brahmaji
-
లైలా ఈవెంట్లో పృథ్వీదే వందశాతం తప్పు: బ్రహ్మజీ
టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన లైలా మూవీ ఈవెంట్ వివాదంపై స్పందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన మాటలు వందశాతం తప్పని బ్రహ్మజీ అన్నారు. ఈ విషయంలో పృథ్వీని టార్గెట్ చేయడం సరైందే అని తన అభిప్రాయం వెల్లడించారు. సినిమా ఈవెంట్కు వచ్చి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. బ్రహ్మజీ మాట్లాడుతూ..' లైలా ఈవెంట్లో పృథ్వీది తప్పు. సినిమా ఈవెంట్కు వచ్చి అలా మాట్లాడకూడదు. పృథ్వీ మీద రియాక్ట్ అయిన వాళ్లందరూ కరెక్టే. ఎలక్షన్స్ అయిపోయాయి. కొత్తగా నువ్వు ఇప్పుడు వచ్చి అలా మాట్లాడటం చాలా తప్పు. హీరో మంచి వ్యక్తి. ప్రతి చిన్న సినిమా ఫంక్షన్కు విశ్వక్ సేన్ వస్తాడు. పరిచయం లేకపోయినా సరే పిలిస్తే వెళ్లి సపోర్ట్ చేస్తాడు. మా బాపు సినిమా ఈవెంట్కు వచ్చి గంటన్నర్ర కారులోనే కూర్చున్నాడు. లైలా ప్రమోషన్లో ఉండి కూడా మాకు మద్దతు తెలిపేందుకు వచ్చాడు. అలాంటి వ్యక్తి సినిమాకు వచ్చి నువ్వేదో మాట్లాడటం సరైన పద్ధతి కాదు.' అని అన్నారు.(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్.. ఈ బుద్ధి ముందుండాలి!)ప్రస్తుతం బ్రహ్మాజీ బాపు మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే బాపు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. -
బాపు అరుదైన సినిమా: రానా దగ్గుబాటి
రెగ్యులర్కి భిన్నంగా ఉండే ‘బాపు’లాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఒక సంస్కృతిని చూపించే ఇలాంటి చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకుల్లా నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati ) అన్నారు. బ్రహ్మాజీ(Brahmaji) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘బాపు’(Bapu). దయా దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.హైదరాబాద్లో నిర్వహించిన ‘బాపు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి రానా దగ్గుబాటి, నటుడు తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ– ‘‘బాపు’ ట్రైలర్లో మట్టివాసన కనిపించింది. దయాగారు చాలా మంచి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘మన కుటుంబంలోని పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి.ఈ మూవీని అందరం ్రపోత్సహిద్దాం’’ అని దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పేర్కొన్నారు. ‘‘బాపు’ మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి మంచి పేరు రావాలి’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్స్లో చూడాలి’’ అని దయా కోరారు. ‘‘నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘బాపు’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్. -
బ్రహ్మాజీ 'బాపు' ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఒక రైతు బాధను కళ్లకు కట్టేలా చూపించే 'బాపు'.. ట్రైలర్ చూశారా?
బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'బాపు'. ‘ఎ ఫాదర్స్ స్టోరీ’ అనేది ట్యాగ్లైన్. ఈ సినిమాను దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాపు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు.ట్రైలర్ చూస్తే తండ్రి పడే కష్టాలను తెరపై చూపించనున్నట్లు తెలుస్తోంది. ఒక రైతు తన పిల్లల కోసం పడే తపన, బాధలను కథాంశంగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో బలగం సుధాకర్ రెడ్డి, బ్రహ్మజీ తండ్రీ, కుమారులుగా నటించారు. గతంలో విడుదలైన టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతమందించారు. -
నాగ్ అశ్విన్.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ
నాగ్ అశ్విన్.. మొన్నటి వరకు ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు తప్పితే..పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం మార్మోగిపోతోంది. యావత్ సినీ ప్రపంచం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దానికి కారణంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది.(చదవండి: కల్కి దెబ్బకు 'షారుఖ్ ఖాన్' రికార్డ్ బద్దలైంది) నాగ్ అశ్విన్ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడని పొగిడేస్తున్నారు. సామాన్యులు మొదలు..స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ‘కల్కి 2898 ఏడీ’పై రివ్యూ ఇస్తూ.. నాగ్ అశ్విన్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదైన శైలీలో ‘కల్కి 2898 ఏడీ’ టీమ్పై ప్రశంసలు జల్లు కురిపించారు. (చదవండి: ఆ సంఘటనతో భయమేసింది: నాగ్ అశ్విన్)ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడు. ఆ విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తూ రిలీజ్ రోజు అరిగిపోయిన చెప్పులను తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో సినిమా తీసే డైరెక్టర్ ఎంత సింపుల్ ఉంటాడో చూడండి అంటూ.. ఆయన చెప్పుల ఫోటోలను వైరల్ చేశారు నెటిజన్స్. దానికి సింక్ ఆయ్యేలా బ్రహ్మాజీ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. తెలుగు సినిమా అనుకొంటే వరల్డ్ సినిమా తీశారు . నాగ్ అశ్విన్ గారు.. మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటా. థ్యాంక్యూ ప్రియాంక ,స్వప్న (నిర్మాతలు). మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష’ అని బ్రహ్మాజీ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం బ్రహ్మాజీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు సినిమా అనుకొంటే world సినిమా తీశారు .@nagashwin7 గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను ❤️..thank యూ ప్రియాంక ..స్వప్న ..మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష 🙏🏼 .#Kalki2808AD 🔥@VyjayanthiFilms 🙏🏼— Brahmaji (@actorbrahmaji) July 1, 2024 -
మరి ఎక్కడ తినమంటారు సార్?: టాలీవుడ్ నటుడు ఆసక్తికర ప్రశ్న
గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పలుచోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, ఎక్స్పైరీ అయిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. పలు హోటల్ యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడుల్లో ఇంత పెద్దఎత్తున హోటల్ యజమాన్యాలు నిర్లక్ష్యం బయటపడడంతో ఆహార ప్రియుల గుండెల్లో దడ మొదలైంది.తాజాగా ఈ దాడులపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫుడ్ సెఫ్టీ కమిషనర్ ట్వీట్ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇలా అయితే మరీ ఎక్కడ తినాలి సార్? ఇంట్లోనేనా? అని రిప్లై ఇచ్చారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లో కుదరని సమయాల్లో ప్రముఖ రెస్టారెంట్స్కు వెళ్తుంటారు. ఇలా భాగ్యనగరంలో హోటల్ యజమాన్యాల నిర్లక్ష్యానికి ఆహార ప్రియులు భయపడుతున్నారు. ఇక నుంచి బయట తినాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. Sirr.. Mari ekkada thinamantaru..? Intilonaaa ..? https://t.co/Vs8r0kd83A— Brahmaji (@actorbrahmaji) May 23, 2024 -
బ్రహ్మాజీ కుమారుడు ‘గుట్టు చప్పుడు’ టీజర్
డాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘గుట్టు చప్పుడు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్రావ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్గా ఆయేషాఖాన్ నటిస్తుంది. రొమాంటిక్ మాస్ యాక్షన్ లవ్, ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని మణీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారథ్యంలో వస్తున్న ఈ సినిమాను డాక్టర్ లివింగ్స్టన్ నిర్మిస్తున్నారు.బ్రహ్మాజీ మాట్లాడుతూ... 'టైటిల్కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉంది. టీజర్ను సాయి దుర్గాతేజ్ ఆన్లైన్లోను, నేను ఆఫ్లైన్లోను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్ కుదిరారు. భారీ బడ్జెట్తో తీశారు.ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్ ఇవ్వలేదు' అని నవ్వుతూ అన్నారు.నిర్మాత లివింగ్స్టన్ మాట్లాడుతూ... 'డైరెక్టర్ మణీంద్రన్ కథ చెప్పినప్పుడు ఎగ్జైట్గా ఫీలయ్యా. ఆయనతో నాకు 12 సంవత్సరాల అనుబంధం ఉంది. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మంచి ఆర్టిస్ట్లు, టెక్నీషియన్స్తోనే చేయాలని ముందే డిసైడ్ అయ్యాము. అందుకే పాన్ ఇండియా రేంజ్కు ఎదిగిన సంగీత దర్శకులు హరి గారితో పాటు ఇతర టెక్నీషియన్స్ను కూడా మంచి వారిని ఎంచుకున్నాం. ఇదొక ప్రేమ, యాక్షన్, రొమాంటిక్తో పాటు మంచి మెసేజ్తో కూడిన సినిమా. హీరో సంజయ్ రెండు రకాల షేడ్స్ను అద్భుతంగా చేశారు. సినిమాలో ఇంకా మంచి స్టఫ్ ఉంది. క్లైమాక్స్ ఫైట్ను ముందుగా 15 లక్షలతో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం దాదాపు 75 లక్షల రూపాయలతో జహీరాబాద్ షుగర్ ఫ్యాక్టరీలో తీశాం.' అని ఆయన అన్నారు. -
అతన్ని చూస్తే భయమేస్తోంది.. రిటైర్ అవుతానంటున్న బ్రహ్మజీ!
