ కౌంటర్లు.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ సింద్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జేఅండ్కే బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ 8-1.3 శాతం మధ్య ఎగశాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదవుతోంది. జోరు తీరిలా ఐవోబీ కౌంటర్లో గత నెల రోజుల ట్రేడింగ్ సగటు బీఎస్ఈలో 1.46 లక్షల షేర్లుగా నమోదుకాగా.. మిడ్సెషన్కల్లా 5.01 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ బాటలో ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్ సగటు 6.45 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 10.06 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇక యూనియన్ బ్యాంక్ కౌంటర్ సగటు 7.91 లక్షల షేర్లుకాగా.. 10.35 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కాగా.. ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 7.70 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ సగటు పరిమాణం 11,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.2 లక్షల షేర్లు చేతులు మారాయి. -
భారీ ఊగిసలాట, చివరికి లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిసాయి. కీలక సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య ఊగిస లాడాయి. ఆరంభంలో పాజిటివ్ గా ఉన్న సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఆ తరువాత కొనుగోళ్లతో పుంజుకుని ఒక దశలో దాదాపు 500 పాయింట్లు ఎగిసింది. ఈ లాభాలనుంచి వెనక్కి తగ్గి, చివరి గంటలో మళ్లీ ఊపందుకుంది. సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంతో 31685 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు ఎగిసి 9270 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 9250 స్థాయిని నిలబెట్టుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్ల లాభాలు మార్కెట్ కు భారీ ఊతమిచ్చాయి. (పెట్రో షాక్, నష్టాల్లో మార్కెట్లు ) బజాజ్ ఫిన్ సర్వ్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్ సీ, గెయిల్, భారతి ఎయిర్టెల్, హీరో, మెఓటో, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ భారీగా లాభపడగా, ఐటీసీ, భారతి ఇన్ ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఐవోసీ, టీసీఎస్, యూపీఎల్, హెచ్ యూఎల్, యాక్సిస్ ఇన్ఫోసిస్, సిప్లా టాప్ లూజర్స్ గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి బుధవారం బలహీపడింది.17 పైసలు క్షీణించి 75.80 వద్ద ట్రేడ్ అయింది.చివరికి 75.76 వద్దస్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మంగళవారం 75.63 వద్ద ముగిసింది. చదవండి : పెట్రో వాత : అక్కడ పెట్రోలు ధర రూ. 2 పెంపు -
భారీ లాభాలు, ఒత్తిడిలో సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఆరంభంలోనే 450 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ 32 వేలను టచ్ చేసింది. నిఫ్టీ కూడా 9350 పాయింట్లను అధిగమించింది. కానీ లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలను కోల్పోయింది. తిరిగి పుంజుకుని సెన్సెక్స్333 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 9341 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాలు ఫ్లాట్ గా ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ లాభాల్లో ఉన్నప్పటికీ హై స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఫార్మా షేర్లు నష్టపోతున్నాయి. టాటామోటార్స్, ఎస్ బీఐ, వేదాంతా, ఓఎన్ జీసీ యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర, రిలయన్స్ నష్టపోతుండగా ఫలితాలపై అంచనాలతో ఇన్ఫోసిస్, మెరుగైన ఫలితాలను ప్రకటించి హెచ్డీఎఫ్సీ , టీసీఎస్ లాభాపడుతున్నాయి. -
లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 300 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. కానీ వెంటనే పుంజుకుని స్వల్ప లాభాల్లోకి మళ్లాయి. తిరిగి అమ్మకాల ధోరణి నెలకొంది. ఇలా లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 30434 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8953 వద్ద ట్రేడ్ అయింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో బలహీనపడిన సెన్సెక్స్ 220 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. బ్యాంకింగ్, ఐటీ రంగంలో ఒత్తిడి కొనసాగుతుండగా, ఫార్మా, ఎఫ్ ఎంసీజీ లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్ర, కోటక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ , టీసీఎస్, హీరో మోటో, టైటన్, ఐషర్ మోటార్స్ భారీగా నష్టపోతుండగా వేదాంతా, యూపీఎల్, లార్సెన్, హిందాల్కో, జీ, పవర్ గ్రిడ్, గెయిల్, రిలయన్స్ లాభపడుతున్నాయి. -
లాభాల్లోకి మార్కెట్లు, తప్పని ఊగిసలాట
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో నష్టాలతో కనిపించినా వెంటనే 200 పాయింట్లకు పైగా ఎగిసాయి. గ్లోబల్ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నా.. కీలక సూచీలు స్వల్ప లాభాల్లో మందకొడిగా ట్రేడవుతున్నాయి. కరోనా వ్యాప్తి విస్తృతంకానుందన్న అంచనాలతో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుండడంతో అనేక రంగాలకు చెందిన స్టాక్స్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో 26854 వద్ద, 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 7853 వద్ద ట్రేడవుతోంది. 228 పాయింట్లు నష్టంతో బ్యాంక్ నిఫ్టీ 16879 వద్ద ట్రేడవుతోంది. తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. మరికొంత కాలంపాటు స్టాక్ మార్కెట్లకు లాభనష్టాల మధ్య ఊగిసలాట తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక అంశాలను ప్రకటించిన అనంతరం స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా లాభాలతో ముగిసాయి. ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాల్లోని షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండగా.. హెల్త్కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు పాజిటివ్గా ఉన్నాయి. రిలయన్స్ జియోలో వాటాను కొనుగోలు చేసేందుకు ఫేస్బుక్ చర్చలు జరుపుతోందన్న వార్తలో రిలయన్స్ భారీగా లాభపడుతోంది. ఇంకా నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్గా ఉండగా, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ షేర్లు టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు లాక్ డౌన్ కారణంగా మనీ మార్కెట్లకు సెలవు. -
లాభనష్టాల సయ్యాట, ఐటీ జూమ్
సాక్షి, ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. వెంటనే నష్టాలలోకి ప్రవేశించాయి. కోవిడ్ -19 మహమ్మారి ఆర్థిక పతనానికి వ్యతిరేకంగా ఆర్థిక టాస్క్ఫోర్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఉద్దీపన ప్యాకేజీ ఆశల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు సెషన్ల నష్టాలకు శుక్రవారం చెక్ పెట్టాయి. నేడు కూడా లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడిన సెన్సెక్స్ ఒక దశలో 2వేల పాయింట్లు ఎగిసి 30,418 పాయింట్ల స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా భారీగా లాభపడి 8,883 వద్దకు చేరింది. ప్రస్తుతం 1038 