yalamanchili
-
భారతీయ మేధా శిఖరం!
యాభై ఐదు సంవత్సరాల నాటి మాట. 1969 మేలో పూనా–బొంబాయి మధ్యగల లోనావాలా అనే హిల్ స్టేషన్లో లెస్లీ సాక్నీ ప్రజాస్వామ్య శిక్షణ శిబిరంలో ఓ పది, పధ్నాలుగు రోజులున్నాను. ఎమ్.ఆర్. మసానీ ఆ శిబిరానికి ప్రారంభోపన్యాసం చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర ఆచార్యులు ఎస్.పి. అయ్యర్ ప్రిన్సి పాల్గా తరగతులు నిర్వహించారు. నానీ పాల్కీవాలా ఆ సంస్థ అధ్యక్షులు. సోలీ సొరాబ్జీ, రజనీ పటేల్, వి.బి. కార్నిక్, వి.వి. జీన్, అరవింద్ దేశ్పాండే, రాము పండిట్, ఫెడీ మెహతా, ఎస్.వి. రాజు వంటి వారు వివిధ అంశాలపై శిక్షణ గరిపారు.వారిలో ఎ.జి. నూరానీ కూడా ఉన్నారు. ఆయన అప్పటికే ఒక దశాబ్ద కాలంగా వివిధ అంశాలపై పూంఖానుపుంఖాలుగా వివిధ పత్రికలలో వ్యాసాలు రాసేవారు. ఇండి యన్ ఎక్స్ప్రెస్, హిందూ, స్టేట్స్మన్ వంటి స్వదేశీ పత్రికలకే గాక, పాకి స్తాన్లోని ‘డాన్’ పత్రికలో కూడా వారి రచనలు ప్రచురితమవుతుండేవి. ఆ తదుపరి ఫ్రంట్లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి వాటికి కూడా రాసేవారు. జాకీర్ హుస్సేన్, బొంబాయి హైకోర్టులో మొట్టమొదటి భార తీయ వకీలు బద్రుద్దీన్ త్యాబ్జీ జీవిత చరిత్రలను ప్రచురించారు. కశ్మీర్ సమస్య, బాబ్రీ మసీదు, ఆర్టి కల్–370, లద్దాఖ్, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ పాత్ర, పౌరహక్కులు, భగత్ సింగ్పై విచారణ, సావర్కర్, హైదరాబాదు డిమాలిషన్ వంటి భిన్న విభిన్న అంశాలపై రచనలు చేశారు.తదాదిగా బొంబాయిలోగానీ, ఢిల్లీలోగానీ నూరానీని కలుసుకొనే అవకాశం దొరికేది. దక్షిణ బొంబాయిలో వీలు దొరికినప్పుడల్లా ఆయననను కలిసేవాడిని. ఎం.ఆర్. మసానీ అక్కడే బీచ్కాండీలో ఉండేవారు. నూరానీ నేపియన్ సీ అపార్టుమెంట్స్లో ఉండేవారు. అవి రెండూ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండేవి. దానితో మసానీ దగ్గరకెళ్లినప్పుడు విధిగా నూరానీని కూడా కలిసేవాడిని. నూరానీ బల్ల కుర్చీమీద కాకుండా, మంచంమీద కూర్చుని రాసేవారు. చుట్టూ అప్పడాలు ఆరబోసినట్లు లెక్కకు మించిన పుస్తకాలు తెరిచి, తిరగేసి ఉండేవి. ఏదైనా అంశంపై చర్చిస్తుండగా, ఎదురుగా ఉన్న పుస్తకాల్లో ఫలానా పుస్తకం తీసి ఫలానా చాప్టర్ చదవమనేవాడు.తాను చెప్పిన దానిని, వివరంగా అర్థం చేసుకోవడానికి ఉదయం చదివిన పత్రికలలో అవసరమయిన అంశాలను కత్తిరించి, అంశాల వారీగా ఫైల్ చేసేవారు. కొన్ని వందలు, వేల ఫైళ్ళు అలా ఉన్నాయి. ఏ అంశంమీద రాసినా, లోతైన పరిశోధన చేసేవారు. వాజ్పేయి–ముషారఫ్ల మధ్య ఆగ్రాలో జరిగిన చర్చలపై రాసే దానికి, పూర్తి సమాచారం రాబట్టడానికై, పనిగట్టుకొని ఇస్లామాబాద్ వెళ్లి పరిశోధన గావించారు. క్రీ.శ. 1775–1947ల మధ్య జరిగిన రాజకీయ ప్రేరిత విచారణలపై సమగ్ర పరిశోధన చేసి గ్రంథస్థం గావించారు. ‘జిన్నా–తిలక్ – కామ్రేడ్స్ ఆఫ్ ఫ్రీడం స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. అయితే ఏది ఎలా ఉన్నా ఎవరిమీదా వ్యక్తిగతంగా విమర్శ చేసేవారు కాదు. ‘రాజాజీ – అంకి తమైన, నిబద్ధతగల హిందువు, మహో న్నతమైన భారతీయుడు, అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు అలు పెరుగని రక్షకుడు’ అని కొనియాడారు. షేక్ అబ్దుల్లా, కరుణానిధిల తరఫున సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టులలో వకీలుగా తన వాదనలను వినిపించారు.నూరానీకి కొన్ని నిర్దిష్టమయిన, చిత్ర–విచిత్రమయిన అభిరుచులు ఉండేవి. ఢిల్లీ వస్తే ఇండియా ఇంటర్నేష నల్ సెంటర్లో 38వ నంబరు గదిలోనే మకాం. ఓల్డ్ ఢిల్లీ, నిజాముద్దీన్, కరోల్ బాగ్, జామా మసీదు వంటి చోటసందులు – గొందులలోని హోటళ్లలో కబాబ్–కుర్మా ఎక్కడ దొరుకు తుందోనని శోధించి, ఆస్వాదించేవారు. గత నెలాఖరులో తన 94వ ఏట కన్నుమూసిన అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ సేకరించిన వేలాది పుస్తకాలు, పేపర్ క్లిప్పింగ్లు ఏమవుతాయో? ఏదైనా జాతీయ స్థాయిలో నున్న గ్రంథాలయం గానీ, పరిశోధనా సంస్థలు, లేక జాతీయ పత్రికలు భద్రపరిచి, సద్వినియోగం గావించడం అవసరం. అవి భావి తరాలకు ప్రజాసేవా రంగాలలో, పాత్రికేయ రంగంలోకి అడుగు పెట్టే యువతరానికి ఉపయుక్తం కాగలవు. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు, 98663 76735 -
జనసేనకు ఝలక్.. ఐదురోజుల్లోనే సొంత గూటికి..
సాక్షి, అనకాపల్లి జిల్లా: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ప్రలోభాలు, మాయమాటలతో మభ్యపెట్టి అయిష్టంగా తమ పార్టీల్లోకి చేర్చుకోవడానికి యత్నించిన కూటమి పార్టీలకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఝలక్ ఇస్తున్నారు. కూటమి పార్టీకు బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదోలా గెలవడానికి ప్రయత్నించిన ఆ పార్టీల నేతలు భంగపడిన ఘటన యలమంచిలి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని జంపపాలెం ఎంపీటీసీ శిలపరశెట్టి ఉమ యలమంచిలి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా పదవిలో ఉన్నారు. ఈ నెల 8న ఉమను మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, మరికొంత మంది జనసేన రాష్ట్ర, స్థానిక నేతల సమక్షంలో జనసేన పార్టీలో చేర్చుకున్నట్టు ప్రచారం చేశారు. ఈ మేరకు ఉమకు జనసేన పార్టీ కండువా వేసిన ఫోటోలను మీడియాకు పంపించారు. అయితే కేవలం 5 రోజుల్లోనే శిలపరశెట్టి ఉమ తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు.బుధవారం తాడేపల్లిలో పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో జరిగిన యలమంచిలి నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశంలో ఉమ ఆమె భర్త గణేష్తో హాజరయ్యారు. సమావేశంలో భాగంగా మాజీ సీఎం జగన్ను కలిసిన ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. జనసేనలో ఐదు రోజులు కూడా ఇమడలేక తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.ఎంపీటీసీల సమావేశం ఉందని మాయమాటలు చెప్పి బలవంతంగా జనసేన కండువా వేశారని, తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని శిలపరశెట్టి ఉమ సాక్షికి తెలిపారు. పార్టీ అధినేత జగనన్నతోనే తమ ప్రయాణం ఉంటుందన్నారు. ఈ పరిణామం నియోజకవర్గంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. కేవలం ఐదు రోజుల్లోనే జనసేనను వీడడంతో లేని బలం ఉన్నట్టు చూపించుకోవడానికి ప్రయత్నించిన జనసేన నేతలు అభాసుపాలైనట్టయిందని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. -
జగన్ పాలనే ఉండి ఉంటే చర్చ మొదలైంది
-
యలమంచిలి టీడీపీ-జనసేన సమావేశం రసాభాస
-
పవన్ తిక్క.. పైత్యంగా మారిందా?.. జనసేనలో ‘సర్వే’ రచ్చ
సాక్షి, విశాఖపట్నం: సర్వేల పేరుతో ఆశావహులు, అభ్యర్థులతో పాటు క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు పవన్.. ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం నెలకొంది. ఐవీఆర్ఎస్ సర్వే కలకలం రేపుతుండగా, ఇదేం తిక్క అంటూ పవన్ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న పవన్ ధోరణిపై జనసేనలో రచ్చ జరుగుతోంది. తాజాగా, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్పై ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. సీటు కేటాయించిన తర్వాత కూడా సర్వే నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళనలో పడ్డారు. విజయ్ కుమార్ను యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం జరగ్గా, తరువాత జనసేన జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. మరోవైపు చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పీవీఎస్ఎన్ రాజు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అనుచరులతో ఆయన రహస్యంగా సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించారు. ఇదీ చదవండి: దళితులు, డ్రైవర్లంటే అంత చిన్నచూపా చంద్రబాబూ? -
బీసీలను లీడర్లను చేసింది సీఎం జగన్ ఒక్కడే..
-
గోదావరి దాటికి విలవిలలాడుతున్న లంక గ్రామాలు
-
Adari Tulasi Rao: ఆంధ్రా కురియన్కు నివాళి!
అనూహ్యమైన, అనితరసాధ్యమైన పాల ఉత్పత్తి రంగంలో విజయాలు సాధించిన ఆడారి తులసీరావు ఈనెల 4వ తేదీన మరణించారు. మూడున్నర దశాబ్దాలు విశాఖ డెయిరీ ఛైర్మన్గా వ్యవహరించి, రైతుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. మూడు జిల్లాల పరిధిలోని ప్రతి ఒక్క రైతుతో ప్రత్యక్ష సంబంధాలు నెరుపుతూ ఉండేవారు. డెయిరీకి పాలు సరఫరా చేసే వేలాదిమంది రైతుల పిల్లలకు అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించారు. పాడి రైతులలో పేదవారి పిల్లలకు హాస్టలు వసతి కల్పించి, ఉచిత విద్యను బోధింపజేసిన సేవాదృక్పథం ఆయనది. రైతాంగ యువత ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఆత్మ విశ్వాసంతో వ్యవసాయాన్నీ, పాడినీ అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా ఆత్మ గౌరవంతో జీవించడానికి ప్రయత్నించాలని తరచూ తన అనుభవాలు జోడించి ఉద్బోధించేవారు. పాలను సేకరించి, వినియోగదారులకు పాలు, పెరుగు, మజ్జిగ అమ్మడమే ప్రధానంగా కొనసాగిన విశాఖ డెయిరీ, అనంతర కాలంలో ఆ పాలతో అనేక ఇతర ఆహార ఉత్పత్తులు ప్రారంభించి రుచి, శుచిలో అగ్ర తాంబూలం అందుకునేలా చేసిన సవ్యసాచి ఆయన. ఆంధ్రా కురియన్గా కీర్తించబడినా కించిత్ గర్వం, అతిశయం దరిచేరనివ్వని వ్యక్తిత్వ శైలి ఆయనది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో డెయిరీ కార్యకలాపాలను నిర్వహిస్తూనే, యలమంచిలి నియోజక వర్గం రాజకీయాలలో ఆరు దశాబ్దాలు క్రియాశీల పాత్ర పోషించారు. ఆనాటి విశాఖ జిల్లా బోర్డు సభ్యునిగా వ్యవహరించిన తన తాత స్వర్గీయ ఆడారివీరు నాయుడు ఆయనకు స్ఫూర్తి. నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి పంచాయతీకి మూడుసార్లు సర్పంచ్గా ఎన్నికైనారు. యల మంచిలి పురపాలక సంఘంగా మారిన తర్వాత రెండుసార్లు ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 2015 డిసెంబరులో భారత పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ తన 37వ జాతీయ సమావేశంలో తులసీరావు పోస్టల్ స్టాంపును విడుదల చేయడం, ఆడారి కీర్తి కిరీటంలో కలికితురాయి. లక్షలాదిమంది రైతులు, వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవితాలకు బతుకుదెరువు చూపించిన దార్శనికుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆడారి తులసీరావు అంత్యక్రియల్లో పాల్గొనడం ఆయన మృతికి గొప్ప నివాళి. ఆయన మరణించినా, పల్లెల్లో ఆయన నిర్మింపజేసిన వందలాది కట్టడాలు ఆయన సేవలను మరింత చిరస్మరణీయం చేస్తాయి. లక్షలాది కుటుంబాలు తరతరాలు ఆ మహనీయునికి రుణపడి ఉంటాయి. (క్లిక్ చేయండి: ఆయన జీవితం.. స్ఫూర్తివంతం.. ఫలవంతం) – బి.వి. అప్పారావు, విశాఖపట్నం -
జలదిగ్బంధంలో యలమంచిలి
-
గుండుసూదిపై స్వర్ణ ‘ఒలింపిక్స్ చిహ్నం’
యలమంచిలి రూరల్: ఒలింపిక్స్ క్రీడోత్సాహం ఎల్లెడలా వెల్లివిరిస్తోంది. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేలా ఏటికొప్పాక హస్తకళాకారుడు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీశైలపు చిన్నయాచారి రూపొందించిన సూక్ష్మ ఒలింపిక్స్ చిహ్నం అందర్నీ ఆకర్షిస్తోంది. 22 క్యారెట్ బంగారంతో ఒలింపిక్స్ చిహ్నాన్ని తయారు చేసి గుండు సూది పైభాగంలో ఆయన అమర్చారు. 1 మి.మీ. ఎత్తు, 2 మి.మీ. వెడల్పుతో ఈ కళాఖండాన్ని సృజించేందుకు రెండు రోజుల వ్యవధి పట్టిందని, దీనిని మైక్రోస్కోప్లో మాత్రమే స్పష్టంగా వీక్షించగలమని చిన్నయాచారి చెప్పారు. -
ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
-
ఏటి ‘గొప్పా’క
