Warner
-
ఢిల్లీకి భారీ షాక్ ఐపీల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్
-
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వార్నర్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో పాల్గొనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. భారత జట్టు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో పంత్ స్థానంలో వార్నర్ను సారథిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. గతంలో వార్నర్ నాలుగున్నర సీజన్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. వార్నర్ సారథ్యంలో 2016లో సన్రైజర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. -
వార్నర్, కోహ్లీలను వెనక్కు నెట్టిన పాక్ కెప్టెన్..
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్, ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14 సెంచరీలు బాదిన బ్యాట్స్మన్గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో మంగళవారం అర్థరాత్రి వరకు జరిగిన మూడో వన్డేలో బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 158; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కి కెరీర్లో 14వ శతకాన్ని నమోదు చేశాడు. బాబర్ ఈ ఘనతను కేవలం 81 ఇన్నింగ్స్ల్లోనే సాధించాడు. దీంతో ఈ జాబితాలోని దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా(84 ఇన్నింగ్స్లు), ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(98 ఇన్నింగ్స్లు), టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (103 ఇన్నింగ్స్లు)లను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల క్రికెట్లోనూ ఏ బ్యాటర్ కూడా బాబర్ సాధించినంత తొందరగా 14 సెంచరీలు సాధించలేదు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగ్ లాన్నింగ్ 14 సెంచరీలు సాధించడానికి 82 ఇన్నింగ్స్లు ఆడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, బాబర్ శతకంతో చెలరేగిన పాక్కు మాత్రం పరాజయం తప్పలేదు. ఇంగ్లండ్ యువ బ్యాట్స్మెన్ జేమ్స్ విన్స్(95 బంతుల్లో 102; 11 ఫోర్లు) సూపర్ సెంచరీ సాధించడంతో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ను 3-0తో ఇంగ్లండ్ క్వీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 రన్స్ చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(56), మహ్మద్ రిజ్వాన్(74) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కేర్స్ (5/61) ఐదు వికెట్లతో రాణించగా.. సకీబ్ మహమూద్(3/60) మూడు, మాట్ పార్కిన్సన్ ఓ వికెట్ తీశాడు. అనంతరం ఛేదనలో జేమ్స్ విన్స్(102), లూయిస్ గ్రెగరి(77) రాణించడంతో ఇంగ్లండ్ జట్టు మరో రెండు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. -
సూర్యకుమార్ జట్టులో ఆ ఇద్దరు స్టార్లకు దక్కని చోటు..
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్యాదవ్.. తన ఐపీఎల్ డ్రీమ్ ఎలెవన్ను ఎన్నుకున్నాడు. తాజాగా ఓ ప్రముఖ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. సూర్యకుమార్ను తన డ్రీమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించమని కోరాడు. అయితే హర్షా భోగ్లే సూర్యకుమార్కు రెండు కండీషన్లు పెట్టాడు. జట్టులో సూర్యకుమార్ తప్పనిసరిగా ఉండాలన్నది మొదటిది కాగా.. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి నలుగురిని ఎంచుకోవాలన్నది రెండోది. ఈ నిబంధనలకి లోబడే సూర్యకుమార్ తన ఐపీఎల్ జట్టుని ఎంపిక చేశాడు. అయితే, సూర్య తన జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి, ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు, ఆసీస్ విధ్వంసకర వీరుడు డేవిడ్ వార్నర్లకు చోటివ్వకపోవడం గమనార్హం. ఓపెనర్ల కోటాలో ఇంగ్లండ్ వికెట్కీపర్ జోస్ బట్లర్ను ఎనుకున్న సూర్య.. ఓపెనింగ్ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ధోనీని పక్కకు పెట్టేశాడు. ఈ ఒక్క దెబ్బతో ధోనీకి, ఆసీస్ స్టార్ ఓపెనర్ వార్నర్కు ఒకేసారి చెక్ పెట్టాడు. మరో ఓపెనర్గా రోహిత్ శర్మను ఏంపిక చేసిన ఆయన.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. ఇక, నాలుగో స్థానం కోసం తన పేరును ప్రకటించుకున్న సూర్య.. ఐదో ప్లేస్ కోసం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ను ఎన్నుకున్నాడు. సూర్యకుమార్ తన జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లకు అవకాశం ఇవ్వడం విశేషం. ఈ కోటాలో హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజాలకు వరుసగా 6, 7, 8 స్థానాల్లో అవకాశం ఇచ్చాడు. ఇక స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో రషీద్ ఖాన్ను ఎంచుకున్న సూర్యకుమార్.. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను జట్టులోకి తీసుకున్నాడు. కాగా, సూర్యకుమార్.. ప్రస్తుతం ధవన్ జట్టుతో పాటు శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భారత్.. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. -
బాల్ టాంపరింగ్ వివాదం సద్దుమణిగినట్టే: ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియాలో పెను దుమారం రేపిన బాల్ టాంపరింగ్ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగిందని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ వెల్లడించాడు. బాన్క్రాఫ్ట్తో బౌలర్లు సమావేశమై సమస్యను పరిష్కరించుకున్నారని అతను ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విలేఖరులు అడిన ప్రశ్నలకు తికమక పడిన బాన్క్రాఫ్ట్.. ఒత్తిడిలో అలా మాట్లాడాడని, ఈ ఉదంతం గురించి బౌలర్లకు ముందుగానే తెలుసన్న విషయమై అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించాడు. కాగా, 2018లో వెలుగు చూసిన బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఆసీస్ ఆటగాడు బాన్క్రాఫ్ట్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఘటనపై పునర్విచారణ జరిపేందుకు తాము సిద్దమని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది.దీంతో నాటి జట్టులో సభ్యులైన కమిన్స్, హాజిల్వుడ్, స్టార్క్లు బాన్క్రాఫ్ట్తో సమావేశమయ్యారు. అనంతరం ఈ ముగ్గురు బౌలర్లు ఆ వివాదంలో తమ పాత్ర ఏమీ లేదంటు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకులో ఏదో సమాధానం చెప్పానని బాన్క్రాఫ్ట్ తమకు వివరణ ఇచ్చాడని వారు పేర్కొన్నారు. ఈ విషయమై బాన్క్రాఫ్ట్ కూడా అదే సమాధానం చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తనను సంప్రదించిన సీఏ ఇంటిగ్రిటీ యూనిట్కు వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. కాగా, 2018లో కేప్టౌన్ వేదికగా ఆసీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఆ మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు బాన్క్రాఫ్ట్ బంతికి సాండ్ పేపర్ రుద్దుతూ కెమెరాల కంటపడ్డాడు. దీంతో అతనితో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్పై నిషేధం విధించారు. చదవండి: 500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం.. -
బాల్ టాంపరింగ్ వివాదంలో మరికొందరి ప్రమేయం..
మెల్బోర్న్: మూడేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది. ఆ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాన్క్రాఫ్ట్ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించగా, తాజాగా ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్క్రిస్ట్, డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్, ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్లు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రక్తి కట్టించాయి. ఈ విషయమై తొలుత బాన్క్రాఫ్ట్ మాట్లాడుతూ.. 2018లో సఫారీలతో జరిగిన మూడో టెస్ట్లో తాను సాండ్ పేపర్ వాడిన విషయం తమ బౌలర్లకు ముందే తెలుసని బాంబు పేల్చగా, తాజాగా ఆసీస్ లెజండరీ ఆటగాడు గిల్లీ మాట్లాడుతూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం బాన్క్రాఫ్ట్తో పాటు మరికొంత మందికి ముందే తెలుసని, ఆ పేర్లను బయటపెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపునకు లోను చేసిన ఈ ఉదంతంపై వార్నర్ మేనేజర్ జేమ్స్ మాట్లాడుతూ.. నాడు జరిగిన విచారణ ఏకపక్షంగా సాగిందని, ఈ విషయమై నిషేదానికి గరైన ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పక కేసు గెలిచే వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. కాగా, ఈ వివాదంలో బాన్క్రాఫ్ట్తోపాటు నాటి జట్టు కెప్టెన్ స్టీవ్స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లు ఏడాది పాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది.. -
హై హై హైదరాబాద్...
సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఒక పెద్ద విజయంతో ఐపీఎల్లో తమ విలువను ప్రదర్శించింది. అభిమానులు మెచ్చేలా ఒక అద్భుత ప్రదర్శనతో సంతోషం పంచింది. ఓపెనర్లు బెయిర్స్టో, వార్నర్ల మెరుపు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొక్కేసింది. ముందుగా పేలవ బౌలింగ్, ఆ తర్వాత చేవ లేని బ్యాటింగ్తో కుప్పకూలిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లీగ్లో తాము ముందంజ వేసే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్ పూరన్ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగియడం పంజాబ్ వైఫల్యాన్ని సూచిస్తోంది. శతక భాగస్వామ్యం... సీజన్లో తొలిసారి ఓపెనర్లు వార్నర్, బెయిర్స్టో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాట్రెల్ వేసిన మొదటి ఓవర్లోనే 13 పరుగులు రాబట్టడంతో వీరి జోరు మొదలైంది. పవర్ప్లేలో హైదరాబాద్ స్కోరు 58 పరుగులకు చేరింది. రవి బిష్ణోయ్ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాది బెయిర్స్టో దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. అంతకుముందు 19 పరుగుల వద్ద మిడాఫ్లో రాహుల్ కష్టసాధ్యమైన క్యాచ్ వదిలేయడం కూడా బెయిర్స్టోకి కలిసొచ్చింది. హైదరాబాద్ 10 ఓవర్లలో 10 రన్రేట్తో సరిగ్గా 100 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన బెయిర్స్టో... ముజీబ్ ఓవర్లో వరుసగా మరో రెండు సిక్సర్లు సాధించడం విశేషం. మరోవైపు 37 బంతుల్లో వార్నర్ అర్ధసెంచరీ పూర్తయింది. 5 ఓవర్లలో 6 వికెట్లు... 15 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ స్కోరు వికెట్ కోల్పోకుండా 160 పరుగులు. కానీ జట్టు బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పంజాబ్ చక్కటి బౌలింగ్కు తర్వాతి మూడు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే వచ్చాయి. బిష్ణోయ్ ఓవర్లో వరుస బంతుల్లో వార్నర్, బెయిర్స్టో అవుట్ కాగా, భారీ షాట్లు ఆడే క్రమంలో పాండే (1), సమద్ (8) వెనుదిరిగారు. అయితే చివరి రెండు ఓవర్లలో విలియమ్సన్ (20 నాటౌట్) చకచకా రన్స్ చేయడంతో స్కోరు 200 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ 41 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యం చేరేలా కనిపించలేదు. కొద్దిసేపు పూరన్ జోరు మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పూరన్ మెరుపులు.. పంజాబ్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచిన అంశం పూరన్ బ్యాటింగ్ ఒక్కటే. తొలి బంతినే కవర్డ్రైవ్ బౌండరీగా మలచి ఖాతా తెరిచిన అతను, అభిషేక్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో ధాటిని పెంచాడు. సమద్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లోనైతే పూరన్ భీకరంగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్ తొలి ఐదు బంతుల్లో 6, 4, 6, 6, 6 బాది 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రివ్యూ నిర్ణయంపై రివ్యూ... పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఖలీల్ వేసిన ఐదో బంతి ముజీబ్ బ్యాట్కు తాకుతూ కీపర్ చేతుల్లో పడటంతో అప్పీల్ చేయగా, అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. ఆపై రైజర్స్ రివ్యూ కూడా కోరలేదు. అయితే ఇద్దరూ అంపైర్లు చర్చించి మూడో అంపైర్ను సంప్రదించారు. బంతిని నేలను తాకిందా లేదా అనేదానిని మాత్రమే సమీక్షించిన థర్డ్ అంపైర్ అవుట్గా ప్రకటించడంతో ముజీబ్ మైదానం వీడబోయాడు. అంతలోనే వెనక్కి వచ్చి అవుట్పై సందేహం వ్యక్తం చేస్తూ రివ్యూ కోరాడు. దాంతో అల్ట్రా ఎడ్జ్ రీప్లే చూసిన అనంతరం బంతి బ్యాట్కు తగిలిందంటూ మూడో అంపైర్ అవుట్ ఇచ్చాడు. ప్రధాన బ్యాట్స్మన్ కాకపోయినా రివ్యూపై మళ్లీ రివ్యూ కోరడంతో మైదానంలో కొద్దిసేపు డ్రామా కనిపించింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మ్యాక్స్వెల్ (బి) రవి బిష్ణోయ్ 52; బెయిర్స్టో (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 97; సమద్ (సి) అర్‡్షదీప్ (బి) బిష్ణోయ్ 8; పాండే (సి అండ్ బి) అర్‡్షదీప్ 1; విలియమ్సన్ (నాటౌట్) 20; ప్రియమ్ గార్గ్ (సి) పూరన్ (బి) అర్‡్షదీప్ 0; అభిషేక్ (సి) మ్యాక్స్వెల్ (బి) షమీ 12; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–160; 2–160; 3–161; 4–173; 5–175; 6–199. బౌలింగ్: కాట్రెల్ 3–0–33–0; ముజీబ్ 4–0–39–0; షమీ 4–0–40–1; మ్యాక్స్వెల్ 2–0–26–0; బిష్ణోయ్ 3–0–29–3; అర్‡్షదీప్ 3–0–33–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) విలియమ్సన్ (బి) అభిషేక్ 11; మయాంక్ (రనౌట్) 9; సిమ్రన్ సింగ్ (సి) గార్గ్ (బి) ఖలీల్ 11; పూరన్ (సి) నటరాజన్ (బి) రషీద్ 77; మ్యాక్స్వెల్ (రనౌట్) 7; మన్దీప్ (బి) రషీద్ 6; ముజీబ్ (సి) బెయిర్స్టో (బి) ఖలీల్ 1; రవి బిష్ణోయ్ (నాటౌట్) 6; షమీ (ఎల్బీ)(బి) రషీద్ 0; కాట్రెల్ (బి) నటరాజన్ 0; అర్‡్షదీప్ (సి)వార్నర్ (బి)నటరాజన్ 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (16.5 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం: 1–11; 2–31; 3–58; 4–105; 5–115; 6–126; 7–126; 8–126; 9–132; 10–132. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–27–0; ఖలీల్ అహ్మద్ 3–0–24–2; నటరాజన్ 3.5–0–24–2; అభిషేక్ 1–0–15–1; రషీద్ ఖాన్ 4–1–12–3; సమద్ 1–0–28–0. -
ఆసీస్తో సిరీస్ అప్పటిలా ఉండదు: రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జట్టులో ఇప్పుడు స్మిత్, వార్నర్ ఉండటంతో ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ కాస్త భిన్నంగానే జరుగుతుందని, మునుపటిలా ఉండదని భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. 2018–19లో వాళ్లిద్దరిపై నిషేధం ఉండటంతో ఆడలేకపోయారు. భారత్ 2–1తో టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చి ఈ సిరీస్ను ఆడనిస్తే తప్పకుండా భారత్, ఆసీస్ మధ్య పోరు రసవత్తరంగా జరుగుతుందని రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా ఉందని ఇలాంటి జట్టు తమకు దీటైన జట్టే ఎదురుపడాలనుకుంటుందని... స్మిత్, వార్నర్లు ఉన్న ఆసీస్ జట్టుతో తప్పకుండా రోమాంచకరమైన సిరీస్ జరుగుతుందని స్టార్ ఓపెనర్ వివరించాడు. అక్టోబర్లో మొదలయ్యే కంగారూ పర్యటన జనవరి దాకా సాగుతుంది. అయితే మధ్యలో టి20 ప్రపంచకప్ కూడా అక్కడే జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కోవిడ్–19పైనే ఆధారపడ్డాయి. -
వార్నర్, లబ్షేన్ సెంచరీలు
అడిలైడ్: తొలి టెస్టులో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించింది. పింక్ బాల్తో ‘డే అండ్ నైట్’ టెస్టుగా సాగుతున్న ఈ మ్యాచ్ మొదటి రోజు ఆసీస్ అదరగొట్టింది. ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో వికెట్ నష్టపోయి 302 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (228 బంతుల్లో 166 బ్యాటింగ్; 19 ఫోర్లు), మార్నస్ లబ్షేన్ (205 బంతుల్లో 126 బ్యాటింగ్; 17 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీలు బాదారు. వార్నర్ కెరీర్లో ఇది 23వ సెంచరీ కావడం విశేషం. నాలుగో ఓవర్లోనే బర్న్స్ (4)ను షాహిన్ అఫ్రిది అవుట్ చేసిన తర్వాత వార్నర్, లబ్షేన్ చెలరేగారు. -
సాగర తీరంలో తాడోపేడో
డేవిడ్ వార్నర్ (692 పరుగులు); కగిసొ రబడ (25 వికెట్లు)... బ్యాటింగ్లో, బౌలింగ్లో ఐపీఎల్–12 సీజన్ టాపర్లు వీరు. సన్రైజర్స్ హైదరాబాద్ను వార్నర్ ఒంటిచేత్తో ముందుకు నడిపించగా, ఢిల్లీ క్యాపిటల్స్ను పదునైన పేస్తో రబడ ఒడ్డున పడేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి గెలిస్తేనే లీగ్లో ముందుకెళ్లే అవకాశం ఉన్న స్థితిలో రెండు జట్లూ వీరు లేకుండానే తలపడబోతున్నాయి. బలాబలాలు విశ్లేషించి చూస్తే... బ్యాటింగ్లో పటిçష్టంగా ఉన్న ఢిల్లీ ముందు హైదరాబాద్ కొంత డీలాగా కనిపిస్తోంది. కానీ, బౌలింగ్ బలగంతో ప్రత్యర్థిని కట్టిపడేసే సన్రైజర్స్ తేలిగ్గా తలొగ్గకపోవచ్చు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పేరుతో పాటు ఆటతీరూ మార్చుకుని ఏడు సీజన్ల తర్వాత ప్లే ఆఫ్ చేరిన ఢిల్లీ... గతేడాది రన్నరప్ హైదరాబాద్ సాగరతీరాన అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐపీఎల్–12లో భాగంగా బుధవారం రెండు జట్ల మధ్య ఇక్కడి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ టాపార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంటే, హైదరాబాద్ బౌలింగ్లో మెరుగ్గా కనిపిస్తోంది. లీగ్ దశలో రెండు జట్ల ప్రయాణం భిన్నంగా సాగింది. ఢిల్లీ పెద్దగా కష్టపడకుండానే ప్లే ఆఫ్స్ చేరగా, సన్రైజర్స్కు అదృష్టం తోడై బయటపడింది. అనూహ్యంగా మారిన వేదికపై కీలకమైన మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి. అదే హైదరా‘బాధ’... ముందు బెయిర్స్టో, తర్వాత వార్నర్ దూరమవడం, ప్రత్యామ్నాయంగా షకీబుల్ హసన్ వంటి నాణ్యమైన ఆల్రౌండర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సన్రైజర్స్ ఒక్కసారిగా సాధారణ జట్టులా మారిపోయింది. ఈ విధ్వంసక బ్యాట్స్మెన్కు తోడు భువనేశ్వర్, రషీద్ ఖాన్ వంటి బౌలర్లతో ఓ దశలో హైదరాబాద్ అత్యంత పటిష్ఠంగా కనిపించింది. ఎప్పుడైతే ఓపెనర్లు వెళ్లిపోయారో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. నెట్ రన్రేట్ ఆదుకోవడంతో లీగ్ చరిత్రలో తొలిసారిగా 12 పాయింట్లతోనే ప్లే ఆఫ్స్కు చేరింది. ఈ రన్రేట్ కూడా వార్నర్, బెయిర్స్టోల దూకుడైన ఆట పుణ్యమే. ఇప్పుడు ఈ బలహీనతలన్నీ అధిగమించి ముందుకెళ్లాల్సి ఉంది. ఇన్నింగ్స్ను ప్రారంభించే గప్టిల్, వృద్ధిమాన్ సాహాలపై పెద్ద బాధ్యతే ఉంది. వన్డౌన్ బ్యాట్స్మన్ మనీష్ పాండే, నాలుగో స్థానంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్ సానుకూలాంశం. వీరి తర్వాత విజయ్ శంకర్, నబీ, యూసుఫ్ పఠాన్ స్కోరును నడిపించాలి. భువీ పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నా, మిస్టరీ స్పిన్నర్ రషీద్ను ప్రత్యర్థులు బాదేస్తున్నారు. కీలకమైన మ్యాచ్లో అతడు తిరిగి లయ అందుకుంటే జట్టుకు మేలు. పేసర్లు థంపి, ఖలీల్ మెరుగ్గా రాణిస్తున్నారు. విజయ్ మాత్రం పరుగులిస్తున్నాడు. ఫీల్డింగ్లో జట్టుకు తిరుగులేదు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ను ముంచి నా తేల్చినా అంతా బ్యాట్స్మెన్ చేతుల్లోనే. ఢిల్లీ ఢీకొట్టేలా... గతేడాది వరకు హైదరాబాద్కు ఆడిన శిఖర్ ధావన్... ఈసారి ఢిల్లీ ఫ్లే ఆఫ్స్ చేరడంలో కీలకంగా నిలిచాడు. యువ ఓపెనర్ పృథ్వీ షా తడబడుతున్నా ధావన్ జోరుతో ఆ ప్రభావం కనిపించడం లేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే భారీ స్కోరు ఖాయం. వీరు విఫలమైతేనే ఇబ్బందికరం. హిట్టర్లయినప్పటికీ నిలకడ కొరవడిన ఇంగ్రామ్, రూథర్ఫర్డ్ల నుంచి ఎక్కువ ఆశించలేం. బౌలింగ్లో రబడ లోటును ఎడమ చేతివాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ పూడ్చాడు. ఇషాంత్ కచ్చితత్వం చూపుతున్నాడు. అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా స్పిన్ ప్రభావవంతంగా ఉంది. జట్టులోని వారు ఏదో ఒక దశలో గట్టెక్కిస్తుండటంతో ఢిల్లీ ఇక్కడివరకు వచ్చింది. బ్యాటింగ్ త్రయం (ధావన్–అయ్యర్–పంత్) చెలరేగితే ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను లాగేసుకుంటుంది. విశాఖ వాసులకు భలే ఛాన్సులే అందాల విశాఖపట్నం వాసులకు ప్లే ఆఫ్ మ్యాచ్ల నిర్వహణ రూపంలో ఐపీఎల్ మెరుపులను చూసే భాగ్యం దక్కింది. లీగ్కు సంబంధించి... మామూలు పరిస్థితుల్లో అయినా ఇక్కడ మ్యాచ్లు జరిగే అవకాశం లేదు. కానీ, చెన్నై స్టేడియంలో స్టాండ్స్ వివాదం కారణంగా అనూహ్యంగా వైజాగ్ నాకౌట్ మ్యాచ్లకు వేదికైంది. పైగా ఒకటి కాదు రెండు మ్యాచ్లు అవి కూడా కీలకమైనవి జరుగనుండటంతో స్థానికుల ఆనందం, ఉత్సాహం రెట్టింపవుతోంది. అన్నింటికి మించి వాతావరణం పూర్తి ప్రశాంతంగా ఉండే వేళ రాత్రి 7.30కు మ్యాచ్లు ప్రారంభం కానుండంతో నగర వాసులు వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరే కీలకం విలియమ్సన్ పిచ్తో సంబంధం లేకుండా పరుగులు సాధించే విలియమ్సన్... సంప్రదాయ షాట్లతో అంతే వేగంగా చాప కింద నీరులా స్కోరును నడిపిస్తాడు. గత మ్యాచ్లో బెంగళూరుపై చివరి వరకు నిలిచి దీనిని మరోసారి నిరూపించాడు. మనీశ్ పాండే కీలక సమయంలో ఫామ్లోకి వచ్చాడు. వరుసగా మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ఇతడిని వన్డౌన్లో పంపడం జట్టుకు మేలు చేసింది. దూకుడుగానూ ఆడగలడు. భువనేశ్వర్ మిగతా ఇద్దరు పేసర్లు సందీప్ శర్మ, సిద్ధార్థ కౌల్ ఈసారి విఫలమైనా భువనేశ్వర్ మాత్రం ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగానే పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు (11) మాత్రం తక్కువ తీశాడు. రషీద్ ఈ సీజన్లో 15 వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచ్ల్లో ప్రత్యర్థులకు లొంగినా మొత్తమ్మీద ఇతడి బౌలింగ్ ఆడటం కష్టమే. ధావన్ ఫ్రాంచైజీ మారినా, బ్యాటింగ్లో అదే నిలకడ చూపుతూ ఈ సీజన్లో 450 పరుగులు చేశాడు. పవర్ ప్లే ఓవర్లలో చకచకా పరుగులు సాధిస్తున్నాడు. అయ్యర్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ 442 పైగా పరుగులు చేశాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ దూకుడైన బ్యాటింగ్తో ఫలితాన్ని మార్చేసే పంత్... ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే ప్రత్యర్థులకు అంత నష్టం. ఈ సీజన్లో 401 పరుగులు చేశాడు. అమిత్ మిశ్రా ఐపీఎల్లో 150కిపైగా వికెట్లు తీసిన ఈ వెటరన్ లెగ్ స్పిన్నర్ మ్యాచ్ మలుపుతిప్పే స్పెల్ వేయగలడు. -
