wall
-
వరదల్లోనూ డయాఫ్రం వాల్ నిర్మాణం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ పనులకు గోదావరి వరదల సమయంలో ఆటంకం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ దిశా నిర్దేశం చేసింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో నీటి మట్టం 17 మీటర్ల (సముద్ర మట్టానికి) ఎత్తులోపే ఉండేలా గ్రావిటీ ద్వారా, ఎత్తిపోతల ద్వారా సీపేజీ నీటిని ఎప్పటికప్పుడు తోడేయాలని సూచించింది. ఇందుకు మరిన్ని పంపులు ఏర్పాటు చేయాలని చెప్పింది. గియాన్ ఫ్రాన్కో డి సిస్కో, డేవిడ్ బి పాల్తో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్ (డ్యాం సేఫ్టీ రిహాబిలిటేషన్) సరబ్జీత్ సింగ్ బక్షి తదితరులతో కలిసి శనివారం డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించింది. ఆది, సోమవారాల్లో డయా ఫ్రం వాల్ నిర్మాణ విధానంపై చర్చించింది. గోదావరి వరదల సమయంలో డయా ఫ్రం వాల్ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం సుదీర్ఘంగా చర్చించింది. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీని నియంత్రించేందుకు డ్యాం పొడవునా.. అంటే 2,458 మీటర్ల పొడవుతో బట్రెస్ డ్యాంను నిరి్మంచాలన్న గతంలో సూచనపై కూడా చర్చించింది. ఎగువ కాఫర్ డ్యాం దిగువన, ఆ డ్యాం గర్భం వద్ద బట్రెస్ డ్యాంను నిర్మించడం వల్ల సీపేజీ నీటిని సమర్థవంతంగా నియంత్రించ వచ్చని నిపుణులు స్పష్టం చేశారు. బట్రెస్ డ్యాం డిజైన్లో మార్పులు చేర్పులపై సుదీర్ఘంగా చర్చించి.. తగిన సూచనలు చేశారు. ఆ మేరకు డిజైన్ పంపితే ఆమోదిస్తామని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పారు. గోదావరి వరదల సమయంలో ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన ప్లాట్ఫాం సీపేజీ నీటితో ముంపునకు గురికాకుండా ఎప్పటికప్పుడు ఎత్తిపోసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1, గ్యాప్–2 డిజైన్లపై కూడా చర్చించారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సభ్యులు, సీడబ్ల్యూసీ అధికారులు బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. -
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం గ్యాప్–2లో 2016–19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు 6 మీటర్ల ఎగువన సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1.5 మీటర్ల మందంతో నిర్మించేందుకు రాష్ట్ర జల వనరులశాఖ, ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా, సబ్ కాంట్రాక్టు సంస్థ బావర్ రూపొందించిన డిజైన్పై ఆమోద ముద్ర వేసింది. నిర్మాణంలో టీ–16 రకంతో పోల్చితే టీ–5 రకం కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించడమే శ్రేయస్కరమని సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) చేసిన ప్రతిపాదన వైపు సీడబ్ల్యూసీ మొగ్గు చూపింది. అయితే డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ మిశ్రమంపై.. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం పటిష్టతపై 28 రోజుల పరీక్ష నివేదికల ఆధారంగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) సూచన తీసుకోవాలని మెలిక పెట్టింది. నిర్మాణ పనుల్లో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి రాష్ట్ర జల వనరుల శాఖ, మేఘా, బావర్ సంస్థలే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సీడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేశ్ టొతేజా లేఖ రాశారు. కాంక్రీట్ మిశ్రమంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకుని ఒకట్రెండు రోజుల్లో పనులు చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ఇలా.. » ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు సమాంతరంగా 6 మీటర్ల ఎగువన 89.09 మీటర్ల నుంచి 1,485.69 మీటర్ల మధ్య 1,396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తారు.» కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం భారీ గ్రాబర్లు, ట్రెంచ్ కట్టర్ యంత్రాలతో భూమిని తవ్వుతూ ప్యానళ్లను దించుతూపోతారు. రాతి పొర తగిలే(కనిష్టంగా పది మీటర్లు.. గరిష్టంగా 93.5 మీటర్లు) వరకూ ప్యానళ్లను దించి.. ఆ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని పంపుతారు. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్ మిశ్రమంతో కొంత బెంటనైట్ మిశ్రమం కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్ గోడగా ఏర్పడుతుంది. అదే డయాఫ్రం వాల్. » డయాఫ్రం వాల్కు లీకేజీ (సీపేజీ) ఫర్మియబులిటీ (తీవ్రత) ఒక లీజీయన్ లోపు ఉండాలి(ఫర్మియబులిటీని లీజీయన్ లలో కొలుస్తారు). అప్పుడే ఆ డయా ఫ్రం వాల్ నాణ్యంగా ఉన్నట్లు లెక్క. గ్యాప్–1లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్లో లీకేజీ ఫర్మియబులిటీ ఒక లీజీయన్ లోపే ఉండటం గమనార్హం. -
ఆర్ట్తో మూగ జీవుల సంక్షేమంపై అవగాహన..!
’ది కైండ్ అవర్’ ఫౌండేషన్ ద్వారా రెండు వందల యాభైకి పైగా వీధి కుక్కలను కాపాడుతోంది లక్నో వాసి మౌలి మెహ్రోత్రా. కళ ద్వారా జంతువుల పట్ల ప్రేమను ప్రజలకు తెలియజేస్తుంది. వీధుల్లో సృజనాత్మక కుడ్యచిత్రాల ఏర్పాటు, కమ్యూనిటీ ఔట్రీచ్లు, వర్క్షాప్ల ద్వారా పిల్లలకు బాధ్యతను బోధిస్తోంది.‘జంతు హక్కుల‘ గురించి చెబుతున్నప్పుడు చాలామందిలో ‘ఇది అవసరమా?’ అన్నారు. కానీ, ఎవ్వరి మాటలను పట్టించుకోను అంటోంది మౌలి. నలుగురు తిరిగే వీధుల్లో మూగ జంతువులకు సంబంధించిన చిత్రాలను ఉంచుతుంది. తనలాగే ఆలోచించే శ్రేయోభిలాషుల బృందం నుంచి ఆలోచింపజేసే పెయింటింగ్ తెప్పించి, వీధుల్లో ఏర్పాటు చేస్తుంది.కళ– వృత్తి సమతుల్యత23 ఏళ్ల వయస్సులో మౌళి తన చుట్టూ ఉన్న కుక్కలకు ఆహారం ఇవ్వడం, రక్షించడం, సంరక్షణ చేయడం ప్రారంభించింది. ‘నేను దాదాపు 200 కుక్కల బాధ్యత తీసుకున్నాను. ఒక ఏడాది పాటు ప్రతిరోజూ వాటి సంరక్షణ చూశాను. కానీ ఒంటరిగా చేయలేమని గ్రహించాను. నేను ప్రయాణాలు చేయవలసి వస్తే,.. ఈ పని ఎలా కొనసాగుతుంది? నేను చని΄ోతే ఏమి జరుగుతుందో... అని కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. జంతు సంక్షేమం పట్ల తనలో పెరుగుతున్న నిబద్ధతతో కళలలో వృత్తిని సమతుల్యం చేసుకోవడంలో అన్నీ సవాళ్లే. అందుకే, ఈ అభిరుచిని ఒక సంస్థగా మార్చాలనుకున్నాను. అప్పుడే ప్రతి జంతువుకు మరింత ప్రేమను పంచవచ్చు అనుకున్నాను’ అని ఆమె వివరిస్తుంది.లోతైన అవగాహనమౌళి చేసే ప్రయాణంలో సంస్థను ఎలా నమోదు చేసుకోవాలో తెలియక΄ోయినప్పటికీ, చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి సహాయం కోరింది. ‘నేను దీన్ని రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సొసైటీగానా, ట్రస్ట్గానా లేదా సెక్షన్ 8గా జాబితా చేయాలనుకుంటున్నారా అని అధికారులు అడిగారు. నాకు అవేవీ తెలియవు. కానీ, మెల్లగా అర్ధం చేసుకున్నాను. నల్సార్ యూనివ ర్శిటీ నుంచి లా లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు జంతు సంరక్షణ పట్ల అంకితభావం మరింత పెరిగింది. దీంతో వీటిలో శిక్షణ తీసు కున్నా. ఇది నాకు సబ్జెక్ట్లో చాలా లోతైన అవగాహనను ఇచ్చింది. ఈ విషయాలపై పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ఉన్న నేను ఎవరితోనైనా కూర్చున్నప్పుడు చేస్తున్న పని గురించి తప్పు పట్టాలని చూస్తుంటారు. కానీ, వారితో చర్చలు చేయను’ అని వివరిస్తుంది.గోడల నుంచి మనసుల వరకుకైండ్ అవర్ ఫౌండేషన్ పనుల్లో కళను చేర్చడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది మౌళి. అదే వీధి కళ. మౌళి చెబుతున్నట్టుగా వారు నివసించే వ్యక్తులకు విషయం చేరే శక్తివంతమైన వ్యక్తీకరణ ఇది. ‘వారు కుక్కను ఎందుకు చిత్రీకరిస్తున్నారు?‘ అని వీ«ధిలో ఎవరైనా అడుగుతారు. ‘అతను ఈ వీధిలో నివసిస్తున్నాడు కాబట్టి అని మేం చెబుతాం’ అని వివరిస్తుంది మౌళి. మౌళి చిత్రించిన కుక్కల వీధి కుడ్యచిత్రాలు లక్నో చుట్టూ, బయట గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. లక్నోలోని పాత పాడుబడిన ప్రభుత్వ భవనంపై కుక్కను చిత్రించడం ఆమె అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్లలో ఒకటి. దీనికి మంచి స్పందన లభించింది. చాలా మంది ప్రజలు పెయింటింగ్ను గమనించడం ప్రారంభించారు. రిషికేశ్లోని బ్యాక్ప్యాకర్స్ హాస్టల్లో మరొక కుడ్యచిత్రం ఏర్పాటు చేసింది.‘నాలుగేళ్ల క్రితం ఆ చిత్రం ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఆ పెయింటింగ్ను ప్రజలు ఇష్టపడతారు’ అని చెప్పే మౌళి కుడ్యచిత్రాలతో పాటు, ఫౌండేషన్ వర్క్షాప్ల ద్వారా విద్యార్థులతో కలిసి పనుల్లో నిమగ్నమై ఉంటుంది. ‘‘ఒక పాఠశాలలో మేం పిల్లలతో కలిసి గోడకు పెయింట్ చేశాం. వారు ఆ పనిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పెయింటింగ్లో ఉన్న జంతువుల గురించి మేం వారికి నేర్పించాం. వాటిని ఎలా చూసుకోవాలో చెబితే చాలా బాగా అర్ధం చేసుకున్నారు ’అంటూ నాటి విషయాలను గుర్తుచేసుకుంటుంది. వీధి జంతువుల పట్ల బాధ్యతను ్ర΄ోత్సహించడానికి ఫౌండేషన్ స్థానిక సంఘాలతో కలిసి పనిచేస్తుంది. వారు స్థానిక పశువైద్యులతో కలిసి ఆహారం, రెస్క్యూ సేవలు, సంరక్షణనూ అందిస్తున్నారు.పంచుకునే వ్యక్తులతో కలిసి..బాలీవుడ్ నిర్మాత అమన్ విషేరాతో సహా మౌళి నిబద్ధత చాలా మందికి నచ్చింది. ‘ఎప్పటినుండో ఒక షోలో పాల్గొనాలని, జంతు సంక్షేమం కోసం పని చేయాలని ఉందని అడిగాను. అలా మేమిద్దరం కళాకారులం కాబట్టి, ఇతర జీవులు, జంతువుల గురించి పిల్లలకు నేర్పించడంలో కళ నిజంగా సహాయపడుతుందని, మనలాగే వాటికీ భావోద్వేగాలు, బాధలు ఎలా అనుభవిస్తాయో వాస్తవాన్ని గ్రహించాం. ఇప్పుడు పాఠ్యాంశాలు, స్టడీ మెటీరియల్స్, జంతు సంక్షేమం గురించి పిల్లలకు బోధించడానికి పంచుకునే కథలను రూపొందించడానికి కలిసి పని చేస్తున్నాం’ అని వివరించారు. టీమ్లోని మరొక సభ్యురాలు మేఘన మాట్లాడుతూ– ‘ఎవరో ఒక కుక్కపిల్లని నా ఇంటి బయట పడేశారు. ఏమి చేయాలో గుర్తించే ప్రయత్నంలో నేను మౌళి గురించి తెలుసుకున్నాను. నాకు ఆ సంస్థ పనులు చాలా బాగా నచ్చాయి. నేను కూడా వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాను’ అని చెబుతుంది. (చదవండి: సోషల్ మీడియా గెలిపించింది..!) -
పాత పద్ధతిలోనే కొత్త డయాఫ్రం వాల్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు ఎగువన సమాంతరంగా కొత్తగా పాత పద్ధతిలోనే డయాఫ్రం వాల్ నిర్మించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరోసారి స్పష్టం చేసింది. పాత డయాఫ్రం వాల్ను 15 నెలల్లో నిర్మించారని గుర్తు చేస్తూ.. కొత్త డయాఫ్రం వాల్ను ఈ ఏడాది నవంబర్ నుంచి 2025 జూలైలోగా పూర్తి చేయాలని పేర్కొంది.ఒకే సీజన్లో ఆ పనులు చేసేందుకు అదనంగా గ్రాబర్లు, కట్టర్లు, అనుబంధ యంత్ర పరికరాలు, నిపుణులైన సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించింది. డయాఫ్రం వాల్ డిజైన్, నిర్మాణంపై చర్చించేందుకు తక్షణమే వర్క్ షాప్ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ, పీపీఏలకు ఈనెల 20న అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. అందులో కమిటీ సిఫార్సులు ఇవీ.. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు ఎలాంటి ముప్పు లేదు. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీకి అడ్డుకట్ట వేయడానికి టోయ్ (అడుగు భాగం)లో ఫిల్టర్లు వేయాలి. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాం మధ్య సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపు ఎత్తు ఉండేలా సీపేజీ నీటిని గ్రావిటీతో పంపడంతోపాటు పంపులతో ఎత్తిపోయాలి. ⇒ ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి నదీ గర్భం సముద్ర మట్టానికి సగటున 13 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దానిపై ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్ చేసి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి వీలుగా ప్లాంట్ఫామ్ సిద్ధం చేయాలి. పూర్తిగా పొడి వాతావరణంలోనే డయాఫ్రం వాల్ను నిర్మించాలి. ⇒ కొత్త డయాఫ్రం వాల్ను పాత పద్ధతిలోనే నిర్మించాలి. గ్రాబర్లు, కట్టర్లతో రాతి పొర తగిలే వరకూ నదీ గర్భాన్ని తవ్వుతూ వాటిలో బెంటనైట్ మిశ్రమాన్ని పంపాలి. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపితే బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్, ఒకింత బెంటనైట్ మిశ్రమం కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్గా మారుతుంది. అదే డయాఫ్రం వాల్. గత 40 ఏళ్లుగా డయాఫ్రం వాల్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఈ వాల్ ఎక్కడా విఫలమైన దాఖలాలు లేవు. -
చంద్రబాబు తప్పిదం వల్లే.. వాల్ ఢమాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అవగాహనా రాహిత్యం, అస్తవ్యస్థ పనులు మరోసారి బహిర్గతమయ్యాయి. పోలవరం డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కావడానికి, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సాక్షిగా నిర్ధారణ అయింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్వాల్ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారని ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు 1,006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ను నిర్మించారని పేర్కొంది. అయితే నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకపోవడంతో 2017, 2018లో గోదావరి ప్రవాహం డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించిందని గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రమ్వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వరద ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్లో ఐదు చోట్ల 693 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బ తిందని స్పష్టం చేస్తూ ఈనెల 12న కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక అందచేసింది. గతేడాది ఎన్హెచ్పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిర్వహించిన అధ్యయనంలో నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున డయాఫ్రమ్వాల్ దెబ్బ తిన్నట్లు తేల్చగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరో 208 మీటర్ల మేర అధికంగా దెబ్బ తిన్నట్లు తేల్చడం గమనార్హం. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో(యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం గత నెల 7న ప్రాథమిక నివేదిక అందచేసింది. పూర్తి నివేదికను ఈనెల 12న సీడబ్ల్యూసీకి సమర్పించింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ..క్రమబద్ధంగా పనులు» గాడి తప్పిన పోలవరం పనులను 2019 తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, డయాఫ్రమ్ వాల్పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేసింది. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. » ఎగువ కాఫర్ డ్యామ్ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించింది.» దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసింది. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పటిష్టంగా ఉన్నాయి. 2018లో జెట్ గ్రౌటింగ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించకుండా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడం వల్లే సీపేజీ (లీకేజీ) అధికంగా ఉంది.వాస్తవాలకు దర్పణంప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యామ్లు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యామ్ పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరం ప్రాజెక్టులో మాత్రం చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్వాల్ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యామ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్వాల్ కోతకు గురై దెబ్బతింది.ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్రబాబుదేనని సాగునీటిరంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేయగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా అదే అంశాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం. ప్రణాళికారాహిత్యం వల్లే..» పోలవరం జలాశయం పనులను 2016 డిసెంబర్లో ప్రారంభించారు. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనుల కోసం కొండ తవ్వకం పనులకు సమాంతరంగా ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్వాల్ పనులు ప్రారంభించారు. 2017 జూలైలో వరదలు ప్రారంభమయ్యే సమయానికి ఎడమ వైపు నుంచి 1,006 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ను పూర్తి చేశారు. 2017 జూలై తర్వాత వచ్చిన వరద డయాఫ్రమ్వాల్ మీదుగానే ప్రవహించింది. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ నాటికి మిగిలిన 390.6 మీటర్ల పొడవున గ్యాప్–2లో డయాఫ్రమ్వాల్ను పూర్తి చేశారు. 2018లోనూ వరద ప్రవాహం డయాఫ్రమ్వాల్ మీదుగానే ప్రవహించింది. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల 2018 నాటికే డయాఫ్రమ్వాల్ దెబ్బతింది.» 2017లో వరద ప్రవాహం ముగిశాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లను 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. కానీ ప్రవాహ ప్రభావం పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో 2018లో గోదావరి వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతింది. 20 మీటర్ల లోతుతో నిర్మించిన జెట్ గ్రౌటింగ్ వాల్ పటిష్టంగా ఉందో లేదో తెలుసుకోకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించి.. 2019 మార్చి నాటికి పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల గోదావరి కుచించుకుపోయి వాటి మధ్య ప్రవహించాల్సి ఉంటుంది. దీనివల్ల వరద ఉద్ధృతి పెరుగుతుంది. ఆ ప్రభావం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంపై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. దాంతో 2019లో గోదావరి ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో 30 మీటర్ల లోతు వరకూ ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది. డయాఫ్రమ్వాల్ పూర్తిగా దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్ కూడా కోతకు గురైంది. జగన్ సర్కారు పనులపై కమిటీ సంతృప్తి» పోలవరం పనులను 2019 నుంచి గాడిలో పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం» వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ శరవేగంగా పూర్తి» ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహం స్పిల్వే మీదుగా మళ్లింపు» దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతంలో జియో బ్యాగ్లు ఇసుకతో నింపి పూడ్చివేత» 2023 ఫిబ్రవరికి దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి» స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పటిష్టంగా ఉన్నట్లు నిపుణుల కమిటీ సంతృప్తి » గతంలో జెట్ గ్రౌటింగ్ గోడలో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్లో లీకేజీ ఒకే సీజన్లో.. కొత్త డయాఫ్రమ్వాల్ » 2024 నవంబర్ 1 నుంచి 2025 జూలై 31లోగా పూర్తి చేయాలి » పాత డయాఫ్రమ్వాల్కి ఎగువన సమాంతరంగా కొత్తది నిర్మించాలి » కేంద్ర జలసంఘానికి అంతర్జాతీయ నిపుణుల నివేదిక సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్కి ఎగువన కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదించింది. డయాఫ్రమ్ వాల్ పనులను వరదలు తగ్గాక అంటే 2024 నవంబర్ 1న ప్రారంభించి 2025 జూలై 31లోగా పూర్తి చేసేలా నిరంతరాయంగా చేయాలని స్పష్టం చేసింది. ఒకే సీజన్లో డయాఫ్రమ్వాల్ను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ కీలక సిఫార్సులివీ...»గోదావరి వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో డయాఫ్రమ్వాల్ 693 మీటర్ల పొడవున దెబ్బతింది. మరమ్మతులు చేసినా అది పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తుందో లేదో చెప్పలేం. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా కొత్త డయాఫ్రమ్వాల్ని నిర్మించడమే శ్రేయస్కరం.» ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పటిష్టంగా ఉన్నాయి. పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్లో సీపేజీ అధికంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఎగువ కాఫర్ డ్యామ్కు ఎగువన నది మధ్యలో ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్యన సీపేజీ నీటి మట్టం సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపే ఉండాలి. ఆ మేరకు దిగువ కాఫర్ డ్యామ్లో ఏర్పాటు చేసిన గ్రావిటీ స్లూయిజ్ల ద్వారా సీపేజీ నీటిని బయటకు పంపాలి. గ్రావిటీ ద్వారా పంపడానికి సాధ్యం కాని నీటిని ఎత్తిపోయాలి. ఈ పనులను తక్షణమే ప్రారంభించాలి.» నవంబర్ 1 నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడానికి వీలుగా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ఇసుక తిన్నెలను యధాస్థితికి తెచ్చేలా వైబ్రో కాంపాక్షన్ పనులను పూర్తి చేయాలి. సముద్ర మట్టానికి 3 మీటర్ల ఎత్తు వరకూ ఈ పనులను అక్టోబర్లోగా పూర్తి చేయాలి. » కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.. గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, పనులు చేపట్టడంపై వర్క్ షాప్ నిర్వహించాలి.» 2024లో వరదలు తగ్గి పనులు ప్రారంభించడానికి ముందే పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ వర్క్ షాప్ నిర్వహించాలి. సీడబ్ల్యూïÜ, పీపీఏ, జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతిని«దులు పాల్గొనే ఈ వర్క్ షాప్నకు అంతర్జాతీయ నిపుణులు కూడా హాజరవుతారు. -
తప్పిన పెను ప్రమాదం.. ‘సుంకిశాల’లో అసలేం జరిగింది?