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 29340 వద్ద, నిఫ్టీ 316 పాయింట్లు ఎగిసి 8573 వద్ద కొనసాగుతోంది. తొలుత సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 2846 వద్ద ప్రారంభమై 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. బ్యాంకింగ్ షేర్లు నష్టపోతుండగా, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 10.75 శాతం ఎగిసాయి. దీంతోపాటు ఎనర్జీ, కన్స్యూమర్ గూడ్స్ స్టాక్స్లో లాభాలు మార్కెట్లకు మద్దతు ఇ'స్తున్నాయి. ఓఎన్జిసి, గెయిల్, విప్రో, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీ అత్యధిక శాతం లాభపడ్డాయి. -
తీవ్ర ఒడిదుడుకులు, చివరికి నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య చివరికి భారీ నష్టాలతో ముగిసాయి. కోవిడ్-19 ప్రభావంతో వరుసగా కుదేలవుతున్న కీలక సూచీలు గురువారం కూడా అదే బాటలో పయనించాయి. ఆరంభ నష్టాలనుంచి కోలుకుని మిడ్సెషన్లో కనిష్టం నుంచి సెన్సెక్స్ 2650 పాయింట్లు, నిఫ్టీ 600 పాయింట్లు, నిఫ్టీ బ్యాంకు 2100 పాయింట్లు ఎగిసాయి. కానీ డెరివేటివ్ కౌంటర్ ముగింపు నేపథ్యంలో తిరిగి అమ్మకాలు భారీగా నెలకొన్నాయి. దీంతో సెన్సెక్స్ 581 పాయింట్లు, నిఫ్టీ 199 పాయింట్లు నష్టంతో ముగిసాయి. దీంతో సెన్సెక్స్ 28500, నిఫ్టీ 8500 పాయింట్లను నిలబెట్టుకోలేక పోయాయి. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా ఫైనాన్షియల్ స్టాక్స్ నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ కూడా 5.3 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.5 శాతం, ఐటి 3 శాతం, నిఫ్టీ బ్యాంక్ 2.6 శాతం క్షీణించాయి. ఇండెక్స్ హెవీవెయిట్స్ ఆర్ఐఎల్, ఎల్ అండ్ టీ మారుతి సుజుకి భారీగా నష్టపోయాయి. ఐటీసీ, భారతి ఎయిర్టెల్, కోటక్ మహీంద్ర, హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, హీరో మోటో, ఐవోసీ లాభపడ్డాయి. మరోవైపు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. -
సుప్రీం షాక్, గరిష్టంనుంచి 500 పాయింట్లు పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలనుంచి అనూహ్యంగా నష్టాల్లోకి జారి బలహీనంగా కొనసాగుతున్నాయి. ఏజీఆర్ చెల్లింపుల విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన టెలికాం కంపెనీలకు చుక్కెదురు కావడంతో మార్కెట్లో అనూహ్య అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలుకొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి ఏకంగా 519 పాయింట్లు, నిఫ్టీ ఇంట్రాడే హై నుంచి 148 పాయింట్లను కోల్పోయాయి. మిడ్ సెషన్ అనంతరం పుంజుకుని, సెన్సెక్స్ 110 పాయింట్లు క్షీణించి 41344 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు పతనమైన 12140 వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఇంకా లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. వారాంతంలో చివరి గంట ట్రేడింగ్ కీలకం. ప్రధానంగా బ్యాంకుల, టెలికాం సెక్టార్ నష్టాలు ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. అయితే భారతి ఎయిర్ టెల్ మాత్రం లాభాల్లో కొనసాగుతోంది. వోడాఫోన్ ఐడియా ఏకంగా 17శాతం కుదేలైంది. ఐడియా, అవెన్యూ సూపర్మార్కెట్స్, భారతి ఇన్ఫ్రాటెల్, గెయిల్ తదితరాలు నష్టపోతున్నాయి. యస్ బ్యాంకు, యూపీఎల్, బీపీసీఎల్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంకు లాభపడుతున్నాయి. -
యుద్ధ ఉద్రిక్తత, తీవ్ర ఒడిదుడుకులు