చెన్నైకి సన్స్ట్రోక్
సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్లో రెండు హ్యాట్రిక్లు నమోదు చేసింది. తొలి మ్యాచ్లో ఓడిన సన్ జట్టు ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచింది. ఆ వెంటనే మళ్లీ హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడింది. తాజాగా సొంతగడ్డపై ‘టేబుల్ టాపర్’ చెన్నై సూపర్ కింగ్స్నే దడదడలాడించింది. ప్రత్యర్థిని మొదట బౌలర్లు సమష్టిగా వణికిస్తే... ఓపెనర్లు వార్నర్, బెయిర్స్టో మెరుపులతో సన్రైజర్స్ విజయాన్ని ఖాయం చేశారు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–12 సీజన్లో వరుస పరాజయాలకు సన్రైజర్స్ హైదరాబాద్ ఫుల్స్టాప్ పెట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్పై గర్జించింది. 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ విక్టరీని నమోదు చేసింది. అంతకుముందు మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించారు. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ (25 బంతుల్లో 50; 10 ఫోర్లు), బెయిర్స్టో (44 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. తాహిర్కు 2 వికెట్లు దక్కాయి. వార్నర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఓపెనర్లే ఆడారు... ఈ ఐపీఎల్లో చాలా జట్లు టాస్ గెలిస్తే మరో మాటే లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయి. ఇక్కడ దీనికి భిన్నంగా జరిగింది. టాస్ చెన్నై గెలిచింది. కానీ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై తాత్కాలిక కెప్టెన్ రైనా నిర్ణయానికి మద్దతుగా ఓపెనర్లు డు ప్లెసిస్, వాట్సన్ ఆడారు. అంతే! అంతవరకే ఇన్నింగ్స్ బాగుంది. ఈ ఇద్దరి తర్వాత ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేదు. నిలబడిన వారెవరూ కనీసం ఓ మోస్తరు పరుగులు చేయలేదు. ఈ ఓపెనర్లు ఔటయ్యాక ఐదుగురు బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వచ్చారు. కానీ ఎవరూ సన్రైజర్స్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించలేకపోయారు. సన్ బౌలర్లు ఆకట్టుకున్నారు. ఆరుగురు బౌలింగ్ చేయగా... నదీమ్, సందీప్ శర్మ మినహా ఎవరూ కూడా బంతికో పరుగైన సమర్పించుకోలేదు. అంతబాగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. డు ప్లెసిస్ సిక్సర్లు సూపర్కింగ్స్ ఇన్నింగ్స్లో ఏవైనా చెప్పుకోదగ్గ మెరుపులున్నాయంటే అవి డు ప్లెసిస్ సిక్సర్లే. నాలుగు ఓవర్లు ముగిసినా చెన్నై స్కోరు 15 పరుగులే! సందీప్ వేసిన ఐదో ఓవర్లో డు ప్లెసిస్, వాట్సన్ చెరో ఫోర్ కొట్టారు. ఖలీల్ అహ్మద్ తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 6, 4తో వేగం పెంచాడు. నదీమ్ వరుస ఓవర్లలో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. 9 ఓవర్లు ముగిసేసరికి 70/0 స్కోరుతో పటిష్టంగా ఉంది. కానీ నదీమ్ 10వ ఓవర్లో వాట్సన్ను ఔట్ చేసి ఈ జోడీని విడగొట్టాడు. దీంతో 79 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కేవలం మూడు బంతుల వ్యవధిలో విజయ్ శంకర్... డు ప్లెసిస్ను ఔట్ చేయడంతో చెన్నై జోరుకు అడ్డుకట్టపడింది. 14వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్... రైనా (13), జాదవ్ (1)లను పెవిలియన్ చేర్చాడు. బిల్లింగ్స్ (0)ను ఖలీల్ అహ్మద్ డకౌట్ చేశాడు. ఇలా 22 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను చేజార్చుకుంది. తర్వాత రాయుడు (21 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు), జడేజా (20 బంతుల్లో 10 నాటౌట్) ఆఖరి 5.2 ఓవర్లు ఆడినా 31 పరుగులే చేయగలిగారు. వార్నర్... ధన్ ధనాధన్ సులువైన లక్ష్యాన్ని హైదరాబాద్ ఓపెనర్ వార్నర్ ధనాధన్ ఫోర్లతో మరింత సులభతరం చేశాడు. బెయిర్స్టో, వార్నర్ సన్రైజర్స్ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించారు. తొలి ఓవర్లో బెయిర్స్టో బౌండరీ కొట్టగా 10 పరుగులొచ్చాయి. రెండో ఓవర్లో ఇద్దరూ చెరో ఫోర్ బాదడంతో 11 పరుగులు లభించాయి. తర్వాత మూడు, నాలుగు, ఐదు ఓవర్లను వార్నర్ ఇష్టంగా ఆడేసుకున్నాడు. ఈ ఓవర్లలో వరుసగా రెండు, మూడు ఫోర్లు బాదడంతో అర్ధసెంచరీకి చేరువయ్యాడు. దీపక్ చహర్ వేసిన ఆరో ఓవర్లో 4, 4తో 24 బంతుల్లో 10 ఫోర్లతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న వార్నర్... ఆ మరుసటి బంతికే డు ప్లెసిస్ చేతికి చిక్కాడు. పవర్ ప్లేలో రైజర్స్ స్కోరు 68/1. బెయిర్స్టో ఫిఫ్టీ వార్నర్ ఔటయ్యే సమయానికి బెయిర్స్టో 15 పరుగులే చేశాడు. కెప్టెన్ విలియమ్సన్ (3) విఫలం కాగా... జట్టును నడిపించే బాధ్యత బెయిర్స్టో తీసుకున్నాడు. కరణ్ శర్మ వేసిన 11వ ఓవర్లో 2 సిక్సర్లు బాదాడు. అతను అర్ధసెంచరీకి చేరువవుతుండగా... విజయ్ శంకర్ (7)ను తాహిర్ పెవిలియన్ చేర్చాడు. దీపక్ హుడా క్రీజులోకి రాగా... కాస్త నెమ్మదించిన బెయిర్స్టో 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.చేయాల్సిన పరుగులు తక్కువే కావడంతో అనవసర షాట్లకు పోకుండా ఇద్దరు నింపాదిగా ఆడారు. హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా... కరణ్ శర్మ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఫోర్ కొట్టిన హుడా (13) విన్నింగ్ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ మరుసటి బంతిని సిక్సర్గా మలిచిన బెయిర్స్టో మరో 19 బంతులు మిగిలి ఉండగానే ఆటను ముగించాడు. హైదరాబాద్ బరిలో... ధోని లేని చెన్నై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్లో ఆడలేదు. వెన్నునొప్పితో ఇబ్బంది పడిన అతనికి ముందస్తు జాగ్రత్తగా విశ్రాంతి ఇచ్చారు. దీంతో సురేశ్ రైనా ఈ మ్యాచ్కు సారథ్యం వహించాడు.2010 తర్వాత చెన్నై తరఫున ధోని ఆడకపోవడం ఇదే తొలిసారి. ధోని కోసం పోటెత్తిన హైదరాబాదీలను ఇది తీవ్రంగా నిరాశపరిచింది. బిల్లింగ్స్ కీపింగ్ చేశాడు. సాన్ట్నర్ స్థానంలో కరణ్ శర్మను తీసుకున్నారు. ఇక హైదరాబాద్ జట్టులో రికీభుయ్, అభిషేక్ శర్మ స్థానాల్లో యూసుఫ్ పఠాన్, షాబాజ్ నదీమ్ జట్టులోకి వచ్చారు. -
వార్నర్, స్మిత్ పునరాగమనం
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారణంగా సంవత్సర కాలం నిషేధాన్ని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లకు గొప్ప అవకాశం దక్కింది. మే 30 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టులో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఇటీవల పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ చివరి రెండు మ్యాచ్ల నాటికే వీరిద్దరిపై నిషేధం ముగిసింది. అయినప్పటికీ సెలక్టర్లు వీరిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకుండా... ఐపీఎల్లో ఆడాలని సూచించారు. మరోవైపు పీటర్ హ్యాండ్స్కోంబ్, జోష్ హాజల్వుడ్లకు ఆసీస్ జట్టులో చోటు దక్కలేదు. ఆసీస్ ప్రపంచ కప్ జట్టు: ఫించ్ (కెప్టెన్), ఖాజా, వార్నర్, స్మిత్, షాన్ మార్‡్ష, మ్యాక్స్వెల్, స్టొయినిస్, క్యారీ, కమిన్స్, మిచెల్ స్టార్క్, రిచర్డ్సన్, కూల్టర్ నీల్, బెహ్రెన్డార్ఫ్, నాథన్ లయన్, ఆడమ్ జంపా. -
సొంతగడ్డపై హైదరాబాద్ చిత్తు
-
సన్డే స్ట్రోక్
సన్రైజర్స్ విజయానికి నాలుగు ఓవర్లలో 52 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. తాజా సీజన్లో ఇలాంటి లక్ష్యాన్ని వివిధ జట్లు తరచుగా ఛేదిస్తుండటం, వార్నర్ క్రీజ్లో ఉండటంతో రైజర్స్కు గెలుపుపై ఆశలు ఉన్నాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ముందు సన్కు భారీ స్ట్రోక్ తగిలింది. వరుస బంతుల్లో వార్నర్, విజయ్లను రబడ ఔట్ చేయగా... తర్వాతి ఓవర్లో మోరిస్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టడంతో జట్టు ఓటమి దిశగా పయనించింది. ఐపీఎల్లో తమ 100వ మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ 15 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోయి మరో 13 బంతులు మిగిలి ఉండగానే అనూహ్యంగా ఆలౌట్ కావడం పెద్ద షాక్! సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 39 పరుగుల తేడాతో రైజర్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 45; 5 ఫోర్లు), కొలిన్ మున్రో (24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఖలీల్ అహ్మద్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం సన్రైజర్స్ 18.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (47 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) బెయిర్స్టో (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా... ఇతర బ్యాట్స్మెన్ వైఫల్యం సన్ను ఘోరంగా దెబ్బ తీసింది. రబడ 4 వికెట్లు పడగొట్టగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కీమో పాల్, మోరిస్లకు మూడేసి వికెట్లు దక్కాయి. మున్రో వల్లే... ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు ఈ మాత్రమైనా వచ్చిందంటే మున్రోనే కారణం. ఖలీల్ చక్కటి బౌలింగ్కు ఓపెనర్లు పృథ్వీ షా (4), ధావన్ (7) వెనుదిరిగిన తర్వాత ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మున్రో దూకుడైన ఆటను ప్రదర్శించాడు. సందీప్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను... ఖలీల్ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అభిషేక్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టిన మున్రో తర్వాతి బంతికే కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇద్దరూ అంతంతే... క్రీజ్లో ఇద్దరు హార్డ్ హిట్టర్లు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (19 బంతుల్లో 23; 3 ఫోర్లు) ఉన్నారు... వీరిద్దరే మూడో వికెట్కు అతి కష్టమ్మీద 56 పరుగులు జోడించేందుకు 47 బంతులు తీసుకున్నారు. వీరి భాగస్వామ్యంలో కేవలం ఆరు ఫోర్లే వచ్చాయి. ఇన్నింగ్స్ కీలక దశలో ఢిల్లీ బ్యాటింగ్ ఎలా సాగిందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. సన్రైజర్స్ బౌలర్లు పట్టు బిగించడంతో ఢిల్లీ పరుగులు చేయడమే గగనంగా మారిపోయింది. అయ్యర్, పంత్ చెత్త షాట్లతో నాలుగు బంతుల వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత స్కోరు వేగం ఆగిపోయింది. చివరి 5 ఓవర్లలో క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. నబీ స్థానంలో వచ్చిన విలియమ్సన్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టగా... యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండే, కౌల్ స్థానాల్లో రికీ భుయ్, అభిషేక్, ఖలీల్ అహ్మద్లకు అవకాశం దక్కింది. శుభారంభం... సీజన్లో మరోసారి బెయిర్స్టో, వార్నర్ జోడీ హైదరాబాద్కు చక్కటి ఆరంభాన్ని అందించింది. రబడ ఓవర్లో ఇద్దరూ చెరో ఫోర్ కొట్టగా, ఇషాంత్ వేసిన తర్వాతి ఓవర్లో బెయిర్స్టో మరో రెండు ఫోర్లు బాదాడు. పవర్ప్లే ముగిసే సరికి స్కోరు 40 పరుగులకు చేరింది. తొలి వికెట్కు 59 బంతుల్లో 72 పరుగులు జోడించిన అనంతరం బెయిర్స్టో వెనుదిరిగాడు. రబడ అద్భుత క్యాచ్కు విలియమ్సన్ (3) ఔట్ కాగా... తొలి మ్యాచ్ ఆడుతున్న రికీ భుయ్ (7) విఫలమయ్యాడు. పరుగులు రావడం కష్టంగా మారిపోగా, చేయాల్సిన రన్రేట్ కూడా పెరిగిపోవడంతో హైదరాబాద్పై తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ను, తర్వాతి బంతికి విజయ్ శంకర్ (1)ను రబడ ఔట్ చేయడంతో సన్రైజర్స్ విజయంపై ఆశలు వదిలేసుకుంది. -
రైజింగ్ మొదలైంది
199 పరుగుల విజయ లక్ష్యం. చూస్తే కష్టంగానే అనిపించినా సన్రైజర్స్ సవాల్ను స్వీకరించింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే రాజస్తాన్ను ఓడించి గెలుపు తీరం చేరింది. వార్నర్ మెరుపు బ్యాటింగ్కు బెయిర్స్టో జోరు తోడై శుభారంభం దక్కడంతో హైదరాబాద్ పని సులువైంది. మధ్యలో విజయ్ శంకర్ దూకుడు జట్టుకు గెలుపు అందించడంలో కీలక పాత్ర పోషించాయి. అంతకుముందు అద్భుత సెంచరీ సాధించి సంజు సామ్సన్ రాయల్స్కు భారీ స్కోరు అందించాడు. సాక్షి, హైదరాబాద్: సొంత మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ విజయంతో బోణీ చేసింది. సీజన్లో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా... అజింక్య రహానే (49 బంతుల్లో 70; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం సన్రైజర్స్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ (37 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... బెయిర్స్టో (28 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), విజయ్ శంకర్ (15 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. రషీద్ ఖాన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు లభించింది. పేలవ ఆరంభం... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ దూకుడుగా ఆడటంలో విఫలమైంది. ఓపెనర్లు రహానే, బట్లర్ తడబడుతూ ఆడారు. ఇన్నింగ్స్ 17వ బంతికి గానీ మొదటి బౌండరీ రాలేదు. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న బట్లర్ (5)ను తన రెండో బంతికే బౌల్డ్ చేసి రషీద్ దెబ్బ తీశాడు. పవర్ప్లే ముగిసేసరికి రాయల్స్ కేవలం 3 ఫోర్లతో 35 పరుగులే చేయగలిగింది. రహానే అర్ధ సెంచరీ... కెప్టెన్ రహానే ఇన్నింగ్స్ చాలా వరకు ఎలాంటి టి20 మెరుపులు లేకుండా సాధారణంగానే సాగింది. దాదాపు బంతికో పరుగు చొప్పున మాత్రమే అతను చేస్తూ పోయాడు. ఒక దశలో అతను 29 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఆ తర్వాత నదీమ్, విజయ్ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టి కొంత జోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత నదీమ్ ఓవర్లోనే మరో సిక్సర్ బాదిన రహానే... అదే ఓవర్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి లాంగాన్లో పాండేకు క్యాచ్ ఇచ్చాడు. సూపర్ సంజు... తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్గా మలచి ఇన్నింగ్స్ ప్రారంభించిన సామ్సన్ చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. నదీమ్, కౌల్ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టి దూకుడు పెంచిన అతను.... ఆ తర్వాత చూడచక్కటి షాట్లు కొట్టాడు. 34 బంతుల్లో సంజు హాఫ్ సెంచరీ పూర్తయింది. 58 పరుగుల వద్ద అతనికి అదృష్టం కలిసొచ్చింది. కౌల్ బౌలింగ్లో షాట్ ఆడబోగా బంతి మిడ్ వికెట్ ప్రాంతంలోనే గాల్లో చాలా ఎత్తుకు లేచింది. క్యాచ్ పట్టేందుకు ఇద్దరు ఫీల్డర్లతో పాటు కీపర్ బెయిర్స్టో కూడా పరుగెత్తుకొచ్చాడు. అయితే బంతి బెయిర్స్టో చేతుల్లో పడినా...అతను దానిని నియంత్రించలేకపోవడంతో సామ్సన్ బతికిపోయాడు. ఈ ఓవర్ తర్వాత మరింత చెలరేగిన సంజు తర్వాతి 13 బంతుల్లోనే 42 పరుగులు బాదడం విశేషం. 54 బంతుల్లో సామ్సన్ సెంచరీ చేశాడు. అయ్యో భువనేశ్వర్... ఐపీఎల్లో ఒకప్పుడు అద్భుత బౌలర్గా, ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒంటి చేత్తో సన్రైజర్స్కు విజయాలు అందించిన భువనేశ్వర్ గత సీజన్ నుంచి కొంత కళ తప్పినట్లున్నాడు. 2018లో కూడా అతను 12 మ్యాచ్లలో 9 వికెట్లే తీయగలిగాడు. తాజా సీజన్లో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఒక ఓవర్లో రసెల్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టిన తీరు మరవక ముందే మరో సారి అతని బౌలింగ్ను ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఆడుకున్నారు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో సామ్సన్ వరుసగా 6, 4, 4, 2, 4, 4 కొట్టడంతో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. అయితే అది అంతటితో ఆగిపోలేదు. భువీ వేసిన చివరి ఓవర్లో స్టోక్స్ చెలరేగిపోయాడు. అతను కూడా 3 ఫోర్లు బాదడం, సామ్సన్ మరో ఫోర్ కొట్టడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. తొలి 2 ఓవర్లలో 10 పరుగులే ఇచ్చిన భువీ... తర్వాతి 2 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు. వార్నర్ దూకుడు... సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ అర్ధ సెంచరీతో డేవిడ్ వార్నర్ సత్తా చాటాడు. ధావల్ కులకర్ణి వేసిన ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్గా మలచిన అతను అదే ఓవర్లో మరో సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత స్టోక్స్ ఓవర్లో అతను మూడు ఫోర్లు బాదడం విశేషం. 26 బంతుల్లో వార్నర్ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గౌతమ్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి దూసుకుపోతున్న తరుణంలో అతని జోరుకు స్టోక్స్ అడ్డుకట్ట వేశాడు. స్టోక్స్ బౌలింగ్లో పుల్కు ప్రయత్నించి ఔట్ కావడంతో వార్నర్ ధాటైన ఇన్నింగ్స్ ముగిసింది. ఆకట్టుకున్న బెయిర్స్టో... వార్నర్తో పోటీ పడుతూ శుభారంభం అందించిన బెయిర్స్టో కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఒక దశలో అతను ఐదు బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. గోపాల్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా బెయిర్ స్టో కొట్టిన సిక్సర్ అతని ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. అయితే గోపాల్ బౌలింగ్లోనే మరో భారీ షాట్కు ప్రయత్నించగా లాంగాఫ్లో ధావల్ అద్భుత క్యాచ్ పట్టడంతో వెనుదిరగాల్సి వచ్చింది. విజయ్ శంకర్ దూకుడు... గత మ్యాచ్లో కూడా చక్కటి ప్రదర్శన కనబర్చిన విజయ్ శంకర్ ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత దూకుడుగా ఆడాడు. ధావల్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన అతను ఉనాద్కట్ ఓవర్లో మరో సిక్స్ బాదాడు. అయితే అద్భుతమైన బంతితో శంకర్కు కళ్లెం వేసిన గోపాల్...అదే ఓవర్లో పాండే (1)ను కూడా ఔట్ చేశాడు. ఉత్కంఠకు గురైనా... ఒకే ఓవర్లో శంకర్, పాండే ఔటైన తర్వాత 26 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితిలో సన్ కొంత తడబడింది. అయితే యూసుఫ్ పఠాన్ (16 నాటౌట్), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో రషీద్ వరుసగా 4, 6 కొట్టి మ్యాచ్ను ముగించాడు. ►ఐపీఎల్లో సామ్సన్కిది రెండో సెంచరీ. ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో 53 సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో భారత ఆటగాళ్ల సెంచరీలు 20 ఉన్నాయి. -
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో వార్నర్
బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాదిపాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో సెయింట్ లూసియా స్టార్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని సెయింట్ లూసియా జట్టు మేనేజర్ మొహమ్మద్ ఖాన్ స్పష్టం చేశాడు. ‘వార్నర్ ఒక దిగ్గజ ఆటగాడు. అతని రాకతో డ్రెస్సింగ్ రూమ్తో పాటు మైదానంలోనూ మా జట్టు పటిష్టంగా మారుతుంది. మేం సీపీఎల్ టైటిల్ గెలిచేందుకు వార్నర్ కీలకంగా వ్యవహరిస్తాడు’అని ఆయన అన్నారు. -
స్మిత్, వార్నర్లపై సర్రే కౌంటీ ఆసక్తి
లండన్: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్లపై ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రే ఆసక్తి కనబరుస్తోంది. సర్రే హెడ్ కోచ్ మైకేల్ డి వెనుటో వాళ్లిద్దరిని ఆడించాలని ఆశిస్తున్నారు. ఆయన 2013 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్గా పనిచేశారు. అయితే వీళ్లిద్దరు కౌంటీల్లో ఆడాలంటే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆమోదం తప్పనిసరి. డి వెనుటో మాట్లాడుతూ... ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ, దేశవాళీ టోర్నీల్లోనే వాళ్లపై నిషేధం విధించిందని, ఆసీస్లో క్లబ్, ఇతర దేశాల్లో జరిగే టోర్నీల్లో ఆడేందుకు అవకాశముందని చెప్పారు. ‘స్మిత్, వార్నర్లకు ఆడాలని ఉంటే కౌంటీల్లో ఆడించవచ్చు. ఈసీబీ కూడా అనుమతించవచ్చు. అలా కాకుండా... ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లయిన వారిని నిరోధించడం తలతిక్క పనే అవుతుంది’ అని ఆయన అన్నారు. -
ఏడాది శిక్ష... చాలా ఎక్కువ!