సాక్షి, నల్గొండ జిల్లా: సుంకిశాల పంప్ హౌస్ రక్షణ గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. కొన్ని క్షణాలు ముందైనా, ఆలస్యం అయినా భారీగా ప్రాణ నష్టం జరిగేది.పంప్ హౌస్లో షిఫ్ట్కు 115 మంది వరకు కూలీలు పని చేస్తున్నారు. సాగర్ డెడ్ స్టోరేజ్కు చేరిన సమయంలో హైదరాబాద్కు తాగునీటిని అందించడానికి సుంకిశాల పథకం చేపట్టారు. పథకంలో భాగంగా సొరంగ మార్గం నిర్మాణ పనులు చేస్తున్నారు. సొరంగంలోకి సాగర్ నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టగా.. సాగర్ నిండటంతో నీటి ఒత్తిడికి రక్షణ గోడ కూలింది. దీంతో సొరంగం పూర్తిగా మునిగిపోయింది. నీటిలోనే క్రేన్, టిప్పర్లు, ఇతర సాంకేతిక సామాగ్రి మునిగిపోయాయి. కోట్లలో నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ నెల ఒకటినే రక్షణ గోడ కూలినా అధిక యంత్రాంగం గోప్యంగా ఉంచారు. ఆగష్టు ఒకటిన ఉదయం ఆరుగంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జలమండలి అధికారులు నీళ్లు నములుతున్నారు.అసలు అక్కడ ఏం జరగలేదన్నట్లు కప్పిపుచ్చుకునే ధోరణిలో అధికార యంత్రాంగం ఉంది. తిరిగి పనులు ప్రారంభం కావాలంటే వచ్చే వేసవి వరకు ఆగాల్సిందే. -
కొత్త డయాఫ్రమ్ వాల్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కొత్త డయా ఫ్రమ్ వాల్ను నిర్మించాలని కేంద్ర జల్ శక్తి శాఖను కోరుతూ తీర్మానం చేసింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో హామీ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. వీటిని కేంద్ర జల్ శక్తి శాఖకు పంపాలని నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు పనులను జూన్ 30 నుంచి జూలై 3 వరకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్ వోరా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో గోదావరి వరదల ఉధృతికి గ్యాప్–2లో డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందని, దానికి మరమ్మతులు చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తుందని చెప్పలేమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సూచనకు ఆమోదం తెలిపింది.2023 జూన్ 5నే నిధులు మంజూరు » కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో దక్కించుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ప్రోటోకాల్ను తుంగలో తొక్కి.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో పునాది డయా ఫ్రమ్ వాల్ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు.» 2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరదలు.. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయా ఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గరిష్టంగా 36 మీటర్లు.. కనిష్టంగా 26 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి.» వెఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ప్రోటోకాల్ ప్రకారం స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీల పొడవున మళ్లించారు. ఆ తర్వాత దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశారు. కోతకు గురై దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన మేరకు.. 2022 మార్చి 4న అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. » చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్ పునరుద్దరణ, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు. » వాటిని పరిగణనలోకి తీసుకుని.. రెండు దశల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని నిర్ణయించిన కేంద్రం.. వైఎస్ జగన్ జగన్ విజ్ఞప్తి మేరకు తొలి దశ పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, డయా ఫ్రమ్ వాల్ పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.2 వేల కోట్లు వెరసి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు.నాడు వద్దంటూ.. నేడు నిధుల విడుదలకు ప్రతిపాదన» గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తికి అవసరమైనన్ని నిధులు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖను ప్రధాని నరేంద్ర మోదీ అప్పట్లో ఆదేశించారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పలుమార్లు రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో సమావేశమై.. కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మాణంతోపాటు తొలి దశ పూర్తికి రూ.12,157.52 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదించారు. » ఆ నిధులు విడుదల చేయాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే.. 2016 సెప్టెంబర్ 6న పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయం అంటే రూ.15,667.90 కోట్లు ఇవ్వాలని 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. » ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.15,146.28 కోట్లు విడుదల చేసింది. దీనికితోడు రూ.12,157.52 కోట్లు విడుదల చేయాలంటే 2017 మార్చి 15న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ మారుస్తూ తీర్మానం చేయాలి. ఆ మేరకు తీర్మానం చేసి.. నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖ ఈ ఏడాది మార్చి 6న కేంద్ర కేబినెట్కు ప్రతిపాదన పంపింది. » అయితే అప్పటికే ఎన్డీఏలో చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ నిధులు ఇస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల చెవిలో ఊదారు. దాంతో అప్పట్లో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేసి.. నిధులు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గంతో సీఎం చంద్రబాబు తీర్మానం చేయించడం గమనార్హం. -
మరో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిందే
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో గోదవరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సూచించింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్కు మరమ్మతులు చేసినా, దెబ్బతిన్న ప్రాంతాల్లో ‘యూ’ ఆకారంలో నిర్మించి అనుసంధానం చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తుందని చెప్పలేమని తేల్చిచెప్పింది. ఇప్పటికే గోదావరి వరదలను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్తోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను ప్రభుత్వం పూర్తి చేసినందున కొత్త డయాఫ్రమ్ వాల్ను సులభంగా నిర్మించవచ్చని నిపుణుల బృందం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నియమించిన యూఎస్ఏకు చెందిన డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్ యాఫ్రి సంస్థ (స్వీడన్) ప్రతినిధులు నాలుగు రోజులపాటు ప్రాజెక్టును పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. బుధవారం మరోసారి సమీక్షించిన అనంతరం నిపుణుల బృందంతో సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. గతంలో వరదను మళ్లించేలా స్పిల్ వే పూర్తి చేయకుండా, ఎగువ కాఫర్ డ్యామ్ను చేపట్టి ఇరు వైపులా ఖాళీ వదిలేయడం వల్లే వరద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణులు సీడబ్ల్యూసీ చైర్మన్కు తేల్చి చెప్పారు. గ్యాప్–2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల మేర దెబ్బతిందని నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) ఇచ్చిన నివేదికతో ఈ బృందం ఏకీభవించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తది నిర్మించడం శ్రేయస్కరమని సూచించింది.జెట్ గ్రౌటింగ్లో లోపం వల్లే లీకేజీలుఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందు జెట్ గ్రౌటింగ్ చేసేటప్పుడు ఆ ప్రదేశంలో ఇసుక సాంద్రతను తప్పుగా అంచనా వేశారని ఈ బృందం తెలిపింది. అందువల్లే తక్కువ లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి, జెట్ గ్రౌటింగ్ చేశారని, దీనివల్లే లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. లీకేజీలకు కారణాలు కనుక్కోవడానికి కాఫర్ డ్యామ్ పైనుంచి 100 నుంచి 150 మీటర్లకు ఒక చోట మొత్తం 17 చోట్ల బోర్ హోల్స్ వేసి పరీక్షలు చేయాలని సూచించామని తెలిపింది. యాఫ్రి సంస్థ ఇప్పటికే నాలుగు చోట్ల పరీక్షలు చేసిందని వివరించింది. ఆ పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తే.. లీకేజీలను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేమని, కొంతవరకు అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. కొంతవరకు లీకేజీలు ఉన్నప్పటికీ కొత్త డయాఫ్రమ్వాల్ నిర్మాణానికి, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించింది.ముగిసిన అంతర్జాతీయ నిపుణుల పర్యటనఅంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజుల పోలవరం పర్యటన బుధవారం ముగిసింది. వారు బుధవారం విజయవాడ చేరుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి వారి దేశాలకు వెళ్తారు. రెండు వారాల్లో మధ్యంతర నివేదికపోలవరం ప్రాజెక్టు పరిశీలన, అధికారులతో సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సవాళ్లను అధిగమించడం, నిర్మాణాల డిజైన్లపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని నిపుణుల బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థ అంతర్జాతీయ కన్సల్టెంట్ యాఫ్రి సంస్థ సవాళ్లను అధిగమించడానికి చేపట్టాల్సిన నిర్మాణాల డిజైన్లను రూపొందించి తమకు పంపితే.. తాము పరిశీలించి మార్పులుంటే సూచిస్తామని చెప్పింది. యాఫ్రి, తాము ఏకాభిప్రాయంతో నిర్ణయించిన డిజైన్ను సీడబ్ల్యూసీకి పంపుతామని తెలిపింది. ఆ డిజైన్ను సీడబ్ల్యూసీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోదించాకే దాని ప్రకారం పనులు చేపట్టాలని సూచించింది. ఇందుకు సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా అంగీకరించారు. నిపుణల బృందం మధ్యంతర నివేదిక ఇచ్చాక ఢిల్లీలో మరోసారి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులతో సమావేశం నిర్వహిస్తామని వోరా చెప్పారు. -
నాగర్ కర్నూల్: ఈదురుగాలుల బీభత్సం.. గోడ కూలి నలుగురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: తాడూరు మండలం ఇంద్రకల్లో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం కూలీ కుటుంబాల బతుకులను చేసింది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం అకాలంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి గ్రామంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల షెడ్డు కూలి నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.ఇంద్రకల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మాణానికి 6 మంది కూలీలు వెళ్లారు. గోడలు కడుతుండగా ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది పని ముగించుకొని నిర్మాణంలో ఉన్న గోడ పక్కనే కూర్చున్నారు. తీవ్రమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా గోడకూలి కూలీలపై పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గోడలెక్కి అడ్డంగా బుక్కైన పెద్దపులి!
పులి మనుషుల మధ్యకు వస్తే.. దాని మనోగతం ఎలా ఉంటుందో హ్యూమర్ టచ్తో భావోద్వేగాలను కలగలిపి Tiger Comes to Town(టైగర్ కమ్స్ టూ టౌన్) ద్వారా అందించారు రచయిత ఆర్కే నారాయణ్. అరణ్యా వాసాల్లోకి జనం చేరి.. జనావాసాలుగా మార్చేసుకుని మరీ వన్యప్రాణుల్ని ఇబ్బంది పెడుతుంటే.. అవి ‘రేయ్.. ఎవర్రా మీరంతా’’ అని అనుకోకుండా ఉండగలవంటారా?.. ఉత్తర ప్రదేశ్లో ఇవాళ ఓ పెద్దపులిని అధికారులు బంధించారు. దానిని పట్టుకునే సమయంలో అది ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా.. పిలిభిత్ జిల్లా అటవీ ప్రాంతాల్లో పులుల బెడద కొనసాగుతోంది. తాజాగా ఓ పులి దారి తప్పి అట్కోనా గ్రామంలోకి వచ్చింది. రాత్రంతా గోడల మీదకు ఎక్కుతూ పడుకుని ఉండి పోయింది. వీధికుక్కలు మొరుగుతుండడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఆశ్చర్యంగా అది ఎవరి మీదా.. పశువుల మీద కూడా దాడి చేయలేదు. రాత్రి నుంచే ఓ ఇంటి గోడ మీద కునుకు తీస్తూ ఉండిపోయింది. దాని ముఖం మీద లైట్లు వేసినా.. అది పట్టించుకోలేదు. ఉదయం చుట్టూ జనం చేరినా.. వాళ్లను పట్టించుకోకుండా గోడ మీద ఎక్కి కూర్చుంది. Tiger was seen in Pilibhit. Pilibhit Tiger Reserve, surrounded by forests, has its own identity among the tourist places of the country. The tiger that came out of the forest gained a foothold in the populated area. The administration should take concrete steps on this #pilibhit pic.twitter.com/pc6v59mY4z — Aasif Ali Official (@aasif_ali__) December 26, 2023 टाइगर कह रहा है अब वह भी इंसानों के साथ रहेगा, वीडियो उत्तर प्रदेश के पीलीभीत जिले का है, टाइगर रिजर्व जंगल से निकलकर रात 2 बजे अटकोना गांव पहुंचा बाघ गुरुद्वारे की दीवार पर बैठकर आराम फरमा रहा है। #tiger #Pilibhit #UP pic.twitter.com/YIDndUsFXd — Sunil Yadav B+ (@sunilyadav21) December 26, 2023 అయితే పెద్దపులితో ఎప్పటికైనా ప్రమాదమే కదా!. అందుకే దానిని బంధించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అది ఎటూ పోకుండా బారికేడ్లు, వలలు ఏర్పాటు చేశారు. ఈ లోపు.. దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకునే యత్నం చేశారు. ఆ సమయంలో దానిని తోక పట్టి అధికారులు లాగినా.. అది కొంచెం కూడా ఆక్రోశం ప్రదర్శించలేదు. చివరకు దానిని బోనులో వేసుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాని ఆరోగ్య స్థితి.. అది ఎందుకలా ప్రవర్తించింది అనేదానిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పిలిభిత్లో అటవీ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ.. నివాసాల్ని నిర్మించుకుంటూ పోతున్న గ్రామస్తుల్ని అటవీ శాఖ అధికారులు వారిస్తూ వస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందనే విమర్శ ఒకటి ఉంది. A tiger on a wall. But it’s real. The most difficult thing in such situation is to control humans not the wildlife. Scene is from nearby area of Pilibhit. Via @KanwardeepsTOI pic.twitter.com/IE8eXS1Brm — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 26, 2023 -
‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ..
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని అంటుంటారు. పూర్వకాలంలో ఈ రెండు పనులూ ఎంతో శ్రమ, ఖర్చుతో కూడినవి కావడంతో అలా అనేవారు. అయితే ఇప్పుడు ఈ రెండు పనులు రోబోలు అత్యంత సులభంగా చేసేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో కొందరు.. రోబోలను వివాహం చేసుకుంటున్నారనే వార్తలు వింటున్నాం. కొత్తగా ఇప్పుడు ఇళ్లను రోబోలే స్వయంగా కట్టేస్తున్నాయి. అది కూడా అత్యంత ధృఢంగా.. పురాతన పద్ధతిలో.. ఆధునికత మేళవిస్తూ.. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా ఇంటి నిర్మాణంలో బండరాళ్లను ఒక పద్ధతిలో పేర్చడం అనేది ఎంతో శ్రమతో కూడిన పని. ఇందుకోసం శారీరకంగానే కాదు..మానసికంగానూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రోబో ఈ పనిని చిటికెలో చేసేస్తోంది. ఇంటికి అవసరమయ్యే గోడ నిర్మాణాలను చేపట్టే ఈ రోబోట్ పేరు ‘హీప్’(హెచీఈఏపీ) ఇదొక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్. ఇది వాకింగ్ ఎక్స్కవేటర్ కూడా. దీనిని ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధనా సంస్థ బృందం తయారుచేసింది. ఈ రోబోలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్, కంట్రోల్ మాడ్యూల్, తవ్వకాల ఆర్మ్పై లిడార్ సెన్సార్లు ఉన్నాయి. ఈ రోబో తాను చేపడుతున్న తాజా ప్రాజెక్ట్ కోసం నిర్మాణ స్థలాన్ని స్కాన్ చేసి, దాని త్రీడీ మ్యాప్ను రూపొందించడం ద్వారా పనిని ప్రారంభించింది. తరువాత ఆ సైట్లో డంప్ చేసిన బండరాళ్లను గోడలో ఎక్కడ ఉంచాలనేది రికార్డ్ చేసింది. అనంతరం ‘హీప్’ ప్రతి బండరాయిని భూమి నుండి పైకి లేపింది. ఇందుకోసం దాని బరువు, గురుత్వాకర్షణ కేంద్రాన్ని అంచనా వేయడానికి, దాని ప్రత్యేక ఆకారాన్ని రికార్డ్ చేయడానికి సాంకేతికతను ఉపయోగించింది. ఒక అల్గారిథమ్ రూపకల్పన అనంతరం 20 అడుగుల ఎత్తు, 65 మీటర్ల పొడవైన రాతి గోడను నిర్మించడానికి ప్రతి బండరాయిని అది చక్కగా ఇమిడిపోయే ప్లేస్లో అమర్చింది. ఒక్కో బిల్డింగ్ సెషన్కు దాదాపు 20 నుండి 30 బండరాళ్లను వాటి స్థానాల్లో ఉంచింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ నూతన రోబో వ్యవస్థ.. నిర్మాణ రంగాన్ని మరింత సులభతరం చేస్తుంది. బండరాళ్లను తీసుకురావడం మొదలుకొని, వాటితో సరైన గోడను నిర్మించేవరకూ ‘హీప్’ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోబో అధ్యయనానికి సంబంధించిన పత్రం ఇటీవల సైన్స్ రోబోటిక్స్ జర్నల్లో ప్రచురితమైంది. ఈటీహెచ్ జ్యూరిచ్ అందించిన ఈ వీడియోలో ‘హీప్’ గోడ నిర్మాణాన్ని చూడవచ్చు. ఇది కూడా చదవండి: కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం.. -
ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
పురాతన వస్తువులను వేలం పాటల్లో అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం మామూలే ! కానీ, ఒక సాధారణమైన గోడ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయి వార్తలకెక్కింది. వాషింగ్టన్ డీసీలోని ఈ గోడ యజమాని పేరు అలెన్ బర్గ్. ఒకసారి ఈ గోడ పక్కన ఉన్న ఇంటికి నీరు లీక్ అవుతున్నట్లు ఆ ఇంటి యజమాని గమనించాడు. దక్షిణంవైపు గోడకు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల దూలాలు తడిసి శిథిలావస్థకు చేరుకున్నాయని ఇంజినీర్ చెప్పడంతో, ఆ యజమాని అలెన్ను తన గోడ భాగాన్ని సరిచేయాలని కోరాడు. అతడు అందుకు నిరాకరించడమే కాకుండా, ఆ యజమానితో గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో ఆ ఇంటి యజమాని సమస్య పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అలెన్కు కోటిన్నర రూపాయలు జరిమానా విధించింది. దీంతో ఇప్పుడు అలెన్ తనకున్న ఆ ఒక్క ఆస్తి, ఈ గోడను రూ.నలభై లక్షలకు అమ్మకానికి పెట్టాడు. దాదాపు నాలుగేళ్ల పాటు ఎవరూ కొనక పోవడంతో, తన ఇంటిని కాపాడుకోవడం కోసం ఆ పొరుగింటి యజమానే దీనిని కొన్నాడు. ఏది ఏమైనా ఆలెన్కు వాళ్ల తాత ఇచ్చిన ఆ ఒక్క గోడ అతన్ని కోటీశ్వరుడుని చేసింది. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
జేసీ.. జేసీబీ!