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో దాదాపు వందల చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలతో నటించిన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాదిలో విహాన్ తెరకెక్కించిన 'హ్యాంగ్ మాన్' చిత్రంలో ఖైదీలను ఉరి తీసే వైవిధ్యమైన తలారి పాత్రను పోషించారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు మోసాలు చేస్తున్నారంటూ అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రహ్మజీ చేసిన మరో ట్వీట్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'బ్రహ్మజీ గొప్ప మనసు.. డబ్బులు తీసుకోకుండానే చేశాడు') ఇటీవల నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో పిల్లల చదువుల గురించి నవీన్ మాట్లాడే సీన్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. అంతే ఈ సీన్ ట్విట్టర్లో చూసిన బ్రహ్మజీ సైతం ఫిదా అయ్యారు. పోలిశెట్టి నటన చూస్తే నాకు భయమేస్తోంది.. ఇక నేను రిటైర్ అయిపోతా అంటూ ఫన్నీ పోస్ట్ చేశారు. దీనికి నవీన్ సైతం 'మీకు పవర్ ఉంది.. నాకు బ్రెయిన్ ఉంది.. మనిద్దరం కలిస్తే' అంటూ ఫన్నీగానే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ ట్వీట్ సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. Ee abbayi talent chusthe naaku bhayamesthundi..ika Nenu retire ayipothe better..🙏🏼🙏🏼🙏🏼 https://t.co/3xQY0hgw1f — Brahmaji (@actorbrahmaji) October 8, 2023 -
వాళ్లే టార్గెట్.. బీ కేర్ఫుల్.. వైరలవుతోన్న బ్రహ్మజీ ట్వీట్!
ప్రస్తుత కాలంలో ప్రజలు ప్రతి రోజు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. చదవుకున్న వాళ్లు సైతం సైబర్ ఉచ్చులో పడి లక్షల్లో మోసపోతున్న సంఘటనలు చూశాం. అయితే సినీ తారలు సైతం వీరి మోసాల పడుతూనే ఉన్నారు. సైబర్ మోసాలు పెరుగుతున్న ఈ రోజుల్లో.. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. సైబర్ తరహాలో సినీ రంగంలో జరుగుతున్న సరికొత్త దోపిడీని తెరపైకి తీసుకొచ్చారు. సినిమా అవకాశాల పేరిట మోసగిస్తున్నారంటూ అలాంటి వారి వివరాలను ట్వీట్లో ప్రస్తావించారు. (ఇది చదవండి: ఆ హీరోతో తొలిసారి జోడీ కడుతున్న నిత్యామీనన్..) బ్రహ్మజీ ట్వీట్లో రాస్తూ..' అందరికీ హెచ్చరిక.. ఈ సెల్ నంబర్(78268 63455 ) డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మేనేజర్ నంబర్లా ఉంటుంది. అతని పేరు నటరాజ్ అన్నాదురై. అతను కాల్ చేసి.. సార్ నేను లోకేశ్ మేనేజర్ను. మీ ప్రొఫైల్ ఆయన తదుపరి సినిమా కోసం ఎంపిక చేయబడింది. ఈ సినిమా కోసం కాస్ట్యూమ్లు అవసరమవుతాయి. ఆడిషన్ కాస్టూమ్స్ కోసం మీరు డబ్బులు చెల్లించండి. ఆడిషన్స్ అయ్యాక మీరు చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామని అంటారు. ప్రస్తుతం ఇది చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్న కొత్త తరహా మోసం.. అబ్బాయిలు జాగ్రత్త..' అంటూ షేర్ చేశారు. అంతేకాకుండా ఆ వ్యక్తిలాగే ఇంకొకరు ఉన్నారంటూ ఫోన్ నెంబర్ వివరాలతో సహా బ్రహ్మజీ ట్వీట్ చేశారు. సత్యానంద్(90877 87999) అనే వ్యక్తి సినిమాల్లోకి రావాలనుకునే వారే లక్ష్యంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారంటూ తెలిపారు. అతన ఓ ప్రముఖ సంస్థ జర్నలిస్ట్లా చెప్పుకుంటూ మోసాలకు చేస్తున్నారని.. ఇలాంటి వారి పట్ల బీ కేర్ఫుల్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మజీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇది చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?) Another fraud guy from Tamilnadu Satydev 90877 87999.. these guys target upcoming actors.. now am getting compliments from new actors.. be careful guys.. — Brahmaji (@actorbrahmaji) October 5, 2023 Alert .. Ph no.. 78268 63455 Name-Natraj Annadurai - Hi everyone, the above number will pose as @Dir_Lokesh sir manager and tell your profile was selected for his next movie.. nd exact costumes will be required for they will bring as rent for which you need to pay and then… — Brahmaji (@actorbrahmaji) October 5, 2023 -
శ్రీలీల డాన్స్ చేస్తుంటే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది
-
Brahmaji Latest Interview: ఫస్ట్ టైమ్ తన గ్లామర్ సీక్రెట్ రివీల్ చేసిన బ్రహ్మాజీ
-
అదే నా ఆస్తి – బ్రహ్మాజీ
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ. -
ఆర్జీవీకి కథ చెబితే ‘కుక్క మొగుడు’ అని టైటిల్ పెట్టాడు : బ్రహ్మాజీ
‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ స్టోరీని రామ్ గోపాల్వర్మకు వినిపించి టైటిల్ అడిగితే ‘కుక్క మొగుడు’అయితే బాగా సెట్ అవుతుందని చెప్పారు. కానీ మా నిర్మాత మాత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్ అని పెడితేనే బాగుంటుందని ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కథ, కథనం రెండూ కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’అని సీనియర్ నటుడు బ్రహ్మాజీ అన్నారు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ప్రణవి మానుకొండ హీరోయిన్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన బ్రహ్మాజీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ టైంలోనే నిర్మాత అప్పి రెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పాను. ఇందులో లాయర్ పాత్రను మీరే అనుకుంటున్నామని అప్పుడు చెప్పారు. మరి హీరో ఎవరు అని అడిగితే.. ఇంకా డిసైడ్ కాలేదని అన్నారు. ఆ తరువాత ఓ నెలకు మా అబ్బాయిని అడగమని అన్నారు. సంజయ్కి స్టోరీ చెబితే నచ్చింది. అలా సినిమా స్టార్ట్ చేశాం. ►సంజయ్ డాగ్ లవర్ అవ్వడంతో కాన్సెప్ట్కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మొన్న ఓ సారి పుష్ప పార్ట్ 2 షూటింగ్లో ఉన్నాను. రాత్రి పూట షూటింగ్ జరుగుతోంది. బన్నీ ఆ ట్రైలర్ను చూసి నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు. ట్రైలర్ నిజంగా బాగుందని అన్నాడు. టీం అందరికీ చెప్పి చూపించాడు. ►మామూలుగా నేను కొత్తగా చేసే పాత్రలు రావు. ఎందుకంటే రకరకాల పాత్రలు చేసి ఉన్నాను. కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త కారెక్టర్ దొరికింది. ఓల్డ్ సిటీలో ఉండే లాయర్. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే ఓ కారెక్టర్. విడాకుల స్పెషలిస్ట్ లాయర్గా ఇందులో కనిపిస్తాను. ► సప్తగిరి నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో మా ఇద్దరి సీన్లు పోటాపోటీగా ఉంటాయి. సప్తగిరి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఇందులో జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్గా నిలుస్తుంది. ► జూలై 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. అదే టైంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని జూలై 29న ఫిక్స్ అయ్యాం. ► భీమ్స్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. ఆయన ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. మా సినిమాకు మంచి మాస్, మెలోడీ పాటలు ఇచ్చారు. మ్యూజికల్ హిట్ అవుతుంది. ► సుకుమార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తాను అని అన్నారు. కానీ అర్జెంట్గా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. రాలేకపోతోన్నాను.. వీడియో బైట్ పంపిస్తాను అని మెసెజ్ పెట్టారు. ఆయన ఇక్కడ ఉండుంటే.. కచ్చితంగా వచ్చేవారు. ► ప్రస్తుతం మహేశ్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సలార్, బాలయ్య గారి భగవంత్ కేసరి, ఊరి పేరు భైరవకోన, నాగ శౌర్యతో ఓ సినిమా చేస్తున్నాను. ప్రభాస్ సలార్ సినిమాలో కొత్త కారెక్టర్ వేస్తున్నాను. రెండో పార్ట్లోనే ఎక్కువగా కనిపిస్తాను. -
Slumdog Husband Movie: ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టని ఇంటర్వ్యూ
-
డైరెక్టర్ను కత్తి పట్టుకుని బెదిరించిన బ్రహ్మాజీ, ఎందుకంటే?
నటుడు బ్రహ్మాజీ కత్తిపట్టుకుని డైరెక్టర్ను బెదిరించాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు అనిల్ రావిపూడి. మైకు పట్టుకుని బిజీగా ఉన్న అనిల్ రావిపూడి దగ్గరకు వెళ్లి అతడి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కత్తితో బెదిరించేంత గొడవ ఏం జరిగిందా? అనుకోకండి.. ఇక్కడుంది బ్రహ్మాజీ కదా.. తన కుమారుడి సినిమా రిలీజ్ డేట్ కాస్త వెరైటీగా అనౌన్స్ చేశాడు. ఫన్ అండ్ ప్రమోషన్ కలిపి అనిల్ రావిపూడితో రిలీజ్ డేట్ చెప్పించాడు. ఈ క్రమంలోనే ఈ సరదా స్కిట్ చేశారు. స్కిట్లో భాగంగా.. సినిమా షూటింగ్లో ఉన్న అనిల్ రావిపూడి దగ్గరకు బ్రహ్మాజీ వెళ్లి డిస్టర్బ్ చేస్తాడు. అన్న, ఒక వీడియో పెట్టవా? స్లమ్డాగ్ హస్బెండ్ సినిమా రిలీజ్ డేట్ చెప్పవా? అని అడుగుతాడు. మొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ అన్నావ్, సాంగ్ అన్నావ్.. పదేపదే వస్తానే ఉంటవా? నన్ను వదిలెయ్ అని కసురుకోవడంతో బ్రహ్మాజీ తన దగ్గరున్న కత్తికి పని చెప్పాడు. మెడ దగ్గర కత్తి పెట్టడంతో అనిల్ రావిపూడి.. స్లమ్డాగ్ హస్బెండ్ జూలై 29న రిలీజ్ అవుతుందని చెప్పాడు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను నవ్విస్తోంది. ఇకపోతే బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం స్లమ్డాగ్ హస్బెండ్. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రణవి మానుకొండ హీరోయిన్గా నటించింది. ఇందులో ఓ శునకం ముఖ్యపాత్రలో కనిపించనుండగా.. జూలై 29న గ్రాండ్గా రిలీజవుతోంది. Funny Banter Between @actorbrahmaji & Blockbuster director @AnilRavipudi 😅 #SlumDogHusband hits the screens on 29th July@SanjayROfficial @Pranavimanukon2@ar_sreedhar @Appireddya @Mic_Movies @RelianceEnt @kvrajendra @GskMedia_PR @saregamasouth pic.twitter.com/TrKHqyhhvz — BA Raju's Team (@baraju_SuperHit) July 23, 2023 చదవండి: ఇంతదాకా వచ్చెందుకు సిగ్గెందుకో? ముఖం దాచుకున్న లైగర్ బ్యూటీ -
విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మెన్టూ (#MenToo). బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ. అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీకి రానుంది. (ఇది చదవండి: Mentoo Movie: #మెన్టూ మూవీ రివ్యూ) ఈ మూవీ జూన్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా స్టిల్ని షేర్ చేస్తూ.. ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్ అనౌన్స్మెంట్ మీ కోసమే అంటూ క్యాప్షన్ పెట్టింది. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం కామెడీతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) Prapancha Purushothhamulaara...!🙋♂️ A Big Announcement for you....👉#MENTOO Antu vachesthunnaru ee frustrated front uu...!😛#MenTooOnAHA Premiers June 9th!@nareshagastya @kaushikghan @PriyankaOffl @IRiyaSuman @MouryaSIddavar1 @SrizTweets @harshachemudu pic.twitter.com/fQHDbnvosK — ahavideoin (@ahavideoIN) June 2, 2023 -
#మెన్టూ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: #మెన్టూ(MenToo) నటీనటులు : నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీకాంత్ జి. రెడ్డి నిర్మాత : మౌర్య సిద్ధవరం సినిమాటోగ్రఫీ : పీసీ మౌళి సంగీతం : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ విడుదల తేదీ: మే 26, 2023 నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం #MenToo. . శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యూత్ను ఎలా అలరించిందో చూద్దాం . అసలు కథేంటంటే.. ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన కష్టనష్టాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆ పబ్ ఓనర్(బ్రహ్మాజి), అందులో పనిచేసే బాయ్(సుదర్శన్) కూడా వారి సాదక, బాధకాలు షేర్ చేసుకుంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో ఎక్సీపీరియన్స్. ఒకరు భార్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది షేర్ చేసుకుంటే... ఇంకొకరేమో తనను అనవసరంగా వేధింపులతో తనువు చాలించడం... మరొకరేమో విదేశాలకు వెళ్లడం ఇష్టం లేక ప్రియురాలికి దూరం కావడం... ఒకరేమో ప్రియురాలి ఎక్స్పేక్టేషన్స్ అందుకోలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడే మగాళ్లంతా... చివరకు ఏమి చేశారనేదే మిగతా కథ. కథ ఎలా సాగిందంటే.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్కి మంచి ఆదరణే ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా తీస్తే... యూత్ బాగా ఆదరిస్తారని ఇది వరకు చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి సినిమానే #MenToo. కేవలం అమ్మాయిలే కాదు... వేధింపులకు గురై బాధపడే అబ్బాయిలు కూడా ఉంటారు అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యం మనం చుట్టూ యువతీ యువకుల్లో జరిగే అంశాల ఆధారంగా కొంత మెసేజ్ ఇస్తూనే... యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా మలిచారు దర్శకుడు. కథ... కథనాలతో ఎక్కడా బోర్ లేకుండా నలుగురు యువకుల మధ్య జరిగిన సంఘటనలను ఎంతో ఎమోషనల్గా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్లో రాహుల్ కథతో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ నిచ్చిన దర్శకుడు... ఆ తరువాత ద్వితీయార్థం అంతా ఎమోషనల్గా నడిపించి ఆడియన్స్ ని సినిమాలోని మల్టిపుల్ ట్రాక్స్ కి కనెక్ట్ చేయడంలో విజయం సాధించారు. వర్క్ ప్లేస్లో కేవలం అమ్మాయిలకే ప్రాధాన్యం ఇచ్చే ఎంఎన్సీ కంపెనీలు... అబ్బాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే అమ్మాయిల అభిప్రాయాలను గౌరవించాలనే దానిని ఆదిత్య పాత్రతోనూ, అమ్మాయిలు... అబ్బాయిలకు కారణం లేకుండా బ్రేకప్ చెప్పడం లాంటి వాటిని ఫేస్ చేసే పాత్రలో సంజు పాత్రను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా... తన