బాల్ ట్యాంపరింగ్లో స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్ అడ్డంగా దొరకడంతో క్రీడాలోకం ఒక్కసారిగా భగ్గుమంది. క్షమించరాని నేరమంది. వారు చేసింది ఘోరమంది. శిక్షలు పడ్డాక... పశ్చాత్తాపంతో విలపిస్తుంటే అదే ‘లోకం’ అయ్యో పాపమంటోంది. సానుభూతి కురిపిస్తోంది. న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్లో తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటున్న స్మిత్ విలాపం బహుశా అందర్ని కదిలిస్తోంది. దీంతో అప్పుడు ఛీ అన్నోళ్లే ఇప్పుడు కనికరించాలంటున్నారు. ఐదు రోజుల క్రితం కెప్టెన్ స్మిత్పై ఐసీసీ కేవలం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడంతో భారత స్పిన్నర్ హర్భజన్ ఐసీసీది ద్వంద్వ నీతంటూ ధ్వజమెత్తాడు. అతనే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్ చేసిన నేరానికి విధించిన ఏడాది శిక్ష చాలా ఎక్కువని... ఏదో ఒక టెస్టు సిరీస్కో లేదంటే రెండు సిరీస్లకో వేటు వేయాల్సిందని భజ్జీ అన్నాడు. మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియన్లపై సానుభూతి చూపాడు. ‘ప్రపంచం మీ కన్నీళ్లు చూడాలనుకుంది... చూసింది. ఇప్పుడు చూశాక సంతోషించినట్లుంది. కానీ సానుభూతి అనేది పదంలా మాత్రమే కాకుండా నిజంగా చూపిస్తే బాగుంటుంది. దీనినుంచి బయటపడే ధైర్యాన్ని దేవుడు వారికివ్వాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మోసగాళ్లు, దోషులు అని పతాక శీర్షికల్లో నిందించిన దిన పత్రికలు కూడా ఇవేం శిక్షలంటూ రాశాయి. ‘దిస్ ఈజ్ బాల్ ట్యాంపరింగ్. నాట్ మర్డర్’ (ఇది బాల్ ట్యాంపరింగే... హత్య కాదు), అని, ‘డియర్ ఆస్ట్రేలియా దట్స్ ఎనఫ్ నౌ’ (ఆస్ట్రేలియా... ఇక చాలు) అని పత్రికలు ఆసీస్ ఆటగాళ్లపై నిందలు చాలించాలని కోరాయి. పాక్ కోచ్గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ మైకీ అర్థర్ మాట్లాడుతూ స్మిత్కు క్రికెటే లోకమని, ఆటకోసమే పరితపిస్తాడని... అతని కెరీర్లో ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. మళ్లీ పునరాగమనంలో మరింత కష్టపడతాడని... సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. -
స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లే దోషులు
-
వార్నర్ దూరమైనా ఇబ్బంది లేదు: సాహా
కోల్కతా: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అతను లేకున్నా సన్రైజర్స్ హైదరాబాద్కు ఎలాంటి నష్టం లేదని ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా తెలిపాడు. తమ జట్టు రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని... వార్నర్ గైర్హాజరీ తమపై పెద్దగా ప్రభావం చూపబోదని పేర్కొన్నాడు. ‘ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా మా జట్టులో ఉంది. కెప్టెన్ ఆధారంగానే జట్టు ఎంపిక జరుగుతుంది. ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో ఇబ్బంది పడొచ్చేమో కానీ... మా రిజర్వ్ బెంచ్ బలంగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఎక్కువగా ఉండదు’ అని అన్నాడు. వార్నర్ స్థానాన్ని శిఖర్ ధావన్ భర్తీ చేస్తాడా అనే ప్రశ్నకు బదులిస్తూ... ‘అది జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయిస్తుంది. సారథి ఎవరైనా లక్ష్యం మాత్రం విజయమే’ అని స్పష్టం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం వరకు వార్నర్పై ఎలాంటి ప్రకటన చేయబోమని సన్రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ తెలపగా... ప్రస్తుత పరిణామాల ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ఫై ఏడాది నిషేధం విధించే యోచనలో కనిపిస్తోంది. -
మరో 24 గంటలు!
ఇప్పటివరకు క్రికెట్లో ఉత్కంఠఅంటే మనకు తెలిసింది మ్యాచ్ చివరి ఓవర్ వరకు పోటాపోటీగా సాగడం... ఆఖరి బంతికి సిక్స్ కొట్టో... వికెట్ తీసో జట్టును గెలిపించడం! అచ్చంగా వీటిని తలపించేలా ‘బాల్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ ఫలితం’ సాగుతోంది! ఇటు ట్యాంపరింగ్ మోసంపై కొనసాగిన విమర్శలు! అటు ఘటనకు కారకులుగా భావిస్తున్న ఆటగాళ్లతో పాటు కోచ్పై ఆ తరహా చర్యలుంటాయి... ఈ తరహా చర్యలుంటాయంటూ రోజంతా ఊహాగానాలు! వీటన్నిటికీ జవాబు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ వైపు అందరి చూపు! ‘విషయం తేల్చేశాం’ అన్నట్లు మంగళవారం రాత్రి ఆయన గంభీరంగా మీడియా సమావేశానికి వచ్చారు. కానీ... సగం తీర్పే చెప్పారు. తదుపరి వివరాలను 24 గంటల్లో వెల్లడిస్తామని ప్రకటించి ముగించారు. మొత్తానికిదోషులెవరో స్పష్టమైంది. మిగిలింది వారి క్రీడా భవితవ్యంపై కీలకనిర్ణయమే! బుధవారంతో ఈ సస్పెన్స్ కూడా వీడిపోనుంది. జొహన్నెస్బర్గ్: తమ దేశ క్రికెట్ను కుదిపేస్తూ... అవమానాల పాల్జేస్తున్న ‘బాల్ ట్యాంపరింగ్’ ఘటన వెనుక ఉన్నదెవరో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ అధికారికంగా వెల్లడించారు. తమ బోర్డు అధికారుల విచారణ వివరాలతో మంగళవారం రాత్రి ఆయన ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. ట్యాంపరింగ్ ఉదంతంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ కామెరూన్ బాన్క్రాఫ్ట్లు దోషులుగా తేలినట్లు ప్రకటించారు. కోచ్ డారెన్ లీమన్ సహా మిగతా ఆటగాళ్లెవరికీ ఇందులో పాత్ర లేదని స్పష్టం చేశారు. విచారణ ముగిశాక, ముగ్గురు ఆటగాళ్లపై తాము తీసుకునే చర్యలను 24 గంటల తర్వాత తెలియజేస్తామన్నారు. వేటుపడినవారు తక్షణమే స్వదేశానికి పయనమవుతారని వారి స్థానాలను మాథ్యూ రెన్షా, జో బర్న్స్, గ్లెన్ మ్యాక్స్వెల్తో భర్తీ చేయనున్నట్లు.... వికెట్ కీపర్ టిమ్ పైన్ నాలుగో టెస్టుకు సారథ్యం వహిస్తాడని పేర్కొన్నారు. లీమన్ రాజీనామా చేశాడన్న వార్తలు నిజం కాదని... ప్రస్తుత కాంట్రాక్ట్తోనే అతడు కొనసాగుతాడని వివరించారు. ‘కేప్టౌన్లోని న్యూలాండ్స్ మైదానంలో మా ఆటగాళ్ల ప్రవర్తనకు క్షమాపణలు కోరుతున్నాం. స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లే ట్యాంపరింగ్లో భాగస్వాములని సీఏ విచారణలో తేలింది. విస్తృత స్థాయి పేరు ప్రఖ్యాతులు ముడిపడి ఉన్న ఈ ఘటనలో తీసుకునే చర్యలు కూడా అంతే కఠినమైనవి. విచారణలో స్పష్టమైన అంశాలతో ఇది ముందుకు సాగుతుంది. ఈ ఉదంతంతో మా పురుషుల జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై నిపుణుల బృందంతో స్వీయ సమీక్ష చేసుకుంటాం’ అని సదర్లాండ్ అన్నారు. కలుపు మొక్క వార్నర్! క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణలో ముగ్గురు ఆటగాళ్లు దోషులుగా తేలినా జట్టు గత రెండు రోజులుగా సాగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అంతర్గత సమాచారం ప్రకారం ట్యాంపరింగ్కు అసలు సూత్రధారి డేవిడ్ వార్నరే అని వినిపిస్తోంది. బంతిని టేపుతో ట్యాంపరింగ్ చేయాలనే ఆలోచన తనదే అని, ఓపెనింగ్ సహచరుడు బాన్క్రాఫ్ట్తో ఆ పని చేయించాలని కూడా అతనే చెప్పాడని తెలిసింది. దీనికి ఊ కొట్టడం వరకే స్మిత్ పరిమితమయ్యాడు. ట్యాంపరింగ్కంటే కూడా ‘అసలు సమస్య వార్నర్’ అని ఒక సీనియర్ ఆసీస్ బోర్డు అధికారి చెప్పడం పరిస్థితిని సూచిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఆసీస్ జట్టులోని ఆటగాళ్లంతా వార్నర్ను వెంటనే జట్టు నుంచి బయటకు పంపించాలని కూడా కోరుకున్నట్లు సమాచారం. తమతో ఎలాంటి సంప్రదింపులు జరగకపోయినా ట్యాంపరింగ్కు సంబంధించి తమ పేర్లను చేర్చడంపై పేసర్లు స్టార్క్, హాజల్వుడ్, స్పిన్నర్ నాథన్ లయన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన దగ్గరి నుంచి అతను సహచరులతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు. టీమ్ వాట్సప్ గ్రూప్ నుంచి వార్నర్ తనంతట తానుగా తప్పుకోవడం కూడా జట్టుతో అతనికి ప్రస్తుతం ఉన్న సంబంధాల పరిస్థితి గురించి చెబుతోంది! 2013లో బార్లో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ను కొట్టిన నాటి నుంచి తమ బోర్డుతో వార్నర్కు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. గత ఏడాది ఆటగాళ్ల జీతాల పెంపు విషయంలో అతను గట్టిగా పోరాడాడు. ఇప్పుడు సరిగ్గా అదను చూసి బోర్డు కూడా వార్నర్ను బద్నామ్ చేసే కార్యక్రమంలో చేరింది. 2014లో యాషెస్తో 0–5తో ఇంగ్లండ్ చిత్తుగా ఓడిన తర్వాత కెవిన్ పీటర్సన్పై వేటు పడింది. నిజానికి జట్టు మొత్తం విఫలమైనా... వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడనే సాకుతో అతనిపై బోర్డు చర్య తీసుకుంది. ఆసీస్ జట్టులో తాజా పరిణామాలు కూడా సరిగ్గా అదే తరహాలో సహచరులతో సమస్యలు చూపిస్తూ వార్నర్ కెరీర్కు ముగింపు పలకవచ్చు! లీమన్కు ఏమీ తెలీదా! బాల్ ట్యాంపరింగ్ వివాదం గురించి సదర్లాండ్ చేసిన ప్రకటనలో అన్నింటికంటే ఆశ్చర్యకరమైంది కోచ్ డారెన్ లీమన్కు క్లీన్చిట్ ఇవ్వడం. అతను ఎలాంటి తప్పు చేయలేదని, తన కాంట్రాక్ట్ ప్రకారం కోచ్గా కొనసాగుతాడని సదర్లాండ్ చెప్పారు. కానీ ఘటన జరిగిన రోజు వీడియోను చూస్తే లీమన్ పాత్ర ఏమిటో చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు. టీవీ స్క్రీన్పై బాన్క్రాఫ్ట్ టేపు దృశ్యాలు కనిపించగానే వాకీటాకీలో హ్యాండ్స్కోంబ్కు సమాచారం ఇవ్వడం... అతడు దానిని బాన్క్రాఫ్ట్కు చేరవేయడం స్పష్టంగా కనిపించింది. జట్టు కోచ్గా అతని ప్రమేయం ఏమీ లేకుండా ఇంత పెద్ద ఘటన జరిగిందనడం నమ్మశక్యంగా లేదు. కాబట్టి లీమన్ను కావాలనే రక్షిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నైపుణ్యం పరంగా గొప్ప కోచ్ కాకపోయినా కేవలం బోర్డులో తనకు ఉన్న సంబంధాలతో ‘సిఫారసు’ వ్యక్తిగా లీమన్ కోచ్గా కొనసాగుతున్నాడనేది చాలా కాలంగా ఉన్న ఆరోపణే. ఐదేళ్ల క్రితం మికీ ఆర్థర్తో ఆస్ట్రేలియా బోర్డుకు గొడవ జరిగిన సమయంలో అప్పటికప్పుడు తాత్కాలికంగా ఎంపిక చేయబడిన లీమన్, ఆ తర్వాత ఎన్ని వైఫల్యాలు ఎదురైనా వేటు పడకుండా తప్పించుకోగలగడం అతనికి ఉన్న పట్టును సూచిస్తోంది. మరోవైపు తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యను కూడా సదర్లాండ్ ‘అబద్ధం’గా మార్చేశారు. లంచ్ సమయంలో తమ మధ్య చర్చ జరిగిందని, ‘లీడర్షిప్ గ్రూప్’ కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయమని ఆ రోజు స్మిత్ చెప్పాడు. కానీ కేవలం ముగ్గురే దోషులంటూ తాజా విచారణలో తేల్చారు. జట్టులో అందరికంటే తక్కువగా ఏడు టెస్టుల అనుభవం ఉన్న బాన్క్రాఫ్ట్ లీడర్షిప్ గ్రూప్లో ఏ రకంగా చూసినా భాగం కాదు. అంటే కేవలం వార్నర్, స్మిత్ మాత్రమే కలిసి వ్యూహం రచించారా! అన్నింటికి మించి ఒక్క బౌలర్కు కూడా ట్యాంపరింగ్లో పాత్ర లేదనేని మరింత ఆశ్చర్యపరిచే విషయం. సాధారణంగా బాల్ ట్యాంపరింగ్ చేస్తే దానిని సమర్థంగా వాడుకోగలిగేది బౌలర్ మాత్రమే. అప్పటి వరకు బంతి ఏ మేరకు స్వింగ్ అయింది? అసలు రివర్స్ స్వింగ్ అవుతోందా లేదా? ఒక వేళ బంతి ఆకారాన్ని దెబ్బ తీస్తే అది ఏమేరకు ప్రభావం చూపిస్తుందో ఒక బౌలర్ మాత్రమే అంచనా వేయగలడు. కానీ సదర్లాండ్ చెప్పిన దాని ప్రకారం ఆ జట్టు బౌలర్లకు పనికొచ్చేలా ముగ్గురు బ్యాట్స్మెన్ కలిసి కుట్ర పన్నారు! మొత్తం సదర్లాండ్ ప్రకటన చూస్తే ఈ ఘటన పట్ల తామంతా బాధపడిపోతున్నట్లు, జాతికి క్షమాపణలు కోరుతున్నట్లు కనిపించినా... మొత్తం మీడియా సమావేశంలో ఒక్కసారి ‘చీటింగ్’ పదం వాడకపోవడం గానీ చూస్తే ఇప్పటి వరకు జరిగిన విచారణలో మాత్రం నిజాయితీ లేదనేది వాస్తవం. బుధవారం ముగ్గురు క్రికెటర్లపై శిక్షలు ఖరారయ్యాక గానీ ఆసీస్ బోర్డు ఈ వ్యవహారంలో ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. -
రిటైరయ్యాక రాజకీయాల్లోకి: వార్నర్
మెల్బోర్న్: క్రికెట్ నుంచి రిటైరయ్యాక రాజకీయాలను ఎంచుకునే అవకాశం ఉందని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రకటించాడు. ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లలా కాకుండా తరచూ రాజకీయ నాయకులను కలిసే వార్నర్... ఇటీవల మాట్రవిల్లేలోని తన చిన్ననాటి నివాస ప్రాంతం సమీపాన ఉన్న ఓ పార్కు అభివృద్ధికి నిధులు ఇచ్చేలా దేశ ప్రధాని టోనీ అబాట్ను ఒప్పించడం విశేషం. -
వార్నర్ సెంచరీ
డ్రింక్స్ బ్రేక్కు ముందు ఓవర్. సెంచరీకి పరుగు దూరంలో వార్నర్ (99). కరన్ వేసిన 41వ ఓవర్ ఐదో బంతిని వార్నర్ గాల్లోకి లేపాడు. మిడాన్లో బ్రాడ్ సునాయాస క్యాచ్ పట్టేశాడు. అంతే... ఓపెనర్ నిరాశగా వెనుదిరుగుతుంటే... అరంగేట్రం బౌలర్ కరన్ తొలి వికెట్ సాధించిన ఆనందంలో, సహచరులంతా సంబరంలో. కానీ...అపుడే ఫీల్డ్ అంపైర్ ధర్మసేన నోబాల్ సిగ్నలిచ్చాడు. వార్నర్ను క్రీజులోకి పిలిచాడు. ఆ తర్వాత బంతికే అతడు సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పుడు సంబరం వార్నర్ది. సంతోషం ఆసీస్ది. మెల్బోర్న్: ఆస్ట్రేలియా ‘బాక్సింగ్ డే’ టెస్టులోనూ శుభారంభం చేసింది. యాషెస్ సిరీస్లో మంగళవారం మొదలైన నాలుగో టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (103; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (65 బ్యాటింగ్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో శతక సాధనలో ఉన్నాడు. మొదటి రోజు ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 89 ఓవర్లు ఆడి 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు నుంచే ఇంగ్లండ్కు కష్టాలు మొదలయ్యాయి. రోజంతా మందకొడిగా సాగిన ఇన్నింగ్స్లో ఆసీస్ సగటున ఓవర్కు 2.74 రన్రేట్తో పరుగులు చేస్తే... 89 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ బౌలర్లు మూడే వికెట్లు తీయగలిగారు. వార్నర్కు కలిసొచ్చినా... టాస్ నెగ్గిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. బాన్క్రాఫ్ట్ (26; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన వార్నర్ తొలి వికెట్కు 122 పరుగులు జోడించి చక్కని ఆరంభమిచ్చాడు. కలిసొచ్చిన ‘నోబాల్’తో టెస్టుల్లో 21వ శతకం సాధించినా... ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. అండర్సన్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ స్మిత్, షాన్ మార్‡్ష (31 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. వీళ్లిద్దరు అభేద్యమైన నాలుగో వికెట్కు 84 పరుగులు జోడించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ‘బాక్సింగ్ డే’ టెస్టును తిలకించేందుకు తొలి రోజు 88,172 మంది ప్రేక్షకులు హాజరు కావడం విశేషం. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 244/3 (వార్నర్ 103, స్మిత్ 65 బ్యాటింగ్, షాన్ మార్‡్ష 31 బ్యాటింగ్; బ్రాడ్ 1/41, అండర్సన్ 1/43). -
వార్నర్ 'గర్జన' ఏది?
బర్మింగ్హోమ్: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొంతకాలంగా ఆసీస్ విజయాల్లో వార్నర్ పాత్ర వెలకట్టలేనిది. అటు టెస్టులైనా, ఇటు వన్డేలైనా, మరొకవైపు ట్వంటీ 20 లీగ్లైనా వార్నర్ మార్క్ ఉండాల్సిందే. ఆ క్రమంలోనే 2016లో ఏడు వన్డే సెంచరీలు చేసి ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ఆసీస్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఓవరాల్ గా ఒక ఏడాదిలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ తరువాత స్థానం పొందాడు. ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే వన్డే టోర్నమెంట్లలో మాత్రం వార్నర్ ఇప్పటివరకూ భారీ స్కోర్లు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటివరకూ ఐసీసీ నిర్వహించిన టాప్-8 జట్లపై వార్నర్ వన్డే సగటు 26. మొత్తం 10 ఇన్నింగ్స్ ల్లో వార్నర్ చేసిన పరుగులు 234. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 45 మాత్రమే. ప్రతీ చోట తనదైన ముద్రను వేసే వార్నర్.. ఇలా ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నమెంట్లలో గర్జించకపోవడం ఆసీస్ ను ఆందోళన పరుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్ లో వార్నర్ (21) నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తేనే సెమీస్ లోకి చేరుతుంది. -
‘రైజ్’ కాలేకపోయింది..!
