Best Villain
-
ఏమప్పా బాలగోవిందు...నేను పొన్నుసామిని!
ఉత్తమ విలన్ జీవా విలనీలో మూసవాసనలు ఉండవు. భయానకం, విరుపు, వెటకారం, హాస్యం కలగలిసి ఒక్కో పాత్రలో ఒక్కరకంగా ఆ విలనీ పండుతుంది. భయానకం: ‘నాకు పెద్దగా కోరికలేమీ లేవు. మూడే మూడు కోరికలు. 1. నాలుగు కోట్లు. 2. డబుల్ ఏసీ రూమ్. 3. అందమైన ఆడపిల్ల. చివరికి ఏమైంది? నాలుగు కోట్లు మటాష్. డబుల్ ఏసీ రూమ్ కాదు కదా...సింగిల్ ఏసీ రూమ్ కూడా లేక... చివరికి ఇలా అడవుల పాలయ్యాం’‘మృగం’ సినిమాలో ప్రతినాయకుడిగా ఈ డైలాగు చెబుతున్నప్పుడు జీవాలో కనిపించే కసి లోతేమిటో తెలిసిపోతుంది.అమ్మో జీవా! ‘ఆ భద్రగాడికి వేలకు వేలు ఇచ్చింది నీ మీద చేయి వేయడానికి... తీయడానికి కాదు’ అని ఆడపిల్లను వేధిస్తూ ‘కార్తికేయ’ సినిమాలో శంకరన్నగా జుగుప్సను రాజేయగలడు. వామ్మో జీవా!! ‘ఏమప్పా బాలగోవిందు! నేను మీ నాన్న ఫ్రెండ్ని అప్పా. ఇంటికెళ్లాలి... అడ్రస్ చెప్పు’ అని హీరోని అడిగి... అతని జవాబు విని కంగుతిన్న తంబిదురై అనుచరుడు పొన్నుసామిగా ‘దేశముదురు’ సినిమాలో కితకితలు పెట్టించగలడు.. ఏడిపిస్తూనే నవ్వించగలడు. నవ్విస్తూనే ఏడిపించగలడు. కొన్నిసార్లు ఆయన పెదవులు కాదు ఎర్రటి కళ్లు డైలాగులు చెబుతాయి. ∙∙ నాటకాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీ లలో నటించి నటనలో రాటుదేలిన జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. ఈ పేరేదో పొడుగ్గా ఉందని దయారత్నం పేరుని ‘జీవా’గా మార్చారు ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్. ఆయన ‘తొలి కోడి కూసింది’ చిత్రంతో వెండి తెరకు పరిచమయ్యారు జీవా. ఈ సినిమాలోని పాత్ర కోసం వేలాది మంది యువకులు పోటీ పడితే తన కళ్లతో ఆ పాత్రను దక్కించుకున్నారు జీవా. కళ్లతో దక్కించుకోవడం ఏమిటి? అనే కదా డౌటు. విషయం ఏమిటంటే ‘తొలి కోడి కూసింది’ సినిమాకు వేలాది ఫొటోలు వచ్చాయి. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఈ ఫొటోల్లో నుంచి ఒక ఫొటోలోని రెండు కళ్లు బాలచందర్ని ఆకర్షించాయి. అలా దయారత్నం కాస్త జీవా అయ్యాడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కెరీర్ తొలిరోజుల్లో ఆయనవేసే పాత్రల్లో విపరీతమైన కోపం, కసి కనిపించేవి. ఇప్పుడు వాటి స్థానంలో కామెడీ అంతర్లీనమై పోయింది. ‘జగ్గా హైదరబాదీ’గా ‘సత్య’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న జీవా... తెలుగు విలన్లలో చెప్పుకోదగ్గ విలన్. మెచ్చుకో దగ్గ విలన్. ఉత్తమవిలన్. -
సైలెంట్ విలన్!
‘ఆయన ఎవరనుకుంటున్నారు?‘‘సాక్షాత్తు ఎంపీగారి కుమారుడు, యూత్ లీడర్... ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారా?’’‘‘తప్పు చేసిన వాడిని జైల్లో వేయక మెడలో దండలు వేసి ఊరేగిస్తారా?’’చట్టంతో వారికి పనిలేదు. రూల్స్తో వారికి పనిలేదు. వారికి తెలిసిందల్లా వాటిని తమ దారిలోకి తెచ్చుకోవడం. అవి దారిలోకి వస్తే రాష్ట్రాన్ని సైతం అమెరికాకు అమ్ముకునే తెలివితేటలు ఉన్నాయి ఈ తండ్రీకొడుకులకు. అందుకే ఆ యూత్లీడర్ ఏమంటున్నాడో చూడండి.‘‘నన్ను లోపలెయ్యడానికి వాడెవ్వడు.మా నాన్నతో ఢిల్లీతో మాట్లాడించి వాడ్ని ట్రాన్సఫర్ చేయిస్తానంతే’’ ‘రక్షణ’ సినిమాలో యూత్లీడర్ కావచ్చు. ‘నువ్వు నేను’ సినిమాలో మాటలు లేకుండా హీరోహీరోయిన్లను వెంటాడే రౌడీ కావచ్చు.... ఏ పాత్ర చేసినా బెనర్జీకి బారెడు డైలాగులు ఉండవు. దీనికి జవాబు అడిగితే ఆయన దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోవచ్చుగానీ... భయపెట్టించడానికి బారెడు డైలాగులు మాత్రమే అక్కర్లేదని బెనర్జీ నటన పరిచయం ఉన్నవాళ్లకు అర్థమవుతుంది.చిన్న డైలాగుల్లో సైతం లోతైన నటనను ప్రదర్శించడంలో తనదైన మార్క్ సృష్టించుకున్నారు బెనర్జీ. సినిమాల్లోకి వెళ్లాలని, నటుడు కావాలని బెనర్జీ పెద్దగా ఎప్పుడూ అనుకోలేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ఒక నీటి ప్రవాహంలా ఎటంటే అటు వెళ్లారు. మద్రాస్లో హోటల్ మేనేజ్మెంట్ చదివి మధ్యలోనే వదిలేశారు. ఒక కంపెనీ బ్రాంచ్ మేనేజర్గా విజయనగరంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. అక్కడ మంచి స్నేహితులను సంపాదించుకున్నారు. వారి సలహా వల్లో ఏమోగానీ ఆ తరువాత సినిమా ఫీల్డ్కు వెళ్లారు. యు.విశ్వేశ్వర్రావు దగ్గర ఒక సినిమాకు అసిస్టెంట్గా పనిచేశారు. అసిస్టెంట్గా విధులు నిర్వహించడంతో పాటు ఆ సినిమాలో నటించారు కూడా. అలా తొలి సినిమాతోనే అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు నటుడు అయ్యారు.‘థర్టీఇయర్స్ ఇండస్ట్రీ’ అనిపించుకున్నారు.‘అది చేస్తా’, ‘ఇది చేస్తా’, ‘ఇరగదీస్తా’ ఇలాంటి ఆడంబరపు మాటలేవీ బెనర్జీ నోటి నుంచి వినిపించవు. అలవి కాని స్వప్నాలు కూడా ఆయనలో కనిపించవు. ఆయన మాటల్లో లోతు కనిపిస్తుంది. అడపాదడపా ఇలాంటి కవితలు కూడా వినిపిస్తాయి. ‘ప్రపంచం ఒక మధుశాల జీవితం అనేది ఒక మత్తు ఒకడికి చనిపోవాలనే మత్తు. ఒకడికి బతకాలనే మత్తు. ఒకడికి సంపాదించాలనే మత్తు. ఒకడికి ప్రేమ మత్తు. నేను కొద్దిగానే తాగా. నా మత్తు పొద్దుటి కల్లా దిగిపోతుంది. ఆ మత్తు మాత్రం జీవితం వెళ్లిపోయేవరకు ఉంటుంది’. ఆయనలోని తాత్వికత మాట ఎలా ఉన్నా.... తక్కువ మాటలతో ఎక్కువ భయపెట్టే విలన్ల వరుసలో బెనర్జీ తప్పనిసరిగా ఉంటారు. -
ఈ బంటిగాడికి తిక్క రేగితే...
‘నేను జీవితంలో ఒక్క మంచిపనీ చేయలేదు.ఈ పని చేయనివ్వు’ అంటున్నాడు బొండు తన ఆత్మీయుడితో.ఇంతకీ మంచిపని అంటే? ఒకరి కోసం ప్రాణం ఇవ్వడం కాదు.ఒకరి పగ కోసం ప్రాణం తీయడం... రక్తచరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకోవడం! నాయక్ అంటే కంత్రి. వాడి తమ్ముడు బంటి పరమ కంత్రి. ఈ కంత్రి అంటే ఆ కంత్రికి ఎనలేని ఇష్టం. ‘బంటీ బేటా’ అని ప్రేమగా పిలుచుకుంటాడు. నాయక్కు బంటి తమ్ముడు మాత్రమే కాదు అతడికి కుడిభుజం కూడా.‘ఏమ్రా బంటీ ఇంత లేటు జేసినవ్’ అని ‘దూకుడు’ సినిమాలో మహేష్బాబుతో అనిపించుకున్న ఈ బంటి అసలు పేరు అజాజ్ఖాన్. ‘రక్తచరిత్ర’ ‘దూకుడు’ ‘నాయక్’ ‘బాద్షా’ ‘హార్ట్ ఎటాక్’ ‘వేట’ ‘రోగ్’ సినిమాలతో ‘యువ విలన్’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఖాన్ మొదట ముంబైలో మోడలింగ్ చేశాడు. కండలు తిరిగిన దేహంతో కనబడే ఖాన్ ‘కరమ్ అప్నా అప్నా’ ‘క్యా హోగా నిమ్మో కా’ ‘రహే తేరా ఆశీర్వాద్’ ‘కహానీ హమారీ మహాభారత్ కీ’...మొదలైన టీవీషోలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘అల్లాకే బందే’ ‘రక్తచరిత్ర’ సినిమాలతో వెండితెరకు పరిచయమయ్యాడు. రియాల్టీ టీవీషో ‘బిగ్బాస్–7’తో మరింత పాపులర్ అయ్యాడు. సెయింట్ జేవియర్ స్కూల్లో చదువుకునే రోజుల్లో చదువు మీద కంటే సాంస్కృతిక కార్యక్రమాల మీదే ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు ఖాన్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోవడం లోపం అనుకోవడం లేదు ఖాన్. ఆయన దృష్టిలో లోపం అంటే కల కనకపోవడం. కల కని కష్టపడకపోవడం. కష్టపడినా.. త్వరగానే నిరాశ చెందడం. టైమ్ కోసం ఎదురుచూడక పోవడం. టైమ్ వచ్చినప్పుడు ఫిట్గా లేకపోవడం. అందుకే ఆరోగ్యంపై అమితశ్రద్ధ కనబరుస్తాడు ఖాన్.‘‘గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. దానికి అంకితభావం కూడా తోడుకావాలి’’ అంటాడు ఖాన్. ‘సినిమా ఫీల్డ్లో మనకో గాడ్ఫాదర్ ఉండాలి అనుకుంటారు. ఉన్నాడనుకుందాం. ఆయన పాత్ర మనల్ని పరిచయం చేయడం వరకే. ప్రతిభతో నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది’’ అని చెప్పే ఖాన్ ఇద్దరు దర్శకుల గురించి చెబుతాడు.‘‘మనం ఏ నేపథ్యం నుంచి వచ్చామనే దానితో రామ్గోపాల్వర్మ, మహేష్భట్ లాంటి దర్శకులకు పనిలేదు. మనలో ఏమాత్రం ప్రతిభ ఉన్నా భుజం తడతారు’’ అనే అజాజ్ఖాన్కు టీవీలో నటించడం కంటే సినిమాల్లో నటించడమంటేనే ఎక్కువ ఇష్టం.‘‘టీవీలో కృత్రిమత్వం ఉంటుంది. సినిమాల్లో వాస్తవం ఉంటుంది’’ అంటాడు ఖాన్.వాస్తవపాత్రలతో ‘యువవిలన్’గా ఆయన మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
ఐయామ్ కనకాంబ్రం... బ్రదర్ ఆఫ్ ఏకాంబ్రం
ఏకాంబ్రం తమ్ముడి పేరు కనకాంబ్రం.పేరులో బంగారం ఉండొచ్చుగానీ ఆయన మనసు మాత్రం విషమయం. ఎప్పుడూ ఎవరి మీదో ఒకరి మీద నిప్పులు కక్కుతూనే ఉంటాడు.‘సాలా మర్గయా’ అని అరుస్తూనే ఉంటాడు.తనకు తానే నిప్పుతో వాతలు పెట్టుకుంటూ ‘రా...యు...డూ’ అని పెద్దగా అరుస్తున్న అతడి పేరు భూపతి. అతనికేమైనా పిచ్చా? కాదు కసి! ఎవరి మీద? ఇదిగో ఆయన మాటల్లోనే వినండి.‘ఆ రాయుడు వంశం మీద నా పగ చల్లారకుండా రగులుతూ ఉండడానికి ఈ వాతలు పెట్టుకుంటున్నాను’. చెవిని కిందికిలాగుతూ విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చే కనకాంబ్రంగా ‘గ్యాంగ్లీడర్’ సినిమాలో, అవమానభారంతో రగిలిపోయే అగ్నిపర్వతంలా కనిపించే భూపతి పాత్రలో ‘పెదరాయుడు’లో కనిపించిన ఆనంద్రాజ్ తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత విలన్. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘యాక్షన్ జాక్సన్’తో బాలీవుడ్కు కూడా పరిచయమైన ఆనంద్రాజ్ పాండిచ్చేరిలో పుట్టి పెరిగాడు. తండ్రి వ్యాపారవేత్త. మంచి ఫిజిక్ ఉండడంతో కుమారుడు పోలీస్ ఆఫీసర్ కావాలనుకునేవాడు తండ్రి. కానీ ఆనంద్కేమో సినిమాలు ఇష్టం. ఒక ఫైన్మార్నింగ్... ‘‘నాకు నటన మీద ఆసక్తి ఉంది’’ అని ఆనంద్రాజ్ చెప్పడంతో తల్లిదండ్రులేమీ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అలా మద్రాస్లోని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఇక్కడ శివరాజ్ కుమార్ (కన్నడ హీరో) ఆనంద్కు సహ విద్యార్థి.కమలహాసన్తో సహా రకరకాల క్రాఫ్ట్లకు సంబంధించిన ప్రముఖులు గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వస్తుండేవాళ్లు. అలా వచ్చిన వారిలో కొందరు, విద్యార్థులను పరిశీలిస్తూ ‘నువ్వు భవిష్యత్లో హీరో అవుతావు’, ‘విలన్ అవుతావు’ అని జోస్యం చెప్పేవాళ్లు. అయితే ఆనంద్ విషయంలో మాత్రం ఎవరూ ఏమీ చెప్పలేదు. దీంతో డీలాపడిపోయేవాడు ఆనంద్. యాక్టింగ్ కోర్సు పూర్తికాగానే అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయిని భావించాడు. అయితే అలాంటిదేమీ జరగలేదు.సత్యరాజ్ విలన్ పాత్రల నుంచి హీరో పాత్రలు చేస్తున్న కాలం అది. అంటే విలన్ సీటు ఖాళీగానే ఉంది. ఈ టైమ్లోనే ‘ఒరువర్ వాళుమ్ ఆలయం’, ‘ఉరిమై గీతం’ సినిమాలతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు ఆనంద్రాజ్. ఈ రెండు సినిమాలు బ్లాక్బస్టర్లు అయినప్పటికీ పి.వాసు సినిమా ‘ఎన్ తంగై పడిచ్చవ’ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ‘‘హీరో పాత్రలో ఎంత దమ్ముందో... నువ్వు చేస్తున్న విలన్ పాత్రల్లో కూడా అంతే దమ్ముంది’’ అంటూ తన ఆరాధ్య నటుడైన శివాజీ గణేషన్ తనకు ఇచ్చిన కాంప్లిమెంట్ను ఎప్పుడూ గుర్తు చేసుకునే ఆనంద్రాజ్... ముద్దుల మామయ్య, లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, బావాబావమరిది, శుభాకాంక్షలు, పెదరాయుడు, గ్యాంగ్లీడర్... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. -
‘ఏమ్రా లొల్లిబెడుతున్నవ్?’
రౌతాల గురించి మీకేమైనా తెలుసా? అయితే వినండి...ఆరడుగులకు పైగా హైట్ ఉండే రౌతాల... అరాచకాలకు తిరుగులేని అడ్డా. తాను చెప్పిందే నిజం. తన నోటి నుంచి వచ్చిందే శాసనం. తాను నేరాలు, ఘోరాలు చేస్తున్నాడని పోలీసులకు తెలిసినా సరే...‘కేసు ఏమని రాసుకోమంటారు?’ అని భయంతో కూడిన వినయంతో అడుగుతారే తప్ప... ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు.‘గెట్ల రాస్తావు?రాస్కోరాస్కో’ అని పోలీసులకు ఆర్డర్ వేసే రౌతాలకు ఎవరూ ఎదురు మాట్లాడడానికి లేదు. ‘నువ్వు చేస్తున్నది అరాచకం’ అని చెప్పడానికి లేదు.చెబితే?‘ఏయ్... ఏమ్రా లొల్లిబెడుతున్నవ్?’ అని గద్దించగలడు. లొల్లిని ఆపడానికి రక్తం చూడగలడు ఈ రౌతాల! ∙∙ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా మంచి పేరు ఉన్న కోళ్ల అశోక్ కుమార్ డిక్షనరీలో ఏ మూలలోనూ ‘నటన’ అనే పదం లేదు. బియ్యపు గింజ మీద తినేవారి పేరు రాసి ఉన్నట్లుగానే... ప్రతి పాత్ర మీద నటుడి పేరు రాసి ఉంటుందేమో! లేకపోతే నటన మీద ఆసక్తి లేని, నాటకాల్లోనైనా చిన్న పాత్ర వేయని అశోక్ కుమార్ 70 సినిమాల్లో నటించడం ఏమిటి? ఇంతకీ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ ‘విలన్ అశోక్ కుమార్’ ఎలా అయ్యారు? తాను నిర్మిస్తున్న ‘చెవిలో పువ్వు’ సినిమాలో నటించమని దర్శకుడు కోడి రామకృష్ణని అడిగారు అశోక్. ‘‘అలాగే నటిస్తానుగానీ... నువ్వు నా సినిమాలో నటించాలి’’ బదులుగా అన్నారు రామకృష్ణ.‘‘నేను నటించడం ఏమిటండీ... నాకు బొత్తిగా నటన రాదు. పైగా బోలెడు సిగ్గు’’ అన్నారు అశోక్.‘‘అదంతా నేను చూసుకుంటానుగానీ... నువ్వు నా సినిమాలో నటించు’’ అంటూ అశోక్ కుమార్ను తొలిసారిగా ‘భారత్బంద్’లో నటింపజేశారు.అలా అశోక్ కుమార్ కాస్తా రౌతాల అయిపోయాడు. విలన్గా బోలెడు గుర్తింపు వచ్చింది. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో అశోక్ చేసిన దొర కొడుకు పాత్ర ఆయనకు మరింత గుర్తింపు తెచ్చింది. నిజానికి ఈ పాత్రను చరణ్రాజ్ చేయాల్సింది. ఎందుకనో అది అశోక్ను వరించింది.‘అశోక్ కుమార్కు టైలర్మేడ్ పాత్ర’ అన్నారు అందరు.‘‘నటన అంటే భయంగా ఫీలవ్వను. ఆ క్యారెక్టర్ ఊహించుకొని అందులోకి వెళ్లిపోతాను’’ అనే అశోక్ కుమార్ బాడీ లాంగ్వేజ్తో విలనిజాన్ని పండించడంలో దిట్ట అనిపించుకున్నారు. అందుకే అంటారు... ఆయన జుట్టు కూడా నటిస్తుందని! -
ఎత్తండ్రా పాడా... కొట్టండ్రా డప్పు!
‘ఏ స్పాట్ పెట్టినా / ఏ గేమ్ ఆడినా భగవతిదేరా పైచేయి/ ఎత్తండ్రా పాడా కొట్టండ్రా డప్పు’ భగవతి స్పాట్ పెడితే చచ్చినట్టే. పాడె ఎత్తాల్సిందే. డప్పు కొట్టాల్సిందే! ‘రణం’ సినిమాలో ‘భగవతి’ బాగా పాపులర్ అయ్యాడు. ‘ఎవరీ భగవతి?’ అనే ఆసక్తిని పెంచాడు. దిట్టంగా కనిపించే మలయాళ నటుడు బీజూ మీనన్ ‘భగవతి’ పాత్రకు ప్రాణం పోశాడు. ‘రణం’ సినిమాలో ఆవేశం, కోపం, ప్రత్యక్షహింసకు నిలువెత్తు కటౌట్లా కనిపించిన బీజూ మీనన్ ‘ఖతర్నాక్’ సినిమాలో మాత్రం చాప కింద విషంలాంటి లాయర్ పాత్రలో...‘పోలీసులకు తెలివిగా స్పిన్ బౌలింగ్ చేసే కిలాడి కావాలి.వాడి ఒంట్లో 420 క్రిమినల్ గ్రూప్ బ్లడ్ ఉండాలి’లాంటి డైలాగులతో మెప్పించాడు. ∙∙ మలయాళం టీవి సీరియల్స్తో తన యాక్టింగ్ కెరీర్ను ప్రారంభించాడు బీజూ మీనన్. ‘పుత్రన్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో విలన్, సెకండ్ హీరోగా నటించాడు. హీరోగా నటించిన చిత్రాలలో ఎక్కువ భాగం పరాజయం పొందాయి. సురేష్ గోపితో కలిసి ఎన్నో సూపర్హిట్ సినిమాల్లో నటించాడు.డబ్బుల కోసం ఎడాపెడా నటించే నటుడు కాదు బీజూ. 2007–2010 మధ్యలో ఒకేరకమైన పోలీసు పాత్రల్లో నటించాల్సివచ్చింది. చివరికి ఒక దశలో విరక్తి వచ్చినంత పనైంది.‘‘ఇక నేను పోలీసు పాత్రల్లో నటించను’’ అని బహిరంగంగా ప్రకటించాడు కూడా.ఎవరూ పోలీసు పాత్రలు ఆఫర్ చేయకుండా పనిగట్టుకొని తలవెంట్రుకలు, గెడ్డం పెంచాడు!ఒక పాత్రను నిండుగా పండించడానికి తన జీవితంలో నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాడు.ఉదాహరణకు పోలీసు పాత్రలో కోపాన్ని ప్రదర్శించే సన్నివేశాల్లో... తన తండ్రి హావభావాలను గుర్తుతెచ్చుకునేవాడు. వాళ్ల నాన్న పోలీసు. కోపంగా ఉన్నప్పుడు... ఆయన ఇంట్లో ప్రదర్శించిన కోపం బీజూ మైండ్లో ఫిక్సయిపోయింది. ఇక ‘రోల్ లెంత్’ అనేదానిపై బీజూకు ఎలాంటి భ్రమలు లేవు.‘‘పాత్ర నిడివి పెద్దగా ఉంటేనే పేరొస్తుంది అనే మాటను నేను నమ్మను. ఎంత పెద్ద పాత్రలో నటించావు, ఎంత చిన్నపాత్రలో నటించావు అనేదాని కంటే... ఇచ్చిన పాత్రకు ఎంత న్యాయం చేశావు అనేది ముఖ్యం’’ అంటాడు బీజూ.టెక్నాలజీ మారినట్లే... నటుడు అనేవాడు కూడా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ ఉండాలి అనే బీజూ మూసా పాత్రలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యం కనిపించే పాత్రల్లో నటించడానికి ఇష్టపడతాడు. ‘‘నటన అనేదానికి అవకాశం ఉందంటే అది హీరోనా, విలనా, సెకండ్ హీరోనా. చిన్నపాత్ర... అనేది చూడను’’ అంటున్న బీజూ మీనన్ ఏ పాత్రలో అయినా ఇమిడిపోయే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. -
కరకు చూపుల... కాదల్ దండపాణి
రాజేంద్రకు మూడు విషయాలు అంటే మాచెడ్డ ఇష్టం. 1.జాతి 2.అంతస్తు 3. గౌరవం...ఈ మూడింటికి ఏ మాత్రం తేడా వచ్చినా, భయపెట్టించేట్టు కనిపించే రాజేంద్ర మరింత భయానకంగా కనిపించగలడు. ఎంత దుర్మార్గానికైనా తెగించగలడు. జాతి, అంతస్తు, గౌరవం... వీటికి ఎవరైనా దూరంగా జరిగి పెళ్లి చేసుకుంటే... వరుడిని మర్యాదగా కిడ్నాప్ చేసుకొచ్చి.. ‘‘ఆ పిల్ల తండ్రికి నువ్వు నచ్చలా. నీకు ఆ పిల్లకు ఏ సంబంధం లేదని రాసివ్వు’’ అని చాలా అమర్యాదగా బెదిరించగలడు. బయటి వాళ్ల సంగతి సరే... సొంత కూతురే ప్రేమించి పెళ్లి చేసుకుంటే?అమ్మో! ఇంకేమైనా ఉందా!! ‘‘తెంచేయ్. ఆ తాళిని నీ మెడలో నుంచి తెంచేయ్. తాళిని నీ మెడలో నుంచి తీస్తావా? చేయి విరిచేయనా?’’ అంటూ కన్న కూతురు ముందు రంకెలు వేయగలడు. ఇక ‘లంక రాజు’ తక్కువోడా ఏమిటి?ఏడుస్తున్న కూతురిని చూస్తూ తన చుట్టూ ఉన్న గూండాలతో ఏమంటున్నాడో చూడండి...‘‘అక్క ఏడుస్తుంది. ఈ విషయం జనాలకు తెలిస్తే ఏమవుతుందిరా?’’‘‘పరువు పోతుందన్నా’’ అంటారు గూండాలు. అప్పుడు ‘లంక రాజు’ ఎంత క్రూరంగా మాట్లాడతాడంటే... ‘‘నేను, నా పరువు ప్రతిష్ఠ బెజవాడలో ఉండాలంటే దీన్నైనా చంపాలి. వాడినైనా చంపాలి’’ ‘ప్రేమిస్తే’ సినిమాలో రాజేంద్ర కావచ్చు, ‘కృష్ణ’ సినిమాలో ‘లంక రాజు’ కావచ్చు... డైలాగుల కంటే పర్సనాలిటీ, హావభావాలతోనే తెగ భయపెట్టించాడు కాదల్ దండపాణి.సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందు దిండిగల్ (తమిళనాడు) నగరంలో దండపాణి రకరకాల వ్యాపారాలు చేసేవాడు. తన వ్యాపారమేదో తాను చేసుకుంటున్న దండపాణి డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ దృష్టిలో పడ్డాడు. శక్తివేల్ స్నేహితుల్లో ఒకరు దండపాణి పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూపించాడు. ఇది సినిమాల్లో అవకాశం కోసం దిగిన ఫొటో కాదు. ఏదో పని కోసం దిగింది. ఫొటో చూసీ చూడగానే ‘నా సినిమాలో ఇతనే హీరోయిన్ తండ్రి’ అనే నిర్ణయానికి వచ్చాడు శక్తివేల్. ‘‘నువ్వు పెద్దగా నటించనక్కర్లేదు. నీ సహజశైలిలో డైలాగులు చెప్పు చాలు’’ అని చెప్పాడు శక్తివేల్. అలా ‘కాదల్’ (తెలుగులో ప్రేమిస్తే) సినిమాలో హీరోయిన్ తండ్రి వేషం ఇచ్చాడు. ఈ పాత్ర దండపాణిని ‘కాదల్ దండపాణి’ని చేసింది. తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించేలా చేసింది. వృత్తిరీత్యా దండపాణి వ్యాపారి. ప్రవృత్తిరీత్యా నటుడు. అయితే తాను ప్రేమించిన నటనే అతడిని నాలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితుడిని చేసింది.‘ప్రేమిస్తే’ ‘రాజుభాయ్’ ‘ముని’ ‘కృష్ణ’ ‘ఆంజనేయులు’ ‘రేసుగుర్రం’...సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కాదల్ దండపాణి 2014లో ఈలోకాన్ని వీడి వెళ్లారు. కరకు చూపులతో, కఠినమైన గొంతుతో తనదైన విలనిజాన్ని వెండితెరపై ప్రదర్శించాడు కాదల్ దండపాణి. -
కాళీ నుంచి సన్యాసినాయుడి వరకు!
ఉత్తమ విలన్ ‘నాకెందుకండీ రాజకీయం. ఏదో రౌడీయిజం మీద బతుకుతున్నాను’ అంటాడు కాళీ. అంతమాత్రానా భజనపరులు ఊరుకుంటారా ఏమిటి?‘తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు... రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అవుతాడు’ అని ఉపదేశించి రంగంలోకి దించుతారు. ఇక అప్పుడు కాళీని ఆపతరమా! రాజకీయం అండతో చెలరేగిపోయే రౌడీ ‘కాళీ’గా ‘ప్రతిఘటన’ సినిమాలో అదరగొట్టేశారు చరణ్రాజ్. ఇప్పటికీ చరణ్రాజ్ను ‘కాళీ’గానే గుర్తుపెట్టుకుంటారు. పచ్చి రౌడీయిజం చలాయించే కాళీ పాత్ర నుంచి ‘పైసా’లో ఎలాగైనా సరే సీఎం కావాలనుకునే సన్యాసినాయుడు పాత్ర వరకు...ఆ పాత్రలలోని సారాన్ని, జీవాన్ని కళ్లకు కట్టిన చరణ్రాజ్ కన్నడంలో చేసిన తొలి సినిమా హిట్ అయింది. ఆ తరువాత పది సినిమాల్లో హీరోగా చేశారు. ఆ సమయంలోనే ‘ప్రతిఘటన’ సినిమాలో ‘కాళీ’ పాత్ర వెదుక్కుంటూ వచ్చింది. ‘విలన్ వేషాలేంటి?’ అని వెనక్కి లాగారు కొందరు. మరోవైపు... ‘టీ.కృష్ణ గొప్ప దర్శకుడు. నీకు నటుడిగా మంచి పేరు వస్తుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు’ అన్నారు మరికొందరు. సరే అంటూ ‘ప్రతిఘటన’ సినిమాలో నటించారు. ‘కాళీ’గా అతని పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించి ‘ఉత్తమ విలన్’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చరణ్రాజ్. హైస్కూల్ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు చరణ్రాజ్.‘నువ్వు హీరో అవుతావు’ అని మునగ చెట్టెక్కించేవారు స్నేహితులు. గురురాజ్ భట్ అనే స్నేహితుడు మాత్రం ‘నీకు అంత సీన్ లేదు’ అనేవాడు. ఇక అప్పటి నుంచి పౌరుషం పుట్టుకొచ్చింది. ఎలాగైనా సరే సినిమాల్లో నటించాలనే పట్టుదల పెరిగింది. ‘నాన్నా... నేను సినిమాల్లోకి వెళ్లాలను కుంటున్నాను’ అని అన్నప్పుడల్లా చెంప చెళ్లుమనేది. ఇలా అయితే కుదరదని ఒక ఫైన్ మార్నింగ్ ఇంట్లో నుంచి డబ్బులు కొట్టేసి సొంతూరు బెల్గాం నుంచి బెంగళూరుకు పారిపోయి వచ్చాడు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. నక్కతోకను చరణ్రాజ్ తొక్కాడో లేదోగానీ ఒకరోజు దర్శకుడు యస్.డి.సిద్దలింగయ్య ‘కొత్తవాళ్లతో సినిమా తీస్తున్నాను. హీరోగా నటిస్తావా?’ అని అడిగాడు. ఇక చరణ్రాజ్ సంతోషానికి హద్దు లేదు. ఆ సినిమా హిట్ కావడంతో పదిమంది దృష్టిలో పడ్డాడు.‘హీరోగానే చేస్తాను’ అనే పరిమితి పెట్టుకోకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు బ్రహ్మానంద. మధ్యలో ఈ బ్రహ్మానంద ఏమిటి అనుకుంటున్నారా? ఇది ఆయన అసలు పేరు! -
స్టైలిష్ విలన్...