ప్రియురాలికి తన ప్రేమను చెప్పలేని పాత్రలో మున్నా పాత్రని ఎంతో ఎమోషనల్గా తెరమీద చూపించారు దర్శకుడు. అబ్బాయిలు కూడా అమ్మాయిల్లాగే అన్ని విధాలుగా ఇబ్బందులు అన్నిచోట్లా ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి కూడా ఓ వేదిక కావాలి అభిప్రాయాలను పంచుకోవడానికి అనేదానితో తెరకెక్కిన ఈచిత్రం ఆద్యంతం అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే... ఇందులో నరేష్ అగస్త్య పాత్ర చాలా మంది యువతకు మెసేజ్ ఇస్తుంది. అలాగే కౌషిక్ కూడా కాస్త తన నటనతో మెప్పించాడు. మున్నా పాత్రలో చిత్ర నిర్మాత మౌర్య ఆకట్టుకుంటాడు. గీతా పాత్రలో రియా సుమన్... గ్లామరస్గా కనిపించి మెప్పించింది. భార్య బాధితునిగా బ్రహ్మాజీ నవ్వించాడు. బార్లో పనిచేసే యువకుని పాత్రలో సుదర్శన్ ఆకట్టుకుంటాడు. వైవా హర్షా చేసిన పాత్ర కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. ఇక మిగత పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త కత్తెర పడాల్సింది. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -
బ్రహ్మాజీ చేయి కోసుకుంటే నేనే ఆస్పత్రికి తీసుకెళ్లా: కమెడియన్ భార్య
కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు బ్రహ్మాజీ. రీల్ లైఫ్లో తక్కువ ప్రేమకథల్లోనే కనిపించినా రియల్ లైఫ్లో మాత్రం అతడికి ఓ ఇంట్రస్టింగ్ ప్రేమకథ ఉంది. ఆల్రెడీ పెళ్లై, కొడుకు ఉన్న బెంగాలీ మహిళ శాశ్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బ్రహ్మాజీ. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న శాశ్వతితో ఏడడుగులు నడవడమే కాకుండా ఆమె కొడుకును తన కొడుకుగా భావించాడు. తనకు పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థపూరిత ఆలోచనలు వస్తాయోనన్న భయంతో అతడి కోసం పిల్లలు కూడా వద్దనుకున్నాడు. ఆ అబ్బాయి మరెవరో కాదు సంజయ్ రావు. ఓ పిట్టకథ సినిమాతో అతడు తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు. తన కొడుకుతో కలిసి నటించాలనుకున్న బ్రహ్మాజీ ఓ పిట్టకథలో పోలీసుగా నటించి తన కోరిక నెరవేర్చుకున్నాడు. తాజాగా బ్రహ్మాజీ తన భార్య శాశ్వతితో కలిసి ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ... 'ఓపక్క మూన్ లైట్, మరోపక్క సన్ రైజ్.. హైస్పీడ్లో శాశ్వతి దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్పాను. ఆమె బర్త్డేకు నా చైన్ తాకట్టు పెట్టాను. తనతో బోలెడంత సేపు ఫోన్లో మాట్లాడేవాడిని. దాదాపు నా లైఫ్ అంతా పబ్లిక్ బూత్లోనే గడిచింది. కానీ తను ఒక్కసారి తిట్టిందంటే మూడు రోజులు భోజనం కూడా చేయలేం' అని చెప్పాడు. శాశ్వతి మాట్లాడుతూ.. తమ పెళ్లిలో డైరెక్టర్ కృష్ణవంశీ కన్యాదానం చేశాడని చెప్పింది. ఒకసారి బ్రహ్మాజీ సడన్గా చేయి కోసుకోవడంతో తాను ఆస్పత్రికి తీసుకెళ్లాను అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్లాస్టిక్ సర్జరీ వికటించి మోడల్ మృతి జియా ఖాన్ కేసులో సంచలన తీర్పు -
సినిమా ఈవెంట్స్ లో పర్సనల్ క్వశ్చన్స్
-
'బ్రహ్మజీ గొప్ప మనసు.. డబ్బులు తీసుకోకుండానే చేశాడు'