►అవకాశాలు చేజార్చుకున్న హైదరాబాద్ ►హైలైట్గా నిలిచిన వ్యక్తిగత ప్రదర్శనలు ►కీలక పాత్ర పోషించిన వార్నర్, భువనేశ్వర్, రషీద్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన జట్టు... హిట్టర్లకు కొదవలేని బ్యాటింగ్ లైనప్... డెత్ ఓవర్లలోనూ కట్టడి చేసే బౌలింగ్ దళం... ఇలా ఎలా చూసినా ఆల్రౌండ్ నైపుణ్యం పుష్కలంగా ఉన్న జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. కానీ ఎలిమినేట్ అయ్యింది...ఈ సీజన్లో నిలకడ చూపించినా కీలక మ్యాచ్లో నిరాశజనక ప్రదర్శన రైజర్స్ మరో టైటిల్ అవకాశాలను దూరం చేసింది. టాప్–2లో నిలిచే సత్తా, సామర్థ్యం ఉన్నా... కొన్ని మ్యాచ్ల ఫలితాలే దెబ్బతీశాయి. టైటిల్ వేటకు టాటా చెప్పించాయి. అయితే ఒకసారి విజేతగా నిలవడంతో పాటు మరో రెండు సార్లు ప్లే ఆఫ్ దశకు చేరుకోవడంతో సన్ యాజమాన్యం సంతృప్తికరంగానే ఐపీఎల్ ప్రస్థానాన్ని ముగించిందని చెప్పవచ్చు. ఎలిమినేటర్ పోరులో కొంత వరకు వర్షం సన్రైజర్స్ అవకాశాలను దెబ్బ తీసింది. అయితే 20 ఓవర్ల మ్యాచ్ జరిగినా కచ్చితంగా గెలిచేదని చెప్పలేం. అయితే చేసిన స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటే, ప్రత్యర్థి జట్టు ప్రదర్శనను పరిశీలిస్తే... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో చేయగలిగిన స్కోరును మాత్రం హైదరాబాద్ చేయలేదనేది అంగీకరించాల్సిన సత్యం. గత సీజన్లోనూ మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరాటంతోనే ఫైనల్ చేరిన జట్టు... చివరకు టైటిల్ సాధించే క్రమంలో బెంగళూరులాంటి జట్టుపై ఇదే మైదానంలో ఎంత స్కోరు చేసిందో అందరికీ తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం ప్రత్యర్థి జట్టును అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైంది. రైజర్స్ వ్యూహాలు బాగానే ఉన్నా కొన్ని తప్పులు వెంటాడాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో పక్కా ప్రణాళికేదీ కనిపించలేదు. వర్షం కురిసిన మైదానం మందకొడిగా ఉంటే భారీ షాట్లకు వెళ్లకుండా గ్రౌండ్ షాట్లకే పరిమితమ్యారు. ఓపెనర్ శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్లకు బ్యాట్ ఝుళిపించే సత్తా ఉన్నా... వారు విఫలం కావడం నిరాశపరిచింది. పరుగులు, వికెట్లలో ‘రైజింగ్’ లీగ్ మొత్తం మీద జట్టును బ్యాటింగ్లో నడిపించిన నాయకుడు వార్నరే. ఇతనికి ఓపెనింగ్లోనూ, బ్యాటింగ్ ఆర్డర్లోనూ అండగా నిలిచింది శిఖర్ ధావన్. కెప్టెన్ 641 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎలిమినేటర్ ముందు వరకు ఆ తర్వాతి స్థానంలో ధావన్ (479 పరుగులు) ఉన్నాడు. (తాజాగా గంభీర్ 486 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు). హైదరాబాద్ విజయాల్లో సింహభాగం భాగస్వామ్యం ఓపెనర్లదే. అయితే మిగతా బ్యాట్స్మెన్ ఆ బాధ్యతను పంచుకోలేకపోయారు. 12 మ్యాచ్లాడిన యువరాజ్ (252 పరుగులు) ప్రదర్శన తీసికట్టుగానే ఉంది. ఏడే మ్యాచ్లాడిన విలియమ్సన్ (256) అతనికంటే చాలా మెరుగ్గా ఆడాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అయిన నమన్ ఓజా నిరూపించుకునే ప్రదర్శన ఒక్కటీ లేదు. ఇక బౌలింగ్లోనూ సన్రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ (26 వికెట్లు)దే అగ్రస్థానం. రషీద్ ఖాన్ (17), సిద్ధార్థ్ కౌల్ (16) టాప్–10లో ఉన్నారు. కోట్లు వెచ్చించిన అఫ్ఘాన్ స్పిన్న ర్ రషీద్ నిలకడగా రాణించాడు. లోకల్ హీరో సిరాజ్ కూడా సత్తా చాటుకున్నాడు. 6 మ్యాచ్లాడిన సిరాజ్ 10 వికెట్లతో ఫర్వాలేదని పించాడు. బౌలింగ్ పరంగా వేలెత్తిచూపలేని ప్రదర్శన రైజర్స్ది. ఎలిమినేటర్లో బ్యాటింగ్ వైఫల్యంతో చేష్టలుడిగినా... బౌలర్లు మాత్రం ఆ 6 ఓవర్లలో తమ శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. టాప్–2లో నిలిచివుంటే: లీగ్ మొత్తాన్ని గమనిస్తే హైదరాబాద్ ప్రదర్శన బాగానే ఉంది. ఆడిన 13 మ్యాచ్ల్లో 8 గెలిచింది. (బెంగళూరుతో మ్యాచ్ రద్దయింది). ఇదేమంత చెత్త ప్రదర్శన కాకపోయినా... కోల్కతాతో ఈడెన్లో, పుణేతో ఉప్పల్లో గెలవాల్సిన రెండు మ్యాచ్లు ఓడిపోవడం రైజర్స్ను టాప్–2కు దూరం చేసింది. తొలి రెండు స్థానాల్లో ఉంటే ఫైనల్ చేరేందుకు ఓడినా... మరో అవకాశముండేది. కోల్కతాతో జరిగిన పోరులో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. చివర్లో బిపుల్ శర్మ ధాటిగా ఆడినా... నమన్ ఓజా బాధ్యతారాహిత్యం 17 పరుగుల పరాజయాన్నిచ్చింది. ఇక ఉప్పల్లో చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన దశలో హైదరాబాద్ ఒక్కపరుగైనా చేయలేక మూడు వికెట్లు కోల్పోయి ఓడటం తీవ్రంగా నిరాశపర్చింది. ఈ రెండు ఫలితాలు హైదరాబాద్ లీగ్ దశను మలుపుతిప్పాయి. ‘‘ఈ సీజన్లో బెంగళూరు పిచ్ చాలా స్లోగా ఉంది. 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే మ్యాచ్ 20 ఓవర్లు పూర్తిగా జరగకపోవడమే మా అవకాశాన్ని దెబ్బతీసింది. పూర్తి కోటా సాగితే మరో రెండు, మూడు వికెట్లు తీసి మేం గెలిచేదారిలో ఉండేవాళ్లం. కానీ దురదృష్టవశాత్తు ఆరు ఓవర్ల ఆటే మా కొంపముంచింది’’ – రైజర్స్ బౌలింగ్ కోచ్ మురళీధరన్ -
సన్రైజర్స్ పుంజుకుంటుందా..?
►నేడు పుణేతో తలపడనున్న హైదరాబాద్ ► సొంతగడ్డపై బలంగా వార్నర్సేన ►వరుస విజయాల జోరులో సూపర్జెయింట్ హైదరాబాద్: ప్లే ఆఫ్లో చోటే లక్ష్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ శనివారం రైజింగ్ పుణే సూపర్జెయింట్తో తలపడనుంది. ఈ సీజన్లో సొంతగడ్డపై ఓటమన్నదే లేకుండా సాగుతున్న హైదరాబాద్.. ఈ మ్యాచ్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్తోన్న పుణే ఇదే జోరును కొనసాగించాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్లో ఎవరు నెగ్గిన పట్టికలో రెండోస్థానానికి ఎగబాకుతారు. అజేయంగా వార్నర్సేన.. డిఫెండింగ్ చాంపియన్గా ఈ సీజన్లో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై అదేస్థాయి ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్లో ఐదు మ్యాచ్లాడిన సన్రైజర్స్ ఆయా మ్యాచ్ల్లో విజయాన్ని నమోదు చేసింది. ఓవరాల్గా 11 మ్యాచ్లాడిన వార్నర్సేన ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు మూటగట్టుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఓవారల్గా 13 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ డేర్డెవిల్స్తో ఆడిన చివరిమ్యాచ్లో బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన చేసిన వార్నర్సేన 185 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఆ మ్యాచ్లో బ్యాట్స్మన్ సమష్టిగా రాణించారు. ముఖ్యంగా డాషింగ్ ఆల్రౌండర్ మెరుపు ఇన్నింగ్స్తో గాడిలో పడ్డాడు. అతని ధాటికి సన్రైజర్స్ భారీస్కోరును నమోదు చేసింది. అయితే టోర్నీలోనే అత్యుత్తమ బౌలింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ ఆ మ్యాచ్లో మాత్రం తేలిపోయింది. దీంతో ఆరు వికెట్లతో ఓటమిపాలైంది. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరుగకుండా చూడాలని జట్టు యాజమాన్యం కృతనిశ్చయంతో ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు మూలస్తంభంలా నిలిచాడు. ఇప్పటివరకు పది మ్యాచ్లాడిన వార్నర్ 489 పరుగులతో టోర్నీలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్గా నిలిచాడు. దీంతో ‘ఆరెంజ్ క్యాప్’ను తన సొంతం చేసుకున్నాడు. శిఖర్ ధావన్ (369 పరుగులు), కేన్ విలియమ్సన్ (228 పరుగులు), మోజెస్ హెన్రిక్స్ (225 పరుగులు), యువరాజ్ సింగ్ (187 పరుగులు)లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. దీపక్ హుడా, నమన్ ఓజాలకు బ్యాటింగ్లో అంతగా అవకాశాలు రాలేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ముందే చెప్పినట్లుగా టోర్నీలోనే పటిష్టమైన బౌలింగ్ లైనప్ సన్రైజర్స్ సొంతమనడంలో సందేహం లేదు. పేసర్ భువనేశ్వర్ కుమార్ పది మ్యాచ్ల్లో 21 వికెట్లతో టోర్నలో అత్యుత్తమ బౌలర్గా కొనసాగుతున్నాడు. దీంతో ‘పర్పుల్ క్యాప్’ను తన సొంత చేసుకున్నాడు. అఫ్గాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ 12 వికెట్లతో సత్తాచాటాడు. ఆశిష్ నెహ్రా, సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, హెన్రిక్స్ ఆకట్టుకుంటున్నారు. గత సీజన్లో హైదరాబాద్, పుణే జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరుగగా.. ఇరుజట్లు చెరో మ్యాచ్లో విజయం సాధించాయి. మరోవైపు ఈ సీజన్లో పుణేలో జరిగిన మ్యాచ్లో ఇరుజట్లు పరస్పరం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెలరేగడంతో పుణే విజయం సాధించింది. దీంతో శనివారం మ్యాచ్లో ఎలాగైనా నెగ్గి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. అలాగే తనకెంతో అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో పుణేను కంగుతినిపించాలని కృతనిశ్చయంతో ఉంది. పుణే జోరు.. మరోవైపు ఈ సీజన్లో రైజింగ్ పుణే సూపర్జెయింట్ జోరుమీదుంది. ముఖ్యంగా పుణే ఆడిన చివరి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలో పటిష్టమైన కోల్కతా నైట్రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లపై గెలుపొందింది. ఓవరాల్గా 11 మ్యాచ్లాడిన పుణే ఏడు విజయాలు, నాలుగు పరజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చివరిమ్యాచ్ కోల్కతాపై రాహుల్ త్రిపాఠీ వన్మ్యాన్ షోతో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. సహచరులంతా విఫలమైనా వేళ.. ఈ సీజన్లో అరంగేట్రం చేసిన త్రిపాఠి సమయోచిత బ్యాటింత్తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో టోర్నీలో ఖరీదైన ఆటగాడు బెన్స్టోక్స్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో పుణే జట్టు ఫుల్జోష్లో ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ స్టీవ్ స్మిత్ (333 పరుగులు) జట్టు బ్యాటింగ్కు వెన్నెముకలా నిలిచాడు. గత రెండు మ్యాచ్ల్లో విఫలమైనా త్వరలో తను గాడిలో పడతాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక రాహుల్ త్రిపాఠి 9 మ్యాచ్ల్లో 352 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బెన్ స్టోక్స్ (244 పరుగులు), ఎంఎస్ ధోని (204 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. అజింక్య రహానే (226 పరుగులు), మనోజ్ తివారీ (190 పరుగులు) గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఇమ్రాన్ తాహిర్ అంచానలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్లాడిన తాహిర్ 17 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. జయదేవ్ ఉనాద్కట్ (12 వికెట్లు), బెన్ స్టోక్స్, డాన్ క్రిస్టియన్, శార్దుల్ ఠాకూర్ రాణిస్తున్నారు. మరోవైపు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మధ్య ఓవర్లలో పరుగులు నియంత్రిస్తున్నాడు. ఈ సీజన్లో హైదరాబాద్తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో పుణే అద్భుత విజ యం సాధించింది. శనివారం మ్యాచ్లో అదే ప్రదర్శన పునరావృతం చేయాలని ఆశిస్తోంది. అయితే సొంతగడ్డపై సత్తా చాటే హైదరాబాద్ను పుణేను ఎంతవరకు నిలువరిస్తుందో చూడాలి. -
దుమ్మురేపిన సన్ రైజర్స్..
► పంజాబ్ లక్ష్యం 208 ► అర్ధసెంచరీలు సాధించిన విలియమ్సన్, శిఖర్ ధావన్, వార్నర్ మోహాలీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, విలియమ్సన్ లు అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో హైదరాబాద్ పంజాబ్ కు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఓపెనర్లు డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ధాటిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సరికి జట్టు 60 పరుగులు చేసింది. అదే ఊపును కొనసాగిస్తూ వార్నర్ 25 బంతుల్లో, ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. అయితే మాక్స్ వెల్ 9 ఓవర్లో వార్నర్ 51( 4 ఫోర్లు, 4 సిక్సర్లు)ను అవుట్ చేయడంతో వీరద్దరీ 107 పరుగుల అజేయ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విలయమ్సన్ కూడా దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 9 ఫోర్లు ఒక సిక్సర్ తో 77 పరుగులు చేసిన ధావన్ మోహిత్ శర్మ బౌలింగ్ లో ఓ భారీషాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్(15) త్వరగా అవుటై మరోసారి నిరాశపర్చగా విలయమ్సన్, హెన్రిక్స్ తో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 బంతుల్లో విలయమ్సన్ అర్ధసెంచరీ సాధించడంతో హైదరబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో మాక్స్ వెల్ కు 2 వికెట్లు దక్కగా, మోహీత్ ఒక వికెట్ దక్కింది. -
హెన్రిక్స్ మెరుపులు.. పుణే లక్ష్యం 177
పుణే: రైజింగ్ పుణే, సన్ రైజర్స్ హైదరాబాద్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చివర్లో హెన్రిక్స్ మెరుపు బ్యాటింగ్ తో సన్ రైజర్స్ జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. పుణే బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. సన్ రైజర్స్ ఓపెనర్లు వార్నర్, ధావన్ లు నెమ్మదిగా ఆడుతూ తొలి వికెట్ కు 55 పరుగులు జోడించారు. ధావన్(31) అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన విలయమ్సన్ దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు నిలవలేక పోయాడు. గత మ్యాచ్ లో విలయ తాండవం చూపించిన విలయమ్సన్ ఈ మ్యాచ్ లో ఒక ఫోర్ ఒక సిక్స్ తో 21 పరుగులు చేసి డాన్ క్రిస్టియన్ కు వికెట్ల ముందు దొరికి పోయాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రీక్స్ తో వార్నర్ స్కోరు బోర్డును పరుగెత్తించాలని ప్రయత్నించిన పుణే బౌలర్ల కట్టు దిట్టమైన బంతులకు నిలదొక్కుకో లేకపోయింది. ఉనద్కత్ 17 ఓవర్లో వార్నర్ (43) ను అవుట్ చేసి 44 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జంటను విడదీసాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాతో హెన్రిక్స్ దాటిగా ఆడాడు. ఉనద్కత్ వేసిన 19 ఓవర్లలో రెండు సిక్స్ లు కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. ఈ దశలో 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో హెన్రిక్స్ హాప్ సెంచరీ చేశాడు. చివరి ఓవర్లలో 15 పరుగులు రావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. -
ఐపీఎల్ కెప్టెన్ల పర్ఫామెన్స్ రిపోర్టు
హైదరాబాద్: ఐపీఎల్-10 సీజన్లో పాయింట్ల పట్టికను ఓ సారి పక్కన పెట్టి కెప్టెన్ల ప్రదర్శనను పరిశీలిస్తే.. కొంత మంది కెప్టెన్లు బాగా ఆడినా జట్టును గెలిపించలేక పోతున్నారు. మరికొందరూ నాయకులు ఆడకున్నా గెలిచి పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు జరిగన మ్యచ్ ల్లో ప్రతి కెప్టెన్ ప్రదర్శన పరిశీలిస్తే సన్ రైజర్స్ కెప్టెన్ డెవిడ్ వార్నర్ అందరీ నాయకుల్లో కంటే ముందున్నాడు. ఇప్పటికే అధిక పరుగులతో ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్నా జట్టును మాత్రం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుప లేక పోతున్నాడు. మరో స్కిప్పర్ రోహిత్ శర్మ నిలకడలేని ఫామ్ తో సతమవుతున్నా ముంబై ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శనతో విజయాలందుకుంటోంది. ఇలా ఓక్కోకెప్టెన్ వ్యక్తిగత రికార్డును పరిశీలిద్దాం. 1. డేవిడ్ వార్నర్, సన్ రైజర్స్ హైదరాబాద్: ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు 5 మ్యాచ్ ల్లో 137 స్ట్రైక్ రేట్ తో 235 పరుగులు చేసి అగ్రస్దానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక స్కోరు 76. ఇక జట్టు విజయాల పరంగా 5 మ్యాచ్ ల్లో 3 నెగ్గి 6 పాయింట్లతో మూడో స్దానంలో కొనసాగుతుంది. 2. గౌతమ్ గంభీర్, కోల్ కతా నైట్ రైడర్స్: ఆరేంజ్ క్యాప్ అందుకున్నా ఎక్కువ సేపు ఉండలేదు. 5 మ్యాచ్ ల్లో 142 స్ట్రైక్ రేట్ తో 196 పరుగులు చేసి అత్యధిక పరుగుల లిస్టులో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇక జట్టును తన బ్యాటింగ్ తో విజయాల వైపు పరుగులెత్తిస్తున్నాడు.అత్యధిక స్కోరు 76 నాటౌట్. ఐదు మ్యాచ్ లు ఆడిన కోల్ కతా నాల్గు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 3. స్టీవ్ స్మిత్, రైజింగ్ పుణే: ధోని కెప్టెన్సీకి ఎసరు పెట్టిన ఈ ఆసీస్ ఆటగాడు తన దూకుడైన బ్యాటింగ్ తో జట్టు ను ముందుకు నడింపించాలనుకున్నా ఇతరుల సాయం అందక జట్టు వరుస పరాజయాలను మూటగట్టుకుంది. నాలుగు మ్యాచ్ లు ఆడిన స్మిత్ 133 స్ట్రైక్ రేట్ తో 180 పరుగులు చేశాడు.అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఇక పుణే 5 మ్యాచ్ లు ఆడి రెండు మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నాలుగు మ్యాచ్ లకు స్మిత్ కెప్టెన్ గా వ్యవహిరించగా మరో మ్యాచ్ కు రహానే సారథ్యం వహించాడు. 4. సురేశ్ రైనా, గుజరాత్ లయన్స్: టీ20లు అంటే చెలరేగే సురేశ్ రైనా తన స్థాయి తగ్గ ప్రదర్శన ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక అర్ద సెంచరీ చేసినా, అది సురేశ్ రైనా స్థాయిని కనబర్చలేక పోయింది. 5 మ్యాచ్ లు ఆడిన రైనా 134 స్ట్రైక్ రేట్ తో 159 పరుగులు చేశాడు.అత్యధిక స్కోరు 68 నాటౌట్. ఇక ఐదు మ్యచ్ ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన లయన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్తానంలో నిలిచింది. గత సీజన్ లో మొదటి నుంచి అగ్రస్థానంలో కొన సాగిన లయన్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో అపజయాలు మూటగట్టుకుంది. 5.విరాట్ కోహ్లీ, బెంగళూరు రాయల్ చాలెంజర్స్: ఈ సీజన్లో లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాడు విరాట్ కోహ్లీ. భుజ గాయంతో ప్రారంభ మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే. కేవలం మూడు మ్యాచ్ లు ఆడిన కోహ్లీ తన బ్యాటింగ్ శైలి మాత్రం ఏ మాత్రం మారలేదు. అదే దూకుడు బ్యాటింగ్ తో రెండు అర్ధ సెంచరీలతో 154 పరుగులు చేశాడు. అయితే మిగతా ఆటగాళ్లు విఫలమవడం, బౌలింగ్ విభాగం బలంగా లేకపోవడం కోహ్లీని కలవరపెడుతున్నాయి. వ్యక్తిగతంగా దూకుడు ప్రదర్శిస్తున్నా జట్టుకు విజయాలు అందించడంలో విఫలమవుతున్నాడు. నాయకత్వం వహించిన మూడు మ్యాచ్ ల్లో బెంగళూరు కేవలం ఒకే మ్యాచ్ నెగ్గింది. మొత్తం 6 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 6 స్థానంలో కొనసాగుతుంది. మిగతా మూడు మ్యాచ్ లకు వాట్సన్ నేతృత్వం వహించాడు. 6. గ్లేన్ మాక్స్ వెల్, కింగ్ప్ ఎలెవెన్ పంజాబ్: ఈ సీజన్లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన మాక్స్ వెల్ పంజాబ్ కు వరుస విజయాలు అందించాడు. ఎక్కువ పరుగులు చేయకున్న వేగమైన బ్యాటింగ్ శైలితో అభిమానులను అలరిస్తున్నాడు. మూడు ఇన్నింగ్స్ లు ఆడిన మాక్స్ వెల్ 174 స్ట్రైక్ రేట్ తో 124 పరుగులు చేశాడు. ఇక పంజాబ్ 5 మ్యాచ్ ల్లో 2 నెగ్గి పాయింట్ల పట్టికలో ఐదో స్దానంతో కొనసాగుతుంది. 7. రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ నిలకడ లేని ఫామ్ తో సతమతమవుతున్నాడు. 5 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ కేవలం 49 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్ ల్లో కేవలం 9 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 40 నాటౌట్. ఇక ముంబై మాత్రం విజయాలతో దూసుకుపోతుంది. ముంబై ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. 8. జహీర్ ఖాన్, ఢిల్లీ డేర్ డేవిల్స్: ఐపీఎల్-10 అన్ని జట్ల కెప్టెన్లు బ్యాటర్ప్ అయితే, జహీర్ మాత్రం బౌలర్. ఇక తన బౌలింగ్ ప్రదర్శనతో జహీర్ ఆకట్టుకుంటున్నాడు. కీలక వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాలుగు మ్యాచ్ లు ఆడిన జహీర్ 7 వికెట్లు పడగొట్టాడు. ఇక ఉత్తమ బౌలింగ్ 3/29. నాలుగు మ్యాచ్ ల్లో ఢిల్లీ 2 గెలిచి నాలుగో స్థానంలో కొన సాగుతుంది. -
మేమిద్దరం మిత్రులమే!