యలమంచిలి రూరల్, అచ్యుతాపురం: విశాఖ జిల్లా యలమంచిలి మండలం వరాహనది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామంలో అంకుడు కర్రతో రూపొందించిన బొమ్మలు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించాయి. ఇక్కడి కళాకారులు సహజసిద్ధంగా లభించే కర్ర,, మైనం, సహజ రంగులతో తమ సృజనకు పదునుపెట్టి అనేకరూపాల్లో బొమ్మలు తయారు చేస్తారు. ఏటా ఈ గ్రామం నుంచి రూ. 10 కోట్ల వ్యాపారం జరుగుతోంది. రిటైల్ అమ్మకం దారులు, సరుకురవాణాచేసేవారు.. ఇలా అనేక కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఏటికొప్పాక కళ వందేళ్లక్రితం ఉప్పుచిప్ప, కుంకుమ భరిణి, పిల్లలు ఆడుకునే దొండకాయ తయారీతో ప్రారంభమయింది. ఒక తరం నుంచి మరో తరానికి.. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ఎటువంటి శాస్త్రం లేదు. ఒక తరం నుంచి మరోతరం నేర్చుకోవడమే జరుగుతోంది. ఒక బొమ్మ తయారీకి 3 నుంచి 10 విడిభాగాలు తయారుచేస్తారు. పలు బొమ్మల సమాహారం ఒక చిత్రరూపంగా రూపొందుతుంది. అంకుడు కర్రను విడిభాగాలుగా చెక్కి వాటికి మైనం పూస్తారు. ఒక్కొక్క భాగానికి రంగులు అద్ది ఆరబెడతారు. విడిభాగాలన్నీ కలిపి బొమ్మ తయారుచేస్తారు. రాజు, రాణి, పల్లకీ, భటులు.. ఇలా బొమ్మలను కలిపి చిత్రరూపంగా తయారుచేసి అమ్మకానికి పెడతారు. చారిత్రక కథారూపాలు, గ్రామీణ ఉత్సవ సందడి, అన్నమయ్య, దశావతారాల ఆలయం, పెళ్లిసందడి, రథం, పల్లెటూరు, ఎడ్లబండి వంటి చిత్రరూపాలను కళాకృతులుగా తయారుచేసి ఏటికొప్పాక కళాకారులు తమ సత్తా చాటారు. వైఎస్సార్ ఆసరాతో ఉలి పట్టిన బాలికలు కొన్నాళ్ల క్రితం వరకు కళాఖండాల తయారీలో మహిళలు ఉలిపట్టుకునేవారు కాదు. మగవారు బొమ్మల్ని తయారుచేస్తే మహిళలు మైనం, రంగులు అద్దేవారు. వైఎస్సార్ హయాంలో రూ. 50 లక్షలతో గ్రామంలో కళాకారులకు కమ్యూనిటీహాల్ నిర్మించారు. ప్రత్యేక కాలనీ, విద్యుత్ మోటార్లు ఇచ్చారు. కళాకారుల సంక్షేమ సంఘం ద్వారా పాఠశాల స్థాయిలో బొమ్మల తయారీపై శిక్షణ ప్రారంభించారు. దీంతో ఎక్కువగా బాలికలు బొమ్మల తయారీ నేర్చుకుంటున్నారు. విద్యుత్ మోటార్ల వినియోగం పెర గడంతో బొమ్మల తయారీలో శారీరక శ్రమ తగ్గింది. అవార్డుల పంట అంకుడుకర్రతో కళాకృతులు రూపొందించి ఈ గ్రామానికి చెందిన కళాకారులు అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. శ్రీశైలపు చిన్నయాచారి 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. శ్రీశైలపు రమణ, పెదపాటి ఆనందాచారి జాతీయ మెరిట్ పురస్కారం పొందారు. పీఆర్వీ సత్యనారాయణ, కొత్తలి శ్రీను, కె.సోమేశ్వరరావు, లక్కరాజు నాగేశ్వరరావు, పెదపాటి శివకృష్ణ రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారు. ‘అమ్మ’కాల్లో అగ్రస్థానం... బిడ్డను ఎత్తుకొని లాలించే అమ్మ బొమ్మను ఏటికొప్పాక కళాకారులు దశాబ్దం క్రితం రూపొందించారు. ఈ బొమ్మ విశేష ఆదరణ పొందింది. ఈ ఆకృతిలో ఉండే బొమ్మల అమ్మకాలే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఏటా వేల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఈ బొమ్మనే చాలా కార్యక్రమాల్లో అవార్డుగా ప్రదానం చేస్తున్నారంటే దీని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలోనూ ఏటి కొప్పాక బొమ్మల్నే మెమెంటోలుగా అందజేశారు. తరతరాలుగా కొనసాగుతున్న కళ.. బొమ్మల తయారీని తరతరాల నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్నాము. బ్రిటీషు వారి హయాంలోనే కుంకుమ భరణి, ఉప్పుచిప్ప, దొండకాయ, పెళ్లికొడుకు పెళ్లికూతురు బొమ్మల్ని చెక్కారు. ఉప్మాక తీర్థంలో అమ్మకానికి పెట్టేవారు. 1910 నాటికి మా తాత పెదపాటి సత్యం హయాంలో చిలుకలు ,పెళ్లికి వ్రతంకి నగిసీలుదిద్దిన పీటలు, డబ్బులపెట్టి తయారుచేసేవారు. మా నాన్న ఆనందాచారి హయాంకి నాజూకైన బొమ్మల తయారీపై దృష్టి పెట్టారు. మా నాన్నగారి హయాంలో రంగులను తగుమోతాదులను మార్చడంద్వారా కొత్తరంగులను కనుక్కున్నారు. ద్రాక్ష గుత్తులు, అరటి పళ్లు వంటివి తయారుచేసేవారు. మా తరంలో ఆలయ సముదాయం, గుర్రపు బండి పెండ్లిసందడి వంటి సన్నివేశాలను ప్రదర్శించేలా కళాకృతుల సమ్మేళనాలను తయారుచేస్తున్నాము. అప్పట్లో ఈ పరిశ్రమ లాభసాటిగా ఉండేది. ఈ మధ్య చైనా బొమ్మల పోటీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రోత్సాహం ఉంటే మరింత మంది కళాకారులు తయారయ్యే అవకాశం ఉంది. – పెదపాటి శరత్, జాతీయఅవార్డు గ్రహీత సిరామిక్, ప్లాస్టిక్తో తయారు చేసే దేశ, విదేశీ బొమ్మలు కుప్పలు తెప్పలుగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఏటి కొప్పాక బొమ్మల్లో సహజసిద్ధమైన రంగుల్ని మాత్రమే వినియోగించడం వల్ల ఎన్నాళ్లు ఉన్నా గాలిలో రసాయన మార్పులు చెందవు. సహజరంగుల తయారీ ఇలా.. మైనంకి ఎటువంటి రంగు ఉండదు. మైనం కరిగించి దీనిలో స్వయంగా తయారు చేసుకున్న సహజ రంగుల్ని కలిపి కర్రకు పూస్తారు. ఎరుపు రంగు: బిక్షా ఒరిల్లా విత్తనాల నుంచి ఎరుపురంగు తయారుచేస్తారు. కేజీ విత్తనాలను లీటరు నీటిలో నానబెట్టి రంగునీళ్లు సేకరిస్తారు. దీన్ని మరిగించడంతో చిక్కటి ఎరుపురంగు ద్రావణం తయారవుతుంది. నీలంరంగు: ఇండిగో మొక్కల ఆకులనుంచి నీలంరంగు సేకరిస్తారు. ఇండిగో ఆకుల్ని డ్రమ్ములో కుళ్లబెట్టి పసరు తీస్తారు. ఈ పసరును ఘనీభవింపజేసి ఇండిగో రంగు ముక్కలుగా నిల్వచేసుకుంటారు. పసుపురంగు: పసుపు కొమ్ములనుంచి తీసుకుంటారు. మైనంలోకలిపి వినియోగిస్తారు. ఆకుపచ్చరంగు: ఇండిగో ముక్కల్లో పసుపు కలపడంతో తయారవుతుంది. నలుపురంగు: పాడైపోయిన నల్లబెల్లం, ఇనుపతుప్పుని వేడినీళ్లలో కలిపి నెలరోజులపాటు కుండలో నిల్వచేస్తారు. కరక్కాయ తొక్కల్ని నీటిలో మరిగించి కషాయం తయారుచేస్తారు. నల్లబెల్లం నీటి కషాయాన్ని కలిపి మరిగిస్తే నల్లరంగు వస్తుంది. ప్రధానరంగులను తగు మోతాదులో కలపడం ద్వారా కళాకారులు తమకు అవసరమైన పలు వర్ణాలు తయారు చేసుకుంటారు. కళ నిలబడాలంటే.. - అటవీశాఖ ఆధ్వర్యంలో అంకుడు కర్ర సాగు చేపట్టాలి. కర్ర సరఫరాలో అడ్డంకులు లేకుండా చూడాలి. కర్ర సాగు, అమ్మకాన్ని చట్టబద్ధం చేయాలి. - కళాకారులకు వడ్డీలేని రుణాలు అందించాలి. సొసైటీద్వారా షెడ్లు నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి. - మున్సిపాలిటీ, కార్పొరేషన్ , బస్కాంప్లెక్స్ పరిధిలో దుకాణాలు ఏర్పాటుచేసుకోవడానికి స్థలాలు కేటాయించాలి. - కళలో కంప్యూటర్ డిజైనింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జొప్పించాలి. - చైనా బొమ్మలను తెచ్చి ఏటికొప్పాక బొమ్మలుగా నమ్మంచి అమ్ముతున్న వర్తకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పింఛను సౌకర్యం కల్పించాలి.. కళ నేర్చుకోవడం మానసిక స్థైర్యాన్నిస్తుంది. ఈ నమ్మకంతోనే బాలికలు ఎక్కువ మంది బొమ్మల తయారీ నేర్చుకుంటున్నారు. మా పూర్వీకుల నుంచి పారంపర్యంగా దీన్ని నేర్చుకుంటున్నాము. సీనియర్ కళాకారులకు ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించాలి. – పి.శ్రావణి, యువకళాకారిణి -
‘ఎమ్మెల్యే రామానాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి’
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో యలమంచిలి మండలంలోని ఇసుక ర్యాంపులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కవురు శ్రీనివాస్, మండల కన్వీనర్ పోత్తూరి బుచ్చిరాజు, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, చెల్లెం ఆనంద ప్రకేష్లు సోమవారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇసుక ర్యాంపులపై అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. గత ప్రభుత్వంలో ఇసుకపై పర్సంటేజీలు తీసుకుని 100ల కోట్లు దోచుకున్న విషయం మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు మరిచిపోలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకమైన పాలన అందిస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇసుక కొరత ఏర్పడిన విషయం వాస్తవమని అన్నారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఇసుక నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్లైన్లో ఇసుక పాలసీని ప్రారంభించామని ఆయన తెలిపారు. -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ యలమంచిలి ఫ్లైఓవర్
-
కొత్తదనం వైపు.. ‘యలమంచిలి’ చూపు
అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గం వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి మిళితం. మున్సిపాలిటీ హోదా సాధించింది. ఈ నియోజకవర్గంలో దేశంలోనే చెప్పకోదగ్గ ఏటికొప్పాకలో బొమ్మల తయారీ కళాకారులు ఉన్నారు. అచ్యుతాపురంలో స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏర్పాటైంది. రాంబిల్లి మండలంలో రక్షణ శాఖకు చెందిన నేవెల్ బేస్ను ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్రంలో కొల్లేటి సరస్సు తరువాత ఆస్థాయిలో కొండకర్ల ఆవ ఉంది. ప్రధాన జల వనరుగా శారదానది ప్రవహిస్తోంది. ఈ నియోజకవర్గ పరిధిలో వరి, చెరకును ప్రధాన పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. యలమంచిలిలో కనకమహాలక్ష్మి, భూలోకమాంబ, మామిడివాడ పైడితల్లి అమ్మవారు, చోడపల్లి చోడమాంబిక, మునగపాక గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అలాగే పంచదార్ల పుణ్యక్షేత్రం జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచింది. రాజకీయ నేపథ్యం... యలమంచిలి నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకూ 14 సార్లు ఎన్నికలు జరిగాయి. రాంబిల్లి మండలం దిమిలికి చెందిన వారు ఎక్కువ కాలం పాలన సాగించారు. యలమంచిలి నియోజకవర్గంలో గతంలో ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాలు ఉండేవి. దిమిలికి చెందిన పప్పల బాపునాయుడు, నగిరెడ్డి సత్యం ఒక్కొక్కసారి ఎస్.రాయవరం మండలం సైతారుపేటకు చెందిన వీసం సన్యాసినాయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అచ్యుతాపురం మండలానికి చెందిన కేకేవీ ఎస్ రాజు ఒకసారి గెలుపొందారు. 1983, 1989, 1994 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు రాంబిల్లి మండలం దిమిలికి చెందిన పప్పల చలపతిరావు టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొం దారు. అత్యధికంగా పప్పల చలపతిపావు 19,000 మెజారిటీతో నగిరెడ్డి ప్రభాకర్పై విజ యం సాధించారు. పప్పల చలపతిరావు, నాలుగు ఎన్నికల్లోనూ, వీసం సన్యాసినాయుడు, కె.కె.వి.ఎస్. రాజు, యు.వి.రమణమూర్తిరాజు, ప్రభాకరరావులను ఓడించారు. 1999 ఎన్నికలో కాంగ్రెస్ తరుపున పోటీచేసి యు.వి.రమణమూర్తిరాజు ఓటమి చెందారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ తరుపున గెలుపొందారు. యు.వి. రమణమూర్తిరాజు తాను గెలి చిన రెండు ఎన్నికల్లోనూ గొంతెన నాగేశ్వరరావుపై 5,863, 10,090 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పంచకర్ల రమేష్బాబు ప్రత్యర్థి ప్రగడ నాగేశ్వరరావుపై 8,375 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రగడ నాగేశ్వరరావు ఓడినప్పటికీ టీడీపీకి దీటుగా జవాబు చెప్పారు. నియోజకవర్గ ఓటర్లు 1,88,766 పురుషులు 92,879 మహిళలు 95,875 ఇతరులు 12 పోలింగ్ బూత్లు 224 గెడ్డకు అవతల–గెడ్డకు ఇవతల... యలమంచిలి నియోజకవర్గం ఏర్పాటుకు ముందు నుంచి శారదా నది హద్దుగా గెడ్డ అవతల గెడ్డ ఇవతల అనే విభజన ప్రజల్లో ఉండేది. ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లిలో సగం మండలం గెడ్డ అవతల అనేవారు. రాంబిల్లి మండలంలో మిగిలిన సగభాగం, అచ్యుతాపురం మండలాలను గెడ్డ ఇవతల అనేవారు. 1983 వరకూ గెడ్డ అవతల, ఇవతల నినాదం కొనసాగింది. గెడ్డ అవతల వ్యక్తులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1981లో గెడ్డ ఇవతల కె.కె.వి.ఎస్.రాజు ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీలపరంగా రాజకీయ చైతన్యం పెరిగిన తర్వాత ఈ నినాదం సమసిపోయింది. ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు.. కాలపరిమితి ఎమ్మెల్యే పార్టీ 1952 పి.బాపునాయుడు కె.ఎల్.పి 1955 సి.వి.ఎస్.రాజు ఇండిపెండెంట్ 1962 వి.సన్యాసినాయుడు కాంగ్రెస్ 1967 ఎన్.సత్యనారాయణ ఇండిపెండెంట్ 1972 కె.వి.కాకర్లపూడి ఇండిపెండెంట్ 1978 వి.సన్యాసినాయుడు కాంగ్రెస్ 1983 కె.కె.వి.ఎస్.రాజు టీడీపీ 1985 పప్పల చలపతిరావు టీడీపీ 1989 పప్పల చలపతిరావు టీడీపీ 1994 పప్పల చలపతిరావు టీడీపీ 1999 పప్పల చలపతిరావు టీడీపీ 2004 యు.వి.రమణమూర్తిరాజు కాంగ్రెస్ 2009 యు.వి.రమణమూర్తిరాజు కాంగ్రెస్ 2014 పంచకర్ల రమేష్బాబు టీడీపీ పునర్విభజనలో మారిన కులసమీకరణ... 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్.రాయవరం మండలం పాయకరావుపేట నియోజకవర్గంలో కలిసిపోయింది. మునగపాక మండలం యలమంచిలిలో చేరింది. అప్పటివరకు కాపు, వెలమ, మత్స్యకార సామాజికవర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. మునగపాక మండలం కలవడంతో గవర సామాజిక వర్గం ప్రాధాన్యత పెరిగింది. నియోజకవర్గంలో అధిక ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గానికి ఉంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు... నియోజకవర్గంలో 224 పోలింగ్ బూత్లు ఉన్నాయి. వీటిలో సమస్యాత్మకమైనవి యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 1, 3, 6, 7 వార్డులు, ఏటికొప్పాక, ఎర్రవరం, రాంబిల్లి మండలంలో కొత్తపట్నం, గజిరెడ్డిపాలెం, వైలోవ, మునగపాక మండలంలోని వాడ్రాపల్లి, నాగవరం, ఉమ్మలాడ, అచ్యుతాపురం మండలంలో తంతడి, కొండకర్ల, పూడిమడక, ఎస్ఈజెడ్ కాలనీ, దోసూరు, దొప్పెర్ల, ఇరువాడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. -
తండ్రి మీదకి కుక్కను ఉసిగొల్పుతూ..