మన మార్కు సంప్రదాయ విలన్లు మనకు దూరమై ఇప్పుడు సరికొత్త విలన్లు వస్తున్నారని కొన్ని సినిమాలలో విలన్ క్యారెక్టర్లను చూస్తే సులభంగా అర్థమైపోతుంది. ‘ఖైదీ నంబర్:150 కూడా ఇలాంటి చిత్రమే.పేదవాళ్లను నైసుగా మోసం చేసే నక్క తెలివితేటలు ఉన్న ఎం.ఎన్.సి. యజమాని అగర్వాల్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు తొలి పరిచయం అయ్యాడు తరుణ్ అరోరా. స్టైలిష్గా కనిపిస్తూనే క్రూరత్వాన్ని ప్రదర్శించే పాత్రలో నటించి ‘ఉత్తమ విలన్ నిపించుకున్నాడు.రంజీవి సెకండ్ ఇన్నింగ్స్ సినిమా ‘ఖైదీ నం: 150లో చిన్న పాత్ర దొరికినా గొప్పే అనుకునే పరిస్థితుల్లో ‘ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎవరిని వరిస్తుంది? అనే ఆసక్తి నెలకొని ఉండేది. అలాంటి ఆసక్తికర సమయాల్లో తరుణ్ అరోరా పేరు వినిపించింది. ‘ఖైదీనం:150లో విలన్ క్యారెక్టర్ అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటికి న్యాయం చేస్తూ ‘ఉత్తమ విలన్ అనిపించుకున్నాడు తరుణ్ అరోరా. పంజాబీ అయిన అరోరా పెరిగింది మాత్రం అస్సాంలో.బెంగళూరులో ‘హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో మోడలింగ్ చేశాడు తరుణ్ అరోరా. ‘ప్యార్ మే కభీ కభీ సినిమాతో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టాడు. ‘జబ్ వుయ్ మెట్ తరువాత అవకాశాలు వెల్లువెత్తాయిగానీ అన్నీ ఒకే మూసలో ఉన్నాయి. దీంతో బెంగళూరుకు వెనక్కి వచ్చాడు. అక్కడ ఆయనకో రెస్టారెంట్ ఉంది. ఆ సమయంలోనే ‘కనితన్ అనే తమిళ సినిమాలో విలన్ పాత్ర వెదుక్కుంటూ వచ్చింది. ‘మా హీరో చాక్లెట్ బాయ్ కదా అన్నారు కో ఆర్డినేటర్లు.అయితే అక్కడ కావల్సింది మాంచి శరీరదారుఢ్యంతో ఉన్న సై్టలిష్ విలన్. దీనికి తరుణ్ అరోరా పక్కాగా సరిపోయాడు. ఫేక్ సర్టిఫికెట్ల ధందా నిర్వహించే తురా సర్కార్గా తొలిసారిగా కనితన్లో విలన్గా కనిపించాడు. ఈ పాత్ర కోసం 7 కిలోలు బరువు కూడా పెరిగాడు.తురా సర్కార్ తక్కువగా మాట్లాడతాడు. అందుకే డైలాగులు కూడా చిన్నవిగానే ఉండేవి. వాటిని అసిస్టెంట్ çసహకారంతో నేర్చుకునేవాడు. ‘జబ్ వుయ్ మెట్ సినిమాలో నటిస్తున్నప్పుడు టేకుల మీద టేకులు తీసుకునేవాడు తరుణ్. అయినప్పటికీ ఆ సినిమా డైరెక్టర్ ఇంతియాజ్ అలీ విసుక్కోకుండా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు నటన గురించి చెప్పేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా తరుణ్ అరోరాకు ఫిల్మ్ మేకింగ్లో భిన్నమైన కోణాలను పాఠాలుగా నేర్పించింది.‘ఖైదీనంబర్:150, కాటమరాయుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తరుణ్ అరోరా అందాల నటి అంజలా జవేరీ భర్త. -
నేనొక్కసారి స్కెచ్ వేస్తే...
చెల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకునే అన్నయ్య... ఆ చెల్లి కోసం ఎంత దుర్మార్గానికైనా తెగించే అన్నయ్యగా ‘చంటి’ సినిమాలో కనిపించినా, ప్రత్యర్థి కోసం ఆకలాకలిగా ఎదురుచూసే ప్రతినాయకుడిగా ‘దమ్ము’లో కనిపించినా, బిజ్జలదేవునిగా శకుని తరహా విలనిజంతో ‘బాహుబలి’లో భయపెట్టినా... తనదైన విలనిజాన్ని చాటుకుంటున్నారు నాజర్. ‘‘నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను’’ అనగానే... ‘‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా సినిమాలేమిటి?’’ అనే తల్లిదండ్రులనే చూస్తుంటాం. నాజర్ విషయంలో మాత్రం సీన్ రివర్స్.కడుపులో చల్ల కదలకుండా, డబ్బులకు ఇబ్బంది పడకుండా ఉండే ఉద్యోగం చేయాలనేది నాజర్ కల. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం చేయడం ద్వారా తన కలను నెరవేర్చుకున్నాడు నాజర్. అయితే నాజర్ ఉద్యోగం చేయడం తండ్రికి నచ్చలేదు. కొడుకును నటుడిగా చూడాలనేది ఆయన కల. అయితే నాజర్కు మాత్రం ఎప్పుడూ నటన మీద ఆసక్తి లేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు పండగల సందర్భాల్లో నాటకాల్లో నటించడం తప్ప... నటన గురించి నాజర్కు పెద్దగా తెలియదు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనకు ఒక స్థిరమైన ఉద్యోగం అవసరం అనుకున్నారు నాజర్. అందుకే ఎయిర్ఫోర్స్లో ఉద్యోగంలో చేరినప్పుడు చాలా సంతోష పడ్డారు. కానీ నాన్న ఆలోచన వేరుగా ఉంది. ‘‘నీ గురించి ఎన్నో కలలు కంటే ఇలా చేస్తావా!’’ అన్నారు ఆయన బాధ పడిపోతూ. ఇక చేసేదేమి లేక ఉద్యోగానికి రాజీనామా చేశారు నాజర్. ‘‘సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తాను’’ అన్నారు తండ్రితో. ‘‘అలా ఎలా కుదురుతుంది. శిక్షణ తీసుకోకుండా సినిమాల్లో ఎలా నటిస్తావు? నువ్వు నటనలో తప్పకుండా శిక్షణ తీసుకోవాల్సిందే’’ అని కాస్త గట్టిగానే చెప్పారు తండ్రి. అప్పుడుగానీ అర్థం కాలేదు. తన తండ్రి తన విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నాడో. ఎలాగైనా సరే, తండ్రి కలను నిజం చేయాలనుకున్నారు. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. కె.బాలచందర్ ‘కళ్యాణ అగతిగల్’ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం కాస్త నిరాశకు గురైనా అంతలోనే తేరుకున్నారు. ‘కళ్యాణ అగతిగల్’ సినిమా ఫెయిల్యూర్ నాజర్ కెరీర్కు అడ్డంకేమీ కాలేదు. ఈ సినిమా తరువాత విలనీ ఛాయలు ఉన్న పాత్రలు చేసి శబ్భాష్ అనిపించుకున్నారు. మణిరత్నం సినిమా ‘నాయకన్’తో నాజర్కు మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించారు. ‘విలన్ లేనిది హీరో లేడు’ అని చెప్పే నాజర్ ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు. -
దండాలు జగ్గన్నదొరా!
‘ఆ బ్రహ్మ కాదు కదా అతడి అమ్మ దేవుడి వల్ల కూడా కాని పనిరా. ఏంచేయాలన్నా... దొర దొరతనం చేయాలా దొర మగతనం చేయాలా’ ‘దొరతనం’ గురించి జగ్గన్న దొరకు చాలా క్లారిటీ ఉంది. అంతే కాదు...తనకు ఎలాంటి వాడు నచ్చుతాడో అనేదాని గురించి కూడా పరమ క్లారిటీ ఉంది. ఒకరి చెంప చెళ్లుమనిపిస్తాడు. సదరు ఆ చెంపదెబ్బతిన్నవాడు ‘అమ్మో’ అని బాధగా ముఖం పెట్టవద్దు. చాలా సంతోషంగా కనిపించాలి. ‘నేను చెంపదెబ్బ కొడితే...మల్లెపువ్వు రుద్దుకున్నట్లు కమ్మగా ఉంది దొర అనేవాడు నాకు కావాలి.నేను చెప్పిన చోట వేలి ముద్రలు వేసే కుక్క కావాలి కాని...నా కాలి జాడ వెదికే తోడేళ్లు కాదు’ అంటాడు జగ్గన్న దొర. ‘ఎర్రమందారం’ సినిమాలో కన్నడ నటుడు దేవరాజ్ను చూస్తే...అచ్చం దొరను చూసినట్లే ఉంటుంది. ‘గ్రామీణ విలన్’గా నూటికి నూరుపాళ్లు సరిపోయే దేవరాజ్ ‘20వ శతాబ్దం’ ‘బంగారు బుల్లోడు’ ‘సమరసింహారెడ్డి’ ‘యజ్ఞం’...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.హెచ్ఎంటీలో తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన దేవరాజ్ ‘త్రిశూల’ అనే కన్నడ సినిమాతో చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఏ ఆర్టిస్ట్కైనా మొదటి సినిమా హిట్ అయితే కెరీర్ ఊపందుకుంటుంది. హిట్ కావడం మాటేమిటోగానీ దేవరాజ్ నటించిన మూడు సినిమాలు విడుదల కూడా కాలేదు. ఆ సమయంలోనే ‘ఇంద్రజిత్’ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ వేషం వచ్చింది. ఆ సినిమా యావరేజ్ హిట్ అయింది. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ చేయడం ప్రారంభించారు. కొన్ని పాత్రలకు అవార్డులు కూడా వచ్చాయి. ‘వీరప్పన్’ అనే సినిమాలో చేసిన నెగెటివ్ రోల్కు స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. ‘ఆవేశ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసిన తరువాత హీరోగా అవకాశాలు వెల్లువెత్తాయి. అలా అని హీరోగా మాత్రమే చేస్తానని భీష్మించుకొని కూర్చోలేదు.విలన్ అయినా, హీరో అయినా పాత్రలో సత్తా ఉంటే చేసుకుంటూ వెళ్లేవాడు. దీనికి కారణం...హీరోగా మాత్రమే చేస్తే...ఒక సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హీరో భవిష్యత్ అనేది సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్టిస్ట్గా ఎదగాలనుకునే వ్యక్తికి ఇది అడ్డు అనుకున్నారు దేవరాజ్. అందుకే కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా విలన్గా కూడా చేశారు. సినిమాల్లోకి రాక ముందు దేవరాజ్ స్టేజీ ఆర్టిస్ట్గా ప్రసిద్ధుడు.‘నాటకాలు’ అనే బలమైన పునాది ఆయనకు ఉండడం వల్ల ‘పోలీస్ ఆఫీసర్’ రోల్ నుంచి ‘డాన్’ వరకు...రఫ్ అండ్ టఫ్ లుక్స్ నుంచి శాడిస్ట్ వరకు...ఏ పాత్ర అయినా అవలీలగా పోషించే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దేవరాజ్. -
దేవన్...ఒక కూల్ విలన్!
విలన్లు మూడు విధములు... 1. బాడీతో భయపెట్టించే విలన్లు. 2. గొంతుతోనే భయపెట్టించే విలన్లు. 3. భయపెట్టకుండానే భయపెట్టే విలన్లు. మొదటి రెండు సరే, భయపెట్టకుండానే భయపెట్టే విలన్ ఏమిటి? ఈ విలన్ను చూస్తే...భయపడ్డానికి పెద్దగా ఏమీ ఉండదు. పక్కా పెద్ద మనిషి తరహాలోనే ఉంటారు. మర్యాదను తు.చ తప్పకుండా పాటిస్తారు. కానీ చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేస్తారు. చాప కింద పెట్రోలన్న మాట!‘శుభాకాంక్షలు’ సినిమాలో బలరామయ్యను చూడండి...కుటుంబసభ్యులతో ఎంత ఆప్యాయంగా ఉంటాడో! కానీ ఆ ఆప్యాయత ఎప్పటి వరకు? తన మాట వినేంత వరకే. ఎప్పుడైనా ఎవరైనా అంతకుమించి ఆలోచిస్తే....‘చిన్నపిల్లలకు నీతికథలు చెప్పాలి తప్ప నీతి తప్పిన వాళ్ల కథలు చెప్పొద్దు’ అని కన్నెర్ర చేస్తాడు.ఇక్కడ ‘నీతి తప్పిన వాళ్లు’ అంటే నిజంగానే నీతి తప్పిన వాళ్లు కాదు. తనకు నచ్చని వాళ్లు. అలాంటి వాళ్లను దగ్గరికి తీస్తే ‘ఈ ఇల్లు ఆరు శవాలున్న స్మశానం కాగలదు’ అని హెచ్చరించగలడు. ఇదే విలన్ ‘కాశీ’ సినిమాలో ప్రేమతో సహా ప్రతి విషయాన్ని కరెన్సీతో కొలిచే పారిశ్రామికవేత్తగా భయపెట్టించగలడు. ఇక ‘బాషా’ సినిమాలో పొగుడుతూనే వెన్నుపోటు పొడిచే కేశవ పాత్రతో భయపెట్టించగలడు.కూల్గా కనిపిస్తూనే వేడి పుట్టించే విలన్ పాత్రలకు ప్రసిద్ధుడైన దేవన్ డబ్బింగ్ సినిమాలతోనే కాదు స్ట్రెయిట్ చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. నటులు నిర్మాతలు కావడం చూస్తుంటాం. నిర్మాతలు నటులు కావడం అనేది మాత్రం అరుదుగానే జరుగుతుంది. దేవన్ మొదట నిర్మాత. ప్రేమ్నజీర్, మధు ప్రధాన పాత్రధారులుగా మలయాళంలో ఆయన తీసిన సినిమా ‘వెల్లమ’ బాక్సాఫీసు దగ్గర చతికిలపడటమే కాదు...ఆయన్ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. దీని నుంచి బయటపడటానికి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. కొద్దికాలం తరువాత ‘ఓజమ్’ అనే మలయాళం సినిమాలో హీరోగా నటించే ఛాన్సు వచ్చింది. ఆ తరువాత అయిదారు సినిమాల్లోనూ హీరోగా నటించారు. అయితే వీటిలో ఎక్కువ సినిమాలు విజయవంతం కాకపోవడంతో విలన్గా నటించడం ప్రారంభించారు. కేవలం మలయాళంలోనే కాదు తమిళ, తెలుగు సినిమాల్లోనూ ఆయన రకరకాల పాత్రలు పోషిస్తున్నారు.నటుడిగానే కాదు ‘కేరళ పీపుల్స్ పార్టీ’ నాయకుడిగా కూడా దేవన్ కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధుడు. -
నాదసలే రఫ్ హ్యాండ్!
కృష్ణవంశీ ‘అంతఃపురం’ సినిమాలో గుర్తుండే పాత్రలలో ‘జీవీ’ పాత్ర ఒకటి.ప్రత్యర్థులను మందుపాతరతో పేల్చేయడానికి ఉచ్చు బిగించే సీన్ నుంచి, ప్రత్యర్థుల చేతిలో మేకలా బలయ్యే సీన్ వరకు అద్భుతమైన విలనిజాన్ని పండించాడు జీవీ.భారీ డైలాగులేమీ లేకపోయినా భారీ కాయంతో, పొడవాటి వెంట్రుకలతో భయపెట్టాడు. భయానకాన్ని సృష్టించడానికి అతని రెండు కళ్లు వందల ఆయుధాలయ్యాయి. ‘ఎవరీ జీవీ?’ అని అందరూ మాట్లాడుకునేంత గుర్తింపు తెచ్చుకున్న ‘జీవీ’ అసలు పేరు సుధాకర్ నాయుడు. ఈయన చిరంజీవి వీరాభిమాని∙విద్యార్థి సంఘ రాజకీయాలు, క్రికెట్ గురించి తప్ప... ‘నటన’ మీద ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు సుధాకర్ నాయుడు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన సుధాకర్ ఆ తరువాత హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత... ఏదో అసంతృప్తి.‘ఇది కాదు... ఇంకా ఏదో చేయాలి’ అనుకున్నాడు.తరువాత యు.ఎస్ వెళ్లి ఇంటర్నేషనల్ లా మాస్టర్స్ చేశాడు. రోజూ జిమ్కు వెళ్లడం, జుట్టు పొడవుగా పెంచడంతో పాటు అక్కడి జీవనశైలితో మమేకమైపోయి ఇండో–అమెరికన్గా మారిపోయాడు. రెండున్నర సంవత్సరాల తరువాత ఇండియాకు వచ్చాడు. అమెరికా నుంచి తెచ్చిన గిఫ్ట్ను తనకు బంధువైన దాసరి నారాయణరావుకు ఇవ్వడానికి వెళ్లినప్పుడు... పొడవాటి జుట్టు చూసి ‘ఏంటీ ఇలా అయిపోయావు?’ అన్నారు దాసరి. ‘‘అమెరికాలో ఉన్నాను కదా’’ అని చిన్నగా నవ్వాడు సుధాకర్.‘‘అరుణ్బాబుతో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. నటిస్తావా?’’ అడిగారు దాసరి.‘‘నాకెందుకు సార్ నటన... కోర్టులో ప్రాక్టీస్ చేయాలి’’ అని మొదట అన్నాడు గానీ దాసరి ఒప్పించడంతో ‘చిన్నా’ సినిమాతో విలన్గా పరిచయం అయ్యాడు సుధాకర్ నాయుడు. ఫీల్డ్లో సుధాకర్లు ఇద్దరు ముగ్గురు ఉండడంతో ‘చిరంజీవి’లోని చివరి అక్షరాలతో సుధాకర్ నాయుడికి ‘జీవీ’గా వెండితెర నామకరణం చేశారు దాసరి. ఈ సినిమా తరువాత ‘అంతఃపురం’లో నటించే అవకాశం వచ్చింది జీవీకి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని జీవీ తెలుగులో మాత్రమే కాదు కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ ‘అగ్రెసివ్ విలన్’గా మంచి గుర్తింపు పొందుతున్నారు. -
హాలీవుడ్లో ఉత్తమ విలన్!
టాలీవుడ్.. కోలీవుడ్.. శాండల్వుడ్.. మాలీవుడ్.. బాలీవుడ్... ఈ అన్ని వుడ్ల వారు హాలీవుడ్ చిత్రాలు చూసి, ఇన్స్పైర్ అవుతుంటారు. కొందరు దర్శకులు అప్పుడప్పుడు ఆ సినిమాల్లోని సీన్స్ని ఆదర్శంగా చేసుకుని, తీస్తుంటారు కూడా. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లనిపిస్తోంది. మన ఇండియన్ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఓ హాలీవుడ్ చిత్రం రూపొందించారట. సినిమా పేరు ‘ది హీరో’. బ్రెట్ హాలే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఉత్తమ విలన్’లా ఉందట. టాలీవుడ్, కోలీవుడ్లో రెండేళ్ల కిందట విడుదలైన కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ గుర్తుండే ఉంటుంది. కమల్ స్వయంగా కథ అందించి, నటించిన ఈ చిత్రానికి రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టేకింగ్ హాలీవుడ్ రేంజ్లో ఉందనే ప్రశంసలూ దక్కాయి. ఈ ఏడాది జనవరి 21న ‘ది హీరో’ చిత్రాన్ని ‘సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించారు. ఈ సినిమాలో మన ‘ఉత్తమ విలన్’ షేడ్స్ ఉన్నాయన్నది కొందరి అభిప్రాయం. జూన్ 9న సినిమా విడుదలకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. -
హాలీవుడ్లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమా
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా రెండేళ్ల కిందట తెరకెక్కిన సినిమా ఉత్తమ విలన్, కమల్ సన్నిహితుడు, ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్గా ఆకట్టుకోలేకపోయినా.. కమల్ నటనకు మరోసారి ప్రశంసలు దక్కాయి. ఎప్పుడో సౌత్ ప్రేక్షకులు మర్చిపోయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఉత్తమ విలన్ సినిమా కథ ఆధారంగా హాలీవుడ్లో 'ది హీరో' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారట. త్వరలోనే తాను చనిపోతానని తెలిసిన ఓ సూపర్ స్టార్ ఆఖరి రోజుల్లో ఏం చేశాడన్న కథతో ఉత్తమ విలన్ సినిమా తెరకెక్కింది, ఇది పాయింట్ను తీసుకొని హాలీవుడ్ దర్శకుడు బ్రెట్ హాలే 'ది హీరో' చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ క్రెడిట్స్లోనూ కమల్ పేరు కనిపించనుందన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలు ఫిలిం ఫెస్టివల్స్లో సత్తా చాటిన 'ది హీరో' జూన్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా నిజంగా ఉత్తమ విలన్కు అఫీషియల్ రీమేకా.. లేక ఫ్రీ మేకా తెలియాంలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఈ టిట్లాకు తిక్క రేగితే!
ఉత్తమవిలన్ తన శత్రువును తాను ఎలా ద్వేషిస్తాడో మిగిలిన వాళ్లు కూడా అలాగే ద్వేషించాలి. తన శత్రువుపై తాను ఎలా కసితో రగిలి పోతాడో మిగిలిన వాళ్లు కూడా అలాగే రగిలి పోవాలి. లేకుంటే తేడాలు వస్తాయి. ఇళ్లు కాలిపోతాయి. ‘నెత్తి మీద టోపీ. చేతిలో పవరు... మూతి మీద మీసం ఉందని... దేవుడు...దేవుడు అని భజన చేశారు. ఏకీ సీ గోలిసే...’ అంటూ మాటలతో మంటలు రేపగలడు టిట్లా.‘టిట్లా’ అంటే మాటలా?మాటల్లోనే తూటాలు పేలుతుంటాయి!‘విక్రమార్కుడు’ సినిమాలో ‘టిట్లా’గా.... వేషంతో సహా క్రూర హావభావాలతో భయపెట్టించాడు అజయ్. ‘ఖుషి’ సినిమాలో ఈవ్ టీజర్గా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ అజయ్ ‘ఒక్కడు’ ‘ఛత్రపతి’ సినిమాలలో ఆవేశం మూర్తీభవించిన పాత్రలలో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో ‘టిట్లా’ అనే గట్టి విలన్గా ప్రేక్షకుల దృష్టిలో మిగిలిపోయాడు. విజయవాడలో పుట్టి పెరిగిన అజయ్ ఎమ్సెట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. జూబ్లీహిల్స్లో ఉన్న ఆ కాలేజీ పరిసరాల్లో తరచుగా సినిమా షూటింగ్లు జరుగుతుండేవి. షూటింగ్లను ఆసక్తిగా చూసేవాడుగానీ ‘నటించాలి’ అని పెద్దగా అనుకోలేదు. ఆ తరువాత మాత్రం నటించాలనే కోరిక బలపడడంతో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ‘కౌరవుడు’ సినిమా డైరెక్టర్, అజయ్ నాన్నకు తెలిసిన వ్యక్తి కావడంతో ఆ సినిమాలో నటించే ఛాన్సు దొరికింది. ‘పెద్దగా స్ట్రగుల్ కాకుండానే సినిమాల్లో నటించే ఛాన్సు వచ్చింది. ఇక ‘నల్లేరు మీద నడకే’ అనుకున్నాడు. అయితే తొమ్మిది నెలలు గడిచినా ఏ సినిమాలోనూ నటించే ఛాన్సు రాలేదు. ‘ఖుషి’ సినిమా సెలెక్షన్కు వెళ్లి, సెలెక్ట్ అయిన తరువాత మాత్రం ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రాజమౌళి ‘సింహాద్రి’ సినిమాలో చిన్న విలన్ రోల్ పోషించాడు. షూటింగ్లో పాల్గొనడానికి కేరళకు వెళ్లినప్పుడు ‘మీ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలో నటించాలని ఉంది’ డైరెక్టర్తో రిక్వెస్ట్గా అన్నాడు. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆతరువాత మాత్రం ‘సై’ సినిమాలో విలన్ తమ్ముడిగా అజయ్కి పవర్ఫుల్ రోల్ ఇచ్చాడు రాజమౌళి. ఇక ‘విక్రమార్కుడు’ సినిమాలో చేసిన ‘టిట్లా’ పాత్రతో పెద్ద గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ‘ఉత్తమ విలన్’గా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. -
నేను పక్కా క్రిమినల్!
‘ఈ కైజర్ని చంపేవాడు ఇంకా పుట్టలేదు’ అంటూ ‘అతి«థి’ సినిమాతో ఉత్తమ విలన్ అనిపించుకున్నారు మురళీశర్మ. హిజ్రాగా నటించినా, ఒక పాత్ర కోసం గుండు కొట్టించుకున్నా...ఎప్పటికప్పుడు తన నటనలో వైవిధ్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తుంటారు. స్కూల్, కాలేజీ రోజుల నుంచే నాటకాల్లో నటించేవాడు మురళీశర్మ. ముంబైలోని ‘రోషన్ తనేజాస్ యాక్టింగ్’ స్కూల్లో శిక్షణ పూర్తయిన తరువాత సహాయ దర్శకుడిగా పనిచేయడానికి దర్శకులను కలవడం మొదలుపెట్టాడు. నటన అంటే ఇష్టం ఉన్న శర్మ దర్శకత్వ శాఖ వైపు అడుగులు వేయడానికి కారణం... సరిౖయెన పాత్రలు రాకపోవడమే. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన తక్కువ కాలంలోనే మనసు నటన వైపు లాగింది. వినోద్ పాండే ‘రిపోర్టర్’ అనే సీరియల్ తీస్తున్నాడు అని తెలుసుకొని ప్రయత్నిద్దామనుకున్నాడుగానీ, గతంలో వృథా అయిన ప్రయత్నాలు గుర్తుకు వచ్చి ‘ఇది జరిగే పనేనా’ అనుకున్నాడు. అందుకే పాండే ఇంటి అడ్రస్ కనుక్కొని సరాసరి వెళ్లి కలిశాడు. అలా ‘రిపోర్టర్’ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. తొలి అడుగు పడింది. అయినప్పటికీ... నాలుగు సంవత్సరాల స్ట్రగుల్ íపీరియడ్! అయినా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. జీటీవి సీరియల్ ‘రిష్తే’లో రామ్కలీ అనే హిజ్రా పాత్రను పోషించాడు శర్మ. దీని కోసం ఎందరో హిజ్రాలను కలిసి మాట్లాడి వారి సాధకబాధకాలను అవగాహన చేసుకున్నాడు. శర్మలో మంచి నటుడు ఉన్నాడు అనే విషయం రామ్కలి పాత్ర ఇండస్ట్రీకి చెప్పకనే చెప్పింది. ‘డయల్ 100’ సీరియల్లో చేసిన పోలీసు పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ‘ధూప్’లో ఆర్మీ ఆఫీసర్, ‘మక్బూల్’లో సీనియర్ పోలీస్ ఆఫీసర్, ‘మై హూ నా’లో కెప్టెన్ ఖాన్గా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్న మురళీశర్మ హిందీ, ఇంగ్లిష్లతో సహా తెలుగు, తమిళ, మరాఠీ, గుజరాతీ భాషలు మాట్లాడగలరు.‘అతిథి’ సినిమాలో ‘కైజర్’గా తెలుగు తెరకు పరిచయం అయిన మురళీశర్మ పుట్టింది మన గుంటూరు జిల్లాలోనే! ‘కంత్రీ’ ‘ఊసరవెల్లి’ ‘మిస్టర్ నూకయ్య’ ‘కృష్ణం వందే జగద్గురుం’ ‘ఎవడు’...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మురళీశర్మ ‘పట్టుదలే విజయానికి మూలం’ అనే మాటను బలంగా నమ్ముతారు. -
ఖతర్నాక్...కాలకేయ!
వెండితెర అద్భుతం ‘బాహుబలి’లో బాహుబలి, భల్లాలదేవలు ఎలా గుర్తుండి పోతారో కాలకేయుడు కూడా అలాగే గుర్తుండి పోతాడు. అతడు మాట్లాడిన ‘కిలికి’ భాష కూడా అలాగే గుర్తుండి పోతుంది. నల్లరాతి కొండలాంటి దృఢమైన శరీరం, చింత నిప్పులాంటి కళ్లు...ఈ భయానక ఆహార్యానికి తోడు భయంకరమైన కంఠంతో వెన్నులో చలి పుట్టించాడు కాలకేయుడు. ‘ప్రభాకర్’ అనే పేరు పెద్దగా తెలియకపోవచ్చుగానీ, ‘కాలకేయుడు’ అనే పేరు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులకు తెలుసు! ఎవరీ ప్రభాకర్!మహబూబ్నగర్ జిల్లా హస్నాబాద్కు చెందిన ప్రభాకర్ స్వభావరీత్యా సిగ్గరి. క్రికెట్ ఆడడం తప్ప సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. నటిస్తాను అని ఎప్పుడు భవిష్యవాణిని అంచనావేయలేదు. మాంచి ఒడ్డూ పొడుగు ఉన్న ప్రభాకర్ను చూసి బంధువు ఒకరు... ‘‘హైదరాబాద్కు వచ్చేయ్... రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాను’’ అన్నాడు. అయితే ఆరు సంవత్సరాలు గడిచినా అలాంటిదేమీ జరగలేదు. మహేష్బాబు ‘అతిథి’ సినిమా షూటింగ్కు వెళ్లినప్పుడు అనుకోకుండా ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించే చాన్సు వచ్చింది ప్రభాకర్కు. ‘మగధీర’ సినిమా కోసం నటులను వెదుకుతున్నప్పుడు డైరెక్టర్ రాజమౌళిని కలిశాడు ప్రభాకర్. ఆయన ఏమీ చెప్పలేదు. అయితే తనతో పాటు రాజస్తాన్కు తీసుకువెళ్లాడు. అక్కడ ‘మగధీర’ షూటింగ్ జరుగుతోంది. రాజస్తాన్లో ప్రభాకర్ను గమనించారు రాజమౌళి. తిరిగి హైదరాబాద్కు వచ్చిన తరువాత మళ్లీ ఉద్యోగ వేటలో పడ్డాడు ప్రభాకర్. ఒకరోజు రాజమౌళి నుంచి పిలుపు వచ్చింది. ‘మర్యాద రామన్న’ సినిమాలో ఒక వేషం ఇస్తున్నట్లు చల్లని కబురు చెవిలో వేశారు రాజమౌళి. చా...లా గొప్ప చాన్స్... కానీ తనకు నటన అంతగా రాదు... ఇదే విషయాన్ని రాజమౌళితో చెప్పాడు ప్రభాకర్. ‘ఫరవాలేదు’ అంటూ దేవదాస్ కనకాల దగ్గర శిక్షణ ఇప్పించడమే కాకుండా, నెలకు పదివేలు సై్టపెండ్ కూడా ఇచ్చారు రాజమౌళి. ‘మర్యాద రామన్న’ సినిమాలో వేసిన బైరెడ్డి పాత్రతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్తో అప్పులన్నీ తీర్చేశాడు. ఇక ‘బహుబలి’ సినిమాలో వేసిన కాలకేయుడి వేషం ప్రభాకర్ని ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. ఈ సినిమాలో ఉపయోగించిన ‘కిలికి’ భాష కోసం రోజూ తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రాక్టీస్ చేసేవాడు ప్రభాకర్. ఇది మాత్రమే కాదు... కాలకేయుడిగా ప్రేక్షకులను భయపెట్టడానికి ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగానూ పడ్డాడు. ఆ కృషి వృథా పోలేదు... అని కాలకేయుడి పాత్రకు వచ్చిన స్పందన చెప్పకనే చెప్పింది. -
ఈ చూపుల్లో శూలాలున్నాయి!