హైదరాబాద్: ఇటీవల ముగిసిన భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొనసాగిన మాటల యుద్ధాలు, కవ్వింపులు ఇంకా ఎవరూ మరిచిపోలేదు. రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో వార్నర్ అవుటయ్యాక కోహ్లి తన భుజంపై చేయి పెట్టి చేసిన సైగ కూడా అందరికీ గుర్తుండిపోయింది. అయితే వార్నర్ మాత్రం అదంతా ఆటలో భాగమేనని, తమ మధ్య మంచి స్నేహం ఉందని చెబుతున్నాడు. ‘ఐపీఎల్ ప్రారంభోత్సవం సమయంలో మేమిద్దరం ఎంతో మాట్లాడుకున్నాం. అదృష్టవశాత్తూ మా మధ్య మంచి స్నేహమే ఉంది. ఇద్దరం మెసేజ్లు కూడా పంపించుకున్నాం. ఈ విషయంలో కోహ్లి స్పందన కూడా బాగుంది. మైదానంలో గెలవాలనే కసిలో కొన్ని ఘటనలు జరుగుతాయి. ఆ కొద్దిసేపు ఉద్వేగాలను అదుపు చేయలేం. ఆ తర్వాత అంతా సాధారణంగా మారిపోతుంది’ అని వార్నర్ అభిప్రాయపడ్డాడు. -
'ధర్మశాల' దక్కేదెవరికో?
-
'ధర్మశాల' దక్కేదెవరికో?
నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ నిర్ణయాత్మక టెస్టు ►ఒత్తిడిలో ఆతిథ్య జట్టు ►కోహ్లి ఆడేది అనుమానమే ►ఇషాంత్ స్థానంలో షమీ! నిజానికి సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు ఇలాంటి ‘కష్టం’ ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. 4–0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపించాయి. అయితే అంచనాలు తారుమారై ఇప్పుడు భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా నుంచి లాగేసుకునేందుకు ధర్మశాలలో నేటి నుంచి జరిగే చివరి టెస్టును నెగ్గడం తప్పనిసరి. దీనికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి భుజం నొప్పి నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతను ఆడేది అనుమానంగా మారింది. ఇదే జరిగితే బరిలోకి దిగకముందే భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే.. ఏదేమైనా ఈ మ్యాచ్తో పాటు సిరీస్ నెగ్గి సొంతగడ్డపై సాగిన సుదీర్ఘ టెస్టు సీజన్ను విజయవంతంగా ముగించాలని భారత్ కోరుకుంటోంది. ఇక మూడో టెస్టులో భారత్ విజయావకాశాలను సమర్థంగా అడ్డుకున్న ఆస్ట్రేలియా జట్టు ఫుల్ జోష్లో ఉంది. నైతికంగా తామే గెలిచామనే భావనతో చివరి టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ప్యాట్ కమిన్స్, హేజల్వుడ్ దూకుడుకు ఇక్కడి బౌన్సీ పిచ్ సహకారం అందిస్తే భారత్కు తిప్పలు తప్పవు. వార్నర్ మినహా అంతా ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే్చ అంశం. దీంతో 2004 అనంతరం భారత గడ్డపై ఓ టెస్టు సిరీస్ను దక్కించుకోవడంతో పాటు వరుసగా మరోసారి ఈ ట్రోఫీని గెల్చుకోవాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది. ధర్మశాల: ఆటకన్నా వివాదాలతో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రస్తుత బోర్డర్–గావస్కర్ టెస్టు సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు నేటి (శనివారం) నుంచి బరిలోకి దిగబోతున్నాయి. ఈ హోరాహోరీ పోరుకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియం ‘తొలిసారి’గా వేదిక కానుంది. ఈ సిరీస్కు ముందు భారత జట్టు స్వదేశంలో అద్భుత ఆటతీరుతో విజయయాత్ర కొనసాగించింది. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్లను మట్టికరిపించి అజేయంగా నిలిచింది. తాజాగా ఆస్ట్రేలియా జట్టును కూడా ఇదే కోవలోకి చేర్చాలనే కసితో విరాట్ సేన ఉంది. అయితే 1–1తో సిరీస్ సమంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఈ కీలక మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడేది అనుమానంగా మారింది. భుజం నొప్పితో బాధపడుతున్న అతను మ్యాచ్ ఫిట్నెస్ కలిగి ఉన్నాడా? అనేది సంశయాత్మకంగా ఉంది. ధర్మశాలలో గురువారం జట్టు ప్రాక్టీస్ సెషన్కు అతను వచ్చినా బ్యాటింగ్ చేయలేదు. ఇప్పటికే అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ను బ్యాకప్గా తీసుకున్నారు. మరోవైపు ఆసీస్ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సిరీస్ గెల్చుకోవాలనే ఆలోచనలో ఉంది. తొలి టెస్టులో ఘనవిజయం తర్వాత రెండో టెస్టులో ఆజట్టు చతికిలపడినా రాంచీ మ్యాచ్లో పుంజుకుంది. చివరి రోజు అద్భుత బ్యాటింగ్తో భారత విజయాన్ని అడ్డుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే కీలక పోరు అభిమానులను ఆకట్టుకోనుంది. కోహ్లి పరిస్థితేమిటి? కీలకమైన చివరి టెస్టులో కోహ్లి ఆడతాడా.. లేదా? అనే విషయంలో ఇప్పటిదాకా స్పష్టత కనిపించడం లేదు. తాను మాత్రం పూర్తి ఫిట్నెస్ లేకుండా బరిలోకి దిగనని తేల్చాడు. మ్యాచ్కు కొద్ది గంటల ముందు ఈ విషయం తేలే అవకాశం ఉంది. శుక్రవారం కొద్దిసేపు నెట్స్లో ప్రాక్టీస్ చేసినా ఫిజియో నిర్ణయం మేరకు నడుచుకుంటానని తేల్చాడు. అయితే ప్రత్యర్థికి మానసికంగా ఎలాంటి పైచేయి ఇవ్వకూడదనే ఆలోచనలో టీమిండియా మేనేజిమెంట్ ఉంది. అందుకే అతను మీడియా సమావేశానికి కూడా హాజరయ్యాడు. ఒకవేళ కోహ్లి ఆడలేకపోతే రహానే జట్టుకు నాయకత్వం వహిస్తాడు. బ్యాటింగ్లో మురళీ విజయ్ ఓపెనర్గా విజయవంతమవుతున్నాడు. అయితే తను శుక్రవారం ప్రాక్టీస్కు హాజరుకాకపోగా, అభినవ్ ముకుంద్ ఎక్కువసేపు శిక్షణ సాగించాడు. అలాగే రహానే, కరుణ్ నాయర్ కూడా కీలక సమయంలో బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. చతేశ్వర్ పుజారా ఈ సిరీస్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రాంచీలో డబుల్ సెంచరీ అతడి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అటు కీపింగ్లో, బ్యాటింగ్లో చెలరేగడం అనుకూలాంశం. బ్యాకప్గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆసీస్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. తుది జట్టులో బరిలోకి దిగితే తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇదిలావుండగా జట్టు ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భావిస్తే కరుణ్ నాయర్ తప్పుకోవాల్సి వస్తుంది. ఉమేశ్ పేస్ బాధ్యతలు మోస్తున్నాడు. ఇషాంత్ ఇప్పటిదాకా మూడు వికెట్లు మాత్రమే తీయగా తన స్థానంలో జట్టులో చేరిన మొహమ్మద్ షమీ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా జట్టుకు ఉపయోగపడుతున్నారు. జోష్లో ఆస్ట్రేలియా... ఆసీస్ జట్టులో ఆందోళన ఏదైనా ఉందంటే అది ఓపెనర్ డేవిడ్ వార్నర్ వైఫల్యమే. మిగతా అన్ని అంశాల్లోనూ ఈ జట్టు పటిష్ట స్థితిలోనే ఉంది. కెప్టెన్ స్మిత్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి ఊపు మీదున్నాడు. మ్యాట్ రెన్షా చక్కటి ఆటతీరుతో ప్రశంసలందుకుంటున్నాడు. హ్యాండ్స్కోంబ్ మూడో టెస్టులో జట్టును ఆదుకున్న తీరు అపూర్వం. ఇక వార్నర్ ఒక్కడు ఫామ్లోకి వస్తే కీలక టెస్టులో భారత్కు ఇబ్బంది తప్పదు. మ్యాక్స్వెల్ తాను నిదానంగా కూడా ఆడగలనని సెంచరీతో నిరూపించుకున్నాడు. అయితే పిచ్ను బట్టి బౌలింగ్లో స్పిన్నర్ ఒకీఫ్ను తప్పించి అతడి స్థానంలో పేసర్ జాక్సన్ బర్డ్ను తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బౌన్సీ వికెట్ సిద్ధమైతే ప్యాట్ కమిన్స్, హేజల్వుడ్, బర్డ్ భారత బ్యాటింగ్ను ఇబ్బంది పెట్టవచ్చు. అయితే రాంచీలో ఆడిన జట్టునే కొనసాగించేందుకు ఆసీస్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. ‘తొలి’ ఓటమిని చెరిపేస్తారా..? అసలే సిరీస్ను నిర్ణయించే కీలక టెస్టు మ్యాచ్ ఆడబోతున్న భారత్కు ఇక్కడి ధర్మశాల స్టేడియంలో తమ రికార్డు భయపెడుతోంది. ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చిన తొలి అంతర్జాతీయ వన్డే, టి20ల్లోనూ భారత జట్టుకు ఓటమి ఎదురుకావడం ఇందుకు కారణం. 2013 ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో... 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20లో భారత్ పరాజయం పాలైంది. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ జరగబోయే అరంగేట్రం టెస్టులో భారత్ మెరుగ్గా ఆడి గత చరిత్రను తిరగరాస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. పిచ్, వాతావరణం గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో పిచ్ ఎక్కువగా పేసర్లకు అనుకూలించింది. అయితే గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్లో స్పిన్నర్లు విశేషంగా రాణించారు. ప్రస్తుతానికైతే పిచ్పై పచ్చిక ఎక్కువగానే కనిపిస్తోంది. మ్యాచ్ జరిగే రోజు ఉదయం కట్ చేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే స్పిన్నర్లు కూడా కీలకంగా మారతారు. రెండు రోజుల అనంతరం వర్ష సూచనలున్నాయి. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్)/అయ్యర్, విజయ్/అభినవ్ ముకుంద్, రాహుల్, రహానే, పుజారా, కరుణ్ నాయర్, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్/షమీ, ఉమేశ్ యాదవ్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, రెన్షా, షాన్ మార్‡్ష, హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్వెల్, వేడ్, ఒకీఫ్, కమిన్స్, లయన్, హేజల్వుడ్. ⇒ ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
కోహ్లి ఆట కావాలి!
►వరుసగా విఫలమవుతున్న భారత కెప్టెన్ ►చివరి టెస్టులోనైనా రాణించేనా! మాటకు మాట జవాబు... ప్రత్యర్థికి పోటీగా ఎదురుదాడి... మీడియా సమావేశాల్లో కూడా దూకుడు... ఆస్ట్రేలియాలాంటి జట్టుతో తలపడుతున్న సమయంలో ఒక కెప్టెన్గా ఎలా ఉండాలో విరాట్ కోహ్లి అన్నీ చేసి చూపించాడు. స్మిత్ దొంగతనాన్ని పట్టుకోవడంనుంచి వార్నర్ను ఆటపట్టించడం వరకు అన్నీ అయిపోయాయి. కానీ కోహ్లినుంచి జట్టు, అభిమానులు ఆశించే ఆట మాత్రం మూడు టెస్టులు ముగిసినా కనిపించలేదు. ఆసీస్తో పోరుకు ముందు వరకు వరుసగా నాలుగు సిరీస్లలో డబుల్ సెంచరీలతో చెలరేగిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్లలో కలిపి కనీసం అర్ధ సెంచరీ కూడా పూర్తి చేయలేదు! అటు వైపు తీవ్ర ఒత్తిడిలో కూడా ప్రత్యర్థి కెప్టెన్ పరుగుల వేటలో దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం పూర్తిగా వెనుకబడిపోయాడు. ఇతర బ్యాట్స్మెన్ రాణిస్తున్నా కోహ్లి వైఫల్యం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. అద్భుతంలా సాగిన ఈ సీజన్లో చివరి టెస్టులోనైనా తన అసలు సత్తా ప్రదర్శించే కోహ్లి ఈ టెస్టును బ్యాటింగ్తోనూ చిరస్మరణీయం చేసుకుంటాడా అనేది ఆసక్తికరం. సాక్షి క్రీడా విభాగం : బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టుల ఫలితాలు, వివాదల సంగతి పక్కన పెడితే ఆస్ట్రేలియా జట్టు ఒక విషయంలో మాత్రం పూర్తిగా సఫలమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడైన విరాట్ కోహ్లిని పరుగులు చేయకుండా ఆ జట్టు నిరోధించగలిగింది. 0, 13, 12, 15, 6... ఈ సిరీస్లో కోహ్లి చేసిన స్కోర్లు ఇవి. ఈ సిరీస్కు ముందు అద్భుతమైన ఆటతో రికార్డులు తిరగరాసిన కోహ్లి అనూహ్య ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2014లో ఇంగ్లండ్లో ఘోర వైఫల్యంనుంచి కోలుకొని తన ఆటలో మార్పులు చేసుకున్న అనంతరం కోహ్లి కెరీర్లో ఇంత గడ్డు దశ ఎప్పుడూ రాలేదు. బ్యాట్స్మెన్ అప్పుడప్పుడు ఫామ్ కోల్పోవడం సాధారణమే అని సర్ది చెప్పుకున్నా... కోహ్లి స్థాయి క్రికెటర్ అదీ సొంత గడ్డపై ఇలా ఇబ్బంది పడటం మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అతనికంటే ఎక్కువగా జట్టు భారాన్ని మోస్తున్న స్మిత్ అలవోకగా పరుగులు సాధిస్తుండగా, కోహ్లి మాత్రం తడబడ్డాడు. క్రీజ్లోనే తడబాటు... పుణే టెస్టు తొలి ఇన్నింగ్స్లో దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి స్లిప్లో క్యాచ్ ఇవ్వడం ఒక్కసారిగా మూడేళ్ల క్రితంనాటి కోహ్లిని గుర్తుకు తెచ్చింది. రెండో ఇన్నింగ్స్లో కూడా బంతి వదిలేసి బౌల్డ్ కావడంపై క్రికెట్ విశ్లేషకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బెంగళూరు టెస్టులో రెండు సార్లూ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం అయితే అతని ఫుట్వర్క్ లోపాలను చూపించింది. గతంలో ఇదే తరహా సమస్య వచ్చినప్పుడు అతను సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేయడంతో పాటు తన లోపాన్ని సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్లకు సన్నద్ధమయ్యాడు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కోహ్లి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అయితే రాంచీ టెస్టుకు ముందు చాలా విరామం లభించినా కోహ్లి దీనిపై దృష్టి పెట్టినట్లు లేదు. తన స్థాయికి ఫామ్లోకి తిరిగి రావడం పెద్ద సమస్య కాకపోవచ్చని అతను భావించి ఉంటాడు. మూడో టెస్టులో కూడా కొత్త బంతిని డ్రైవ్ చేయబోయి స్లిప్లోనే క్యాచ్ ఇవ్వడం కోహ్లి సన్నాహకాల లోపాలను బయట పెట్టింది. ఒక సిరీస్ వైఫల్యం గొప్ప ఆటగాడి స్థాయిని తగ్గించకపోవచ్చు గానీ జట్టు బ్యాటింగ్కు మూలస్థంభంలాంటి ఆటగాడు మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశించడంలో తప్పు లేదు. ఒత్తిడి పెంచుకున్నాడా... రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో కోహ్లి... ఆసీస్ ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డాడు. అద్భుతమైన బ్యాటింగ్తో నాలుగు టెస్టులలో నాలుగు సెంచరీలు సాధించడంతో పాటు మాటల యుద్ధంలో కూడా కంగారూలతో సమానంగా బదులిచ్చాడు. ఈ సారి ఆ జట్టు భారత్కు వచ్చినప్పుడు కూడా తన దూకుడును ఎక్కడా తగ్గించవద్దని, పెద్దగా బలంగా లేని ఆసీస్పై అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించాలని కూడా భావించి ఉంటాడు. మాటల దాడికి కూడా కోహ్లి ముందే సన్నద్ధమైనట్లున్నాడు. అదే మైండ్సెట్తో కోహ్లి తన బ్యాటింగ్పై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాడేమో అనిపిస్తోంది. మీడియాలో ఏం రాసినా పట్టించుకోను, అది వారి ఉద్యోగం అంటూ ఒక వైపు చెబుతున్నా... పుణే ఫలితం కోహ్లిపై ప్రతికూల ప్రభావం చూపించింది. రివ్యూ వివాదం విషయం, రాంచీ టెస్టు తర్వాత ఫిజియోపై వ్యాఖ్యల విషయంలో కూడా కోహ్లి అవసరానికి మించిన దూకుడు కనబర్చాడని, ఇది అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని వ్యాఖ్యలు వినిపించాయి. ఒక కెప్టెన్గా ఉంటూ వికెట్ తీసినప్పుడు వార్నర్కు భుజం చూపిస్తూ చేసిన సంజ్ఞను వీవీఎస్ లక్ష్మణ్ కూడా తప్పుపట్టారు.ఇక అర్థం పర్థం లేనివే అయినా... ఆస్ట్రేలియా మీడియా వార్తలు కూడా కోహ్లి దాకా చేరి అతని ఏకాగ్రతను దెబ్బ తీసినట్లున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలోనైనా కోహ్లి తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాలని అంతా కోరుకుంటున్నారు. గాయం తగ్గలేదా..! రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గురువారం భారత జట్టు నెట్ సెషన్కు అతను వచ్చినా బ్యాటింగ్ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. అతని భుజానికి ఇంకా బ్యాండేజీ కనిపిస్తోంది. కొద్ది సేపు వార్మప్లో పాల్గొన్న అనంతరం ఫీల్డింగ్లో అండర్ ఆర్మ్ త్రోలు మాత్రం విసిరాడు. మొత్తంగా తన భుజంపై ఎలాంటి ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు కోహ్లి ప్రయత్నించాడు. అయితే ముందు జాగ్రత్త కోసమే అతను బ్యాటింగ్కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. నాలుగో టెస్టుకు ముందు రోజు శుక్రవారం జరిగే ప్రాక్టీస్ సమయంలో కోహ్లి గాయంపై మరింత స్పష్టత రావచ్చు. అయితే రాంచీలోనూ తన గాయంపై ఉన్న సందేహాలను తొలగిస్తూ బ్యాటింగ్కు దిగిన విరాట్ స్వభావం గురించిన తెలిసినవారు సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టుకు అతను దూరంగా ఉండే అవకాశమే లేదని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా అయ్యర్... కోహ్లి గాయం నేపథ్యంలో బీసీసీఐ ముందు జాగ్రత్తగా మరో బ్యాట్స్మెన్ను ఎంపిక చేసింది. ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ శుక్రవారం జట్టుతో చేరతాడు. ధర్మశాలలాంటి చోటుకు చివరి నిమిషంలో చేరుకోవడం కష్టం కాబట్టి, మరో ఆటగాడు అందుబాటులో ఉంటే మంచిదని భావించి అయ్యర్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. గత ఏడాది రంజీ ట్రోఫీలో 1321 పరుగులతో టాపర్గా నిలిచిన అయ్యర్, ఈ సీజన్లో కూడా ముంబై తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. ఈ సిరీస్లో తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో అయ్యర్ అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. -
కోహ్లి కసిగా...
భుజం గాయంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఎక్కువ భాగం పెవిలియన్కే పరిమితమైన కోహ్లి రెండో ఇన్నింగ్స్లో ఆరంభం నుంచే జట్టును నడిపించాడు. అతను మైదానంలో ఉంటే జట్టులో ఉండే ఉత్సాహమే వేరు. జడేజా బౌలింగ్లో వార్నర్ బౌల్డ్ కాగానే విరాట్ తన కసినంతా ప్రదర్శించాడు. గాయమైన తన కుడి భుజంపై చేయి వేసి చూపిస్తూ ఆవేశంగా అరిచాడు. మూడో రోజు తనను వ్యంగ్యంగా అనుకరించిన మ్యాక్స్వెల్కు ఈ రకంగా అతను బదులిచ్చాడు. అంతకుముందు బ్యాటింగ్లో భారత్ దూసుకుపోతుండటంతో ఒక దశలో హాజల్వుడ్ స్లెడ్జింగ్కు కూడా దిగాడు. అయితే పుజారా చాలా ప్రశాంతంగా ‘వెళ్లి స్కోరు బోర్డు చూసుకో’ అని ఒకే మాటలో జవాబిచ్చేశాడు. భారత్ 4, ఆసీస్ 0 సిరీస్ ఆరంభం నుంచి భారత్కు కలిసిరాని డీఆర్ఎస్ నాలుగో రోజు మాత్రం బాగా అచ్చివచ్చింది. ఏకంగా నాలుగు సార్లు రివ్యూ భారత్కు అనుకూలంగా రావడం విశేషం. ఇందులో రెండు సార్లు భారత్ రివ్యూ చేసి సానుకూల ఫలితం పొందగా, మరో రెండు సార్లు ఆసీస్ రివ్యూ చేసి భంగపడింది. ఆటలో మరో ఆసక్తికర ఘటన కూడా జరిగింది. పుజారా 142 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ క్యాచ్ కోసం హాజల్వుడ్ అప్పీల్ చేశాడు. అవుట్గా ప్రకటిస్తున్నట్లు అంపైర్ క్రిస్ గఫానీ తన వేలు చాలా వరకు పైకెత్తారు. అయితే ఆసీస్ ఆటగాళ్ల అప్పీల్లో పెద్దగా బలం లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. దాంతో ఒక్కసారిగా ఆలోచన మార్చుకొని చేతిని తన నెత్తి మీదికి పోనిచ్చి హ్యాట్ను సవరించుకోవడం విశేషం! -
ఆసీస్ కవ్వింపులకు కోహ్లీ చురక..
