BRICS Summit
-
S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం
కజన్: వివాదాలు, విభేదాలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. యుద్ధాలతో సాధించేదీ ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు చల్లారాలంటే చర్చలపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచించారు. రష్యాలోని కజన్ నగరంలో బ్రిక్స్ ఔట్రీచ్/బ్రిక్స్ ప్లస్ సదస్సులో చివరి రోజు గురువారం జైశంకర్ మాట్లాడారు. ఇది యుద్ధాల శకం కాదంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. శాంతియుత చర్చలు, దౌత్య మార్గాలపై దృష్టి పెడితే వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వాటిని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఎవరైనా సరే లోబడి ఉండాలని, ఎలాంటి మినహాయింపులు ఉండొద్దని తేల్చిచెప్పారు. ప్రపంచానికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. పశి్చమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీర్ఘకాలపు సవాళ్లను ఎదిరించే విషయంలో కొత్తగా ఆలోచించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిందే ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందడం లేదని, ఈ నిజాన్ని బ్రిక్స్ వేదిక గుర్తించాలని జైశంకర్ కోరారు. కోవిడ్ మహమ్మారితోపాటు వేర్వేరు సంఘర్షణల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలపై భారం మరింత పెరిగిందన్నారు. వైద్యం, ఆహారం, ఇంధన భద్రత విషయంలో ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సరిసమానమైన ప్రపంచ క్రమం’ అవసరమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి వలసవాద పాలన నుంచి వారసత్వంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలను సరి చేయాలన్నారు. సరుకుల సరఫరా కోసం దేశాల మధ్య అనుసంధానం మరింత పెరగాలన్నారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని గౌరవిస్తూ ఆ దిశగా అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సంస్థలు, అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు తక్షణావసరమని జైశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. భద్రతా మండలిలో మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కలి్పంచాలని డిమాండ్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్∙సదస్సుకు పదికిపైగా బ్రిక్స్ సభ్యదేశాలతోపాటు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. -
బ్రిక్స్ సదస్సు వేళ.. రష్యాపై భారీ సైబర్ దాడి
మాస్కో: రష్యాలోని కజాన్లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు.‘‘రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్దాడికి లక్ష్యంగా చేసుకున్నారు. అధికారిక వెబ్సైట్, మౌలిక సదుపాయాలపై ఈ బుధవారం ఉదయం విదేశాల నుంచి భారీ సైబర్టాక్ ప్రారంభమైంది. అయితే.. మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఇలాంటి విదేశీ సైబర్ దాడులను శక్తిమంతంగా ఎదుర్కొంటోంది. అయితే బుధవారం చేసిన సైబర్ దాడి మాత్రం చాలా తీవ్రమైంది’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆంక్షలను లెక్కచేయకుండా మాస్కో ప్రపంచ స్థాయిలో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలను అక్టోబర్ 22-24 తేదీల్లో రష్యాలోని కజాన్లో జరుపుతోంది.Russian Foreign Ministry suffers ‘unprecedented’ #cyberattack - spox ZakharovaSpecialists are working to restore the functionality of the Russian Foreign Ministry's website after a large-scale DDoS attack, ministry spokesperson Maria Zakharova told TASS.The attack...RTNews pic.twitter.com/RS2ilmEhVJ— TifaniesweTs (@TifaniesweTs) October 23, 2024 రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కజన్ నగరంలో జరుగుతున్న ‘బ్రిక్స్’ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.చదవండి: PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు -
PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు
కజన్: సంఘర్షణలు, సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యమార్గాలే శ్రేయస్కరమని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. శాంతియుత మా ర్గంలో చర్చలు, సంప్రదింపులకే తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఏ సమస్యకైనా యుద్ధాలతో పరిష్కారం లభించందని స్పష్టంచేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు.రష్యాలోని కజన్ నగరంలో బుధవారం 16వ ‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశి్చతి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేలా బ్రిక్స్ సానుకూల పాత్ర పోషించగలదని చెప్పారు. బ్రిక్స్ వైవిధ్యంతో కూడిన, సమగ్ర వేదిక అని వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు ‘‘యుద్ధానికి కాదు.. చర్చలు, దౌత్యానికే మా మద్దతు ఉంటుంది. కోవిడ్–19 సంక్షోభాన్ని మనమంతా కలిసికట్టుగా అధిగమించాం అదే తరహాలో ముందు తరాలకు సురక్షితమైన, బలమైన, సౌభాగ్యవంతమైన భవిష్యత్తును అందించడానికి నూతన అవకాశాలు మనం సృష్టించగలం. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో బ్రిక్స్పై ప్రపంచ దేశాలకు ఎన్నో అంచనాలున్నాయి. వాటిని నెరవేర్చేలా మనం పనిచేయాలి. ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి అన్ని దేశాలూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. అందరూ ఒకే ఆలోచనతో ఉంటేనే లక్ష్యం సాధించడం సులువవుతుంది. యువతను ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు అవసరం. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర తీర్మానం చేసేలా మనమంతా కలిసి ఒత్తిడి పెంచాలి. అలాగే సైబర్ భద్రత, సురక్షితమైన కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం కోసం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలు అవసరం. నిరి్ధష్ట గడువులోగా సంస్కరణలు వచ్చేలా మనం ఉమ్మడిగా ముందుకు సాగాలి. బ్రిక్స్లో మన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంతర్జాతీయ సంస్థలకు బ్రిక్స్ ప్రత్యామ్నాయం అనే భావన రాకూడదు. ఆయా సంస్థలను సంస్కరించే వేదిక అనే అభిప్రాయం అందరిలోనూ కలగాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడాన్ని మనం కర్తవ్యంగా స్వీకరించాలి. ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్లోకి మరికొన్ని భాస్వామ్య దేశాలను ఆహా్వనించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈ విషయంలో కూటమి దేశాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి. అదేసమయంలో బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశాలను గౌరవించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. కూటమిలోకి మరో ఐదు దేశాలు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో చేరేందుకు గ్లోబల్ సౌత్ దేశాలు ఎంతగానో ఆసక్తి చూపుతున్నాయని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చెప్పారు. ఈ విషయంలో ఆయా దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల పట్ల చురుగ్గా స్పందించాలని కూటమిలోని సభ్యదేశాలకు సూచించారు. కొత్త దేశాలను కూటమిలో భాగస్వాములుగా చేర్చుకోవాలని బ్రిక్స్ ప్రస్తుత సదస్సులో నిర్ణయించినట్లు తెలిపారు. బ్రిక్స్లో తాజాగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సభ్యదేశాలుగా చేరాయి. బ్రిక్స్ ప్రయాణంలో ఇదొక కీలకమైన ఘట్టమని జిన్పింగ్ చెప్పారు. ఆయన బుధవారం బ్రిక్స్ సదస్సులో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో బిక్స్ దేశాల్లో 10 ఓవర్సీస్ లెరి్నంగ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటిలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. భారత ఆర్థిక ప్రగతి సూపర్: పుతిన్ భారత ఆర్థిక ప్రగతి అద్భుతమంటూ బ్రిక్స్ సదస్సు వేదిక సాక్షిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతించారు. ఈ విషయంలో బ్రిక్స్ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘‘హెచ్చు వృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని గురించి దేశాధినేతలుగా మనమంతా తరచూ మాట్లాడుతుంటాం. ప్రధాని మోదీ దాన్ని విజయవంతంగా సాధించి చూపిస్తున్నారు. 