సాక్షి, యలమంచిలి: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉన్నమట్ల లక్ష్మణదాసు. పశ్చిమగోదావరి జిల్లా కొంతేరు పంచాయతీ లేతమామిడితోటకు చెందిన లక్ష్మణదాసు భార్య చనిపోయింది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను పెళ్లి చేసుకోలేదు. చిన్న కుమారుడు చిరంజీవికి, కూతురు సౌమ్యలకు పెళ్లి అయ్యింది. లక్ష్మణదాసుకు ప్రభుత్వం ఇచ్చిన ఐదు సెంట్ల ఇంటి స్థలం ఉంది. అది కాకుండా మరో ఐదు సెంట్ల స్థలం ఉంది. ఈ మధ్య చిన్న కుమారుడు చిరంజీవి, అతని భార్య రజని ఆస్తి తమ పేరిట రాయమని ఇబ్బంది పెడుతున్నారు. అతని స్థలంలో ఉన్న కొబ్బరి చెట్ల ఫలసాయం కూడా తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా కుక్కను తీసుకువచ్చి లక్ష్మణదాసుపై ఉసిగొల్పుతూ భయపెడుతున్నారు. దీనిపై స్థానిక సంఘ పెద్దలకు చెపితే వారి మాట కూడా వినకుండా సంఘ పెద్దలను దుర్భాషలాడి చెదరగొట్టారు. దీంతో స్థానిక సర్పంచ్ కలుగజేసుకుని ఆస్తి రాయమని సలహా ఇచ్చారు. సరే కదాని ఇరువురు కుమారులకు చెరొక 5 సెంట్ల స్థలం ఇవ్వడానికి సిద్ధపడగా అలా కుదరదు నాకు ఏడున్నర సెంట్లు రాయాలని చిన్న కొడుకు, కోడలు ఎదురుతిరగడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంటిలో ఉంటుంటే సూటి పోటు మాటలతో ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో తన కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని లక్ష్మణదాసు తహసీల్దార్ వి. స్వామినాయుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. -
కమీషన్ల యావ తప్ప జన ఘోష పట్టలేదు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన మాకన్నీ కష్టాలే మిగిల్చింది. కమీషన్ల కక్కుర్తి తప్ప బడుగు, బలహీన వర్గాల సమస్యలేవీ ఆయన పట్టించుకోవడం లేదు. రోడ్లు లేవు.. పింఛన్లు ఇవ్వరు.. ఆరోగ్యశ్రీ అమలు చేయరు.. మైనారిటీలను చిన్నచూపు చూస్తున్నారు. సెజ్, ఎన్ఏఓబీ నిర్వాసితులను పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మా సమస్యలు పరిష్కరించాలయ్యా..’ అంటూ వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో మొరపెట్టుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 247వ రోజు సోమవారం వైఎస్ జగన్.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో పాదయాత్ర కొనసాగించారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, అక్కచెల్లెమ్మల ఆత్మీయత, అనురాగాల మధ్య రామన్నపాలెం నుంచి ప్రారంభమైన యాత్ర అప్పన్నపాలెం, మదుటూరు జంక్షన్, సాని కాలువ, చీమలాపల్లి, బంగారుపాలెం క్రాస్, కొండకర్ల మీదుగా కొండకర్ల జంక్షన్ వరకు సాగింది. దారిపొడవునా వేలాది మంది ఎంతగా ఘన స్వాగతం పలికారో అంతగా తమ సమస్యలనూ విన్నవించారు. జగన్ను కలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తమరు అధికారంలోకి రాగానే వాటికో పరిష్కారం చూపాలంటూ వేడుకున్నారు. ఎన్ఏఓబీ నిర్వాసితులకిచ్చిన హామీలన్నీ గాలికే నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్ (ఎన్ఏఓబీ) నిర్వాసితులు తాము పడుతున్న ఇక్కట్లను జగన్ దృష్టికి తీసుకువచ్చారు. 2011 సెప్టెంబర్ 3న అప్పటి జిల్లా కలెక్టర్ తమ 13 డిమాండ్లను పరిష్కరిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చినా ఇంతవరకు ఏ ఒక్కటీ పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఏఓబీ కోసం తీసుకున్న భూములకు ఇచ్చే పరిహారంలోనూ తేడా చూపుతున్నట్టు చెప్పారు. ‘ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్ష, పరోక్ష నిర్వాసితులకు ఆనాడు ఇచ్చిన హామీ ప్రకారం కేంద్రీయ విద్యాలయం లేదా గురుకుల ఆశ్రమ పాఠశాల, కేంద్రీయ ఆరోగ్య కేంద్రం నిర్మించాలి. మత్య్యకార కుటుంబాలపై ఆధారపడిన ఇతర వర్గాల వారికి నష్టపరిహారం ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. గుర్తింపు కార్డులు ఇవ్వాలి. జెట్టి నిర్మాణం చేయాలి. కాంట్రాక్ట్, కార్మిక సంఘం ఏర్పాటుకు అనుమతించాలి. వేతన నష్టపరిహారం చెల్లించాలి. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులతో పాటు కుటుంబాల జాబితా తయారు చేసి న్యాయం చేయాలి. చేపలు అమ్ముకునే మహిళలకు ఆర్థిక సహాయం అందించాలి. సొసైటీ భూములకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. పునరావాస ప్యాకేజీని ఆయా కుటుంబాల్లోని మేజర్ అయిన కుమార్తెలు, కుమారులకు కూడా వర్తింపజేయాలి. అయితే వీటిల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు’ అని నిర్వాసితుల సంఘం నాయకులు సీహెచ్ అప్పారావు, మేరిగి అప్పలరాజు తదితరులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మరోపక్క కొత్త్తపట్నం, వాడనరసాపురం పరిధిలోని మత్స్యకారులు సుదీర్ఘకాలం నుంచి చేపల వేట సాగిస్తున్న ప్రాంతాలను ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంటోందని చెప్పారు. తమకు చెప్పకుండానే సముద్రంలో నాలుగు రాతి వంతెనలు, ఇనుప వంతెనలు నిర్మిస్తున్నారని, ఇవి పూర్తయితే మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాపోయారు. ఎన్ఏఓబీ ప్రాజెక్టు నుంచి సుమారు 5 కిలోమీటర్ల పొడవునా కొత్తపట్నం, యాత కొత్తపట్నం గ్రామాల మీదుగా పైపు లైను సముద్రంలోనికి తీసుకువెళ్లి అక్కడ డ్రెడ్జింగ్ నిర్వహిస్తూ ఇసుకను బయటకు తీసుకువస్తున్నారని, దీనివల్ల మత్స్యసంపద అంతరించి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల పరోక్షంగా ప్రభావితమయ్యే కుటుంబాలకు కూడా నౌకదళం వారు సహాయ పునరావాస ప్యాకేజీ ఇచ్చేలా చూడాలని జగన్ను కోరారు. వీరి సమస్య ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే పూర్తిగా పరిశీలించి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దిబ్బపాలెం పునరావాస కాలనీలో అక్రమాలు... అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) నిర్వాసితుల కోసం దిబ్బపాలెం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాలు, ప్యాకేజీల అమలులో అక్రమాలకు అంతే లేకుండా పోయిందని ఆ కాలనీ వాసులు కె.రమణ, ఎస్.బాబూరావు, ఎ.శ్రీనివాసరావులు జగన్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించి.. అనర్హులను కూడా అర్హులుగా గుర్తించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఇదే జరిగితే సుమారు 700 మంది అనర్హులు లబ్ధి పొందుతారని వాపోయారు. సెజ్ కోసం భూమిని సేకరించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు న్యాయం జరగలేదని నిర్వాసితుల సంఘం ప్రతినిధులు జగన్ ఎదుట వాపోయారు. సెజ్ పునరావాస కాలనీలో ఐటీఐ, పాలిటెక్నిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, నిర్వాసితులకు స్థానిక కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించేలా చూడాలని కోరారు. యలమంచిలి నియోజకవర్గంలో తమ పట్ల వివక్ష చూపుతున్నారని పలు క్రిస్టియన్ సంఘాలు జగన్ దృష్టికి తీసుకువచ్చాయి. శ్మశానాలు కూడా లేకుండా చేస్తున్నారని, ఎవరైనా చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి వీలు లేకుండా ఆంక్షలు పెడుతున్నారని ఆర్మీ ఆఫ్ ది లార్డ్ సంఘానికి చెందిన జాషువారాయ్, అచ్యుతాపురం పాస్టర్ సుధీర్ తదితరులు ఫిర్యాదు చేశారు. చర్చిలు కట్టుకోవడానికి ఇచ్చే మైనారిటీ ఫండ్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో చర్చికి తాళాలు వేసి పాస్టర్లు రాకుండా చేస్తున్నారని వాపోయారు. నేను బతికున్నానంటే వైఎస్ చలువే.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ వల్లే తానీవేళ బతికున్నానని కొండకర్ల వద్ద అరుణ అనే యువతి జగన్ ఎదుట భావోద్వేగానికి లోనయ్యింది. తనకు చిన్నప్పటి నుంచి గుండె జబ్బు ఉండేదని, తన తల్లిదండ్రులు ఎక్కడెక్కడో చూపించి.. ఐదారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్థోమత లేక నిశ్చేష్టులై ఉన్న స్థితిలో ఆరోగ్య శ్రీతో బతికి బయటపడ్డానని వివరించింది. ఆ రోజుల్లో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు పెద్దాస్పత్రుల్లో ఆపరేషన్లు చేయించే వారని 13 ఏళ్ల నాటి సంగతుల్ని గుర్తు చేసుకుంది. అసలు బతుకుతానని అనుకోలేదని, తనకు ఇప్పుడు ఇద్దరు పిల్లలని చెప్పింది. పిల్లల్ని బాగా చదివించాలని, ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవం తీసుకువస్తానని జగన్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే మా ఆరోగ్యాలు బాగుంటాయని ఆరోగ్య శ్రీతో బతికి బట్టకట్టిన కె.అందులాపల్లి గ్రామానికి చెందిన గుబ్బల జ్యోతి అన్నారు. చేతిలో నయాపైసా లేక తనకు చికిత్స ఎలా చేయించాలో తెలియక సతమతం అవుతున్న తన తల్లిదండ్రులకు ఆనాడు వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఆశాదీపంగా కనిపించిందని, ఫలితంగానే నేనిప్పుడు జగన్ను కలిసి కృతజ్ఞతలు చెప్పగలిగానని సంబరపడ్డారు. పేదలకు మేలు జరగాలంటే జగన్ రావాలన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య పింఛన్ కోసం ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా తమను పట్టించుకోవడం లేదని నాటక రంగ కళాకారుడు శ్రీనివాసరాజు, తమను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని నిరుద్యోగులు వాపోయారు. దళిత వర్గాలకు చెందిన ఆడపిల్లల పెళ్లి కానుకను లక్ష రూపాయలకు పెంచాలని మహిళా నాయకురాలు కాశీ ముని కుమారి నాయకత్వంలో పలువురు మహిళలు వైఎస్ జగన్కు విన్నవించారు. జీవో నెంబర్ 550 ద్వారా నష్టపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోనే ద్వీతీయ మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందిన కొండకర్ల ఆవకు పూర్వవైభవం తేవాలని, వలస వెళ్లిన తూర్పు కాపులకు ఇతర ప్రాంతాల్లోనూ బీసీ–డి కులధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని, దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న అనాధ ఆశ్రమానికి రహదారి సౌకర్యం కల్పించాలని, అనాధ పిల్లలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా పింఛన్లు ఇవ్వాలని పలువురు జగన్ను కోరారు. విశాఖలో ఎగసిపడుతున్న జనకెరటం సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లాలో అడుగుపెట్టింది మొదలు రోజురోజుకు జనాదరణ వెల్లువెత్తుతోంది. ప్రజా ప్రస్థానంలో మహానేత అడుగుపెట్టిన నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్దే ఆయన తనయుడు, జననేత జగన్ అడుగు పెట్టినప్పుడు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. నర్సీపట్నం, కోటఉరట్ల, యలమంచలిలో జరిగిన సభలకు జోరు వర్షంలోనూ జనం పోటీపడ్డారు. మరో వైపు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేవుడు కుమార్తె గొట్టేటి మాధవి యలమంచలిలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అప్పటి చింతపల్లి నియోజకవర్గం నుంచి సీపీఐ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గొట్టేటి దేవుడుకు విశాఖ ఏజెన్సీలో మంచి పేరు ఉంది. నిజాయితీపరుడిగా, నిష్కలంక రాజకీయ నేతగా పేరొందిన ఆయన్ను అభిమానించే వేలాది మంది గిరిజనులు, సీపీఐ శ్రేణులతో కలిసి మాధవి పార్టీలో చేరడంతో స్థానికంగా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో మరింత జోష్ వచ్చింది. అంతకు ముందు నర్సీపట్నం నియోజకవర్గంలో బీజేపీ జిల్లా నాయకుడు రుత్తల ఎర్రా పాత్రుడితో పాటు నర్సీపట్నం మండల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి, గత ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పెట్ల రామచంద్రరావు, మాకవరపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుత్తల జమిందారి తదితర నేతలు పార్టీలో చేరారు. డీసీసీ ఉపాధ్యక్షుడు పోలిశెట్టి పెదఈశ్వరరావు, డీసీసీ కార్యదర్శి అద్దేపల్లి నూకి నాయుడు తదితరులు దార్లపూడిలో వైఎస్సార్సీపీలో చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన విడదల రజని వందలాది మంది అనుచరులతో రేగుపాలెం జంక్షన్లో పార్టీలో చేరారు. నేదురుమల్లి కుమారుడి చేరిక ఖరారు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి తనయుడు రామ్కుమార్రెడ్డి వచ్చే నెల 8న విశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు తనతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేదురుమల్లి అభిమానులు పార్టీలో చేరతారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలకు చరమగీతం పాడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే శక్తి వైఎస్ జగన్కు మాత్రమే ఉందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన కొండకర్ల జంక్షన్లో వైఎస్ జగన్ను కలిసి మాట్లాడారు. కాగా, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల నేతలు పలువురు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సబ్బవరం మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాలనాయుడు, ఆర్ఈసీఎస్ మాజీ డైరెక్టర్ సబ్బవరపు నారాయణమూర్తి, తవ్వవానిపాలెం సర్పంచ్ బోకం అప్పలనాయుడు తదితరులతో పాటు 500 మంది నాయకులు, కార్యకర్తలు చేరారు. అనకాపల్లి నియోజకవర్గం మారేడుపూడి మాజీ సర్పంచ్ ఈగల నూకరత్నం, ఈగల కృష్ణమూర్తి, ఆర్ఎంపీ వైద్యుడు బి.అప్పలనాయుడు, అచ్యుతాపురం మాజీ ఎంపీపీ వి.నరసింగరావు, వెన్నెలపాలెం కమ్యునిటీ హెల్త్ అధికారి వెన్నెల నరసింహరావు, మరో 500 మంది వైఎస్సార్సీపీలో చేరారు. -
మీరొస్తేనే మాకు మంచి రోజులు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విపక్ష నేత ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లో అచెంచల ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులొస్తాయనే నమ్మకాన్ని తీసుకొస్తోంది. దీంతో ఊరూవాడా ఆయన కోసం తరలివస్తున్నారు. ప్రస్తుత పాలనపై విసుగెత్తిన వాళ్లు, మార్పును కోరుకునే వాళ్లు, రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేనివాళ్లు, చంద్రబాబు పాలనలో అనుభవాలు చవిచూసిన మాజీ ఉన్నతోద్యోగులు, అనుక్షణం చిత్ర వధ అనుభవిస్తున్న ఉద్యోగులు, భద్రత కరువైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా తరలివస్తున్నారు. ‘నువ్వొస్తేనే రాష్ట్రం బాగుంటుంది’ అని మనోభావాలను వ్యక్తీకరిస్తున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో శనివారం సాగిన 245వ రోజు పాదయాత్రలో కూడా ఇలాంటి సన్నివేశాలు అనేకం కనిపించాయి. కొత్తపాలెం క్రాస్ నుంచి నారాయణపురం, మామిడివాడ, పంచదార్ల, అప్పరాయుడుపాలెం, ధారభోగాపురం వరకు వేలాది మంది జననేతకు స్వాగతం పలికారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మార్చే సారథి ఆయనేనంటూ అభిప్రాయపడ్డారు. కన్నీళ్లు తెప్పిస్తూ.. జీవితాలతో ఆడుకుంటున్న అధికార తెలుగుదేశం పార్టీని జననేత చెబుతున్నట్లు బంగాళాఖాతంలో కలపాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రే దళారై దోచుకుంటున్న వైనాన్ని ఊరూరా జనం చెప్పుకొచ్చారు. మండుతున్న రైతు గుండెకు చల్లదనం మూతపడ్డ సహకార చెక్కర ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తామని, నష్టపోయిన కర్మాగారాలకు జవసత్వాలిస్తామని జగన్ చేసిన ప్రకటన యలమంచిలి చెరకు రైతులను ప్రభావితం చేసింది. రాంబిల్లి మండలం కొత్తూరు రైతులు జననేతను కలిసి సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ మంచి రోజులు వస్తాయన్న విశ్వాసం పెరిగిందన్నారు. ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ బకాయిలు ఇవ్వక బాధపడుతున్న నానేపల్లి గణేష్.. అభిమాన నేత ముందు ఆనందాన్ని పంచుకున్నాడు. రాజశేఖరరెడ్డి గారి పాలనలో ఎంతో ధీమాగా ఉన్నామని చెప్పాడు. మీ వల్లే గత వైభవం వస్తుందన్న విశ్వాసం ప్రదర్శించాడు. నేవెల్ బేస్ భూసేకరణ బాధితులూ వచ్చారు. కేంద్రంతో పని లేకుండానే న్యాయం చేస్తానంటూ మీరిచ్చిన హామీ మత్స్యకారుల జీవితాల్లో ఆశలు రేపిందన్నారు. ‘ఎన్నాళ్ల నుంచో ఆందోళన చేస్తున్నామయ్యా.. మీరొక్కరే కనికరించారు.. మీరే సీఎం అవుతారు.. మా బతుకుల్లో చీకట్లు తొలుగుతాయి’ అని వీరభద్రం, శంకర్ అన్నారు. శారద, వరాహ నదుల్లోనే చేపల వేటకు అనుమతిస్తే మేమెలా బతకాలంటూ మత్స్యకారులు జననేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మా ఉపాధి గురించి మీరే ఆలోచించాలన్నా.. అంటూ కొత్తపట్నం, వాడనరసాపురం, ఈతపాలెం, ఏలుగుండుపాలెం, వారకాడ, బంగారయ్యపాలెం గ్రామాల ప్రజలు జగన్కు విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలో వంద బడులు తీసేస్తారా? ఇదెక్కడి ప్రభుత్వం? గిరిజనులపై ఇంత కక్షా? అంటూ గిరిజన ప్రాంత ఉపాధ్యాయ ప్రతినిధి కోడా సింహాద్రి ఆవేదన వెలిబుచ్చాడు. సహచరులతో పాటు ఆయన జగన్ను కలిశాడు. విశాఖ ఏజెన్సీలో విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పాడు. ఏజెన్సీలోని 11 మండలాల్లో వంద పాఠశాలలను మూయించారని, విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారని వివరించాడు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టు అధ్యాపక నియామకాలు జరగడం లేదన్నాడు. మీరు సీఎం అయితే ఈ పరిస్థితులు మారతాయని ఆకాంక్షించాడు. 15 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా జగన్ వద్ద కష్టాలు చెప్పుకున్నారు. ‘మా నోళ్లు కొట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోందన్నా.. మీరు అధికారంలోకి రాగానే మంచి రోజులొస్తాయనే నమ్మకం ఏర్పడింది’ అని గట్టు రాఘవ, ధనలక్ష్మి తెలిపారు. ఆరోగ్యశ్రీ అందని కిడ్నీ బాధితులు, దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వాళ్లు, పింఛన్లు, రేషన్కార్డులు రాని వారు, రుణమాఫీ హామీతో మోసపోయిన వారు.. అడుగడుగునా కష్టాలు చెప్పుకున్నారు. జగనన్న రాగానే కష్టాల నుంచి గట్టెక్కుతామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. హమ్మయ్యా.. వర్షం వెలిసింది.. మధ్యాహ్న భోజన విరామం తర్వాత పాదయాత్ర తిరిగి మొదలయ్యే సమయంలో వర్షం ప్రారంభమైంది. ‘జగన్ను కలుద్దామని వచ్చాను.. మళ్లీ వాన పడుతోంది. కలుస్తామో.. లేదో..’ అంటూ నర్సమ్మ, శంకర్, వీరయ్యతో పాలు అనేక మంది పాదయాత్ర శిబిరం వద్ద ఆందోళనగా అన్నారు. అప్పటికే జనం.. పాదయాత్ర శిబిరం సమీపంలోని చెట్ల కింద, రోడ్డుపై గొడుగులు పట్టుకుని నిరీక్షిస్తుండటం కనిపించింది. కొద్దిసేపటి తర్వాత వర్షం ఆగిపోవడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ‘హమ్మయ్యా.. వర్షం ఆగింది.. పాదయాత్ర సాగుతుంది’ అంటూ ఉత్సాహం ప్రదర్శించారు. తమ నేత బయటకు రాగానే వాళ్లంతా చుట్టుముటారు. ఆయనతో కలిసి చినుకులతో తడిసిన రోడ్డుపై కేరింతలు కొడుతూ ముందుకు సాగారు. మధ్యలో కాసేపు జల్లులు పడినా ఎవరూ లెక్క చేయలేదు. -