రాంచీ: భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టులో కవ్వింపులకు పాల్పడ్డ ఆసీస్ ఆటగాళ్లకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చురక అంటించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో జడేజా బౌలింగ్లో డేవిడ్ వార్నర్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ఆసీస్ ఆటగాళ్ల వెటకారాలకు కొంచెం కారం అద్ది కోహ్లీ రుచి చూపించాడు. తొలిరోజు ఫీల్డీంగ్ చేస్తూ గాయపడ్డ కోహ్లీ , భుజం నొప్పి బాధతో కుడి చేతిని పట్టకుంటూ మైదానం వీడాడు. అయితే కోహ్లి రెండోరోజు మైదానంలోకి అడుగుపెట్టలేదు. మూడో రోజు బ్యాటింగ్కు వచ్చిన కోహ్లిని స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజం నొప్పిలా చేతిని పట్టుకొని కోహ్లీ గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎగతాళి చేశాడు. మరో ఆటగాడు మూడో టెస్టులోనే ఆరంగ్రేటం చేసిన మ్యాక్స్వెల్ సైతం పుజారా కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆపి భుజం పట్టుకొని కోహ్లీని ఎగతాళి చేశాడు. ఇవన్నీ మనసులో ఉంచుకున్న కెప్టెన్ కోహ్లీ అదే రీతిలో సమాధానం ఇచ్చాడు. వార్నర్(14) పరుగుల వద్ద ఔటవ్వడంతో తన భుజాన్ని తడుముతూ మరికొంచె ఎక్కువగా ఎటకారం చూపించాడు. అయితే ఈ వీడియోని కోహ్లీ అభిమానులు ట్వీట్టర్, ఫేస్బుక్లో షేర్చేస్తూ కోహ్లీకి మద్దతు తెలిపారు. ఇక మ్యాక్స్వెల్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు ఎలా ఎగతాళి చేస్తాడో చూడాలి.. -
వార్నర్పై ప్రతీకారం తీర్చుకున్న హర్భజన్
బెంగళూరు: భారత్- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో మాటల యుద్దమే కాదు.. ట్వీట్టర్ వార్ నడుస్తుంది. ఆసీస్, భారత్ ఆటగాళ్లు పరస్పరం తమ అభిప్రాయాలను ట్వీట్టర్లో పేర్కొంటున్నారు. బెంగళూరు టెస్టులో భారత్ సంచలన విజయం నమోదు చేయడంతో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్కు కౌంటర్ ట్వీట్ చేశాడు. పూణే టెస్టులో భారత ఓటమిని గుర్తు చేస్తూ వార్నర్ చేసిన ట్వీట్కు ప్రతికారంగా బజ్జీ ఫోటోతో బదులిచ్చాడు. హర్భజన్ సింగ్ గతంలో ఇప్పుడున్న ఆసీస్ జట్టు బలహీనమైనదని, భారత్ ఖచ్చితంగా 4-0 క్లీన్ స్వీప్చేస్తుందని తెలిపాడు. అయితే భారత్ అనుహ్యంగా పుణే టెస్టులో 333 పరుగులు తేడాతో ఓడిపోవడంతో వార్నర్, ఆసీస్ అభిమానులు బజ్జీ అన్న మాటలను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. బెంగళూరు టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంతో బజ్జీ ‘వెల్డెన్ మై బాయిస్, ఇదే ఊపుతో రెండు టెస్టుల్లో విజయం సాధించాలి’ అని ఓ ఫోటోతో రివేంజ్ ట్వీట్ చేశాడు. IND-1 AUS-1 welldone my boys @BCCI time 2 go up in th series -
వార్నర్ తొమ్మిదో 'సారీ'
బెంగళూరు: భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ నానా తంటాలు పడుతున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరిన వార్నర్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అతని బౌలింగ్ లోనే నిష్క్రమించి నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్ 10 ఓవర్ లో అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. తద్వారా 13 టెస్టుల్లో తొమ్మిదిసార్లు అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ అవుటయ్యాడు. దాంతో తన టెస్టు కెరీర్ లో ఒకే ఆటగాడ్ని అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనతను అశ్విన్ సాధించాడు. కాగా, అదే సమయంలో ఒకే బౌలర్ కు తన వికెట్ ను అత్యధిక సార్లు సమర్పించుకున్న అప్రథను వార్నర్ సొంతం చేసుకోవడం ఇక్కడ గమనార్హం. భారత్ విసిరిన 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 42 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయింది. తొలి వికెట్ గా రెన్ షా(5) అవుట్ కాగా, రెండో వికెట్ గా వార్నర్(17) పెవిలియన్ చేరాడు. -
కోహ్లి అండగా నిలవడం వల్లే...
కెప్టెన్ విరాట్ కోహ్లి ఇచ్చిన స్వేచ్ఛ కారణంగానే టెస్టుల్లో తనలోని అత్యుత్తమ ప్రదర్శన బయటపడుతోందని భారత పేసర్ ఉమేశ్ యాదవ్ వ్యాఖ్యానించాడు. బౌలర్ చేతికి బంతిని ఇవ్వగానే, ఫీల్డింగ్ ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కూడా కోహ్లి ఇస్తాడని, ఆ ప్రణాళిక విఫలమైతే మరో వ్యూహంతో అండగా నిలిచేందుకు తాను ముందుకు వస్తాడని ఉమేశ్ అన్నాడు. దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో విసిరే సంప్రదాయక అవుట్ స్వింగర్ తన బలమని, ఇప్పుడిప్పుడే ఇన్స్వింగ్, రివర్స్ స్వింగ్పై పట్టు పెంచుకుంటున్నానన్న ఉమేశ్... ఆసీస్ ఓపెనర్ వార్నర్కు బౌలింగ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నానన్నాడు. -
ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్...
-
ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్...
- ఆస్ట్రేలియా ఆటగాళ్ల సుదీర్ఘ సాధన - కోహ్లీ, అశ్విన్లను ఉద్దేశించి వార్నర్ ఆసక్తికర కామెంట్స్ ముంబై: భారత గడ్డపై భారీ సమరానికి సన్నద్ధమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బుధవారం తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టింది. జట్టు సభ్యులంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కీలక ఆటగాళ్లు స్మిత్, వార్నర్, ఖాజా, మ్యాక్స్వెల్ నెట్స్లోని వేర్వేరు వికెట్లపై తమ ప్రాక్టీస్ను కొనసాగించగా, మరి కొందరు స్లిప్ క్యాచింగ్లో పాల్గొన్నారు. ముఖ్యంగా స్థానిక స్పిన్ బౌలర్లతో పాటు జట్టు స్పిన్ కన్సల్టెంట్ శ్రీధరన్ శ్రీరామ్ బౌలింగ్లో ఆసీస్ క్రికెటర్లంతా స్పిన్ను ఆడటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ ‘ఎ’తో ఆస్ట్రేలియా తలపడుతుంది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు ఈ నెల 23 నుంచి పుణేలో జరుగుతుంది. అశ్విన్తో పోరుకు సిద్ధం...: భారత్తో సిరీస్ అంటే ఆసీస్కు అశ్విన్ రూపంలోనే అగ్నిపరీక్ష ఎదురవుతోంది. నాలుగేళ్ల క్రితం 0–4తో కంగారూలు చిత్తుగా ఓడిన సిరీస్లో అశ్విన్ 29 వికెట్లతో చెలరేగాడు. ఈసారి భారత ఆఫ్ స్పిన్నర్ను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధమై వచ్చామని ఆ జట్టు అగ్రశ్రేణి బ్యాట్స్మన్ వార్నర్ అన్నాడు.‘ప్రత్యర్థి బ్యాట్స్మన్ మనసును చదివి బౌలింగ్ చేసే అశ్విన్ లాంటి బౌలర్నునేను గౌరవిస్తా. అతని బౌలింగ్లో జాగ్రత్తగా ఆడటం అవసరం. అయితే అశ్విన్ కోసం నా వద్ద ప్రత్యేక ప్రణాళిక సిద్ధంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు’ అని వార్నర్ చెప్పాడు. కోహ్లితో స్లెడ్జింగ్ అంటే వ్యతిరేక ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్న వార్నర్... మాటల యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో గొప్ప ఆటగాళ్లకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. స్లెడ్జింగ్ విషయంలో వార్నర్తో అతని సహచరుడు గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఏకీభవించాడు. అందుకే కోహ్లితో స్లెడ్జింగ్కు దిగే సాహసం చేయనని స్పష్టం చేశాడు. ‘కోహ్లిని నేను ఏమీ అనదల్చుకోలేదు. అది మాత్రం ఖాయం. ఎందుకంటే అతడితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. ప్రస్తుతం అత్యద్భుత ఫామ్లో ఉన్న కోహ్లి అవుట్ కావాలంటే ఏ రనౌట్లాంటిదో అదృష్టం మాకు కలిసి రావాల్సిందే’ అని మ్యాక్స్వెల్ వ్యాఖ్యానించాడు. మరోవైపు భారత పిచ్లపై ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ కూడా మంచి ప్రభావం చూపించగలడని, అతని పదునైన బౌలింగ్ విరాట్ కోహ్లిని కూడా ఇబ్బంది పెట్టవచ్చని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వార్నర్ సెంచరీ: ఆసీస్ గెలుపు
బాసెటెరీ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): బ్యాట్స్మెన్తో పాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో ముక్కోణపు సిరీస్లోని నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆసీస్ 36 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. వార్నర్ (120 బంతుల్లో 109; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... ఉస్మాన్ ఖాజా (71 బంతుల్లో 59; 4 ఫోర్లు,1 సిక్సర్), స్మిత్ (49 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తాహిర్ 2 వికె ట్లు తీశాడు. అనంతరం 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.4 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. 38వ ఓవర్లో 210/4తో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా... కేవలం 42 పరుగుల వ్యవధిలోనే మిగతా ఆరు వికెట్లను కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది. ఆమ్లా (64 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్సర్), డుప్లెసిస్ (76 బంతుల్లో 63; 5 ఫోర్లు), డివిలియర్స్ (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (39 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజెల్వుడ్, జంపా తలా 3 వికెట్లను చేజిక్కించుకున్నారు. -
వెస్టిండీస్పై ఆసీస్ గెలుపు
ముక్కోణపు వన్డే టోర్నీ గయానా: ఐపీఎల్ ఫామ్ను వార్నర్ (55 నాటౌట్: 3 ఫోర్లు, 1 సిక్సర్) ముక్కోణపు సిరీస్లోనూ కొనసాగిస్తున్నాడు. దీంతో వెస్టిండీస్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 32.5 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లు లియోన్ (3/39), ఆడమ్ జంపా (3/16), స్టార్క్ ( 2/37) అద్భుతంగా రాణించడంతో... సొంత గడ్డపై విండీస్ అత్యల్ప స్కోరును నమోదుచేసింది. చార్లెస్ (22), బ్రాత్వైట్ (21) కాసేపు ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కొన్నా వారి ముందు నిలవలేకపోయారు. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 25.4 ఓవ ర్లలోనే చేధించి ఆసీస్ బోనస్ పాయింట్ను తన ఖాతాలో వేసుకుంది. భీకర ఫామ్లో ఉన్న వార్నర్కు, ఫించ్(19), మిచెల్ మార్ష్ (9 నాటౌట్) సహకారం అందించారు. ఖవాజా 27 పరుగులతో రాణించినా... స్మిత్(6), మాక్స్వెల్(0)లు నిరాశపరిచారు. వెస్టిండీస్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీసుకోగా... బెన్, హోల్డర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బౌలర్ లియోన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది. -
నాయర్ నిలబెట్టాడు
► డేర్డెవిల్స్ను గెలిపించిన కరుణ్ నాయర్ ► 6 వికెట్లతో హైదరాబాద్ ఓటమి ► ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు సజీవం ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ మళ్లీ ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది. ఆశలు నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో ఆ జట్టు సమష్టిగా రాణించింది. ముందుగా బ్రాత్వైట్ బౌలింగ్, ఆ తర్వాత కరుణ్ నాయర్ మెరుపు బ్యాటింగ్తో డెవిల్స్కు కీలక విజయం దక్కింది. లీగ్లో ‘టాప్’లో ఉన్న సన్రైజర్స్... ఈసారి బ్యాటింగ్లో తడబడి ప్రత్యర్థి ముందు తలవంచింది. ఆఖర్లో కాస్త ఉత్కంఠ ఎదురైనా... చివరి బంతికి ఢిల్లీ లక్ష్యం చేరడంలో సఫలం అయింది. రాయ్పూర్: ఢిల్లీ విజయం కోసం చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా... భువనేశ్వర్ వేసిన తొలి నాలుగు బంతుల్లో ఐదు పరుగులే వచ్చాయి. ఆఖరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో కరుణ్ నాయర్ ఒత్తిడిని అధిగమించాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఢిల్లీ ఆశలు సజీవంగా నిలబెట్టాడు. శుక్రవారం ఇక్కడి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్లో డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి అర్ధ సెంచరీతో చెలరేగాడు. అనంతరం ఢిల్లీ డేర్డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (59 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ముందుండి నడిపించగా... రిషభ్ పంత్ (26 బంతుల్లో 32; 3 ఫోర్లు) అండగా నిలిచాడు. తాజా ఫలితంతో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు నిలిచాయి. ఆ జట్టు తమ చివరి మ్యాచ్లలో బెంగళూరుతో, సన్రైజర్స్ తమ చివరి మ్యాచ్లో కోల్కతాతో తలపడతాయి. వార్నర్ జోరు: సీజన్ ఆరంభంనుంచి రైజర్స్ బ్యాటింగ్ భారం మోస్తున్న కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో సారి ఆపద్బాంధవుడయ్యాడు. లీగ్లో ఏడో అర్ధ సెంచరీతో అతను జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించాడు. బ్యాటింగ్కు పెద్దగా అనుకూలించని నెమ్మదైన పిచ్పై ఒక వైపు వార్నర్ దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శించినా...మరో ఎండ్లో ఐదు బంతుల వ్యవధిలో ధావన్ (10), హుడా (1) రనౌట్ కావడం సన్కు అడ్డుకట్ట వేసింది. తమ బౌలింగ్లోనే చక్కటి ఫీల్డింగ్తో బ్రాత్వైట్, మిశ్రా ఈ రెండు వికెట్లు తీశారు. కొద్ది సేపటికే యువరాజ్ (10) బ్రాత్వైట్ బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో రైజర్స్ మరింత ఇబ్బందుల్లో పడింది. 40 బంతుల్లో వార్నర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతడిని కూడా బ్రాత్వైట్ వెనక్కి పంపి దెబ్బ తీయగా, హెన్రిక్స్ (18), మోర్గాన్ (14), ఓజా (16 నాటౌట్) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా చివరి ఐదు ఓవర్లలో సన్ 43 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీలక భాగస్వామ్యం: ఛేదనలో ఢిల్లీకి కూడా సరైన ఆరంభం లభించలేదు. బరీందర్ తన తొలి ఓవర్లోనే డి కాక్ (2)ను అవుట్ చేయడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే బరీందర్ తర్వాతి ఓవర్లో నాయర్ మూడు బౌండరీలు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేశాడు. అనంతరం రైజర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, పంత్, నాయర్ కూడా భారీ షాట్లకు పోకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. దాంతో తర్వాతి ఏడు ఓవర్లలో కేవలం 2 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే వచ్చాయి. రెండో వికెట్కు 59 బంతుల్లో 73 పరుగులు జోడించిన అనంతరం భువనేశ్వర్ డెరైక్ట్ త్రోకు పంత్ రనౌట్గా వెనుదిరిగాడు. ఈ దశలో నాయర్, డుమిని (17) కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. 15వ ఓవర్లో నాయర్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను వార్నర్ వదిలేయడం ఆ జట్టుకు కలిసొచ్చింది. డుమినితో పాటు బ్రాత్వైట్ (10) అవుటైనా, నాయర్ చివరి వరకు నిలబడి విజయాన్ని అందించాడు. స్కోరు వివరాలు: సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మిశ్రా (బి) బ్రాత్వైట్ 73; ధావన్ (రనౌట్) 10; హుడా (రనౌట్) 1; యువరాజ్ (బి) బ్రాత్వైట్ 10; హెన్రిక్స్ (సి) నేగి (బి) డుమిని 18; మోర్గాన్ (సి) బ్రాత్వైట్ (బి) కూల్టర్నీల్ 14; ఓజా (నాటౌట్) 16; భువనేశ్వర్ (రనౌట్) 13; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-46; 2-48; 3-66; 4-105; 5-117; 6-132; 7-158. బౌలింగ్: జహీర్ ఖాన్ 4-0-26-0; జయంత్ యాదవ్ 4-0-37-0; కూల్టర్నీల్ 4-0-36-1; బ్రాత్వైట్ 4-0-27-2; మిశ్రా 3-0-21-0; డుమిని 1-0-9-1. ఢిల్లీ డేర్డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) ఓజా (బి) బరీందర్ 2; పంత్ (రనౌట్) 32; నాయర్ (నాటౌట్) 83; డుమిని (సి) వార్నర్ (బి) బరీందర్ 17; బ్రాత్వైట్ (సి) బరీందర్ (బి) ముస్తఫిజుర్ 10; శామ్సన్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-9; 2-82; 3-117; 4-143. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-33-0; బరీందర్ 4-0-34-2; ముస్తఫిజుర్ 4-0-24-1; హెన్రిక్స్ 2-0-18-0; హుడా 2-0-16-0; కరణ్ శర్మ 3-0-25-0; యువరాజ్ 1-0-7-0. -
రైజర్స్ బల్లే బల్లే...