తాడిపత్రి: ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణంలో దర్జాగా అసాంఘిక కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవటమే కాకుండా తన అనుచరులతో కలసి కూల్చివేతలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనుల వద్ద వీరంగం సృష్టించారు. జేసీ గ్యాంగ్ కూలగొట్టిన పిల్లర్లను తిరిగి నిర్మించేందుకు ప్రయత్నించిన కార్మికులపై ఆదివారం ఉదయం దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఏం జరిగిందంటే... నాడు–నేడు ఫేజ్ 2 పనుల్లో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను మూడు రోజుల క్రితం చేపట్టారు. జూనియర్ కళాశాల సమీపంలోనే జేసీ ప్రభాకర్రెడ్డి నివాసం ఉంది. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో నిర్మాణ పనుల వద్దకు అనుచరులతో కలసి చేరుకున్న జేసీ ‘రేయ్ జేసీబీతో పిల్లర్లను కూలదోయండిరా..’ అంటూ హుకుం జారీ చేశారు. జేసీబీతో కాంక్రీట్ పిల్లర్లను కూలదోశారు. మర్నాడు అక్కడకు వచ్చిన కూలీలను పనులు నిలిపి వేయాలంటూ జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన అనుచరులు అడ్డగించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రహరీ నిర్మిస్తున్నామని, అడ్డు తగలడం సమంజసం కాదని చెప్పినా వినిపించుకోలేదు. దీనిపై మేస్త్రీ గురుశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్మాణాలను దౌర్జన్యంగా కూలగొట్టడంపై జేసీ ప్రభాకర్రెడ్డి, వెన్నపూస మల్లికార్జునరెడ్డి, సుబ్బయ్య, వడ్డే మధు, సోమశేఖర్ నాయుడు, దినేష్రెడ్డి, పవన్నాయుడు, మునిసిపల్ కాంట్రాక్టర్ తిరుపాల్రెడ్డి, కుమ్మరి వెంకటేష్, రాంబాబు, గురుజాల శివశంకర్రెడ్డి, చరణ్, హరినాథ్రెడ్డి, గండికోట కార్తీక్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ హమీద్ఖాన్ తెలిపారు. -
నేడు జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి సమావేశం
-
వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూపరులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ వీడియోలను చూస్తే జనానికి ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయో అంటూ ముక్కున వేలేసుకుంటాం. కొందరు కార్లను హెలీకాప్టర్లుగా మార్చేస్తూ ఉంటే, మరికొందరు ఇటుకలతో కూలర్ తయారు చేస్తారు. @TansuYegen పేరుతో ట్విట్టర్లో ఈ కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో @TansuYegen పేరుతో ట్విట్టర్లో షేర్ అయ్యింది. ఈ వీడియోలో కొందరు కూలీలు గోడ నిర్మించడం కనిపిస్తుంది. ఇద్దరు కూలీలు రెండు కర్ర చెక్కలపై కూర్చుని కనిపిస్తారు. వారు కిందకు మీదకు కదులుతుంటారు. ఈ చెక్కలకు మరోవైపున ఉన్న కూలీలు ఆ చెక్కలను పైకి కిందకు కదుపుతుంటారు. ఒక కూలీ ఇటుక, సిమెంట్లను పైనున్న కూలీకి అందిస్తుండగా అతను వాటిని పైనున్న కూలీకి అందిస్తుంటాడు. వాటిని అందుకున్న ఆ కూలీ గోడను వేగంగా నిర్మిస్తుంటాడు. Everything can be automated.., pic.twitter.com/VOow1m1b55 — Tansu YEĞEN (@TansuYegen) July 6, 2023 సూపర్ ఐడియా అంటూ.. ఈ వీడియోను ఇప్పటివరకూ 2.5 మిలియన్లమందిపైగా నెటిజన్లు వీక్షించారు. చాలామంది దీనిని సూపర్ ఐడియా అంటూ ఆ కూలీలను మెచ్చుకుంటున్నారు. ఈ టెక్నిక్ నిర్మాణ పనిని మరింత వేగవంతం చేస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. కారణం తెలిస్తే షాకవుతారు.. -
డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట సమాంతరంగా మరో వాల్
సాక్షి, అమరావతి: గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్) వద్ద ఏర్పడిన నాలుగు భారీ అగాధాలు పూడ్చి వయబ్రో కాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తేవడం, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించి పటిష్టం చేసే పనులకు రూ.2022.05 కోట్లతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పనులను సక్రమంగా చేపట్టకపోవడం వల్ల 2019లో వచ్చిన వరదలకు ప్రాజెక్టు పలు చోట్ల తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన డ్యామ్తో పాటు దిగువ కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ల వద్ద పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో పాటు అదనపు వ్యయమూ అవుతోంది. గోదావరి వరద ఉధృతికి ప్రధాన డ్యామ్ వద్ద ఏర్పడిన భారీ అగాధాల పూడ్చివేత, డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడానికి అయ్యే అదనపు వ్యయాన్ని భరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ గత ఏడాది హామీ ఇచ్చారు. డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం దిగువ కాఫర్ డ్యామ్లో దెబ్బ తిన్న ప్రాంతాలను ఇసుకతో నింపిన జియోమెంబ్రేన్ బ్యాగులతో పూడ్చి వయబ్రో కాంపాక్షన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం య«థాస్థితికి తీసుకువచ్చింది. ఆ తరువాత దిగువ కాఫర్ డ్యామ్ను 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసింది. నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించిప్రధాన డ్యామ్ అగాధాల పూడ్చివేత, డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చడానికి దేశంలో అత్యున్నత సంస్థ్ధలైన సీడబ్ల్యూసీ, ఎన్హెచ్పీసీ, ఐఐటీ నిపుణులతో 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మేధోమథనం చేయించింది. ఈ బృందం పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. అగాధాలను ఇసుకతో పూడ్చి వయబ్రో కాంపాక్షన్ చేయాలని సూచించింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో నాలుగు చోట్ల 30 శాతం మేర దెబ్బతిందని తేల్చింది. ఆ నాలుగు ప్రాంతాల్లో ‘యు’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించి పాత దానికి అనుసంధానం చేయాలని ఆదేశించింది. ఈ పనులకు రూ.2022.05 కోట్లు వ్యయం అవుతుందని తేల్చింది. ఆ మేరకు పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. బాబు సర్కారు నిర్వాకమిదీ.. పోలవరంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకాల వల్లే ఈ అదనపు భారం పడుతోందని అధికారవర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు సర్కారే చేపట్టింది. అసలు చేపట్టాల్సిన పనులు చేపట్టలేదు. సులభంగా చేయగలిగే, అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ పునాది, డయాఫ్రమ్ వాల్ను 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. స్పిల్ వేను పునాది స్థాయిలోనే వదిలేశారు. స్పిల్ ఛానల్లో మాస్ కాంక్రీట్ పనులు చేశారు. అప్రోచ్ ఛానల్, ఫైలెట్ ఛానల్లో తట్టెడు మట్టి ఎత్తకుండానే 2018లో ఎగువ, దిగువ కాఫ్ర్ డ్యామ్ల పనులను ప్రారంభించారు. నిర్వాసితులకు పునరావాసంపై మాత్రం దృష్టి పెట్టలేదు. భారీ నష్టం గోదావరి నదికి 2019లో భారీ వరదలు వచ్చాయి. పోలవరం వద్ద 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరికి అంత జాగా లేకపోయింది. దిగువ కాఫర్ డ్యామ్లో ఖాళీ ప్రదేశం 800 మీటర్లకు కుంచించుకుపోయింది. దీంతో వరద ఉధృత్తి మరింత తీవ్రమై ప్రధాన డ్యామ్ వద్ద గరిష్టంగా 35 మీటర్లు, కనిష్టంగా 22 మీటర్లు లోతుతో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్లో 0 నుంచి 600 మీటర్ల వరకు కోతకు గురై 36.5 మీటర్ల లోతుతో భారీ అగాధం ఏర్పడింది. ఇలా చంద్రబాబు నిర్వాకం వల్ల జరిగిన విధ్యంసంతో పోలవరం పనుల్లో జాప్యమే కాకుండా, అదనపు వ్యయాన్నీ భరించాల్సి వస్తోంది. టెండర్లకు రంగం సిద్ధం గోదావరికి వరదలు వచ్చేలోగా ప్రధాన డ్యామ్ వద్ద ఏర్పడిన భారీ అగాధాలను పూడ్చివేత, డయాఫ్రమ్ వాల్ను పటిష్టవంతం చేసే పనులను పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఆదేశించిన నేపథ్యంలో తక్షణమే ఆ పనులు చేపట్టడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు.నిబంధనల మేరకు లంసం ఓపెన్ విధానంలో టెండర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన టెండర్లను ఖరారు చేసి రివర్స్ టెండరింగ్లో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. పునరావాసంపై బాబు చేతులెత్తేసి.. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మిస్తే తామంతా ముంపునకు గురవుతామని, పునరావాసం కల్పించాలని 103 గ్రామాల ప్రజలు సీడబ్ల్యూసీని ఆశ్రయించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సీడబ్ల్యూసీ ఆదేశించింది. కమీషన్ల కోసం నిర్మాణాన్ని నెత్తికెత్తుకున్న చంద్రబాబు సర్కారు.. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక చేతులెత్తేసింది. ఎగువ కాఫర్ డ్యామ్కు కుడి, ఎడమ వైపు 400 మీటర్ల చొప్పున, దిగువ కాఫర్ డ్యామ్ కుడి వైపున 600 మీటర్లు ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. దీంతో గోదావరి ప్రవాహానికి అడ్డంకులేర్పడ్డాయి. -
కోతకు గురైన ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్
సాక్షి, అమరావతి: గోదావరి వరదల ఉద్ధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో ఇరువైపులా కోతకు గురైన ప్రాంతంలో దెబ్బతిన్న చోట సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించాలని జలవనరుల శాఖకు డీడీఆర్పీ సూచించింది. కోతకు గురికాని ప్రాంతంలో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడంపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జలవనరుల శాఖ అధికారులతో భేటీ గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో ఏర్పడిన భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ (బోరు బావి తవ్వి వైబ్రో కాంపాక్షన్ యంత్రంతో అధిక ఒత్తిడితో భూగర్భాన్ని మెలి తిప్పడం ద్వారా పటిష్టం చేయడం) ద్వారా యథాస్థితికి తేవచ్చంటూ ఏడు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు డీడీఆర్పీ తాజాగా ఆమోదం తెలిపింది. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సమస్యలకు డీడీఆర్పీ పరిష్కార మార్గాలు చూపడంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. పోలవరం పనులను ఏబీ పాండ్య నేతృత్వంలోని డీడీఆర్పీ బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ క్రమంలో ఆదివారం రాజమహేంద్రవరంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఎస్కే సిబాల్, పీపీఏ సీఈవో శివ్నందన్కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు నిర్వహించిన ఎన్హెచ్పీసీ బృందం సమర్పించిన నివేదికను తాజా సమావేశంలో డీడీఆర్పీ ప్రవేశపెట్టింది. సరిదిద్దే మార్గం ఇలా.. ♦ కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ గ్యాప్–2లో ఎడమ వైపున 175 నుంచి 363 మీటర్ల పొడవున అంటే 188 మీటర్ల పొడవు.. కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల పొడవున అంటే 200 మీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిందని ఎన్హెచ్పీసీ తెలిపింది. ఈ ప్రాంతంలో ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ను నిర్మించాలని డీడీఆర్పీ ఆదేశించింది. ♦డయాఫ్రమ్ వాల్లో 480 – 510 మీటర్ల మధ్య 30 మీటర్ల పొడవున ఒక చోట, 950 – 1,020 మీటర్ల మధ్య 70 మీటర్ల పొడవున మరోచోట 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు ఎన్హెచ్పీసీ తేల్చింది. ఈ రెండు ప్రాంతాల్లో డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడంపై మరింత అధ్యయనం చేసి సీడబ్ల్యూసీ సూచనల మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డీడీఆర్పీ సూచించింది. ♦మిగతా ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్కు రెండు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి (కోర్) నింపి దానిపై ప్రధాన డ్యామ్ను నిర్మించేలా సీడబ్ల్యూసీ గతంలో డిజైన్ను ఆమోదించింది. అయితే డయాఫ్రమ్ వాల్కు ఐదు మీటర్ల లోతు నుంచి ఇరువైపులా బంకమట్టి నింపి దానిపై ప్రధాన డ్యామ్ను నిర్మించాలని డీడీఆర్పీ సూచించింది. దీనివల్ల ఊట నీటిని డయాఫ్రమ్ వాల్ సమర్థంగా అడ్డుకుంటుందని తేల్చింది. రూ.రెండు వేల కోట్లకు పైగా వ్యయం.. గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడం, కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు సుమారు రూ.రెండు వేల కోట్లు వ్యయం అవుతుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకే 48 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో అదనంగా వ్యయమయ్యే రూ.రెండు వేల కోట్లను మంజూరు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ చేసిన విజ్ఞప్తిపై డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అధికారుల ప్రతిపాదనకే మొగ్గు.. గోదావరి వరద ఉద్ధృతి ప్రభావం వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం కోతకు గురైంది. గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో 35 మీటర్ల లోతుతో, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. కోతకు గురైన ప్రాంతంతోపాటు భారీ అగాధాలను ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఏడు నెలల క్రితమే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించగా అప్పట్లో డీడీఆర్పీ తోసిపుచ్చింది. దీంతో కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపడుతూనే అగాధాలను పూడ్చేందుకు డీడీఆర్పీ సూచించిన మేరకు 11 రకాల పరీక్షలను నిర్వహించారు. ఆ ఫలితాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటితో సంతృప్తి చెందిన డీడీఆర్పీ ఏడు నెలల క్రితం రాష్ట్ర అధికారులు ప్రతిపాదించిన విధానం ప్రకారమే అగాధాలను పూడ్చి యథాస్థితికి తేవాలని ఆదేశించింది. ఈ పనులను గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాలని సూచించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దే పనులు పూర్తి చేసి ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేసింది. -
డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్మానవ తప్పిదమే
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరంపై చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలు.. ప్రణాళికా రాహిత్యం.. కమీషన్ల దాహంతోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిందని ఆది నుంచి చెబుతున్న వాస్తవాలను ఎన్హెచ్పీసీ నివేదిక అధికారికంగా ధ్రువీకరించింది. చంద్రబాబు పాపాలే ప్రాజెక్టుగా శాపాలుగా మారాయని, లేదంటే 2021 నాటికే సీఎం జగన్ పోలవరాన్ని పూర్తి చేసేవారని నీటి పారుదల రంగ నిపుణులు, అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 800 మీటర్లకు కుచించుకుపోవడంతో.. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ చానల్, స్పిల్వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయకుండా టీడీపీ సర్కారు ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ను నిర్మించడం ఘోర తప్పిదమని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) నివేదిక తేల్చి చెప్పింది. ఆ మానవ తప్పిదం వల్లే 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడంతో ఖాళీ ప్రదేశం 800 మీటర్లకు కుచించుకుపోయి ప్రవహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది వరద ఉద్ధృతి తీవ్రతరం కావడానికి దారితీసింది. అందువల్లే ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గ్యాప్–1లో 35 మీటర్లు, గ్యాప్–2లో 20 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయని ఎన్హెచ్పీసీ స్పష్టం చేసింది. గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ ఎడమ వైపున 175 మీటర్ల నుంచి 363 మీటర్ల వరకు ధ్వంసం కాగా కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల వరకు పూర్తిగా ధ్వంసమైందని తేల్చింది. 480 మీటర్ల నుంచి 510 మీటర్ల వరకు, 950 మీటర్ల నుంచి 1,020 మీటర్ల వరకు రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని తేల్చింది. ఫలితంగా భూగర్భంలో గోదావరి ప్రవాహాన్ని సమర్థంగా అడ్డుకట్ట వేయలేదని పేర్కొంది. డయాఫ్రమ్ వాల్ను పటిష్టం చేసే చర్యలు చేపడితేనే లీకేజీలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపింది. ఎన్హెచ్పీసీ సమగ్ర అధ్యయనం.. పోలవరం వద్ద భౌగోళిక పరిస్థితుల రీత్యా వరద ప్రవాహాన్ని మళ్లించే స్పిల్వేను నదీ తీరానికి కుడి వైపున రాతి నేలపై, 194.6 టీఎంసీలను నిల్వ చేసే ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ను నదికి అడ్డంగా నిర్మించేలా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రాజెక్టు డిజైన్ను ఆమోదించింది. ప్రధాన డ్యామ్కి పునాదిగా డయాఫ్రమ్ వాల్ వేయాలని పేర్కొంది. డయాఫ్రమ్ వాల్ను నిర్మిస్తేనే భూ గర్భంలో గోదావరి ప్రవాహం ఎగువ నుంచి దిగువకు, దిగువ నుంచి ఎగువకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. అంటే లీకేజీ (ఊట నీరు)కి పూర్తిగా అడ్డుకట్ట వేస్తుంది. ఇది ప్రధాన డ్యామ్ చెక్కు చెదరకుండా కాపాడుతుంది. ప్రధాన డ్యామ్కు అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ను గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తి చేశాకే చేపట్టాలి. గత సర్కారు అనాలోచితంగా అందుకు విరుద్ధంగా చేపట్టడంతో 2019లో వచ్చిన వరద ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈ క్రమంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. సీడబ్ల్యూసీ సూచనల మేరకు ఎన్హెచ్పీసీకి ఈ బాధ్యతను అప్పగించింది. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 10 వరకూ నాలుగు రకాల పరీక్షలు నిర్వహించిన ఎన్హెచ్పీసీ సమగ్రంగా విశ్లేషించి రాష్ట్ర జలవనరుల శాఖకు నివేదిక అందచేసింది. ఈ పాపం.. చంద్రబాబుదే పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నాడు సీఎం హోదాలో చంద్రబాబు కోరారు. ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధం కావడంతో 2016 సెప్టెంబరు 6న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారమే నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం విధించిన షరతులకు చంద్రబాబు తలొగ్గారు. రూ.3,302 కోట్ల విలువైన జలాశయం పనులను ‘ఈనాడు’ రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు, ఎడమ కాలువలో రూ.150 కోట్ల పనులను నాటి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు నామినేషన్పై కట్టబెట్టారు. వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ను పూర్తి చేశారు. ఈ పాపాల కారణంగానే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వీటిని సరిదిద్ది సవాళ్లను అధిగమిస్తూ ప్రణాళికాబద్ధంగా సీఎం జగన్ పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. -
మాజీ బాయ్ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది
పాప్ సింగర్ షకీరా, స్పెయిన్ ఫుట్బాల్ స్టార్ గెరార్డ్ పీక్ మధ్య 12 ఏళ్ల బంధం ముగిసిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. అప్పటినుంచి షకీరా, పీక్లు ఒకే ఇంట్లో ఉంటున్నా వేర్వేరుగా ఉంటున్నారు. పీక్, షకీరాలు కలిసి బార్సిలోనా ఏరియాలో రెండంతస్తుల ఇల్లును కొన్నారు. షకీరా నుంచి విడిపోయిన తర్వాత పీక్ తన తల్లిదండ్రులతో అదే ఇంట్లో పై అంతస్తులో ఉంటున్నాడు. తాజాగా షకీరా తన మాజీ బాయ్ఫ్రెండ్ మొహం చూడకూడదని అడ్డుగా గోడ కట్టించింది. బార్సిలోనా ఏరియాలో ఉన్న షకీరా ఇంటికి సిమెంట్ మిక్సర్ కాంక్రీట్ లారీ రావడం టీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్ని గొడవల మధ్య వాళ్లతో కలిసి ఉండలేనని అందుకే గోడ కట్టిస్తున్నట్లు షకీరా పేర్కొంది. అయితే షకీరా వ్యవహారశైలిపై పీక్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీక్ తల్లి మాంటిసెరాట్ బెర్నాబ్యూ.. గోడను తీసేయాలని షకీరాను అడిగినప్పటికి ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. ఇక గెరార్డ్ పీక్ 2009 నుంచి స్పెయిన్ ఫుట్బాల్ టీంకు ఆడుతున్నాడు. గెరార్డ్ పీక్ జట్టులో బ్యాక్ సెంటర్ ఆటగాడిగా ఉన్నాడు. ఇక మాంచెస్టర్ యునైటెడ్, బార్సిలోనా క్లబ్లకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: 71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు షార్ట్ టెంపర్కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం -
ఉగ్రవాది ఇంటిగోడ బుల్డోజర్తో కూల్చివేత.. వీడియో వైరల్..
శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది అక్రమంగా నిర్మించిన ఇంటిగోడను జమ్ముకశ్మీర్ అధికారులు కూల్చివేశారు. జేసీబీతో ప్రహరీని నేలమట్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కశ్మీర్ అనంతనాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదిని గులాం నబీ ఖాన్గా గుర్తించారు. ఈ ప్రహరీని గోడను అక్రమంగా నిర్మించాడని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమమించుకున్నాడని అధికారులు చెప్పారు. అందుకే చర్యలు చేపట్టి గోడను కూల్చివేసినట్లు వివరించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. Jammu and Kashmir Administration demolishes property of Hizbul Mujahideen terrorist commander Gulam nabi Khan @ Amir Khan, in Anantnag's Pahalgam. 🧐🧐👇 pic.twitter.com/TofBRReHlZ — Naren Mukherjee (@NMukherjee6) December 31, 2022 చదవండి: డ్రైవర్కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం -
Viral Video: వామ్మో.. గోడపై పాకుతున్న కొండచిలువ
-
వామ్మో.. గోడపై పాకుతున్న కొండచిలువ.. ఒళ్లు జలదరించే వీడియో
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి రకరకాల వీడియోలు వైరల్గా మారుతున్నాయి. నిత్యం ఫన్నీ, షాకింగ్, ఆశ్చర్యపరిచే లక్షల వీడియోలు నెటిజన్లను దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే భయపడకుండా ఉండలేం! తర్వాత ఏం జరగబోతుందో అనే ఉత్కంఠను రేపుతాయి కూడా. తాజాగా అటువంటి ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మెట్ల పక్కనున్న గోడపై ఓ భారీ కొండచిలువ పాకుతూ పైకి వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాంత నంద తన ట్విటర్లో పోస్టు చేశారు. పైకి వెళ్లడానికి ప్రతీసారి మెట్లు అవసరం లేదు’ అనే కాప్షన్తో షేర్ చేశారు. 32 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మెట్లకు ఆనుకుని ఉన్న రెయిలింగ్పై కొండచిలువ పాకుతూ ఇంటిపై అంతస్తులోకి వెళ్తుండటంకనిపిస్తోంది. ఈ వీడియో చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ట్విటర్లో పోస్టు చేసిన గంటల్లోనే వైరల్గా మారింది. దీనికి వేలల్లో వ్యూస్ వచ్చాయి. అనేకమంది నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. కొండచిలువ ఎక్కుతుండటం చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుందని, వీడియో తీసిన వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఓసారి వీక్షించండి. -
ఫ్యాక్ట్ చెక్ : ఏ రంగు కనిపించినా YSRCP రంగేనంటూ ఎల్లో బ్యాచ్ విష ప్రచారాలు
-
అర్ధరాత్రి గోడదూకి.. మహేష్బాబు ఇంట్లోకి చొరబడేందుకు యత్నం
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇంట్లో ఓ యువకుడు గోడదూకి గాయాలపాలయ్యాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్నెం 81లో నివసించే మహేష్బాబు ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి కృష్ణ(30) అనే యువకుడు గోడ దూకి ఇంట్లోకి చొచ్చుకెళ్ళేందుకు యత్నించాడు. పది అడుగుల ఎత్తున్న గోడ మీది నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శబ్ధానికి అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా తీవ్ర గాయాలతో వ్యక్తి కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆరా తీయగా సదరు యువకుడు మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి హైదరాబాద్కు వచ్చి సమీపంలోని ఓ నర్సరీలో పని చేస్తున్నట్లుగా తేలింది. నిందితుడు కోలుకున్నాక లోతుగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. చదవండి: (25 ఏళ్లకే గుండె సమస్యలు..గోల్డెన్ అవర్లో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు) -
జైహింద్ స్పెషల్: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు
స్వాతంత్య్రోద్యమంలో గోడ పత్రికలు ఉద్యమకారులకు ఏమాత్రం తక్కువకాని పాత్రను పోషించాయి. బ్రిటిషర్ల దురహంకారాన్ని వేలెత్తి చూపించాయి. గోడల వైపు తలెత్తి చూడటానికే బ్రిటిష్ అధికారులు సంశయించేంతగా మన తెలుగువాళ్లు గోడ పత్రికలపై నిజాలను నిర్భయంగా రాశారు. నాటి గోడపత్రికల ఆనవాళ్లు నేడు లేవు కానీ, ఆనాటి స్వాతంత్య్ర స్ఫూర్తి నేటి అమృతోత్సవాలలో మహా నగరాల గోడలపై వర్ణ చిత్రాలుగా ప్రతిఫలిస్తూ ఉంది. చదవండి: పెనంలోంచి పొయ్యిలోకి పడిన రోజు! యూరప్లో జరిగిన ఫ్యూడల్ వ్యతిరేకోద్యమంలో ఆయుధాలుగా ఆవిర్భవించిన పత్రికలు, ఆ సమాజాన్ని ఆధునీకరించడంలో అమోఘమైన పాత్రను నిర్వహించాయి. అలాగే భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా పత్రికలు అక్షరాయుధాలుగా కీలక భూమికను పోషించాయి. వాటిల్లో గోడ పత్రికలు, కరపత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఉద్యమజ్వాలల్ని రగిలించాయి. తొలి గోడపత్రిక ‘నగరజ్యోతి’ దేశంలోనే తొలి గోడ పత్రికగా నెల్లూరులో ‘నగర జ్యోతి’ నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రజలలో స్వాతంత్రేచ్ఛతోపాటు విజ్ఞానాన్ని వెలిగించింది. నెల్లూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తూములూరి పద్మనాభయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి, వలస పాలనకు వ్యతిరేకంగా ఒక రహస్య సైక్లోస్టైల్ పత్రికను నడిపారు. అది బైటపడడంతో బ్రిటిష్ పోలీసులు ఆయనను ఆరెస్టు చేసి, జైల్లో పెట్టి హింసించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక 1932లో నెల్లూరు ట్రంకు రోడ్డులోని తిప్పరాజువారి సత్రం గోడలపై ‘నగరజ్యోతి’ని వెలిగించారు. కాగితాలపై పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాసి సత్రం గోడలకు అంటించేవారు. ఆ కాగితాలను పశువులు తినేయడంతో, ఆ గోడలను బ్లాక్ బోర్డుగా చేసి చాక్పీసులతో వార్తలు రాయడం మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించేవారు. స్వాతంత్య్రం రాకముందే తూములూరి పద్మనాభయ్య క్షయ వ్యాధితో మృతి చెందారు. ఓకే పత్రిక... రెండు గోడలు! పద్మనాభయ్యకు సహాయకులుగా పనిచేస్తున్న ముత్తరాజు గోపాలరావు, ఇంద్రగంటి సుబ్రమణ్యం చెరొక గోడపై ‘నగరజ్యోతి’ కొనసాగించారు. వారిద్దరూ గాంధేయ వాదులు. ముత్తరాజు గోపాలరావు వార్తలలో ఆవేశం పాళ్లు ఎక్కువ. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు నాయకుడు కొండయ్యకు ఆశ్రయం కల్పించారని ముత్తరాజు గోపాలరావును పోలీసులు ఆరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇంద్రగంటితో పోటీ పడలేక, ముత్తరాజు గోపాలరావు తన గోడను కూడా ఆయనకు అప్పగించేశారు. ఇంద్రగంటి తాను వాస్తవమని నమ్మినవే వార్తలుగా రాసేవారు. ఇటు విజయవాడ, అటు మద్రాసు నుంచి వచ్చే రైళ్ల కోసం అర్ధరాత్రి అయినా వేచి చూసి, వేరే వారి కోసం వచ్చిన ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫ్రీ ప్రెస్, పేట్రియాట్ వంటి పత్రికలను చూసి గబగబా వార్తలు రాసుకునే వారు. ఆ పత్రికలలో వచ్చిన కార్టూన్లను కూడా వేసేవారు. బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ఇంద్రగంటి సుబ్రమణ్యం ‘నగర జ్యోతి’ ద్వారా బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనను అరెస్టు చేసి వేలూరు జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక చివరి వరకు ఖద్దరునే ధరించారు. స్వాతంత్య్రమే తప్ప కుటుంబాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. వార్తలు రాయడానికి చాక్పీసుల కోసం తప్ప, తన కోసం ఏనాడూ చేయిచాచలేదు. తాజా వార్తలను అందించడం తప్ప, ఇంద్రగంటికి వేరే వ్యాపకమే లేదు. నయాపైసా ఆదాయం లేకపోయినా, నాలుగు దశాబ్దాలపాటు ‘నగర జ్యోతి’ని ఆరిపోకుండా కాపాడారు. ఇంద్రగంటి 1976 సెప్టెంబర్ 16వ తేదీన తుదిశ్వాస విడిచేవరకు వార్తలను విడవలేదు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వం రెండున్నర ఎకరాలను ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో శాలువాతో సరిపెట్టుకుంది. విద్వాన్ విశ్వంకి జైలు! కవి, రచయిత, పండిత పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు విద్వాన్ విశ్వం బ్రిటిష్ పాలనలో ‘యుద్ధం వల్ల కలిగే ఆర్థిక ఫలితాలు’ అన్న కరపత్రం వేసినందుకు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఖాసా సుబ్బారావు టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన ‘స్వరాజ్య’ పత్రికలో ఎడిటర్గా 12 ఏళ్లు పనిచేశారు. మరెందరో చరిత్రకందని పాత్రికేయులు స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్నారు. – రాఘవ శర్మ -
హాస్టల్ గోడ దూకి.. 150 సీసీ కెమెరాల కళ్లుగప్పి..
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి నలుగురు విద్యార్థినులు పారిపోయిన ఘటన చంద్రగిరిలో కలకలకం సృష్టించింది. వెస్ట్ డీఎస్పీ నరసప్ప కథనం మేరకు.. విజయనగరం, విజయవాడ, కడప, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థినులు చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలలో ఉంటూ చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. వీరిలో ఇద్దరు విద్యార్థినులు మైనర్లు. వీరు డిగ్రీ చదువుకుంటూ.. హాస్టల్లో వేదాలు, హిందూ సంప్రదాయాలు నేర్చుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు అమ్మాయిలు హాస్టల్ వెనుక వైపు నుంచి 8 అడుగుల ఎత్తయిన గోడదూకి పారిపోయారు. హాస్టల్ ఇన్చార్జి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ గుర్తించేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, హాస్టల్ నుంచి వెళ్లే మూడు రోజులకు ముందు ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఓ బయటి వ్యక్తి సెల్ఫోన్ నుంచి విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం రెండు సార్లు ఎవరితోనో మాట్లాడినట్లు తెలుస్తోంది. సుమారు 350 మంది ఉన్న హాస్టల్లో 150కి పైగా సీసీ కెమెరాలు, 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా విద్యార్థినులు పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
గోడ కన్నంలో ఇరుక్కున్న దొంగ..
-
Viral Video: ఎంతపనైపాయే.. దొంగతనానికి వచ్చి.. గోడ కన్నంలో..
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: దొంగతనానికి వెళ్లిన దొంగ.. గోడలో ఇరుక్కుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కంచికి సమీపంలోని జడిపుడి గ్రామంలో పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి.. గాల జమ్మి గుడిలో దొంగతనానికి ప్రయత్నించాడు. తొలిత గోడకు ఓ వైపున చిన్న కన్నం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. చదవండి: యువతిపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో నేలకేసి కొట్టి.. గోడలో నుండి గుడిలోకి బాగానే వెళ్లిపోయిన ఆ దొంగ.. హుండీలో ఉన్న కానుకలు చేత పట్టి ఈజీగా బయటకు రాలేకపోయాడు. చివరికి గోడలో ఇలా ఇరుకున్నాడు. స్థానికులు గమనించి దొంగని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు దీనిని వీడియో చిత్రించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. -
స్పైడర్మెన్లా గోడను పాకిన చిన్నారి.. ‘నీ టాలెంట్ సూపర్’
పిల్లలు ఏ విషయం అయిన తొందరగా నేర్చుకుంటారంటారు. పనులైన, ఆటలైన ఒక్కసారి ఆసక్తి పెట్టారంటే ఇట్టే అలవాటు చేసుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ చిన్నారి ఎలాంటి సాయం లేకుండా అవలీలగా గోడను పాకుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. ఐదేళ్ల చిన్నారి ఇంట్లోని రెండు గోడల మధ్య ఒక్కో కాలు పెట్టి స్పైడర్మెన్లా పైకి పాకుతుంది. నిమిషంలోనే ఇంటి పైకప్పు వరకు చేరి అక్కడే కాసేపు విన్యాసాలు చేసింది. కాళ్లను, చేతులను ఆడిస్తూ ఫీట్లు చేసింది. అనంతరం మళ్లీ అలాగే పాకుతూ కిందకు దిగింది. అయితే ఇక్కడ చిన్నారి గోడకు వ్యతిరేకంగా చేతులు, కాళ్లను ఉంచడం విశేషం. వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారింది. పాప టాలెంట్ను చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘చిన్నారి.. నువ్వు సూపర్. అచ్చం స్పైడర్లా వెళ్లావ్. అర్ధరాత్రి నిద్రలోంచి లేచి ఇలాంటివి ట్రైం చేస్తే ఇక నా జీవితమంతా డాక్టర్తో మందులు వాడుతూనే ఉంటాను’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో వివరాలు తెలియరాలేదు. చదవండి: తల మీద నుంచి ట్రాక్టర్ టైర్ దూసుకెళ్లిన ఏం కాలేదంటే.. రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ Imagine waking up in the middle of the night to this. I’d be on medication for the rest of my days. https://t.co/7NAiQ7Tn1n — josh (@jccmm) September 16, 2021 Imagine waking up in the middle of the night to this. I’d be on medication for the rest of my days. https://t.co/7NAiQ7Tn1n — josh (@jccmm) September 16, 2021 It's like something out of the Exorcist.😲😱 https://t.co/ODSpti0rGv — MrChelsea (AKA col ) London is blue 💙⭐⭐ (@MrChels33381819) September 16, 2021 -
వామ్మో.. కొంపముంచిన బైక్ స్టంట్.. వైరల్ వీడియో..
బెంగళూరు: కొంత మంది యువకులు అర్ధరాత్రికాగానే రోడ్డుపై వచ్చి ఇష్టమోచ్చినట్లు వాహనాలను నడుపుతుండటం మనకు తెలిసిందే. ఈ క్రమంలో వీరు అత్యధిక వేగంతో తమ బైక్లను నడుపుతూ.. రకారకాల స్టంట్లు చేస్తుంటారు. కొంత మంది యువకులు బైక్ నడుపుతున్నప్పుడు హ్యండిల్ను వదిలేస్తే.. మరికొందరు ఆకతాయిలు ముందు టైర్ను లేదా వెనుక టైర్ను గాల్లో అమాంతం పైకి ఎత్తి వెరైటీ డ్రైవ్ చేస్తుంటారు. అయితే, ఇలాంటి స్టంట్లు చేసే క్రమంలో ఒక్కొసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కాగా, ఒక యువకుడు తన మోటర్బైక్తో చేసిన స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో యువకుడు రోడ్డుపై బైక్ స్టంట్ చేస్తున్నాడు. అక్కడ రోడ్డంతా వర్షం నీరుతో నిండి ఉంది. అతను ఏమాత్రం భయపడకుండా.. అలాగే బైక్ను స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా.. బైక్ను వేగంగా నడిపిస్తూ ముందు టైర్ను అమాంతం గాల్లో పైకి లేపాడు. అతగాడి విన్యాసాన్ని చుట్టుపక్కల వారు వింతగా చూస్తున్నారు. అయితే, ఆ యువకుడు తొలుత బైక్ను బాగానే నడిపినా ఆ తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో అతను పక్కనే ఉన్న ఒక ప్రహరీ గొడను ఢీకొడుతూ ముందుకు వెళ్లిపోయాడు. ఈ షాకింగ్ ఘటనతో అక్కడి వారంతా దూరంగా పారిపోయారు. మోటర్ బైక్ ఢీకొని గోడంతా కూలిపోయింది. ఆ యువకుడు హెల్మెట్ పెట్టుకొని ఉండటంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. దీన్ని.. స్ప్లెండర్ బుల్లెట్ లవ్ అనే యూజర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్.. ఏమన్న స్టంటా..’, ‘కొంచెంలో మిస్ అయ్యాడు..’, ‘ఇలాంటి ప్రమాదకర స్టంట్లు అవసరమా..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by splendor_bullet_love (@splendor_bullet_love) -
చైనా దుశ్చర్య.. సరిహద్దులో 2000 కి.మీ గోడ