7.5 శాతం వృద్ధి రేటుతో భారత్ను మనందరికీ ఆదర్శంగా నిలిపారు. ఆయన సాధిస్తున్న విజయాలకు అభినందనలు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు మోదీకి ధన్యవాదాలు’’ అన్నా రు. ద్వైపాక్షిక వర్తకంలో భారత్, రష్యా సాధిస్తున్న వృద్ధి పట్ల పుతిన్ సంతృప్తి వెలిబుచ్చారు. ఉగ్రవాదంతో అందరికీ ముప్పు బ్రిక్స్ సదస్సు అనంతరం కూటమి నేతలు బుధవారం ఒక ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని ‘ఉమ్మడి ముప్పు’గా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క మతం, జాతీయత, నాగరికతకు సంబంధించింది కాదని ఉద్ఘాటించారు. అది ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని బ్రిక్స్ కూటమి నేతలు నిర్ణయించారు. ప్రపంచానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులను కూడా డిక్లరేషన్లో ప్రస్తావించారు. అజర్బైజాన్లో జరగబోయే కాప్–29 సదస్సులో వాతావరణ మార్పులకు సంబంధించి ఒక పరిష్కారం మార్గం వెలువడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. -
సుహృద్భావమే లక్ష్యం
కజాన్: భారత్, చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ ద్వైపాక్షిక సమావేశం బుధవారం జరిగింది. రష్యాలో జరిగిన మూడు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికైంది. జిన్పింగ్, మోదీ అధికారికంగా భేటీ కావడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. లద్దాఖ్ సమీపంలో సరిహద్దు గస్తీపై ఇరు దేశాల సైనిక, తదితర ఉన్నతాధికారుల స్థాయిలో కుదిరిన తాజా ఒప్పందాన్ని అధినేతలిద్దరూ స్వాగతించారు. ఇరుదేశాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా పలు అంశాలపై ప్రత్యేక ప్రతినిధులు నడుమ మరిన్ని ఉన్నత స్థాయి చర్చలు జరపాలని నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతల పరిరక్షణే ఇరుదేశాల ధ్యేయం కావాలని మోదీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, పరిణతే ప్రాతిపదికగా ఇరు దేశాల సంబంధాలు బలపడాలని పిలుపునిచ్చారు. రష్యాలోని కజాన్లో బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం నేతల భేటీ జరిగింది. అన్ని అంశాలపైనా వారిద్దరూ 50 నిమిషాలకు పైగా లోతుగా చర్చలు జరిపారు. ‘‘విభేదాలు, వివాదాలను చర్చలు తదితరాల ద్వారా సజావుగా పరిష్కరించుకోవాలి. శాంతి, సౌభ్రాతృత్వాలను అవి దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి’’ అంటూ చైనా అధ్యక్షునికి మోదీ ఈ సందర్భంగా హితవు పలికారు. ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలైన చైనా–భారత మధ్య సత్సంబంధాలు ఇరు దేశాల ప్రజలకే గాక ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సామరస్యాలకు చాలా కీలకమని పేర్కొన్నారు. భేటీ అనంతరం ఈ మేరకు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ భేటీని ఇరు దేశాల ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తోందని జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. సమస్యలు, విభేదాల పరిష్కారానికి, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇరు దేశాల మధ్యా అన్ని స్థాయిల్లోనూ మరింత సమన్వయం, మరిన్ని చర్చలు అత్యవసరమన్నారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, సమస్యలు తదితరాలు కూడా నేతలిద్దరి చర్చల్లో చోటుచేసుకున్నాయి. షాంఘై సహకార సంస్థకు 2025లో చైనా సారథ్యానికి పూర్తిస్థాయిలో మద్దతిస్తామని జిన్పింగ్కు మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చైనా, భారత సైనికుల మధ్య 2020 నాటి గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల సంబంధాలు దారుణంగా క్షీణించడం తెలిసిందే. వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాల దిశగా ఈ భేటీని కీలక ముందడుగుగా భావిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కరచాలనం చర్చలు కొనసాగుతాయి పలు ద్వైపాక్షిక