యలమంచిలిలో పండుగాలా సాగుతోన్న ప్రజాసంకల్పయాత్ర
-
హోరువానలోనూ వైఎస్ జగన్ వెంట కదిలిన జనం
-
ప్రజాసంకల్పయాత్ర: వర్షం సాక్షిగా...జనప్రభంజనం
-
‘ఆమెతో పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటా’
సాక్షి, యలమంచిలి: తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలని ఓ యువతి గ్రామస్తులు, కులపెద్దలు, ఐద్వా సంఘ మహిళలతో కలిసి ధర్నాకు దిగిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏనుగువానిలంకలో చోటుచేసుకుంది. గెద్దాడ మరియ మ్మ అనే యువతి బండి మురళీకృష్ణతో వివాహం చేయాలని ధర్నాకు దిగింది. వివరాలిలా ఉన్నాయి.. కలగంపూడిలోని తూర్పుపాలెంనకు చెందిన మేరీమాత ఏనుగువానిపాలెంకు చెందిన మురళీకృష్ణ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగానూ ఒక్కటయ్యా రు. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం మురళీకృష్ణ గల్ఫ్ దేశం వెళ్లగా మేరీమాత కూడా మరో గల్ఫ్ దేశం వెళ్లింది. ఇద్దరూ వేర్వేరు దేశాల్లో ఉపాధి పొందుతుండగా కొంతకాలానికి మురళీకృష్ణ స్వగ్రామానికి వ్యాపారం చేసుకుంటానని చెప్పి వచ్చాడు. మురళీకృష్ణ వ్యాపారానికి మేరీమాత డబ్బులు కూడా పంపించింది. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ అబ్బిరాజుపాలెంకు చెందిన మరో యువతితో వివాహానికి నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలిసిన మేరీమాత హుటాహుటిన స్వగ్రామానికి రాగా మురళీకృష్ణ ఆమెకు కనిపించకుండా తిరుగుతున్నాడు. దీంతో మేరీమాత విషయాన్ని కులపెద్దలకు చెప్పి మురళీకృష్ణ ఇంటి వద్ద ధర్నాకు దిగింది. ఇదిలా ఉండగా మేరీమాతను పెళ్లిచేసుకోవడానికి తనకు ఇష్టంలేదని, బలవంతంగా చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని మురళీకృష్ణ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. మురళీకృష్ణతో పెళ్లి జరిగేవరకూ వదిలేది లేదని మేరీమాత భీష్మించింది. ఇరు సంఘాల పెద్దలు బండి శ్రీనివాస్, గుబ్బల ఏడుకొండలు ఏనుగువానిలంక గ్రామ పెద్దలు మేళం రామాంజనేయులు, ముచ్చర్ల ధర్మరాజు, ఐద్వా సంఘం తరఫున పొత్తూరి జ్యోతి, జిల్లెళ్ల ప్రశాంతి, సీఐటీయూ మండల కార్యదర్శి దేవ సుధాకర్, సీపీఎం నాయకుడు మాసవరపు సుబ్బారావు తదితరులు మేరీమాతకు బాసటగా నిలిచారు. -
యలమంచిలిలో చోరీ
విశాఖపట్నం, యలమంచిలి: పట్టణంలోని రామ్నగర్లో సోమవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది.రామ్నగర్ శివారు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గొర్లె శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు ప్రవేశించి ఏడున్నర తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. ఇంటి బయట శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఇంటి వెనుక తలుపు తాళం తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న బంగారు,వెండి ఆభరణాలను చోరీ చేశారు. బాధితుడు శ్రీనివాసరావు విశాఖ డెయిరీలో టెక్నికల్అసిస్టెంట్గా పనిచేస్తుండడంతో తెల్లవారుజామున లేచి డ్యూటీకి బయలుదేరే సమయంలో ఇంటిలో వెళ్లగా చూడగా వెనుక తలుపులు తీసి ఉన్నాయి. బీరువా తెరిచి, దుస్తులు చిందరవందరగా పడిఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించాడు. బాధితుని ఫిర్యాదుమేరకు యలమంచిలి టౌన్ ఎస్ఐ నారాయణరావు ఆ ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు.దొంగలను పట్టుకునేందుకు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఎస్ఐ నారాయణరావు తెలిపారు. -
నాకెప్పుడు ప్రజల మధ్యనే ఉండటం ఇష్టం
-
టీడీపీకి షాక్: కన్నబాబు రాజీనామా
రాంబిల్లి(యలమంచిలి): మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు(కన్నబాబు), ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ యు. సుకుమారవర్మలు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర, రూరల్ జిల్లా అధ్యక్షులు కళా వెంకటరావు, పంచకర్ల రమేష్బాబులకు పంపినట్టు సుకుమారవర్మ తెలిపారు. తమ అనుచరులతో కలసి శనివారం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. తాజాగా కన్నబాబురాజు వైఎస్సార్సీపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధిష్టానం పలు దఫాలు ఆయనతో చర్చలు జరిపి పార్టీని వీడవద్దని ఒత్తిడి తెచ్చింది. అయితే తాను వైఎస్సార్సీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నానని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదని టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు కన్నబాబురాజు తెలిపారు. -
ఏడో భార్యని వదిలించుకునేందుకు యత్నం
యలమంచిలి: న్యాయం కోసం మరోసారి ఆ ఇల్లాలు రోడ్డెక్కింది. భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బూరుగుపల్లి పంచాయతీ మట్టవానిచెరువులో గురువారం జరిగింది. అసలేం జరిగిందంటే.. గ్రామానికి చెందిన చెల్లుబోయిన ఆంజనేయులు ఇప్పటివరకూ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. గ్రామస్తులకు తెలిసి రెండు, తెలియకుండా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏడో భార్య దేవరపల్లి మండలం సంగాయిగూడెంకు చెందిన లక్ష్మిని గతేడాది గర్భిణిగా ఉన్నప్పుడు వదిలించుకోవడానికి యత్నించాడు. దీంతో ఆమె సంఘ పెద్దల సాయంతో భర్త ఇంటిముందు ఆందోళన చేపట్టింది. ఈ విషయం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో అప్పట్లో సంచలనమైంది. దీంతో సంఘ పెద్దల చొరవతో పుట్టే బిడ్డకు అరెకరం పొలం, రూ.లక్ష నగదు, ఇంటిలో వాటా ఇచ్చేందుకు ఆంజనేయులు అంగీకరించాడు. అయితే పొలం రాశాడు కానీ నగదు, ఇల్లు ఇవ్వలేదు. ఈ ఏడాది కాలంలో భార్యను వదిలించుకోవడానికి అనేకసార్లు యత్నించినా ఆమె సంఘ పెద్దల సాయంతో నెట్టుకొచ్చింది. దీంతో అతను రెండు నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. భర్త వెళ్లిపోవడంతో లక్ష్మి తల్లిని తోడుగా తెచ్చుకుని భర్త మొదటి భార్య కుమారుల పేరిట ఉన్న ఐదెకరాల భూమిని అప్పు చేసి సాగు చేసుకుంది. ఇటీవలే కోత కూడా కోయించింది. ఇప్పుడు మరో నాటకం పంట చేతికి వచ్చిందని తెలుసుకున్న ఆంజనేయులు బుధవారం తన చెల్లి చంద్రావతి, మేనల్లుళ్లు జక్కంశెట్టి వెంకటేశ్వరరావు (వెంకన్నబాబు), గుబ్బల కోటేశ్వరరావును పొలం పంపి కట్టేత కట్టించడానికి పూనుకున్నాడు. ఉదయం పొలం వెళ్లిన లక్ష్మి వారిని చూసి నిలదీయగా.. మా మావయ్య పొలం నువ్వెవరు అడగడానికి అని ఎదురుతిరగడంతో బిత్తరపోయిన లక్ష్మి వారిని వారించే యత్నం చేయడంతో వారు ముగ్గురూ కలసి లక్ష్మిని చితకబాది వెళ్లిపోయారు. గాయాలతో గ్రామంలోకి వచ్చిన లక్ష్మి సంఘ పెద్దలకు జరిగిన విషయం తెలిపింది. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. కొంచెం తేరుకోవడంతో గురువారం ఇంటికి వచ్చి ఆందోళన చేపట్టింది. సంఘ పెద్దల సహకారంతో విలేకరులకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇదిలా ఉండగా పొలం విషయంలో సంఘ పెద్దలు అడ్డు వస్తారని ముందుగానే ఊహించిన ఆంజనేయులు తొమ్మిది మంది పెద్దలు మామిడిశెట్టి పెద్దిరాజు, గుబ్బల జయరాజు, గుబ్బల సత్యనారాయణ, యల్లమిల్లి ఏసుబాబు, బండి చంద్రవాసు, దొంగ వెంకటరమణ, గుబ్బల సత్యనారాయణ, యల్లమిల్లి వెంకట రామలక్ష్మి, పిల్లి పద్మావతిలకు కోర్టు నుంచి నోటీసులు ఇచ్చాడు. దీనిపై సంఘ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టోకెన్ ఉంటే ఓకే
►ఇసుక అక్రమ రవాణాకు వరం ►టోకెన్ల ముసుగులో రాత్రివేళ భారీగా తరలింపు ►కొన్ని చోట్ల బాహటంగానే రవాణా రాంబిల్లి(యలమంచిలి): ఇసుక టోకెన్ల రూపంలో కనక వర్షం కురిపిస్తోంది. దీంతో అక్రమార్కులు రంగంలోకి దిగి యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. రజాల, పెదకలవలాపల్లి సమీపంలో శారద నది నుంచి భారీ స్థాయిలో అక్రమంగా తరలిస్తున్నారు. టోకెన్ల ముసుగులో కొన్ని లోడ్లు తరలిస్తుండగా, ఎలాంటి అనుమతులు లేకుండా మరికొన్ని లోడ్లు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. రజాల వద్ద రాత్రి వేళలో యంత్రాలతో తవ్వి ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ట్రాక్టరు లోడ్ ఇసుకను రూ.3వేలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. రూ.3 లక్షల ఇసుక నిల్వలు పెదకలవలాపల్లి సమీపంలో సుమారు రూ. 3 లక్షల విలువ చేసే ఇసుక నిల్వలు పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. రోజూ సుమారు రూ.2 లక్షల విలువైన ఇసుకను తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రజాల గ్రామానికి చెందిన కొందరు అధికారులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించకపోవడం విశేషం. పది రోజుల నుంచి ఈ దందా కొనసాగుతోంది. తహసీల్దార్ మహేశ్వరరావు ప్రభుత్వ నిర్మాణాల నిమిత్తం కొంత మందికి టోకెన్లు ఇచ్చారు. ఎంతమందికి ఏ ప్రాతిపదికన ఎన్ని టోకెన్లు ఇచ్చారో తెలియడం లేదు. తహసీల్దార్ ఎమ్మెల్సీ ఓట్లు కౌంటింగ్ వి«ధుల్లో విశాఖపట్నంలో ఉన్నారు. మరో పక్క ఈ టోకెన్లు కలెక్షన్ చేయకపోవడంతో అవే టోకెన్లతో పలుమార్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. తవ్వకాలతో చొచ్చుకొస్తున్న సముద్రం నీరు రజాల వద్ద ఇసుక అక్రమ తవ్వకాలతో సముద్రం నీరు వై.లోవ, రజాల, కొత్తూరు వద్ద ఉన్న ఏడుమూళ్ల ఆనకట్ట వరకూ చొచ్చుకొస్తుంది. దీంతో పొలాల్లో ఉప్పునీరు చేరడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నేల చౌడుగా మారుతుందని కలవరపడుతున్నారు. మరోపక్క నదిలో ఉప్పునీరు వస్తుండటంతో పశువులు ఆ నీరు తాగడం లేదని, వాటికి నీరు అందజేసేందుకు పడరాని పాట్లు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
వైఎస్సార్ సీపీ పటిష్టతే లక్ష్యం : ఆళ్లనాని
యలమంచిలి (పాలకొల్లు) : వైఎస్సార్ సీపీని మరింత పటిష్టం చేయడమే లక్ష్యమని, దీనికోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) సూచించారు. స్థానిక తమ్మినీడి ఉమానరసింహ కల్యాణ మండపంలో మంగళవారం పార్టీ మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. ఈ విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగ న్మోహ న్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇ న్చార్జ్ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన తెలుగుదేశం నాయకులు ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. పార్టీ నియోజకవర్గ అదనపు కన్వీనర్ గుణ్ణం నాగబాబు మాట్లాడుతూ గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని, ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారని చెప్పారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ చెల్లెం ఆనందప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి రాజధాని అభివృద్ధిపై ఉన్న శ్రద్ధలో ఇసుమంతైనా ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. నరసాపురం నియోజకవర్గ ఇ న్చార్జ్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ.. వై.ఎస్.జగ న్మోహ న్రెడ్డి మోసపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటే ఇప్పటికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయి ఉండేవారని, ఆయన నైజం అది కాదని స్పష్టం చేశారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయి బాల పద్మజ మాట్లాడుతూ రుణమాఫీ అంటూ రైతులు, మహిళలను, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటు యువతను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా నిరీక్షిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పాలకొల్లు మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు యడ్ల తాతాజీ, నాయకులు పీడీ రాజు, గుణ్ణం సర్వారావు, మైలాబత్తుల మైఖేల్రాజు, ఎంపీటీసీ సభ్యులు చేగొండి సూర్యశ్రీనివాస్, శిరిగినీడి రామకృష్ణ, మోకా వెంకటలక్ష్మి నాయకులు బోనం బులివెంకన్న, విప్పర్తి నవీన్, చివటపు నాగేశ్వరరావు, కల్యాణం గంగాధరరావు, రావూరి వెంకటకోటి మురళీకృష్ణ, లంక చిరంజీవి, గుడాల సురేష్, ఉచ్చుల స్టాలిన్, మోకా నరసింహారావు, దేవరపు మల్లేశ్వరరావు, జల్లి నాగేశ్వరరావు, మద్దా చంద్రకళ, ఖండవల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ 32 గ్రామ కమిటీల అధ్యక్షులను ఆళ్ల నానికి స్థానిక నేతలు పరిచయం చేశారు. -
అక్కడ 'పచ్చ' భూతాలదే రాజ్యం
యలమంచిలి నియోజకవర్గంలో పచ్చనేత అండ్ కో దోపిడీ మండలానికో ఇన్చార్జితో ప్రత్యేక పాలన చెరువులు, దేవుని మాన్యాలకూ చెర భూసేకరణలోనూ అడ్డగోలు దందాలు విశాఖపట్నం : పంచదార్ల వంటి పుణ్యక్షేత్రం ఉన్న యలమంచిలి నియోజకవర్గంలో ఎక్కడా లేనివిధంగా భూతాల పాలన నడుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పచ్చనేతలు తలో మండలాన్ని ఎంచుకుని నంజుకు తింటున్నారు. యలమంచిలి మున్సిపాలిటీకో ఇన్చార్జి, రూరల్ మండలం, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాలకు తలా ఒకరు.. నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ప్రత్యేక పాలన సాగిస్తున్నారు. ఆయా మండలాల్లోని ఎంపీడీవోలు, తహశీల్దార్లు, చివరికి టీడీపీకే చెందిన మండలస్థాయి ప్రజాప్రతినిధులను ఏమాత్రం లెక్క చేయకుండా రెచ్చిపోతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, పథకాల్లోనూ వీరి జోక్యం మితిమీరిపోయింది. పరిశ్రమల పుంతగా రూపుదిద్దుకుంటున్న ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధితో పాటు ఈ ఇన్చార్జీల దోపిడీ ఇప్పటికే వందల కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు. భూసేకరణలోనూ మాయాజాలం రాంబిల్లి మండలం సీతపాలెం రెవెన్యూ పరిధిలో బినామీ పేర్లతో 27 ఎకరాలను దోచేందుకు రంగం సిద్ధమైంది. ఇదే ప్రాంతంలో ప్రజాప్రతినిధి అండతో ఓ ఫ్యాక్టరీ ఐదెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా పట్టించుకునే నాధుడే లేడు. మునగపాక మండలం సిరసపల్లి పరిధిలో చేపట్టిన భూసేకరణలో బినామీ పేర్లు చూపించి కోట్లు దోచేశారన్న ఆరోపణలున్నాయి. ఏపీఐఐసీ భూసేకరణ పేరుతో అచ్యుతాపురం మండలం తంతడి వద్ద వందెకరాల సముద్రపు దిబ్బను బినామీ పేర్లతో దోచేసేందుకు అధికారపార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. రూ.30 నుంచి కూ.40 కోట్ల విలువైన ఈ కుంభకోణంపై బీజేపీ శ్రేణులు సీఐడీ విచారణకు డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పరిశ్రమలు మామూళ్లు ఇవ్వాల్సిందే.. యలమంచిలి మండలంలోని ఒక సిమెంట్ కంపెనీ, అచ్యుతాపురం, రాంబిల్లి పరిధిలో పలు పరిశ్రమల నుంచి ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఇన్చార్జీలు నెలవారీ మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకుంటే భూముల పేరిట రైతులతోనూ, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులతోనూ ఉద్యమాలు చేయిస్తామని బ్లాక్మెయిల్ చేసి మరీ లక్షలు గంజుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక ఇటీవల నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి జన్మదిన వేడుల పేరిట భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు మూటకట్టుకున్నారు. అచ్యుతాపురం మండలంలోని కంపెనీలకు, రియల్ ఎస్టేట్ వాపారులకు టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేశారని అంటున్నారు. పల్లె వాతావరణం నుంచి పరిశ్రమల హబ్గా రూపు మారుతున్న నియోజకవర్గ పరిధిలో ప్రతి పనిలోనూ కాసుల వేటలో మునిగిపోతున్న ప్రజాప్రతినిధి అండ్ కో దోపిడీకి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో మరి. కొండల్ని పిండి చేసి.. కోట్లు కొల్లగొట్టి తాత్కాలిక పర్మిట్లతో రూ.