సాక్షి, ముంబై: ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను రాజేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో ఆసియా స్టాక్మార్కెట్లు విలవిల్లాడాయి. ఫలితంగా ఆరంభంలోనే దేశీయ స్టాక్మార్కెట్ 350పాయింట్లు, నిఫ్టీ 100నపాయింట్లకు పైగా కుప్పకూలింది. కానీ వెంటనే పుంజుకున్నా తిరిగి నిఫ్టీ 12వేల దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 98 పాయింట్ల నష్టంతో 40770 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల క్షీణించి 12011 వద్ద కొనసాగుతున్నాయి. తీవ్ర ఊగిసలాట ధోరణి నెలకింది. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఎనర్జీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అటు రూపాయి బలహీనత నేపథ్యంతో ఐటీ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. టీసీఎస్, అల్ట్రాటెక్, టెక్ మహీంద్ర, బజాజ్ ఆటో, రిలయన్స్, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ లాభపడుతుండగా, బీపీసీఎల్, లార్సెన్, జీ, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, హిందాల్కో పవర్ గ్రిడ్, యూపీఎల్ నష్టపోతున్నాయి. యుద్ధవాతావరణం చమురు ధరలకు ఊతమిచ్చింది. ఇరాక్లోని అమెరికా రెండు ఎయిర్బేస్లపై బాలిస్టిక్ క్షిపణి దాడి అనంతరం బుదవారం ఉదయం చమురు ధర 4.5 శాతం ఎగిసింది. డబ్ల్యుటిఐ 4.53 శాతం పెరిగిబ్యారెల్ 65.54 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ 70 డాలర్లును తాకినా,ప్రస్తుతం 69.29వద్ద వుంది. దీంతో మంగళవారం కొద్దిగా శాంతించిన పుత్తడి ధరలో నేడు మరోసారి పుంజుకున్నాయి. ఏడేళ్ల గరిష్టాన్ని తాకాయి. -
నష్టాల్లో సాగుతున్న స్టాక్మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. బలహీనంగా ప్రారంభమైన ప్రస్తుతం సెన్సెక్స్ 66 పాయింట్లు క్షీణించి 40,265 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నీరసించి 11,888 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ఫార్మా, ఐటీ, ఆటో నష్టపోతుండగా, పీఎస్యూ బ్యాంక్స్ స్వల్పంగా లాభపడుతున్నాయి. యస్ బ్యాంక్, జీ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, బ్రిటానియా, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లోనూ, సన్ ఫార్మా, సిప్లా, కోల్ ఇండియా, గ్రాసిమ్, నెస్లే, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫ్రాటెల్, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, ఐషర్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. మరోవైపు మూడీస్ ఇన్వస్టర్ సర్వీసెస్ దేశ ఔట్లుక్ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో శుక్రవారం అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. -
లాభనష్టాల ఊగిసలాటలో సూచీలు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఒక దశలో 100 పాయింట్లకు పైగా పుంజుకున్నప్పటికీ, 300 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 111 పాయింట్లు క్షీణించి 39 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 38 పాయింట్లు పతనమై 11,544వద్ద ట్రేడవుతోంది. దీంతో కీలకమైన 11600 స్థాయిని కోల్పోయింది. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాలు పుంజుకోగా, రియల్టీ నష్టపోతోంది. ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐషర్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టైటన్ లాభపడుతుండగా, ఇన్ఫ్రాటెల్ ఏకంగా 6 శాతం పతనమైంది. యస్ బ్యాంక్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, ఎయిర్టెల్, వేదాంతా,ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టాఆ మోటార్స్, ఇండస్ఇండ్ నష్టపోతున్నాయి. -