కొన్నిసార్లు అతని మాట పదునుగా ఉంటుంది. కొన్ని సార్లు అతని చూపు పదునుగా ఉంటుంది. వీటన్నిటికంటే కొన్నిసార్లు అతని మౌనం కూడా అత్యంత పదునుగా ఉంటుంది. సుబ్బరాజు అంటే ‘యువ విలన్’ అనేదానికి నిలువెత్తు సంతకం. ‘‘మనలో సహజమైన ప్రతిభ ఏదో ఉండాలి. అలా లేకుంటే...ఎంత గొప్ప ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా...మనతో ఉండేది డిప్లొమో తప్ప ప్రతిభ కాదు’’ అంటారు ప్రసిద్ధ విలన్ ప్రాణ్. సుబ్బరాజులో ఇన్స్టిట్యూట్ వారి డిప్లొమో పవర్ కంటే, సహజ నటన అనే పవరే ఎక్కువగా ఉంది. అదే ఆయన్ను కంప్యూటర్ ఫీల్డ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకువచ్చింది. భీమవరంలోని డీయన్ఆర్ కాలేజీలో చదువుకున్న సుబ్బరాజు, ఆ తరువాత కంప్యూటర్ కోర్సు చేసి ౖహైదరాబాద్లోని డెల్ కంప్యూటర్స్లో చేరారు. మంచి ఉద్యోగం, మంచి శాలరీ... అయినా మనసులో ఏదో తెలియని అసంతృప్తి. ‘వర్క్ అంటే ప్రతి క్షణం ఎంజాయ్ చేసేలా ఉండాలి. కొత్త ప్రదేశాలు తిరగాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆలోచించాలి... జీవితంలోని తాజాదనాన్ని ఎప్పటికప్పుడు ఆస్వాదించాలి’’ అనుకున్నారు సుబ్బరాజు.ఇంతకీ అదేమిటి? టైమ్ కోసం ఎదురుచూడడం తప్ప ఏమో ఇప్పటికైతే తెలియదు. ఆ టైమ్ రానే వచ్చింది. ఒకసారి దర్శకుడు కృష్ణవంశీ ఇంట్లోని కంప్యూటర్కు ఏదో సమస్య వచ్చినప్పుడు, చేయిచేసుకోవడానికి మిత్రుడితో కలిసి వెళ్లాడు సుబ్బరాజు. ఆ కొద్ది సమయంలోనే సుబ్బరాజుకు నటన అంటే ఇష్టమని తెలుసుకొని తన చిత్రంలో చిన్న పాత్ర ఒకటి ఇచ్చారు కృష్ణవంశీ. కనిపించీ కనిపించనట్లు ఉండే ఆ టెర్రరిస్ట్ పాత్ర తనకేమీ పెద్దగా గుర్తింపు తేలేదు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ సినిమాలో వేసిన ఆనంద్ పాత్రతో సుబ్బరాజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి’ సినిమాలో కిక్–బాక్సింగ్ ఛాంపియన్ రఘువీర్ (ప్రకాష్రాజ్) ప్రియ శిష్యుడు ఆనంద్గా, గురువును మోసం చేసిన శిష్యుడి పాత్రను అద్భుతంగా పోషించారు సుబ్బరాజు. ‘ఆర్య’ ‘పోకిరి’ ‘నేనున్నాను’ ‘దూకుడు’ ‘నమో వెంకటేశ’ ‘పరుగు’... ఇలా చెప్పుకుంటే పోతే సుబ్బరాజుకు పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. శత్రువుల తలలు తీసే ఫ్యాక్షనిస్ట్కు కుడిభుజంలాంటి సేవకుడి నుంచి, అమ్మాయిలను మోసం చేసే ‘చీటింగ్ లవర్’ వరకు రకరకాల పాత్రలు పోషించి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు సుబ్బరాజు. -
నా ముందు తలదించుకొని బతకాల...
నాగిరెడ్డి అంటే మాటలా? మాట మాటకూ మందుపాతర దట్టించి పేల్చగలడు. పండ్లు నూరుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తించగలడు. ‘రేయ్... పో... ఎక్కడో ఒక చోట హాయిగా బతుకు. లేదు... ఇక్కడే బతుకుతానంటావా... ఇల్లు ఇస్తా. ఎకరం పొలం ఇస్తా. నా ముందు తలదించుకొని బతకాల. తల ఎత్తావో... నరికేస్తా!’ అంటూ ప్రత్యర్థి ముఖం మీదే పిడుగులు కురిపించగలడు.. ‘ఆది’ సినిమాలో నాగిరెడ్డిగా అసమాన నటన ప్రదర్శించారు రాజన్ పి. దేవ్. రాజన్ను చూస్తే... మన ఊళ్లోనో, మరో చోటో కనిపించే పెద్ద మనిషిలాంటి విలన్ గుర్తుకు వస్తాడు తప్ప ఎక్కడి నుంచో దిగుమతి అయిన ‘మల్లువుడ్ విలన్’ గుర్తుకురాడు.‘మన ఇలనే’ అన్నంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజన్ పి. దేవ్ ఈవారం మన ‘ఉత్తమ విలన్’ ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది కదా!’రాజన్ కూడా ఆ గూటి పలుకే పలికారు. రాజన్ నాన్న ఎస్.జె.దేవ్ ప్రసిద్ధ నాటకకళాకారుడు. చిన్నప్పుడు ఆటల కంటే నాటకాల మధ్యే ఎక్కువ కాలం గడిపేవాడు రాజన్. రిహార్సల్ సమయంలో పెద్ద పెద్ద నటుల నుంచి వినిపించే భారీ డైలాగులు, చిన్న రాజన్ పెదాల మీద అలవోకగా ప్రతిధ్వనించేవి. నాన్న ఎస్.జె.దేవ్ను ఆదర్శంగా తీసుకొని ఎన్నో నాటకాల్లో నటించారు రాజన్. సీనియర్ రంగస్థల కళాకారుడు ఎన్.ఎన్.పిల్లై ఆధ్వర్యంలో ఎన్నో నాటకాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించారు రాజన్. నటించడం మాత్రమే కాదు... చిన్నవయసులోనే నాటకాలు రాయడం, దర్శకత్వంలాంటివి చేసేవాడు. ‘మలయాళం నాటక వేది’ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి ‘రాధమ్’ అనే నాటకం రాసి దర్శకత్వం చేశారు. అయితే ఈ నాటకం పెద్ద డిజాస్టరై రాజన్ను ఆర్థికసమస్యల్లో కూడా నెట్టింది. వేరొకరయితే ‘నాటకాలకో దండం మీకో దండం’ అని మూటా ముల్లే సర్దుకునే వారు. పోయిన చోటే వెదుక్కోవాలనుకునే రాజన్ వెనక్కి తగ్గలేదు. ఎస్.ఎల్.పురం సదానందన్ నాటకం ‘కట్టుకుతిర’లో ప్రధాన పాత్రను పోషించారు. ఈ నాటకం వందకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకోవడంతో రాజన్ పేరు కేరళ మొత్తం సుపరిచితం అయింది. హరిశ్రీ థియేటర్ వారి ఒక నాటకంలో మానసిక వికలాంగుడి పాత్ర ధరించి శభాష్ అనిపించుకున్నారు రాజన్. ‘బెస్ట్ యాక్టర్’గా స్టేట్ అవార్ట్ కూడా గెలుచుకున్నారు.నాటకరంగంలో తిరుగులేని నటుడు అనిపించుకున్న రాజన్ ఆ తరువాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఫజిల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంటె మమట్టికుట్టియమక్కు’ చిత్రంతో రాజన్ ఫిలిం కెరీర్ మొదలైంది. రాజన్ వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ‘కట్టుకుతిర’ నాటకం సినిమాగా వచ్చింది. అయితే ఆ నాటకంలో తాను చేసిన లీడ్రోల్ వేరే నటుడికి దక్కడం రాజన్ని నిరాశకు గురిచేసింది. ఇదే విషయాన్ని ఒక ఇంటర్య్వూలో చెప్పుకున్నారు రాజన్. ఇది చదివిన ‘కట్టుకుతిర’ దర్శకుడు తన మరో చిత్రం ‘ఇంద్రజాలం’లో ‘కార్లోస్’ అనే విలన్ రోల్ రాజన్కు ఇచ్చాడు. ‘కార్లోస్’ పాత్రతో రాజన్ కెరీర్ మలుపు తిరిగింది. ఎన్నో చిత్రాల్లో విలన్గా నటించారు. విలన్ పాత్రల్లో రాజన్ ఎంత పాపులర్ అయ్యాడంటే... ‘‘ఆయన పని గట్టుకొని క్రూరమైన డైలాగులు చెప్పాల్సిన పనిలేదు. ఆ ముఖం, కళ్లు చాలు విలనిజాన్ని చాటడానికి’’ అనేవాళ్లు.క్రూరత్వంతోనే విలనీ పండుతుందనేది నిజమే అయినా కాస్త హ్యూమర్ టచ్తో కూడా విలనిజాన్ని పండించి తనదైన శైలిని చాటుకున్నారు రాజన్. తమిళ, కన్నడ, తెలుగు సినిమాలలో అవకాశాలు రాజన్ను వెదుక్కుంటూ వచ్చాయి. తెలుగులో ‘ఖుషీ’ ‘ఆది’ ‘నాగా’ ‘దిల్’ ‘ఒక్కడు’ ‘ఆర్యా’ ‘గుడుంబ శంకర్’ ‘బాలు’ ‘బన్నీ’ ‘వీరభద్ర’ ‘యోగి’ ‘కాళిదాస్’ ‘క్రిష్ణ’... మొదలైన సినిమాలలో నటించారు. అవివీతి పోలీసు అధికారి నుంచి ఫ్యాక్షనిస్ట్ వరకు... ప్రతి పాత్రలోనూ తన మార్క్ విలనిజాన్ని చాటుకొని ‘ఉత్తమ విలన్’గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాజన్ పి. దేవ్ 2009లో చనిపోయారు. చాలామంది ప్రేక్షకులకు ఆయన మలయాళ నటుడు అనే విషయం తెలియదు. మన తెలుగు విలనే అన్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘రాజన్ పి. దేవ్’ అనే ఆయన పేరు కొద్దిమందికే తెలిసి ఉండవచ్చు. అయితే ‘నాగిరెడ్డి’ ‘యం.పీ. అవతారం’ ‘కుమారస్వామి మామ’ మొదలైన పేర్లతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత విలనీయుడుగా గుర్తుండిపోతారు రాజన్ పి. దేవ్. -
ఈ మున్నా నాలిక మడతెడితే...ఇక అంతే!
పోలీసుల మీద బావూజీ గుర్రుగా ఉన్నాడు. కోపంగా ఉన్నాడు. కసిగా ఉన్నాడు.తన అసహనాన్ని, కసిని, కోపాన్ని చాటుకోవాలనుకున్నాడు.‘షురూ కరో బేటా’ అన్నాడు. ఆ బేటా (కొడుకు) ఎలాంటోడు అనుకున్నారు? నాలుక మడతపెట్టి ఉరిమి చూస్తే చాలు... ఎదుటి వారికి చుక్కలు కనపడతాయి.మున్నానా మజాకా?పోలీసులతో ఈ మున్నా ఎంతలా ఆడుకున్నాడు!‘ఓడిపోయిన పోలీసోడి బెల్టుమా ఇంట్లో గేదె మెడలో వేస్తాను’ అంటూ...కాసేపు రైలు ఆట.కాసేపు విమానం ఆట.కాసేపు ఛల్ ఛల్ గుర్రం ఆట! ఎన్నెన్నో ఆటలు ఆడుకున్నాడు!!‘విక్రమార్కుడు’ సినిమాలో ‘మున్నా’ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటుడు అమిత్ కుమార్ తివారీ. సినిమాలు చూస్తూ పెరిగిన అమిత్కు ‘సినిమా యాక్టర్’ కావాలనుకోవడం తప్ప పెద్ద లక్ష్యాలంటూ ఏమీ లేవు. డిగ్రీ పూర్తికాగానే ‘యాక్టింగ్ ఫీల్డ్’లో దూకడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. నాన్న మాత్రం ‘అది తక్క’ అన్నట్లుగా మాట్లాడి బిజినెస్ చేయమన్నాడు.‘బిజినెస్ చేయడం నా వల్ల కాదు’ అంటూ తండ్రి దగ్గర మొరపెట్టుకొని, ఆయనను ఒప్పించి రంగంలోకి దిగాడు అమిత్. తెలుగులో ‘కళ’ సినిమాలో నటించే ఆఫర్ రావడంతో ముంబై నుంచి 2003లో హైదరాబాద్ వచ్చాడు అమిత్. ఈ సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతలు, దర్శకులు, రచయితలను రెగ్యులర్గా కలిసేవాడు. అలా ‘కళ’ తరువాత ‘యువసేన’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా నుంచి అవకాశాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ‘యువసేన’లో అమిత్ చేసిన డ్యాన్స్కు మంచి పేరు వచ్చింది. విలన్కు డ్యాన్స్ ఉండడం అనేది కొత్తగా అనిపించింది. ‘విక్రమార్కుడు’ సినిమా అమిత్ తివారీకి టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఆ సినిమాలో బావూజీ కుమారుడు ‘మున్నా’గా క్రూరత్వాన్ని పండించాడు అమిత్. ‘మున్నా’ పాత్ర ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పడానికి చిన్న ఉదాహరణ...‘విక్రమార్కుడు’ సినిమా రిలీజ్ రోజు అందరితో కలసి సుదర్శన్ థియేటర్ (హైదరాబాద్)కు వెళ్లాడు అమిత్. తెర మీద మున్నా కనిపిస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లు పైకి లేచి కాగితాలు, నాణేలు విసురుతూ బండబూతులు తిడుతున్నారు.‘ఓరి నాయనో... నా పని ఇవాల్టితో ఖతం. బయట కనిపిస్తే ఎముకల్లోకి సున్నం లేకుండా తంతారు’ అనుకున్నాడు. ఎలాగైనా సరే, అక్కడి నుంచి సేఫ్గా ఎస్కేప్ కావాలనుకున్నాడు. డైరెక్టర్ రాజమౌళి దగ్గరికి వెళ్లి మనసులో మాట చెప్పాడు. ‘‘మరేం ఫరవాలేదు. నీ పాత్ర పెద్ద హిట్ అనడానికి ఇదే సాక్ష్యం. ఇక్కడ తిట్టిన వాళ్లే నువ్వు బయట ఎక్కడైనా కనిపిస్తే పొగుడుతారు చూడు’’ అన్నాడు రాజమౌళి. ఆయన చెప్పినట్లే జరిగింది. సినిమా నుంచి బయటికి వచ్చిన తరువాత అమిత్ను గుర్తు పట్టిన ఆ కుర్రాళ్లు...‘‘సార్... ఎంత బాగా చేశారు’’ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు.‘హమ్మయ్య’ అనుకున్నాడు అమిత్. మున్నా పాత్ర ఎంత హిట్ అయిందంటే...‘విక్రమార్కుడు’ సినిమాకు ముందు ఏడెనిమిది సినిమాలు చేసిన అమిత్ ఆ తరువాత డెబ్బై సినిమాల వరకు చేశాడు. కెరీర్ యమస్పీడ్ అందుకుంది! ‘ఈ క్యారెక్టర్ ఎలా చేయాలి? సమ్థింగ్ డిఫరెంట్గా ఎలా చేయాలి? ఎలాంటి గెటప్ వేయాలి’ అని ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంటాడు అమిత్. పాత్రకు తగ్గట్టు బాడీని పెంచడం, తగ్గించడం చేస్తుంటాడు. ఇది మాత్రమే కాదు...సెట్లో సీనియర్ విలన్ల నటనను జాగ్రత్తగా గమనిస్తూ పాఠాలు నేర్చుకుంటాడు.‘యువసేన’ ‘విక్రమార్కుడు’ ‘లక్ష్యం’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అత్తారింటికి దారేది’...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమిత్ కుమార్ తివారీ కన్నింగ్, సైకో, క్రుయల్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచాడు.‘కీప్ ట్రైయింగ్’ ‘కీప్ ఫైటింగ్’ అనేవి అమిత్ నమ్ముకున్న సూత్రాలు. ఈ సూత్రాలే అతనిలో ఆశావహ దృక్పథాన్ని పెంచి ‘ఉత్తమ విలన్’గా ప్రేక్షకుల మెప్పు పొందేలా చేశాయి. -
నా పేరు జక్కా... పెద్ద ఎదవని
‘ఈయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లా ఉన్నాడు. నేను సంతకం పెట్టను...అంటున్నాడు’అలాగా! అదిగో జక్కా వస్తున్నాడు చూడండి...ఎడమ చేత్తో చేతిలోని సిగరెట్ను సై్టలిష్గా విసిరేసి ఆ అధికారితో జక్కా ఏమంటున్నాడో చదవండి... ‘నా పేరు జక్కా. పెద్ద ఎదవని. మా మామయ్య నా కంటే పెద్ద ఎదవ. నీకు కారుందా? సొంతబిల్డింగ్ ఉందా? ఏమీ లేని వాడివి ఉన్నవాడితో పెట్టుకుంటే... ఉండే ప్రాణాలు కూడా ఉండవు’ పొడవాటి జుత్తుతో సై్టలిష్గా కనిపిస్తూనే ‘కృష్ణ’ సినిమాలో ‘జక్కా’గా ప్రేక్షకులను తెగభయపెట్టించాడు ముకుల్దేవ్. ముకుల్దేవ్ పక్కా ఢిల్లీబాయ్. నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్. అమ్మ స్కూలు టీచర్. అమ్మ విషయం ఎలా ఉన్నా నాన్న మాత్రం తన కొడుకు ఏదైనా ఒక పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, యూనిఫాం ధరించాలని అనుకునేవాడు. అది సాధ్యం కాలేదుగానీ, రాయబరేలిలోని ‘ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ’లో కమర్షియల్ పైలట్గా శిక్షణ తీసుకున్నాడు.బాలీవుడ్ సినిమాలంటే ఇష్టపడే ముకుల్దేవ్, స్నేహితుల దగ్గర హీరోలను సరదాగా అనుకరించి చూపేవాడు. ఇంతకు మించి దేవ్కు నటన గురించి పెద్దగా తెలియదు.కమర్షియల్ పైలట్గా తన కెరీర్ మొదలుకాకముందే, మహేష్భట్ ‘దస్తక్’ సినిమాలో నటించే బంగారు అవకాశం ముకుల్దేవ్కు వచ్చింది.‘‘చాలామందిలా బాలీవుడ్లో ప్రవేశించడానికి నేనేమి కష్టపడలేదు. పాకెట్ మనీ కోసం సరదాగా యాడ్స్ చేస్తున్న సమయంలో ప్రఖ్యాత దర్శకుడు మహేష్భట్ కంట్లో పడ్డాను. అలా దస్తక్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్లో నాది రెడ్కార్పెట్ వెల్కమ్’’ అని తన బాలీవుడ్ ప్రవేశం గురించి చెబుతాడు దేవ్.‘దస్తక్’లో దేవ్ పోషించిన ఏసీపీ రోహిత్ మల్హోత్ర పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.నటనలో ఓనమాలు తెలియకపోయినా, ఒక్కో సినిమాతో తన నటనను మెరుగు పరుచుకుంటూ వెళ్లాడు ముకుల్ దేవ్.‘ఖిలా’ సినిమాలో దిలీప్ కుమార్తో పని చేయడం దేవ్కు ఒక అద్భుత అనుభవంగా మిగిలింది . ఒక నటదిగ్గజంతో నటించడం వల్ల, తనకు తెలియకుండానే పాఠాలు నేర్చుకున్నాడు దేవ్. ‘తెలుసుకోవడం ద్వారా మాత్రమే కాదు నటిస్తూ పోవడం ద్వారా కూడా నటన పట్టుబడుతుంది’ అంటాడు ముకుల్దేవ్. ‘దస్తక్’ సినిమాతో లక్కీచాన్స్ కొట్టేసిన దేవ్ తన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్నాడు.రెండు సంవత్సరాల తరువాత కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది.‘ఏంచేయాలా?’ అని ఆలోచిస్తున్న సమయం టీవీ రంగం ఆహ్వానం పలికింది.‘పెద్ద సినిమాల్లో నటించిన నేను...టీవీలో నటించడం ఏమిటి?’ అనుకోలేదు.‘ఇప్పుడు నా చేతిలో పని లేదు. ఆ పని టీవీ ఇస్తుంది’ అనుకొని రకరకాల సీరియల్స్లో నటించి టీవీరంగాన్ని ఆస్వాదించాడు ముకుల్. టీవీ రంగంలో విజయవంతమైన దేవ్కు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్వాగతం పలికింది. 2008లో వచ్చిన రవితేజ చిత్రం ‘కృష్ణ’లో ‘జక్కా’గా కనిపించి, తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు ముకుల్ దేవ్. ఏక్నిరంజన్, అదుర్స్, కేడీ, మనీ మనీ మోర్ మనీ, బెజవాడ, నిప్పు, భాయ్...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు దేవ్. తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు తెలుగు తెలిసినవాళ్లనే అసిస్టెంట్గా పెట్టుకునేవాడు. దీని ద్వారా క్రమక్రమంగా తెలుగు భాష నేర్చుకునే అవకాశం ఏర్పడింది. మూడు, నాలుగు సినిమాలు పూర్తయ్యేలోపు తెలుగులో సంభాషించే లెవెల్కు చేరుకున్నాడు!రాహుల్ దేవ్ (అతడు, తులసీ, ఎవడు, నాయక్... మొదలైన తెలుగు చిత్రాల్లో నటించారు)కు ఈ ముకుల్దేవ్ స్వయాన సోదరుడు. అన్నలాగే తమ్ముడు కూడా ‘ఉత్తమ విలన్’గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
ఆడంగులంతా లోపలకి వెళ్లండి...
‘ఇంజినీరన్నయ్యా, నాకు సెప్పకుండా డ్యామ్ కట్టేసి దాని పేరు సెప్పుకుని నువ్వు, నీ పేరు సెప్పుకుని నీ కొడుకులు అంతా నొక్కేద్దామనుకుంటున్నారా. నేను బతికుండగా ఆ డ్యామ్ పని జరగనివ్వను’’ అంటూ బ్రహ్మన్న పాత్రలో చెప్పిన డైలాగ్తో తెలుగుతెరకు విలన్గా పరిచయం చేశారు కృష్ణవంశీ. చిత్రం శ్రీఆంజనేయం. ‘ఆడంగులంతా లోపలకి వెళ్లండి... అంటూ ‘ఔనన్నా కాదన్నా’ చిత్రంలో మంగరాజు పాత్రలో ప్రేక్షకులను భయపెట్టారు. ‘ఆరున్నర కోట్లు నీ మీద పెట్టుబడి పెడుతున్నాం...’ అన్నారు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు... ఈ చిత్రంలో పాత్ర గురించి చెబుతూ. ౖరైల్వే ప్లాట్ఫారమ్ మీద కళాసీ అభిమానులు ‘యాక్షన్’ అంటూ, పిళ్లా లక్ష్మీప్రసాద్ చేత ముచ్చటగా ‘ఔనన్నా కాదన్నా’ డైలాగును పెద్ద గొంతులో చెప్పించుకున్నారు. 1969లో సీతన్నపేటలో ‘విషవలయం’ నాటకంలో వీధిలో హాస్యపాత్రతో రంగస్థల జీవితం ప్రారంభించి, నాటకాలలో హీరో అయ్యారు. ఆదివిష్ణు రచించిన ‘సిద్ధార్థ’ నాటకంతో రంగస్థలం మీద గుర్తింపు తెచ్చుకున్నారు. 1973లో అత్తిలి కృష్ణారావు ‘యుగసంధ్య’ నాటకాన్ని చెన్నై ఆంధ్ర క్లబ్లో ప్రదర్శించారు. నాటకానికి వచ్చిన సినీ ప్రముఖులందరూ ప్రశంసల జల్లులు కురిపించారు. కానీ ఒక్కరూ చలన చిత్రంలో నటించే అవకాశం ఇవ్వలేదు.ఆ నాటకానికి ప్రముఖ హాస్యనటుడు రాజబాబు వచ్చారు. ప్రసాద్ నటన చూసి ముచ్చటపడి, ఆయనను మెచ్చుకుని ఊరుకోకుండా, ముద్దాడారు. ‘నీకు ఎప్పటికైనా సినిమాలలో నటించే అవకాశాలు వస్తాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఇక్కడ అన్నీ ఉన్నాయి. వాటికి దూరంగా ఉండు’ అని చెవిలో రహస్యంగా చెప్పిన శిలాక్షరాలను ప్రసాద్ ఎన్నటికీ మర్చిపోలేదు. పిళ్లా ప్రసాద్లో చాలా కోణాలు ఉన్నాయి. రచయిత, రంగస్థల నటుడు, దర్శకుడు, రేడియో టీవీ నటుడు. ‘పిట్టలదొర’ గా వేగంగా మాట్లాడి ఉగాది పురస్కారం అందుకున్నారు. విజయవాడలో ఉన్న రోజుల్లోనే ‘కళాభారతి’ నాటక సంస్థలో జంధ్యాలతో కలిసి పనిచేశారు. ఆయన రికమెండేషన్ మీదే ‘గందరగోళం’ లో నటించే అవకాశం వచ్చింది. పిళ్లా ఫొటోలు జంధ్యాల స్వయంగా సింగీతం శ్రీనివాసరావుకి పంపారు. ‘బీగరపంధ్య’ కన్నడ చిత్రంలో హాస్యనటునిగా కన్నడ తెర మీదా కనిపించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1980లో విడుదలైన ‘గందరగోళం’ చిత్రంలో మూడో హీరోగా నట జీవితం ప్రారంభించారు. ఆ తరువాత ‘నటన’ చిత్రంలో సెకండ్ హీరోగా కనిపించారు. హీరోగా రెండు చిత్రాలలో మాత్రమే కనిపించారు. అన్నవరంలో ఏదో పనిలో ఉన్న కృష్ణవంశీ ఏదో మ్యాగజైన్లో పిళ్లా ప్రసాద్ ఫొటో చూసి ‘వీడు నా ఫ్రెంyŠ , వీడిని పట్టుకోవాలి’ అనడంతో పిళ్లాప్రసాద్ కృష్ణవంశీ చేతికి దొరికారు. ‘శ్రీఆంజనేయం’ చిత్రంలో విలన్గా పరిచయం చేశారు. అలా 2004లో సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వెంటనే దర్శకులు తేజ, ‘ఔనన్నా కాదన్నా’ చిత్రంలో ప్రధాన విలన్ మంగరాజు పాత్ర ఇచ్చారు. విజయవాడలోనే ఉంటూ, వస్తూ వెళ్తూ సినిమాలు చేశారు. విలన్గా 31 సినిమాలు పూర్తి చేసుకున్నారు. మరో రెండు సినిమాలలో కనిపించనున్నారు. బుర్ర మీసాలతోను, ఎర్రబడ్డ కళ్లతోనూ, గంభీరమైన డైలాగులతో ప్రేక్షకులను భయపెట్టిన పిళ్లా ప్రసాద్, అక్కడితో ఆగకుండా ‘వంకాయ ఫ్రై’లో కామెడీ విలన్గా నవ్వులు పండించారు. నగరం నిద్రపోతున్న వేళ, మిర్చి, యువసేన, అసాధ్యుడు, నేను శైలజ చిత్రాలలో ప్రధానంగా కనిపించారు. 2014, 2015 ఉత్తమ విలన్ అవార్డులు అందుకున్నారు. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
నాతోనే గేమ్సా?!
నన్నే మోసం చేస్తావారా? బొమ్మ పడితే వదిలేస్తా బొరుసు పడితే నరికేస్తా ఇటీవలి కాలంలో దక్షిణాది చలనచిత్రరంగంలో చెడ్డ ‘విలన్’ పాత్రలకు మంచి పేరు తెచ్చుకుంటున్న నటుడు ఆదిత్య మీనన్. ‘సింహ’ సినిమాలో గోపి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు ఆదిత్య. ఆ సినిమాలో అతనికి చాంతాడు పొడుగు, బీభత్సమైన డైలాగులేమీ ఉండవు. ‘ఎవడ్రా కొట్టింది?’ ‘వాడి పేరు తెలుసా?’ ‘మనం వచ్చిన పనేమిటి? ఈ గొడవేమిటి?’ ‘చేతికి దొరికిన వాడ్ని వదిలేశానురా’..... ఇలా పొడి పొడి డైలాగులతోనే వీర లెవెల్లో విలనిజాన్ని పండించాడు ఆదిత్య. తక్కువ మాటలతో ఎక్కువ నటనను ప్రదర్శించే ఆదిత్య నటనను గమనిస్తే, విలన్ల గురించి ప్రముఖ మాట ఒకటి చప్పున గుర్తుకొస్తుంది. ‘మా దగ్గర ప్లాన్లు తప్ప డైలాగులు లేవు. మా దగ్గర ప్రాబ్లమ్స్ తప్ప సొల్యూషన్స్ లేవు’ బాడీ అంతగా లేకపోయిన...డైలాగులు, హావభావాలతోనే భయపెట్టడం ఒక రకం. ఉదాహరణకు... రఘువరన్లాంటి వాళ్లు. నటనలో పస లేకపోయినా...ఒడ్డూ పొడుగుతోనే భయపెట్టడం రెండో రకం. రెండో రకం విలన్లు పెద్దగా కాలానికి నిలవరు. విలన్కు ఒడ్డూ పొడుగు, మంచి శరీరసౌష్ఠవం అవసరమేగానీ అవి మాత్రమే ఉత్తమ విలన్కు ప్రామాణికాలు కాలేవు. అందుకే...విలన్ జిమ్లోనే కాదు ‘మైండ్ జిమ్’లో కూడా గడపాలి. మానసిక కసరత్తు ఎంత బాగా జరిగితే నటన అంతగా మెరుస్తుంది. ఆదిత్య మీనన్ మంచి ఒడ్డూ, పొడుగు ఉన్న నటుడు. దీనికి తనలోని నటన కూడా తోడుకావడంతో విలన్ పాత్రలను సునాయాసంగా పోషించగలుగుతున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఉత్తమ విలన్’గా రాణించగలుగుతున్నాడు. ముంబాయిలో జన్మించాడు ఆదిత్య మీనన్. కొంత కాలం తరువాత అతడి కుటుంబం దుబాయికి వలస వెళ్లింది. దుబాయిలోని ‘అవర్ ఓన్ ఇంగ్లీష్ హైస్కూల్’లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు ఆదిత్య. పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు దుబాయిలోనే ఉన్నాడు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో పాటు బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరులోని ‘యం.ఎస్.రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో ఇంజనీరింగ్ చేశాడు. కాలేజీలో ‘రేడియో మిడ్డే’లో రేడియో హోస్ట్గా మీడియా రంగంలోకి ప్రవేశించాడు. ప్రాడక్ట్ లాంచ్, ఫ్యాషన్ షోలాంటి లైవ్ ఈవెంట్స్కు హోస్టింగ్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత ఈవెంట్ మేనేజర్గా కొంతకాలం పనిచేశాడు. ఈ సమయంలోనే ఒక థియేటర్ గ్రూపులో చేరి కొన్ని నాటకాల్లో నటించాడు. ఒకసారి ఆదిత్య నటన ప్రకాష్ బేలవాడి కంటపడింది. బెంగళూరుకు చెందిన ప్రకాష్ బేలవాడి జర్నలిస్ట్ మాత్రమే కాదు... నాటకాలు, సినిమా, టీవీలలో నటుడిగా మంచి పేరు ఉంది. సామాజిక, కళారంగాలకు సుపరిచితమైన పేరు ప్రకాష్ బేలవాడి. ఆదిత్య నటనను చూసి ‘‘ఈ కుర్రాడిలో స్పార్క్ ఉంది’’ అనుకున్నారు ప్రకాష్. అలా ప్రకాష్ తీసిన ఒక టీవి సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ఆదిత్యకు. ఇదే సమయంలో ప్రముఖ కమెడియన్ యస్.కె.చంద్రు దర్శకత్వం వహించిన ‘సూర్య శిఖరీ’ టీవీ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. నాటకాల్లో నటించాడు. టీవిలో నటించాడు. ఇక వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 2001లో చెన్నైకు వెళ్లాడు ఆదిత్య. అవకాశాలు రాకో, మరే కారణమో తెలియదుగానీ చెన్నైకి వెళ్లిన తరువాత మళ్లీ బుల్లితెర మీద కనిపించాల్సి వచ్చింది. అలా రాడాన్ మీడియా వర్క్ నిర్మించిన ‘తంతిర భూమి’ సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ సన్ టీవీలో ప్రసారమైంది. ఆ సమయంలోనే ప్రఖ్యాత దర్శడుకు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన టీవీ సీరియల్ ‘అన్నీ’లో నటించే అవకాశం వచ్చింది. ‘ఆంజనేయ’ ‘జేజే’ సినిమాల్లో నటించే అవకాశం రావడం, ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నలుగురి దృష్టిలో పడే ఛాన్స్ దొరికింది. సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది.‘సింహ’ ‘బిల్లా’ ‘దూకుడు’ ‘ఈగ’ ‘మిర్చి’ ‘బలుపు’ ‘పవర్’ ‘లయన్’ ‘రుద్రమదేవి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆదిత్యమీనన్ మరిన్ని చెడ్డ పాత్రలతో ‘మంచి’ నటనను ప్రదర్శించి ‘ఉత్తమ విలన్’గా మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
నువ్వు మేకవన్నె పులివి రాజా!