కోట్లు విలువైన గ్రావెల్ను దోచేస్తున్నారు. కొండలను పిండి చేస్తున్నారు. రాంబిల్లి మండలంలో గ్రావెల్ దందాకు తెరలేపారు. నిర్మాణ దశలో ఉన్న ఒక సైనిక స్థావరంతో పాటు ఎస్ఈజెడ్లోని పలు పరిశ్రమలకు రూ.48 కోట్ల విలువైన గ్రావెల్ కావల్సి ఉంది. ఇప్పటికే రూ.20 కోట్ల గ్రావెల్ తరలించారు. రాంబిల్లి మండలం పెదకలవలాపల్లి, పంచదార్ల, అచ్యుతాపురం మండలం చోడపల్లి, మునగపాకతోపాటు అనకాపల్లి మండలంలోని పలు ప్రాంతాల నుంచి రూ. కోట్లు విలువైన గ్రావెన్ను అక్రమంగా తరలించారు. గ్రావెల్ క్వారీలకు అనకాపల్లి మండలంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు భూగర్భ, గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి యలమంచలి నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాల వెనుక కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు మండల స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి గ్రావెల్ దందాకు తెర లేపినట్టు ఆరోపణలున్నాయి. మునగపాక మండలంలో ఉన్న కొండల నుంచి గత రెండేళ్లలో రూ. 50 లక్షల విలువైన గ్రావెల్ను దోచేశారని అధికార పార్టీ నేతలే పేర్కొనడం గమనార్హం. దేవుని మాన్యాలను వదల్లేదు.. చెరువులు, కొండలే కాదు.. దేవుని మాన్యాలూ అక్రమార్కుల చెరలోకి వెళ్తున్నాయి. యలమంచిలిలోని వీరభద్రస్వామి దేవాలయ భూముల వ్యవహారం కోర్టులో ఉన్నా.. అక్రమార్కులు బెదరడం లేదు. ఇప్పటికే వేల గజాల భూములను టీడీపీ నేతలు అక్రమించేశారు. రాంబిల్లి మండలం రాజకోడూరు పరిధిలో నాగలింగేశ్వరస్వామి దేవాలయామికి చెందిన ఆరెకరాల మాన్యంపై నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి కన్నుపడింది. ఎస్ఈజెడ్ కాలనీ రాకతో ఆ భూముల విలువ కోట్లకు చేరింది. దీంతో రికార్డులు తారుమారు చేసి ఆ ఆరెకరాలను కొట్టేసేందుకు పక్కాగా స్కెచ్ రెడీ చేశారని తెలుస్తోంది. అదే మండలం వెంకటాపురం పరిధిలో రూ.20 కోట్ల విలువైన దేవుని మాన్యాన్ని సర్వీస్ నామా కింద మార్చి టీడీపీ కీలక నేతకు ధారాదత్తం చేసేం దుకు రంగం సిద్ధమైంది. ఇక చెరువుల సంగతి చెప్పనవసరంలేదు. ప్రభుత్వ రికార్డుల్లో చెరువులుగా నమోదైన భూముల వివరాలను తారుమారు చేసేస్తున్నారు. రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం గ్రామ పరిధిలో రూ.35 కోట్ల విలువైన కర్ర చెరువును కబళించేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే మండలం మూలజంప పరిధిలో నియోజకవర్గ ప్రజాప్రతినిధి సోదరుడు, మండలస్థాయి ప్రజాప్రతినిధి కలిసి ఇసుకను ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. -
ముద్రగడకు మద్దతుగా టీడీపీకి రాజీనామాలు
యలమంచిలి (పశ్చిమ గోదావరి) : కాపు నేత ముద్రగడకు మద్దతుగా టీడీపీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువానిలంకలో 106 మంది టీడీపీ కార్యకర్తలు ఆదివారం రాజీనామాలతో టీడీపీకి షాకిచ్చారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు 106 మంది సంతకాలతో కూడిన లేఖను పార్టీ గ్రామ అధ్యక్షుడు గుబ్బల ఏడుకొండలుకు అందజేశారు. రాజీనామా చేసినవారిలో లింగం లక్ష్మి, వినుకొండ వెంకటేశ్వరరావు, రామలక్ష్మి, కాశీ విశ్వనాథం తదితరులు ఉన్నారు. -
గృహ ప్రవేశానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
యలమంచిలి (విశాఖ జిల్లా) : శుభకార్యానికి బయలుదేరిన కాకినాడకు చెందిన వృద్ధ దంపతులు యలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాకినాడ నుంచి గాజువాక వెళ్తున్న వీరి కారు రేగుపాలెం ఫ్లైవోవర్ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుటుంబ యజమాని ఆచంట దక్షిణామూర్తి (79), భార్య అనసూయ (68) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న దక్షిణామూర్తి రెండో కుమారుడు శ్రీనివాస్, ఆయన తనయుడు అనిల్ గాయాలతో బయటపడ్డారు. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వీరిని మృత్యువు లారీ రూపంలో కబళించడంతో విషాదం అలుముకుంది. మూడో కుమారుడి ఇంటికెళ్తూ... కాకినాడ భానుగుడి జంక్షన్ సమీపంలో శ్రీరామ్నగర్ మున్సిపల్ హైస్కూల్ వద్ద ఎంఎస్ రెసిడెన్సీలో ఉంటున్న దక్షిణామూర్తి, భార్య అనసూయ దంపతులు ఉంటున్నారు. వారి రెండో కుమారుడు శ్రీనివాస్, మనుమడు అనిల్లతో కలిసి గాజువాకలో ఉంటున్న మూడో కుమారుడు వీరరాజశేఖర్ ఇంటికి శనివారం ఉదయం 6 గంటలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు రేగుపాలెం ఫ్లైఓవర్ దాటిన తర్వాత రోడ్డు పక్కగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అతివేగమే కారణమా.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మలుపు ఉండటం, వాహనం వేగంగా ప్రయాణించడంతో అదుపు చేయడానికి సాధ్యపడలేదు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే దక్షిణామూర్తి, భార్య అనసూయ కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కారు ముందుభాగం పూర్తిగా నుజ్జయింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్సై సీహెచ్.వెంకట్రావు, హైవే పెట్రోలింగ్ ఎస్సై దయానిధి సిబ్బందితో ప్రమాదస్థలానికి చేరుకున్నారు. గాయపడిన తండ్రీ కొడుకులు శ్రీనివాస్, అనిల్లను యలమంచిలి ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం బంధువులు కాకినాడకు తరలించారు. మృతదేహాలను యలమంచిలి మార్చురీకి తరలించారు. మృతదేహాలపై ఉన్న బంగారు ఆభరణాలను యలమంచిలి రూరల్ ఎస్సై వెంకట్రావు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆనందంగా బయలుదేరి.. దక్షిణామూర్తి మూడో కుమారుడు వీరరాజశేఖర్ అనకాపల్లి టెలికాం డిపార్ట్మెంట్లో జేటీఓగా పనిచేస్తున్నారు. ఇటీవల ఇతను గాజువాకలో కొత్తగా ఇంటిని నిర్మించారు. సోమవారం గృహప్రవేశం చేయడానికి నిర్ణయించారు. దీని కోసం దక్షిణామూర్తి దంపతులు ఆనందంగా కుమారుడి ఇంటికి వస్తుండగా ఆగి ఉన్న లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మార్చురీ వద్ద మిన్నంటిన రోదనలు.. మృతి చెందిన దక్షిణామూర్తి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు రాధాకృష్ణ శర్మ కాకినాడలోని విద్యాశాఖలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు శ్రీనివాస్ ప్రమాదంలో గాయపడ్డారు. మూడో కుమారుడు వీరరాజశేఖర్. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో యలమంచిలి మార్చురీ వద్దకు చేరుకున్నారు. దంపతులిద్దరి మృతదేహాలను చూసి బోరున విలపించారు. మార్చురీ వద్ద రోదనలు మిన్నంటాయి. -
ఆకలి కేకలు
ఉపాధికి దూరం చేసిపొట్టకొట్టారన్న కూలీలు రహదారిపై మహిళల బైఠాయింపు, రాస్తారోకో మున్సిపల్ కమిషనర్ ఘెరావ్ యలమంచిలి : ‘యలమంచిలిని మునిసిపాలిటీగా మార్చడంతో మా తలరాతలు మారిపోయాయి. రెండు పూటలా తిండికి నోచుకోని దుర్భర పరిస్థితిలో పనుల్లేక ఆకలితో అలమటిస్తున్నాం. మా గ్రామాలను మునిసిపాలిటీ నుంచి తొలగించి పుణ్యం కట్టుకోండి. ఎంత మంది అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ మా బాధ పట్టించుకోవడంలేదు. మూకుమ్మడిగా ఆత్మహత్యలే శరణ్యం..’ అంటూ పట్టణం పరిధిలోని సోమలింగపాలెం, కొక్కిరాపల్లి, వెంకటాపురం, వి.ఎన్.పేట, గొల్లలపాలెం మహిళలు బుధవారం మునిసిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఒకవైపు ఉపాధి హామీ పథకానికి దూరమై అవస్థలు పడుతుంటే, మరోవైపు ఆస్తిపన్ను మోతతో రెండు వైపులా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మహిళలు వాపోయారు. ఇందుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ శ్రీనివాసరావును ఘెరావ్చేశారు. పేదలమైన తమకు ఉపాధి హామీ పథకం ఆకలితీర్చేదని, దానికి దూరం చేసి రోడ్డున పడేశారంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాలను మునిసిపాలిటీ నుంచి తొలగించాలని మహిళలు మున్సిపల్ కమిషనర్ను కోరారు. ఆస్తిపన్ను కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి ప్రత్యామ్నాయం చూపుతామని, మీఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మునిసిపల్ కమిషనర్ వారికి చెప్పారు. మరోసారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆందోళనకారులు ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకోవడంతో గంటకుపైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి కమిషనర్తో చర్చలు జరిపేందుకు ఆహ్వానించారు. ఈ చర్చల్లో మహిళలు ఉపాధి హామీ పథకం అమలుకాకపోవడంతో తాము ఎలా ఇబ్బంది పడుతున్నదీ వారు కమిషనర్కు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. -
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు
యలమంచిలి (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలోని ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో.. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ర్యాంపు వద్దకు చేరుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అక్రమ రవాణాను అరికట్టాలని ధర్నాకు దిగారు. -
వైఎస్ జగన్ను కలిసిన లాజిస్టిక్ హబ్ నిర్వాసితులు
-
వైఎస్ జగన్ను కలిసిన లాజిస్టిక్ హబ్ నిర్వాసితులు
విశాఖపట్నం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం యలమంచిలి చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. అనంతరం ఆయన చింతపల్లిలో బాక్సైట్ వ్యతిరేక సభలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు. అంతకుముందు అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ను తుమ్మపాల కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బాధితులు కలిశారు. ఫ్యాక్టరీ ఆధునీకరించేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని ఆయనకుకి కార్మికులు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ బకాయిలు తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అందుకు వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. అలాగే వల్లూరు లాజిస్టిక్ హబ్ భూ నిర్వాసితులు కూడా వైఎస్ జగన్ను కలిశారు. తమకు నష్టపరిహారం చెల్లింపులో పక్షపాతం చూపుతున్నారంటూ వారు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వక్తం చేశారు. ఈ అంశంలో అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని వైఎస్ జగన్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన యలమంచిలిలోని మేడపాడు ఏయిర్టెల్ సెల్టవర్ వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని కట్టుపాలెం గ్రామానికి చెందిన గెద్దాడ మధు(35) ఎలక్ట్రీషియన్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఏయిర్టెల్ టవర్ వద్ద జన్రేటర్ బాగు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. -
విశాఖజిల్లాలో పురాతన విగ్రహం లభ్యం
యలమంచిలి: విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం ఓ పురాతన విగ్రహం బయటపడింది. యలమంచిలి మండలం రామచంద్రమ్మ కొండపై తవ్వకాలు జరుపుతున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. ఈ విగ్రహం14వ శతాబ్దానికి చెందిందని స్థానికులు భావిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహన్ని చూడటానికి గ్రామస్థుల భారీగా తరలివస్తున్నారు. దీంతో గ్రామస్థులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
కాటేసిన కరెంటు తీగెలు
విద్యుదాఘాతానికి అన్నదమ్ముల దుర్మరణం రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వైనం యలమంచిలిలో విషాదఛాయలు యలమంచిలి : విధి బలీయమైనది.. మృత్యువు అతి కర్కశమైనది.. ఎవరిని ఎప్పుడు ఎలా కాటేస్తుందో ఊహించలేం.. విద్యుత్ షాక్తో విలవిలాడుతున్న ఒక కూలీ యువకుడిని రక్షించేం దుకు వెళ్లిన అన్నదమ్ములు బుద్దా సత్యనారాయణ (65), బుద్దా బాపునాయుడు (62)లను మృత్యు రాబంధు తన్నుకుపోయింది. మొదట విద్యుత్షాక్కు గురైన యువకుడు ప్రాణాలతో బయటపడగా, అతన్ని రక్షించేందుకు వెళ్లిన సోదరులిద్దరూ క్షణాల్లో అసువులు బాశారు. వీరిద్దరు విద్యుత్శాఖలో పనిచేసి రిటైరయ్యారు. యల మంచిలిలో భూలోకమాంబ అమ్మవారి ఆలయం వద్ద జరి గిన ఈ దుర్ఘటనను చూసినవారంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. తులసీనగర్లో భూలోకమాంబ అమ్మవారి ఆలయానికి సమీపాన కాళ్ల సత్యనారాయణ తన ఇంటిపై మొదటి అంతస్తు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సుంకర ఛత్రపతి అనే యువకుడు ఇనుప ఊచలను ఇంటిపైకి తీసుకెళ్తుండగా సమీపంలో 11కెవి తీగలు తగి లాయి. దీంతో ఆ యువకుడు రక్షించమని గట్టిగా అరిచా డు. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న బుద్దా సత్యనారాయణ (65), బుద్దా బాపునాయుడు (62) వెంటనే అక్కడికి వెళ్లా రు. ఆ సమయంలో విద్యుత్తీగలపైనే ఇనుప ఊచలుండ టం, విద్యుత్ ప్రవాహం ఉండటంతో గమనించని సోదరులిద్దరూ ఊచల్లో ఇరుక్కున్న ఛత్రపతిని బయటకు తీసే క్రమంలో వారు కూడా విద్యుదాఘాతానికి బలయ్యారు. ఈ సంఘటనలో ఛత్రపతి గాయాలతో బయటపడగా, రక్షించేందుకు వెళ్లిన సోదరులు మరణించారు. . ఇంటి బయట అరుగుపై ఉదయం టిఫిన్ చేసి మాట్లాడుకుంటున్న సోదరులిద్దరినీ కరెంట్ తీగలు తమ కౌగిట బంధించాయి. ఒకేదగ్గర ఉన్న అన్నదమ్ముల మృతదేహాలను చూసిన వారంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన కూలీ యువకుడు ఛత్రపతిని తోటి కూలీలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్కు తరలించారు. పేరుకే సోదరులయినా మంచి స్నేహితుల్లా ఉండేవారు.. మృతిచెందిన ఇద్దరూ స్థానికులందరికీ తలలో నాలుకలాఉండేవారు. సత్యనారాయణకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహాలు అయ్యాయి. బాపునాయుడికి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు శ్రీను, ఇద్దరు కుమార్తెలున్నారు. సత్యనారాయణ డ్రైవర్గా పనిచేసి పదవీ విరమణ చేయగా, బాపునాయుడు లైన్మన్గా పనిచేసి రిటైరయ్యారు. ఈ ఇద్దరినీ ఒకేసారి మృత్యువు కబళించడం స్థానికులను కలచివేసింది. పట్టణ పోలీసులు, యలమంచిలి రూరల్ ఎస్ఐ సిహెచ్.వెంకట్రావు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. -
బస్సు బోల్తా: 20 మందికి గాయాలు
యలమంచిలి: విశాఖపట్టణం జిల్లా యలమంచిలి మండలం పెద్దపల్లి వద్ద 16వ నంబరు జాతీయరహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఆర్టీసీ బస్సు అమలాపురం నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో ప్రమాద జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా యలమంచిలిలోని పెద్దపల్లి హైవే జంక్షన్ వద్ద బుధవారం జరిగింది. అమలాపురం నుంచి టెక్కలి వెళ్తున్న బస్సు హైవే జంక్షన్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో రెండు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాల య్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. -
న్యాయం చేయాలంటూ బైఠాయింపు
యలమంచిలి (పశ్చిమగోదావరి) : భర్త తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఓ భార్య నిరసనకు దిగింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గోంపూరు గ్రామానికి చెందిన తారక రామకృష్ణ ప్రసాద్కు విజయలక్ష్మితో 2009లో వివాహమైంది. అయితే వీరిద్దరు మూడేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. తనను భర్త, మామలు కలసి వేధించడంతోనే వేరుగా ఉంటున్నాని ఆమె తెలిపింది. తనను భర్త ఇప్పటికైనా అర్థం చేసుకుని న్యాయం చేయాలని ఆమె భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. -
ఈవ్టీజింగ్కు పాల్పడిన యువకునికి దేహశుద్ధి
యలమంచిలి : కళాశాల విద్యార్థినిపట్ల అనుచితంగా ప్రవర్తించిన యువకునికి యలమంచిలిలో శుక్రవారం దేహశుద్ధి చేశారు. ఒక ప్రైవేట్ కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన గేదెల గణేష్ అనే యువకుడు అడ్డగించి సైకిల్ తాళం తీసుకున్నాడు. తనతో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చాడు. ఇది గమనించిన ఒక పత్రికా విలేకరి ఫొటో తీయబోగా పరుగున వెళ్లిపోయాడు. కొక్కిరాపల్లి పీఏసీఎస్ సమీపంలో అతడ్ని పట్టుకున్నారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పట్టణ పోలీసులకు అప్పగించారు. వారు కూడా తమదైన శైలిలో యువకుడికి కోటింగ్ ఇచ్చారు. ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడనని రాతపూర్వకంగా యువకుడు హామీ తీసుకుని యువకుడ్ని విడిచి పెట్టారు. -
యలమంచిలిలో నకిలీ కరెన్సీ!