తీవ్ర ఒడిదుడుకులు : 10850 దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ లాభాల నుంచి వెనక్కి తగ్గిన సెన్సెక్స్ ప్రస్తుతం 42 పాయింట్లు క్షీణించి 36,682 వద్ద వుంది. అయితే నిఫ్టీ 11 పాయింట్లు లాభంతో 10,855 వద్ద ట్రేడవుతోంది. మిడ్ సెషన్ నుంచి తీవ్ర ఒడిదుడుకుల ధోరణి కొనసాగుతోంది. తొలుత సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ ఒకదశలో 150 పాయింట్లకు పైగా నఫ్టోయింది. మళ్లీ 100 పాయింట్లకు పైగా పుంజుకుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉంది. మెటల్, ఆటో, ఫార్మా లాభపడుతుండగా, రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ నష్టపోతున్నాయి. టాటామోటార్స్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐవోసీ, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, గెయిల్ లాభపడుతున్నాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, హెచ్యూఎల్, హెచ్సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ నష్టపోతున్నాయి. -
లాభాల్లోకి మళ్లిన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్నా, అనంతరం 100 పాయింట్లకు పైగా క్షీణించింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ మిడ్సెషన్ తరువాత మరింత పుంజుకుంది. సెన్సెక్స్ 140 పాయింట్లు ఎగిసి 36703 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 10829 వద్ద కొనసాగుతోంది. ప్రధానంగా ఫార్మా ఆటో ఎఫ్ఎంసీజీ నష్టపోతుండగా పీఎస్యూ బ్యాంక్స్, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్ లాభపడుతున్నాయి. భారతి, ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ, విప్రో, ఎన్టీపీసీ, వేదాంతా, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభ పడుతున్నాయి. మరోవైపు సన్ ఫార్మా 7 శాతం, టాటా మోటార్స్ 5 శాతం చొప్పున పతనం కాగా.. ఏషియన్ పెయింట్స్, జీ, మారుతీ, బ్రిటానియా, టైటన్, ఇండస్ఇండ్, బీపీసీఎల్, యస్ బ్యాంక్, టెక్ మహీంద్రా నష్టపోతున్నాయి. -
ఊగిసలాట: 120 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. డెరివేటివ్ సెప్టెంబర్ సిరీస్కు శుభారంభాన్నిచ్చిన మార్కెట్లు అనంతరం ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. తొలుత 250 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ తిరిగి అదే స్థాయిలో కుదేలైంది. మిడ్ సెషన్ తరువాత తిరిగి పుంజుకుని 124 పాయింట్లు జంప్ చేసి 37193 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 28 పాయింట్లు లాభంతో 10975 వద్ద 11వేల దిశగా సాగుతోంది. అమెరికా, చైనా మధ్య తిరిగి వచ్చే వారం నుంచీ వాణిజ్య వివాద పరిష్కార చర్చలు ప్రారంభంకానున్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్ 2 శాతం క్షీణించగా ఆటో 0.4 శాతం డీలాపడింది. అయితే మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగ లాభాలు మార్కెట్కు బలాన్నిస్తున్నాయి. వేదాంతా, టాటా స్టీల్, హిందాల్కో, జీ, విప్రో, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్యూఎల్, ఐటీసీ, బ్రిటానియా లాభపడుతుండ పవర్గ్రిడ్, ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఐబీ హౌసింగ్, ఎల్అండ్టీ, యాక్సిస్, ఐవోసీ, బీపీసీఎల్ నష్టపోతున్నాయి. -
లాభనష్టాల ఊగిసలాట
సాక్షి,ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. వెంటనే తేరుకుని స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 43 పాయింట్లు ఎగిసి 38779 వద్ద, నిప్టీ 4 పాయింట్ల నామమాత్రపు లాభాలతో 11558 వద్ద కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, యెస్ బ్యాంక్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ షేర్లు టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇన్ఫోసిస్ రికార్డు స్థాయిని తాకింది. అటు ఫలితాల బూస్ట్తో అవెన్యూ సూపర్ మార్కెట్ కూడా లాభపడుతోంది. మరోవైపు ఇండియా బుల్స్, వేదాంత, జీ ఎంటర్టైన్మెంట్ , టైటాన్ కంపెనీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ ఏకంగా 27శాతం పతనమైంది. -
లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు
సాక్షి, ముంబై : లాభాలతో ఉత్సాహంగా కదుతున్న దేశీ స్టాక్మార్కెట్లు ఉన్నట్టుండి నష్టాల్లోకి జారుకున్నాయి. 150 పాయింట్లకు పైగా ఎగిసినా.. అమ్మకాలు వెల్లువెత్తడంతో 100పాయింట్లకు పైగా పతనమైంది. ఆరంభంలో స్వల్ప ఒడిదొడుకులకు లోనైనా మిడ్సెషన్ తరువాత కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అనంతరం మళ్లీ బలహీన పడ్డాయి. కేవలం పది-పదిహేను నిమిషాల్లో ట్రెండ్ రివర్స్ అవుతున్న ధోరణి కనిపిస్తోంది. సెన్సెక్స్ 111 పాయింట్లు పతనమై 38,711 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని 11,546 వద్ద ట్రేడవుతోంది. దీంతో నిఫ్టీ 11600 దిగువకు చేరింది. మెటల్, రియల్టీ, మీడియా రంగాలు లాభపడుతుండగా, ప్రయివేట్ బ్యాంక్స్ స్వల్పంగా నష్టపోతున్నాయి. టాటా స్టీల్, సన్ఫార్మా, ఎన్టీపీసీ, వేదాంతా, యూపీఎల్, హీరో మోటో, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ లాభపడుతున్నాయి. మరోవైపు విప్రో, ఎల్ అండ్ టీ, యాక్సిస్, ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఐవోసీ, పవర్గ్రిడ్, ఇన్ఫ్రాటెల్ స్వల్పంగా నష్టపోతున్నాయి. అలాగే క్యూ1 ఫలితాల్లో నిరాశపర్చడంతో ఇండస్ ఇండ్ బ్యాంకులో అమ్మకాలు కొనసాగుతున్నాయి. టెక్ మేజర్ ఇన్ఫోసిస్ ఇవాళ క్యూ1 ఫలితాలును విడుదల చేయనుంది. పాజిటివ్ అంచనాలతో ఇన్ఫోసిస్ స్వల్పంగా లాభపడుతోంది. -
పీఎస్యూ బ్యాంక్స్ అండతో ప్లాట్ ముగింపు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి బాగా కోలుకున్నా రోజంతా వోలటైల్గా కొనసాగింది. చివరికి మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 10 పాయింట్లు మేర లాభపడగా, నిఫ్టీ 2 పాయింట్ల నష్టాలకు పరిమితమై 11555 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకులు భారీగాకోలుకోవడంతో మార్కెట్ నష్టాలనుంచి తెప్పరిల్లింది. ఫార్మ, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియల్, ఇన్ఫ్రా సెక్టార్లలోకొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు నష్టపోయాయి. బజాన్ ఫిన్, హీరోమోటోకార్ప్, రిలయన్స్ అదానీ పవర్, సన్ ఫార్మ , భారతి ఎయిర్టెల్ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. గెయిల్, టైటన్, యూపీఎల్, టీసీఎస్, హెచ్సీఎల్టెక్, ఐటీసీ, మారుతి నష్టపోయాయి. -
నష్టాలు.. లాభాలు...మార్కెట్ల ఊగిసలాట
సాక్షి, ముంబై : దేశీ స్టాక్మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభ సెంచరీ లాభాలను కోల్పోయి దాదాపు 150 పాయింట్ల నష్టాలలోకి జారుకుంది. కానీ మిడ్ సెషన్ తరువాత మళ్లీ పుంజుకుని సెంచనీ లాభాలవైపు పయనిస్తోంది. సెన్సెక్స్ 71 పాయింట్లు ఎగిసి 39757 వద్ద, నిఫ్టీ సైతం 21 పాయింట్ల లాభంతో 11,888 వద్ద ట్రేడవుతోంది. రియల్టీ, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ, ఆటో నష్టపోతుండగా ఎఫ్ఎంసీజీ లాభపడుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ నష్టాలు బాగా ప్రభావం చూపిస్తున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్ బ్యాంక్ 6 శాతానికిపైగా పతనం కాగా.. ఐసీఐసీఐ, యాక్సిస్, తదితర బ్యాంకులు నష్టపోతున్నాయి. ఇంకా సన్ ఫార్మా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, హీరో మోటో, బజాజ్ ఫిన్, టైటన్ టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. మరోవైపు యూపీఎల్, ఓఎన్జీసీ, ఎయిర్టెల్, ఐవోసీ, బీపీసీఎల్, ఎన్టీపీసీ, జీ ఎంటర్టైన్ మెంట్ లాభపడుతున్నాయి. -