బీజింగ్: ప్రపంచ దేశాలన్ని చీదరించుకున్నా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా డ్రాగన్ దేశం మాత్రం తాను అనుకున్నదే చేస్తుంది. చుట్టు పక్కల దేశాలను తనలో కలుపుకుని.. అతిపెద్ద దేశంగా అవతరించడమే దాని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం చైనా ఎన్ని కుయుక్తులయినా పన్నుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చైనా మరో దుశ్చర్యకు దిగింది. మయన్మార్ సరిహద్దులో ఏకంగా 2000 వేల కిలోమీటర్ల పొడవైన గోడ నిర్మాణాన్ని తలపెట్టింది. అక్రమంగా దేశంలో ప్రవేశించే వారిని నివారించడానికే ఈ గోడ నిర్మాణం చేపడుతన్నట్లు చైనా చెప్తుండగా.. మయన్మార్ ఆక్రమణే డ్రాగన్ ప్రధాన ఉద్దేశం అని అమెరికా అత్యున్నత టింక్టాక్ వెల్లడించింది. వివరాలు.. చైనా తన దక్షిణ సరిహద్దు మయన్మార్ వెంట 2000 కిలోమీటర్ల పొడవైన ముళ్ల గోడను నిర్మించే పనిలో ఉంది. నివేదికల ప్రకారం, మయన్మార్ సైన్యం తన సరిహద్దులో గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండగా, చైనా తన వైఖరిని మార్చుకోవడం లేదని సమాచారం. (చదవండి: పరాక్రమంతో తిప్పికొట్టాం) మయన్మార్ సరిహద్దు వెంట చైనా చేపట్టిన గోడ నిర్మాణంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా చేసిన ప్రయత్నం దాని విస్తరణవాద ఆలోచనను ప్రతిబింబిస్తుందని, రాబోయే దశాబ్దాల్లో దక్షిణాసియాలో సంఘర్షణ గణనీయంగా పెరుగుతుందని ఒక అమెరికన్ థింక్ ట్యాంక్ తెలిపింది. చైనా ప్రభుత్వం మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ (గ్లోబల్ టైమ్స్) ప్రకారం మయన్మార్ నుంచి అక్రమ చొరబాట్లను అరికట్టడం కోసమే ఈ గోడ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొంది. చైనా నైరుతి యునాన్ ప్రావిన్స్లో 9 మీటర్ల ఎత్తులో ముళ్ల తీగతో ఈ గోడను నిర్మిస్తుంది. అసమ్మతివాదులు చైనా నుంచి తప్పించుకోకుండా చూడటం కోసమే ఈ గోడ నిర్మాణం చేపట్టినట్లు ఆర్ఎఫ్ఏ నివేదిక వెల్లడించింది. (సర్జికల్ స్ట్రైక్ చేయండి: సంజయ్ రౌత్) చైనా చర్యలను మయన్మార్ సైన్యం నిరంతరం వ్యతిరేకిస్తోంది. తమ దేశ సరిహద్దు వెంబడి ముళ్ల తీగను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపింది. ఈ నేపథ్యంలో మయన్మార్ సైన్యం చైనా అధికారులకు ఒక లేఖ రాసింది. అంతేకాక ఈ లేఖలో 1961 సరిహద్దు ఒప్పందం గురించి ప్రస్తావించింది. దాని ప్రకారం సరిహద్దుకు 10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణాన్ని చేపట్టికూడదని ఒప్పందంలో ఉందని మయన్మార్ లేఖలో గుర్తు చేసింది. -
శత్రువులకు హెచ్చరిక.. 600 పుర్రెలతో గోడ
మెక్సికో సిటీ: సాధారణంగా రాతి గోడలు, ఇటుక గోడలు.. చివరకు కర్ర, సీసలతో నిర్మించిన గోడల గురించి విన్నాం.. చూశాం. కానీ పుర్రెలతో నిర్మించిన గోడ గురించి ఎప్పుడైనా విన్నారా... లేదు కదా. అయితే ఇది చదవండి. మెక్సికోలో 15వ శతాబ్దానికి చెందిన ఓ పురాతన గోడ బయటపడింది. దాన్ని చూసి పురాతత్వ శాస్త్రవేత్తలు షాకయ్యారు. ఎందుకుంటే ఈ గోడలో వరుసగా పుర్రెలు ఉన్నాయి. వీటిలో ఆడ, మగతో పాటు చిన్నారుల పుర్రెలను కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. దేవతా పూజ సందర్భంగా వీరందరిని బలి ఇచ్చి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. ఇక వీరిలో ఎక్కువ మంది శత్రు సైనికులు అయి ఉంటారని అంచనా వేస్తున్నారు. తల నిర్మాణం, పళ్ల సైజు ఆధారంగా ఈ పుర్రెల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ గోడ 2017లోనే బయటపడిందని.. గతంలో కొన్ని పుర్రెలని గుర్తించగా.. తాజాగా మరో 114 పుర్రెలు వెలుగులోకి వచ్చినట్లు ఆర్కియాలజిస్ట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 600 వందల పుర్రెలు బయటపడ్డాయని తెలిపారు. (మిస్టరీ: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) ఇక అజ్టెక్ సామ్రాజ్యాధిపతి తన ప్రత్యర్థులకు హెచ్చరికగా ఈ గోడ నిర్మణాన్ని చేపట్టి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్పానిష్ ఆక్రమణదారులు 1521లో అజ్టెక్ సామ్రాజ్యాన్ని కూలదోశారు. ఇక గోడ నిర్మాణంలో వెలుగు చూసిన పుర్రెల్లో ఎక్కువ భాగం శత్రు సైనికులవి కాగా.. మరి కొన్ని సాధారణ ప్రజలవి అయి ఉండవచ్చని.. వీరందరిని దేవుడికి బలి ఇచ్చి ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే వీరిలో శత్రు సైనికులు ఎవరో.. సామాన్యులు ఎవరో గుర్తించడం కష్టం అంటున్నారు. ఇక ఈ గోడని 15వ శతాబ్దం చివర్లో నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఇది ఆధునిక మెక్సికో నగరంలోని చారిత్రాత్మక జిల్లా అజ్టెక్ రాజధాని టెనోచ్టిట్లాన్ ప్రధాన ఆలయాలలో ఒకటైన టెంప్లో మేయర్ ప్రాంతంలో ఉంది. ఇక ఇది దేశంలోని ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు శాస్త్రవేత్తలు. "టెంప్లో మేయర్ అడుగడుగునా, మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది" అని కల్చరల్ మినిస్టర్ అలెజాండ్రా ఫ్రాస్టో ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి) "హ్యూయి జొంపంట్లీ, ఇటీవలి సంవత్సరాలలో మన దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పురావస్తు పరిశోధనలలో ఒకటి. మీసోఅమెరికాలో వెలుగు చూసిన మానవ త్యాగం విశ్వం నిరంతర ఉనికిని నిర్ధారించే మార్గంగా భావించబడింది" అని ప్రకటనలో తెలిపారు. అందువల్ల నిపుణులు ఈ టవర్ను "మరణం కాకుండా జీవిత భవనం" గా భావిస్తున్నట్లు వెల్లడించారు. -
వందేళ్ల నాటి గోడలో.. 66 విస్కీ బాటిల్స్
వాషింగ్టన్: సాధారణంగా వందల ఏళ్ల క్రితం నాటి కట్టడాల పట్ల ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే పూర్వం అక్కడ ఏమైనా విలువైన వస్తువులు, నిధి నిక్షేపాలు వంటివి దాచారేమోననే అనుమానం ఉంటుంది. వాటిని వెలికి తీయడం కోసం చాలా మంది రహస్యంగా తవ్వకాలు జరుపుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథనం కూడా ఇలాంటిదే. అయితే తవ్వకాలు జరిపింది నిషేధిత ప్రాంతంలో కాదు. సొంత ఇంట్లోనే. ఇక గోడలో వెలుగు చూసిన వస్తువులను చూసి ఆ దంపతులు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. తమకు లభించిన వస్తువులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. ఇంతకు వారికి గోడలో ఏం కనిపించాయి అంటే 66 విస్కీ బాటిళ్లు. అవును అది కూడా స్మగుల్డ్ బాటిల్స్. వివరాలు.. న్యూయార్క్కు చెందిన దంపతులు నిక్ డ్రమ్మండ్, పాట్రిక్ బక్కర్ పోయిన నేలలో వారి కొత్త ఇంటికి మారారు. అయితే అక్కడ ఇంటి గోడలో తమకు మద్య నిషేద యుగం కాలానికి చెందిన విస్కీ బాటిళ్లు లభ్యమవుతాయని వారు కలలో కూడా ఊహించలేదు. ఈ సంఘటన ఈ ఏడాది అక్టోబర్లో చోటు చేసుకుంది. నిక్ డ్రమ్మండ్ దంపతులు ఈ ఇంటిని ఓ నటోరియస్ స్మగ్లర్ దగ్గర నుంచి కొనుగోలు చేశారు. వందేళ్ల నాటి ఇల్లు కావడంతో మరమత్తులు చేపించాలని భావించారు. ఆ క్రమంలో క్షీణించిన ఇంటి గోడలను బాగు చేసేందుకు గాను తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో వారికి వరుసగా విస్కీ బాటిళ్లు దర్శనమిచ్చాయి. వీటిని చూసిన వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే తేరుకుని తమకు దక్కిన అదృష్టాన్ని తలచుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. (చదవండి: 10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి? ) View this post on Instagram A post shared by Nick Drummond (@bootleggerbungalow) ‘మా ఇంటిని మద్యంతో నిర్మించారు’ అనే క్యాప్షన్తో ఫోటోలని ఫేర్ చేశాడు నిక్. ఇక విస్కీ బాటిళ్లు మధ్యనిషేధం నడిచిన 1920 కాలానికి చెందినవి. వాటి మీద తయారీ తేదీ అక్టోబర్ 23, 1923గా ఉంది. ఇక మొత్తం 66 బాటిళ్లలో 13 ఫుల్గా ఉండగా.. 9 మంచి పరిస్థితిలో ఉన్నాయి.. నాలుగు పూర్తిగా క్షీణించాయి. ఇక కొన్నింటిలో విస్కీ సగమే ఉంది. ఇన్నేళ్లు గోడలోపల ఉండటంతో ఆవిరి అయి ఉండవచ్చు అన్నాడు నిక్. ఈ ఫోటోలు చేసిన నెటిజనులు ‘మీరు ఆ విస్కీని ట్రై చేశారా’.. ‘వేలం వేసే ఆలోచన ఉంటే చెప్పండి.. నేను కొంటాను’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన మద్యం ప్రియులు మాత్రం ‘అదృష్టం అంటే నీదే పో’ అంటూ ఈర్షపడుతున్నారు. -
హత్య చేసి.. గోడ మీద రాసి వెళ్లాడు
గాంధీనగర్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేయడమే కాక అందుకు గల కారణాన్ని గోడ మీద రాసి మరీ వెళ్లాడో వ్యక్తి. వివరాలు.. గుజరాత్ బనస్కాంత జిల్లా కుడా గ్రామానికి చెందిన ఉకభాయ్ పటేల్ స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద రూ. 21 లక్షలు అప్పు చేశాడు. తిరగి చెల్లించలేక పోయాడు. దాంతో సదరు వడ్డీ వ్యాపారి గురువారం రాత్రి ఉకభాయ్ ఇంటికి వచ్చి పదునైన ఆయుధంతో ఉకభాయ్తో పాటు అతని భార్య, కుమార్తె, కొడుకుల గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అంతేకాక తన అప్పు చెల్లించనందువల్లే ఉకభాయ్ కుటుంబ సభ్యులను హతమార్చినట్లు గోడ మీద రాసి మరీ వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఉకభాయ్ కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
చైనా భూగర్భంలో ఉక్కు గోడ
బీజింగ్: దాడుల నుంచి అణ్వస్త్రాలను కాపాడుకునేందుకు పర్వతాల కింద, భూగర్భంలో పెద్ద ఉక్కు గోడను చైనా నిర్మించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేసే శాస్త్రవేత్త క్వియాన్ క్విహు (82) వెల్లడించారు. ఇటీవలే ఈయనకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, చైనా రక్షణ శాఖలో అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఈ భారీ ఉక్కు గోడ చైనా వ్యూహాత్మక ఆయుధాలకు రక్షణగా నిలుస్తుందనీ, ఎవరైనా చైనాపై దాడులు చేసినపక్షంలో ఆయుధాలు ధ్వంసం కాకుండా కాపాడుతుందని క్విహు వెల్లడించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. పర్వతాల కింద భాగాల్లో చైనాకు రక్షణ స్థావరాలున్నాయి. సాధారణంగా శత్రు దాడుల నుంచి ఆ పర్వతాలే ఆయుధాలకు రక్షణ కల్పిస్తాయి. రక్షణ స్థావరాల్లోకి ప్రవేశించే, నిష్క్రమించే చోట్ల మాత్రం ఎవరైనా దాడులు చేస్తే ఆయుధాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉండటంతో ద్వారాల దగ్గర మరింత భద్రంగా ఉండేలా చేసే బాధ్యతను చైనా ప్రభుత్వం క్విహుపై పెట్టింది. ఆయన ఆ పనిని పూర్తి చేయడంతో 2018 ఏడాదికి ‘స్టేట్ ప్రీమినెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్’ను చైనా ప్రభుత్వం క్విహుకు ప్రదానం చేసింది. ఓ కార్యక్రమంలో క్విహు మాట్లాడుతూ ‘బల్లెం పదును ఎక్కువవుతున్నప్పుడు కవచం కూడా దృఢంగా తయారైతేనే రక్షణను ఇవ్వగలదు. సవాళ్లకు దీటుగా ఈ భూగర్భ ఉక్కు గోడను నిర్మించాం’ అని చెప్పారు. -
పాదగయ క్షేత్రంలో ప్రహరీను కూల్చిన ఆధికారులు
-
తిరిగితే తిరిగావు కానీ...
లాంతరు వెలుగులో తిరిగి ఆ స్టూలు ఎక్కడుందో కనిపెట్టాడు గురువు. దాన్ని తీసేయించి, ఆ రాత్రి ఆ గోడ దగ్గరే నిల్చున్నాడు. ఊరికి దూరంగా వున్న గురుకులం అది. చాలామంది పిల్లలు అందులో ఉండేవారు. వారికి ఒక గురువు పాఠాలు బోధించేవారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు.అయితే, ఒక పిల్లాడు రోజూ రాత్రి లేచి, గోడ దూకి, పట్టణంలోకి తిరగడానికి వెళ్లేవాడు. గదుల్ని పర్యవేక్షించడానికి వచ్చిన గురువు ఒక పిల్లాడు గోడ దూకి వెళ్లినట్టు గుర్తించాడు. అలాగే తాను వాడే ఒక ఎల్తైన స్టూలు కూడా లేకపోవడం గమనించాడు. లాంతరు వెలుగులో తిరిగి ఆ స్టూలు ఎక్కడుందో కనిపెట్టాడు గురువు. దాన్ని తీసేయించి, ఆ రాత్రి ఆ గోడ దగ్గరే నిల్చున్నాడు. బయటికి పోయిన కుర్రాడు అర్ధరాత్రి దాటాక తిరిగివచ్చాడు. అక్కడ స్టూలు ఉందో లేదో గుర్తించకుండా, నిల్చున్న గురువు తల మీద కాలు మోపాడు. కిందికి దిగాక తను చేసింది చూసి ఒక్కసారి భయాశ్చర్యాలకు లోనయ్యాడు. కాలు మోపిందానికి గురువు ఏ స్పందనా కనబరచకుండా, ‘నాన్నా, నువ్వు రాత్రిళ్లు తిరిగితే తిరిగావు. కానీ బయట బాగా చలిగావుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెబుదామనే ఇంతసేపూ ఇక్కడ నిల్చున్నాను’ అన్నాడు. పిల్లాడి ముఖంలో మార్పు కనబడింది. ఇంకంతే, అప్పట్నించీ ఆ గోడ దూకే పని మళ్లీ చేయలేదు. -
ఏడో శతాబ్దం నాటిది
సాక్షి, హైదరాబాద్: ఓ గొప్ప చారిత్రక వారసత్వ కేంద్రమది.. ఆదిమానవుల కాలం నుంచి మహారాజ్యాల పాలనకు సంబంధించిన ఎన్నో ఆధారాలు అక్కడ కొలువయ్యాయి. కానీ విచక్షణ లేకుండా సాగిన తవ్వకాలతో మొత్తం నాశనమయ్యాయి. జనగామ సమీపంలో తాజాగా వెలుగు చూసిన పురాతన నిర్మాణ అవశేషాలను ప్రాథమికంగా పరిశీలించిన పురావస్తు శాఖ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. పెంబర్తి శివారు ఎల్లంలలో వెలుగుచూసిన పురాతన ఇటుక గోడను పురావస్తు శాఖ అధికారి భానుమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది పరిశీలించారు. ఆ నిర్మాణం ఏ కాలానికి చెందిందో తేల్చనప్పటికీ.. అది దాదాపు ఏడో శతాబ్దానికి చెందిన కట్టడంలాగా ఉందని అధికారులు గుర్తించారు. ఇటుకల తీరు, నిర్మాణ పద్ధతి ఆధారంగా చాళుక్యుల కాలం నాటిది కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటుక గోడపైన రెండు మీటర్లకుపైగా ఎత్తుతో భారీగా ఇసుక మేట వేసి ఉందని, దాన్ని తొలగిస్తే గాని సరైన అంచనా రాదని వారు పేర్కొంటున్నారు. చుట్టూ తవ్వకాలు జరిపితేనే ఆ నిర్మాణం పూర్తిగా వెలుగు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు. బుధవారం మరింత మేర తవ్వగా తొమ్మిది ఇటుక నిర్మాణ వరసలు వెలుగు చూశాయి. ఈ వివరాలతో రెండు రోజుల్లో పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చికి నివేదిక ఇస్తానని భానుమూర్తి తెలిపారు. గోడ అవశేషమే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో మరెన్నో ఆధారాలు కనిపించాయి. ఆదిమానవుల ఆవాసం, వివిధ అవసరాల కోసం రూపొందించిన రాతి గుంతలు, వినియోగించిన వస్తువులు, సమాధులు కనిపించాయి. వాటిలో చాలావరకు దెబ్బతిన్నాయి. పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలకు వెంటనే అనుమతించి పనులు చేపడితే నాటి నిర్మాణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
మూర్ఖంగా చేయకండి.. అభిమానికి హీరో ట్విట్ !
ముంబై: హీరోలు సినిమాలో చేసే స్టంట్స్ అభిమానులపై ప్రభావం చూపుతాయి. బాహుబలి-2 సినిమాలో ప్రభాస్ ఏనుగు తొండంపై పైకి ఎక్కుతాడు. ఆ విధంగా చేయాలని కేరళకు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఏమైందో ఏమో గజరాజుకి కోపం వచ్చి తొండంతో ఆ వ్యక్తిని దూరంగా విసిరేసింది. తీవ్రగాయాలై ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అదే విధంగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి సాహసామే చేశాడు. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్కి అమన్ అనే వ్యక్తి అభిమాని. తన సినిమాల్లో టైగర్ డూప్ లేకుండా స్టంట్లను చాలా ఈజీగా చేస్తుంటారు. 2016లో వచ్చిన ‘ప్లయింగ్ జాట్’ సినిమాలో టైగర్ చాలా స్టంట్లు చేశారు. అమన్ తన హీరో చేసిన స్టంట్నే ప్రయత్నించాడు. దాదాపుగా 13 అడుగుల గోడపై నుంచి దూకేశాడు. అతను దూకుతున్నప్పుడు తీసని వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ‘ నేను భయాన్ని జయించాను. అంత పై నుంచి దూకడం అంత ఈజీ కాదు అందుకు చాలా ధైర్యం కావాలి. కింది నుంచి చూస్తే ఏలాంటి భయం ఉండదు.. కానీ గోడపైకి ఎక్కితే భయం అనేది తెలుస్తుంది. నాకు నేనే హీరోగా ఫీలై అలా కిందకు దూకాను. నాకు ఈ స్పూర్తిగా నిలిచిన టైగర్ ష్రాఫ్కు కృతజ్ఞతలు’ అని అమన్ తన ట్విట్టర్ అకౌంట్లో ట్విట్ చేశాడు. ఈ వీడియో చూసిన హీరో టైగర్ తన ట్విట్టర్ ద్వారా స్పందించి..‘ నువ్వు ఈ విధంగా చేయడం చాలా మూర్ఖత్వం. నీ లైఫ్ను ఈ విధంగా ఎప్పుడు రిస్క్ చేయవద్దు. చిత్ర షూటింగ్ సమయంలో ఈ విధమైన స్టంట్లు చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తారు. ఈ విధమైన విన్యాసాలను స్వతహగా చేయకండి’ అని టైగర్ అమన్ను ఉద్దేశించి ట్విట్ చేశారు. -
అమెరికా–మెక్సికో గోడకు 1.6 బిలియన్ డాలర్లు
వాషింగ్టన్: మాదకద్రవ్యాల ప్రవాహం, అక్రమ వలసలను అరికట్టేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని ఎన్నికల సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన హామీ అమలు దిశగా తొలి అడుగు పడింది. ఈ వివాదాస్పద గోడ నిర్మాణానికి 1.6 బిలియన్ డాలర్లు సహా 827 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. ఇందులో గోడ కోసం 1.6 బిలియన్లు కేటాయించింది. గురువారం ప్రవేశపెట్టిన ఈ బిల్లు 235–192 ఓట్లతో పాసయింది. ఈ బిల్లు ప్రతిపక్ష డెమోక్రాట్ల బలం ఉన్న సెనేట్లోనూ ఆమోదం పొందాలి. గోడ నిర్మాణానికి అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును విచ్చలవిడిగా వెచ్చించడం తగదని, ఎన్నికల ప్రచారంలో ఈ ఖర్చు మెక్సికోతోనే పెట్టిస్తానన్న ట్రంప్ వాగ్దానం ఏమయిందని సభలో డెమోక్రాట్లు ప్రశ్నించారు. మూడోసారీ వీగిన ‘ట్రంప్కేర్’ బిల్లు అమెరికా పౌరుల ఆరోగ్య బీమాకు సంబంధించిన ఒబామాకేర్ (అఫర్డబుల్ కేర్ యాక్ట్) చట్టాన్ని రద్దు చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఈ వారంలో మూడోసారి విఫలమయ్యాయి. ఎగువసభ సెనెట్లో పాలకపక్షమైన రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ ఉన్నాగాని వారిలో ముగ్గురు ట్రంప్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడంతో శుక్రవారం అది వీగిపోయింది. -
ఆ దయ గల గోడ..