విచ్చలవిడిగా రూ.1,000, 500 నోట్ల చలామణి బ్యాంకులు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో గుర్తింపు కొరవడిన పోలీసు నిఘా యలమంచిలి : ఇటీవల కాలంగా యలమంచిలి పట్టణం, పరిసర ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ నోట్లు హల్చల్ చేస్తున్నాయి. రూ.500, రూ.1,000 నోట్లను చూస్తేనే ఇక్కడ వ్యాపారులు, ప్రజలు హడలిపోతున్నారు. బాగా తెలిసినవారైనా సరే ఈ నోట్లు ఇస్తే వ్యాపారులు ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటున్నారు. వీటి బెడదతో కరెన్సీ నోట్లు అసలో? నకిలీయో? నిర్ధారించే పరికరాలను పలువురు వ్యాపారులు కొనుగోలు చేసుకుంటున్నారు. దీనిని బట్టి యలమంచిలి ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పట్టణంలో జల్సాలకు అలవాటు పడిన కొందరు యువకులకు నకిలీ నోట్ల ముఠా సభ్యులు భారీగా ఆశ చూపుతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. రూ.10వేల అసలు నోట్లకు రూ.40 వేల నకిలీ కరెన్సీ ఎరచూపుతున్నారని, ఏజెంట్లు కొందరు అమాయకులైన యువకులను కూడా ఈ ఉచ్చులోకి లాగుతున్నారని తెలిసింది. వారపు సంతలు, నగల దుకాణాలు, ప్రైవేట్ చిట్టీ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, పెట్రోల్ బంకులు, కూరగాయల దుకాణాలు, హోల్సేల్ వ్యాపారులకు దొంగనోట్లు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నకిలీ కరెన్సీ చలామణితో సంబంధం ఉన్న కొందరు బాగా సంపాదించుకుంటున్నట్టు పట్టణంలో చర్చించుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం రోడ్డుపై కన్పించిన పరిచయస్తులను రూ.10 ఉంటే ఇవ్వండి సార్.. అంటూ చేయిచాచే ఒక యువకుడు నేడు రెండు అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేయడం, తరచూ సరికొత్త ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితం గడపడం వెనుక నకిలీ దందా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దొంగనోట్ల చలామణిపై పత్రికల్లో వార్తలొచ్చినప్పుడల్లా ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి పోలీసులు ఆరా తీయడం, సరైన ఆధారాలు దొరక్కపోవడంతో మిన్నకుండటం జరుగుతోంది. పోలీసు భాషలో నకిలీ నోట్ల చెలామణి కేసును గ్రేవ్ (పెద్ద నేరం)గా పరిగణిస్తారు. ఒకటి, రెండు నోట్లేకదా.. అని పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. బ్యాంకులకు వచ్చే నకిలీ నోట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ వ్యవహారంపై పోలీసులు పకడ్బందీగా ముందుకు వెళ్లేందుకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. -
కూల్డ్రింక్ అనుకుని..
యలమంచిలి : రోజూలాగే సాయంత్రం పాఠశాల నుంచి ఉత్సాహంగా ఇంటికి వచ్చిన ఐదో తరగతి బాలిక కూల్డ్రింక్ అనుకుని పొరబాటు పురుగు మందు తాగడంతో మృత్యువాత పడింది. రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు జరిగిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి. దిమిలి గ్రామానికి చెందిన మామిడి శ్రీహరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె మామిడి నాగభవాని (10) స్థానికంప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో వ్యవసాయ పనుల నిమిత్తం శ్రీహరి, అతని భార్య పొలం పనులకు వెళ్లారు. సోమవారం ఉదయం స్కూల్కు వెళ్లిన భవాని సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. ఆకలి తీర్చుకునేందుకు కూల్డ్రింక్ అనుకుని పురుగుమందును పొరబాటున తాగింది. కొద్దిసేపటికే బాలిక నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు తండ్రికి సమాచారం అందించారు. ఆమెను హుటాహుటిన స్థానిక 30 పడకల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆలస్యం కావడంతో బాలిక పరిస్థితి పూర్తిగా విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు, సిబ్బంది లాభంలేదని మెరుగైన చికిత్స కోసం విశాఖకు తీసుకెళ్లాల్సిందిగా చెప్పడంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తండ్రి భుజాలపై వేసుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేసరికి బాలిక మృతి చెందింది. తండ్రి శ్రీహరి కన్నీరుమున్నీరుగా విలపించడం కంట తడిపెట్టించింది. బరువెక్కిన హృదయంతో బాలిక మృతదేహాన్ని తండ్రి ఇంటికి తీసుకెళ్లడంతో బాలిక తల్లి, సోదరి, సోదరుడితో పాటు బంధువులు తీవ్రంగా రోదించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
యలమంచిలి: విశాఖపట్టణం జిల్లా యలమంచిలి శివారులో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. రేగిపాళెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన రాజీసాయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే పులపర్తి గ్రామం వద్ద కూడా గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాలను పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోటికి చేరువలో..
సాక్షి, కొవ్వూరు : జిల్లాలోని 97 ఘాట్లలో గడచిన తొమ్మిది రోజుల్లో పుష్కర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 91లక్షల 87 వేల 752కు చేరింది. కొవ్వూరు డివిజన్ పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, పెనుగొండ మండలాల్లో గల ఘాట్లలో 60,63,775 మంది స్నానాలు ఆచరించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. నరసాపురం డివిజన్ పరిధిలోని నరసాపురం, యలమంచిలి, ఆచంట మండలాల్లోని ఘాట్లలో 27,49,327 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 3,74,750 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. బుధవారం సాయంత్రం 8 గంటల వరకు జిల్లాలో 10,26,170 మంది పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లావ్యాప్తంగా బుధవారం వేకువజామునుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. జిల్లాలో సగటున 17.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిపి లేకుండా వాన కురిసినా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. -
విడిపోయిన గూడ్స్ రైలు 40 బోగీలు
యలమంచిలి(విశాఖపట్టణం జిల్లా): ప్రమాదవ శాత్తు లైమ్స్టోన్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి 40 బోగీలు విడిపోయాయి. ఈ సంఘటన మంగళవారం విశాఖ జిల్లా యలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. అయితే విడిపోయిన 40 బోగీలు పట్టాలు తప్పకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. విడిపోయిన గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బోగీలను తిరిగి కలిపే ప్రయత్నం చేస్తున్నారు. -
యలమంచిలిలో సీఎం సభ ?
డిగ్రీ కళాశాల మైదానాన్నిపరిశీలించిన జిల్లా అధికారులు యలమంచిలి : ఈ నెల 20న సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా యలమంచిలిలో సభ ఏర్పాటుకు అధికారులు సిద్ధపడుతున్నారు. జెడ్పీ సీఈవో మహేశ్వరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ సోమవారం యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఎంపీడీవో ఇ.సందీప్, మున్సిపల్ కమిషనర్ సత్తారు శ్రీనివాసరావులకు సీఎం సభకు అవసరమైన ఏర్పాట్లకు సిద్ధపడాలని సూచించారు. ముఖ్యంగా రోడ్లు, శానిటేషన్ పరిస్థితులు మెరుగుపరచాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కాలేదని, ఎక్కడెక్కడ సభలు ఏర్పాటు చేయాలనే విషయమై ప్రాథమిక పరిశీలన చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సీఎం పర్యటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని డీఆర్డీఏ పీడీ తెలిపారు. -
అయ్యో పాపం.. ఏమయ్యిందో!
యలమంచిలి: యలమంచిలిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. స్థానిక బస్కాంప్లెక్స్ సమీపంలో నడిరోడ్డుపై సుమారు 28 ఏళ్ల మహిళ రోడ్డుపై పాక్కుంటూ కనిపించింది. అతికష్టం మీద పక్కన ఉన్న వాణిజ్య సముదాయం మెట్లపైకి చేరుకుంది. తరువాత స్పృహ కోల్పోయింది. మద్యం వాసన వస్తోంది. ఆమె శరీరంపై దుస్తులు చెదిరిపోయి ఉండటాన్ని గమనించిన కొందరు మహిళలు దుస్తులు సరిచేశారు. ఆమె వెంట సుమారు ఏడాది చిన్నారి కూడా ఉంది. ఇది గమనించిన విలేకరులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఫిర్యాదు ఉంటేగాని తాము పట్టించుకోలేమని చెప్పడం విశేషం. సాక్షి విలేకరి ద్వారా విషయం తెలుసుకున్న యలమంచిలి ఐసీడీఎస్ సీడీపీవో విజయ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికి స్పృహలోకి వచ్చిన ఆ మహిళ నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేసినప్పటికీ ఏమీ చెప్పలేకపోయిది. ఆ మహిళ చిన్నారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించి, తరువాత యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి సీడీపీవో తరలించారు. ఎవరో ఆమెకు పూటుగా మద్యం తాపించి అత్యాచారం చేసి వెళ్లిపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అంతకు ముందు ఆమెను ఎవరో కొందరు వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి యలమంచిలి బస్కాంప్లెక్స్ సమీపంలో నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. -
అన్నదాత కుదేలు
యలమంచిలి సబ్డివిజన్లో 16వేల ఎకరాల్లో నీటమునిగిన వరి 8,500 ఎకరాల్లో చెరకుకు నష్టం యలమంచిలి : వరుస విపత్తులతో అన్నదాత కుదేలవుతున్నాడు. హుదూద్ తుపాను రూపంలో వరుసగా మూడో ఏడాది యలమంచిలి నియోజకవర్గంలో పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఈసారి పెనుగాలుల బీభత్సానికి పంటలతో పాటు మహావృక్షాలు నేలకొరగడంతో రైతులు మరింత ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చింది. యలమంచిలి వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలో దాదాపు 25వేలకుపైగా ఎకరాల్లో పంటలు నీటమునిగినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 16వేల ఎకరాల్లో వరి, 8,500 ఎకరాల్లో చెరకు, 515 ఎకరాల్లో పత్తి, కంది, మినుము, పెసలు, నువ్వు పంటలు ముంపులో ఉన్నట్టు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. యలమంచిలి వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోని ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో 25,015 ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్టు యలమంచిలి అసిస్టెంట్ డెరైక్టర్ డి.మాలకొండయ్య గురువారం చెప్పారు. ప్రస్తుతం పంట పొలాల్లో వర్షపునీరు మెల్లగా బయటకు వస్తోందని, రెండు మూడు రోజుల్లో పూర్తి నష్టం అంచనా తెలుస్తుందని చెప్పారు. నీటమునిగిన పొలాల్లో నీరు తొలగిన వెంటనే వరిపంటకు ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని, చెరకు తోటల్లో ఎకరానికి 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ కలిపిన ద్రావణాన్ని వినియోగిస్తే తెగుళ్లు సోకకుండా పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని ఏడీ సూచించారు. ఎక్కువ చెరకు తోటల్లో గెడలు విరిగిపోవడంతో వాటిని ఎత్తికట్టడానికి కూడా వీలులేని పరిస్థితి ఉందన్నారు. పెనుగాలుల ధాటికి చెరకు పంటకు భారీగా నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ విస్తరణాధికారులు చెబుతున్నారు. మరోవైపు రైతులు రెండేళ్ల క్రితం నీలం తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలకే ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదని, ఈసారైనా త్వరితగతిన పరిహా రం అందించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. ఉద్యానపంటలకూ నష్టం... యలమంచిలి వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలో సంప్రదాయ పంటలతో పాటు ఈసారి ఉద్యానపంటలకూ తీవ్ర నష్టం సంభవించింది. హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలుల తాకిడికి మామిడి, జీడితోటల్లో చెట్లు నేలకొరిగాయి. కొబ్బరిచెట్లు తలలు తెగినట్లు మోడువారాయి. పంటచేతికందే సమయంలో హుదూద్ తుపాను రూపంలో తమకు నష్టం చేకూర్చిందని యలమంచిలి ప్రాంతంలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేలాది ఎకరాల్లో సంవత్సరాలు సంరక్షిస్తున్న మామిడి, జీడి, కొబ్బరి తోటలు నిర్జీవంగా మారిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. ప్రభుత్వం తమపై దయచూపి మెరుగైన నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు. -
8 మంది టీచర్ల జీతాలు నిలిపివేత
యలమంచిలి : లక్షలాది రూపాయలు ఖర్చు చేసి శిక్షణ ఇస్తుంటే ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చూపుతున్నారు... పాఠశాలలకు సకాలంలో విధులకు హాజరుకావడం లేదు... చిత్తశుద్ధితో విద్యాబోధన చేపట్టడం లేదు... ఇదా పనిచేసే తీరు అంటూ.. యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి ఉపాధ్యాయులపై మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యలమంచిలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో రాంబిల్లి, ఎస్.రాయవరం, యలమంచిలి మండలాల ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. రాంబిల్లి మండలానికి చెందిన 8 మంది ఉపాధ్యాయులు ఆ సమయంలో శిక్షణకు హాజరుకాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఉపాధ్యాయుల్లో మార్పు రావడం లేదన్నారు. శిక్షణకు హాజరుకాని ఎనిమిది మంది ఉపాధ్యాయులకు ఈ నెల జీతం నిలిపివేయాలని రాంబిల్లి ఎంఈవోను ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని సహిం చేది లేదని హెచ్చరించారు. అనంతరం బాలికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. రూ.30లక్షల సర్వశిక్షాభియాన్ నిధులతో బాలికోన్నత పాఠశాలలో 6 గదులు నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం పాత భవనాలను కూల్చేందుకు అనుమతి కోసం డీఈవోకు లేఖరాసినట్టు తెలిపారు. డీఈవో నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. -
నకిలీ నోట్లు చలా‘మనీ’
యలమంచిలి కేంద్రంగా సాగుతున్న వ్యవహారం రూ.10వేల అసలుకు రూ.40వేలు నకిలీ నోట్లు యలమంచిలి : యలమంచిలి కేంద్రంగా నకిలీనోట్లు జోరుగా చలామణి అవుతున్నాయి. రూ.500, రూ.1,000 నోట్లను చూస్తేనే ఇక్కడ వ్యాపారులు, ప్రజలు హడలిపోతున్నారు. అంతా ఈ నోట్లను ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటున్నారు. ఇందుకు పరికరాలను కొందరు సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. పట్టణానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి గుట్టుగా ఈ వ్యవహారం సాగిస్తున్నారన్న వాదన ఉంది. రూ.10వేలు అసలనోట్లకు రూ.40వేలు నకిలీ కరెన్సీ ఇస్తుండటంతో నేరం అని తెలిసినప్పటికీ ఇందుకు కొందరు యువకులు ఆసక్తి చూపుతున్నారు. యలమంచిలిలో ఏ దుకాణం వద్దకైనా వెళ్లి సరుకులు కొనుగోలు చేసినా రూ.100 నోటు ఉంటే ఇమ్మని అడుగుతున్నారు. వారపు సంతలు, నగల దుకాణాలు, ప్రైవేట్ చిట్టీ వ్యాపారులు, ఫైనాన్సియర్లు, పెట్రోల్బంకుల్లో దొంగనోట్లను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రైల్వేస్టేషన్లో టిక్కెట్ బుకింగ్ కార్యాలయం, బ్యాంకులకు నకిలీనోట్లు తరచూ వస్తున్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు. మునిసిపాలిటీలోని భవనం వీథిలో ఇటీవల ఒక నగల దుకాణంలో మహిళ దుకాణదారుడికి ఇచ్చిన సొమ్ములో రూ.500 నకిలీ నోటు బయటపడింది. బస్ కాంప్లెక్స్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక ఫైనాన్స్ వ్యాపారికి వచ్చిన రోజువారి కలెక్షన్లో రూ.1,000, రూ.500 నకిలీ నోట్లు గుర్తించారు. నకిలీ నోట్ల బెడదతో పాత ఆంధ్రాబ్యాంక్ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే ఒక మీ-సేవా కేంద్రంలో రూ.500, రూ.1,000 నోట్లు తీసుకోవడం లేదంటూ ఏకంగా నోటీసు బోర్డు పెట్టడం ఇందుకు తార్కాణం. ఒక ప్రైవేట్ కళాశాల్లో విద్యార్థులు చెల్లించిన ఫీజు సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తే అందులో రూ.500 నోట్లు రెండు నకిలీవిగా సిబ్బంది గుర్తించి జమ చేయడానికి వెళ్లిన కళాశాల ఉద్యోగిని మందలించారు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో బయటపడిన నకిలీ నోట్లపై రైల్వేశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఇటీవల రెండు కేసులు నమోదు చేశారు. బ్యాంకులకు వచ్చినవాటిపై అధికారులు ‘ఫేక్రూ. నోట్ అని రాసి ఊరుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఇదే చలామణిదారులకు అవకాశంగా మారుతోంది. -