చివరికి నష్టాలే
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా కన్సాలిడేషన్ బాటలో సాగినా చివరికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ పాయింట్లు క్షీణించి వద్ద, నిఫ్టీ పాయింట్లు నష్టపోయి వద్ద ముగిశాయి. లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లలో చివర్లో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ 50 పాయింట్లు క్షీణించి 39 వేల స్థాకియిక దిగువన, నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 11750కి దిగువన ముగిసాయి. ఐటీ, ఫార్మా నష్టాల్లో ముగియగా, రియల్టీ లాభపడ్డాయి. సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ ఈ రోజు మరింత కుదేలవ్వగా, ఇటీవల బాగా పడిపోయిన ఎస్బ్యాంకు షేరు టాప్ విన్నర్గా నిలిచింది. ఆసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ గెయిల్, బయోకాన్, టీవీఎస్ మోటార్ తదితర షేర్లతోపాటు బ్యాంకింగ్ షేర్లు బాగా నష్టపోయాయి. రిలయన్స్ ఆల్టైం గరిష్టాన్ని నమోదు చేసింది. -
స్టాక్మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ మిడ్ సెషన్లో డే హై నుంచి దాదాపు 475 పాయింట్లు పతనమైంది. మళ్లీ అంతలోనే భారీ నష్టాలనుంచి తేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 152 పాయింట్లునష్టపోయి 38,098 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 11449 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 38వేలకు ఎగువన, నిఫ్టీ 11500 స్థాయికి దిగువన ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ బ్యాంకు కూడా నష్టాల్లోకి జారుకుంది. వెంటనే తేరుకుని 30వేలఎగువన కొనసాగుతోంది. డెరివేటివ్ కౌంటర్ రేపటితో ముగియ నున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అమ్మకాలతో దాదాపు అన్ని సెక్టార్లు నెగిటివ్ జోన్లోకి మళ్లి పోయాయి. హెల్త్కేర్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ , పవర్ ఇలా అన్నిసెక్టార్ల షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్, హెచ్డీఎఫ్సీ భారీగా నష్టపోయాయి. -
ఫ్లాట్గా స్టాక్మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం ఫ్లాట్గా మారాయి. సెన్సెక్స్, నిఫ్టీ తిరిగి పుంజుకుంటూ లాభనష్టాల మధ్య ఊగిస లాడుతున్నాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మ , బ్యాకింగ్ సెక్టార్లు లాభపడుతున్నాయి. ఎయిర్టెల్, భారతి ఇన్ఫ్రాటెల్, ఎస్ బ్యాంకు, వేదాంతా టాప్ లూజర్స్గా నమోదవుతున్నాయి. ఎస్బీఐ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, పీఎన్బీ, జీ ఎంటర్టైన్మెంట్, ఎం అండ్ ఎండ్ , హీరో మోటా లాభపడుతున్నాయి. మరోవైపు రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానంపై మూడు రోజులు సమీక్ష సమావేశం నేటినుంచి ప్రారంభం కానుంది. -
శుభారంభం: అంతలోనే నష్టాలు