మాట కంఠంలోనే ఆపెయ్ నీ మనసులో ఏమున్నా... అది లోనే దాచెయ్ బయటికి రానీకు. దాటి బయటికి వచ్చిందా... వస్తే? బాడీ... పార్ట్స్ పార్ట్స్గా విడిపోవచ్చు. అంతా మాత్రాన... మద్దాలి శివారెడ్డి అన్నీ సూటిగా చేస్తాడని కాదు. అవసరమైతే...కాళ్లు పట్టుకుంటాడు. ‘నువ్వు నా తమ్ముడిగా ఎందుకు పుట్టలేదురా? నీ కాళ్లకు దండం పెడతా!’ అంటూనే కాళ్లు లాగి అవతలి వ్యక్తిని కింద పడేయగలడు. వికటాట్టహాసం ఒకటి చేసి... ‘మంత్రి శివారెడ్డిని మళ్లీ రౌడీ శివారెడ్డిగా మార్చావు కదరా ఇది రౌడీ శివారెడ్డి పవర్’ అని తన పవర్ ఏమిటో చూపగలడు. ‘రేసుగుర్రం’ సినిమాతో మద్దాలి శివారెడ్డిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సరికొత్త విలన్ రవి కిషన్. ‘లక్’ సినిమాలో రవి కిషన్ డెరైక్టర్ సురేందర్రెడ్డికి బాగా నచ్చాడు. ముఖ్యంగా కళ్లు. అలా ‘రేసుగుర్రం’ సినిమాతో ‘మద్దాలి శివారెడ్డి’గా తెలుగు చిత్రసీమకు ‘ఉత్తమ విలన్’గా దిగుమతి అయ్యాడు. ‘కిక్-2’లో సోల్మాన్సింగ్ ఠాకూర్, ‘సుప్రీమ్’ సినిమాలో బీకుగా రవికిషన్ మనకు మరింత దగ్గరయ్యాడు. హీరోగా నటించడం కంటే విలన్గా నటించడమే కష్టం అంటారు. ఆ కష్టం రుచి ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాడేమో రవికిషన్. భోజ్పురి ఫిల్మ్ సూపర్స్టార్ అయిన రవి కిషన్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో విలన్గా కనిపిస్తున్నాడు. రవి శరీర దారుఢ్యానికి ఆకర్షించే కళ్లు తోడై డైలాగులు బాంబుల్లా పేలుతున్నాయి. విలనిజం ఇరగ పండుతుంది. ‘రౌడీయిజం మా నాన్న దగ్గర నేర్చుకున్న. రాజకీయం నీ దగ్గర నేర్చుకున్న’ అనేది విలన్గా రవికిషన్ డైలాగ్. మరి నటన ఎక్కడ నేర్చుకున్నాడు? నటుడు ఎలా అయ్యాడు? ఆ స్టోరీలోకి వెళదాం పదండి.... ముంబైలోని శాంటాక్రాజ్లో ఒక చిన్న ఇంట్లో పుట్టాడు రవి. తండ్రికి చిన్న డైరీ బిజినెస్ ఉండేది. అన్నదమ్ముల మధ్య గొడవ రావడంతో ఆ వ్యాపారం మూతపడింది. అప్పుడు ఆయన తన మకాంను సొంతూరు ఉత్తరప్రదేశ్లోని జోన్పూర్కు మార్చాడు. చదువు మీద రవికి ఎంత మాత్రం ఆసక్తి ఉండేది కాదు. మరోవైపు చూస్తే...ఇంట్లో పేదరికం. దీపావళిలాంటి పెద్ద పండగలకు కూడా కొత్త బట్టలు కొనే స్థోమత ఉండేది కాదు. రవికి ఒక లక్ష్యం అంటూ ఉండేది కాదు. ‘గూండాగా మారుతానేమో’ ‘చనిపోతానేమో’ ‘నాకు పిచ్చిపడుతుందేమో’ ఇలా ఏవో పిచ్చి పిచ్చిగా ఆలోచించేవాడు. ఆరోజుల్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు బాగా చూసేవాడు. ఆ సినిమాలు రవిని బాగా ప్రభావితం చేశాయి. ‘నా వెనకాల ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. చదువు లేదు. టీచర్ లేడు. సినిమానే నా గురువు’ అనుకున్నాడు. ఆ గురువే తనకు నటనలో కూడా పాఠాలు నేర్పించింది. పదిహేడు సంవత్సరాల వయసులో తల్లి ఇచ్చిన ఐదొందల రూపాయలు తీసుకొని ముంబైకి వెళ్లిపోయాడు. పాత ఫ్రెండ్ హృదయ్షెట్టి రూమ్లో ఉన్నాడు. అతడే రవిని ఎందరో దర్శకులకు పరిచయం చేశాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో, తినడానికి భోజనం లేకుండా ఎన్ని రోజులు పస్తులు ఉన్నాడో తెలియదుగానీ బి-గ్రేడ్ ఫిల్మ్ ‘పీతాంబర్’లో నటించే అవకాశం వచ్చింది. ‘తేరే నామ్’ సినిమాతో రవి కిషన్కు కాస్త గుర్తింపు వచ్చింది. అందులో పూజారి పాత్ర వేశాడు. ఆ తరువాత కూడా పెద్ద గుర్తింపు లేదు. డబ్బులు లేవు. ఈ సమయంలోనే ఒక భోజ్పురి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ‘భోజ్పురి సినిమా నాకు గౌరవాన్ని, గుర్తింపును, డబ్బును ఇచ్చింది. నన్ను సూపర్స్టార్ని చేసింది’ అని భోజ్పురి మీద కృతజ్ఞత చాటుకున్న రవికిషన్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు.తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ విలన్గా గుర్తింపు పొందుతున్నాడు. -
ఈ బత్తుల బైరాగినాయుడి జోలికి వస్తే...
ఉత్తమ విలన్ ఏ మిస్టేక్ జరిగినా అందరూ నాలో ఉన్న రాక్షసుడిని చూడాల్సి ఉంటుంది కాంట్రాక్టర్ బద్రీనారాయణలో రాక్షసుడు కనిపించాలంటే ‘మిస్టేక్’ కనిపించాలి. బద్రీనారాయణ పాత్ర వేసిన షాయాజీ షిండే మాత్రం... తన నటనలో చిన్న మిస్టేక్ లేకుండా వెండితెరపై రాక్షసత్వాన్ని పండించి ‘గ్రేట్ విలన్’ అనిపించుకోగలరు. ‘ఏం నిల్చొని మాట్లాడుతున్నావు? కూర్చోవయ్యా. ఏం తీసుకుంటావు?’... ఇవి బత్తుల బైరాగి నాయుడి మాటలు. ఆహా... ఆ మాటల్లో ఎంత మర్యాద ఉంది! ‘రౌడీ వెధవలు మనకు ఎందుకు చెప్పు’ ఇవి కూడా బైరాగి నాయుడి మాటలు. ఆహా... రౌడీయిజం మీద ఎంత మంట! ‘ఒక్క ఓటు వేసి మీరు నన్ను మరిచిపోయినా... నేను మాత్రం మిమ్మల్ని జీవితాంతం మరిచిపోను’... ఇవి కూ....డా బైరాగి నాయుడి మాటలే.... ఆహా... ఎంత విశ్వాసం!! కానీ... బైరాగినాయుడిలో భూతద్దం వేసి వెదికినా... మర్యాద కనిపించదు. రౌడీయిజం మీద అపారమైన ప్రేమ తప్ప వ్యతిరేకత కనిపించదు. తనను గెలిపించిన ప్రజల పట్ల పొరపాటున కూడా విశ్వాసం కనిపించదు. ‘ఠాగూర్’ సినిమాలో బద్రీనారాయణ, ‘వీడే’ సినిమాలో బత్తుల బైరాగి నాయుడు పాత్రలు షాయాజీ షిండే విలనిజానికి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. సొంతగొంతు కంటే... అరువు గొంతుతో మరింత ఎక్కువగా భయపెట్టగలడనేది ‘వీడే’ సినిమాతో రుజువు అయినా... ఆయన సొంతగొంతుతోనే మనకు ఎక్కువగా భయపడడం అలవాటైంది. సరే... ఆ గొంతులో పలికే ముక్కల ముక్కల తెలుగు సంగతి ఎలా ఉన్నా... ఆ కళ్లలో పలికే భావాలు చాలు... విలనిజం చిరునామా చెప్పడానికి! తెలుగు ప్రేక్షకులకు ‘మన ఇలనే’ అన్నంతగా దగ్గరైన... షాయాజీ షిండే... ఎక్కడి వారు? ఒక్కసారి అలా మహారాష్ట్ర వరకు వెళ్లొద్దాం... మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టారు షిండే. డిగ్రీ తరువాత ‘మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్’లో వాచ్మెన్గా చేరారు. నెల జీతం 165 రూపాయలు. ఉద్యోగం చేస్తున్నా మనసంతా నాటకాలపైనే ఉండేది. ‘నేను నటుడిని కాగలనా?’ అని మనసులో ఒక ప్రశ్న. ‘కావాలంటే ఏంచేయాలి?’ అనేది మరో ప్రశ్న. ‘మంచి నటుడు కావాలంటే ఏంచేయాలి?’ అని ఒక పెద్దాయనను అడిగినప్పుడు.... ‘మందుకొట్టే అలవాటు ఉందా?’ ‘సిగరెట్ తాగే అలవాటు ఉందా?’ అని అడిగాడు. ‘అప్పుడప్పుడు తాగుతాను’ అని జవాబు ఇచ్చారు షిండే. ‘‘చెడు అలవాట్లేమీ లేకుంటేనే మంచి నటుడివి కాగలవు’ అని విలువైన సలహా ఇచ్చాడు ఆ పెద్దాయన. ఇక అప్పటి నుంచి... ‘శరీరంపై శ్రద్ధ చూపాలి. యోగా చేయాలి’ ‘కొత్త జీవితం మొదలు పెట్టాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నారు షిండే. అంతే కాదు... ‘నటన’ గురించి తెలుసుకోవడానికి ఎందరితోనో మాట్లాడేవాడు. నటనకు సంబంధించి ఎన్నో పుస్తకాలను చదివేవాడు. దాదర్స్టేషన్ సమీపంలో ఒక పుస్తకాల దుకాణంలో కనిపించిన భరతముని ‘నాట్యశాస్త్ర’ పుస్తకాన్ని కూడా వదల్లేదు. ‘అభినయ సాధన్’లాంటి మరాఠీ పుస్తకాల నుంచి కూడా నోట్స్ తయారు చేసుకునేవాడు. ఇంట్లో వాళ్లు మాత్రం... ‘వీడికేమైనా పిచ్చా’ అనుకునేవాళ్లు. ‘ధార్మియ’ అనే మరాఠీ నాటకంలో షిండే చేసిన హిజ్రా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. షిండేను నిజమైన హిజ్రా అనుకున్నారు చాలామంది. ఈ హిజ్రా పాత్రతో ప్రముఖల దృష్టిలో పడిన షిండేకు ఎన్నో మరాఠీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చిన ‘భారతి’ అనే తమిళ సినిమాలో ప్రఖ్యాత కవి సుబ్రమణ్య భారతిగా నటించి... దక్షిణాది సినీ పరిశ్రమకు దగ్గరయ్యారు. ‘ఠాగూర్’ సినిమాలో ‘బద్రీనారాయణ’గా నటించడంతో తెలుగు చలన చిత్రసీమకు ‘షాయాజీ షిండే’ రూపంలో సరికొత్త విలన్ పరిచయం అయ్యాడు. -
మనది విలన్ టైప్... అందుకే...
ఉత్తమ విలన్ ఇది నా రాజ్యమే...ఇక్కడ పగలేగానీ ప్రేమలుండవు. కక్షలేగానీ కనికరాలుండవు ఒక్కసారి టైమ్మిషన్లోకి వెళ్లి 1991లో ఆగండి. దగ్గర్లో ఉన్న థియేటర్లో ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా చూడండి. ఆ సినిమాలో పొట్ట చెక్కలయ్యేలా నటించే నటుల్లో జయప్రకాష్రెడ్డి కూడా ఉంటారు. ఆయన ఊత పదం ‘తూ....చ్’ ‘నీ యెంకమ్మ’లాగే బాగా పాప్లర్ అయింది. పె....ద్దగా నవ్వి... ‘మనది విలన్ టైప్. అందుకే అలా నవ్వాను.... తూ....చ్’ అనే డైలాగ్ విసురుతారు. ఇంకాస్త వెనక్కి వెళ్లండి. సరిగ్గా 1988లో ఆగండి. ‘బ్రహ్మపుత్రుడు’ సినిమా మరొక్కసారి చూడండి. జయప్రకాష్ ఎస్పీగా కనిపిస్తారు. ఆయన డైలాగ్ ఒకసారి వినండి... ‘హ్యాండ్సప్... చేతుల్లో ఉన్నది కింద పెట్టు. చేతులు ముందుకు పెట్టు. చెడుగుడు ఆడేస్తా....’ జయప్రకాష్రెడ్డి పేరుకి విలన్గా కనిపించినా... ఆయన డైలాగ్లకు భయం కంటే ముందు నవ్వే వస్తుంది. ఆయన విలనిజంలో కామెడీ అంతర్లీనమై కితకితలు పెడుతుంది. అయితే... ఇదంతా ఒకప్పటి సంగతి. సరిగ్గా చెప్పాలంటే... ‘ప్రేమించుకుందాంరా’ సినిమా ముందు సంగతి. ఈ సినిమా తరువాత... జయప్రకాష్రెడ్డిని తెర మీదే కాదు... తెర బయట చూసి కూడా భయపడ్డారు చాలా మంది! జయప్రకాష్కు చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడడం అంటే తెగ పిచ్చి. రొటీన్గా అయితే ‘ఇదేమి పిచ్చి? చదువుకోకపోతే ఆడుక్కు తింటావు. నాటకాలు అన్నం పెట్టవు’ అనే డైలాగు కోపంగా వినిపించాలి. కానీ ఆ ఇంట్లో మాత్రం ఎలాంటి డైలాగ్ వినిపించలేదు. జయప్రకాష్రెడ్డి నాన్నగారు పోలీసు అధికారి. నటుడు కూడా. ఆయనలోని నటుడు కొడుకులోని నటుడిని ఎక్కడా నిరాశ పరచలేదు. కొడుకుతో కలిసి స్వయంగా నాటకాలు వేశాడు ఆ తండ్రి! నాటకాలు వేసినంత మాత్రాన చదువును నిర్లక్ష్యం చేయలేదు జయప్రకాష్. చదువులోనూ ముందుండేవాడు. డిగ్రీ... ఆ తరువాత టీచర్ ట్రైనింగ్... ఆ తరువాత లెక్కల మాస్టారుగా పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. అంతమాత్రాన... ఆయనలోని నటుడు ఊరుకుంటాడా? పాఠాలు పాఠాలే... నాటకాలు నాటకాలే! ఒకసారి నల్లగొండలో జయప్రకాష్రెడ్డి బృందం ‘గప్చుప్’ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్య అతిథిగా వచ్చిన దాసరి నారాయణరావుకు జయప్రకాష్ నటన బాగా నచ్చింది. ఇదే విషయాన్ని రామానాయుడుతో చెప్పారు. రామానాయుడు ఈ నాటక బృందాన్ని హైదరాబాద్కు పిలిపించుకొని ‘గప్చుప్’ చూశారు. ఆయనకు కూడా జయప్రకాష్ రెడ్డి నటన బాగా నచ్చింది. అలా జయప్రకాష్కు ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. అయితే జయప్రకాష్కు పెద్దగా పేరు రాలేదు. కెరీర్ ఊపందుకోలేదు. అటు చూస్తేనేమో... అప్పులు అంతకంతకు పెరిగి పోతున్నాయి. బాగా ఆలోచించుకున్న తరువాత... బ్యాక్ టు పెవిలియన్ అని డిసైడ్ అయ్యారు. లెక్కల మాస్టారుగా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటున్నారు. ఆ తరువాత కొద్ది కాలానికి... వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’ సినిమాకు విలన్ కోసం వెదుకుతున్నారు. బాలీవుడ్లో ఎవరైనా ఉన్నారా? అని కూడా వెదుకుతున్నారు. రామానాయుడు మాత్రం జయప్రకాష్రెడ్డి పేరు చాలా గట్టిగా సూచించారు. అప్పటికి జయప్రకాష్ స్టార్ విలన్ కాదు... ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. టైమ్ అంటే ఇదేనేమో! ‘‘పొరపాటున కూడా కామెడీ కనిపించకూడదు. ఔట్ అండ్ ఔట్ సీరియస్గా చేయాలి’’ అని చెప్పాడు డెరైక్టర్ జయంత్. సీరియస్గా కాదు... ప్రేక్షకులు వణికిపోయేలా విలనిజాన్ని ప్రదర్శించి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు జయప్రకాష్. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంత ఎత్తు, భారీ కాయం, పెద్ద మీసాలు... అమ్మో జయప్రకాష్రెడ్డి! తూ...చ్ అని తెగ నవ్వించిన జయప్రకాష్రెడ్డి ఎంత పెద్ద విలన్గా ఎదిగారు... ఎంతలా భయపెట్టారు!! -
నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ...
ఉత్తమ విలన్ గౌరీ... ఇది ఆట కాదు. జీవితం. ఏదైనా సరే... నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు. అలాంటి నన్ను ఓడించాలని చూస్తావా? నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ. పవర్ ఉంటే... అన్నీ కొట్టుకుపోతాయి. అది నాకు ఉంది కదా! ‘గుడుంబా శంకర్’ సినిమాలో కుమారస్వామి నాయుడు డైలాగ్ ఇది. ఈ నాయుడు... ఆశిష్ విద్యార్థి. నిజమే... ఆశిష్ దగ్గర పవర్ ఉంది. అది పొలిటికల్ పవర్ కాదు. కరెన్సీకి సంబంధించిన పవర్ కాదు... కలేజా పవర్! ‘నన్ను సవాల్ చేసే పాత్ర రావాలి...దాన్ని నేను సవాలు చేయాలి’ అనుకునే పవర్. ప్రాంతీయ టీవీ ఛానెళ్లలో మొదట్లో మైనర్ రోల్స్ చేసిన ఆశిష్ పెద్ద విలన్గా ఎదగడానికి ఈ పవరే కారణం. ‘ఒరేయ్ ఆనంద్... బ్రిటిష్ వాళ్లు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్లిపోయారని ఓ... ఏడుస్తుంటారు మనవాళ్లంతా. దాని పేరేమిటి? కోహినూర్ వజ్రం. ఎవరు చెప్పారురా బ్రిటిష్ వాళ్లు పట్టుకెళ్లారని? అదిగో... రోడ్ల మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్....’ అందమైన ఆడపిల్ల శ్రుతిని ఇలా కవితాత్మకంగా టీజ్ చేయడమే కాదు... ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలూ చేస్తాడు ‘పోకిరి’ సినిమాలో ఇన్స్పెక్టర్ పశుపతి(ఆశిష్). ఈ పశుపతి అంటే అందాల శ్రుతికి మాత్రమే కాదు ఆమె తమ్ముడికి, అమ్మకీ భయమే. వీళ్ల సంగతి వదిలేయండి...పెద్ద పెద్ద గూండాలే ఇతనికి భయపడతారు. పనిగట్టుకొని దుర్మార్గాన్ని అదేపనిగా పండిస్తున్నట్లుగా ఉండదు ఆశిష్ విద్యార్థి నటన. సహజంగా ఉంటుంది. ఎంత సహజంగా అంటే... తెర మీద విలన్ను చూస్తున్నట్లుగా ఉండదు. నిజజీవితంలో ఎప్పుడో, ఎక్కడో ఒక దుర్మార్గుడిని చూసినట్లుగానే ఉంటుంది. అతనిలోని ‘చెడు’ను చూస్తున్నట్లుగానే ఉంటుంది. ‘ఆశిష్ విద్యార్థి మంచి నటుడు’ అనే పేరు ఒకే ఒక సినిమాతోనో, రెండో సినిమాతోనో రాలేదు. అదొక అందమైన ప్రయాణం. ‘నటుడు అనే వాడు ఎప్పటికప్పుడు సవాళ్ల కోసం ఎదురుచూడాల్సిందే’ అంటాడు ఆశిష్. ‘ద్రోహ్కాల్’లో ‘కామ్రేడ్ భద్రా’గా తన అద్భుత నటనతో ప్రేక్షకుల మెప్పును మాత్రమే కాదు... జాతీయ అవార్డ్ను కూడా అందుకున్నాడు ఆశిష్. ‘ఒక సంతృప్తికరమైన పాత్రను పోషించాను’ అని ఫుల్లుగా సంతృప్తి పడి ఎడాపెడా పాత్రలు చేసుకుంటూ పోలేదు. తనను సవాలు చేసే పాత్రల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కానీ అతడి నిరీక్షణ ఫలించలేదు. ‘సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్’ అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి ముంబై విడిచి పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు అనుకున్నాడు. ఈలోపు ఒక పెద్ద నటుడిని కలిసి తన మనసులో బాధను చెప్పుకున్నాడు. ‘‘చేసిన పాత్రలే చేసి బోర్ కొడుతోంది’’ అన్నాడు. ‘‘ఫరావాలేదు... మొదట బోర్ కొట్టినా... ఆ తరువాత అదే అలవాటైపోతుంది’’ అన్నాడు ఆ నటుడు. ఆయన సీరియస్గా అన్నాడో, నవ్వించడానికి అన్నాడోగానీ.... ఆశిష్కు బోర్ పాత్రలు అలవాటైపోలేదు. మరింత బోర్ కలిగించాయి. ‘ఈమాత్రం దానికేనా నేను సినిమాల్లో నటించేది!’ అనుకున్నాడు. తక్షణం ముంబాయి విడిచాడు. ఒక పాత కథ ముగియలేదు. ఒక కొత్త కథ మొదలైంది... ఆకలితో ఉన్న ఆశిష్కు దక్షిణాది సినీపరిశ్రమ కడుపు నిండిపోయే ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఎలాంటి పాత్రలైతే చేయాలనుకున్నాడో అలాంటి పాత్రలు చేశాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలు. తృప్తితో కడుపు నిండే పాత్రలు. ‘బాబా’, ‘శ్రీరామ్’, ‘ఏకె-47’, ‘గుడుంబాశంకర్’, ‘నరసింహుడు’, ‘పోకిరి’, ‘చిరుత’, ‘అతిథి’, ‘తులసి’, ‘అలా మొదలైంది’, ‘కిక్-2’... మొదలైన సినిమాలు ఆశిష్కు మంచి గుర్తింపును ఇచ్చాయి. ‘‘సౌత్లో నేను పోషించిన పాత్రలు... నటుడిగా నన్ను నేను పునర్నిర్మించుకోవడానికి ఉపయోగపడ్డాయి’’ అంటాడు ఆశిష్ కృతజ్ఞత నిండిన కంఠంతో. -
అమ్మాళీ... ఎంత బొమ్మాళీ!!!! వదలా నిన్నొదలా...
ఉత్తమ విలన్ ‘అరుం.... అరుంధతా? అమ్మాళీ... ఎంత బొమ్మాళీ! పిందె పండైందే... అమ్మ బొమ్మాలే... నిన్ను చంపి ముక్కలు చేయాలని వచ్చానే. కానీ నిన్ను చంపా. ఏడు సంవత్సరాలు ఆడగాలి కరువైన ఈ పిశాచికి ఇంత అందాల బొమ్మ ఎదురుపడుతుందని నేను అనుకోలేదు’ ‘అరుంధతి’ సినిమాలో అఘోరా గొంతు నుంచి డైలాగులు వినిపిస్తున్నప్పుడు రోమాలు నొక్కబొడుచుకుంటాయి. అఘోర... ఎంత శక్తివంతమైన విలన్! ‘వాడి నాలుక మరణశాసనం. వాడి చేతులు యమపాశాలు. ఎంత బలవంతుడైనా వాడిని ఎదురించలేడు. ఏ ఆయుధమూ వాడిని సంహరించలేదు’ ‘అరుంధతి’ సినిమా కథ తయారవుతు న్నప్పుడే నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డి దృష్టిలో తమిళ నటుడు పశుపతి ఉన్నాడు. కామెడీ అయినా, కర్కశత్వమైనా... పశుపతి రామస్వామి తాను చేస్తున్న పాత్రను అద్భుతంగా పండించ గలడు. అందుకే విలన్ పేరుకు ‘పశుపతి’ అని పేరు పెట్టుకున్నాడు. ‘అఘోర’ పాత్రలో పశుపతి జీవించడం ఖాయం! కానీ... ఒక పెద్ద డౌటు వచ్చింది. ‘అరుంధతి’లో విలన్ పశుపతిగా, అఘోరగా నటించాలి. అఘోరగా పశుపతి ఓకే. మరి ‘పశుపతి’ పాత్రలో పశుపతి? నాట్ ఓకే! ‘పశుపతి’ పాత్రలో రాచరికం ఉట్టి పడాలి. రాచరికంతో కూడిన క్రౌర్యం ఉట్టిపడాలి. ఎందుకో ఆ పాత్రకు పశుపతి సరియైన ఎంపిక కాదనిపించిది.విలన్గా పశుపతి పేరు కొట్టేశాడు. విలన్ పేరును మాత్రం కొట్టేయలేదు. విలన్ పేరు పశుపతే! ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమా చూశాడు శ్యాంప్రసాద్రెడ్డి. ఆ సినిమాలో ‘కేకే’గా సోనూ సూద్ విలనిజం రెడ్డిని ఆకట్టుకుంది. అలా తన ‘అరుంధతి’ సినిమాకు విలన్గా సోనూ సూద్ను అనుకున్నాడు. అయితే పశుపతి క్యారెక్టర్ స్కెచ్లు చూసిన సోనూ సూద్ ఆ పాత్రను పెద్దగా ఇష్టపడలేదు. అయితే నిర్మాత ఆసక్తి, ఉత్సాహం చూసి నటించడానికి ఒప్పుకున్నాడు. పశపతి పాత్రకుగానూ ఛాతి, పొట్టపై మంత్రాల టాటూలు వేసుకోవాల్సి వచ్చింది సోనూ సూద్. మేకప్కు రోజూ... మూడు గంటల సమయం పట్టేది. అఘోర మేకప్ ఒక ఎత్తయితే... సోనూ నటన మరొక ఎత్తు. ‘అరుంధతి’ విడుదైన తరువాత ఎక్కడ చూసినా ‘అమ్మాళీ... బొమ్మాళీ’ డైలాగే! ‘పశుపతి’ పాత్రలో రాచరికపు అహాన్ని, ‘అఘోరా’లోని భయానకాన్ని సమానస్థాయిలో ప్రదర్శించి ప్రేక్షకలోకంలో జేజేలు అందుకున్నాడు సోనూ. ‘బెస్ట్ విలన్’గా నంది అవార్డ్ కూడా అందుకున్నాడు. పంజాబ్లోని మోగ నగరం సోనూ సూద్ స్వస్థలం. చదువుల కోసం నాగపూర్కు వచ్చిన సోనూ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్లు చేసేవాడు. ఆ సమయంలోనే సినిమాల్లో నటించాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1999లో ‘కుళ్లళగర్’ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్స్టర్గా నటించాడు. 2000 సంవత్సరంలో శివనాగేశ్వర్రావు దర్శకత్వం వహించిన ‘హ్యాండ్సప్’ అనే సినిమాలో నటించాడు. బాలీవుడ్ సినిమాల్లో నటించాలని కలలు కన్న సోనూకు ఆ కల అంత తొందరగా నెరవేరలేదు. 2002లో మాత్రం ‘షాహీద్-ఏ-ఆజామ్’ అనే బాలీవుడ్ సినిమాలో భగత్సింగ్ పాత్ర పోషించే అవకాశం లభించింది. మణిరత్నం ‘యువ’ సినిమాలో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. ‘సూపర్’ సినిమాలో హైటెక్-రాబర్ సోనూ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సోనూ సూద్. తెలుగులో ‘అరుంధతి’ ఆయన విలనిజాన్ని తారస్థాయికి తీసుకెళితే, ‘దబాంగ్’లో చేడిసింగ్ పాత్రతో విలనిజంలో ఎంత భిన్నత్వాన్ని చూపవచ్చో నిరూపించాడు సోనూ సూద్. నట విద్యాలయంలో సోనూ సూద్ చదువుకుంది నెలరోజులు మాత్రమే... అయితే కెమెరా మాత్రం అతడికి సంవత్సరాలకు సరిపడేంత పాఠాలు నేర్పింది. అందుకే.. సోనూ సూద్ అనే పేరు వినబడగానే స్పందనగా ‘ఉత్తమ విలన్’ అనే మాట కూడా వినబడుతుంది. -
రావత్... వెండితెర రావణ్!