► పంజాబ్పై 7 వికెట్లతో హైదరాబాద్ గెలుపు ► రాణించిన వార్నర్, యువరాజ్ ► కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అవుట్3 ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ‘ప్లే ఆఫ్’ అవకాశాలను దాదాపు ఖాయం చేసుకుంది. వార్నర్ మరో అర్ధ సెంచరీ, దీపక్ హుడా ధాటికి తోడు యువరాజ్ సింగ్ తనదైన శైలిలో మెరుపులు ప్రదర్శించడంతో ఆ జట్టు ఖాతాలో ఎనిమిదో విజయం చేరింది. అధికారికంగా ఇంకా ఖరారు కాకపోయినా, ఈ గెలుపుతో నాకౌట్కు సన్రైజర్స్ టీమ్ మరింత చేరువైంది. మరో వైపు హషీం ఆమ్లా దూకుడైన ప్రదర్శనతో కింగ్స్ ఎలెవన్ భారీ స్కోరు చేసినా చివర్లో చేతులెత్తేసింది. ఫలితంగా పుణే తర్వాత ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా నిష్ర్కమించిన రెండో జట్టుగా నిలిచింది. మొహాలీ: పంజాబ్ గడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ‘భాంగ్రా’ చిందులేశారు. భారీ స్కోరును అలవోకగా ఛేదించి కీలక విజయాన్ని అందుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. హషీం ఆమ్లా (56 బంతుల్లో 96; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం సన్రైజర్స్ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) సీజన్లో ఆరో అర్ధ సెంచరీ సాధించడం విశేషం. చాలా కాలం తర్వాత యువరాజ్ సింగ్ (24 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడగా, దీపక్ హుడా (22 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. ఆమ్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది. ఆమ్లా జోరు... వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమైనా పంజాబ్ ఆమ్లాపై నమ్మకముంచింది. దానిని నిలబెట్టుకుంటూ అతను చెలరేగాడు. ఇన్నింగ్స్ రెండో బంతికి ఫోర్తో ఖాతా తెరిచిన అతను, నెహ్రా వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు బాదగా, మరోవైపు విజయ్ (6) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అనంతరం ఆమ్లాకు సాహా (23 బంతుల్లో 27; 3 ఫోర్లు), గుర్కీరత్ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచారు. 30 బంతుల్లోనే ఆమ్లా తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్కు సాహాతో 41 బంతుల్లో 54 పరుగులు జోడించిన ఆమ్లా, మూడో వికెట్కు గుర్కీరత్తో 37 బంతుల్లోనే 65 పరుగులు జత చేశాడు. హెన్రిక్స్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన ఆమ్లా... ముస్తఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు బౌండరీలు కొట్టి శతకానికి చేరువయ్యాడు. అయితే చివరి ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్లో క్యాచ్ ఇవ్వడంతో అది సాధ్యం కాలేదు. సన్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయంతో మ్యాచ్ మధ్యలోనే నిష్ర్కమించాడు. సమష్టి ప్రదర్శన... ఐపీఎల్లో విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచిన వార్నర్, ధావన్ (22 బంతుల్లో 25; 4 ఫోర్లు) మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. స్టొయినిస్ ఓవర్లో వార్నర్ ఫోర్, సిక్స్ కొట్టగా, మ్యాక్స్వెల్ వేసిన తర్వాతి ఓవర్లో ధావన్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. తొలి వికెట్కు చకచకా 48 బంతుల్లో 68 పరుగులు జత చేసిన తర్వాత రెండో పరుగుకు ప్రయత్నించి మోహిత్ అద్భుత ఫీల్డింగ్కు ధావన్ అవుట్ కాగా, 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ హిట్వికెట్గా వెనుదిరిగాడు. ఈ సీజన్లో యువరాజ్, హుడా తర్వాత హిట్వికెట్గా అవుటైన మూడో సన్ బ్యాట్స్మన్ వార్నర్. అయితే హుడా, యువరాజ్ చెరో వైపు నుంచి చెలరేగడంతో రైజర్స్కు ఇబ్బంది ఎదురు కాలేదు. యువరాజ్ మూడు భారీ సిక్సర్లతో అలరించాడు. హుడా అవుటైనా... యువీ, బెన్ కటింగ్ (11 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్సర్లు) 22 బంతుల్లోనే 41 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 96; విజయ్ (సి) వార్నర్ (బి) ముస్తఫిజుర్ 6; సాహా (సి) హుడా (బి) హెన్రిక్స్ 27; గుర్కీరత్ (బి) భువనేశ్వర్ 27; మిల్లర్ (నాటౌట్) 20; మ్యాక్స్వెల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1-33; 2-87; 3-152; 4-173. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-32-2; నెహ్రా 2.5-0-35-0; ముస్తఫిజుర్ 4-0-32-1; కటింగ్ 1.1-0-11-0; కరణ్ శర్మ 4-0-26-0; హెన్రిక్స్ 3-0-29-1; యువరాజ్ 1-0-11-0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (హిట్వికెట్) (బి) అక్షర్ పటేల్ 52; ధావన్ (రనౌట్) 25; హుడా (సి) మిల్లర్ (బి) సందీప్ 34; యువరాజ్ (నాటౌట్) 42; కటింగ్ (నాటౌట్) 18; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1-68; 2-97; 3-139. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-35-1; విజయ్ 1-0-8-0; మోహిత్ శర్మ 3.4-0-40-0; అనురీత్ సింగ్ 3-0-28-0; స్టొయినిస్ 3-0-28-0; మ్యాక్స్వెల్ 1-0-11-0; అక్షర్ పటేల్ 4-0-26-1. -
‘సన్’ జోరుకు బ్రేక్
► సొంతగడ్డపై చివరి మ్యాచ్లో హైదరాబాద్ ఓటమి ► 7 వికెట్లతో ఢిల్లీ ఘన విజయం రాణించిన మిశ్రా, డి కాక్ నడి వేసవిలో హైదరాబాద్లో సూర్యుడి ప్రతాపానికి వరుణుడు బ్రేక్ వేసినట్లే... ఐపీఎల్లోనూ సన్రైజర్స్ జోరుకు ఢిల్లీ బ్రేక్ వేసింది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న వార్నర్ సేన సొంతగడ్డపై మ్యాచ్లను ఓటమితో ముగించింది. బౌలర్ల నిలకడ, డికాక్ మెరుపులతో డేర్డెవిల్స్ ప్లే ఆఫ్కు చేరువయింది. సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్లో విఫలమైన చాలా సందర్భాల్లో బౌలింగ్తో గట్టెక్కే సన్రైజర్స్కు ఈసారి అదృష్టం కలిసి రాలేదు. అన్ని విభాగాల్లో వైఫల్యం కారణంగా... నాలుగు విజయాల జోరుకు బ్రేక్ పడింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిశ్రా, కూల్టర్ నీల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ డేర్ డెవిల్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ (31 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా... రిషభ్ పంత్ (26 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శామ్సన్ (26 బంతుల్లో 34 నాటౌట్; 2 సిక్సర్లు) నాలుగో వికెట్కు అభేద్యంగా 50 బంతుల్లోనే 72 పరుగులు జోడించి 11 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీని గెలిపించారు. హైదరాబాద్లో సొంత మ్యాచ్లు ముగించుకున్న రైజర్స్ ఇకపై మిగిలిన మూడు మ్యాచ్లను ప్రత్యర్థి వేదికలపైనే ఆడుతుంది. క్రిస్ మోరిస్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వార్నర్ మెరుపులు తప్ప...: తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు... తర్వాతి 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 66 పరుగులు మాత్రమే... సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ స్వరూపం ఇది. ఎప్పటిలాగే వార్నర్ తనదైన శైలిలో దూకుడు మినహా జట్టు బ్యాటింగ్లో ఎలాంటి మెరుపులు లేవు. ధావన్ (37 బంతుల్లో 34; 3 ఫోర్లు), విలియమ్సన్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంలో విఫలం కాగా, మిగతా బ్యాట్స్మెన్ కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయారు. ఇన్నింగ్స్ తొలి 3 ఓవర్లలో 11 పరుగులే రాగా, తర్వాతి రెండు ఓవర్లు సన్ సొమ్ము చేసుకుంది. షమీ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లు, ధావన్ ఒక ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. జయంత్ వేసిన మరుసటి ఓవర్లో తొలి మూడు బంతులకు వార్నర్ 4, 4, 6 బాదడంతో 17 పరుగులు లభించాయి. అయితే 6-20 మధ్య 15 ఓవర్లలో హైదరాబాద్ రెండు ఓవర్లలో మాత్రమే రెండంకెల పరుగులు తీయగలగడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్కు రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. జయంత్ తన చివరి ఓవర్లో వార్నర్ను బౌల్డ్ చేసి పతనానికి శ్రీకారం చుట్టాడు. వార్నర్, ధావన్ తొలి వికెట్కు 53 బంతుల్లో 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత 15 బంతుల వ్యవధిలో సన్ మూడు వికెట్లు కోల్పోయింది. మిశ్రా తన వరుస ఓవర్లలో ధావన్, యువరాజ్ (8)లను అవుట్ చేయగా, హెన్రిక్స్ (0) షమీ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. డి కాక్ జోరు...: నెహ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి డి కాక్ దూకుడు ప్రదర్శించాడు. నెహ్రా మరుసటి ఓవర్లో కూడా అతను మరో రెండు బౌండరీలు కొట్టాడు. అయితే ఆ ఓవర్లో ఢిల్లీ జట్టు అగర్వాల్ (10) వికెట్ కోల్పోయింది. అనంతరం నాయర్ (17 బంతుల్లో 20; 3 ఫోర్లు) కొద్ది సేపు డి కాక్కు అండగా నిలిచాడు. బరీందర్ వేసిన తొలి రెండు ఓవర్లలో వీరిద్దరు కలిసి మూడు ఫోర్లు, 1 సిక్స్తో 21 పరుగులు రాబట్టారు. అయితే హెన్రిక్స్ చక్కటి బంతితో నాయర్ను బౌల్డ్ చేయడంతో 55 పరుగుల (37 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో మూడు బంతులకే డి కాక్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత శామ్సన్, పంత్ నిలకడగా ఆడారు. 18 పరుగుల వద్ద శామ్సన్ క్యాచ్ను హెన్రిక్స్ వదిలేయడం ఢిల్లీకి కలిసి రాగా... లీగ్లో తొలిసారి ముస్తఫిజుర్ విఫలం కావడం కూడా డేర్డెవిల్స్ పని సులువు చేసింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) జయంత్ 46; ధావన్ (సి) శామ్సన్ (బి) మిశ్రా 34; విలియమ్సన్ (బి) మోరిస్ 27; యువరాజ్ (సి) పంత్ (బి) మిశ్రా 8; హెన్రిక్స్ (ఎల్బీ) (బి) షమీ 0; హుడా (హిట్ వికెట్) (బి) కూల్టర్ నీల్ 10; ఓజా (సి) శామ్సన్ (బి) కూల్టర్ నీల్ 7; భువనేశ్వర్ (రనౌట్) 1; బరీందర్ (నాటౌట్) 1; నెహ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-67; 2-98; 3-113; 4-114; 5-135; 6-137; 7-138; 8-143. బౌలింగ్: జయంత్ యాదవ్ 4-0-32-1; కూల్టర్నీల్ 4-0-25-2; షమీ 3-0-26-1; మోరిస్ 4-0-19-1; డుమిని 2-0-19-0; మిశ్రా 3-0-19-2. ఢిల్లీ డేర్డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) ఓజా (బి) హెన్రిక్స్ 44; అగర్వాల్ (సి) యువరాజ్ (బి) నెహ్రా 10; నాయర్ (బి) హెన్రిక్స్ 20; శామ్సన్ (నాటౌట్) 34; పంత్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1-20; 2-75; 3-78. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-32-0; నెహ్రా 3-0-23-1; బరీందర్ 2-0-21-0; ముస్తఫిజుర్ 4-0-39-0; హెన్రిక్స్ 3-0-19-2; హుడా 1-0-5-0; యువరాజ్ 1.1-0-11-0. -
కొత్త ఉత్సాహంతో ఉన్నాం...
► విశ్రాంతి అనంతరం ► నేడు బరిలోకి సన్రైజర్స్ సాక్షి, హైదరాబాద్: దాదాపు వారం రోజుల క్రితం బెంగళూరుపై కీలక విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఆ తర్వాత దక్కిన ఐదు రోజుల విరామాన్ని ఆటగాళ్లు పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఈ విరామంలో ఆటగాళ్లు తమకు నచ్చిన రీతిలో సరదాగా గడిపారు. ఇప్పటికి సరిగ్గా సగం మ్యాచ్లు ఆడిన జట్టు, రెండో దశకు సిద్ధమైంది. కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగి ప్లే ఆఫ్ దిశగా దూసుకుపోవాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రైజర్స్ ప్రధాన ఆటగాళ్లు వార్నర్, ధావన్, భువనేశ్వర్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆటతో పాటు తమ ఆసక్తులను పంచుకున్నారు. విశేషాలు వారి మాటల్లోనే... నాకు నచ్చిందే చేస్తా! ఐపీఎల్ ఆరంభంలో కాస్త తడబడ్డాను. కానీ కొద్ది సేపు నిలదొక్కుకోగలిగితే రాణిస్తానని నాకు నమ్మకముంది. ఇప్పుడు మళ్లీ లయ అందుకున్నాను. కెప్టెన్గా, ఓపెనింగ్ సహచరుడిగా కూడా వార్నర్ ఎంతో అండగా నిలిచాడు. క్రీజ్లో ఉన్నప్పుడు నాపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు. రెండేళ్లుగా కలిసి ఆడటంతో అతనితో మంచి సమన్వయం ఉంది. టి20ల్లో టాపార్డర్ బాగా ఆడితే విజయం దక్కుతుంది. రైజర్స్కు ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. అనుభవజ్ఞులు యువరాజ్, నెహ్రాల రాకతో జట్టు బలం పెరిగింది. మా ఫీల్డింగ్ కాస్త మెరుగైతే చాలు. పాతతరం ఆటగాళ్లకు ఎలా ఉండేదో తెలీదు కానీ సోషల్ మీడియా వల్ల మా జనరేషన్ క్రికెటర్లపై బాగా ఒత్తిడి పెరిగింది. ప్రతీ విషయం అందరికీ చేరిపోతోంది. నాకు నచ్చింది నేను చేస్తాను తప్ప ఎవరి కోసమో, స్టైల్ ఐకాన్గా గుర్తింపు తెచ్చుకునేందుకో కాదు. మీసం మెలేసినా, పఠానీ సూట్ ధరించినా, చెవిపోగు అయినా అదంతా నేను ఇష్టంతో చేసే పని. వీటి వల్ల నాలో కొత్త ఉత్సాహం వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక నేను ఎవరికో చూపించడానికో, సరదాకో స్విచ్ హిట్లు, స్కూప్లులాంటి షాట్లు ఆడను. సాధారణ షాట్లతోనే పరుగులు వస్తుంటే ఇంక వాటి అవసరం లేదు’ - ధావన్ మందు మానేశా... అంతా బాగుంది! మనం ఏదైతే బాగా ఇష్టపడతామో దానిని వదిలేయడం అంత సులువు కాదు. గతంలో మ్యాచ్కు ముందు గానీ, మ్యాచ్ తర్వాత గానీ తప్పనిసరిగా మద్యం తీసుకునేవాడిని. దీనివల్ల నా మనసు ప్రశాంతంగా అనిపించేది. మానేశాక అంతా భిన్నంగా ఉంది. ఇప్పుడు నా శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత 12 నెలల కాలంలో ఆస్ట్రేలియా తరఫున, ఐపీఎల్లో చాలా క్రికెట్ ఆడటమే కాదు బాగా ఆడుతున్నాను కూడా. ప్రతీ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నా. మందు మానేయడం వల్ల గాయాలయ్యే అవకాశాలు కూడా తక్కువ. దీని వల్ల నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించగలుగుతున్నా. అల్కహాల్కు గుడ్బై చెప్పి నాకు నేనే సవాల్ విసిరా. లక్ష్యం చేరుకోవడం సంతోషంగా ఉంది. నేను కెప్టెన్గా మరీ కొత్త వ్యూహాలు ఏమీ అమలు చేయడం లేదు. పైగా ప్రతీది చెప్పాల్సిన అవసరం లేకుండా ఆటగాళ్లంతా బాగా ఆడుతుండటంతో నా పని మరింత సులువైంది. జట్టులో 11 మందీ సమానమే. ఎవరినీ గొప్ప చేసి చెప్పను. యువరాజ్ ఇప్పుడు పూర్తి ఫిట్గా ఉన్నాడు’ - వార్నర్ స్పీడున్నా ‘స్వింగ్’ మారదు ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్లో విఫలమైన తర్వాత నా బౌలింగ్పై కాస్త ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత మరింత ప్రాక్టీస్తో నియంత్రణ సాధించాను. నేను ప్రధానంగా స్వింగ్ బౌలర్నే. కానీ వేగంగా వేసేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాను. బౌలింగ్లో వేగం పెరిగితే స్వింగ్ పోతుందని చాలా మంది అంటారు. కానీ నేను రెండింటినీ సమన్వయం చేసుకోగలననే నమ్మకముంది. దాని కోసం ప్రాక్టీస్ సెషన్లోనే ఎక్కువగా సాధన చేస్తున్నాను. తొలి ఆరు ఓవర్లలో, చివరి ఓవర్లలో నా బౌలింగ్లో కచ్చితంగా వైవిధ్యం ఉంటుంది. టి20 ఫార్మాట్లో బౌలర్ మరింత తెలివిగా వ్యవహరించాలి. యార్కర్లు, స్లో బౌన్సర్లు సమర్థంగా ఉపయోగించాలి. మా జట్టులో మంచి పేసర్లు ఉండటంతో ఒకరినుంచి మరొకరు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. ముస్తఫిజుర్ గొప్పతనం అతని యాక్షన్లో ఉంది. అది అతనికి సహజంగా వచ్చింది. ఐపీఎల్లాంటి బిజీ షెడ్యూల్లో సుదీర్ఘ విశ్రాంతి లభించడం చాలా మంచి విషయం. కొత్తగా ఆలోచించేందుకు, బాగా ఆడేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని ఇది ఇస్తుంది. రాబోయే మ్యాచ్లలో మరింతగా రాణిస్తాను’ - భువనేశ్వర్ -
జోడీ నంబర్ 1
► కోల్కతా ఓపెనర్లు సూపర్ హిట్ ► వరుసగా మూడో సీజన్లోనూ నిలకడ ఫార్మాట్ ఏదైనా ఓపెనర్లు బాగా ఆడితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి జట్టూ మంచి ఓపెనింగ్ జోడీ కోసం చూస్తుంది. ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లూ సరైన ఓపెనర్ల కోసం ఇబ్బంది పడుతూ, ప్రతి సీజన్లోనూ మార్పులు చేస్తూనే ఉంటాయి. కోల్కతా కూడా ఆరేళ్ల పాటు ఇలాంటి తిప్పలే పడింది. 2014లో తొలిసారి గంభీర్, ఉతప్ప జతకలిశాక ఈ జట్టు రాత మారింది. ఈ ఏడాది కూడా అదే జోరుతో ఈ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. సాక్షి క్రీడావిభాగం:- మిగిలిన చాలా జట్ల ఓపెనర్లతో పోలిస్తే గంభీర్, ఉతప్ప ఇద్దరూ అంత పెద్ద విధ్వంసకర ఆటగాళ్లేం కాదు. కానీ పవర్ప్లేలో ఈ ఇద్దరూ కలిసి అలవోకగా ఓ 50-60 పరుగులు చేసేస్తారు. విరుచుకుపడి సిక్సర్ల సునామీ సృష్టించడం, భీకరమైన షాట్లు ఆడటం కనిపించదు. కానీ పరుగులు వస్తాయి. అడపాదడపా గ్యాప్లలోకి ఫోర్లు కొట్టినా... ఈ ఇద్దరూ ఎక్కువగా నమ్ముకుంది స్ట్రయిక్ రొటేట్ చేయడం. సింగిల్ లేదు అనుకునే దగ్గర కూడా ఈ ఇద్దరూ కలిసి పరుగు రాబడతారు. దీనికి కారణం ఈ ఇద్దరికీ కుదిరిన సమన్వయం. మైదానంలో ప్రొఫెషనల్గానే కాదు... వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం కూడా దీనికి కారణం. నిలకడకు మారుపేరు గంభీర్, ఉతప్ప కలిసి ఇప్పటివరకూ 28 ఇన్నింగ్స్లో ఓపెనింగ్ చేస్తే ఇందులో 18 సార్లు 30 పరుగులకి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఐపీఎల్లో మరే జట్టుకూ ఇంత నిలకడైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు లేవు. వాస్తవానికి 2014 సీజన్లో ఉతప్ప ఓపెనర్ కాదు. లోయర్ ఆర్డర్లో ఆడేవాడు. ఆ సీజన్లో గంభీర్, కలిస్, మనీష్ పాండే, బిస్లా... ఈ నలుగురూ కలిసి రకరకాల కాంబినేషన్లలో ఆడారు. కానీ ఏ ఒక్క జోడీ హిట్ కాలేదు. అప్పటికి ఉతప్ప కూడా లోయర్ ఆర్డర్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే ఓ రోజు మ్యాచ్కు ముందు జట్టు సమావేశంలో ఓపెనర్ల గురించి చర్చ జరిగినప్పుడు... తాను తొలి స్థానంలో సౌకర్యంగా ఆడతానని ఉతప్ప చెప్పాడు. దీంతో అవకాశం ఇచ్చారు. 2014 మే 2న తొలిసారి ఇద్దరూ కలిసి ఆడారు. ఆ మ్యాచ్లో గంభీర్ రనౌట్ అయ్యాడు. కానీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత... ఒకరితో ఒకరికి స్నేహం పెరిగాక వికెట్ల మధ్య పరుగులోనూ సమస్యలు తొలిగిపోయాయి. ఆ మ్యాచ్ తర్వాత ఈ జోడీ ఆడుతుండగా ఒక్కసారి కూడా రనౌట్ కాలేదు. ఆ సీజన్లో ఉతప్ప కోల్కతాకు అద్భుతాలు చేసి పెట్టాడు. ఏకంగా 660 పరుగులతో ‘ఆరెంజ్ క్యాప్’ సంపాదించడంతో పాటు కోల్కతాను చాంపియన్గా నిలబెట్టాడు. ఒకరి మీద ఒకరికి నమ్మకం గంభీర్, ఉతప్పల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగు విషయంలో ఇది బాగా కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎక్కువ. ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవిస్తారు. గంభీర్ సింగిల్ కోసం బయల్దేరాడంటే ఉతప్ప కూడా గుడ్డిగా పరుగెడతాడు. సహచరుడి జడ్జిమెంట్ మీద పరస్పరం ఉన్న నమ్మకం ఇది. హైదరాబాద్లో సన్రైజర్స్తో మ్యాచ్లో ఇది బాగా కనిపించింది. పరిస్థితికి తగ్గట్లు ఇన్నింగ్స్ పేస్ మార్చడంలోనూ ఇద్దరూ సిద్ధహస్తులే. గంభీర్ వేగంగా ఆడుతున్న సమయంలో పొరపాటున కూడా ఉతప్ప షాట్ల కోసం వెళ్లడు. సింగిల్ తీసి వెంటనే స్ట్రయికింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇటు గంభీర్ కూడా అంతే. ఇద్దరిలోనూ ఉతప్ప కొంత మెరుైగె న హిట్టర్. ప్రస్తుతం ఈ ఇద్దరూ అద్భుతమైన ఫామ్లో ఉండటం కోల్కతాకు బాగా కలిసొచ్చే అంశం. ప్రయోగాల పరంపర కోల్కతాతో పోలిస్తే మిగిలిన జట్లు ఓపెనింగ్ కాంబినేషన్ కోసం ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో గుజరాత్ లయన్స్, పుణే జెయింట్స్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. సన్రైజర్స్ జట్టు కూడా 2014 నుంచి కేవలం రెండు జోడీలను మాత్రమే ప్రయత్నించింది. వార్నర్, ధావన్ ఇద్దరూ సూపర్ స్టార్స్ కావడం వల్ల ఓపెనర్లను మార్చడం లేదు. కానీ ప్రస్తుతం ధావన్ ఫామ్ చూస్తే త్వరలోనే హైదరాబాద్ జట్టు కూడా ఓపెనర్లను మార్చక తప్పకపోవచ్చు. ఇక ఓపెనర్ల విషయంలో ఏమాత్రం నిలకడ లేని జట్టు ముంబై ఇండియన్స్. 2014 నుంచి ఇప్పటివరకూ ఈ జట్టు 11 రకాల ఓపెనింగ్ కాంబినేషన్లను ప్రయత్నించింది. అటు ఢిల్లీ డేర్డెవిల్స్ కూడా ఈ మూడు సీజన్లలో 10 రకాల జోడీలను ఆడించింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 9 జోడీలతో ప్రయోగాలు చేస్తే... పంజాబ్ ఆరు కాంబినేష్లను ప్రయత్నించింది. ఏమైనా ఓపెనర్లు ఇద్దరూ ఫామ్లో ఉంటే ఆ జట్టు సురక్షితంగా ఉన్నట్లే. కోల్కతా విషయంలో మరోసారి ఇదే నిజమయింది. -
విజయంపై దృష్టి
నేడు ముంబై ఇండియన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ ‘ఢీ’ సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9 సీజన్ను నిరాశాజనక రీతిలో ప్రారంభించిన సన్రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై గెలుపు బోణీ చేయాలని భావిస్తోంది. నేడు ఇక్కడి రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో హైదరాబాద్, ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సన్రైజర్స్ ఆడిన రెండు మ్యాచ్లలో కూడా ఓడిపోగా, ముంబై మూడు ఆడి రెండింటిలో ఓటమి పాలైంది. బ్యాటింగ్లో రైజర్స్ జట్టుకు వార్నర్, మోర్గాన్లు కీలకం కాగా...బౌలింగ్లో సన్ జట్టు విజయావకాశాలు ముస్తఫిజుర్పై ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్ బలహీనతను అధిగమించి హైదరాబాద్ సమష్టిగా రాణించాల్సి ఉంది. ఈ మ్యాచ్లోనూ ఓడితే సన్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. మరోవైపు ముంబై కూడా పెద్దగా ఫామ్లో లేదు. గుజరాత్తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో కూడా ఆ జట్టు బ్యాట్స్మెన్ పేలవంగా ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మకు ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం లభిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో పాటు వికెట్పై మంచి బౌన్స్ కూడా ఉంది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్కు ముందు స్టేడియం పరిసరాల్లో భారీగా వర్షం పడి ఆగిపోయింది. మ్యాచ్ రోజు వర్షంతో ఇబ్బంది ఉండకపోవచ్చు. -