సాక్షి, ముంబై: కొత్త ఏడాదిలో స్టాక్మార్కెట్లు శుభారంభం చేశాయి. కానీ అంతలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. 90 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 80 పాయింట్లు నష్టపోయి 35,984 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ సైతం 27 పాయింట్లు క్షీణించి 10,836 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 36వేల దిగువకు,నిఫ్టీ 10900 దిగువరకు చేరింది. భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్టీ, ఇండిగో, యూపిఎల్ లాభపడుతున్నాయి. పవర్గ్రిడ్, హిందాల్కో, ఆసియన్ పెయింట్స్, హెచ్సీఎల్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్ నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి. మరోవైపు కరెన్సీ మార్కెట్లో రూపాయి పాజిటివ్గా ప్రారంభమైంది. 70మార్క్కు దిగువన డాలరు మారకంలో 69.69 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. ప్రస్తుతం 34 పైసలు ఎగిసి 69.64వద్ద కొనసాగుతోంది. -
లాభనష్టాల ఊగిసలాట
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో 50పాయింట్లకు పైగాపుంజుకున్నాయి. అయితే వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, టెక్ నష్టాలు కీలక సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీమార్కెట్ల ప్రతికూల సంకేతాలతో వరుసగా నాలుగోరోజు కూడా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీల్లో సెన్సెక్స్ ప్రస్తుతం 12 పాయింట్ల లాభంతో 38,030 వద్ద,నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి 11,475వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మ, ఆటో సెక్టార్ లాభపడుతోంది. టాటా మెటార్స్, సిప్లా, సన్పార్మ, అరబిందో కోటక్ మహీంద్ర, ఎస్బ్యాంకు డెల్లా, గోద్రెజ్ ప్రాపర్టీస్ లాభపడుతున్నాయి. మరోవైపు జీ , విప్రో ఐసీఐసీఐ, వేదాంతా, భారతి ఇన్ప్రాటెల్, నష్టపోతున్నాయి. మరోవైపు దేశీయకరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. డాలరుమారకంలో 71.92 వద్ద కొనసాగుతోంది. -
ఒడిదుడుకుల్లో స్వల్పలాభాలు
ముంబై :తీవ్ర ఒడిదుడుకుల అనంతరం బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ 47.81 పాయింట్ల లాభంతో 28,024 వద్ద ముగియగా.. నిఫ్టీ 25.15 పాయింట్ల లాభంతో 8,615వద్ద ట్రేడ్ అయింది. ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్ లాభాలను పండించగా.. డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, రిలయన్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు నష్టాలను గడించాయి. బ్యాంకు, ఆటో స్టాక్స్ నెలకొన్న కొనుగోలు మద్దతుతో మార్కెట్లు లాభాల్లో నమోదయ్యాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 0.85 శాతం ఎగిసింది. మరోవైపు ఫార్మా స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫలితాల్లో కుదేలైన డాక్టర్ రెడ్డీస్కు నేడు మార్కెట్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. షేర్లు 10.71శాతం పతనమై, రూ. 2,964గా ముగిసింది. నేడు నిఫ్టీలో టాప్ గెయినర్గా భారతీ ఎయిర్ టెల్ నిలిచింది. ఈ మొబైల్ టవర్ కంపెనీ క్యూ1 లాభాలను 71శాతం పెంచుకోవడంతో, షేర్లు 4.72శాతం లాభపడి, రూ.380.55గా క్లోజ్ అయ్యాయి. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్, యూనిటెడ్ స్పిరిట్స్ సైతం 2.38 శాతం, 4.40 శాతం ఎగిశాయి. అయితే జీఎస్టీ సవరణ బిల్లు ఈ పార్లమెంట్ సెషన్స్ లో 60శాతం ఆమోదం పొందుతుందనే మార్కెట్ విశ్లేషకుల అంచనాల నేపథ్యంలో మార్నింగ్ ట్రేడింగ్లో బెంచ్ మార్కు సూచీలు ఫుల్ జోష్లో నడిచాయి. నిఫ్టీ గతేడాది ఏప్రిల్ నాటి గరిష్టంలో ట్రేడ్ అవ్వగా.. బీఎస్ఈ సెన్సెక్స్ ఏడాది గరిష్టంలో 236 పాయింట్ల పైగా లాభాలను పండించింది. అనంతరం ప్రాఫిట్ బుకింగ్స్, ఇంట్రా ట్రేడ్ గెయిన్స్తో మార్కెట్లు పడిపోయి, తీవ్ర ఒడిదుడుకులో నడిచాయి. చివరికి మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. అటు డాలర్తో పోలిస్తే రూపాయి 0.17 పైసలు లాభపడి, 67.18గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ.85లు నష్టపోయి, రూ.30,827గా నమోదైంది.