నిజామాబాద్లో డాక్టర్ శ్రావణి, శ్రీనుల వినూత్న సేవా కార్యక్రమం ఇదో గోడ.. అన్ని చోట్లా ఉన్నట్లే ఇక్కడానూ..అయితే.. ఇది పిట్ట గోడ కాదు..పోకిరీలు కాలక్షేపం చేసే గోడ కానే కాదు.. ఇదో దయ గల గోడ..ఇక్కడ దయ లభిస్తుంది..బట్టలు లభిస్తాయి..పాఠ్య పుస్తకాలు లభిస్తాయి..చెప్పులు.. బ్యాగులు లభిస్తాయి..అంతేకాదు.. సాటి మనిషికి సాయపడాలన్న సందేశమూ లభిస్తుంది.. అసలు.. అనవసరం అన్న పదంలోనే అవసరం అన్న పదమూ దాగుంది.. అదే ఈ సేవకు స్ఫూర్తి. ప్రభుత్వ సహాయం అవసరం లేకుండా.. మనిషికి మనిషి సాయపడాలన్న ఉద్దేశంతో నిజామాబాద్కు చెందిన డాక్టర్ శ్రావణి, శ్రీనునాయక్ దంపతులు ఈ ‘వాల్ ఆఫ్ కైండ్నెస్’కు శ్రీకారం చుట్టారు. ఇంట్లో మనకు అవసరం లేనివి.. వృథాగా మూలనపడేసిన వస్తువులను అవసరం ఉన్న వారికి, నిరుపేదలకు దానం చేయాలనే సదాశయంతో పట్టణంలోని ఖలీల్వాడి రాజీవ్గాంధీ ఆడిటోరియం చౌరస్తాలో ఉన్న స్కూల్ గోడపై ఇలా రాయించారు. ‘‘మీకు ఉపయోగం లేనివి ఇంట్లో ఉంటే ఇక్కడ వదలండి– మీకు అవసరమైనవి ఇక్కడ ఉంటే తీసుకెళ్లండి’’ అని రాయించారు. ఈ నెల 4 నుంచి ఈ వినూత్న సామాజిక సేవా కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని కొద్దిరోజుల్లో ఇనుపషెడ్ను వేయిస్తామని శ్రావణి, శ్రీనునాయక్ చెబుతున్నారు. ఈ తరహా సేవా కార్యక్రమాన్ని తాము జార్ఖండ్, ఢిల్లీ, బెంగళూర్లోని పలు స్కూళ్లలో చూశామని.. ఆ స్ఫూర్తితోనే నిజామాబాద్లో ప్రారంభించామని తెలిపారు. వాల్ ఆఫ్ కైండ్నెస్కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. చాలా మంది పాత ప్యాంట్స్, షర్ట్సు, టీ షర్ట్సుతోపాటు హ్యాండ్ బ్యాగులు, టెన్త్, ఇంటర్, నీట్ బుక్స్ ఇక్కడ వదలి వెళ్లారని.. వాటిని అవసరం ఉన్న వారు తీసుకువెళ్లారన్నారు. ఈ చక్కటి సామాజిక సేవా కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజలు చేయూతనందిస్తారన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. అటు సోషల్ మీడియాలోనూ దీనికి మద్దతుగా ప్రచారం పుంజుకుంటోంది. – నిజామాబాద్ కల్చరల్ -
పెళ్లి వేడుకలో విషాదం: 26 మంది మృతి
-
పెళ్లి వేడుకలో విషాదం: 25 మంది మృతి
భరత్పూర్: రాజస్ధాన్లోని భరత్పూర్లో గురువారం ఉదయం ఘోరప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన పందిట్లో మృత్యువు విలయతాడవం సృష్టించింది. పెళ్లి కోసం వచ్చిన బంధువులు భారీ వర్షం కురవడంతో దగ్గరలోని ఓ గోడ పక్కనే నిల్చున్నారు. అప్పటికే వర్షానికి బాగా తడిసిన గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో దాదాపు 25 మంది నలిగి ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది తీవ్ర గాయాలయపాలయ్యారు. ఘటనపై మాట్లాడిన పోలీసులు మృతుల్లో 11 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కూలిన గోడ దాదాపు 90 అడుగుల పొడవు ఉంటుందని తెలిపారు. గోడకు అనుకుని ఏర్పాటు చేసిన కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ధ్వంసమైనట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
భారత్ ఆ గోడను నిర్మించడం లేదట
జమ్మూ వద్ద గల భారత్-పాకిస్తాన్ బోర్డర్లో గోడను నిర్మించే ఆలోచనను భారత్ విరమించుకున్నట్లు తెలిసింది. చొరబాటుదారులను అడ్డుకునేందుకు స్మార్ట్ ఫెన్సింగ్ నిర్మించే యోచనలో ఉన్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. ఫెన్సింగ్కు అత్యాధునిక టెక్నాలజీతో సెన్సార్లను అమర్చనున్నట్లు తెలిపారు. 2015లో భారత్ వాల్ నిర్మించబోతోందనే చర్యలపై పాకిస్తాన్ యూఎన్ కౌన్సిల్ను ఆశ్రయించింది. మిలటరీ ఆపరేషన్స్కు ఇబ్బంది కలగొచ్చనే భారత ఆర్మీ కూడా అభ్యంతరం తెలిపింది. 2013లో హీరానగర్/సాంబా సెక్టార్లలో జంట దాడుల తర్వాత 179 కిలోమీటర్ల మేర గోడను నిర్మించాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం కూడా యోచించింది. అయితే, ప్రస్తుతం గోడ నిర్మాణానికి రెండు సమస్యలు అడ్డు వస్తున్నాయని సదరు అధికారి చెప్పారు. ఇంటిలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన ప్రాంతాలు ఎక్కువగా ఉండటం, అక్కడి ప్రజలు ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడకపోవడం ప్రధాన ఇబ్బందులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఒకవేళ గోడను నిర్మించదలుచుకుంటే కేవలం 25శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ విషయంపై హోంశాఖను ప్రశ్నించగా విస్తృతమైన ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టంను తయారుచేసేందుకు 24 గంటలు కసరత్తులు జరగుతున్నాయని పేర్కొంది. -
అమెరికా, మెక్సికో మధ్య గోడ
దుర్భేద్యమైన సరిహద్దు నిర్మాణానికి ట్రంప్ ఆదేశం ► నిర్మాణ ఖర్చులు పంచుకోవాలని సూచన ► ఖండించిన మెక్సికో అధ్యక్షుడు.. డబ్బులిచ్చే ప్రసక్తే లేదని స్పష్టీకరణ వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలుచేసే దిశగా దూసుకెళ్తున్నారు. అమెరికా దక్షిణాన ఉన్న మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆ దేశ సరిహద్దుల్లో దుర్భేద్యమైన గోడ నిర్మించేందుకు ఉద్దేశించిన రెండు ఆదేశాలపై గురువారం సంతకాలు చేశారు. గోడ నిర్మాణ ఖర్చులను మెక్సికో కూడా పంచుకోవాలని సూచించారు. దీన్ని మెక్సికో తీవ్రంగా ఖండించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గోడ నిర్మాణానికి సహకారం ఉండదని ఆ దేశాధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్పష్టం చేశారు. దీనిపై ట్విటర్లో ఘాటుగా స్పందించిన ట్రంప్.. ‘గోడ నిర్మాణ ఖర్చులు పంచుకోకపోతే జనవరి 31న జరపనున్న అమెరికా పర్యటనను రద్దుచేసుకోండి’ అని నీటోను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో అమెరికా–మెక్సికోల మధ్య వాతావరణం వేడెక్కింది. ట్రంప్ ట్వీట్ నేపథ్యంలో తన అమెరికా పర్యటనను రద్దుచేసుకుంటున్నట్లు నీటో ప్రకటించారు. అంతకుముందు గోడ నిర్మాణ ఆదేశాలపై సంతకం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘సరిహద్దుల్లేని దేశం దేశమే కాదు. ఈ రోజునుంచి అమెరికా తన సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధిస్తుంది’ అని వెల్లడించారు. అమెరికా–మెక్సికోలు 3,100 కిలోమీటర్ల సరిహద్దులను పంచుకుంటున్నాయి. అయితే ఇందులో 1600 కిలోమీటర్లకు మాత్రమే గోడ నిర్మించనున్నారు. మిగిలిన చోట్ల కంచె, అక్కడక్కడ సిమెంటు స్లాబులతో కట్టిన సరిహద్దు ఉంది. ‘ఈ రెండు ఆదేశాలు మా ఇమిగ్రేషన్ సంస్కరణల్లో భాగమే’ అని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. గోడకు మేం వ్యతిరేకం: మెక్సికో ట్రంప్ నిర్ణయాన్ని మెక్సికో తీవ్రంగా ఖండించింది. ఈ గోడ నిర్మాణానికి తమవంతు సహకారం ఉండబోదని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తెలిపారు. ఇరు దేశాల ప్రజలను ఒకటి చేయాల్సిందిపోయి.. విడగొట్టేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్నారు. అవతలి దేశం ప్రజలను గౌరవించటం కూడా అమెరికా నేర్చుకోవాలన్నారు. వలసవాదులకు, మెక్సికన్లకు భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించిన నీటో.. అమెరికాలోని 50 మెక్సికన్ కాన్సులేట్లు యథావిధిగానే వలసవాదుల హక్కుల పరిరక్షణకు పనిచేస్తాయన్నారు. ఉగ్ర విచారణలో టార్చర్ సబబే: ట్రంప్ ఉగ్రవాదం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వం వహించదలచుకోలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఉగ్రవాదుల విచారణలో వాటర్బోర్డింగ్ (ముక్కు, నోటి కి గుడ్డకట్టి పైనుంచి నీటిని పోస్తూ ఊపిరాడకుండా చేసి నిజాలు చెప్పించే విధానం) వంటి కఠినమైన పద్ధతులను అవలంబించనున్నట్లు తెలిపారు. దేశభద్రతకోసం ఉగ్రవాదులను టార్చర్ చేయటం తప్పుకాదన్నారు. ‘వారు (ఐసిస్) కేవలం క్రిస్టియన్ అనే కారణంతో మనోళ్లను పట్టుకుని తలలు నరికేస్తుంటే.. ఎవరూ దీనిపై మా ట్లాడరు. నేను వాటర్బోర్డింగ్ అనగానే హక్కులు గుర్తొస్తాయా?’ అని ఏబీసీ న్యూ స్తో ట్రంప్ చెప్పారు. ట్రంప్ భద్రతలేని ఫోన్ నే వాడతుండటం దేశ భద్రతకు ము ప్పు అని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. -
'ట్రంప్ గోడ'కు డబ్బులివ్వం
మెక్సికో సిటీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో, విజయం సాధించిన తరువాత ట్రంప్ పదేపదే చెబుతున్న మాట.. మెక్సికో సరిహద్దులో కట్టబోయే గోడ గురించే. అక్రమ వలసదారులను దేశంలోకి రానివ్వకుండా మెక్సికో సరిహద్దులో భారీ గోడ కడతాం అని తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సైతం ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు గోడ నిర్మాణ ఖర్చును కూడా పొరుగుదేశం పంచుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెన నీటో 'ట్రంప్ గోడ'పై స్పందించారు. అమెరికా కొత్త ప్రభుత్వంతో తమకు కొన్ని విభేదాలున్నాయనడానికి ఇది నిదర్శనం అన్న ఆయన.. గోడకు తమ వైపు నుంచి ఎలాంటి చెల్లింపులు ఉండబోవని తెలిపారు. గత సెప్టెంబర్లో ట్రంప్తో సమావేశమైన సందర్భంలో కూడా నీటో ఇదే విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ట్రంప్ మాత్రం బుధవారం ప్రెస్మీట్లో గోడ కోసం మెక్సికో ఇచ్చే డబ్బులను మళ్లీ రీయింబర్స్ చేస్తామని చెప్పడమే కాకుండా.. ‘గుర్తుంచుకోండి ఇది జరుగుతుంది’ అని కాన్ఫిడెంట్గా అన్నారు. చూడాలి మరి మెక్సికో సహకారంతోనే గోడ నిర్మాణం జరుగుతుందో.. లేక అమెరికా సొంతంగానే ఈ పనికి పూనుకోవాల్సి వస్తుందో. -
విద్యార్థినులపై దాడులకు అధికారులదే బాధ్యత
– కేవీఆర్ హాస్టల్ను తనిఖీ చేసిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు సిటీ: రాష్ట్రంలో కె.వి.ఆర్ డిగ్రీ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కళాశాల గోడను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం తగదు. ఇక్కడి విద్యార్థులపై ఎలాంటి దాడులు జరిగినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె కేవీఆర్ కళాశాలను సందర్శించి కూల్చివేసిన గోడతో పాటు కాలేజీ హాస్టల్, కిచెన్ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు ఒకచోట గోడను కూల్చివేయాలనుకున్నప్పుడు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిందేనన్నారు. ఓ పార్టీ నాయకుడు చెప్పాడని ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కళాశాల గోడ కూల్చివేయడం చట్టవిరుద్ధమన్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా గోడను కూల్చివేయదలిస్తే ముందుగా అక్కడి ప్రజలకు రక్షణ గోడ నిర్మించిన తర్వాతే ఆ పని చేయాలన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీ నాయకులు దుకాణాలు నిర్మించుకునేందుకే రోడ్డు విస్తకరణ సాకుతో విద్యార్థినుల ఆట స్థలంలోకి చొచ్చుకుని రావడం సమంజసం కాదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. అదేవిధంగా హాస్టల్లో విద్యార్థినుల సమస్యలను కూడా పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఎంపీ విద్యార్థినులతో ముచ్చటించారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి హఫీజ్ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
వరద రక్షణ గోడ లేనట్లే!
– దివంగత వైఎస్ఆర్ హయాంలో రూ. 244 కోట్లు మంజూరు - ఆయన అకాల మరణంతో నిలిచిపోయిన పనులు – చేతులెత్తేసిన ప్రస్తుత ప్రభుత్వం - రెండున్నర ఏళ్లు గడిచినా అమలుకు నోచుకోని ఎమ్మెల్యే హామీ – రక్షణ గోడకు బదులు పూడికతీతతోనే సరిపెట్టేందుకు ఎత్తుగడ కర్నూలు సిటీ: కర్నూలు నగరానికి ఒక వైపు తుంగభద్ర, మధ్యలో హంద్రీనది ప్రవహిస్తోంది. ఈ నదులు రెండుమూడు సార్లు ఉగ్రరూపం దాల్చి నగర రూపురేఖలను ఛిన్నభినం చేశాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. మళ్లీ ఈ పరి స్థితి పునరావృతం కాకూడదని 2008లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరద రక్షణ గోడ నిర్మాణానికి రూ. 244 కోట్లు మంజూరు చేశారు. అదే ఏడాది డిసెంబర్ 11న పనులకు శంకుస్థాపన చేశారు. అయితే, ఆయన అకాల మరణంతో అధికారం చేపట్టిన పాలకులు పట్టించుకోకపోవడంతో పనులు ప్రారంభదశలోనే నిలిచిపోయాయి. ఈ లోపు రాష్ట్ర విభజన జరగడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో రక్షణ గోడ అటకెక్కింది. ఆయకట్టు లేనప్పుడు అంత మొత్తంలో నిధులు ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. త్వరలో నగర పాలక సంస్థకు ఎన్నికల రానుండడంతో అందులో లబ్ధిపొందేందుకు హంద్రీనదిలో పూడికతీత తీసేందుకు నీరు–చెట్టు కింద 29.86 కోట్లు, సుద్దవాగుకు వాల్, పూడికతీతకు 39 కోట్లు, జోహరాపురం దగ్గర వంతెనకు 19 కోట్లతో అంచనాలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పూడితతీతో సరిపెట్టేందుకు అధికారి పార్టీ ఎత్తుగడ! త్వలరలో నగరపాలక సంస్థ ఎన్నికలు రానుండడంతో ప్రజలను మరో సారి మభ్య పెట్టేందుకు అధికారపార్టీ నేతలు యత్నిస్తున్నారు. గతంలో ఇచ్చిన రక్షణ గోడ హామీని వదిలేసి పూడికతీతతో సరిపెట్టేందుకు ఎత్తుగడ వేశారు. నీరు–చెట్టు కార్యక్రమం కింద రూ.29.86 కోట్లతో 44వ జాతీయ రహదారి దగ్గర ఉన్న హంద్రీ బ్రిడ్జి నుంచి జోహరాపురం వరకు పూడికతీసేందుకు అంచనాలు వేశారు. మొత్తం హంద్రీ 0.కిమీ నుంచి 5.4 కి.మీ వరకు ఉన్న 12,02, 096 క్యుబిక్ మీటర్ల పూడిక, ముళ్ల కంప, 59339 క్యుబిక్ మీటర్ల రాక్, 2626 క్యుబిక్ మీటర్ల కాంక్రీట్ దిమ్మెలను తొలగించనున్నారు. సుద్దవాగులో పూడిక తీసేందుకు రూ.39 కోట్లు, జోహరాపురం దగ్గర వంతెన నిర్మాణానికి 19 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. హామీని మరచిన ఎమ్మెల్యే! 2008, 2009 సంవత్సరాఽల్లో హంద్రీ, తుంగభద్ర నదులు పోటెత్తి నగర ప్రజలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. వర్షం వస్తే చాలు ఇప్పటికీ నాటి భయంకర పరిస్థితులు వారికి గుర్తుకు వస్తాయి. తనను గెలిపిస్తే నగరాన్ని శాశ్వతంగా వరదల నుంచి కాపాడేందుకు రక్షణ గోడ నిర్మిస్తానని కర్నూలు ఎమ్మెల్యే గత ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీచ్చారు. కానీ గెలిచి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఆ హామీ ప్రకటనకే పరిమితమైంది. పూడికతీతకు ప్రతిపాదనలు పంపాం – మల్లికార్జునరెడ్డి, ఎఫ్ఆర్ఎల్,ఈఈ హంద్రీ, సుద్దవాగులో పేరుకుపోయిన పూడిక తీసేందుకు అంచనాలు వేసి సీఈ ద్వారా ఇటీవలే ప్రభుత్వానికి పంపించాం. నీరు–చెట్టు కింద పూడికతీత పనులు చేపడతాం. జోహరాపురం వద్ద వంతెన నిర్మాణానికి రూ. 19 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపించాం. -
వారెవ్వా.. వాల్స్!