ఉత్తమ విలన్ కొన్ని సంఘటనలు ‘చిత్రం’గా జరుగుతాయి. సూచనప్రాయంగా కూడా చెప్పకుండా జరుగుతాయి. ‘ప్రదీప్ రావత్ ఎవరు?’ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కాస్తో కూస్తో ఆలోచించవచ్చుగానీ...మన తెలుగు వాళ్లు మాత్రం టకీమని చెబుతారు. వీలైతే అతని డైలాగును ఒకసారి ఇలా గుర్తుతెచ్చుకుంటారు. ‘ఒక్క ముక్క చెప్పి ఉండాలి. చెప్పలే. అంటే...లెక్కలే! నేనంటే లెక్కలేని వాన్ని నా లెక్కలో ఉంచడం ఇష్టం లేదు’ రాజమౌళి ‘సై’ సినిమాకు ఒక విలన్ కావాలి. ఆషామాషీ విలన్ కాదు. గట్టి విలన్ కావాలి. సినిమా విజయానికి విలనే కీలకం! అందుకే రాజమౌళి విలన్ల వేటలో ఉన్నాడు. ఎందరినో... స్క్రీన్టెస్ట్, అడిషన్ టెస్టులు చేస్తున్నాడు. కానీ ఎవరూ నచ్చడం లేదు. దీంతో ‘నాకో మాంచి విలన్ కావాలి’ అంటూ తన అసిస్టెంట్ను ముంబైకి పంపించాడు. ఆ అసిస్టెంట్ ఎక్కడెక్కడ తిరిగాడోగానీ ఆరోజు అమీర్ఖాన్ ‘లగాన్’ సినిమా చూద్దామని డిసైడైపోయాడు. అతను అలా డిసైడై ఉండకపోతే....ప్రదీప్ రావత్ ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. మనకు ఒక ఉత్తమ విలన్ తెర మీద పరిచయమయ్యేవాడు కాదు! ‘లగాన్’ సినిమాకు కృతజ్ఞతలు. ‘లగాన్’లో దేవా అనే సర్దార్ పాత్ర పోషించాడు రావత్. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పట్టణంలోని యు.సి.ఒ. బ్యాంకులో కొంత కాలం పని చేసిన ప్రదీప్ రామ్సింగ్ రావత్ ‘మహాభారత్’ టీవీ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘యుగ్’ టీవీ సీరియల్లో బ్రిటీష్ ఇన్స్పెక్టర్గా, ‘సర్ఫ్రోష్’ సినిమాలో ‘సుల్తాన్’గా నటించాడు. మళ్లీ ‘లగాన్’ దగ్గరకు వద్దాం. ‘లగాన్’లో దేవా దూకుడు రాజమౌళి అసిస్టెంట్కు బాగా నచ్చింది. ‘నేను వెదుకుతున్న విలన్ ఇతడే’ అనుకున్నాడు. రావత్ను సంప్రదించాడు. సౌత్ సినిమాలలో నటించడానికి విముఖంగా లేడుగానీ తనలో చిన్న సందేహం... ‘‘నాకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. భాష రాకపోతే బొమ్మలా నటించాల్సిందే...’’ అయితే ఈ సందేహాన్ని పక్కన పెట్టి అడిషన్ టెస్ట్కు హాజరయ్యాడు. ఓకే అనిపించుకున్నాడు. అలా తెలుగు వెండితెరపై బిక్షు యాదవ్గా అలరించాడు. నోటిలో పెద్ద చుట్ట. ముక్కుకు రింగు. కాటుక కళ్లు. పే...ద్ద మీసాలు. నాలుక మడతెట్టి వార్నింగ్ ఇచ్చే మ్యానరిజం... చూసీ చూడగానే తెలుగు ప్రేక్షకలోకానికి చేరవయ్యాడు రావత్. ఆ తరువాత... ‘భద్ర’లో వీరయ్య, ‘అందరివాడు’లో సత్తి బిహారి, ‘ఛత్రపతి’లో రాస్ బిహారి, ‘దేశముదురు’లో తంబిదురై, ‘యోగి’లో నరసింహ పహిల్వాన్, ‘జగడం’లో మాణిక్యం... ఇలా ఎన్నో పేర్లతో ఉత్తమ విలన్గా స్థిరపడ్డాడు రావత్. ఇక ‘గజినీ’ సినిమాలో రావత్ చెడ్డ విలనిజానికి మంచి పేరు వచ్చింది. రామ్-లక్షణ్గా సౌత్లో, ధర్మాత్మగా నార్త్లో ఆయన విలనిజానికి బోలెడు ‘చెడ్డ’ పేరు వచ్చింది. ‘‘బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటించకపోవడానికి కారణం ఏమిటి?’’ అనే ప్రశ్నకు- ‘‘అవకాశాలు రాకపోవడమే’’ అని చెప్పే రావత్ తనకు అవకాశం ఇచ్చిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ‘ఉత్తమ విలన్’గా గట్టి పేరు సంపాదించుకున్నాడు. ‘లగాన్’లో దేవ పాత్ర ముఖేష్ రుషి చేయాల్సింది. అయితే డేట్స్ సమస్య వల్ల ఆ పాత్రను ముఖేష్ వదులుకోవాల్సి వచ్చింది. ఆ అవకాశం రావత్కు వచ్చింది. ‘లగాన్’లో సర్దార్జీ పాత్ర ముఖేష్ చేసి ఉంటే....రావత్ ‘లగాన్’లో నటించేవాడు కాదు. ‘లగాన్’లో నటించకపోతే...రాజమౌళి దృష్టిలో పడి ఉండేవాడు కాదు. రాజమౌళి దృష్టిలో పడి ఉండకపోతే... సౌత్లో స్టార్ విలన్గా పేరుతెచ్చుకొని ఉండేవాడు కాదు... ఎంత చిత్రం! -
సినిమా ఆలస్యంగా విడుదలైతే....
చెన్నై: ఏ సినిమా అయినా ముందుగా ప్రకటించిన తేదీకీ విడుదల కాకపోతే కలెక్షన్లపై ఆ ప్రభావం బాగా పడుతోంది. ప్రముఖ నటుడు, నిర్మాత కమల్హాసన్ నిర్మించిన 'ఉత్తమ విలన్' చిత్రం విషయంలో అది స్పష్టమైంది. ప్రకటించిన తేదీకి విడుల కాకపోవడం వల్లే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిందని సినిమా వ్యాపార వర్గాల అభిప్రాయం. ఉత్తమ విలన్ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉండేవి. కలెక్షన్ల వసూలులో రికార్డు సృష్టిస్తుందని భావించారు. మొదటి రోజు కలెక్షన్ పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనావేశారు. అయితే సినిమా నిర్మాతలకు, ఫైనాన్సర్లకు మధ్య తలెత్తిన కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఈ చిత్రం మే 1న విడుదల కాలేదు. మే 2న విడుదలైంది. ఒక రోజు ఆలస్యంగా విడుదలవడం వల్ల పెద్ద దెబ్బే తగిలింది. అనుకున్న కలెక్షన్లు రాలేదు. సాధారణంగా పెద్ద హీరోల చిత్రాలు మొదటి వారంలోనే కలెక్షన్లు అధికంగా రాబడతాయి. ఉత్తమ విలన్ విడుదలై రెండు వారాలైనా పెద్దగా టాక్ రాలేదు. మల్టీఫ్లెక్స్ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు. బీ, సీ సెంటర్లలో ఓ మోస్తరు స్పందన మాత్రమే కనిపిస్తోంది. సినిమా విడుదల ఆలస్యం అయితే ఆర్థికంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందనేది స్పష్టమవుతోంది. -
ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా
అచంచలమైన ఆత్మస్థైర్యంగల నటి ఆండ్రియా సొంతం. ఎవరో ఏదో అనుకుంటారని తన వ్యక్తిత్వానికి అతీతంగా నడుచుకునే స్త్రీకాదు. ముక్కుసూటి ప్రవర్తన ఈమె నైజం. బహుముఖ ప్రజ్ఞ ఇందుకు ఒక కారణం కావచ్చు. మలయాళ యువ నటుడితో ప్రేమ వ్యవహారం, యువ సంగీత దర్శకుడితో రొమాన్స్ అంటూ...కోరుకున్న జీవితాన్ని అనుభవించే ఆండ్రియా ఎప్పటికీ సంచలన తారనే. ఒక్కసారి నటిస్తే చాలని ఆశించే చాలామందికి హీరోయిన్లు మధ్య విశ్వనాయకుడు కమలహాసన్ సరసన మూడుసార్లు నటించే లక్ను దక్కించుకున్న ఆండ్రియాతో చిన్న భేటీ... ప్రశ్న: నటుడు కమలహాసన్తో వరుసగా చిత్రాలు చేశారు. ఆయన నుంచి ఏమి నేర్చుకున్నారు? జవాబు: ఒక్కో చిత్రంలో నేనాయన నుంచి చాలా నేర్చుకున్నాను. కమలహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. నేను సినీరంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో కమలహాసన్ సరసన నటించే అవకాశం వస్తే అది ఒక్క సీన్ అయినా ఒప్పేసుకుని నటించమని ఒక దర్శకుడు సలహా ఇచ్చారు. అయితే కమలహాసన్ చిత్రాల్లో ఒక్క సన్నివేశంలో నటించినా అది అద్భుతంగా ఉంటుంది. అందువలన ఆయన అవకాశం ఇస్తే ఎలాంటి సందేహం లేకుండా ఎస్ అంటాను. ప్రశ్న: మీలో మంచి గాయని ఉన్నారు. చాలా చిత్రాల్లో పాడారు. అలాంటిది ఉత్తమ విలన్ చిత్రంలో పాడలేదే? జవాబు: మీరు చాలా చిత్రాల్లో పాడారు. ఈ చిత్రంలో వద్దు అని కమల్ అన్నారు. ఆయనే అలా అంటే నేనెలా పాడగలను. ప్రశ్న: ఏ విషయాల ప్రాతిపదికపై చిత్రాలు ఎంపిక చేసుకుంటారు? జవాబు: మొదట చిత్రానికి పని చేసే టీమ్ ఎవరన్నది తెలుసుకుంటాను. ఆ తరువాత చిత్ర కథ ఏమిటి? అందులో పాత్ర సంతృప్తికరంగా ఉందా? అన్న విషయాలపై దృష్టి సారిస్తాను. అలాగే చిత్రానికి దర్శకుడు ఎవరన్నది చూస్తాను. ప్రశ్న : సినిమా గురించి అర్థం చేసుకుంది? జవాబు: నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నాకేమి అర్థం కాలేదు. షూటింగ్ స్పాట్లో నా పాత్ర చిత్రీకరణ పూర్తి అయితే చాలు అక్కడ నుంచి వెళ్లిపోతాను. ఆ తరువాత నాకంటూ ఒక చిన్న జీవితం ఉంది. అంతేకాని పుస్తకాలు చదువుతాను లాంటి కాకమ్మ కథలు చెప్పను. నాకు సంబంధించినంతవరకు నటన అనేది ఒక వృత్తి అంతే. ప్రశ్న: ఎలాంటి చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నారు? జవాబు: మణిరత్నం చిత్రాల్లాంటి పూర్తి ప్రేమ కథా చిత్రాల్లో నటించాలనుంది. నేనింత వరకు అలాంటి చిత్రం ఒక్కటి చేయలేదు. ప్రశ్న: ఏ భాషల్లో నచ్చిన పాత్రలు లభిస్తున్నాయి. జవాబు: కరెక్ట్గా చెప్పాలంటే మలయాళంలో గ్లామర్ పాత్రలే చేయాలని ఒత్తిడి చేయరు. అదే విధంగా తెలుగులోనూ మంచి ఆదరణ, గౌరవం లభిస్తోంది. అలాంటి చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉంది. ప్రశ్న: మీ గురించి తరచూ వదంతులు ప్రచారం అవుతున్నాయి. బాధగా లేదా? జవాబు: మొదట్లో కొంచెం బాధనిపించేది. ప్రస్తుతం అలాంటి వదంతులు తగ్గాయిలెండి. ప్రశ్న: ప్రస్తుతం కథానాయికుల పరిస్థితి? జవాబు: నిజం చెప్పాలంటే తమిళంలో సీనియర్ కథానాయికల గురించి నాకు తెలియదు గాని ఇప్పుడు భారతీయ సినిమాలో హీరోయిన్ల వయసు పెరుగుతున్న కొద్దీ ప్రాధాన్యత తగ్గుతూ పోతుంది. హాలీవుడ్లో అలా కాదు. అక్కడ వయసు పెరుగుతున్న కొద్ది గిరాకీ పెరుగుతుంది. -
పోలీస్గా కమల్..?
‘ఉత్తమ విలన్’ తర్వాత కమల్హాసన్ నటించబోయే సినిమా మీద చాలా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా తెలిసిన వార్త ఏంటంటే లోకనాయకుడు కమల్హాసన్ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు వినికిడి. ఈ సినిమా కోసం ఇప్పటికే కమల్హాసన్ కసరత్తులు మొదలుపెట్టారట. ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్ ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. -
ఉత్త రిలీజులు
మే 1వ తేదీ... శుక్రవారం. ఉదయం 8.30 గంటలు... హైదరాబాద్లోని ప్రసాద్ ఐ-మ్యాక్స్ ప్రాంగణం... గుంపులుగా జనం... హీరో కమల్హాసన్ ‘ఉత్తమ విలన్’ను చూడడానికి ఉదయాన్నే సిద్ధమై వచ్చిన జనం... తమిళనాట వసూళ్ళ వర్షం కురిపిస్తూ... తెలుగులోకి లేట్ రిలీజైన లారెన్స్ ‘గంగ’ చూడాలని ఆసక్తిగా వచ్చిన ఆడియన్స్! తెలుగువాళ్ళు... తమిళులు... మలయాళీలు... భాషాభేదాలు లేకుండా సినిమా ఏకం చేసిన దాదాపు వెయ్యిమంది! ఎవరికి వారు పక్కవాళ్ళను విషయం అడుగుతూ, ఫోనుల్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. ‘సినిమా రాలేదట!’... ‘పడం వరలా’... ‘ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్!’... లాంగ్వేజ్ ఏదైనా డిస్కషన్ ఒకటే! ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని వచ్చినా, రీళ్ళ బాక్సులు (ఇప్పుడన్నీ డిజిటల్ ప్రింట్లే కాబట్టి, డిజిటల్ కోడ్లు) రాలేదని నిరుత్సాహం! ఒక్క హైదరాబాద్లోనే కాదు... తెలుగునేల అంతటా ఆ రోజు మధ్యాహ్నానికి కానీ, తెరపై ‘గంగ’ బొమ్మ పడలేదు. తెలుగుతో పాటు తమిళనేల మీదా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొన్న ‘ఉత్తమ విలన్’ అయితే శనివారం మధ్యాహ్నం తరువాత కానీ, ప్రేక్షకుల్ని పలకరించలేదు. ఇన్ని కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాలు... అదీ పేరున్న పెద్దవాళ్ళ సినిమాలు కూడా ఆఖరు క్షణంలో రిలీజ్ ఎందుకు ఆగినట్లు? సినిమాలు బాగున్నా - ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే...? సినిమా కష్టాలు... సినిమా రిలీజ్కు ముందు సవాలక్ష కష్టాలు... పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్కు తగ్గట్లు బిజినెస్ జరగడం లేదు! ఫలానా ఏరియాను ఫలానా మొత్తానికి కొంటామన్న బయ్యర్లు ఆఖరు క్షణంలో... అనుకున్న మొత్తం కన్నా తక్కువ డబ్బే తెస్తున్నారు! తమకు చెల్లించాల్సిన పాత ఫ్లాప్ సినిమాల అప్పుల సంగతేంటో తేల్చమంటూ నిర్మాతల మీద పడే ఫైనాన్షియర్లు! వెరసి ఒక సినిమా ఎంత ఖర్చుతో తీస్తున్నామనే దాని కన్నా, ఎంత సులువుగా రిలీజ్ చేసుకుంటామనేది సమస్యగా మారింది. ఈ కష్టాల కథేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా సినీ వ్యాపారం ఏమిటో తెలుసుకోవాలి. అది ఏమిటంటే... గతంలో సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన - ఈ మూడు సెక్టార్ల కలెక్టివ్ రెస్పాన్స్బిలిటీ. సినిమా అంటే నిర్మాత, దర్శకుడు ఒక కథ అనుకొని, ప్రయత్నాలు మొదలుపెట్టేవారు. నిర్మాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాడు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లే కింగ్ మేకర్లు. చిత్ర నిర్మాణానికి డబ్బు వాళ్ళ నుంచి అందేది. ఆ మనీతో సినిమా తయారయ్యేది. పంపి ణీకి డిస్ట్రిబ్యూటర్లు... అద్దె లేదా నెట్ కలెక్షన్లలో పర్సంటేజ్ మీద తమ హాలులో సినిమా వేయడానికి ఎగ్జిబిటర్లు రెడీ. కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతల మధ్య పంపిణీ అయ్యేది. సినిమా ఆడక తేడా వస్తే, అప్పటికి ఆ నష్టం డిస్ట్రిబ్యూటర్ భరించేవాడు. సదరు దర్శక, నిర్మాతల తరువాతి సినిమాలో ఎడ్జస్ట్ చేసేవాడు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. రిలీజ్ ముందు నిద్ర లేని రాత్రులు! డిస్ట్రిబ్యూటర్ల సిస్టమ్ పోయి, బయ్యర్లు వచ్చాక రిస్క్ ఫ్యాక్టరూ పెరిగింది. నిర్మాతలు క్రేజీ కాంబినేషన్స్ మాత్రం సెట్ చేసుకొంటారు. మినిమమ్ ఇన్వెస్ట్మెంట్తో సినిమా స్టార్ట్ చేస్తారు. పదుల కోట్లు ఫైనాన్షియర్స్ నుంచి వడ్డీకి తెస్తారు. సినిమా సిద్ధమయ్యేవేళలో బయ్యర్లు క్రేజీ ఆఫర్లతో వస్తారు. కానీ, సినిమా కాస్త తేడాగా ఉందని ఏ మాత్రం ఉప్పందినా... వెంటనే ప్లేటు ఫిరాయిస్తారు. అనుకున్న దాని కన్నా తక్కువ రేటే ఇస్తారు. ఫలితం - నిర్మాతకు ఆశించిన బిజినెస్ కావడం లేదు. ఇప్పటికి ఈ సినిమా వరకు ప్రాఫిట్కే అమ్మినా, గత సినిమాలపై పేరుకున్న అప్పులు నిర్మాతను భూతంలా వెంటాడి వేధిస్త్తుంటాయి. ఉదాహరణకు, ఒక నవ యువ సామ్రాట్ మూడక్షరాల సినిమా ఏప్రిల్ చివరి వారంలో రూ. 10 కోట్ల దాకా బిజినెస్ కావాల్సింది. లాస్ట్మినిట్లో బయ్యర్లు 25 శాతం తగ్గించి, కట్టారు. వ్యాపారం తగ్గినా, నిర్మాత విధి లేక సినిమా రిలీజ్ చేశారు. ఇక, గత చిత్రాల లాస్లు తడిసి మోపెడై, నిర్మాత బెల్లంకొండ సురేశ్ను ‘గంగ’ రిలీజ్లో ఇబ్బంది పెట్టాయి. ‘ఉత్తమ విలన్’ను సమర్పిస్తున్న తిరుపతి బ్రదర్స్కు పాత ఫ్లాప్ ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) తాలూకు అప్పులు ఇప్పుడడ్డుపడ్డాయి. ‘‘అక్కడెవరో తీసిన సినిమాను ఇక్కడ నుంచి వెళ్ళి ఎగబడి కొంటున్నప్పుడు, వాళ్ళకున్న పాత అప్పులేంటో మనకు తెలీదుగా! చివరకు మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని, తమిళ, తెలుగు వెర్షన్ల నిర్మాతలు, సినీ సంఘాలు శ్రమిస్తే కానీ ‘ఉత్తమ విలన్’ ఒకటిన్నర రోజులు ఆలస్యంగా మన దేశంలో విడుదల కాలేకపోయింది’’ అని ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. నిజానికి, ఇలా ఒక పెద్ద సినిమా రిలీజ్ ఒక్క రోజు ఆలస్యమైనా ఆ సినిమాకొచ్చే మొత్తం రెవెన్యూలో 20 నుంచి 25 శాతం మేర నష్టపోవాల్సి వస్తుంది. ఇక, ఆ రోజున సినిమా థియేటర్లో సైకిల్ స్టాండ్ మొదలు ఇతర అనుబంధ వ్యాపారాలకు కలిగే లాస్ దీనికి అదనం. నిజానికి, ఇది ఒక రోజుకో... ఒక సినిమాకో... పరిమితమైన సమస్య కాదు. కలెక్షన్స్లో ఇండస్ట్రీ హిట్ పవన్కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లాంటి బడా సినిమాల మొదలు ఛోటా నటుల చిన్న సినిమాల దాకా ఇదే పరిస్థితి. సినిమాల రిలీజ్ ముందు రోజు రాత్రి ల్యాబుల్లో, స్టార్ హోటళ్లలో ప్రైవేట్ ‘పంచాయతీ’లు మామూలే. కాకపోతే, కొన్ని బయటకొస్తాయి. చాలా మటుకు సినీ వ్యాపార వర్గాల ‘రహస్యాలు’గా మిగిలిపోతాయి. ‘‘ఇవాళ రెమ్యూనరేషన్స్తో సహా నిర్మాణవ్యయం 40 శాతం పెరిగింది. అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల పర్చేజింగ్ పవర్ 30 నుంచి 40 శాతం తగ్గింది. వెరసి సినిమా వ్యాపారానికి 70 - 80 శాతం బొక్క పడింది’’ అని గుంటూరు డిస్ట్రిబ్యూటర్, చిత్ర నిర్మాణంలో అనుభవమున్న కొమ్మినేని వెంకటేశ్వరరావు వివరించారు. ఇలా కాస్ట్ పెరిగి, బిజినెస్ తగ్గి, పాత అప్పుల భారం తీరే మార్గంలేక, నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. సినిమాల రిలీజ్లు లాస్ట్మినిట్లో లేట్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి ఇప్పుడో హిట్ కావాలి! కోట్ల ఖర్చుతో సినిమా తీసిన నిర్మాత... కోట్లు పారితోషికం తీసుకొనే హీరో... తెర ముందు కనిపించే షో ఇది. ఈ షోకు తెర వెనుక ఆర్థిక సూత్రధారులుగా ఫైనాన్షియర్లు, బయ్యర్లు, వీళ్ళకు డబ్బులు సమీకరించే ఎగ్జిబిటర్లు... సినిమా బిజినెస్ గ్లామర్ దీపం చుట్టూ శలభాలు. గత అయిదు నెలలుగా అన్నీ నష్టాలవడంతో బయ్యర్ల మొదలు ఫైనాన్షియర్స్ దాకా ఎవరికీ ఇప్పుడు చేతిలో డబ్బు ఆడని పరిస్థితి. ‘‘తక్షణమే కనీసం ఒక్క పెద్ద హిట్ రావాలి. అప్పుడు కానీ, డబ్బులు పెట్టే ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ఈ ఫైనాన్షియల్ స్లంప్ నుంచి తేరుకోలేరు’’ అని ప్రస్తుతం రిలీజ్కు సిద్ధమవుతున్న ‘లయన్’ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు అన్నారు. ‘‘మన దగ్గర రిలీజ్ ప్లానింగ్ లేదు. బయ్యర్ల నుంచి వస్తున్నదెంత, ఫైనాన్షియర్లకు తీర్చాల్సిన అప్పుల రూపంలో పోయేదెంత అనే లెక్క చూసుకోవడం లేదు. ఇవన్నీ సరిదిద్దుకోవాలి. నిర్మాతలంతా కూర్చొని, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి’’ అని సునీల్ నారంగ్ సూచించారు. అవును... అది నిజం. ఒకప్పుడు సినిమా... కేవలం కళ! ఆ తరువాత.... కళాత్మక వ్యాపారం! మరి ఇప్పుడు కాసుల చుట్టూ తిరిగే వ్యాపార కళ!! ఈ పరిస్థితుల్లో సినిమా బిజినెస్ ప్రతి వారం టేబుల్స్ టర్న్ చేసే చిత్రమైన ‘ధందా’! ఈ వ్యాపారంలో ఆర్థిక కష్టాలను తట్టుకొని, హాలులోని జనం దాకా సినిమా రావడం... ప్రతి శుక్రవారం ఒక సెల్యులాయిడ్ సిజేరియన్ డెలివరీ! - రెంటాల జయదేవ నష్టాల్లో... అయిదు నెలలు ‘డిసెంబర్ నుంచి ఈ 5 నెలల్లో తెలుగులో వచ్చిన సినిమాల్లో నికరంగా డబ్బులు చేసుకున్నది ఒక్కటీ లేదు. కల్యాణ్రామ్ ‘పటాస్’ ఒక్కటే రీజనబుల్గా పే చేసింది. పెద్ద స్టార్ల ‘లింగ’, ‘గోపాల గోపాల’ నుంచి లేటెస్ట్ సమ్మర్ రిలీజ్ల దాకా అన్నీ లాసే. బయ్యర్లను పోటు పొడిచినవే.’’ - సుధాకర్ నాయుడు, ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్ అధినేత - బయ్యర్, కర్నూలు ‘‘తమిళనాట ఎవరో తీస్తున్న సినిమాను మనం ఎగబడి వెళ్ళి కొనుక్కోవడంలో ఎంత ఇబ్బంది ఉందో అర్థమైంది. అక్కడ వాళ్ళకున్న అప్పులేమిటో తెలియదుగా! 53 సినిమాలు నిర్మించినా రిలీజ్ డేట్ నాడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు 54వ సినిమా ‘ఉత్తమ విలన్’కు తొలిసారి అది నాకు అనుభవమైంది.’’ - సి. కల్యాణ్ ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేటెస్టయినా లేట్గా వచ్చిన కొన్ని! శంకర్ - విక్రమ్ల ‘ఐ’ నాని నటించిన ‘జెండా పై కపిరాజు’ వై.వి.ఎస్. - సాయిధరమ్ తేజ్ల ‘రేయ్’ కమలహాసన్ ‘ఉత్తమ విలన్’ లారెన్స్ ‘గంగ’ షూటింగ్ ఫినిష్! రిలీజ్కే వెయిటింగ్!! నితిన్ ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ కమల్ దర్శకత్వంలోని ‘విశ్వరూపమ్ 2’ రాజశేఖర్ నటించిన ‘వందకు వంద’ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ‘పట్టపగలు’ ....................................................................... సెన్సారైంది..! రిలీజ్ ఆగింది! విజయశాంతి నటించిన ‘శివాని’ రాఘవేంద్రరావు ‘ఇంటింటా అన్నమయ్య’ -
ఏ హీరో ఇలా చేయలేదు!
‘‘మే 1న విడుదల కావాల్సిన చిత్రం ఇది. కానీ, అది జరగలేదు. విడుదలకు ముందు మూడు రోజుల పాటు పోరాడాం. చివరికి శనివారం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలిగాం’’అని నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు. కమల్హాసన్ హీరోగా రమేశ్ అరవింద్ దర్శక త్వం వహించిన చిత్రం ‘ఉత్తమ విలన్’. సి.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘విడుదలలో జాప్యం జరిగినా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఏ హీరో చేయని కేరెక్టర్ చేసి కమల్ ప్రేక్షకులను మెప్పించారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుమార్బాబు, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ విలన్కు తొలగిన అడ్డంకులు
టీనగర్:ఉత్తమ విలన్ చిత్రానికి అడ్డంకులు తొలగినట్లు దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్కుమార్, దర్శకుడు, నిర్మాత లింగుసామి తెలిపారు. నటుడు కమలహాసన్, దివంగత దర్శకుడు కె.బాలచందర్, పూజాకుమార్, ఆండ్రియా నటించిన చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రాన్ని లింగుసామి తిరుపతి పిక్చర్స్, కమల్హాసన్ రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. మొదట్లో ఉత్తమ విలన్ మే ఒకటవ తేదీన విడుదల కానున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారమే తెరపైకి వచ్చింది. అయితే తమిళనాడులో చిత్రం విడుదలకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో చిత్రం కోసం ఆసక్తితో ఎదురు చూసిన అభిమానులు నిరాశకు గురయ్యారు. రిజర్వేషన్ చేసుకున్న టికెట్ల సొమ్మును థియేటర్ల యజమానులు తిరిగి చెల్లించారు. ఈ చిత్రం కోసం నిర్మాతలు తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడమే చిత్రం విడుదలలో చిక్కులు ఏర్పడినట్లు సమాచారం. ఇలావుండగా దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్కుమార్, లింగుసామి శనివారం విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ విలన్ చిత్రానికి వ్యాపార రీత్యా ఏర్పడిన కొన్ని సమస్యలతో విడుదలకు జాప్యం జరిగిందన్నారు.చిత్రం విడుదలలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. చిత్రం విడుదలలో జాప్యానికి లింగుసామి క్షమాపణ కోరారు. 27 గంటల చర్చల తర్వాత ఈ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయన్నారు. ఈ చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు అరుళ్పతి, అన్బు సెలియన్ పాల్గొన్నారు. -
ఉత్తమ విలన్కు లైన్ క్లియర్
హైదరాబాద్ : ఎట్టకేలకు 'ఉత్తమ విలన్' చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయింది. నిర్మాత లింగుస్వామి, జ్ఞాన్వేల్ రాజాకు ఒప్పందం కుదిరింది. దాంతో శనివారం మధ్యాహ్నం1500 థియేటర్లలో మ్యాట్నీ నుంచి అన్ని భాషల్లో విడుదల కానుంది. కమల్ హీరోగా, ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్లుగా నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమ విలన్ సినిమా రూపుదిద్దుకుంది. ప్రముఖ నిర్మాత లింగుస్వామి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఈ సినిమా శుక్రవారమే దేశవ్యాప్తంగా విడుదల కావల్సి ఉండగా, వివాదం నేపథ్యంలో రిలీజ్ నిలిచిపోయింది. -
'ఉత్తమ విలన్' విడుదలపై తొలగని సందిగ్థత
హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్ హసన్ నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం విడుదలపై ఇంకా సందిగ్థత తొలగలేదు. శనివారం ఈ చిత్రం విడుదల అవుతుందని అన్నారు. కానీ ఇంకా విడుదల కాలేదు. ఈ రోజు మ్యాట్నీ సమయానికి ఉత్తమ విలన్ విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. తన వద్ద తీసుకున్న అప్పును చెల్లించకుండా 'ఉత్తమ విలన్' చిత్రం విడుదల చేసేందుకు వీల్లేకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ చెన్నై వలసరవాక్కంకు చెందిన తంగరాజ్ మద్రాసు హైకోర్టులో గత నెల పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఈ చిత్రం విడుదల బ్రేకు పడింది. ఉత్తమ విలన్ చిత్రం ఆది నుంచి వివాదాల మయమైంది. ఈ సినిమాలో కమల్ విచిత్ర వేషధారణ ఒక హాలీవుడ్ చిత్రం నుంచి కాపీ కొట్టారని ఫొటోలు సహా ప్రచురితమైనాయి. పుదియ తమిళగం కట్చి అధ్యక్షులు కృష్ణస్వామి సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. హిందూ దేవుళ్లను చిత్రంలో కించపరిచారంటూ కొన్ని హిందూ సంస్థల కార్యకర్తలు కమల్ ఫొటోలను తగులబెట్టి ఆందోళన నిర్వహించారు. అయితే వీటన్నింటినీ అధిగమించి ఉత్తమ విలన్ విడుదలకు సిద్ధమైనా అప్పు వ్యవహారంతో బ్రేక్ పడింది. అయితే కమల్ హసన్ ఉత్తమ్ విలన్ ఎప్పుడు విడుదల అవుతందా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
‘ఉత్తమ విలన్’కు బ్రేక్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉలగనాయకన్ కమలహాసన్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన ఉత్తమవిలన్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. కమల్ హీరోగా, ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్లుగా నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమ విలన్ సినిమా రూపుదిద్దుకుంది. ప్రముఖ నిర్మాత లింగుస్వామి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సెన్సార్ సర్టిఫికెట్ తదితర అన్ని హంగులు పూర్తిచేసుకుని శుక్రవారం (మే1న) రాష్ట్రవ్యాప్తంగా 400 థియేటర్లలో సినిమా రిలీజ్కు సన్నాహాలు పూర్తిచేశారు. వాల్పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా భారీ పబ్లిసిటీ ఇచ్చారు. విదేశాల్లో సైతం సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితం అన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. మూడురోజుల వరకు అన్నిషోలు ఫుల్ అయ్యా యి. శుక్రవారం ఉదయం 7 గంటలకే ప్రత్యేక షో ద్వారా అభిమానులను అలరించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధం కాగా పెద్ద సంఖ్యలో కమల్ ఫ్యాన్స్ తరలివచ్చారు. మేడే సందర్భంగా సెలవు కావడంతో సాధారణ ప్రజానీకం సైతం థియేటర్ల ముందు క్యూకట్టారు. అయితే ఇంతలో సినిమా విడుదల రద్దయినట్లు థియేటర్ల ముందు అకస్మాత్తుగా బోర్డు ప్రత్యక్షమైంది. ఉదయం 6 గంటల నుంచే థియేటర్ల ముందు పడిగాపులు కాసిన అభిమానులు ఈ పరిణామంతో ఖిన్నులైనారు. అడ్వాన్సు బుకింగ్ చేసుకున్న కమల్ అభిమానులు థియేటర్ల ముందు ఆందోళన జరిపారు. వేలాచ్చేరి ఫినిక్స్మాల్ లోని మొత్తం 9 థియేటర్లు ఉత్తమ విలన్ ప్రదర్శనకు సిద్ధంకాగా నాలుగు గంటలపాటూ ఎదురుచూసిన కమల్ అభిమానులు సినిమా వేస్తారా... వెయ్యరా అంటూ యాజమాన్యంతో వాదనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పారు. ఇదే టికెట్టుపై శనివారం రాత్రి 7 గంటల షోకు సినిమాను చూడవచ్చని యాజమాన్యం నచ్చచెప్పడంతో అభిమానులు వెనుదిరిగారు. ఉత్తమవిలన్ చిత్రం విదేశాల్లో విడుదలై సమీక్షలు సైతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. హైకోర్టులో ఫైనాన్షియర్ పిటిషన్: తన వద్ద తీసుకున్న అప్పును చెల్లించకుండా సినిమా విడుదల చేసేందుకు వీల్లేకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ చెన్నై వలసరవాక్కంకు చెందిన తంగరాజ్ మద్రాసు హైకోర్టులో గత నెల పిటిషన్ దాఖలు చేశాడు. అందులో...తంగం సినిమాస్ అనే కంపెనీలో తాను భాగస్వామిగా ఉన్నానని, తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా సంస్థ ఎగ్జిక్యుటీవ్ డెరైక్టర్గా ఎన్ లింగుస్వామి, డెరైక్టర్గా సుభాష్ చంద్రబోస్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. కమల్హాసన్ కథానాయకునిగా ఉత్తమవిలన్ చిత్ర నిర్మాణం కోసం వీరిద్దరూ తన వద్ద రూ.2 కోట్లు అప్పుగా తీసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏడాదికి 12 శాతం వడ్డిని సినిమా రిలీజుకు ముందు చెల్లించాలని, సినిమా కాపీహక్కులు, చెంగల్పట్టు ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తనకు అందజేయాలని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందానికి భిన్నంగా సినిమా హక్కులు వేరే సంస్థకు కట్టబెట్టాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని పిటిషన్లో తెలిపారు. కాబట్టి తనవద్ద అప్పుగా తీసుకున్న రూ.2 కోట్లను వడ్డీ రూపేణా రూ.22 లక్షలను చెల్లించేవరకు ఉత్తమ విలన్ సినిమా మే 1వ తేదీన విడుదల చేయకుండా స్టే మంజూరు చేయాలని ఆ పిటిషన్లో కోర్టును కోరారు. ఈ పిటిషన్ గత నెల 24వ తేదీన న్యాయమూర్తి కే రవిచంద్రబాబు ముందు విచారణకు రాగా, సినిమా రిలీజుకు ముందు పిటిషన్దారునికి అప్పు సొమ్ము చెల్లిస్తామని లింగుస్వామి తరపు న్యాయవాది తెలిపాడు. 29వ తేదీన మరోసారి పిటిషన్దారుడు కోర్టుకు హాజరై లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ తనకు చెక్కు రూపేణా ఇచ్చారని అభ్యంతరం లేవనెత్తాడు. ఇరుపక్షాల అభ్యర్థనమేరకు ఈ కేసును లోక్అదాలత్కు బదలాయిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. నిర్మాత లింగుస్వామి ఈ చిత్రం కోసం పలువురు ఫైనాన్షియర్ల వద్ద రూ.20 కోట్ల వరకు అప్పుతీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పు చెల్లించకుండా సినిమాను రిలీజ్ చేయరాదని ఫైనాన్షియర్లు పట్టుపట్టినట్లు సమాచారం. అప్పు ఇచ్చి న వారితో నిర్మాతల మండలి అధ్యక్షులు కలైపులి థాను శుక్రవారం చర్చలు ప్రారంభించారు. ఇరుపక్షాల మధ్య ఒక అంగీకారంతో త్వరలో ఉత్తమ విలన్ విడుదల చేస్తారని చెబుతున్నారు. వివాదాల విలన్: ఉత్తమ విలన్ చిత్రం ఆది నుంచి వివాదాల మయమైంది. ఈ సినిమాలో కమల్ విచిత్ర వేషధారణ ఒక హాలీవుడ్ చిత్రం నుంచి కాపీ కొట్టారని ఫొటోలు సహా ప్రచురితమైనాయి. పుదియ తమిళగం కట్చి అధ్యక్షులు కృష్ణస్వామి సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. హిందూ దేవుళ్లను చిత్రంలో కించపరిచారంటూ కొన్ని హిందూ సంస్థల కార్యకర్తలు కమల్ ఫొటోలను తగులబెట్టి ఆందోళన నిర్వహించారు. అయితే వీటన్నింటినీ అధిగమించి ఉత్తమ విలన్ విడుదలకు సిద్ధమైనా అప్పు వ్యవహారంతో బ్రేక్ పడింది. -
ఉత్తమ విలన్?