గెలవాలి....నిలవాలి
► నేడు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ► గెలిచిన జట్టు సెమీఫైనల్కి ► ఓడితే కథ ముగిసినట్లే ► టి20 ప్రపంచకప్ టోర్నీ సరిగ్గా సంవత్సరం క్రితం... మార్చి 26న సిడ్నీ మైదానంలో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తయింది. ఇప్పుడు ఏడాది వ్యవధిలో మరో ప్రపంచకప్ పోరు వచ్చింది. సెమీస్ కాకపోయినా, ఇప్పుడు కూడా నాకౌట్ పోరే. క్వార్టర్ ఫైనల్లాంటి ఈ మ్యాచ్లో ఓడిన జట్టు కథ ముగిసిపోతుంది. ఫార్మాట్ వేరు కావచ్చు కానీ వైరంలో మాత్రం తేడా ఉండదు. ఇక నాటి పరాజయానికి పదునైన జవాబు ఇవ్వడం మన వంతు. మన సొంతగడ్డపై ఆసీస్ను చిత్తు చేసి ఇంటికి పంపడం, దర్జాగా సెమీస్లోకి అడుగుపెట్టడం ఆదివారం భారత్ ముందున్న లక్ష్యం. మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి;- టి20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జైత్రయాత్ర ఆస్ట్రేలియాలోనే మొదలైంది. అక్కడి నుంచి 14 మ్యాచ్లలో 12 విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు వరల్డ్కప్ రేస్లో కీలక దశలో అదే ఆసీస్తో పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఇక్కడి ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఎలాంటి గణాంకాలు, రన్రేట్లతో పని లేకుండా ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇరు జట్లకు ఇది చావోరేవోలాంటి పరిస్థితి. ఉత్కంఠభరితంగా సాగిన గత మ్యాచ్లో భారత్ ఒక పరుగుతో గట్టెక్కగా, ఇదే మైదానంలో శుక్రవారం పాక్ను చిత్తు చేసి ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఉదాసీనత లేకుండా...: బంగ్లాదేశ్తో ఓటమి అంచుల్లోకి వెళ్లినా చివరకు భారత్ మ్యాచ్ కాపాడుకోగలిగింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి వస్తే ఒత్తిడిలో చిత్తవడానికి ఎదురుగా ఉన్న జట్టు బంగ్లాదేశ్ కాదు. చిన్నపాటి అవకాశం ఇచ్చినా ఆస్ట్రేలియన్లు మ్యాచ్ లాక్కోగలరు. కాబట్టి అన్ని రంగాల్లో జట్టు సమష్టిగా రాణించాల్సి ఉంది. చివరి రెండు మ్యాచ్లలో గెలిచినా నిజాయితీగా చెప్పాలంటే భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ఓపెనర్లు ఒక్కసారి కూడా శుభారంభం ఇవ్వలేకపోయారు. ఈ టోర్నీకి ముందు స్టార్ హోదాతో బరిలోకి దిగిన రోహిత్తో పాటు ధావన్ ఒక్కసారి కూడా ఆకట్టుకోలేదు. పైగా వీరిద్దరూ నిర్లక్ష్యమైన రీతిలో వరుసగా ఒకే తరహాలో అవుట్ కావడం ఆసీస్ గుర్తిస్తే కష్టం. కోహ్లి విఫలమైతే చాలు... ఇక కష్టం అన్నట్లుగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో కనిపించింది. శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ప్రధాన బ్యాట్స్మెన్తో పాటు లోయర్ ఆర్డర్ వరకు కూడా అంతా సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌలింగ్లో పేసర్లకంటే అశ్విన్, జడేజాల రాణింపుపైనే భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రాక్టీస్ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సాధారణ సెషన్ తర్వాత బుమ్రాకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. గాల్లో లేచే బంతిని క్యాచ్ ఎలా అందుకోవాలో ప్రతీది విడమర్చి చెప్పడంతో పాటు చాలా సేపు సాధన చేయించాడు. అందరూ ఫామ్లోనే! తొలి మ్యాచ్లో కివీస్తో ఓడి ఆ తర్వాత బంగ్లాదేశ్పై తడబడుతూ గెలిచిన ఆస్ట్రేలియా ఒక్కసారిగా సరైన సమయంలో ఫామ్లోకి వచ్చింది. జట్టులో అందరూ రాణించడంతో గత మ్యాచ్లో ఆ జట్టు పాక్పై ఘన విజయం సాధించింది. ఇది కచ్చితంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంచే అంశం. వార్నర్ మినహా గత మ్యాచ్లో ప్రధాన బ్యాట్స్మెన్ అంతా చెలరేగారు. అయితే వార్నర్ ఎప్పుడైనా ప్రమాదకర ఆటగాడే. అతనితో పాటు ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడే వాట్సన్, మ్యాక్స్వెల్, ఫాల్క్నర్లకు ఇక్కడి పిచ్లపై మంచి అనుభవం ఉంది. ఈ టోర్నీతో రిటైర్ కానున్న వాట్సన్ తన జట్టును టోర్నీలో మరింత ముందుకు తీసుకెళ్లాని పట్టుదలగా ఉన్నాడు. పాక్తో బ్యాటింగ్ చూస్తే వాట్సన్ ఎంత ప్రమాదకారినో అర్థమవుతుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్తో పోలిస్తే భారత్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఈసారి కూడా అదే జట్టు బరిలోకి దిగవచ్చు. ఈ టోర్నీలో ప్రభావం చూపిస్తున్న లెగ్స్పిన్నర్ ఆడమ్ జంపా తొలిసారి భారత్పై ఆడబోతున్నాడు. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), ఫించ్, ఖాజా, వార్నర్, వాట్సన్, మ్యాక్స్వెల్, ఫాల్క్నర్, నెవిల్, కూల్టర్ నీల్, జంపా, హాజల్వుడ్. పిచ్, వాతావరణం టోర్నీలో ఇక్కడి రెండు వేర్వేరు పిచ్లపై జరిగిన రెండు మ్యాచ్లలోనూ పరుగుల వరద పారింది. ఇప్పుడు కూడా బ్యాటింగ్కు అనుకూలించే వికెట్ కనిపిస్తోంది. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణం సాధారణంగా ఉంది. వర్షంతో మ్యాచ్కు ఆటంకం కలిగే అవకాశాలు తక్కువ. 8 భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 12 టి20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 8 గెలిచి 4 ఓడింది. వరల్డ్కప్లలో 4 మ్యాచ్లలో చెరో 2 గెలిచారు. -
ఆసీస్ సూపర్ షో
వార్నర్, మ్యాక్స్వెల్ మెరుపులు దక్షిణాఫ్రికాపై రెండో టి20లో విజయం జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ చివరి బంతికి గెలిచింది. దీంతో మూడు టి20ల సిరీస్లో 1-1తో పోటీలో నిలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ప్రొటీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (41 బంతుల్లో 79; 5 ఫోర్లు; 5 సిక్సర్లు), డి కాక్ (28 బంతుల్లో 44; 8 ఫోర్లు; 1 సిక్స్), మిల్లర్ (18 బంతుల్లో 33; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) వేగంగా ఆడి భారీ స్కోరుకు సహాయపడ్డారు. ఫాల్క్నర్కు మూడు, హేస్టింగ్స్కు రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆసీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 205 పరుగులు చేసి గెలిచింది. అయితే 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా డేవిడ్ వార్నర్ (40 బంతుల్లో 77; 6 ఫోర్లు; 5 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (43 బంతుల్లో 75; 7 ఫోర్లు; 3 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్తో ప్రొటీస్ను వణికించారు. వీరిద్దరి జోరుతో నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 161 పరుగులు వచ్చాయి. దీంతో ఆసియా కప్ టి20లో ఇదే వికెట్కు ఉమర్ అక్మల్, షోయబ్ మధ్య నెలకొన్న ప్రపంచ రికార్డు కనుమరుగైంది. మ్యాక్స్ 19వ ఓవర్ తొలి బంతికి, వార్నర్ చివరి ఓవర్ తొలి బంతికి అవుటైనా ఆసీస్ ఇబ్బంది పడకుండా నెగ్గింది. రబడా, స్టెయిన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. -
రోహిత్తో గొడవ.. వార్నర్కు జరిమానా
మెల్బోర్న్: భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్కు జరిమానా విధించారు. దురుసు ప్రవర్తన మానుకోవాలని, మరోసారి ఇలా వ్యవహరించవద్దంటూ క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జేమ్స్ సదర్లాండ్ వార్నర్ను హెచ్చరించారు. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా వార్నర్.. రోహిత్పై నోరుపారేసుకున్నాడు. రోహిత్, రైనా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓవర్ త్రోకు వీరిద్దరూ పరుగు తీశారు. ఆ సమయంలో రోహిత్, వార్నర్ మధ్య వాగ్వాదం జరిగింది. వార్నర్ తాను తప్పుచేసినట్టు అంగీకరించాడు. అతనికి మ్యాచ్ ఫీజులో సగం జరిమానాగా విధించారు. -
కోహ్లీ, ధవన్, వార్నర్లకు జరిమానా
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్తో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్లకు జరిమానా విధించారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో వీరు దూషించుకున్నందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది. కోహ్లీ, ధవన్లకు మ్యాచ్ ఫీజులో 30 శాతం చొప్పున, వార్నర్కు 15 శాతం జరిమానా వేసినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్ నాలుగో రోజు శుక్రవారం వీరు దూషణలకు దిగారు. దీంతో ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. శనివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఆసీస్ 48 పరుగులతో భారత్పై విజయం సాధించింది. -
పట్టు బిగించిన ఆసీస్
అడిలైడ్ : ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య అడిలైడ్లో జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగోరోజు ముగిసేసరికి ఆతిథ్య జట్టు ఆసీస్ 363 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్లో పక్కా గేమ్ ప్లాన్ ప్రకారం ఫాస్ట్ బ్యాటింగ్తో ఆసీస్ దూకుడుగా ఆడింది. దాంతో అడిలైడ్లో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు డ్రా అయ్యేలాగే ఉంది. ఐదో రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తొలి టెస్ట్ డ్రా కావడం ఖాయం. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్సింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ తొలి రోజునే 145 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా తన దూకుడు ప్రదర్శించి సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు వేగంగా ఆడుతున్న మిచెల్ మార్ష్ని రోహిత్ శర్మ ఔట్ చేయగా, సెంచరీ వీరుడు డేవిడ్ వార్నర్ని కరణ్శర్మ ఔట్ చేశాడు. కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 517/7 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్లో 444 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 115, పుజారా 73, రహానే 62, విజయ్ 53, రోహిత్శర్మ 43, షమీ 34, శిఖర్ధావన్ 25 పరుగులు చేశారు. -
ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్, స్మిత్ హాఫ్ సెంచరీ
అడిలైడ్ : అడిలైడ్ టెస్ట్లో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 266 వద్ద అయిదో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న మిచెల్ మార్ష్ని రోహిత్ శర్మ తన బౌలింగ్లో ఔట్ చేశాడు. అంతకుముందు సెంచరీ వీరుడు డేవిడ్ వార్నర్ని కరణ్శర్మ పెవిలియన్ దారి పట్టించాడు. అయితే ఆసీస్ వికెట్ల పతనం కన్నా నాలుగో రోజు ఇరు జట్ల ఆటగాళ్లు గరం గరం కావడం అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. నాలుగో రోజు టీ విరామం తర్వాత రోహిత్ శర్మ బౌలింగ్లో అప్పీలు చేశాడు. అది పూర్తిగా బౌలర్కు, అంపైర్కు మధ్యన జరిగే అంశం. అయితే, ఆసీస్ బ్యాట్స్మన్ వెంటనే స్పందించి ఏదో అనడంతో వివాదం రాజుకుంది. స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ కోహ్లి సైతం బరిలోకి దిగాడు. ఆసీస్ బ్యాట్స్మెన్ను లిమిట్స్లో వుండాలంటూ ఏదో అనేశాడు. దాంతో అంపైర్లు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. అరగంట సమయంలోనే ఆసీస్,టీమిండియా ఆటగాళ్ల మధ్య రెండుసార్లు వివాదం చెలరేగటం గమనార్హం. -
అడిలైడ్ టెస్టు : సెంచరీ కొట్టిన వార్నర్
-
సెంచరీ కొట్టిన వార్నర్
అడిలైడ్ : భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ సెంచరీ చేశాడు. వార్నర్ తన కెరీర్లో 33వ టెస్ట్లో 10వ సెంచరీ పూర్తి చేశాడు. వార్నర్ సెంచరీలో 10 ఫోర్లు, ఒక సిక్సర్ వున్నాయి. వార్నర్ సెంచరీ పుణ్యమా అని ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. నాలుగో రోజు టీ విరామం తర్వాత మూడు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 207 పరుగులు చేసింది. ఓవరాల్ లీడ్ 280 దాటిపోయింది. మొదటి టెస్ట్లో ఫలితం ఆశిస్తే త్వరగా ఆసీస్ ఇన్నింగ్స్ని కెప్టెన్ క్లార్క్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఫస్ట్ టెస్ట్ డ్రా దిశగా దూసుకుపోవడం ఖాయం. -
మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్
అడిలైడ్ : భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా మూడో వికెట్ను కోల్పోయింది. క్లార్క్ 7 పరుగులకు పెవిలియన్ దారి పట్టాడు. వార్నర్ 94, స్మిత్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీకి దగ్గరలోఉన్నాడు. ఆసీస్ 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
థావన్కు రిటార్ట్ ఇచ్చిన వార్నర్
అడిలైడ్ : భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అడిలైడ్ తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్ మ్యాచ్లో ఆసీస్, టీమిండియా ఆటగాళ్లు గరం గరం అయ్యారు. శుక్రవారం నాలుగో రోజు ఆటలో 66 పరుగుల వద్ద వార్నర్ బౌల్డవడంతో ఫీల్డర్ శిఖర్ థావన్ మోతాదు మించి స్పందించాడు. అయితే అది నోబాల్ అని తేలడంతో వార్నర్ వెనక్కి వచ్చి థావన్కు రిటార్ట్ ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా ఇరు జట్ల ఆటగాళ్లు సహనం కోల్పోవటంతో అక్కడ వేడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అంపైర్లు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణగింది. కాగా ఆసీస్ ఫస్ట్ వికెట్గా రోజర్స్ ఔటైనపుడు సైతం విరాట్ కోహ్లి ఇదేవిధంగా స్పందించాడు. -
అడిలైడ్ టెస్ట్ : రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
అడిలైడ్ : అడిలైడ్ టెస్ట్లో నాలుగో రోజు టీ విరామం అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో రెండో వికెట్ కోల్పోయింది. జట్టు 140 పరుగుల వద్ద ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ 33 పరుగులకు అవుట్ అయ్యాడు. వార్నర్ 70 పరుగులతో, క్లార్క్ పరుగుల ఖాతా ఓపెన్ చేయకుండా ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా 213 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
హాఫ్ సెంచరీ చేసిన వార్నర్
అడిలైడ్ : అడిలైడ్ టెస్ట్లో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. 63 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో శుక్రవారం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది. వార్నర్ 61, వాట్సన్ 20 పరుగులతో ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ ఇప్పటివరకూ 178 పరుగుల ఆధిక్యంలో ఉంది.కాగా అంతకుముందు ఇండియా మొదటి ఇన్నింగ్స్లో 444 పరుగులకు ఆలౌటైంది. -
ప్లేఆప్ ఆశలు నిలుపుకున్న హైదరాబాద్
హైదరాబాద్: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు తమ ముందుంచిన 161 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(50), వార్నర్(59)తో రాణించారు. నమన్ ఓజా 24, ఫించ్ 11, స్యామీ 10 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో ఆరోన్ 2 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఈ ఓటమితో బెంగళూరుకు ప్లేఆప్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. హైదరాబాద్ ఆశలు నిలుపుకుంది. -
రైజర్స్కు ‘సొంత’ దెబ్బ
- ముంబైని గెలిపించిన రాయుడు - మెరిసిన సిమ్మన్స్ - ఫించ్, వార్నర్ల శ్రమ వృథా - సొంతగడ్డపై తొలి మ్యాచ్లో ఓడిన సన్రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలతో సొంతగడ్డపై వరుసగా నాలుగు మ్యాచ్లు ఆడేందుకు వచ్చిన సన్రైజర్స్కు... హైదరాబాద్లోని తొలి మ్యాచ్లోనే షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ జట్టులోని హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు సొంతగడ్డపై అద్భుతమైన ఇన్నింగ్స్తో రైజర్స్ను దె బ్బతీశాడు. సిమ్మన్స్ కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడటంతో ఈ సీజన్లో ఉప్పల్లో తొలి మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. సాక్షి, హైదరాబాద్: తెలుగు తేజం అంబటి రాయుడు (46 బంతుల్లో 68; 7 ఫోర్లు; 2 సిక్స్లు) చేతిలో హైదరాబాద్ జట్టు ఓడింది. సోమవారం ఉప్పల్లో ముంబైతో జరిగిన మ్యాచ్ను ఒక్కమాటలో ఇలాగే చెప్పాలి. సొంత మైదానంలో, సొంత ప్రేక్షకుల మధ్య రాష్ట్రానికి చెందిన ఆటగాడు ప్రత్యర్థి జట్టును గెలిపించడం వింతగా అనిపించినా అదే జరిగింది. రాయుడుతో పాటు సిమ్మన్స్ (50 బంతుల్లో 68; 5 ఫోర్లు; 4 సిక్స్లు) కూడా రాణించడంతో 158 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించి 7 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు సన్రైజర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఫించ్ (62 బంతుల్లో 68; 7 ఫోర్లు; 2 సిక్స్), వార్నర్ (31 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు; 2 సిక్స్) మాత్రమే రాణించారు. మలింగకు రెండు వికెట్లు దక్కాయి. భువనేశ్వర్కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రాయుడుకు దక్కింది. రాణించిన ఫించ్ టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్కు ఓ మోస్తరు శుభారంభం దక్కింది. మూడో ఓవర్లో ఫించ్ రెండు ఫోర్లు బాది 13 పరుగులు సాధించాడు. అయితే మలింగ తన తొలి ఓవర్లో కెప్టెన్ ధావన్ (11 బంతుల్లో 11; 2 ఫోర్లు)ను బౌల్డ్ చేశాడు. ఓజా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఫించ్ 6, 4 బాదడంతో పవర్ ప్లేలో 43 పరుగులు వచ్చాయి. అటు ఫించ్ తన జోరును ప్రదర్శించాడు. ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ స్థానంలో బరిలోకి దిగిన ఓజాను లక్ష్యం చేసుకుని పరుగులు బాగానే పిండుకున్నాడు. ఈ సమయంలో లేని పరుగు కోసం యత్నించి లోకేశ్ రాహుల్ (13 బంతుల్లో 10; 1 ఫోర్) రనౌట్ అయ్యాడు. కవర్లో బంతిని పుష్ చేసిన తను పరుగు కోసం వెళ్లాడు. అయితే రోహిత్ వేగంగా స్పందించడంతో రనౌట్ అయ్యాడు. రెండో వికెట్కు 39 పరుగులు వచ్చాయి. ఈ దశలో ఫించ్కు వార్నర్ జత కలిశాడు. ఫించ్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వార్నర్ కూడా బ్యాట్ను ఝళిపించడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ఈ దశలో మలింగ్ బౌలింగ్లో ఫించ్ లాంగ్ ఆఫ్లో భారీ సిక్స్కు యత్నించి పొలార్డ్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివరి ఓవర్లో నమన్ ఓజా (3 బంతుల్లో 7 నాటౌట్; 1 సిక్స్) ఓ సిక్స్తో పాటు వార్నర్ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. చివరి రెండు ఓవర్లలో సన్రైజర్స్ 33 పరుగులు సాధించింది. సిమ్మన్స్, రాయుడు జోరు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ను ఆరంభంలో సన్రైజర్స్ బౌలర్లు అద్భుత రీతిలో అడ్డుకున్నారు. తొలి ఓవర్లో కేవలం రెండు పరుగులే రాగా రెండో ఓవర్లో ఓపెనర్ గౌతమ్ (1)ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. అయితే మరో ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్, అంబటి రాయుడు ఇన్నింగ్స్ను కుదుటపరిచారు. ఇర్ఫాన్ తొలి ఓవర్లో సిమ్మన్స్ 6, 4, 6 తో విరుచుకుపడ్డాడు. ఇదే ఊపును కొనసాగిస్తూ కరణ్ శర్మ బౌలింగ్లోనూ 4, 6తో రెచ్చిపోగా.... రాయుడు పఠాన్ బౌలింగ్లో ఫోర్, సిక్స్తో ఆడుకున్నాడు. ఆ తర్వాత కూడా హైదరాబాద్ బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోవడంతో వీరు యథేచ్ఛగా ఆడారు. 39 బంతుల్లో సిమ్మన్స్ అర్ధ సెంచరీ చేసుకోగా.. రాయుడు 34 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని భువనేశ్వర్ విడదీశాడు. ర్యాంప్ షాట్కు యత్నించిన సిమ్మన్స్ భువీ యార్కర్కు క్లీన్బౌల్డ్ అయ్యాడు. రాయుడు, సిమ్మన్స్ రెండో వికెట్కు 130 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ మరుసటి ఓవర్లోనే రాయుడు... హెన్రిక్స్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే మ్యాచ్లో పైచేయి సాధించిన ముంబై ఒత్తిడికి లోను కాకుండా రోహిత్ (6 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు), పొలార్డ్ (7 బంతుల్లో 6 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు: సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) పొలార్డ్ (బి) మలింగ 68; ధావన్ (బి) మలింగ 11; రాహుల్ (రనౌట్) 10; వార్నర్ నాటౌట్ 55; నమన్ ఓజా నాటౌట్ 7; ఎక్స్ట్రాలు (లెగ్ బైస్ 1, వైడ్లు 5) 6; మొత్తం (20 ఓవర్లలో మూడు వికెట్లు) 157. వికెట్ల పతనం: 1-31; 2-70; 3-133. బౌలింగ్: అండర్సన్ 2-0-17-0; బుమ్రా 4-0-24-0; హర్భజన్ 4-0-27-0; మలింగ 4-0-35-2; ఓజా 4-0-32-0; పొలార్డ్ 2-0-21-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (బి) భువనేశ్వర్ 68; గౌతమ్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 1; రాయుడు (సి అండ్ బి) హెన్రిక్స్ 68; రోహిత్ నాటౌట్ 14; పొలార్డ్ నాటౌట్ 6; ఎక్స్ట్రాలు (వైడ్లు 3) 3; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు)160. వికెట్ల పతనం: 1-2; 2-132; 3-141; బౌలింగ్: స్టెయిన్ 4-0-29-0; భువనేశ్వర్ 4-0-21-2; ఇర్ఫాన్ 2-0-29-0; మిశ్రా 3-0-33-0; శర్మ 2.4-0-25-0; హెన్రిక్స్ 3-0-23-1.