అంశాలను అధినేతలిద్దరూ దీర్ఘకాలిక దృష్టితో లోతుగా సమీక్షించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ‘‘సరిహద్దు వివాదం మొదలుకుని పలు విభేదాలపై ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కొనసాగాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు త్వరలోనే చర్చలుంటాయి’’ అని వెల్లడించారు. మోదీ–జిన్పింగ్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ముందుగా సరిహద్దు ప్రాంతాల వద్ద శాంతి, సామరస్యం నెలకొనాలన్న అంశంపై వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు వివరించారు. అభివృద్ధిపరమైన సవాళ్లను అధిగమిస్తూ పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారన్నారు. ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భారత్కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనాకు విదేశాంగ మంత్రి వాంగ్ యీ సారథ్యం వహిస్తున్నారు. వారి నడుమ 2019లో చివరిసారిగా చర్చలు జరిగాయి. ఉజ్బెక్, యూఏఈ అధ్యక్షులతో మోదీ భేటీ బ్రిక్స్ సదస్సు చివరి రోజు బుధవారం ఉజ్బెకస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్అల్ నహ్యాన్తో కూడా మోదీ భేటీ అయ్యారు. వారిద్దరితో చర్చలు అత్యంత ఫలప్రదంగా జరిగినట్టు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అనంతరం రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని మోదీ భారత్ బయల్దేరారు. -
ఈ భేటీ శుభ పరిణామం
అయిదేళ్ల తర్వాత నైరుతి రష్యాలోని కజన్లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య బుధవారం ద్వైపాక్షిక సమావేశం జరిగింది. బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ సందర్భంగా రెండు దేశాల అధినేతల మధ్యా చర్చలు జరగటం శుభపరిణామం. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాల గస్తీకి రెండురోజుల క్రితం అవగాహన కుదరటంతో అధినేతల భేటీ సాధ్యమైంది. ఈ విషయాన్ని మన విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం ప్రకటించటం... దానికి అనుగుణంగా చైనా వైపునుంచి కూడా ప్రకటన జారీకావటంతో వాతావరణం తేలికపడింది. అయితే గతాన్ని అంత తేలిగ్గా మరిచిపోరాదు. సరిగ్గా అయిదేళ్లనాడు ఇదే నెలలో తమిళనాడులోని మహా బలిపురం వేదికగా ఇరు దేశాధినేతలూ కలుసుకోగా ఆ తర్వాత ఏడాది తిరగకుండానే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి చైనా తన నైజం చాటుకుంది. దాంతో ఇరు దేశాల సంబంధాలూ కనీవినీ ఎరుగనంతగా దెబ్బతిన్నాయి. నిజానికి అంతక్రితం 2018లో మోదీ జిన్పింగ్తో ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం వూహాన్ తరలివెళ్లిన నాటికే డోక్లాంలో రెండు దేశాల సైనికుల మధ్యా 73 రోజులపాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. డోక్లాం చిన్న అపశ్రుతి మాత్రమేనని, అంతా చక్కబడిందని అనుకుని మహాబలిపురంలో జిన్పింగ్కు ఘనమైన ఆతిథ్యం అందించిన కొద్దికాలా నికే మళ్లీ సరిహద్దుల్లో సమస్యలు తలెత్తాయి. 2020 ఏప్రిల్లో చైనా సైనికులు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను అతిక్రమించి గాల్వాన్ లోయలో చొరబాట్లకు పాల్పడ్డారు. తూర్పు లద్దాఖ్లోని ప్యాంగ్యాంగ్, డెస్పాంగ్, హాట్స్ప్రింగ్స్ తదితరచోట్ల ఆక్రమణలకు దిగి అక్కడ మన సైనికులు గస్తీ తిరగడానికి వీల్లేదని పేచీకి దిగారు. కర్రలు, ఇనుపరాడ్లతో మన జవాన్లపై దాడికి దిగి 21 మంది ఉసురు తీశారు.అంతంతమాత్రంగా సాగుతూవచ్చిన సంబంధాలు కాస్తా ఆ తర్వాత పూర్తిగా పడకేశాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య సంప్రదింపులు జరుగుతున్నా, అడపా దడపా సేనల ఉపసంహరణ జరిగినా మునుపటి సాన్నిహిత్యం లేదు. రెండు దేశాల విదేశాంగ మంత్రులూ 2020 సెప్టెంబర్లో సమావేశమై ఉద్రిక్తతల ఉపశమనానికి పంచసూత్ర పథకం రూపొందించారు. రక్షణ మంత్రుల స్థాయిలో కూడా చర్చలు జరిగాక వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ సమస్యలు పూర్తిగా సమసిపోలేదు. 