సల్మాన్ ఖాన్ ఉత్తమ హీరో కావచ్చు. ఉత్తమ విలన్ కావచ్చు. కాని ఉత్తమ నటుడు ఎప్పుడూ కాడు... జీవితంలో నటించడం అతనికి చేత కాదు. ఒంటి మీద ఉన్న చొక్కాను విప్పి 42 అంగుళాల ఛాతీని... దాని చాటున ఉన్న గుండెను చూపినట్టే ఏదీ దాచలేడు. ఈ కారణం వల్లే అతడు హీరో అయ్యాడు. కానీ వివాదాల వల్ల విలన్ కాబోతున్నాడా? షారూక్ఖాన్ను అందరూ షారూక్ అంటారు. ఆమిర్ఖాన్ను ఆమిర్ అని ఆదరిస్తారు. సల్మాన్ఖాన్ను మాత్రం సల్లూ భాయ్ అని ప్రేమగా చేరదీసుకుంటారు. జనం ఒకరిని తమ సోదరుడిగా అన్నగా అనుకోవాలంటే అతడిలో చాలా ఉండాలి. తన ప్రయత్నం లేకుండానే వాళ్ల హృదయాలను తాకే పనులేవో చేస్తూ ఉండాలి. కపటం లేదు. కుట్ర లేదు. బయట ఒకలాగా లోపల ఒకలాగా వ్యవహరించే నటన లేదు.ప్రేమ ఉంటే వ్యక్తం చేస్తాడు. కోపం ఉంటే ప్రదర్శిస్తాడు. జేబు నుంచి ఏదైనా తీసి ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు. కాదు అనుకుంటే దేవుణ్ణయినా ఎదిరిస్తాడు. ముక్కున కోపం. కరిగితే మంచు. షారూక్ఖాన్ తొలిరోజుల్లో సల్మాన్ ఇంట్లో ఆదరణ పొందాడని చాలామందికి తెలియదు. షారూక్ కెరీర్ నిలబడ్డానికి సల్మాన్ సాయం చేశాడని కూడా చాలామందికి తెలియదు. కత్రీనా కైఫ్ పార్టీలో ఆ షారూక్ మీద సల్మాన్ భగ్గుమనడమే అందరికీ కనిపించింది. కాని తన చెల్లి పెళ్లికి స్వయంగా ఆహ్వానించి ఆ వేడుకలో మరో అన్న మిస్ కాకుండా చూశాడు. సల్మాన్ కుటుంబంతో జాతి కులం మతం అనే బేధం లేదు. ఎక్కువ తక్కువ అనే వివక్ష లేదు. నలుపు తెలుపు అనే తేడా లేదు. తండ్రి సలీమ్ఖాన్ ముస్లిం. తల్లి సుశీల హిందు. దారిన పోయే ఒక దీనురాలు ఎవరో కుమార్తెను కని చనిపోతే ఆ పాపను దత్తత తీసుకొని అర్పిత అని పేరు పెట్టుకొని సొంతబిడ్డ కంటే గారాబంగా పెంచి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. సాధారణంగా చెల్లి ప్రేమకు అన్న విలన్. సల్మాన్ కోట్లాది రూపాయలు కానుకగా ఇచ్చి పెళ్లి జరిపించాడు. ఐశ్వర్యారాయ్ని ప్రేమ కోసం వేధించాడని పుకారు. కాని అలా అని చెప్తూ మీడియాకు అందిన టేప్ నకిలీది అని ఫొరెన్సిక్ నిపుణులు తేల్చారు. చాలామంది సల్మాన్ వల్ల ఇవాళ నోటికి నాలుగు మెతుకులు తినగలుగుతున్నారు. సంజయ్ లీలా బన్సాలి తొలి సినిమా ఖామోషీ బయటకు రావడానికి సల్మాన్ కారణం. హిమేష్ రేష్మియా దేశానికి తెలిశాడంటే సల్మాన్ కారణం. కత్రినా కైఫ్ నంబర్ ఒన్ స్థానంలో ఉందంటే సల్మాన్ కారణం. రాజకీయపరంగా, సినిమాల పరంగా వెనకబడి- సల్మాన్ నువ్వే సహాయం చేయాలి అని అడిగితే- గోవిందాకు ‘పార్టనర్’ సినిమాలో లైఫ్ ఇచ్చి నిలబెట్టాడు. స్థూలకాయంతో బాధపడుతున్న సోనాక్షి సిన్హా, బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్లను మీరు టాప్ స్టార్స్ కాగలరు అని ఉత్సాహపరిచి స్టార్లను చేసినవాడు సల్మాన్. ఈ నొప్పి కంటే చావే నయం అనిపించే ముఖ నరాల సమస్య ఉన్నా పంటి బిగువున భరిస్తూ ఉత్సాహంగా తనను నమ్ముకున్నవారికి భరోసాగా కనిపించే ధీరోదాత్తత. ఇప్పుడు కూడా అతడి మీద దాదాపు 500 కోట్ల వ్యాపారం జరుగనుంది. ప్రత్యేక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సినిమా పరిశ్రమకు ప్రత్యేక్ష దైవం. ఈ దైవం ఉంటే కెమెరా ముందు ఉండాలి. లేదంటే ప్రేక్షకుల ముందు ఉండాలి. కాని కటకటాల వెనుక ఉంటే? రెండు ప్రాణాలు పోయాయని సల్మాన్ మీద అభియోగం. ఒకటి 1998లో రాజస్థాన్లో ఒక కృష్ణజింక అతడి చేతిలో హతమైందని కేసు నమోదైంది. 2002లో ముంబైలో కారు దూసుకెళ్లిన సంఘటనతో పేవ్మెంట్ మీద నిద్రపోతున్న ఒక వ్యక్తి చనిపోయాడని మరో కేసు. రెండు కేసులూ అనేక ఏళ్లుగా నడుస్తున్నాయి. అందులో ‘హిట్ అండ్ రన్’ కేసు తీర్పుకు వచ్చింది. రేపో మాపో తీర్పు. నేరం రుజువైతే పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలియక ఇండస్ట్రీ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి మానవ సేవలో అసలైన ఆనందం ఉందని చెబుతున్న సల్మాన్ నేరం రుజువైతే విలన్ అవుతాడు. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ దిల్ దే చుకే సనమ్, దబంగ్ సినిమాల హీరో విలన్ కాగలడా, విలన్గా మిగలగలడా? సల్మాన్కు జైలు శిక్ష పడితే సూరజ్ భరజ్యాత్యా తాజా సినిమా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఘోరంగా నష్టపోతుంది. ఎందుకంటే అది ఇంకా షూటింగ్ దశలో ఉంది. కరణ్ జొహర్ మరో భారీ సినిమా ‘శుద్ధి’ సల్మాన్తో సగం పూర్తయ్యింది. అదీ ఆగిపోతుంది. సల్మాన్ వల్లే టిఆర్పి రేటింగుల్లో నిలిచి ఉన్న బిగ్బాస్ షో తీవ్రమైన నష్టాన్ని చవి చూస్తుంది. ఇవన్నీ పక్కనపెడితే సల్మాన్ లేని ముంబై, అతడు సైకిల్ మీద రివ్వున తిరుగుతూ కనిపించే ఆ గల్లీలూ స్టూడియోలూ, ముంబై నైట్ పార్టీలు బోసి పోతాయి. రేపు ఏదైనా జరగొచ్చు. ఉత్తమ హీరో! ఉత్తమ విలన్? పుట్టింది డిసెంబర్ 27, 1965 (49 ఏళ్లు) తొలి సినిమా: బివీ హో తో ఐసీ (ఆగస్టు 26, 1988న విడుదల) కెరీర్ను మలుపు తిప్పిన సినిమా మైనే ప్యార్ కియా (డిసెంబర్ 29, 1989న విడుదల) అవార్డులు మైనే ప్యార్ కియాతో ఫిల్మ్ఫేర్, కుచ్కుచ్ హోతాహై సినిమాకు రెండో ఫిల్మ్ఫేర్ అవార్డు చారిటీ 2007లో ’బీయింగ్ హ్యూమన్’ ఎన్జీవో ప్రారంభం. దీని ద్వారా అనాథపిల్లలకు సాయం. కృష్ణజింకల కేసు 1998లో జోధ్పూర్ కోర్టులో కేసు నమోదు. 2006లో ఐదేళ్ల జైలు శిక్ష. 3 రోజులు జైల్లో . శిక్షపై స్టే. 2012 నుంచి రాజస్థాన్ హై కోర్టులో విచారణ. తదుపరి విచారణ మే 4, 2015 హిట్ అండ్ రన్ కేసు 2002 సెప్టెంబర్ 28న బాంద్రా ప్రాంతంలో కారు ప్రమాదం. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్పై అరెస్టు. బెయిల్. విచారణ మొదలు. ఈ కేసులో తుదితీర్పు మే 6, 2015 -
కమల్ అభిమానుల ఆగ్రహం
చెన్నై : కావాలనే కొందరు 'ఉత్తమ విలన్' చిత్రాన్ని అడ్డుకుంటున్నారని కమల్హాసన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం గర్వించతగ్గ నటుడి విశ్వరూపం చూడకుండా చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కమల్హాసన్ ప్రతి సినిమా విడుదలకు ఏవో ఒక ఆటంకాలు సృష్టించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, పూణె, ఇలా అనేక రాష్ట్రాల నుంచి ఉత్తమ విలన్ సినిమా చూసేందుకు చెన్నై చేరుకున్నామని కమల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విమానాల్లో నిన్ననే చేరుకుని ఉదయం నుంచీ థియేటర్ల వద్ద ఎదురు చూస్తున్నా తమకు తీవ్ర నిరాశ ఎదురైందని తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కమల్హాసన్కు అభిమానులున్నారని, వారందరి మద్దతు లోకనాయకుడికి ఉంటుందని చెప్పారు. సినిమా చూశాకే తాము థియేటర్ల వద్ద నుంచి వెళ్తామని, అంతవరకూ కదిలేదని అభిమానులు చెన్నైలోని థియేటర్ల వద్ద నుంచి చెబుతున్నారు. -
ఉత్తమ విలన్ ఆగిపోయింది
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ అభిమానులకు ఇది నిరాశే. ప్రారంభం నుంచి చిక్కులు ఎదుర్కొంటున్న ఆయన నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం తాజాగా చిత్ర నిర్మాతల వల్లే మరో సమస్యలో పడింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఆ చిత్రం ఆగిపోయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల కాకుండా నిలిచిపోయింది. చిత్ర నిర్మాతలకు ఫైనాన్షియర్లకు మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలు నెలకొని చిత్ర శుక్రవారం ఉదయం వేయాల్సిన మొదటి ఆటలు నిలిపివేశారు. మరో కొన్ని గంటల్లో వారి సమస్య చర్చల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని, శుక్రవారం తర్వాత సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లలో ఒకరు చెప్పారు. మరొకరు మాత్రం మ్యాట్నీకిగాని, ఫస్ట్ షోకుగానీ విడుదల చేస్తారని అన్నారు. రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎనిమిదో శతాబ్దానికి చెందిన వ్యక్తిగా.. మోడరన్ సూపర్ స్టార్గా కమల్ ఈ చిత్రంలో నటించారు. -
ఎవరైతే నాకేంటి!
వృత్తిపరంగా, వ్యక్తిగతంగాగాని నటి ఆండ్రియా పోకడే వేరు. తన ఇష్టానుసారం నడుచుకునే ఆమె మనస్తత్వమే వేరు. ఎవరేమనుకుంటే నా కేంటి అన్నట్లుగా ఉంటుందామె ప్రవర్తన. ఉత్తమవిలన్ చిత్ర యూనిట్ ఆండ్రియా నుంచి అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. చివరికి కమలహాసన్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. అసలా కథేంటో చూద్దామా? కమలహాసన్ నటించిన చిత్రం ఉత్తమవిలన్. ఇందులో పూజాకుమార్, ఆండ్రియా ప్రధాన హీరోయిన్లు. చిత్రం పలు ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని ఎట్టకేలకు శుక్రవారం తెరపైకి రానుంది. చిత్ర ప్రచారంలో కమలహాసన్ ముఖమే అధికంగా కనిపిస్తోంది. మరీ అయితే నటి పూజాకుమార్ ఫొటో అక్కడక్కడా కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఆ చిత్రంలో మరో హీరోయిన్ అయిన ఆండ్రియాకు సహజంగానే మండింది. సరే సమయం వచ్చినప్పుడు ఆ ఆగ్రహ మంటల్ని బయటకు వెళ్లకక్కుదాం అని కాచుకూర్చున్నారు. అలాంటి సమయం రానే వచ్చింది. ఉత్తమవిలన్ చిత్ర విడుదల దగ్గరపడడంతో చిత్ర యూనిట్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా నటి ఆండ్రియాను ఆహ్వానించారు. ఆమె నుంచి చిత్ర యూనిట్కు నేను రాను పొమ్మనే సమాధానమే వచ్చింది. ఎంతగా ప్రయత్నించినా ఆండ్రియాససేమిరా అనడంతో చిత్ర వర్గాలు కమలహాసన్తో చెబుతామన్నారు. కమల్తోనే కాదు ఎవరితోనైనా చెప్పుకోండి అంటూ ఆండ్రియా ఖరాఖండిగా చెప్పారు. దీంతో చేసేదిలేక చిత్రవర్గాలు కమల్కు ఆండ్రియాపై ఫిర్యాదు చేయక తప్పలేదు. దీంతో రంగంలోకి దిగిన కమల్ ఆండ్రియాకు నచ్చ చెప్పారని కోలీవుడ్ టాక్. -
కమల్హాసన్ తెలుగు అభిమానులకు శుభవార్త!
చెన్నై: ప్రముఖ నటుడు, నిర్మాత కమల్హాసన్ తెలుగు అభిమానులకు శుభవార్త. తెలుగు సినిమాలో తొలిసారిగా ఆయన తన గొంతు వినిపించబోతున్నారు. ఉత్తమ విలన్ తమిళ సినిమా తెలుగు వెర్షన్కు ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా మే 1వ తేదీ శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. సాధారణంగా కమల్హాసన్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ చేస్తే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఇస్తారు. '' ఉత్తమ విలన్ తెలుగు వెర్షన్కు కమల్ హాసన్ సర్ డబ్బింగ్ చెప్పారు. మొట్టమొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నందున, ఈ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డబ్బింగ్ పూర్తి అయిన తరువాత, నచ్చక ఆయన రెండవసారి డబ్బింగ్ చెప్పారు'' అని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కమల్హాసన్ 8వ శతాబ్ధపు థియేటర్ కళాకారుడిగా, నేటి సూపర్ స్టార్గా నటించారు. -
పార్టీల కోసమో.. మతాల కోసమో..నేను సినిమాలు తీయడం లేదు!
- కమల్ హాసన్ ‘‘సినిమా ఎలా చేయాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఈ పరిస్థితిలో తీసిన సినిమాను ప్రతి ఒక్కరికీ చూపించాల్సి వస్తోంది. అది కూడా ఉచితంగా! ఆ సినిమా చూసి, వాళ్లు విడుదల చేసుకోమంటే చేసుకోవాలట! ఈ పరిస్థితి బాధాకరం’’ అని కమల్హాసన్ అన్నారు. రమేశ్ అరవింద్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఉత్తమ విలన్’. పూజా కుమార్, ఆండ్రియా నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి సి. కల్యాణ్ విడుదల చేస్తున్నారు. మే 1న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో కమల్హాసన్, సి. కల్యాణ్, రమేశ్ అరవింద్, నాజర్, పూజాకుమార్లు సోమవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ‘విడుదలకు ముందే మీ సినిమాలు వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి కదా!’ అనే ప్రశ్నకు కమల్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ - ‘‘భారతదేశంలో హిందువుల సంఖ్య ఎక్కువ. వాళ్లను వద్దనుకుని సినిమా తీయడం ఎలా? అలాగని ముస్లిమ్ ప్రేక్షకులను నేను వద్దనుకోవడం లేదు. వాళ్లూ ముఖ్యమే. ఈ రెండు వర్గాలతో పాటు అన్ని మతాల కుటుంబాలూ నాకు అవసరమే! నేను కాంగ్రెస్ కోసమో, బీజేపీ కోసమో... వేరే రాజకీయ పార్టీల కోసమో సినిమాలు తీయడం లేదు. ‘ప్రజల సినిమా’ తీస్తున్నా’’ అన్నారు. కళాకారులం తక్కువ సంఖ్యలో ఉన్నాం. అందుకే మమ్మల్ని మైనార్టీలుగా చూడమంటున్నానని కమల్ చెబుతూ -‘‘మేం గొప్ప అనడం లేదు. చాలా చాలా తక్కువ. అందుకే, దయచేసి మమ్మల్ని బాధపెట్టకండి. మాకు వచ్చిన కళను మీకు చూపించాలన్నదే మా తాపత్రయం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆ కళను ఆదరించండి. మమ్మల్ని ఆదరించండి. మమ్మల్ని అభిమానించడం ద్వారా మీకు మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు’’ అన్నారు. గెటప్స్ కోసం ఎప్పుడూ సినిమా చేయలేదని కమల్ చెబుతూ -‘‘కథ ఏ గెటప్ డిమాండ్ చేస్తే అదే చేస్తున్నాను. అప్పుడు ‘భారతీయుడు’, ‘భామనే సత్యభామనే’ - ఇలా ఏది చేసినా అందులో నేను వేసిన గెటప్స్ కథానుగుణంగానే ఉంటాయి. అవి బాగుండడంతో గుర్తుండిపోయాయి. ఇప్పుడు ‘ఉత్తమ విలన్’ ఓ సినిమా కళాకారుడి జీవితం నేపథ్యంలో సాగుతుంది. ఓ కళాకారుడిగా ఒక్క గెటప్లో కనిపించలేం కదా! ‘ఉత్తమ విలన్’ ఏంటి? అని చాలామంది అడుగుతున్నారు. నా దృష్టికోణంలో విలన్గా కనిపించేవాళ్లు.. మరొకరి దృష్టి కోణానికి హీరోలా కనిపిస్తారు. ఈ చిత్రంలో నా పాత్ర అలానే ఉంటుంది’’ అన్నారు. ఆండ్రియా, పూజా కుమార్లతో మళ్లీ సినిమా చేయడం గురించి అడగ్గా - ‘‘శ్రీదేవితో 27, శ్రీప్రియతో 27 సినిమాలు చేశాను. ఖుష్బూతో ఆరేడు సినిమాలు చేశాను. ఇప్పుడు ఆండ్రియా, పూజాకుమార్లతో మళ్లీ సినిమా చేయడానికి కారణం వాళ్ల ప్రతిభ. ఈ చిత్రంలోని పాత్రలకు వాళ్లే సరిపోతారు. అంతే తప్ప వేరే ఏమీ లేదు’’ అని నవ్వుతూ అన్నారు. అరవైఏళ్ల వయసులోనూ ఎనర్జిటిక్గా ఎలా ఉన్నారని కమల్ను అడిగితే - ‘‘వయసు శరీరానికే. మనసుకు కాదు. మన మనసుకు మనమే వయసు ఫిక్స్ చేసుకోవాలి’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ 54 సినిమాలు చేశాను. పలు విజయాలు చవి చూశాను. కానీ, ఈ చిత్రం నాకు ప్రత్యేకం’’ అని వ్యాఖ్యానించారు. -
గౌతమితోనే ఆలోచనలు షేర్ చేసుకుంటా: కమల్హాసన్
హైదరాబాద్: తన ఆలోచనలను మొదట గౌతమితోనే షేర్ చేసుకుంటానని ప్రముఖ హీరో కమల్హాసన్ చెప్పారు. ఈ రోజు సాయంత్రం ఆయన సాక్షిటీవీకి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. ఉత్తమ విలన్ చిత్రంలో తనలో ఒక హీరోని, ఒక విలన్ని చూస్తారన్నారు. ప్రతి విలన్లోనూ ఓ మానవతావాది ఉంటారు. ఈ చిత్రం చూసిన తరువాత ఆ విలన్ పాత్ర నచ్చిందో, లేదో చెప్పాలన్నారు. సినిమాపై విమర్శల గురించి ప్రశ్నించినప్పుడు సినిమా బాగోలేదని సినిమా చూసిన తరువాత చెప్పాలన్నారు. సినిమా ప్రొడక్షన్లో ఉండగా అది మంచా? చెడా? అనేది ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. ఓం నమో నారాయణ అని హిరణ్యకసిపుడు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆయన అలా అంటే ఇక ప్రహ్లాద చరిత్రే ఉండదని అన్నారు. ఈ చిత్రంపై కోర్టులో దాఖలైన కేసును ఈరోజు కొట్టివేసినట్లు తెలిపారు. ¤ ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్, కె.బాలచందర్ నటించారు. కె.విశ్వనాధ్ గారు ఈ చిత్రంలో ఓ మార్గదర్శిగా నటించారని చెప్పారు. తనకు మార్గదర్శిగా ఉంటారన్నారు. బాలచందర్, విశ్వనాథ్ గార్ల స్నేహం చూసి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. వారు ఇద్దరూ గొప్ప వ్యక్తులన్నారు. బాలచందర్ గారితో ఇది ఆఖరి సినిమా అనుకోలేదన్నారు. మరో రెండు సినిమాలు కూడా చేద్దామని అనుకున్నట్లు తెలిపారు. ¤ ఉత్తమ విలన్లో మేకప్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మేకప్కు మూడు గంటలు సమయం పట్టినట్లు చెప్పారు. మేకప్ వేసుకోవడాన్ని కూడా తాను ఎంజాయ్ చేశానన్నారు. ¤ ఒక కుటుంబంలో పెద్దవారు మంచి కథ గల స్టోరీ ఉండాలని అనుకుంటారు. అబ్బాయిలకు హీరోయిన్ బాగా ఉండాలి.ఆడవారికి సీనియల్లో మాదిరి కధ ఉండాలి. ఈ సినిమా కుటుంబంలోని అందరికీ నచ్చేవిధంగా ఉంటుందని చెప్పారు. ¤ తన కుమార్తె శృతిహాసన్కు తానేమీ సలహాలు ఇవ్వలేదన్నారు. పిల్లలు వారి ఆలోచనల ప్రకారం నడుచుకుంటారని చెప్పారు. మంచి దర్శకులు చిత్రాలలో నటిస్తే వారి నటనలోపరిణతి వస్తుందని కమల్ హాసన్ చెప్పారు. -
హైదరాబాద్లో కమల్ హాసన్
-
రాబోయే రోజుల్లో... నిర్మాతలు ఉండరు!
‘‘హీరోలకు ఓ నిర్మాత పది కోట్లు ఇవ్వడానికి సిద్ధపడితే, మరో నిర్మాత పదిహేను కోట్లు ఇస్తానంటూ డేట్స్ దక్కించుకుంటున్నాడు. ఇలాగే చేస్తూ పోతే... రాబోయే రోజుల్లో నిర్మాతలుండరు. హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులే సినిమాలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. కమల్హాసన్ హీరోగా రమేశ్ అరవింద్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉత్తమ విలన్’ చిత్రాన్ని సీకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఆయన తెలుగులో మే 1న విడుదల చేస్తున్నారు. చిత్రవిశేషాలు తెలియజేయడానికి సమావేశమైనప్పుడు కల్యాణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోట్లు పారితోషికం తీసుకునే హీరోలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చరనీ, ఇంటి నుంచి కదలడానికి, క్యారవాన్ నుంచి కాలు బయటపెట్టడానికి ఫీలైపోతారనీ వ్యాఖ్యానించారు. ‘‘ఉత్తమ విలన్లో వివాదాస్పద సన్నివేశాలున్నాయంటూ తమిళనాట కొందరు వివాదం రేపారు. అలా ఉంటే సెన్సార్ బోర్డ్ అడ్డుకునేది కదా’’ అని కల్యాణ్ పేర్కొన్నారు. -
ఒకే రాత్రిలో...
కమల్హాసన్ నటించిన తాజా చిత్రం ‘ఉత్తమ విలన్’ మే 1న విడుదల కానుంది. ఇంకా ‘విశ్వరూపం 2’, ‘పాపనాశం’ (మలయాళ ‘దృశ్యం’కి తమిళ రీమేక్) చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి చేయనున్న చిత్రంపై కమల్ దృష్టి సారించారు. ఒకే రాత్రి జరిగే కథతో ఈ చిత్రం రూపొందనుందనీ, దీనికి ‘ఒరే ఇరవు’ (అంటే ‘ఒకే రాత్రి’ అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. కమల్ నటించిన పలు చిత్రాలకు సహాయ దర్శకునిగా చేసిన రాజేశ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందనీ, ఇందులో త్రిషను కథానాయికగా ఎంపిక చేశారనీ భోగట్టా. -
కమల్, శృతిల బాక్సాఫీస్ రగడ!
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత కమల్ హాసన్, ఆయన కుమార్తె నటి శృతిహాసన్ మే 1న పోట్లాడనున్నారు. తండ్రి కూతుళ్లు పోట్లాడటమేమిటని అనుకుంటున్నారా.. మరేం లేదండి.. మే 1న వారిద్దరు నటించిన వేర్వేరు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. కమల్ హాసన్ నటించి నిర్మించిన చిత్రం 'ఉత్తమ విలన్' మే1న విడుదల కానుండగా అదే రోజు శృతి హాసన్ హీరోయిన్గా నటించిన హిందీ చిత్రం 'గబ్బర్ ఈజ్ బ్యాక్' కూడా అదే రోజు విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోగా అక్షయ్ కుమార్ నటించాడు. దీంతో ఒకే రోజు విడుదల కానున్న ఈ తండ్రి కూతుళ్ల చిత్రాల్లో ఏ చిత్రం బాక్సాఫీస్ వద్ద పోరాడి ఎక్కువ వసూళ్లు సాధిస్తుందోనని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాకుండా, ఎన్నడూ లేనిది తొలిసారి తన తండ్రి సినిమాతోపాటు తన చిత్రం కూడా విడుదల అవుతుండగా శృతిహాసన్ ఎంతో ఉత్సాహంతో ఆరోజు కోసం ఎదురు చూస్తోందట. -
యాక్షన్ థ్రిల్లర్కు రెడీ
వైవిధ్యానికి మారు పేరు కమల్ హాసన్. నటనలోనే కాదు ఆయన ఎంచుకునే కథల్లోనూ, కథనాల్లోనూ విభిన్నత్వం తొణికిసలాడుతుంది. అందుకే సకలకళావల్లభుడి చిత్రాలు జయాపజయాలకు అతీతం అంటారు. కమల్ నటించిన విశ్వరూపం, పాపనాశం, ఉత్తమవిలన్ వంటి మూడు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వీటిలో ఉత్తమ విలన్ చిత్రం మే నెల 1న తెరపైకి రానుంది. విశ్వనాయకుడు తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. ఆయనీసారి యాక్షన్ థ్రిల్లర్కు మారనున్నారన్నది విశేషాంశం. ఈ చిత్రానికి సంబంధించిన గీతాల సంగీతరూపకల్పన కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు జిబ్రాన్ స్పష్టం చేశారు. కమల్ మూడు చిత్రాలకు వరుసగా పని చేసిన ఈయన ఈ తాజా చిత్రానికి కూడా సంగీతాన్ని అందించడం విశేషం. కమల్ తదుపరి చిత్రం యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని జిబ్రాన్ తెలిపారు. చిత్ర షూటింగ్ మాల్దీవుల్లో నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. -
వివాదాల... విలన్
సినిమా వివాదాలకూ, నటుడు కమలహాసన్కూ మధ్య విడదీయరాని బంధం ఉన్నట్లుంది. ఆయన నటించిన పెద్ద సినిమా ఏది రిలీజవుతున్నా, తమిళనాట ఎవరో ఒకరు కోర్టుకెక్కడం రివాజైంది. గతంలో ‘విరుమాండి’ (తెలుగులో ‘పోతురాజు’) చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ ‘సండియర్’ మీద వివాదం రేగింది. రెండేళ్ళ క్రితం ‘విశ్వరూపం’ సినిమాపై మైనారిటీ వర్గాల గొడవతో కొన్ని వారాల పాటు రిలీజ్ వాయిదా పడింది. తాజాగా, రానున్న ఆయన సినిమా ‘ఉత్తమ విలన్’కు హిందూ సంస్థల నుంచి ఇబ్బంది తలెత్తింది. సినిమాలో వచ్చే ‘ఇరణ్యన్ నాడగమ్...’ అనే పాటలో భక్త ప్రహ్లాదుడికీ, అతని తండ్రి హిరణ్యకశిపుడికీ మధ్య జరిగే సంభాషణ విష్ణుభక్తులను కించపరిచేదిగా ఉందంటూ ‘విశ్వహిందూ పరిషత్’ తమిళనాడు శాఖ నేరుగా పోలీసులను ఆశ్రయించింది. ఆ పాటలో విష్ణుమూర్తిని చిత్రించిన తీరు అభ్యంతరకరంగా ఉందనీ, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందనీ ఫిర్యాదు చేసింది. సినిమాపై నిషేధం విధించాలని కోరింది. పోలీసుల నుంచి ఇప్పటి దాకా ఎలాంటి స్పందనా లేదు. ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో తెలియదు కానీ, మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ‘ఉత్తమ విలన్’కు ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప, ఈ చిత్రం విడుదలకు అడ్డంకులేమీ ఉండవని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, చిత్ర దర్శకుడు రమేశ్ అరవింద్ సైతం, ‘‘సమాజంలోని ఏ వర్గం మనోభావాలనైనా కించపరిచేవేవీ మా సినిమాలో లేవు. చిన్నప్పటి నుంచి మనందరికీ తెలిసిన పురాణేతిహాసాల కథల గురించి ప్రస్తావనే ఇందులోనూ ఉంది. మా పాత్రల మేకప్పే తప్ప, విషయంలో ఎలాంటి మార్పూ లేదు. కాబట్టి, ఈ ఫిర్యాదులకు అర్థం లేదు’’అని వ్యాఖ్యానించారు. అసలు అలాంటివి ఏవైనా ఉంటే, సినిమా సెన్సారే ఇవ్వరు కదా అన్న రమేశ్ అరవింద్ మాటల్లో ఎంతో నిజం ఉంది కదూ! మరి, మే 1 లోగా ఇంకెన్ని ఫిర్యాదులు ఈ సినిమాకు విలన్గా పరిణమిస్తాయో చూడాలి. -
'మా సినిమాలో ఎవరినీ కించపరచలేదు'
చెన్నై: కమల్ హాసన్ హీరోగా నటించిన 'ఉత్తమ విలన్' సినిమాలో ఏ మతాన్ని కించపరిచే సన్నివేశాలు లేవని దర్శకుడు రమేశ్ అరవింద్ తెలిపారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 'దర్శకుడిగా చెబుతున్నా. ఉత్తమ విలన్ సినిమాలో ఎవరి మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు, మాటలు లేవు. ఇది ఒక సూపర్ స్టార్ భావాలకు సంబంధించిన సినిమా. ఇందులో ఆయన ప్రయాణం, భావోద్వేగాల గురించి చూపించాం. పాటల్లోనూ ఏ మతానికి వ్యతిరేకంగా చూపించలేదు' అని రమేష్ అరవింద్ తెలిపారు. తమకు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. సెన్సార్ బోర్డు తమకు క్లీన్ చీట్ ఇచ్చిందని, సినిమా విడుదలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాబోవని అన్నారు. మే 1న విడుదలకానున్న ఉత్తమ విలన్ సినిమాకు సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. -
విడుదలకు ముందే నిషేధమా?