గోడల్లోనే వస్తువుల అమరిక సాక్షి, హైదరాబాద్ : ‘ఇల్లు కట్టి చూడు’ అనేది పాత నానుడి. ‘ఉన్న స్థలంలోనే వస్తువులను అమర్చి చూడు’ అన్నది లేటెస్ట్ సామెత. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో విశాలమైన ఇల్లు కావాలంటే బోలెడంత డబ్బు కావాలి. ఇది అందరికీ కుదరదు. అందుకే ఉన్న కొంచెం స్థలంలోనే ఇంట్లోని ఫర్నీచర్ను అమర్చుకోవాలి. దీనికి కావాల్సిందల్లా కొద్దిపాటి సృజనాత్మకతే. సౌకర్యాల ఆలోచనలు.. ఈ రోజుల్లో 600 చ.అ.- 700 చ.అ. విస్తీర్ణంలోనే ఒక హాలు, వంట గది, పడక గది, పూజ గది, వీటిని ఆనుకునే మరుగుదొడ్డినీ నిర్మిస్తున్నారు బిల్డర్లు. హాల్లోనే సోఫాసెట్, టీవీ, డైనింగ్ టేబుల్, దివాన్కాట్ అమర్చాలి. వంట గదిలోనే ఉడెన్ కప్ బోర్డు, స్టీల్ బాస్కెట్స్, చిమ్నీ, స్టోరేజీ క్యాబిన్తో నిత్యావసర సరుకులతో పాటు బియ్యం వంటి వంట సామాగ్రి ఉండేలా చూసుకోవాలి. పడకగదిలో రెండు మంచాలతో పాటు గోడలకే అమర్చే కప్ బోర్డ్లోనే దుస్తులు, నగదు, బంగారం తదితర విలువైన వస్తువులు పెట్టే ఏర్పాటు చేసుకోవాలి. అన్ని గోడల్లోనే.. టీవీ మొదలుకొని బీరువా, మైక్రోఓవెన్ను అంతర్గత అలంకరణలో భాగంగా గోడల్లోనే అమర్చుకునేలా ప్రణాళికలున్నాయి. మరోవైపు సోపానే మంచంగా మలుచుకునేలా రెడిమేడ్గా తయారైనవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా హాలులో కానీ, పడక గదిలోనే ఒక గూటికి అమర్చుకునేలా నిపుణులు తయారుచే స్తున్నారు. ఇవన్నీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. ప్రత్యేకించి అపార్ట్మెంట్లు, కాలనీల్లో ఇల్లు నిర్మించుకునే వారికి అనుగుణంగా వీటిని రూపొందిస్తున్నారు. -
సరిహద్దుల్లో ఇక ‘గ్రేట్ వాల్ ఆఫ్ బ్రిటన్’
లండన్: ఉత్తర ఫ్రాన్స్లోని కలాయ్ రేవు నగరం నుంచి దొంగచాటుగా తరలి వస్తున్న శరణార్థులను అడ్డుకునేందుకు భారీ అడ్డుగోడను నిర్మించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రాన్స్ను, బ్రిటన్ను వేరు చేస్తున్న ఇంగ్లీష్ ఛానల్ ఒడ్డున 13 అడుగుల ఎత్తుతో కిలోమీటరు పొడవున ఈ భారీ అడ్డుగోడను నిర్మించాలని నిర్ణయించినట్లు బ్రిటన్ వలసల శాఖ మంత్రి రాబర్ట్ గుడ్విల్ ప్రకటించారు. గోడ నిర్మాణం కోసం ఫ్రాన్స్ ప్రభుత్వంతో 2.30 కోట్ల డాలర్లతో ఒప్పందం చేసుకున్నామని రాబర్ట్ తెలిపారు. కలాయ్ రేవు నగరం నుంచి బ్రిటన్లోకి శరణార్థులు రాకుండా అడ్డుకునేందుకు ఎత్తైన ఇనుప కంచెను నిర్మించినా ఫలితం లేకపోవడంతో తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ ప్రభుత్వం శరణార్థులను రిజిస్టర్ చేసుకుంటామని చెబుతున్నప్పటికీ శరణార్థులు ఇష్టపడకుండా బ్రిటన్లో చొరబడేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కలాయ్ రేవు నగరంలో 40 ఎకరాల్లో శరణార్థుల శిబిరాలు వెలిశాయి. అక్కడి నుంచి రకరకాల మార్గంలో బ్రిటన్లోకి ప్రవేశించేందుకు శరణార్థులు పడిగాపులు పడుతున్నారు. కొందరు కార్గో ట్రక్కుల డ్రైవర్లపై దాడులు చేసి, డబ్బులు ఇచ్చి వాటిలో దాక్కొని సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇంగ్లీషు ఛానల్ దాటేందుకు ప్రయత్నిస్తూ మృత్యువాత పడుతున్నారు. కలాయ్ శిబిరాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన వివిధ జాతుల ప్రజలు ఉన్నారు. వారు దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లో బతుకుతున్నారు. శరణార్థులను అడ్డుకునేందుకు టాక్స్ పేయర్ల సొమ్ముతో అడ్డుగోడను కట్టడం అన్యాయమని ట్రక్కు డ్రైవర్ల సంఘం విమర్శించింది. అడ్డుగోడను కట్టినంతమాత్రాన వలసలను నిరోధించలేమని, దానికి బదులు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడమే ఉత్తమమైన మార్గమని ఆ సంఘం తెలిపింది. గోడ నిర్మాణానికి వెచ్చిస్తున్న సొమ్ములో సగం డబ్బుతోనే మూడంచెల భద్రతను ఏర్పాటు చేయవచ్చని, భద్రతను పెంచడం వల్ల సరిహద్దుల్లో తమపై శరణార్థులు జరపుతున్న దాడులను కూడా అడ్డుకోవచ్చని డ్రైవర్ల సంఘం సూచించింది. -
గోడ కూలి వ్యక్తి దుర్మరణం
మరో ఇద్దరికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలు పాత ఇల్లు కూల్చుతుండగా సంఘటన పెదపూడి : పాత ఇల్లు కుల్చుతుండగా.. గోడ కూలి ఒక వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరి కి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలయ్యా యి. వివరాల్లోకి వెళితే.. జి.మామిడాడకు చెందిన దొరబాబు అనే వ్యక్తి శహపురం శివారు లంకలో వి.నాగమణికి చెందిన పాతఇంటి సా మగ్రి, మట్టిని తరలించడానికి బేరం కుదుర్చుకున్నాడు. ఆ ఇంటిని కూల్చి, మట్టిని ట్రాక్టర్లపై తరలించడానికి జి.మామిడాడ శివారు పాటిమీ ద గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు మూ డు రోజులుగా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం ఇంటి గోడ కూలి ముగ్గురు కూలీలపై పడింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే మో కాన శివనారాయణ(38) చనిపోయాడు. కూలీ లు పి.ధర్మయ్య, ఎం.రాజుకు తీవ్ర గాయాలు కాగా, వారిని 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రి కి తరలించారు. స్వల్పంగా గాయపడిన ఐ.కోదండం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీఆర్ఓ సోమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై పెదపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎస్సై వీఎల్వీకే సుమంత్ సందర్శించారు. -
గోడ కూలి వ్యక్తి దుర్మరణం
మరో ఇద్దరికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలు పాత ఇల్లు కూల్చుతుండగా సంఘటన పెదపూడి : పాత ఇల్లు కుల్చుతుండగా.. గోడ కూలి ఒక వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరి కి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలయ్యా యి. వివరాల్లోకి వెళితే.. జి.మామిడాడకు చెందిన దొరబాబు అనే వ్యక్తి శహపురం శివారు లంకలో వి.నాగమణికి చెందిన పాతఇంటి సా మగ్రి, మట్టిని తరలించడానికి బేరం కుదుర్చుకున్నాడు. ఆ ఇంటిని కూల్చి, మట్టిని ట్రాక్టర్లపై తరలించడానికి జి.మామిడాడ శివారు పాటిమీ ద గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు మూ డు రోజులుగా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం ఇంటి గోడ కూలి ముగ్గురు కూలీలపై పడింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే మో కాన శివనారాయణ(38) చనిపోయాడు. కూలీ లు పి.ధర్మయ్య, ఎం.రాజుకు తీవ్ర గాయాలు కాగా, వారిని 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రి కి తరలించారు. స్వల్పంగా గాయపడిన ఐ.కోదండం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీఆర్ఓ సోమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై పెదపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎస్సై వీఎల్వీకే సుమంత్ సందర్శించారు. -
సృజనకు స'వాల్'
అందంగా అలంకరణ చేసుకునే వీలుండగా, బోసి పోయినట్టుగా ఉండాల్సిన పనేంటి? ఖాళీ కాన్వాస్గా ఉండే బదులు రకరకాల బొమ్మలతో నింపేస్తే సరి! ఇంతకీ అంత ఖాళీగా ఉండే కాన్వాస్ ఏంటంటే.. అవి మాఇంటిగోడలు అంటున్నారు సిటీజనులు. కంప్యూటర్ టేబుల్, స్విచ్ బోర్డ్, బెడ్ల్యాంప్ ఉన్న మూల, బెడ్ ఆనుకుని ఉన్న గోడ ఇలా ఇంట్లో ఏ చోటుని అయినా చక్కటి కాన్వాస్గా మార్చి కొత్త లుక్ ఇచ్చేస్తున్నారు. పక్షులు, చెట్లు, నక్షత్రాలు, సీతాకోక చిలుకలు, గార్డెన్ టు గ్యాలెక్సీని తెచ్చి ఇంటి గోడగా మార్చేస్తున్నారు. – సాక్షి, వీకెండ్ ప్రతినిధి ఇంటి గోడలు ఇంటికి రక్షణగానే కాదు.. అభిరుచికి అద్దంగా కూడా నిలుస్తున్నాయి. నగరంలోని నివాసాలు చాలా వరకు అపార్ట్మెంట్లు.. అందులో వార్డ్రోబ్లు, ఫర్నీచర్ పోనూ ఒక ఖాళీ గోడను అలాగే అట్టి పెట్టుకుంటున్నారు. దాన్ని వాల్ హ్యాంగిగ్స్, పెయింటింగ్స్తో అలంకరిస్తున్నారు. మొత్తం మీద తమ అలంకరణాభిలాషను అలా తీర్చుకుంటున్నారు. అయితే గోడలను మరింత అందంగా అలంకరించుకోవచ్చునని అంటున్నారు అభిరుచి కలవారు. థీమ్ డెకర్... నచ్చిన థీమ్లను ఇంటి గోడలపై చిత్రించుకోవచ్చు. ‘వాల్ డెకల్/వాల్స్టిక్కర్’ పేరుతో పాపులర్ అయిన ఈ ఇంటీరియర్ డిజైన్లు సిటీలో ఇప్పుడు బాగా పాపులర్. వీటిని ఎలా తయారు చేసుకోవాలి? వేసుకోవాలి? అనే వీడియోలు యూట్యూబ్లో ఎన్నో లభిస్తాయి. ఒకవేళ ఇంటి యజమాని ఆర్టిస్ట్ అయితే తనే చక్కని చిత్రాన్ని వేసుకోవచ్చు. అలా వేసుకోలేని వారికి ఆన్లైన్ సర్వీస్లు, స్టిక్కర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సర్వీసులు నేరుగా మన సిటీలో దొరుకుతున్నాయి. అభిరుచికి తగ్గట్టుగా తయారు చేసుకోవడం లేదా చేయించుకోవడం ఏదైనా సులువే. అయితే ఖాళీ గోడలను అందంగా చూసుకోవాలనే ఆసక్తి ఉంటే స్వయంగా ఈ స్టిక్కర్స్ తయారు చేసుకోవచ్చు. వ్యయప్రయాసలకు ఓర్చుకునే సత్తాను బట్టి వాల్స్ని క్రియేటివ్గా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. అలంకరణకు సూచనలు... గ్రాఫిక్స్, ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లపై అవగాహన ఉంటే స్వతహాగా డిజైన్లు తయారు చేసుకోవచ్చు. వినైల్ పేపర్ మీద ప్రింట్ తీసి, కత్తిరించి, జాగ్రత్తగా గోడలకు అతికించాలి. మార్కెట్లో వాల్ స్టిక్కర్స్ లభ్యమవుతున్నాయి. వీటి ధర రూ.300 నుంచి ఉంటుంది. -
వైఎస్సార్ విగ్రహానికి అడ్డుగోడలు
వైఎస్సార్సీపీ, కొండవీటి సేవా సమితి నేతల నిరసన తెనాలి : రణరంగచౌక్ సమీపంలోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు దారి లేకుండా చర్యలు తీసుకున్న తీరు హేయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కొండవీటి సేవాసమితి నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. అమరవీరుల స్థూపాలకు పడమర వైపున ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు వీల్లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహం కనిపించకుండా వుండాలనే ఉద్దేశంతో రణరంగ చౌక్ శిలాఫలకాన్ని అడ్డుగా ఉంచారన్నారు. దీనిపై ఆదివారం సాయంత్రం మున్సిపాలిటీ సిబ్బంది ఎదుట నిరసన తెలియజేశారు. వైఎస్సార్ విగ్రహానికి దారి ఇవ్వాలనీ, లేనిపక్షంలో తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఎన్ని అడ్డుగోడలు పెట్టాలని చూసినా వైఎస్ను ప్రజల మనసుల్లోంచి తొలగించలేరని స్పష్టంచేశారు. సేవాసమితి కార్యదర్శి బొంతు చంద్రశేఖరరెడ్డి, ఉపాధ్యక్షుడు ఉడుముల బాలకోటిరెడ్డి, కోశా«ధికారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శులు మోరా శ్రీనివాసరెడ్డి, తవ్వా రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు షేక్ దుబాయ్బాబు, అక్కిదాసు కిరణ్కుమార్రెడ్డి, షేక్ ఖదీర్, షేక్ రఫీ, కౌన్సిలరు బచ్చనబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గోడ కూలి ఒకరు మృతి
నెక్కొండ : ఇంటి గోడను కూలుస్తుండగా మీదపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాగారం గ్రామంలో మంగళవారం సా యంత్రం జరిగింది. గ్రామానికి చెందిన పూర్ణకంటి యాకయ్య(50) ఉదయాన్నే అదే గ్రామానికి చిదురాల యాకూబ్కు చెందిన పాత ఇంటి ని కూల్చేందుకు కూలీకి వెళ్లాడు. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్లే కొద్ది సమయం ముందు ఇల్లును ధ్వంసం చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృ తుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
గోడ కూలి ఇద్దరు మృతి
రోలుగుంట: విశాఖ జిల్లా రోలుగుంట మండలం వడ్డిప గ్రామంలో ఓ పాడుబడిన ఇంటిని కూలగొడుతుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన ఎల్. లింగయ్యపాత్రుడుకు చెందిన పెంకిటిల్లు పాడుబడింది. కొత్త ఇంటి నిర్మాణానికి వీలుగా ఆ ఇంటిని సోమవారం కూలగొట్టడం ప్రారంభించారు. మధ్యాహ్నం వరకూ ఇంటి పైకప్పు తొలగించారు. భోజనాల అనంతరం మధ్యాహ్నం గోడలు తొలగించే పనులు చేపట్టారు. ఇటీవల వర్షాలకు బాగా నానిపోయిన గోడ ఒక్కసారిగా అక్కడున్న ఐదుగురు కూలీలపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన వారందరినీ 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో లంక జనాపాత్రుడు(45), లంక రాము(30) చనిపోయారు. వీరాపాత్రుడు, ఆనంద్, వరహాలబాబులను నర్సీపట్నం ఏరియా అస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించారు. వీఆర్వో శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో రోలుగుంట ఇన్చార్జి ఎస్ఐ పి.రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను ఆరా తీశారు. పోస్టుమార్టానికి మృతదేహాలను నర్సీపట్నం ఏరియా అస్పత్రికి తరలించారు. తహసీల్దార్ అప్పలనాయుడు గ్రామానికి వెళ్లి ప్రమాద వివరాలు తెలుసుకొన్నారు. -
గోడ కూలి చిన్నారి మృతి
ఆత్మకూరురూరల్: నల్లకాల్వ గ్రామంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో గోడకూలి చిన్నారి మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామంలోని ప్రేమజ్యోతి, ప్రేమ్కుమార్ దంపతులకు 6 నెలల క్రితం కుమార్తె పుట్టింది. ఇంకా పేరు కూడా పెట్టలేదు. వీరు రేకులషెడ్డులో నివాసం ఉంటున్నారు. చిన్నారిని ఊయలలో నిద్రపుచ్చిన తల్లి ప్రేమజ్యోతి, అమ్మమ్మ శేషమ్మలు పక్కనే నిద్రించారు. కాగా పక్కనున్న మిద్దె గోడ కూలి రేకుల షెడ్పై పడింది. దీంతో ఊయలలో నిద్రిస్తున్న చిన్నారి తీవ్రంగా గాయపడి మతి చెందింది. చిన్నారి తల్లి, అమ్మమ్మలకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. -
గోడకూలి వృద్ధుడి మృతి
కట్టంగూర్ గోడకూలి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ముత్యాలమ్మగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల లింగయ్య(70) తన ఇంటి ఆవరణలో ప్రహరీ పక్కనే మంచం వేసుకుని పడుకున్నాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ నానడంతో ఒక్కసారిగా కుప్పకూలి లింగయ్యపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రమీల, ఆర్ఐ జానీ షరీఫ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
తప్పిన ప్రమాదం
విజయవాడ (భవానీపురం) : కొండప్రాంతంలో రిటైనింగ్వాల్ కూలి దిగువన ఉన్న ఇంటిపై పడడంతో ఇల్లు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ధ్వంసమైన ఇంటిలోని ఒక పోర్షన్లో అద్దెకు ఉంటున్న కొత్త జంట తృటిలో ప్రమాదం నుంచి తప్పుకున్నారు. 33వ డివిజన్ పరిధిలోని రామరాజ్యనగర్ కొండపై వాటర్ ట్యాంక్ వద్ద కార్పెంటర్ చలపాక త్రినాథాచారి నివసిస్తున్నారు. దిగువున టైలరింగ్ వృత్తి చేసుకునే గట్ల జనార్దన్, పద్మ దంపతుల రేకుల షెడ్ ఇల్లు ఉంది. దానిలో మూడు పోర్షన్లు ఉండగా ఒక దానిలో జనార్దన్, మరో పోర్షన్లో ఇటీవలే వివాహమైన ఆయన కుమారుడు నాగు, వనిత దంపతులు ఉంటున్నారు. మరో పోర్షన్లో వేరేవారు ఉంటున్నారు. మంగళవారం ఉదయం సుమారు 10.30 గంటలకు త్రినాథాచారి ఇంటిపక్కనే ఉన్న రిటైనింగ్వాల్ ఒక్కసారిగా కూలి దిగువున ఉన్న జనార్దన్ ఇంటిపై పడింది. దీంతో పైరేకులు పగిలిపోయి ఇంటిలోని వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఒక పోర్షన్లో ఉండేవారు తాళంవేసి ఊరు వెళ్లగా జనార్దన్, పద్మలు తాము పనిచేసే టైలరింగ్ షాపునకు వెళ్లారు. రిటైనింగ్వాల్ కూలిపోవడానికి అరగంట ముందే కొత్త జంట నాగు, వనితలు బయటకు వెళ్లారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక కార్పొరేటర్ హరనాథస్వామి, బీజేపీ యువ మోర్చా నగర ప్రధాన కార్యదర్శి బొండా నిరీష్కుమార్, పశ్చిమ కో–కన్వీనర్ మైలవరపు దుర్గారావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వీఆర్వో మల్లికార్జునరావు వివరాలను సేకరించారు. రిటైనింగ్వాల్ కూలిన త్రినాథాచారి ఇంటి పక్కన ఇళ్లల్లో -
నిషేధ స్థలంలో గోడ తొలగింపు
ముదివర్తి (విడవలూరు) : మండలంలోని ముదివర్తి వీఆర్వో నరసింహులు స్థానికంగా ఉన్న నిషేధ స్థలంలో ఉన్న గోడను తొలగించడంతో పాటు వీరంగం సష్టించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. పెన్నానది తీరాన ఉన్న సర్వే నంబర్ 54లో కొంత ప్రభుత్వ భూమిని గతంలో స్థానికంగా ఉన్న శనీశ్వర చక్రవర్తి ఆలయానికి ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆలయ నిర్వహకులకు, ఓ వర్గానికి ఈ స్థలం విషయమై వివాదం చోటుచేసుకుంది. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీస్లు రంగప్రవేశం చేసి ఆ స్థలంలో 145 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో ఆదివారం వీఆర్వో తనకు ఆర్డీఓ, తహసీల్దార్ ఆదేశాలు ఉన్నాయని, ఈ గోడను కూల్చుతున్నట్లు తెలిపి, గోడను కూల్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో స్థానికులు కలుగచేసుకుని మీ వద్ద అధికారుల ఆదేశాలు ఉంటే చూపాలని కోరినా వినిపించుకోకుండా వీరంగం సష్టిస్తూ గోడను తొలగించారు. కాగా ఎటువంటి ఆదేశాలు లేకుండా నిషేధ స్థలంలో అధికారులు నిర్మించిన గోడ తొలగించిన విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తామని బాధితులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : తహసీల్దార్ వివాదానికి నిలయంగా ఉన్న స్థలంలో 145 సెక్షన్ విధించి, ఆ ప్రాంతంలో గోడను నిర్మించడం వాస్తమే. ప్రస్తుతం ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు గోడను తొలగించడం జరిగింది. ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములున్న కారణంగా ఆ భూములు చెందిన రైతులు రాకపోకలు సాగించేందుకు వీలుగా మాత్రమే గోడను తొలగించడం జరిగింది. -
కోడల్ని కాల్చి చంపేసింది!
జార్జియాః అమెరికా జార్జియాలో దారుణం చోటు చేసుకుంది. తన కొడుకును విడాకులు కోరినందుకు ఏకంగా ఓ అత్తగారు కోడల్ని కాల్చి చంపేసింది. కొద్దిరోజులుగా ఇంటి గొడవలు కారణంగా కోడలు.. తన ఇద్దరు పిల్లలతోపాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లితండ్రులతో కలసిఉంటున్న ఆమెను కాపురానికి తీసుకొచ్చే వంకతో వెళ్ళిన అత్త.. మనవలు చూస్తుండగానే కోడల్ని కాల్చి చంపేసింది. సౌత్ జార్జియా మెక్ రియోకు చెందిన 68 ఏళ్ళ ఎలిజబెత్ వాల్.. వాయువ్య అట్లాంటా పౌడర్ స్ప్రింగ్స్ లో నివసిస్తున్నతన 35 ఏళ్ళ కోడలు.. జెన్నావాల్ ను తుపాకీతో కాల్చి చంపింది. కొడుకుతో గొడవలు పడి కొద్దిరోజులుగా పుట్టింట్లోనే ఉంటున్నజెన్నాను కాపురానికి తెచ్చేందుకు వెళ్ళిన ఎలిజబెత్.. అక్కడే ఉన్న మనవళ్ళను ముందుగా బయటకు పంపించి, ఇంట్లోనే ఉన్న కోడల్ని మాత్రం షూట్ చేసి, హత్య చేసినట్లు జైల్ రికార్డులు చెప్తున్నాయి. కోడల్ని చంపడంతోపాటు, పిల్లల ఎదుటే హింసకు పాల్పడినందుకు గాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎలిజబెత్ వాల్ పై పలు కేసులు నమోదు చేశారు. అయితే ఆమెకు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. బాధితురాలు కాబ్ కౌంటీ కెంప్ ఎలిమెంటరీ స్కూల్లో కిండర్గార్టెన్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్ వెబ్ సైట్ లోని వివరాలను బట్టి ఆమె.. జార్జియా కెన్నెసా హారిసన్ హై లోను, జార్జియా యూనివర్శిటీలోను చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె...కాబ్ కౌంటీలోని మరో రెండు స్కూళ్ళలో కూడ చదివినట్లు వెబ్ సైట్ లోని వివరాలు చెప్తున్నాయి. -
వేగంగా వెళ్లి.. నదిలో పడి..