వివాహిత ఆత్మహత్య
కొంతేరు (యలమంచిలి), న్యూస్లైన్ : అత్త ఆరళ్లు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతేరు గ్రామానికి చెందిన త్సవటపల్లి బాలకృష్ణకు భీమవరం మండలం గునుపూడికి చెందిన గీత(27)తో మూడే ళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసు కుమార్తె ఉంది. వివాహమైన నాటి నుంచి గీతను ఆమె అత్త పద్మావతి అదనపు కట్నం కోసం వేధించేది. అమ్మ మాటలు విని భర్త కూడా ఆమెను వేధించేవాడు. శనివారం వారి కుమార్తె సునంద పుట్టినరోజు కావడంతో బాలకృష్ణ కేక్, బిస్కట్స్, చాక్లెట్స్ తీసుకువచ్చాడు. అయితే ఇల్లు కడిగే విషయంలో అత్తాకోడళ్లకు శుక్రవారం రాత్రి తగాదా జరిగింది. దీంతో గీత తన భర్త మోటార్సైకిల్లో వేసుకునేందుకు బాటిల్తో తీసుకువచ్చి ఇంట్లో ఉంచిన పెట్రోల్ను శనివారం వేకువ జామున వంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే ఆమెను పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మేజిస్ట్రేట్కు ఆమె వాగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి డాక్టర్లు రిఫర్ చేశారు. అక్కడికి తీసుకెళుతుండగా మార్టేరు వద్ద ఆమె మరణించింది. తహసిల్దార్ చాగలకొండు గురుప్రసాదరావు, డీఎస్పీ రఘువీర్రెడ్డి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు -
వేధిస్తున్న ముంపు భయం
యలమంచిలి రూరల్, న్యూస్లైన్: యలమంచిలి పట్టణాన్ని ముంపు భయం వెంటాడుతోంది. చి న్నపాటి వర్షానికే పట్టణంలోని పలు వీధులు ముంపు బారిన పడుతున్నాయి. పట్టణంలో ఎన్టీఆర్, ధర్మవరం, నాగేంద్రకాలనీ, ఏఎస్ఆర్, మిలట్రీ, యానాద్రి కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. గత ఏడాది అక్టోబరు 27న కురిసిన భారీ వర్షాలతో యలమంచిలి పట్టణమంతా ముంపునకు గురయింది. అప్పట్లో పోలవరం ఎడమ కాలువ నీరు శేషుగెడ్డ ద్వారా ప్రవహించడంతో పట్టణ ప్రజలు వారం రోజలపాటు ముంపులోనే గడిపారు. శేషుగెడ్డ గట్టు పటిష్టంగా లేకపోవడంతోపాటు పట్టణంలో పూర్తిస్థాయిలో కాలువలు లేకపోవడంతో యలమంచిలి పట్టణానికి ముంపు సమస్య పరిష్కారం కావడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గత వారం కురిసిన వర్షాలకు పలు వీధులు ముంపు బారిపడ్డాయి. ఇలా వర్షం పడిన ప్రతిసారీ లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు ప్రారంభమయితే భయంతో గడుపుతున్నారు. వానలు తగ్గుముఖం పట్టిన వారం పది రోజులకు సాధారణ పరిస్థితి నెలకొనడం లేదని వాపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో రోజుల తరబడి తాగునీరు అందడం లేదు. శేషుగెడ్డను పూర్తిస్థాయిలో పటిష్టం చేయడంతోపాటు పట్టణంలో కాలువల నిర్మాణం చేపట్టాలన్న స్థానికుల విన్నపాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యలమంచిలి పట్టణాన్ని ముంపు బారినుంచి తప్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు. -
'ఎన్నికలొచ్చినప్పుడల్లా ఫొటో బయటకు తీస్తారు'
-
'ఎన్నికలొచ్చినప్పుడల్లా ఫొటో బయటకు తీస్తారు'
యలమంచిలి: ఏ నాయకుడైతే ప్రజల గుండెచప్పుడు వింటాడో అలాంటి నాయకుణ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. 45 రోజుల్లో మన తలరాతలు మార్చే ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం జిల్లా యలమంచిలిలో జరిగిన రోడ్ షోలో అశేష జనాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. చంద్రబాబు పాలన తలచుకుంటే భయమేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన ఇంతవరకు ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయలేదన్నారు. రాష్ట్ర విభజనకు కారకుడైన చంద్రబాబు.. ఇప్పుడు సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటూ వస్తున్నారని అన్నారు. ‘‘బాబు తీరు ఎలా ఉందంటే ఒక వ్యక్తిని తానే చంపి తిరిగి చనిపోయిన వ్యక్తికి నేనే దండవేస్తానని పరిగెత్తినట్టుంది. ఒకమనిషిని చంపి దండ వేయడమనేది ఆయనకు కొత్తేం కాదు. సొంత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి తిరిగి ఎన్నికలొచ్చినప్పుడల్లా ఆయన ఫొటో బయటకు తీసి దానికి దండేస్తుంటారు’’ అని ఘాటుగా విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని జగన్ కోరారు. -
రైలుకింద పడి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
-
రైలుకింద పడి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
విశాఖ జిల్లా యలమంచిలి వద్ద ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. వారిలో తల్లి, ఒక కూతురు మరణించగా, మరో కూతురు తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ తల్లీ కూతుళ్లు ఎవరో, ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించారన్న విషయం ఇంకా తెలియరాలేదు. బహుశా కుటుంబలో కలతల వల్ల ఇలా చేసి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. -
గట్టెక్కేదెలా?
యలమంచిలి: సాధారణ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు తరుముకురావడంతో రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైంది. ముందుగా వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించకపోతే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం ాలిటీ ఎన్నికల్లో స్థానిక కులసమీకరణాలు, బంధుత్వాలు, పరిచయాలతో పాటు డబ్బు, మద్యం కీలకం కానున్నాయి. యలమంచిలి మున్సిపాలిటీలో అత్యధికంగా కాపు కులస్తులు ఉండగా తర్వాత వరుసలో గవర సామాజిక వర్గంవారు ఉన్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ, టీడీపీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించాయి. వార్డుల్లో గెలుపు గుర్రాల కోసం వెదుకుతున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీకి మరింత బలాన్నిస్తోంది. వైఎస్సార్ సీపీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా బోదెపు గోవింద్ సతీమణి, లేదా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆడారి శ్రీధర్ భార్యకు అవకాశం రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి ఆడారి తులసీరావు కుమార్తె పిళ్లా రమాకుమారి పేరు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్చార్జ్ సుందరపు విజయ్కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ మరోపక్క మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పేరు వినిపిస్తోంది. సుందరపు అభ్యర్థిత్వాన్ని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుతోపాటు ఆయన అనుచరులు వ్యతిరేకిస్తుండడంతో ఆ పార్టీ అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత కనిపించడంలేదు. మరోపక్క ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు కూడా హటాత్తుగా రూటు మార్చారు. చంద్రబాబుతో మంతనాలు జరిపిన ఎమ్మెల్యే యలమంచిలి నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తానని కార్యకర్తలతో చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రకటనలు తెలుగుతమ్ముళ్లతోపాటు, కాంగ్రెస్ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ఇక కాంగ్రెస్పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు కనుచూపుమేరలో కనిపించడంలేదు. వైఎస్సార్సీపీ నుంచి ఆపార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పేరు వినిపిస్తోంది. -
‘యలమంచిలి’ సీటు కష్టమే!
‘దేశం’లో చేరినా దుర్లభమే కాస్తయినా కలసిరాని తమ్ముళ్లు పాత కేసులతో చిక్కుముళ్లు యలమంచిలి, న్యూస్లైన్: కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా? అన్న సామెత యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు విషయంలో వాస్తవమయ్యేట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ బద్ధ శత్రువులుగా వ్యవహరించిన యలమంచిలి టీడీపీ నాయకులు ఇప్పుడు ఒక్కసారి చేరువైపోయి, ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలన్న ఆయన ఆశ అడియాస అయ్యేట్టు స్పష్టమవుతోంది. పదవిలో ఉన్నప్పుడు యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ నేతలను, కార్యకర్తలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఘనత ఆయనకుంది. తమను నానా ఇబ్బందులు పెట్టిన వ్యక్తి మళ్లీ తమ పార్టీలోనే చేరడంపై తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహం అవధులు మీరుతోంది. కన్నబాబు తప్పుడు కేసులకు తట్టుకోలేక పలువురు రోజుల తరబడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం విదితమే. ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే కాసుల వర్షం కురిపించగలనంటూ టీడీపీ అధినేత బాబుకు కన్నబాబు హామీ ఇచ్చినట్టు తెలియవస్తోంది చంద్రబాబు తనకు ఎక్కడో ఒక్క చోట టికెట్ ఇస్తారని కన్నబాబు ఆశిస్తున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో ఇప్పటికే దేశం పార్టీ ముఖ్యనేతలతో వైరం ఉండడంతో కన్నబాబు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాల్లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ను కన్నబాబు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే విశాఖలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ను ఆశిస్తూ దేశం పార్టీలో చేరినట్టు భావిస్తున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుకు, కన్నబాబుకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కన్నబాబు కేసులకు విసిగిపోయిన టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. తులసీరావు అనుచరుడు ఆడారి ఆదిమూర్తి, కన్నబాబుతో కయ్యానికి దిగారు. కన్నబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీకి ఫిర్యాదుచేశారు. 2004 ఎన్నికలకు ముందు లక్షల్లో ఉన్న కన్నబాబు ఆస్తులు కోట్లకెలా చేరారంటూ వివరాలతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ విచారణ చేపట్టింది. యలమంచిలి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఆస్తులపై ఆరాతీసింది. ఎమ్మెల్యే ఇళ్లను సోదాచేసి ఆస్తులకు సంబంధించిన పలు పత్రాల వివరాలను సేకరించిం ది. ఏసీబీ విచారణలో ఉండగానే ఎమ్మెల్యే సాక్షాత్తు ముఖ్యమంత్రి ద్వారానే పైరవీలు ప్రారంభించారు. కానీ కిరణ్ సహకరించలేదని ఇప్పుడు తెలుగుదేశం వారితో బహిరంగంగా అంటున్నారు. తులసీరావుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. తులసీరావుతో విబేధాలు ఉన్న కన్నబాబును టీడీపీలోకి చేర్చుకోవడం తమ్ముళ్లకు కడుపు మండుతోంది. చంద్రబాబు అండతో స్థానిక నాయకులపై ఒత్తిడి తెచ్చి కేసులు ఎత్తివేయించుకోవడానికే కన్నబాబు టీడీపీ బాట పట్టారని వారు విమర్శిస్తున్నారు. -
జిల్లాస్థాయి ఎడ్ల పోటీ విజేతగా నర్సయ్యపేట
ఉరకలెత్తిన ఎడ్లు అనకాపల్లి మండలం కూండ్రంలో జిల్లా స్థాయి ఎడ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి. యలమంచిలి రామునాయుడు తీర్థంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో 25 ఎడ్లబండ్లు పాల్గొన్నాయి. నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. తుమ్మపాల, న్యూస్లైన్: కూండ్రంలో యలమంచిలి రామునాయుడు 9వ వర్థంతిని పురస్కరించుకొని మంగళవారం తీర్ధ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 25 ఎడ్లబండ్లు పాల్గొన్నాయి. నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. వీలుపర్తి సిద్ధివినాయక ఎడ్లు రెండో స్థానంలో, కృష్ణరాయుడుపేటకు చెందిన ఇసరపు హేమంతకుమార్ ఎడ్లు మూడో స్థానంలో, ఎల్.కోట తలారికి చెందిన ఎం.అచ్చంనాయుడు ఎడ్లు నాలుగో స్థానంలో, కొత్తపెంట అభయాంజనేయస్వామి ఎడ్లు అయిదో స్థానంలో, తమ్మకాపల్లి బంగారమ్మ ఎడ్లు ఆరో స్థానంలో, కందిపూడికి చెందిన పైడిమాంబ ఎడ్లు ఏడో స్థానంలో, కొత్తపెంటకు చెందిన అభయాంజనేయ-3 ఎడ్లు 8వ స్థానంలో నిలిచాయి. విజేతలకు రూ.8 వేలు, రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.1500, రూ.1200, రూ.1000 చొప్పున అనకాపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భాస్కరరావుతో అందజేశారు. నిర్వాహకులు యలమంచిలి పెద రమణ, యలమంచిలి లక్ష్మణరావు, యలమంచిలి చిన రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్కుమార్, జి.వి.నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బరితెగింపు
యలమంచిలి, న్యూస్లైన్: శృతి మించి రాగాన పడుతోంది. పండగ సరదా పరాకాష్టకు చేరి పోలీసులపై దాడి వరకూ వెళ్తోంది. కోడి పందాల్లో రేగిన పౌరుషం మూకుమ్మడిగా గొడవ పడే స్థాయికి చేరుతోంది. పెద్ద పండగ వేళ, పందాలకు పగ్గాలు వేయాలన్న పోలీసులతో గ్రామస్తులు ఘర్షణ పడే వాతావరణం తలెత్తుతోంది. పరిస్థితి చేయి దాటకుండా గ్రామాల్లో పోలీసులను మోహరించాల్సి వస్తోంది. కోడిపందాలను అదుపు చేయాలన్న పోలీసుల ప్రయత్నాలకు ప్రతిఘటన ఎదురవుతోంది. కోడిపందాలరాయుళ్లు బరితెగిస్తూ ఉండడంతో వాతావరణం వేడెక్కుతోంది. పందాలు ఆపడానికి గ్రామాలకు వెళ్తున్న పోలీసులపై అక్కడివారు తిరగబడుతున్నారు. ఎదురుదాడులకు పాల్పడి పోలీసులనే హడలెత్తిస్తున్నారు. గురువారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరంలో ఇదే జరిగింది. ఎర్రవరాన్ని ఆనుకుని కొండకాలువ వద్ద కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యలమంచిలి టౌన్ ఎస్ఐ చంద్రమౌళి, ట్రైనీ ఎస్ఐలు రామకృష్ణ, రవికుమార్, మరో నలుగురు హోంగార్డులు మఫ్టీలో వెళ్లారు. పోలీసులు నిక్కర్లు, లుంగీలు, తలపాగాలతో ఉండడంతో పందెంరాయుళ్లు కొద్దిసేపు వారిని గుర్తించలేదు. వెంటనే పోలీసులు దాడి చేశారు. దాంతో పందెంరాయుళ్లు చెల్లాచెదురయ్యారు. కొందరు గ్రామంలోకి పరుగులు తీశారు. పోలీసులు సంఘటన స్థలం వద్ద ఏడు కోళ్లను, నగదుతోపాటు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు గ్రామంలోకి వెళ్లి వీడియో క్లిప్పింగ్ ఆధారంగా నడిగట్ల చిన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.అడ్డగించిన అతని భార్యను పోలీసులు నెట్టేయడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. దుర్భాషలాడారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తుల దాడిలో పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న యలమంచిలి సీఐ మల్లేశ్వరరావు సమైక్యాంధ్ర విధుల్లో ఉన్న సాయుథ బలగాలను ఎర్రవరానికి పంపారు. పోలీసులు పెద్ద ఎత్తున రావడంతో గ్రామస్తులు చెల్లాచెదురయ్యారు. ఈ సంఘటనను టౌన్ ఎస్ఐ సెల్ఫోన్లో వీడియో తీశారు. ఆ చిత్రాల ఆధారంగా దాడిచేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన పొన్నాడ రమణ, సోరంగి చిన్నలను యలమంచిలి టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద జనం జరిగిన సంఘటనపై నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని టౌన్ పోలీస్స్టేషన్లో సాయంత్రం విచారణ జరిపారు. ఈ సంఘటనకు సంబంధించి ముత్తు గోవిందు, నడిగట్ల దుర్గతోపాటు మరో 18 మందిని వీడియో క్లిప్పింగ్ల ఆధారంగా గుర్తించినట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రమణ, చిన్నలను అరెస్టు చేశామని మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. గ్రామస్తుల దాడి సంఘటనపై ఎస్ఐలు రాతపూర్వకంగా యలమంచిలి సీఐకి ఫిర్యాదుచేశారు. దీంతో ఎర్రవరం గ్రామస్తులు పెద్ద ఎత్తున యలమంచిలి టౌన్ పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. బుధ వారం రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెంలోనూ ఇలాగే జరిగింది. అక్కడ పోలీసులపై దాడిచేసిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. కోడిపందాలు, పేకాటలు నియంత్రించడానికి నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని ముందస్తు వ్యూహంతో మూడురోజులుగా ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించడం సత్ఫలితాలనిస్తోంది. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనే మూడురోజుల్లో 239 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేసి రూ.3 లక్షలవరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులపై కోడిపందేల రాయుళ్ల దాడి