చెన్నై: విడుదలకు ముందే సినిమాను వ్యతిరేకించడం, నిషేధించాలని ఆందోళనలు చేయడం, కోర్టులు, పోలీసుస్టేషన్లను ఆశ్రయించడం ఈ మధ్య పరిపాటిగా మారిందని కేంద్ర సెన్సార్బోర్డు సభ్యులు బక్రిసామి అన్నారు. తాజాగా కమల్హాసన్ నటించిన ఉత్తమవిలన్ చిత్రాన్ని నిషేధించాలని విశ్వ హిందూ పరిషత్ సమితికి చెందిన కొందరు ఆందోళనలు చేసిన నేపథ్యంలో బక్రిసామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమకు నచ్చకుంటే ఎలాంటి సినిమాన్నైనా నిషేధించాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొన్ని తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు బెదిరింపులకు దిగడం సమంజసం కాదన్నారు. ఒక చిత్రాన్ని చూడకుండా అందులో ఓ వర్గాన్ని అవమానించారని, కొందరి మనోభావాలను కించపరిచేలా దృశ్యాలు ఉన్నాయని ఆరోపించడం దారుణమన్నారు. సినిమాల్లో ఆయా పాత్రలకు తగ్గట్టుగానే సంభాషణలను అనుమతించడం జరుగుతోందన్నారు. భావ ప్రకటిత స్వాతంత్య్రాన్ని కొందరు కావాలనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. -
'ఉత్తమ విలన్ పై నిషేధం విధించండి'
చెన్నై:విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఉత్తమ విలన్ చిత్రం విడుదలకు ముందే అనేక అవాంతరాలను ఎదుర్కొంటుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో వాయిదా పడిన ఉత్తమ విలన్ చిత్రంపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పిలుపునిచ్చింది. ఆ చిత్రంలోని సన్నివేశాలు హిందూవుల మనోభావాలను కించే పరిచే అవకాశం ఉన్న కారణంగా నిలుపుదల చేయాలంటూ పోలీస్ కమిషనర్ కు వీహెచ్ పీ ఓ నివేదికను సమర్పించింది. ప్రధానంగా విష్ణుమూర్తి భక్తుడు ప్రహ్లాదనకు, హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి జరిగే సంభాషణ ఆధారంగా తెరకెక్కిన ఒక పాట విష్ణుమూర్తి భక్తులను నిరాశకు గురి చేస్తుందని వివరించింది. దీంతో ఆ సినిమా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
24న ఉత్తమ విలన్?
ఉత్తమవిలన్ చిత్ర విడుదల మరోసారి వాయిదాపడిం ది. ఇది కమలహాసన్ అభిమానుల కు నిరుత్సాహం కలిగించే విషయమే. కమలహాసన్, పూజాకుమార్, ఆండ్రియా, ఊర్వశి, పార్వతిమీనన్, పార్వతినాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉత్తమవిలన్. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మించింది. విడుదల హక్కులను ఇరోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఈ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఉత్తమవిలన్ ఏప్రిల్ 10న తెరపైకి రావడం లేదు. అందుకు కారణాలంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. సెన్సార్ కార్యక్రమాల్లో జాప్యం కారణంగానే చిత్రం విడుదల వాయిదా పడిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే చిత్రానికి గ్రాఫిక్స్ వర్కు పూర్తి కాలేదట. ఉత్తమవిలన్ చిత్రంలోని సుమారు 25 సన్నివేశాలకు గ్రాఫిక్స్ చేయాల్సి ఉందట. ఈ గ్రాఫిక్స్ను మార్చి 27వ తేదీ కల్లా పూర్తి చేయాల్సి ఉండగా పలు కారణాల వలన ఆలస్యం అయ్యిందట. కమలహాసన్ చిత్రాలకు గ్రాఫిక్స్ రూపొందించే మధుసూదన్ ఈ ఉత్తమవిలన్కు గ్రాఫిక్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిన ఈ చిత్రం కోసం ఆయన రేయింబవళ్లు శ్రమిస్తున్నారట. అయితే ఏ విషయంలోనైనా పర్ఫెక్షన్ కోరుకునే కమలహాసన్ ఆలస్యం అయినా ఫర్వాలేదు చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు బ్రహ్మాండంగా ఉండాలని ఆశిస్తుండడంతో ఈచిత్ర విడుదల వాయిదా పడింది. చిత్రం ఈ నెల 24న గాని, మే1గాని విడుదలయ్యే అవకాశం ఉం దని చిత్ర వర్గాలు అంటున్నాయి. -
'ఉత్తమ విలన్' ఆడియో విడుదల
-
నేను ఇప్పటికీ...కమల్ అభిమానినే!
‘‘బాలచందర్గారంటే నాకెంతో అభిమానం. ఆయన దగ్గర సహాయ దర్శకునిగా చేస్తానంటే వద్దన్నారు. ఇక, కమల్హాసన్ ఎంతో క్రమశిక్షణ గల నటుడు. గతంలో ఓ సినిమా షూటింగ్లో ఒకే ఒక్క సీన్ కోసం క్రేన్ మీద గంటల కొద్దీ అలానే నిలబడ్డాడు. అప్పట్నుంచి నాకు కమల్ మీద ఇష్టం మొదలైంది’’ అని సీనియర్ దర్శకులు కె. విశ్వనాథ్ అన్నారు. రమేశ్ అరవింద్ దర్శకత్వంలో కమల్హాసన్, పూజాకుమార్, ఆండ్రియా, కె.బాలచందర్, కె. విశ్వనాధ్ తదితరుల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఉత్తమ విలన్’. ఈ చిత్రాన్ని సి. కల్యాణ్ తెలుగులోకి విడుదల చేస్తున్నారు. జిబ్రాన్ స్వరాలందించారు. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ఆడియో వేడుకలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ - ‘‘ప్రపంచ సినీ కళాకారులు గర్వించదగ్గ నటుడు కమల్. విశ్వనాథ్గారు, కమల్హాసన్ ఏ సినిమా చేసినా ‘బాగుంటుంది’ అనే అంటాను. ఎందుకంటే, ఇద్దరూ అద్భుతమైన సినిమాలు చేస్తారు. కమల్ సినిమాల్లో ప్రయోగాత్మక పాటలు పాడే అవకాశం నాకు లభించింది’’ అన్నారు. కమల్, బాలచందర్ల కాంబినేషన్లో వచ్చిన పాటలను వారిద్దరి మధ్య అనుబంధానికి అన్వయిస్తూ బాలు పాడగా, కమల్ కూడా గొంతు కలపడం విశేషం. కమల్హాసన్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా గురించి మాట్లాడే ముందు నా గురువు బాలచందర్గారి గురించి మాట్లాడాలి. ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయడం నా అదృష్టం. విశ్వనాథ్గారికీ, నాకూ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో చెప్పడానికి మా కాంబినేషన్లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఓ ఉదాహరణ’’ అన్నారు. ‘‘నేను ఇప్పటికీ కమల్ అభిమానినే. ఆయన నటించిన ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’ లాంటి చిత్రాలు తెలుగులో మళ్లీ ఎప్పుడు వస్తాయా? అని తెలుగు ప్రేక్షకురాలిలా ఎదురు చూస్తున్నా. ఈ ‘ఉత్తమ విలన్’ ఆ చిత్రాల సరసన నిలుస్తుంది’’ అని గౌతమి అన్నారు. ఈ చిత్రం తనకు దొరికిన అక్షయ పాత్ర అని సి. కల్యాణ్ అన్నారు. బాలచందర్ గురించి తమిళంలో కమల్ రాసిన కవితను రామజోగయ్య శాస్త్రి తెలుగులోకి అనువదించగా, కమల్ చదివి వినిపించారు. ఈ వేడుకలో టి. సుబ్బిరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, బెల్లంకొండ సురేశ్, రమేశ్ అరవింద్, తమిళ వెర్షన్ నిర్మాత లింగుస్వామి, జిబ్రాన్, శ్రుతీహాసన్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక సూపర్ స్టార్ కథ.. ఉత్తమ విలన్
తన తాజా చిత్రం ఉత్తమ విలన్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ప్రముఖ నటుడు,దర్శకుడు కమల్ హాసన్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమా ఒక నటుడి కథ అని ఆయన చెప్పారు. ఒక సూపర్ స్టార్గా ఎదిగిన ఒక నటుడిలోని రెండు విభిన్నమైన కోణాలను పట్టిచూపించే మంచి సినిమా అన్నారు. అందరూ ఊహిస్తున్నట్టుగా ఉత్తమ విలన్ సినిమా సినీ పరిశ్రమ మీద సంధించిన వ్యంగ్యాస్త్రం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది మీ కథేనా అని అడుగుతున్నారని... కానీ తాను నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ తన జీవితానికి సంబంధించిన కొంత భాగం ఉంటుందని పేర్కొన్నారు. తన గురువు, దైవంతో సమానమైన కె. బాలచందర్ మార్గదర్శి పాత్రలో నటించిన ఉత్తమ విలన్ సినిమా తన జీవితంలో మర్చిపోలేని, అతి ముఖ్యమైందన్నారు కమల్. అలాంటి లెజెండరీ దర్శకుడు బాలచందర్ శిష్యరికంలో ఎదిగిన రమేష్ అరవింద్ మీద అపారమైన నమ్మకముందని, అందుకే ఈ సినిమాకు దర్శకుడిగా ఆయన్ను ఎంచుకున్నానని కమల్ తెలిపారు. ఈ సందర్భంగా తెయ్యం కళను ఫ్రెంచి నుంచి కాపీ చేశారనే విమర్శలు ఆయన తిప్పి కొట్టారు. ఫ్రాన్స్లో ఫ్రెంచి భాష మాట్లాడకముందే తెయ్యం కళ ఉనికిలో ఉందని చెప్పుకొచ్చారు. ఊర్వశి, నాజర్, జయరామ్ , భాస్కర్ లాంటి ప్రముఖులు నటించిన ఉత్తమ విలన్ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. -
కాన్స్ చిత్రోత్సవాలకు జిబ్రాన్
కాన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ రెడీ అవుతున్నారు. వాగై చూడవ చిత్రంతో తన సంగీత పయనాన్ని ప్రారంభించిన ఈయన అనతికాలంలోనే విశ్వనాయకుడు కమలహాసన్ చిత్రానికి సంగీత బాణీలందించే స్థాయికి ఎదిగారు. ఈయన సంగీతాన్ని అందించిన ఉత్తమ విలన్ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా జిబ్రాన్ నిర్మాణ సారథ్యం వహించిన లఘు చిత్రం కాన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపిక కావడం విశేషం. సంగీత దర్శకుడిగా బిజీగా వున్న జిబ్రాన్ తన బాల్య స్నేహితుడు రతీంద్రన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన లఘు చిత్రం స్వేయర్ కార్పొరేషన్కు నిర్వహణ బాధ్యతలను నిర్వహించడం విశేషం. ఈ చిత్రాన్ని టర్కిష్కు చెందిన బసాక్ గ్యాజిలర్ ప్రసాద్, హాకన్ కేంటర్లీ నిర్మించారు. పర్యావరణరంగంపై అక్కర కలిగిన ఒక యువకుడు ఒక కెమికల్ కంపెనీ సీఈవోను హత్య చేయడానికి చేసే ప్రయత్నమే చిత్ర ఇతివృత్తంతో కూడిన ఈ లఘు చిత్రం 30 నిమిషాల నిడివితో ఉంటుందని జిబ్రాన్ తెలిపారు. కాన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జిబ్రాన్ దర్శకుడు రతీంద్రన్ ప్రసాద్ పాల్గొననున్నారు. -
కేసు వాపస్ తీసుకోను
కొత్తగా ఆలోచించడం అన్నది సినిమానే జీవితంగా అనుభవిస్తూ దాన్ని కాచి వడబోసిన కమలహాసన్కే చెల్లు. ఆది నుంచి ప్రయోగాలకు ముందుండే ఈ ప్రయోజనాత్మక చిత్రాల నాయకుడు తాజాగా కొందరు డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నది కోలీవుడ్ టాక్. కమల్ నటించిన విశ్వరూపం-2, ఉత్తమ విలన్, పాపనాశం చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఆయన ద్విపాత్రాభినయంతో పలు గెటప్లతో కనిపించి అబ్బురపరచనున్న ఉత్తమ విలన్ ఏప్రిల్ 10న విడుదలకు ముస్తాబవుతోంది. పూజాకుమార్, ఆండ్రియా, పార్వతిమీనన్, ఊర్వశి, పార్వతి నాయర్అంటూ ఐదుగురు నాయికలు నటించిన ఈ చిత్ర విడుదల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు కమల్ ముందు ఒక డిమాండ్ ఉంచారు. దీని గురించి చెప్పేముందు కాస్త వెనక్కు వెళ్లాలి. విశ్వరూపం చిత్రం విడుదల విషయంలో కమలహాసన్ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారని భావించారు. అదే డీటీహెచ్ విధానం. థియేటర్లతోపాటు అదే రోజున చిత్రాన్ని ఛానళ్లలోను ప్రసారం చేయాలన్నదే ఆ ప్రయోగం. దీనికి కొన్ని ప్రముఖ ఛానళ్లు ముందుకొచ్చాయి. వాటితో కమల్ ఒప్పందం కూడా చేసుకున్నారు. అంతా సరిగా సాగుతోందనుకున్న సమయంలో కమల్ ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ ఆయన నిర్ణయానికి గండి కొట్టారు. డీటీహెచ్లో ప్రసారం చేస్తే విశ్వరూపం చిత్రాన్ని తాము థియేటర్లలో ప్రదర్శించబోమని తెగేసి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యాజమాన్యానికి వంత పాడారు. దీంతో కమల్ ప్రయోగం ఫలవంతం కాలేదు. దీంతో చాలా ఆవేదన చెందిన ప్రయోగాల పిపాసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. దీంతో కమల్ ఎటాక్ను ఊహించని వారు హతాశులయ్యారు. ఉత్తమ విలన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆ డిస్ట్రిబ్యూటర్లలో కొందరు ఉత్తమ విలన్ చిత్రాన్ని కొనుగోలు చేశారు. వారిప్పుడు తమపై సీసీఐలో చేసిన ఫిర్యాదును వాపస్ తీసుకుంటేనే ఉత్తమ విలన్ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. అయితే వారికి బెదిరేది లేదు. ఫిర్యాదును వెనక్కు తీసుకునేది లేదని కమల్ ఖరాఖండిగా చెప్పినట్టు కోలీవుడ్ టాక్. -
ఆ ఒక్కటి అడక్కండి
సినిమా నిరంతర ప్రవాహం. దీని ఆది గురించి చెప్పగలం గాని అంతం అనేది ఉండదు కాబట్టి. ఆ ఊహే అప్రస్తుతం. అయితే అన్ని చలన చిత్రాలే అయినా కొన్ని చిత్రాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి వాటి చరిత్ర తిరగేయకున్నా వాటిలో లివింగ్ లెజెండ్ విశ్వనాయకుడు కమలహాసన్ చిత్రాలు చాలా ఉంటాయి. వాటి జోలికి వెళ్లవద్దు. ప్రస్తుతం అఖిల భారత కాదు విశ్వ భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మహానటుడి తాజా ప్రయోగం ఉత్తమ విలన్ చిత్రం గురించి తెలుసుకోవాలనుకోని సినీ ప్రియుడే ఉండడేమో. అలాంటి చిత్రం గురించి పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఉత్తమ విలన్లో కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని అందులో ఒకటి ఎనిమిదవ శతాబ్దంకు చెందిన పాత్ర మరొకటి 21వ శతాబ్దం సినీ నటుడి పాత్ర అని, ఈ రెండింటిలో ఒకటి కథా నాయకుడు, మరొకటి ప్రతి నాయకుడు పాత్ర లాంటి రకరకాల ప్రచా రం జరుగుతోంది. ఉత్తమ విలన్ చిత్ర కథలో మర్మం ఏమిటి మహాశయా అని దర్శకుడు రమేష్ అరవింద్ను నోరు తెరిచి అడిగి ఆ ఒక్కటి అడక్కండి ఇంకేమైనా సరే చెప్పడానికి సిద్ధం అంటున్నారు. సరే ఈ కన్నడ నట, దర్శకుడు ఏం చెబుతారో చూద్దాం... ప్రశ్న: మంచి దర్శకుడై ఉండి కథను, నిర్మాతను చేతిలో ఉంచుకుని కమల్ మిమ్మల్ని చిత్రానికి దర్శకుడిగా ఎంచుకోవడానికి కారణం? జవాబు: ఏమి అనుకోకపోతే కొంచెం గతంలోకి వెళతాను. పున్నగై మన్నన్ చిత్రంలో నటిస్తున్నప్పుడు దర్శకుడు కె.బాలచందర్ గారు పరిచ యం చేశారు. నీ అనుభవంతో దర్శకత్వం చేయవచ్చుగా అన్నారొకసారాయన. ఆ మాట లు మంత్రంగా పని చేశాయి. అలా దర్శకుడిగా నా తొలి కన్నడ చిత్ర హీరో కమలహాసన్ అ య్యారు. ఆ తరువాత నేనక్కడ నటిస్తూ, దర్శకత్వం చేస్తున్నాను. నా దర్శకత్వ శైలి, టేస్ట్ కమల్కు తెలుసు. బహుశా ఈ అవకాశం నాకివ్వడానికి కారణం ఇదే కావచ్చు. ప్రశ్న : ఇక ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ పాత్రల విషయానికొద్దాం. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వాటిలో ఒకటి నాయకుడు, మరొకటి ప్రతినాయకుడి పాత్రలు అంతే కదా? జవాబు: అలాంటి ఊహల్ని ప్రేక్షకుల్లో రేకెత్తిం చాలన్న ఉద్దేశమే ఉత్తమవిలన్ టైటిల్ నిర్ణ యం. అది నెరవేరింది. కొందరు ఈ చిత్రంలో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన కమలహాసన్ మళ్లీ ఇప్పుడు పునర్జన్మ ఎత్తిన కథాంశం అని అనుకుంటున్నారు. మేమీ చిత్రం విషయంలో సాధ్యమైనంత వరకు సస్పెన్స్ను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రశ్న: దర్శక శిఖ రం లాంటి కె.బాలచందర్, కె.విశ్వనాథ్, కమల్, లింగుస్వామి (చిత్ర నిర్మాత) లాంటి వారితో పని చేసిన అనుభవం గురించి? జవాబు: వారందరూ నేను గురువుగా భావించే, గర్విం చే దర్శకులు. ఇక ఈ చిత్రా న్ని నిర్మిస్తున్న దర్శకుడు లింగుస్వామి గురించి చెప్పాలంటే సహ దర్శకుడిగానే చూస్తారు. పూర్తి స్వేచ్ఛనిస్తారు. ప్రశ్న:చిత్రంలో కొత్త నృత్య ప్రక్రియను పరి చయం చేశారట? జవాబు: ఎనిమిదవ శతాబ్దంకు చెందిన నాయకుడు నృత్య కళాకారుడు. అయితే ఆ కాలంలో ఎలాంటి నృత్యం ఉండేదో తెలియదు. కేరళకు చెందిన తొయ్యం, తమిళనాడుకు చెందిన విల్లుపాటు నృత్య కళల్ని కలిపి ఇలాంటి ఒకే నృత్యకళ ఉండి ఉంటుందనే ఒక కల్పనలో కొత్త నృత్య ప్రక్రియను ఉత్తమవిలన్లో ప్రవేశపెడుతున్నాం. ఈ నృత్యం చేయడానికి కమలహాసన్ పలు వారాలు ప్రాక్టీస్ చేశారు. ప్రశ్న : చిత్రంలో పాటల్ని కమల్నే పాడారట? జవాబు: చిత్రం సందర్భనార్థంతోనే కమల్ పాడాల్సి వచ్చింది. అందువలన చిత్రంలో నటించేవారే పాడితే సహజత్వం ఆపాదిస్తుంది. అందుకే కమల్ పాడాల్సి వచ్చింది. ప్రశ్న: కథా నాయికల గురించి? జవాబు: పూజాకుమార్, పార్వతీనాయర్, పార్వతి మీనన్, ఆండ్రియా, ఊర్వశి ఐదుగురు నాయికలు నటించారు. ప్రశ్న : కమలహాసన్ చిత్రాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక సందేశం ఉంటుంది. ఈ చిత్రంలో? జవాబు: నిజం చెప్పాలంటే నాకీ చిత్రంలో నచ్చింది ఆ సందేశమే. నేను నిద్రకుపక్రమించే ప్రతి రాత్రి దాని గురించే ఆలోచించేవాడిని అలాంటి ఒక మరచిపోలేని సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పనున్నాం. -
ఉత్తమ విలన్కు ఈరోస్ భాగస్వామ్యం
ఉత్తమ విలన్ విడుదలకు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భాగస్వామ్యం అందిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రముఖ దర్శకుడు లింగుస్వామి చిత్ర నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్ నిర్మించిన ఉత్తమ విలన్, రజనీమురుగన్ చిత్రాల విడుదలలో భాగస్వామ్యం పంచుకుంటోంది. కమలహాసన్ త్రిపాత్రాభినయం చేసిన ఉత్తమ విలన్ చిత్రానికి ఆయన స్నేహితుడు, నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. పూజాకుమార్, ఆండ్రియ నాయికలుగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీన్ని ఈరోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తిరుపతి బ్రదర్స్ సంస్థ తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
'నాన్న కన్నా...ఆయన దగ్గరే ఎక్కువ పెరిగా'
చెన్నై: సినీనటుడు కమల్ హాసన్ బుధవారం ప్రముఖ దర్శకుడు బాలచందర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. బాలచందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో షూటింగ్ నిమిత్తం కమల్ హాసన్ లండన్లో ఉండటంతో బాలచందర్ను చివరి చూపు చూసేందుకు అవకాశం దక్కలేదు. చెన్నై చేరుకున్న కమల్ హాసన్ ఈరోజు ఉదయం బాలచందర్ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలచందర్ తనకు తండ్రిలాంటివారని, తన తండ్రి వద్దకన్నా ఆయన దగ్గరే ఎక్కువ పెరిగానని.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలచందర్ చివరిసారి 'ఉత్తమ విలన్' చిత్రంలో నటించటం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఆయన చిత్రాలను ప్రభుత్వం భద్రపరచి రేపటి తరాలకు అందించాలని కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు. -
అమెరికాలో ఉత్తమ విలన్ ఆడియో ఆవిష్కరణ
ఉత్తమ విలన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. విశ్వనాయకుడు కమలహాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రంతో పాటు కమల్ విశ్వరూపం-2, పాపనాశం చిత్రాల్లోనూ నటించారు. ఈ రెండు చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కాగా ఉత్తమ విలన్ చిత్రం మాత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకునే దశలో ఉంది. ఆండ్రియా, పూజాకుమార్, పార్వతీమీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ నటిస్తున్న మూడు చిత్రాలలో ఉత్తమ విలన్ ముందుగా తెరపైకి రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉత్తమ విలన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆ చిత్ర నిర్మాత తిరుపతి బ్రదర్స్ సంస్థ అధినేతలలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ను అడగ్గా ఉత్తమవిలన్ చిత్ర ఆడియో ఆవిష్కరణను ఎక్కడ నిర్వహించాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం కమలహాసన్ ఈ చిత్ర సౌండ్ మిక్సింగ్ కార్యక్రమం కోసం అమెరికాలో ఉన్నారని తెలిపారు. ఆయన చెన్నై తిరిగి రాగానే చిత్ర ఆడియో ఆవిష్కరణను ఎక్కడ నిర్వహించాలన్న విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే చిత్ర ఆడియోను జనవరి రెండో వారంలోనూ చిత్రాన్ని ఫిబ్రవరిలోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. -
కమలహాసన్ కు దక్కని 'చివరిచూపు'
చెన్నై: తన గురువు కె. బాలచందర్ ను కడసారి దర్శించుకునే అవకాశాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ కోల్పోయారు. అమెరికా నుంచి ఆయన ఈ రాత్రికి చెన్నై చేరుకునే అవకాశముంది. బాలచందర్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం ముగియనున్నాయి. తన తాజా చిత్రం 'ఉత్తమ్ విలన్' పోస్టు ప్రొడక్షన్ పనుల కోసం కమలహాసన్... లాస్ ఏంజెలెస్ కు వెళ్లారు. బాలచందర్ మరణవార్త తెలియగానే ఈ తెల్లవారుజామున కాలిఫోర్నియా నుంచి ఆయన బయలుదేరారని, ఈ రాత్రికి చెన్నై చేరుకుంటారని కమలహాసన్ మేనేజర్ తెలిపారు. బాలచందర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తారని చెప్పారు. బాలచందర్ తో కలిసి 40పైగా సినిమాలకు కమలహాసన్ పనిచేశారు. -
ఇవాళ్టికీ అదే తపన... అతనికి అదే శ్రీరామరక్ష!