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని వందల చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలతో నటించిన ప్రత్యేక పేరు సంపాదించారు. అలాగే ఆయన ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. అదే విహాన్ తెరకెక్కించిన 'హ్యాంగ్ మాన్' లో తలారి పాత్ర పోషించారు. ఉరిశిక్ష పడిన ఖైదీలను ఉరి తీసే వ్యక్తిని తలారి అంటారు. ఇది ఒక చిన్న సినిమా అయినా ఒక తలారి జీవితం ఎలా ఉంటుంది? అతను ఉరి తీసేటప్పుడు మానసికంగా ఎలా సిద్దమవుతాడు? అనే విషయాలను తెరకెక్కించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ తన కుమారునికి కొడుక్కి కూడా తలారి పని ఎలా చేస్తారో కూడా వివరిస్తుంటాడు. ఈ షార్ట్ ఫిల్మ్ను ఈమధ్య హైదరాబాద్లోని ప్రివ్యూ థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సినిమాలో బ్రహ్మజీ నటనకు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తలారి పాత్రను అద్భుతంగా చేసి అందులో ఇమిడిపోయాడు. ఇంకో ఆశ్చర్యకరం ఏంటి అంటే ఈ సినిమా కథ నచ్చి.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే నటించాడు. -
కష్టపడితే ఆదరణ లభిస్తుంది – శర్వానంద్
‘‘మేము (నటీనటులు) ఫ్యా షన్తో, నమ్మకంతో, ఆశతో సినిమా చేస్తాం. కష్టపడి మంచి సినిమా చేస్తే ప్రేక్షకాదరణ లభిస్తుందని నేను నమ్ముతా. మంచి కథతో రూపొందిన ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’ పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో శర్వానంద్ అన్నారు. నరేష్ అగస్త్య, బ్రహ్మజీ , హర్ష, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంకా శర్మ ప్రధాన పా త్రల్లో నటించిన చిత్రం ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’. శ్రీకాంత్ జి. రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించారు. ఈ సినిమా టీజర్ను శర్వానంద్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నేను, మౌర్య ‘రణరంగం’ సినిమాలో నటించాం. ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’ కథ నచ్చి, నిర్మించానని మౌర్య చెప్పినప్పుడు హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. ‘‘నన్ను, కథని నమ్మి ఈ సినిమా నిర్మించిన మౌర్యకి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్ జి. రెడ్డి. ‘‘పురుషుల బాధలను చూపించే చిత్రమిది. మహిళలకూ నచ్చు తుంది’’ అన్నారు బ్రహ్మజీ . ‘‘యంగ్ టీమ్తో మంచి సినిమా చేశాను’’ అన్నారు మౌర్య సిద్ధవరం. -
ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే..?
-
అయి బాబోయ్ బ్రహ్మజీ ది మామూలు వెటకారం కాదు..
-
‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’. బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘జాతిరత్నాలు’ తర్వాత అందరూ నన్ను చిట్టీ అని పిలుస్తున్నారు. ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ చూశాక నేను చేసిన వసుధ పాత్రే గుర్తుంటుంది’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. ‘‘ఈ నెల 29న మా సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు వెంకట్ బోయినపల్లి. నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం పాల్గొన్నారు. -
ఉత్తేజ్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్
ఉత్తేజ్, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, ప్రొఫెసర్ దేవన్న, బేబి ధార్వి కీలక పాత్రల్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఊర శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో దర్శఖుడు వి. సముద్ర, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత బాల బ్రహ్మచారి,మన్నెపల్లి అప్పారావు, శ్రీలక్ష్మి, పి. జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హీరో హీరోయిన్లుగా కొత్తవారు నటిస్తున్నారు అన్నారు నిర్మాతలు.