చెన్నై: బైక్ పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు ఫుట్ పాత్ మీద పాదచారులను తప్పించబోయి గోడను ఢీ కొట్టి నదిలో పడ్డాడు. ఆఫీస్ అవసరాలకు కావసిన వస్తువులను తెచ్చేందుకు డీ ఇన్ఫాంటో(20) బైక్ మీద పూనమల్లే రోడ్డులో అతి వేగంతో వెళ్తున్నాడు. అంపా స్కైవే దగ్గరకు చేరుకోగానే అతడి బైకు అదుపు తప్పి.. అటువైపు వెళ్తున్న పాదాచారుల వైపు వెళ్లసాగింది. దాంతో వారికి ప్రమాదం జరగకుండా తప్పించాలన్న ప్రయత్నంలో ఇన్ఫాంటో నదిని అనుకుని ఉన్న గోడను ఢీ కొట్టి 25 మీటర్ల లోతుకు నీళ్లలో పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని రక్షించారు. తలకు బలమైన గాయాలు కావడంతో అతనికి ప్రథమ చికిత్స అందించి నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి డ్రైవింగ్ లైసెన్స్, బైక్ కు సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోడను ఢీకొట్టిన లారీ
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయపడ్డాడు. విజయవాడ వైపు వెళ్తున్న సిమెంట్ లారీ అదుపుతప్పి ఘాట్రోడ్డు గోడను ఢీకొట్టి రోడ్డుపైనే నిలిచిపోయింది. క్యాబిన్ నుజ్జునుజ్జు కావటంతో అందులో చిక్కుకున్న డ్రైవర్ గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. డ్రైవర్ స్వస్థలం గుంటూరు జిల్లా వేమూరు. -
మెక్సికన్ మాజీ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్పై మెక్సికన్ మాజీ అధ్యక్షుడు ఫెలిపె కాల్డెరోన్ విరుచుకు పడ్డారు. ట్రంప్ ప్రచార ప్రణాళికపై స్పందించిన కాల్దెరోన్.. తీవ్ర పదజాలంతో విమర్శించారు. సరిహద్దు గోడ నిర్మాణాకి ఒక్క సెంట్ కూడా చెల్లించేది లేదని.. అదో స్టుపిడ్ వాల్ అని అన్నారు. బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం యాంఛెన్ వెళ్ళిన కాల్దెరోన్.. ఆ వాల్ నిర్మాణ ప్రయత్నం ఎందుకూ పనికి రానిదన్నారు. అంతేకాక అధ్యక్ష పదవికి ట్రంప్ సరిపోడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ పోటీపై కాల్డెరోన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. ఓ ప్రశంసనీయ సమాజం ఉన్న ఆమెరికాలో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ రేస్లో ట్రంప్ వంటి అభ్యర్థులు పోటీ పడటం నమ్మలేకపోతున్నామంటూ తన అయిష్టాన్ని వెళ్ళగక్కారు. ట్రంప్ బాగా చదువుకున్న మనిషే అయినా అధ్యక్ష పదవికి తగ్గ తెలివితేటలు లేవన్నారు. కాగా తన ప్రచారంలో ట్రంప్... సరిహద్దు సమస్యలు, ఇమ్మిగ్రేషన్లను ప్రధాన అజెండాలుగా చేసుకున్నారని, మెక్సికో ...రేపిస్టులను, క్రిమినల్స్ను బరిలోకి పంపిస్తోందంటూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. అంతేకాకుండా ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ సమస్యలను ప్రచార సాధనంగా ఎంచుకోవడాన్ని కాల్డెరోన్ తప్పుబట్టారు. ప్రజల, వాణిజ్య శ్రేయస్సును కోరుకునేవారు సరిహద్దును మూసివేయడంపై మాట్లాడటం వారి ఓటమికి ప్రధమ కారణం అవుతుందన్న కాల్దెరోన్... అటువంటి విధానాలను ప్రవేశపెట్టడం అమెరికా శ్రేయస్సుకు ఎంతమాత్రం సరికాదన్నారు. అలాగే ఇమ్మిగ్రేషన్ పై ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అసంబద్ధమని, మెక్సికో నుంచి అక్రమ వలసలు సమస్యలను తెచ్చి పెడతాయని అన్నారు. గత నవంబరులో చేపట్టిన ఓ నివేదిక ప్రకారం మెక్సికోకు ఇమ్మిగ్రేట్ అయ్యేవారికంటే ఆమెరికా నుంచి వలసలు ఎక్కువయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సరిహద్దు గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాల్దెరోన్ తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. -
ఎల్జి నుంచి మడత పెట్టే టీవీలు
-
కూలిన వరదరాజస్వామి ఆలయ ప్రహరీ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని అతి పురాతనమైన మాణిక్య వరదరాజస్వామి ఆలయ ప్రహరీ ఆదివారం కూలిపోయింది. ఈ శిధిలాలు గర్భగుడిపై పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బలహీనపడిన గోడ కూలిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే చోళుల కాలం నాటి ఈ ఆలయానికి ఆదాయం కూడా ఎక్కువే. రాగి చెట్లు పెరుగుతూ శిధిలావస్థకు చేరిన ఆలయ ప్రహారీ గురించి 'సాక్షి' ఎన్నో సార్లు కథనాలను ప్రచురించింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయ ప్రహారీ కుప్ప కూలింది. -
గోడ కూలి ఐదుగురికి గాయాలు
పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండలోని సాయికాళేశ్వర్ ఆశ్రమం గోడకూలిన ఘటనలో 5 మందికి గాయాలయ్యాయి. ఆశ్రమానికి పక్కనే ఉన్న పాంచ్బీబీ దర్గా వద్దకు మంగళవారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. దర్గాకు ఆనుకుని సాయి కాళేశ్వర్ ఆశ్రమం 14 అడుగుల ఎత్తై గోడ ఉంది. అది మంగళవారం ఉదయం ఒక్కసారిగా కూలింది. గోడ కూలి షెడ్డుపై పడటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గోడకు ఆనుకుని ఉన్న షెడ్డులో సుమారు 500 మంది భక్తులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘రంగు’ పడుద్ది..!
ఇచ్చట మూత్రం పోయరాదు.. అని రాసినా, చెప్పులు వేలాడదీసినా.. గోడలు తడిపేసి పోవడం మన దగ్గర నిత్యం కనిపించే దృశ్యం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఇదే సమస్య మితిమీరిపోవడంతో అధికారులు ఓ కొత్త ఉపాయం ఆలోచించారు. నగరంలో రోడ్ల పక్కన గోడలపై ప్రత్యేక పెయింట్ను వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పది గోడలపై ఈ రంగును వేయడం పూర్తి చేశారు కూడా. రాతలకు, చెప్పులకే జంకనివారు రంగుకు మాత్రం ముచ్చటపడి ఎందుకు ఊరుకుంటారని అనుకుంటున్నారా? ఆ పెయింట్ వేసిన గోడలపై మూత్రం పోస్తే రంగు పడుద్ది మరి! మామూలు గోడపై కిందకు జారిపోయే మూత్రం.. ఈ గోడపై పోస్తే తిరిగి పోసినవారి మీదే పడుతుంది! అల్ట్రా వయొలెట్ కోటెడ్ సూపర్ హైడ్రోఫోబిక్ పెయింట్ వేయడమే అందుకు కారణం. శాన్ ఫ్రాన్సిస్కోలో బహిరంగ మూత్రవిసర్జనకు 50-100 డాలర్ల వరకూ జరిమానా విధిస్తారు. అయినా పరిస్థితి మారకపోవడం.. తమ గోడపై మూత్రం శుభ్రం చేయాలంటూ వందలాది విజ్ఞప్తులు రావడంతో అధికారులు ఈ కొత్త ఐడియా అమలులో పెట్టారు. -
ఇక్కడ మూత్రం చేస్తే ఇక అంతే...
శాన్ఫ్రాన్సిస్కో: ఎక్కడ గోడ కనపడితే అక్కడ లఘుశంక తీర్చుకునే మగ మహారాజులకు ఇప్పుడు చుక్కెదురైనట్టే. ఏం.. ఎందుకు అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. త్రీ ఇడియట్స్ సినిమాలో సీనియర్ మూత్రం పోస్తానంటే స్పూను పెట్టి, దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చే సీన్ చూసే ఉంటారు కదూ. ఇంతవరకు మనం గోడకు కొట్టిన బంతి గురించి విన్నాం.. చూశాం.. ఇది పాతదే. కానీ ఇపుడు గోడక్కొట్టిన సు.. స్సూ.. అంతే వేగంగా తిరిగి మొఖం మీద పడటం ఖాయమట. ఇది కొత్త విషయం. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి.. నగరాన్ని మురికికూపంగా మారుస్తున్న వైఖరికి స్వస్తి చెప్పేందుకు శాన్ఫ్రాన్సిస్కోలోని అధికారులు ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నగరంలోని బార్లు, హోటెళ్లు, బస్లాండ్లు తదితర ఏరియాల్లో గోడలకు ఒక పెయింట్ వేశారు. దాంతో పాటు ఒక స్లోగన్ను కూడా జత చేర్చారు. 'ఆగండి.. ఇక్కడ కాదు... దాని కోసం వేరే చోటు వెదుక్కోండి.. లేదంటే మీ మూత్రం మీ మొఖం మీదికే' అని బోర్డులు తగిలించేశారు. అల్ట్రా ఎవర్ డ్రై గా పిలిచే ఈ పెయింట్ వేసిన గోడలపై నీళ్లు, లేదా ఏదైనా ద్రవపదార్థం పడితే, అది అంతే వేగంగా వెనక్కి వెదజల్లుతుంది. ఈ పెయింట్కు సూపర్ హైడ్రోఫోబిక్ (నీటిని వికర్షించే శక్తి) గుణం ఉండడం వల్ల ఎవరైనా మూత్రం చేస్తే ఆ మూత్రం తిరిగి వారిమీదే పడుతుందని అధికారులు వెల్లడించారు. సిమెంట్ కంపెనీ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ ఈ పెయింటును తయారు చేసిందని సమాచారం. ఇటీవల జర్మనీ అనుసరించిన ఈ విధానం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. జర్మనీలోని హాంబర్గ్ వాసులు సెయింట్ పాలి నైట్క్లబ్ ప్రాంతంలో ఆచరించిన ఈ పద్ధతికి ఎట్రాక్ట్ అయ్యారు. వెంటనే తమ నగరంలోని పలు గోడలకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ పెయింట్లు వేయించారట. దీంతో తమ ప్రాంతంలో కూడా ఈ పెయింట్లు వేయించండి బాబూ అని నగర వాసుల నుంచి విపరీతంగా కాల్స్ వస్తున్నాయట. ఇలాంటి అవకాశం మనకు కూడా వస్తే.. గోడల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రపంచ పటాలు దర్శనం ఇవ్వకుండా ఉంటాయి. -
ఏవీఎమ్ స్టూడియో గోడ కూలి ఒకరి మృతి
చెన్నై: ఏవీఎమ్ స్టూడియోలో గోడ కూలి శనివారం రాత్రి ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని శిధిలాలను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తీహార్ జైలుకు ఖైదీల కన్నం!
సినీఫక్కీలో ఇద్దరు విచారణ ఖైదీల పరారీ * మూడు 13 అడుగుల గోడలు దూకి...16 అడుగుల గోడకు కన్నం వేసి... * పోలీసులకు చిక్కిన ఒక ఖైదీ సాక్షి, న్యూఢిల్లీ: కన్నాలు వేసినందుకు జైలుపాలైన ఇద్దరు చోరశిఖామణులు దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల జైళ్లలో ఒకటిగా పేరుగాంచిన ఢిల్లీలోని తీహార్ జైలుకే కన్నం వేశారు. 13 అడుగుల పొడవైన మూడు గోడల మీద నుంచి దూకడమే కాకుండా 16 అడుగుల పొడవైన మరో గోడకు కన్నం వేసి తప్పించుకున్నారు. ఫైజన్(19), జావేద్(18) అనే విచారణ ఖైదీలను రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో 7వ నంబర్ జైల్లోని ‘రోజా’ వార్డులో ఉంచగా శనివారం అర్ధరాత్రి దాటాక వారు 13 అడుగుల పొడవున్న ఆ జైలు గోడను దూకారు. అక్కడి నుంచి మరో 13 అడుగుల గోడను దూకి ఆపై 16 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు ఉన్న గోడకు రాళ్లతో రంధ్రం చేసి అందులోంచి దూరారు. చివరగా మరో 13 అడుగుల గోడ దూకి దానికి సమీపంలోని డ్రైనేజీ వద్దకు చేరుకున్నారు. అయితే జావేద్తో కలసి బయటపడేందుకు ఫైజన్ భయపడగా జావేద్ అతన్ని వదిలేసి డ్రైనేజీలోంచి వెళ్లిపోయాడు. ఫైజన్ అందులో ఇరుక్కుపోవడంతో పోలీసులకు చిక్కాడు. ఆదివారం ఉదయం ఖైదీల హాజరు సమయంలో వారిద్దరూ కనిపించకపోవడంతో ఈ విషయం బయటపడింది. జావేద్ దొరక్కపోవడంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఖైదీల పరారీలో జైలు అధికారుల ప్రమేయంపైనా దర్యాప్తు చేస్తున్నారు. పనిముట్లేవీ లేకుండా ఖైదీలు ఉట్టి చేతులతో కన్నం వేయడం సాధ్యం కాదన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం జైలు అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో కూడా ఆప్ ప్రభుత్వం ఎల్జీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ సొంతంగా విచారణకు ఆదేశించింది. -
గోడకూలి 8 మందికి గాయాలు
రణస్థలం : శ్రీకాకుళం జిల్లా లో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన పాత గోడ కూలి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం జిల్లా రణస్థలం మండలం జె.ఆర్. పురం కాలనీలో జరిగింది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గోడకూలి మహిళ మృతి
నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు పాత గోడ కూలి ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరగట్లు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన యమునాబాయి (50) ఇంటి ముందు ఉన్న పాత గోడ దగ్గర కూర్చోని ఉంది. అయితే, అదే సమయంలో ప్రమాదవశాత్తు గోడ కూలి మీదపడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద ఉన్న మహిళ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (రెంజల్) -
గోడ కూలి బాలుడి మృతి
వరంగల్ : వరంగల్ జిల్లాలో గోడ కూలి మహేందర్ (5) అనే బాలుడు గురువారం మృతిచెందాడు. మహబూబ్ నగర్ మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ రోడ్లో ఉండే మహేందర్ ఆడుకుంటుండగా ఒక్కసారిగా గోడకూలింది. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
గోడ కూలి బాలుడి మృతి
విజయనగరం: శృంగవరపుకోట మండలంలోని వెంకటరమణపేట గ్రామంలో గోడకూలి వెంకటేశ్(11) అనే బాలుడు శనివారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. వివరాలు...వెంకటేశ్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గోడకింద పడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గోత పాతది కావడంతో కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గోడపక్కనే బాలుడు సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా కూలిడంతో ఊపిరాడక మృతిచెందాడు. కొడుకు చనిపోవడంతో తల్లి సత్యవతి కన్నీరుమున్నీరవుతోంది. (శృంగవరపుకోట) -
భవనం గోడ కూలి విద్యార్థి మృతి: 15 మందికి గాయాలు
ఢిల్లీ: మరోసారి నిర్మాణంలో భవనం గోడ కూలింది. ఢిల్లీలోని నోయిడా ప్రాంతంలోని ఒక భవనం నిర్మాణ పనులు జరుగుతుండగా గోడ ఆకస్మాత్తుగా కూలిన ఘటన గురువారం కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందగా, మరో 15 మందికి గాయాలైయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భవనం గోడ కూలిన ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యజమానికి అదుపులోకి తీసుకున్నారు. -
స్టిక్ ఫ్రేమ్స్
ఎవరి ఇంటికి వెళ్లినా.. ఎదురుగా కనిపించేది ఫొటో ఫ్రేమే. దేవుడిదో.. తాతయ్యదో.. బామ్మదో.. ఎవరెవరి ఫొటోలో గోడకు వేలాడుతూ పలకరిస్తాయి. ఓసారి ఇల్లంతా కలయ తిరిగితే లామినేటెడ్ ఫ్రేమ్ రూపంలో చిలిపి చిన్నారుల చిత్రాలు హాయ్ అంటాయి. జమానా బదల్ గయా.. అన్నింటా కొత్తందాలకు చోటిస్తున్న ఈ తరం.. ఫొటోలను కూడా వెరైటీగా పదిలపరుచుకోవాలని ఫిక్సవుతోంది. ఇలాంటి వారిని స్టిక్ ఫ్రేమ్స్ కట్టిపడేస్తున్నాయి. జ్ఞాపకాలను పది కాలాలు ఉంచేది ఫొటో. అందుకే తీపి గుర్తుల ప్రతిబింబాన్ని ఆల్బమ్లో దాచుకుంటాం. వుది దోచిన వుధుర క్షణాలను ఫ్రేమ్లలో బంధించి గోడలపై అలంకరించుకుంటాం. ఒక్కసారి ఫ్రేమ్ ఫిక్సరుుతే.. ఏళ్లకేళ్లు అలాగే ఉంటారుు. కొత్త ట్రెండ్స్ ఎన్ని వచ్చినా.. పాత ఫ్రేమ్ను అలాగే గోడకు వేలాడుతూనే ఉంటుంది. ఇప్పుడా చింత లేదు. మీ అందమైన ఫొటోలకు పొందికైన రూపాన్నిస్తుంది ఫ్రేమ్ స్టిక్కర్స్. డిఫరెంట్ స్టిక్కర్స్లో ఫొటోలను నగరవాసులు సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. చెట్టు కొమ్మలకు రెమ్మలుగా ఫ్రేమ్స్ స్టిక్ చేసి ఫ్యామిలీ మెమరీస్ను ఇంపుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉడెన్, ఐరన్, ప్లాస్టిక్, గ్లాస్ ఫొటో ఫ్రేమ్లతో పోల్చుకుంటే వీటి ఖరీదు తక్కువే. అతికిస్తే సరి : వేరు వేరు సైజుల్లో ఉండే ఈ స్టిక్కర్ ఫ్రేమ్ల మధ్యలో ఖాళీ ఉండి, వెనుక భాగమంతా జిగురు ఉంటుంది. కావాల్సిన ఫొటోను ఈ స్టిక్కర్ల వెనుక వైపు మధ్యలో పెట్టి నొక్కితేఅది స్టిక్కర్కి అతుక్కుపోతుంది. ఆ తరువాత ఈ ఫ్రేమ్ని నచ్చిన చోట గోడకు అతికిస్తే సరి. డిఫరెంట్ కలర్స్, థీమ్స్తో అందుబాటులో ఉన్న స్టిక్కర్ ఫ్రేమ్స్ సిటీ వాసులకు బాగా కనెక్ట్ అవుతున్నారుు. పైగా, ఈ ఫ్రేమ్లను ఎన్ని సార్లరుునా తీసి కావల్సిన చోట మళ్లీ అతికించుకోవచ్చు. మేకులతో గోడలు పాడవుతాయునే దిగులూ ఉండదు. ఈ ఫొటో ఫ్రేమ్స్ ఫర్నిషింగ్, వాల్ డెకార్ స్టోర్స్లో, ఫ్యాబ్ ఫర్నిష్ ఆన్లైన్ స్టోర్లలో లభిస్తున్నారుు. - విజయారెడ్డి -
సికింద్రాబాద్ లో గోడ కూలి ఇద్దరు మృతి
సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని సంగీత్ థియేటర్ సమీపంలో గోడ కూలిన సంఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు. తొలుత ఒకరు చనిపోయినట్టుగా వార్తలు రాగా, ఆ తర్వాత మృతుల సంఖ్య రెండుకు పెరిగింది. మల్టీప్లెక్స్ నిర్మాణ దశలో గోడ కుప్పకూలింది. రక్షణ చర్యలు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణనష్టం జరిగినట్టు భావిస్తున్నారు. చనిపోయిన వారిని రాజయ్య, శారదలుగా గుర్తించారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు శిథిలాల కింద ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. నిర్మాణపనులకు సంబంధించి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
సికింద్రాబాద్లో గోడ కూలి ముగ్గురి మృతి
-
గోడ రేపిన చిచ్చు
ఇంటికి దారి మూసేశారని మనస్తాపం యువకుని ఆత్మహత్యా యత్నం చావుబతుకుల్లో ఉన్నా దారివ్వని వైనం! రావికమతం, న్యూస్లైన్ : తన ఇంటికి రహదారి సౌకర్యం లేకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నారంటూ మనస్థాపం చెందిన ఇంటి యజమాని కుమారుడు శానాపతి కిశోర్ (31) బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. చావుబతుకుల్లో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేందుకూ ఆ గోడపై నుంచి వెళ్లనీయకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రావికమతం నడిబొడ్డున బుధవారం జరిగిన సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. రావికమతం మండల పరిషత్ ప్రహరీని ఆనుకుని పడమరభాగంలో శానాపతి శ్యామల అనే ఆమె కొన్నేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నారు. భర్త, పిల్లలతో నివాసం ఉంటున్నారు. సర్వే నంబరు 106/1లో ఉన్న ఈ స్థలంలో ఈశాన్య భాగంలో నర్సీపట్నం-భీమునిపట్నం రహదారి ఉంది. వీరి ఇంటికీ, బీఎన్ రోడ్డుకు మధ్య కొంత ప్రభుత్వ స్థలం ఉంది. శ్యామల ఇంటికి అదే రహదారిగా ఉండేది. ఆ ఖాళీ స్థలాన్ని ఒక సామాజిక భవనం నిర్మాణానికి స్థానిక సంఘాల సభ్యులు మంజూరు చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వివాదం కోర్టుకు కూడా వెళ్లింది. పరిస్థితి ఇలా ఉంటే, మంగళ, బుధవారాల్లో ఆయా సంఘాల సభ్యులు ఆ స్థలంలో ప్రహరీ నిర్మించారు. శ్యామల ఇంటికి రహదారిలేకుండా పోయింది. దీంతో తమ ఇంటిలోనే తాము గృహ నిర్మాణంలో ఉన్నామంటూ శ్యామల కుమారుడు కిశోర్ తీవ్ర ఆవేదనకు లోనై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు వచ్చి కిశోర్ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఎత్తై గోడ నిర్మించడం, పైగా ఆ గోడపై నుంచి తరలించవద్దంటూ పలువురు అడ్డుకోవడంతో చివరకు అపస్మారక స్థితిలోఉన్న కిశోర్ను మండల పరిషత్ గోడపై నుంచి అతిప్రయాసతో దాటించి 108లో నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వారు అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. అధికారుల విచారణ ఈ సంఘటనపై తహశీల్దార్ రోజా, రావికమతం ఎస్ఐ సురేష్కుమార్ రావికమతం వచ్చి ఇరువర్గాలనూ విచారించారు. జిల్లా కలెక్టర్ తమకు మూడున్నర సెంట్లు స్థలం కేటాయించారని, తమ స్థలంలో నిర్మాణం చేపట్టామని, తమకు అన్ని ఆధారాలున్నాయని పలువురు సంఘ సభ్యులు వారికి వివరించారు. ఆస్పత్రికి తీసుకుకువెళ్లడాన్ని మాత్రం అడ్డుకోలేదన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఎన్నికలయ్యే వరకూ ఏవిధమైన పనులూ చేయవద్దని వారు ఇరువర్గాలకూ హెచ్చరించారు.