ఒకరు అద్భుతమైన నటుడు... మరొకరు అంకితభావం ఉన్న నటి... వేరొకరు తెలుగు సినిమా దారేది అని చాలామంది వాపోతున్న తరుణంలో తళుక్కుమన్న రచయిత - దర్శకుడు. ముగ్గురివీ మూడు వేర్వేరు మార్గాలు... మూడు వేర్వేరు మనస్తత్వాలు... కానీ, ఇవాళ సినీ రంగం సగర్వంగా చెప్పుకొనే స్థాయి కృషి ఈ ముగ్గురి సొంతం. కమలహాసన్, అనుష్క, త్రివిక్రమ్ - ఈ ముగ్గురి పుట్టినరోజూ చిత్రంగా ఒకటే... నవంబర్ 7. సినిమాల్లోనే కాదు... బయటా జనం తలెత్తి చూసే ఈ ముగ్గురి గురించి... వారిని సన్నిహితంగా చూసిన మరో ముగ్గురు దిగ్గజాలు మనసు కిటికీ తెరిచి ‘సాక్షి’తో పంచు కుంటున్న అను భవాలు, అను భూతులు ఇవాళ్టి ఫ్యామిలీ గిఫ్ట్. - ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్ అప్పుడే కమలహాసన్కు అరవై ఏళ్ళు నిండాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇవాళ్టికీ అతనిలోని ఉత్సాహం, ఉద్వేగం చూస్తుంటే, అతనికి అంత వయసుందని అనిపించదు. దర్శకుడిగా కమలహాసన్తో నేను తీసిన చిత్రాలు మూడే! మా మొదటి సినిమా ‘సాగర సంగమం’. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారి వద్ద కమల్ డేట్లున్నాయి కాబట్టి, అతణ్ణి దృష్టిలో పెట్టుకొనే ‘సాగరసంగమం’ కథ అల్లుకొన్నా. బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించిన కమల్ పెద్దయ్యాక కొన్నాళ్ళు డ్యాన్స్మాస్టర్ తంగప్పన్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ‘సాగర సంగమం’లోని బాలు పాత్రను రాసుకున్నాను. కొన్ని ఘట్టాల్లో అతను చూపిన నటన ఇవాళ్టికీ చూస్తుంటే, ‘తీసింది నేనేనా, చేసింది అతనేనా’ అనిపిస్తుంటుంది. ఇన్నేళ్ళ తన కెరీర్లో అత్యుత్తమమైన 10 చిత్రాల జాబితా వేస్తే, అందులో ‘సాగర సంగమం’ ఒకటని కమల్ పదే పదే ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అన్ని భావోద్వేగాలూ ఉన్న ఆ చిత్ర రూపకల్పన ఇవాళ్టికీ ఓ తీపి గుర్తు. ఏది చేసినా అందులో ప్రత్యేకత, పర్ఫెక్షన్ ఉండాలని కమల్ భావిస్తాడు. దాని కోసం ప్రతి సన్నివేశంలో, సందర్భంలో ప్రయత్నిస్తాడు. సరిగ్గా అలాంటి తపనతో సినిమాలు తీసే మా లాంటి దర్శకులకు అతను బాగా ఉపయోగపడతాడు. అతను ఎంత ప్రొఫెషనల్ అంటే, దర్శకుడు ఆశించినది ఇచ్చే వరకు, చాలాసార్లు అంతకు మించి ఇచ్చేవరకు రాజీ పడడు. షాట్ తీస్తున్నప్పుడు మన రియాక్షన్లో ఏదైనా తేడా ఉన్నా, మనం సరేనని కట్ చెప్పడం ఒక్క సెకన్ ఆలస్యమైనా చటుక్కున గ్రహించేస్తాడు. ఆశించినంత తృప్తిగా రాలేదని గ్రహించి, మళ్ళీ చేయడానికి సిద్ధపడతాడు. అంత సునిశితమైన గ్రహణశక్తి అతనిది. మనం ఎదైనా చెబితే సహృదయంతో తీసుకుంటాడు. చాలామంది లాగా అహంభావానికి పోడు. అతనిలో కళాతృష్ణ ఇవాళ్టికీ తీరలేదు.తీరని దాహంతో ఆయన నిరంతరం కొత్త పాత్రలు, కథల కోసం అన్వేషిస్తూనే ఉంటాడు. అందుకే, అప్పటి ‘పుష్పక విమానం’ మొదలు ఇటీవలి ‘దశావతారం’ దాకా రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అలాంటి కథలు, పాత్రలతో ఎవరు వచ్చినా ధైర్యంగా ముందుకు వస్తాడు. ‘నీ పాత్ర గొప్ప ఫుట్బాల్ ఆటగాడి పాత్ర. కానీ, దురదృష్టవశాత్తూ రెండు కాళ్ళూ లేవు’ అని ఒక లైన్ చెప్పామనుకోండి. వెంటనే, సవాలుగా నిలిచే ఆ పాత్ర పోషించడానికి సిద్ధమైపోతాడు. పెపైచ్చు, చాలామందిలా అతనిది ఆరంభ శూరత్వం కాదు. సవాలుగా నిలిచే చిత్ర నిర్మాణాన్నో, పాత్రనో తీసుకున్న తరువాత చివరిదాకా అదే తపనను నిలుపుకొంటూ, పూర్తి చేస్తాడు. ఎక్కడా రాజీ పడడు. ఒక్కమాటలో చెప్పాలంటే, దర్శకుల నటుడు - కమల్. ఒక పాత్రను ఎలా మలుచుకోవాలనుకున్నా సరే, నటుడిగా అతణ్ణి ఎంచుకోవచ్చు. దర్శకుడు నిశ్చింతగా కళ్ళు మూసుకొని పాత్రను అతని చేతుల్లో పెట్టవచ్చు. తీసుకున్న పాత్రలోకి ఇమిడిపోవడానికి ఏవేం కావాలో అవన్నీ కమల్ సమకూర్చుకుంటాడు. ఆ పాత్రను పండించడం కోసం హోమ్వర్క్ చేస్తాడు. మొదటి రోజుల నుంచి ఇప్పటికీ అతని పద్ధతి అదే! అలాగే, షూటింగ్ జరుగుతుండగా అక్కడికక్కడ, అప్పటికప్పుడు బుర్రలో తళుక్కున మెరిసిన ఆలోచనను అమలు చేసేసి, సన్నివేశం అద్భుతంగా రావడానికి సహకరించే అరుదైన లక్షణం కమల్కు ఉంది. ఉదాహరణకు, ‘సాగర సంగమం’లో జయప్రదతో కలసి ఆలిండియా డ్యాన్స్ ఫెస్టివల్ ఆహ్వానపత్రిక చూసే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ఆ షాట్ చివరలో నాకేదో అనిపించి, ‘కమల్! ఒక్కసారిగా నవ్వేసెయ్’ అని పక్క నుంచి అరిచా. చాలామంది ఆర్టిస్టులు అలాంటి సందర్భాల్లో గందరగోళపడతారు. ‘కట్’ చెప్పారనుకుంటారు. కానీ, క్షణంలో వెయ్యోవంతులో కమల్ నా మాట గ్రహించి, అప్పడికప్పుడు నవ్వును జత చేర్చి, తన నట ప్రతిభతో ఆ సీన్ను పండించాడు. ‘దర్శకుడి భావం ఇదై ఉంటుంది, ఇలా చేయాలన్న’ సిక్స్త్సెన్స్ అతనికి బాగా పనిచేస్తుంది. ఇవాళ ఇంత పెద్ద స్టార్గా ఎదిగినప్పటికీ, ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న తపన ఉంది. అదే అతనికి శ్రీరామరక్ష. ‘శుభసంకల్పం’ చిత్రం అయిపోయిన తరువాత తమిళులకు పెద్ద పండుగ దీపావళికి అతను స్వయంగా మా ఇంటికి వచ్చి, మా దంపతులిద్దరికీ కొత్త బట్టలు పెట్టి, నమస్కారం చేసి వెళ్ళిన సంఘటన నాకిప్పటికీ గుర్తు. ఇవాళ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగినా, అదే భక్తి, గౌరవంతో ఉండడం అతని సంస్కారం. ఇక, సినీ జీవిత గురువు కె. బాలచందర్ అంటే భక్తి గౌరవాలే కాక, చనువు కూడా! ఇప్పటికీ తన కష్టసుఖాలన్నీ ఆయనతో మనసు విప్పి చెప్పుకుంటాడు. నన్ను బలవంతాన ఒప్పించి, నటుణ్ణి చేసింది కమలహాసన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాలే. వాళ్ళిద్దరూ పట్టుబట్టి, ‘శుభసంకల్పం’లో తొలిసారిగా నన్ను నటింపజేశారు. ఆ సినిమా అయిపోయాక కూడా, ‘ఇక్కడితో ఆపవద్దు. నటన కొనసాగించండి’ అని నాకు సలహా ఇచ్చింది కూడా కమలే! అలా నా రెండో ఇన్నింగ్స్ నటుడిగా మొదలై తాజా ‘ఉత్తమ విలన్’, రజనీకాంత్ ‘లింగా’ వరకు కొనసాగుతోంది. కమల్లో వెర్సటాలిటీ ఉంది. వినోదింపజేయగలడు. అంతే గొప్పగా విషాదమూ పలికించగలడు. ఇవాళ, దక్షిణభారతావని నుంచి వచ్చిన అత్యుత్తమ సినీ ప్రతిభాసంపన్నుల్లో అతను ఒకడని నిస్సందేహంగా చెప్పవచ్చు. అతను పుస్తకాలు బాగా చదువుతాడు. బాగా రాస్తాడు కూడా! తమిళంలో కొన్ని పాటలు అతనే రాశాడు. ఇక, సినిమాల్లో డైలాగులైతే, పేరుకు వేరొక డైలాగ్ రైటర్ ఉన్నా, కమల్ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందట! విభిన్నమైన కథాంశాలతో స్వయంగా చిత్రాలు నిర్మిస్తుంటాడు. ఇన్ని లక్షణాలున్న అతను దర్శకుడిగా కూడా వ్యవహరించడం పెద్ద విశేషమేమీ కాదు. అయితే, నేరుగా అతని దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇప్పటి దాకా రాలేదు. టీవీ, చలనచిత్రోత్సవాలు, ప్రపంచ సినిమా గురించి అతనికి ఉన్న అవగాహన కూడా చాలా ఎక్కువ. అందుకే, ఎప్పుడైనా వాటి ప్రస్తావన వచ్చి, మాట్లాడితే - అన్నీ పూసగుచ్చినట్లు చెబుతాడు. అలాంటి వ్యక్తికి తాజా సినీ సాంకేతిక పరిజ్ఞానం క్షుణ్ణంగా తెలిసుండడంలో ఆశ్చర్యం లేదు. ఒక్కమాటలో, ఇటు సృజనాత్మక అంశాల్లోనూ, అటు సాంకేతికంగానూ అతను దిట్ట. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధ్యాత్మిక అంశాలూ గొప్పగా మాట్లాడతాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా - ఇంత సాధించిన వ్యక్తికి ఇవాళ మా లాంటి వాళ్ళం కొత్త కథ, పాత్ర రూపకల్పన చేయడం కూడా కష్టమే. నిజం చెప్పాలంటే, అతని ఇమేజ్ ఇవాళ మాబోటి వాళ్ళకు అందకుండా వెళ్ళిపోయింది. ‘దశావతారం’, ‘విశ్వరూపం’ లాంటి స్థాయి ప్రయోగాలు తాజాగా చేసిన నటుడికి ఎలాంటి పాత్ర రాయాలన్నది పెద్ద సవాలే. అందుకే, ‘ఇప్పుడు నీకు తగ్గ కథ రాయడం కష్టం’ అని నవ్వుతూ అంటూ ఉంటా. అయితే, ‘నందనార్’, ‘రామానుజాచారి’ లాంటి చారిత్రక ప్రసిద్ధమైన పాత్రలకు అతను చక్కగా సరిపోతాడు. అలాంటి పాత్రలు చేయడం అతనికిష్టం కూడా! ఆ ప్రయోగాలు కూడా అతను చేస్తే, ఒక సినీ ప్రియుడిగా చూడాలని ఉంది. ఎప్పుడూ బద్ధకించకుండా, మనసులో ఏదో ఆలోచిస్తూ, కొత్తదనం కోసం అన్వేషించే కమల్ది మన సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అతని కన్నా వయసులో పెద్దవాణ్ణి కాబట్టి, అతనికి ఈ షష్టిపూర్తి క్షణంలో చెప్పేదొక్కటే - ‘‘శతమానం భవతి.’’ -
'సినిమా రచయితలంటే అంత చిన్నచూపా?'
భారతీయ సినిమా పరిశ్రమలో సినీ రచయితలను చిన్న చూపు చూస్తున్నారని ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత రమేష్ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకులు మొత్తం తామే చక్కబెట్టేయాలని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వస్తోందని అంటున్నారు. 'ఇక్కడ సమస్య ఏమిటంటే, ప్రతి ఒక్కళ్లూ ఇతరుల పనిలో వేలు పెడతామంటారు. దర్శకులు తాము దర్శకత్వం వహించి, రాసి, ఇంకా చాలా పనులు చేస్తున్నారు. అది సరికాదని నా అభిప్రాయం. సినిమాలోని ఇతర శాఖల్లో చాలా టాలెంట్ ఉంది. దాన్ని మనం వెలికితీసి, అందరితో ఆయా పనులు చేయించాలి. మన వద్ద మంచి రచయిత ఉంటే అతడికి రాసే అవకాశం ఇవ్వాలి. నాలుగు రూపాయల కోసం వాళ్ల అవకాశాలు లాక్కోవడం సరికాదు. నేనెప్పుడూ ఇతరుల శాఖల్లో వేలుపెట్టను' అని రమేష్ అరవింద్ చెప్పారు. ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న ఉత్తమ విలన్ చిత్ర కథను కమల్ హాసన్ రాశారు. -
డైలాగ్ రైటర్గా కమల్హాసన్
‘సకలకళావల్లభన్’ అనే బిరుదుకు సార్థకతను తెచ్చిన వ్యక్తి కమల్హాసన్. నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు.. ఆయన తరంలో కానీ, నేటి తరంలో కానీ ఎవరూ లేరన్నది నిజం. అభినయం పరంగానే కాకుండా, దర్శకునిగా, కథకునిగా, గాయకునిగా, నృత్యకారునిగా, గీత రచయితగా, సంభాషణల రచయితగా, నిర్మాతగా... పలు రంగాల్లో ప్రజ్ఞను చాటిన కళాకారుడు కమల్. ప్రస్తుతం ఆయన ‘ఉత్తమవిలన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో.. దర్శకుడు లింగుస్వామితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కమల్ సంభాషణలు కూడా అందించడం విశేషం. తొలుత క్రేజీ మోహన్తో సంభాషణలు రాయించాలనుకున్నారాయన. అయితే.. కథ తనదే కాబట్టి తానే స్వయంగా సంభాషణలు రాస్తే బావుంటుందని కమల్ భావించడంతో కొంత విరామం తర్వాత ఆయన కలం చేతబట్టారట. ఓ సీనియర్ సూపర్స్టార్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కమల్హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ అభినయం ప్రేక్షకుల్ని తన్మయత్వానికి లోను చేస్తుందని చెన్నయ్ టాక్. ఆండ్రియా, పూజాకుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్దత్, సంగీతం: గిబ్రన్. -
మళ్లీ పెన్ను పట్టనున్న కమల్ హాసన్
చెన్నై: సకల కళ వల్లభుడు కమల్ హాసన్ మళ్లీ పెన్ను పట్టనున్నారు. కమల్ హాసన్ హీరోగా తాజాగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉత్తమ విలన్'. ఆ చిత్రానికి కమల్ మాటలు అందించనున్నారని ప్రముఖ నటుడు, ఆ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ వెల్లడించారు. ఈ చిత్రానికి మాటలు రాసేందుకు ముందుగా క్రేజీ మోహన్ను అనుకున్నామని కానీ కమల్ను ఎంచుకున్నామని చెప్పారు. మాటల రచయితగా కమల్ వంద శాతం న్యాయం చేస్తారని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఆయన వివరించారు. మలయాళంలో రూపొందించిన దృశ్యం చిత్రం రీమేక్ పాపనాశమా తమిళ థ్రిల్లర్లో నటిస్తూ కమల్ యమా బిజీగా ఉన్నారని రమేష్ అరవింద్ చెప్పారు. -
మేకప్కే నాలుగు గంటలు
వైవిధ్యానికి చిరునామా కమల్ హాసన్ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. పరిపూర్ణమైన నటనను ఇలాంటి నటుడి నుంచే ఆశించగలం. పాత్రకు జీవం పోయడానికి శాయశక్తులా ప్రయత్నించే పద్మభూషణ్ కమల్ హాసన్ ఇంతకు ముందు దశావతారం చిత్రంలో పది పాత్రలకు ప్రాణం పోసి సినీ చరిత్ర పుటల్లోకెక్కారు. ఆయన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడానికి రాజులో నాలుగైదు గంటలు మేకప్కే కేటాయించారు. తాజాగా మరోసారి అలాంటి అనితర సాధ్య కార్యాల్లో లీనమవుతున్నారు. ఈ విశ్వనాయకుడు తాజాగా నటిస్తున్న చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి 1980 ప్రాంతపు రంగ స్థల నటుడి పాత్ర. ఈ పాత్ర రూపం కోసం మళ్లీ ఆయన మేకప్ కోసం నాలుగు గంటలు వెచ్చిస్తున్నారు. ఈ మేకప్ కోసం ఆయన తీసుకుంటున్న శ్రద్ధ అబ్బురపరస్తుంది. వేకువ జామునే లేచి మేకప్కు సిద్ధం అవుతున్నారు. మళ్లీ షూటింగ్ పేకప్ అయ్యే వరకు ఆ పాత్రలోనే లీనమవుతున్నారు. కమల్ ఉత్తమ విలన్ చిత్రంపై అంచనాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అభిమానులు కూడా కమల్ చిత్రం సంవత్సరం తరువాత వస్తుండడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కమల్ ప్రయోగాత్మకమైన , కళాత్మకమైన, వైవిధ్యభరితమైన చిత్రాల మీద దృష్టి పెట్టారు. దీంతో ఆయన బడ్జెట్ను ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. ఉత్తమ విలన్ చిత్రంలో పూజా కుమార్, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరాం, ఊర్వశి తదితరులు నటిస్తుండడం ప్రత్యేకత. నటుడు అరవింద్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. -
కమల్ దృశ్యం ఆవిష్కరణకు వేళాయే!
చూసే దృశ్యం ఏదైనా కనువిందు చేస్తే ఆహా ఎంత బాగుంది అని అనకుండా ఉండలేం. ప్రస్తుతం దృశ్యం చిత్రం కూడా. సినీ ప్రియులకు అలాంటి అనుభూతినే కలిగిస్తోంది. దక్షిణాదిలోని మలయాళం, కన్నడం, తెలుగు భాషల సినీ అభిమానులను విపరీతంగా అలరించిన ఁదృశ్యం* చిత్రం నాలుగో భాష అయిన తమిళ సినీ ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అవుతోంది. దీనికు ప్రఖ్యాత నటుడు పద్మభూషణ్ కమలహాసన్ ప్రధాన రూపం కానున్నారు. ఉత్తమ విలన్ చిత్రానికి తుది రూపం ఇస్తున్న కమలహాసన్ తదుపరి ఁదృశ్యం* ఆవిష్కరణకు సిద్ధం అవుతున్నారు. వైట్ ఆంగిల్ క్రియేషన్స్, రాజ్కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల చెన్నైలో జరిగాయి. చిత్ర షూటింగ్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించారుు. ఒరిజినల్ చిత్రం మలయాళంలో ఁదృశ్యం*ను తెరకెక్కించిన జీతు జోసఫ్కే తమిళంలోను దర్శకత్వం వహించనున్నారు. రచయిత జయమోహన్ సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర పాటల రికార్డింగ్ మొదలైంది. ఈ చిత్రంలో కమల్ ఇద్దరు పిల్లల తండ్రిగా నటించనున్నారు. తల్లిగా నటి గౌతమి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర ఇతర తారాగణం ఎంపిక జరుగుతోందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. -
షూటింగ్లో కమలహాసన్కు గాయాలు
ప్రముఖ నటుడు కమలహాసన్ షూటింగ్లో ప్రమదం కారణంగా గాయాలకు గురయ్యారు. దీంతో ఉత్తమ విలన్ షూటింగ్ రద్దయిం ది. కమలహాసన్ తాజాగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఉత్తమవిలన్ చిత్రా న్ని తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియ, పూజాకుమార్, పార్వతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే మూడు రోజుల క్రితం చిత్రంలో కమలహాసన్ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తుండగా చిన్న ప్రమా దం జరిగి ఆయన కాలుకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, దీంతో షూటింగ్ రద్దు అయినట్లు దర్శకుడు రమేష్ అరవింద్ తెలిపారు. కమల్కు పూర్తిగా ఆర్యోగం చేకూరిన తరువాత ఉత్తమ విలన్ షూటింగ్ చేస్తామని ఆయన తెలిపారు. -
మా ఇద్దర్నీ కలిపింది తనే!
ఓ దర్శక దిగ్గజం మరో దర్శక ప్రముఖుని గురించి మాట్లాడితే... వినేకొద్దీ వినాలనిపిస్తుంది. ఒకరు కె. విశ్వనాథ్ అయితే, మరొకరు కె. బాలచందర్. ఇద్దరి ఇంటి పేర్లు కేతో ఆరంభమైనట్లుగానే, సినిమాల విషయంలోనూ ఇద్దరి అభిరుచులూ దాదాపు ఒకటే. కళాత్మక చిత్రాల నుంచి విభిన్న వాణిజ్య చిత్రాల వరకూ ఇద్దరూ సృష్టించిన సంచలనాలు ఎన్నెన్నో. ఈ ఇద్దరు దర్శకులూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే ‘ఉత్తమ విలన్’. కమల్హాసన్ హీరోగా నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కమల్తో ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’లాంటి ఆణిముత్యాలను విశ్వనాథ్ రూపొందిస్తే, బాలచందర్ ‘అవళ్ ఒరు తొడర్ కథై’, ‘అపూర్వ రాగంగళ్’ వంటి అద్భుత చిత్రాలను రూపొందించారు. ఈ ఇద్దర్నీ తన గురువులుగా భావిస్తారు కమల్. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఉత్తమ విలన్’లో ఉన్న రెండు కీలక పాత్రలను ఈ ఇద్దరూ చేస్తే బాగుంటుందని కమల్ భావించారు. స్వయంగా ఈ ఇద్దర్నీ సంప్రదించి, ఒప్పించారట. ఈ విషయాన్ని కె. విశ్వనాథ్ స్వయంగా చెప్పారు. ‘‘బాలచందర్, నేను బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఎక్కువసేపు కలిసి మాట్లాడుకోవాలనుకునేవాళ్లం. కానీ, కుదిరేది కాదు. ఒకరికొకరం సినిమా మేకింగ్ గురించి తెలిసిన విషయాలు పంచుకోవాలనుకునేవాళ్లం. కానీ, తీరిక లేక అది జరగ లేదు. ఇప్పుడు బాలచందర్తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేటి తరం నటీనటులతో సినిమా చేయడంకూడా మంచి అనుభూతినిస్తోంది’’ అని విశ్వనాథ్ చెప్పారు. -
తేజ దర్శకత్వంలో కమల్హాసన్ త్రిభాషా చిత్రం?
కమల్హాసన్కి కథ చెప్పి ఒప్పించడం అంత సులభసాధ్యం కాదంటారు. కానీ మన తెలుగు దర్శకుడు తేజ చెప్పిన కథకు సింగిల్ సిట్టింగ్లోనే కమల్ ఓకే చెప్పేశారట. తేజ దర్శకత్వంలో మూడు భాషల్లో సినిమా చేయడానికి ఆయన పచ్చ జెండా ఊపారట. చెన్నై పాండీ బజార్లోనూ, హైదరాబాద్ ఫిలిమ్నగర్లోనూ ఈ వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో ‘ఉత్తమ విలన్’ షూటింగ్లో కమల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ‘దృశ్యం’ తమిళ రీమేక్లో నటించనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత తేజ ప్రాజెక్ట్ పట్టా లెక్కనుందని సమాచారం. చిత్రం, నువ్వు-నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన తేజకు ఇటీవల కాలంలో సరైన విజయాలు లేవు. కమల్ సినిమాతో మళ్లీ తన పూర్వవైభవం సాధించుకునే దిశగా తేజ కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో భారీ ఎత్తున ఆ చిత్రం తెరకెక్కనుందట. -
మళ్లీ కమల్, విశ్వనాథ్ కాంబినేషన్...
తెర వెనుక కె.విశ్వనాథ్, తెరపైన కమల్హాసన్.. ఇక చెప్పేదేముంది! తన్మయానందభరితం. అలా కాకుండా ఇద్దరూ కలిసి నటిస్తే! నయనానందభరితం. అసలు ఈ కాంబినేషన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తే కాదు. కమల్, విశ్వనాథ్ కలిసి నటించిన తొలి సినిమా ‘శుభసంకల్పం’. ఎస్పీ బాలు అభ్యర్థనను తోసిపుచ్చలేక తొలిసారి ఆ సినిమా కోసం ముఖానికి రంగేసుకున్నారు విశ్వనాథ్. ఆ తర్వాత పి.సి. శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన‘ద్రోహి’ సినిమా కోసం విశ్వనాథ్, కమల్ కలిసి నటించారు. ‘ద్రోహి’ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ రెండు దిగ్గజాలు తెరను పంచుకోబోతున్నాయి. రమేశ్ అరవింద్ దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా ‘ఉత్తమ విలన్’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ మామయ్యగా విశ్వనాథ్ నటిస్తున్నారు. కథలో ఇది కీలకమైన పాత్ర కావడంతో స్వయంగా కమల్హాసనే... ఈ పాత్ర నటించాలని విశ్వనాథ్ని కోరారట. దాంతో కాదనలేక ఆ పాత్ర చేయడానికి అంగీకారం తెలిపారు విశ్వనాథ్. కథానుగుణంగా ఇందులో 8వ శతాబ్దం నాటి సన్నివేశాలు కొన్ని ఉంటాయట. ఆ సన్నివేశాల్లో విశ్వనాథ్ కనిపిస్తారట. ఊర్వశి, పార్వతీ మీనన్, ఆండ్రియా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
'ఉత్తమ విలన్'లో కమల్ ద్విపాత్రాభినయం
కమల్హాసన్ ఉత్తమవిలన్ చిత్రం గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అదే తాజా అంశం. అందులో ఒక పాత్ర ఎనిమిదో శతాబ్దానికి చెందిన నాటక కళాకారుడిగా, మరో పాత్రలో 21వ శతాబ్దానికి చెందిన సినిమా నటుడిగా చేస్తున్నాడు. ఇందులో నాటక కళాకారుడి పాత్ర పేరు ఉత్తమన్ కాగా, సినిమా సూపర్స్టార్ పేరు మనోరంజన్ అని ఓ ప్రకటనలో సినిమా వర్గాలు తెలిపాయి. అలాగే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆండ్రియా జెర్మియా, పూజాకుమార్ ఇందులో నటిస్తున్నారు. వీళ్లలో మనోరంజన్ పక్కన ఆండ్రియా, ఉత్తమన్ పక్కన పూజాకుమార్ చేస్తారట. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో్ కె.విశ్వనాథ్, కె.బాలచందర్, జయరామన్, పార్వతీ మీనన్, ఊర్వశి, ఎంఎస్ భాస్కర్ కూడా నటిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ ఈ సినిమాకు నిర్మాతలు. -
నన్ను కాపీ మాస్టర్ అంటారా: కమల్
తనను కాపీ మాస్టర్ అంటారా అంటూ కమల్ హాసన్ మండిపడ్డారు. ఎరిక్ లాఫోర్గ్ అనే ఫ్రెంచి ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో ఆధారంగానే కమల్హాసన్ తన ఉత్తమవిలన్ పోస్టర్ను రూపొందించారంటూ వచ్చిన ఆరోపణల మీద ఆయన స్పందించారు. ''తెయ్యం కళ దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటిది. దానికి సంబంధించిన మేకప్ను ఓ మంచి కళాకారుడు చేశాడు.ఆయన ఈ కళకు సంబంధించి మూడో తరం కళాకారుడు. లైటింగ్ మాత్రం కొంత ఒకేలా ఉండొచ్చు. అంతమాత్రాన దాన్ని కాపీ అంటే ఎలా కుదురుతుంది? ఇది ఎలా ఉంటుందంటే, ఇద్దరు ప్రేమికులు ఒకరి ఎదమీద ఒకరు తలవాల్చుకుని ఉంటే, వారు ఏక్ దూజే కే లియే సినిమా పోస్టర్ను కాపీ కొట్టారన్నట్లు చెప్పినట్లుంటుంది'' అని కమల్ అన్నారు. తమిళనాడులోని కొత్తు సంప్రదాయానికి సంబంధించిన తెయ్యం డాన్సు ఫ్యుజన్ ఈ సినిమాలో ఉంటుందని, దానికి తగ్గట్లుగా ముఖానికి పెయింటింగ్ వేసుకోవడం అంత సులభం కాదని ఆయన చెప్పారు. ఇదేమీ మాస్కు కాదని, మొత్తం ముఖం మీద దాన్ని పెయింట్ చేయడానికి నాలుగు గంటలు పట్టిందని అన్నారు. ఇది అనేక తరాలుగా వస్తున్న సంప్రదాయమని ఆయన తెలిపారు. కామెడీ సినిమా చేయడానికి కూడా సిద్ధపడే ఓ సూపర్స్టార్ జీవితాన్ని తన సినిమా ప్రతిబింబిస్తుందని చెప్పారు. -
ఉత్తమవిలన్లో కమల్హాసన్, జయరాం
పంచతంత్రం సినిమాలో విజయవంతంగా కామెడీని పండించిన కమల్హాసన్, జయరాం ఇప్పుడు కొత్తగా రూపొందుతున్న ఉత్తమవిలన్ చిత్రంలోనూ కలిసి కనిపించబోతున్నారు. ఉళగనాయకన్ (అంతర్జాతీయ హీరో) కమల్హాసన్తో కలిసి ఉత్తమవిలన్ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు జయరాం తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశాడు. పంచతంత్రం సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించిన పలు సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. వయసు మీరిపోతున్న సూపర్స్టార్ పాత్రను ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ పోషిస్తున్నాడు. కమల్ స్వయంగా కథ అందించిన ఈ సినిమాకు కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. By mistake my previous tweets got deleted.. Posting again my snap from Kamal Haasan's @Uttama_Villain :) :) pic.twitter.com/ykbRROE66x — Jayaram (@UrsJayaramActor) March 12, 2014 -
నేటి నుంచి ఎల్లారమ్మజాతర
జామి,న్యూస్లైన్: భక్తుల కొంగుబంగారం, ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన జామి ఎల్లారమ్మ జాతర నేటినుంచి ప్రారం భం కానుంది. శనివారం తొలేళ్ల ఉత్సవం, ఆదివారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ఈ జాతరకు ఉత్తరాంధ్రలోని పలుప్రాంతాలనుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు సుమారు లక్షకు పైగా హజరవుతారు. ప్రతి ఏడాది దేవాదాయకమిటీ ఆధ్వర్యంలో జాతర నిర్వహించేవారు. ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అమలు, న్యాయస్థానం ఉత్తర్వుల మేర కు ప్రభుత్వం ఉత్సవ కమిటీలను రద్దుచేయడంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాదీ పాల్గుణ శుద్ధ అష్టమి రోజున జాతర నిర్వహించడం అనావాయితీగా వస్తోంది. ఏర్పాట్లు పూర్తి జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. అమ్మవారి దర్శన నిమిత్తం బారికేడ్లను ఏర్పాట్లు చేశా రు. ఆలయానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దా రు. ముందుజాగ్రత్త చర్యగా మేజర్ పంచాయతీ సర్పంచ్ ఇప్పాక వెంకట త్రివేణి, ఈఓ కేవీ.రమణ ఆధ్వర్యంలో గ్రామంలోని తాగునీటి బోర్లలో క్లోరినేషన్ చేస్తున్నారు. జాతర సందర్భంగా రెండుపూటలా తాగునీటి సరఫరా ఇవ్వనున్నారు. ఎంపీడీఓ సీహెచ్.లక్ష్మీబాయి, ఈఓపీఆర్డీ కె.ధర్మారావు, ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. జాతర లో జామి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. 108 వాహనాన్ని జాతరలో సిద్ధంగా ఉంచడానికి సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ఎంపీడీఓ లక్ష్మీబాయ్ తెలిపారు. పోలీస్ బందోబస్తు జాతరలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా గట్టి పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఎం.ప్రశాంత్కుమార్ తెలిపారు. 130 మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. జాతరకు సహకరించాలి జాతరకు అందరూ సహకరించాలని దేవాదాయశాఖ ఈఓ వి.అప్పారావు కోరారు. అమ్మవారిదర్శనానికి ఈ ఏడాది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఐపీ పాస్ లు రద్దుచేశామన్నారు. శీఘ్రదర్శనానికి 20,ప్రత్యేకద ర్శనానికి 10, విశిష్టదర్శనానికి 30 చొప్పున ఖరారు చేశామన్నారు. వికలాంగులు, వృద్ధులు విశిష్ట దర్శనం క్యూలోఅమ్మవారిని సందర్శించ వచ్చునని చెప్పారు. -
కమల్ 'ఉత్తమ విలన్' పోస్టర్ కాపీయా?
విశ్వరూపం లాంటి సీరియస్ చిత్రం తర్వాత కమల్హాసన్ తీస్తున్న కామెడీ చిత్రం ఉత్తమవిలన్ షూటింగ్ ప్రారంభమైంది. కమల్ స్నేహితుడు, కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు షెడ్యూళ్లలోనే పూర్తవుతుంది. అయితే, ఉత్తమ విలన్ పోస్టర్ విడుదల కాగానే విమర్శకులు దాన్ని కాపీగా అనుమానిస్తున్నారు. ఫ్రెంచి ఫొటోగ్రాఫర్ ఎరిక్ లాఫోర్గ్ కేరళకు చెందిన తెయ్యం అనే నృత్యరూపాన్ని ఫొటో తీయగా.. అచ్చం అలాగే కమల్ తన మేకప్ చేయించుకున్నారని అంటున్నారు. ''రెగ్యులర్ షూటింగ్ బెంగళూరులో ప్రారంభమైంది. కమల్ సార్ రెండు నాన్ స్టాప్ షెడ్యూళ్లలోనే సినిమా మొత్తం తీసేద్దామంటున్నారు. గత రెండు వారాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో లొకేషన్లు వెతకడంలోనే ఆయన గడిపారు'' అని ఈ సినిమా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ చిత్రంలో హీరోయిన్ సహా ప్రధాన పాత్రలు పోషించేది ఎవరన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే.. ప్రముఖ దర్శకుడు, తన గురువు కె.బాలచందర్ను మాత్రం ఓ ముఖ్యపాత్రలో నటింపజేస్తున్నారు. గతంలో పంచతంత్రం, వసూల్రాజా ఎంబీబీఎస్ లాంటి కమల్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత క్రేజీ మోహన్ ఈ చిత్రానికి కూడా డైలాగులు అందిస్తున్నారు. -
కమల్తో ముద్దుకు సై
మహానటుడు కమల్హాసన్ సరసన నటించాలని కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ కాజల్ మాత్రం అంతటి అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదులుకుంది. డేట్స్ సర్దుబాటు చేయలేకే ఆ అవకాశాన్ని చేజార్చుకున్నానని కాజల్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. అయితే... ఉన్నట్లుండి డైరీ ఖాళీ అయ్యిందో ఏమో... కమల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కాజల్. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఉత్తమ విలన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. తిరుపతి బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవే లేదని సమాచారం. ఈ మధ్య ఎక్కువగా సీరియస్ పాత్రలే చేసిన కమల్ని కాస్తంత కొత్తగా రొమాంటిక్ యాంగిల్లో చూపించాలని తమిళ రచయిత క్రేజీ మోహన్ ఓ అద్భుతమైన కథను ఈ సినిమాకోసం తయారు చేశారట. కథ రీత్యా ఇందులో అధర చుంబనాలు కూడా ఉన్నాయని సమాచారం. వాటికి కూడా కాజల్ ‘సై’ అనేశారట. మరి రేపు దక్షిణాదిన ఈ సినిమా ఎన్ని సంచల నాలకు కేంద్రబిందువు కానుందో వేచిచూడాలి.