యలమంచిలి: పోలీసులపై కోడిపందేలరాయుళ్లు గురువారం దాడి చేశారు. విశాఖ జిల్లా యలమంచిలి పట్టణ పరిధి ఎర్రవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎర్రవరాన్ని ఆనుకుని కొండకాలువ వద్ద కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యలమంచిలి టౌన్ ఎస్ఐ చంద్రమౌళి, ట్రైనీ ఎస్ఐలు రామకృష్ణ, రవికుమార్లతోపాటు మరో నలుగురు హోంగార్డులు మఫ్టీలో వెళ్లారు. పందెం రాయుళ్లు కొద్దిసేపు వారిని గుర్తించలేదు. పోలీసులు దాడులకు దిగడంతో పందెంరాయుళ్లు చెల్లాచెదురయ్యారు. పోలీసులు ఘటనాస్థలి వద్ద 7 కోళ్లు, నగదుతోపాటు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు గ్రామంలోకి వెళ్లి వీడియో క్లిప్పింగ్ ఆధారంగా నడిగట్ల చిన్నను అదుపులోకి తీసుకోవడానికి యత్నించారు. అతని భార్య అడ్డగించడంతో వివాదం చోటుచేసుకుంది. ఆమెను పోలీసులు నెట్టేయడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తుల దాడిలో పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. తర్వాత పెద్దఎత్తున పోలీసులు గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులు చెల్లాచెదురయ్యారు. పొన్నాడ రమణ, సోరంగి చిన్నలను యలమంచిలి టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ముత్తుగోవిందు, నడిగట్ల దుర్గతోపాటు మరో 18 మందిని వీడియో క్లిప్పింగ్ల ఆధారంగా గుర్తించినట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. -
వచ్చే నెలలో సీఎం, నేను రాజీనామా చేస్తున్నాం: పితాని
యలమంచిలి, న్యూస్లైన్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వచ్చే నెలలో రాజీనామా చేసేందుకు ముహూర్తం నిర్ణరుుంచుకున్నారని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పితాని ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం కిరణ్ వచ్చే నెలలో రాజీనామా చేస్తారని, ఆ వెంటనే తాను కూడా రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. విభజనకు అనుకూలంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ లేఖలు ఇచ్చినందునే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. అయితే సీమాంధ్రలో ఉద్యమం వెల్లువెత్తడంతో మిగిలిన పార్టీలు యూటర్న్ తీసుకున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన నెపం కాంగ్రెస్ పార్టీపై పడిందన్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలో తామం తా సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నామని చెప్పారు. ఆ దిశగానే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక రాజీనామాలు చేయాలని నిశ్చయించుకున్నట్టు పితాని తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ‘సమైక్య’ ముద్రకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీఎం.. తన సన్నిహిత మంత్రి పితాని నోటివెంట ఈ మాటలు చెప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుండడం గమనార్హం. -
విశాఖ జిల్లాలో బంగారం పేరుతో మోసం
విశాఖపట్నం: రాష్ట్రంలో దుండగుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బంగారాన్ని అపహరించడం, నకిలీ బంగారాన్ని అమ్మడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలోని యలమంచిలిలో బంగారం పేరుతో దుండగులు మోసానికి పాల్పడ్డారు. స్వచ్చమైన బంగారమని చెప్పి, ఓ కుటుంబాన్ని నమ్మబలికిన దుండగులు నకిలీ బంగారాన్ని కట్టబెట్టి సుమారు 8.50లక్షల రూపాయల సొమ్ముతో ఉడాయించారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధిత కుటుంబం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు చెప్పారు. -
యలమంచిలి ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
పాడేరు : యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రయివేటు కేసుకు సంబంధించి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై పోలీసు అధికారులతో పాటు ఎమ్మెల్యే కన్నబాబు, మరో ఇద్దరు పట్టు పరిశ్రమ ఉద్యోగులు మొత్తం 8మందిపై కేసులు నమోదు చేయాలని విశాఖ జిల్ఆ పాడేరు కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పాడేరు పోలీసులు నిన్న ఎనిమిదిమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలో పాడేరులో పనిచేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు బాలసూర్యారావు, వెంకట అప్పారావు, ఎస్ఐలు శోభన్ బాబు, శంకరరావు, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, సెరీకల్చర్ ఉద్యోగులు ధనలక్ష్మి, రత్నకుమారిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాడేరుకు చెందిన సామాజిక కార్యకర్త అల్లాడి శ్రీనివాసరావుకు రెండేళ్ల కిందట కన్నబాబు ఫోన్లో బెదిరించారనే ఆరోపణలపై పాడేరు నాయ్యస్థానంలో ప్రయివేటు కేసు నమోదు అయ్యింది. దీనిపై అప్పట్లో పనిచేసిన వీరంతా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అల్లాడి పలు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి తదుపరి చర్యలకు పాడేరు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారయత్నం
విశాఖపట్నం: యలమంచిలిలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఆ బాలికపై అత్యాచారం చేయడానికి ఇద్దరు యువకులు ప్రయత్నించారు. ఇద్దరూ మద్యం తాగిన మైకంలో అత్యాచారయత్నం చేశారు. స్థానికులు వారిని పట్టుకొని పో్లీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులు ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. నిందితులలో ఒకరు ఆర్మీ ఉద్యోగి కాగా, మరొకరు కోపరేటివ్ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆర్మీ ఉద్యోగి సెలవుపై ఇక్కడికి వచ్చాడు. -
విద్యాశాఖ నెలవారీ సమీక్షలు
విశాఖపట్నం, న్యూస్లైన్: ప్రాథమిక విద్యను పటిష్టం చేసేందుకు విద్యశాఖ కసరత్తు ప్రారంభించింది. నెలవారీ సమీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఇందులో బాగంగా జిల్లాలో ఉన్న యలమంచిలి, పాడేరు, విశాఖపట్నం డివిజన్లలో విద్యాశాఖాధికారులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీఆర్పీలతో సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. ప్రతినెలా 16, 17, 18 తేదీల్లో ఈ మూడు డివిజన్లలో తప్పని సరిగా సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేశారు. తరగతి గదుల నిర్మాణం, మధ్యహ్న భోజన పథకం, యూనిఫామ్స్, బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించడం, అనాథ పిల్లల్ని ఆర్ఎస్టీసీల్లో చేర్చడం, పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి నిర్వహణ, విద్యాహక్కు చట్టం, పాఠ్యపుస్తకాల పంపిణీ, రికార్డుల పరిశీలన తదితర అంశాలపై చర్చించేందుకు వీలుగా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ఉపాధ్యాయులు పనిచేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ సమావేశాలకు ప్రతినెలా జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ), రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ప్రాజెక్ట్ అధికారి(పీఓ) తప్పని సరిగా హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం పాడేరు డివిజన్కు సంబంధించి పాడేరు, 19న యలమంచిలి, 20న విశాఖ డివిజన్లలో విద్యాశాఖాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. -
వరద బాధితులను పరామర్శించని చిరంజీవి
యలమంచిలి: ఆపదలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తన పర్యటన అని చెప్పిన కేంద్ర మంత్రి చిరంజీవి వరద బాధితులను పరామర్శించకుండానే వెళ్లిపోయారు. ఈ ఉదయం చిరంజీవి విశాఖపట్నం జిల్లా యలమంచిలి మీదగా వెళ్లారు. ఇక్కడ వరదకు గురైన ప్రాంతాలను చూడలేదు. బాధితులనూ పలకరించలేదు. కేంద్ర మంత్రి చిరంజీవి యలమంచిలి వస్తున్నట్లు చెప్పడంతో బాధితులు ఆయన కోసం ఎదురు చూశారు. దాదాపు మూడు గంటలపాటు వరద బాధితులు ఆయన కోసం వేచి ఉన్నారు. కానీ ఆయన యలమంచిలి పట్టణంలోకి రాకుండా, బైపాస్ రోడ్డున వెళ్లిపోయారు. దాంతో స్థానిక వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాలు పడుతున్న తమను పట్టించుకోవడంలేదని వాపోయారు. -
ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
యలమంచిలి, న్యూస్లైన్ : అధిక వర్షాలతో ముంపునకు గురైన వరిచేలను ఆదివారం కలెక్టర్ సిద్ధార్థజైన్ పరిశీలించారు. తొలుత కాంభొట్లపాలెం, గుంపర్రు, చింతదిబ్బలో మునిగిన వరి పొలాలను పరిశీలించిన కలెక్టర్ అనంతరం వడ్డిలంక స్లూయిజ్ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు డ్రెయిన్ తవ్వారు కానీ సబ్ డ్రెయిన్లకు షట్టర్లు పెట్టలేదని ఫిర్యాదు చేశారు. షట్టర్లు లేకపోవడం వల్ల డ్రెయిన్లో నీరు ఎదురొచ్చి చేలను ముంచుతుందని చెప్పారు. వడ్డిలంక స్లూయిజ్ తలుపులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని చెప్పారు. రైతుల ఫిర్యాదులను విన్న కలెక్టర్ డీఆర్సీ సమావేశంలో సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. ఆయన వెంట ఎంపీ కనుమూరు బాపిరాజు, ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, ఏఎంసీ చైర్మన్ ఉన్నమట్ల కబర్థి, సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు కడలి గోపాలరావు, మాజీ ఎంపీపీ చిలుకూరి బాపిరాజు, సర్పంచ్లు చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, సత్తినీడి నరసింహరాజా, బుంగా వెంకట్రావు, పాలపర్తి కుమారరత్నం, పూరిళ్ల సత్యవతి, గోడి అశోక్కుమార్ ఉన్నారు. -
జిల్లాలో కనీవినీ ఎరుగని వర్షం
విశాఖ రూరల్, న్యూస్లైన్: జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు అనకాపల్లి, కశింకోట, మునగపాక, ఎస్.రాయవరం, రాంబిల్లి, య లమంచిలి మండలాల్లో గ్రామాలు నీట ముని గాయి. ఐదు రోజుల్లో కురిసిన వర్షాల కంటే ఆదివారం అధికంగా 9.15 శాతం వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్క రోజే 140 గ్రామాలు నీట మునిగాయి. ఇతర ప్రాంతాలతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. 34 ఇళ్లు 24 గంటలకుపైగా ముంపులోనే ఉన్నాయి. 1068 ఇళ్లు దెబ్బతినడంతో రూ.4.27కోట్లు నష్టం వాటిల్లింది. రోడ్లపై వరద నీటి కారణంగా అనకాపల్లి-విశాఖ, అనకాపల్లి-యలమంచిలి మధ్య మధ్యాహ్నం వరకు బస్సులు తిరగలేదు. ఆర్టీసీ 180 సర్వీసులను రద్దు చేసింది. యలమంచిలి మండలం కొక్కిరాపల్లిని వరదనీరు ముంచెత్తడంతో అక్కడి గురుకులపాఠశాల మొదటి అంతస్తు పూర్తిగా మునిగిపోయింది. 600 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. అంతా పైఅంతస్తుకి వెళ్లి తలదాచుకున్నారు. ఉధృతి తగ్గాక అధికారులు వారిని తరలించారు. కశింకోట మండలంలో ఇద్దరు వరదల్లో చిక్కుకొని గల్లంతయినట్టు అధికారులకు సమాచారం అందింది. అయితే వారి జాడలేకపోవడంతో అధికారికంగా ధ్రువీకరించలేదు. మునగపాకలో మేతకు వెళ్లిన రెండు గేదెలు కొండ చరియలు విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందాయి. వాటికి కాపలాగా వెళ్లిన వ్యక్తి కాలికి గాయమవడంతో మండల ప్రత్యేకాధికారి చికిత్స నిమిత్తం విశాఖ తరలించారు. రాంబిల్లి మండలం దిమిలి , యలమంచిలి మండలం సోమలింగపాలెం వద్ద శారదా నదికి గండ్లు పడ్డాయి. జాతీయ రహదారిపైకి నాలుగు అడుగుల మేర వరద నీరు చేరింది. నాలుగు గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. 40 మంది పోలీసులు అక్కడకు చేరుకొని వాహనాలను నియంత్రించారు. వరద ఉధృతి తగ్గాక ట్రాఫిక్ను పునరుద్ధరించారు. రంగంలోకి నేవీ గ్రామాలు నీట మునగడంతో నేవీ రంగంలోకి దిగింది. 30 బోట్లతో 15 బృందాలు ముంపు గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. కలెక్టరేట్ నుంచి ఆదివా రం ఉదయం అధికారులు సహాయక కార్యక్రమాలకు అవసరమైన సామాగ్రిని ముంపు గ్రామాలకు వ్యాన్లలో పంపించారు. నేవీతో పాటు 40 మంది సభ్యులతో కూడిన జాతీయ విపత్తుల స్పందన బృందం శ్రీకాకుళం నుంచి జిల్లాకు చేరుకుంది. అనకాపల్లిలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆహార, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నారు. మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మంగళగిరి, అరక్కోణం నుంచి జిల్లాకు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 47 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల నుంచి 25 వేల మందిని ఆ కేంద్రాలకు తరలించారు. వారి కోసం 25 వేల ఆహారం, లక్షా 20 వేల మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేశారు. అలాగే కొన్ని గ్రామాల ప్రజలకు 153.93 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. 37 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. చాలా గ్రామాలు నీట మునగడంతో మంచినీటి సరఫరా పెద్ద ఇబ్బందిగా మారింది. వాహనాలు వెళ్లే ప్రాంతాలకు సోమవారం వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అవకాశం లేని ప్రాంతాల్లో మంచి నీటి ప్యాకెట్లను సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీగా నష్టం వారం రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. వ్యవసాయ పంటలు 53947.5 ఎకరాల్లోను, ఉద్యానవన పంటలు 1787.5 ఎకరాల్లోను నీట మునిగాయి. జిల్లాలో 229 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు పాడయ్యాయి. వీటిని శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలంటే రూ.55.46 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నా రు. అలాగే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 179 కిలోమీటర్ల పరిధిలో 75 రోడ్లు, 11 భవనాలు దెబ్బతినడంతో రూ.1.77 కోట్లు నష్టం ఏర్పడింది. అంధకారంలో 140 గ్రామాలు ఈ వర్షాలకు జిల్లాలో 140 గ్రామాలు అందకారంలో మగ్గుతున్నాయి. 33 కేవీ సింగిల్ పోల్ కొట్టుకుపోవడంతో మాకవరపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, చింతపల్లి మండలాల గ్రా మాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అలాగే ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో ట్రాన్స్ఫార్మర్ నీట మునగడంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ఇంకా అనేక గ్రామాలు నీటిలో ఉండడంతో వాటికి ఇప్పట్లో విద్యుత్ సరఫరాకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. డీఆర్ఎంతో మాట్లాడిన కలెక్టర్ వర్షాలు కారణంగా విశాఖకు రావాల్సిన రైళ్లు మధ్యలోనే వెనుతిరుగుతున్నాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చే రైళ్లు తుని వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో జిల్లా ప్రయాణీకులు అవస్తలు పడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదివారం డీఆర్ఎంతో ఫోన్లో మాట్లాడారు. జిల్లావాసులను విశాఖకు సురక్షితంగా తీసుకువచ్చేందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. -
నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైళ్లు
యలమంచిలి, న్యూస్లైన్ :విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా 3 ఎక్స్ప్రెస్ రైళ్లు కొద్దిసేపు రేగుపాలెం రైల్వేస్టేషన్లో నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఉదయం గం.5.30ల నుంచి 6గంటలవరకు రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. రైలు నర్సీపట్నంరోడ్డుస్టేషన్ దాటగానే గ్రిడ్ ఫెయిల్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంజిన్ స్టోరోజ్లో ఉన్న విద్యుత్ ద్వారా రేగుపాలెం రైల్వేస్టేషన్కు తీసుకువచ్చారు. కాగా భువనేశ్వర్నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్సెప్రెస్ ఉదయం 5.40 నుంచి 6గంటలవరకు, గరీబ్ధ్ ్రఎక్స్ప్రెస్ ఉదయం 8.11ల నుంచి 8.17వరకు రేగుపాలెం రైల్వేస్టేషన్లో నిలిచిపోయాయి. ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో ఆయా రైళ్లు కదిలాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.