2022లో బాలిలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు, నిరుడు జోహన్నెస్ బర్గ్లో నిర్వహించిన బ్రిక్స్ అధినేతల సదస్సు సందర్భాల్లో మోదీ, జిన్పింగ్లు కలిసిన మాట వాస్తవం. అయితే అవి ముక్తసరి, మర్యాదపూర్వక భేటీలు మాత్రమే. ఆ తర్వాత ఎల్ఏసీలో పరిస్థి తులు స్వల్పంగా మెరుగుపడ్డాయి. అయినా మన హిమాచల్ప్రదేశ్ గ్రామాలకు చైనా తనవైన పేర్లు పెట్టడం, సరిహద్దుల్లో కొత్త గ్రామాలు సృష్టించటంవంటి గిల్లికజ్జాలకు మాత్రం కొదవలేదు. ఎల్ఓసీలో 45 ఏళ్లుగా ఇరు దేశాల సైనికులూ నిరంతరాయంగా గస్తీ కొనసాగిస్తున్న చోటులో చైనా దళాలు ఆక్రమణలకు దిగి ఇక్కడ గస్తీ కాయొద్దంటూ అభ్యంతరపెట్టడంతో 2020లో కొత్త వివాదం మొదలైంది. ఇలా మన జవాన్లు ఉండే చోటుకొచ్చి కవ్వింపులకు దిగి ఎదురుదాడి చేయ టమో, మానటమో మనవాళ్లే తేల్చుకోవాల్సిన స్థితి కల్పించటం చైనా మొదలెట్టిన కొత్త వ్యూహం. యధాతథ స్థితిని కాలరాసి ఆ ప్రాంతం ఎప్పటినుంచో తమదన్న తర్కానికి దిగటం చైనాకే చెల్లింది. 1962లో సైతం ఇలాంటి వైఖరితోనే మన దేశంపై దురాక్రమణకు తెగించింది. అంత వరకూ మన దేశం చైనాకు అన్నివిధాలా సహాయసహకారాలు అందజేసింది. చైనా ఆవిర్భావం తర్వాత దాన్ని గుర్తించటంలో మనం ముందున్నాం. ఆ తర్వాత ‘పంచశీల’ ఒప్పందం సైతం కుదిరింది. కానీ దానికి వెన్నుపోటు పొడిచింది చైనాయే.తాజాగా రెండు దేశాల మధ్యా సామరస్యత నెలకొనడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ చొరవ తీసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా తన ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవ టంలో వింతేమీ లేదు. ఉక్రెయిన్తో రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్కు భారీయెత్తున ఆయుధ సామగ్రి అందిస్తున్న ఆ దేశాలు రష్యాను ఆర్థిక ఆంక్షలతో కూడా దిగ్బంధించి దెబ్బ తీయాలని చూశాయి. ఆ తరుణంలో భారత్, చైనాలు రష్యానుంచి ముడి చమురు కొనుగోలుచేసి ఆదుకున్నాయి. అందుకే కావొచ్చు... ఆ రెండు దేశాలమధ్యా సామరస్యత సాధించి పాశ్చాత్య ప్రపంచానికి పుతిన్ షాక్ ఇచ్చారు. ఇరుగుపొరుగు దేశాలన్నాక సమస్యలు సహజం. ఇచ్చిపుచ్చు కునే ధోరణితో వ్యవహరించాలని, సామరస్యంగా మెలగాలని ఇరుపక్షాలూ అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. అటు చైనాకు ఆర్థికరంగంలో సమస్యలు ముంచుకొస్తున్నాయి. అక్కడ హౌసింగ్ రంగం తీవ్రంగా దెబ్బతిని దాని ఆర్థిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసింది. రుణభారం తడిసి మోపెడైంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దాన్ని సక్రమంగా పరిష్కరించకపోతే చైనాయే కాదు... చైనాతోపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. భారత, చైనాలు రెండూ జనాభాపరంగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అతి పెద్ద మార్కెట్గల భారత్తో సంబంధాలు మెరుగుపడితే తన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవటానికి ఆ చర్య తోడ్పడుతుందన్న వివేకం చైనాకు ఉండాలి. అధినేతల మధ్య అవగాహన ఆచరణలో కనబడాలి. మాటకూ, చేతకూ పొంతన కుదరాలి. అప్పుడు మాత్రమే చెలిమి వర్ధిల్లుతుంది. -
ముగిసిన బ్రిక్స్ సదస్సు.. భారత్కు బయల్దేరిన మోదీ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగిసింది. 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ఆయన.. బుధవారం ఢిల్లీకి బయల్దేరారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా ఆయా దేశాధినేతలను కలుసుకున్నారు. వారితో చర్చలు జరిపారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతంగా కొనసాగిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగిస్తూ.. ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి పోరాడాలని పిలుపు నిచ్చారు. బ్రిక్స్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారంటూ పుతిన్పై ప్రశంసలు కురిపించారు. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో సంస్కరణలు తీసుకురావాలన్నారు. బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేసుకోవడాన్ని ప్రోత్సహించాలని కోరిన ప్రధాని మోదీ.. భవిష్యత్లో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందని ఆకాంక్షించారు. పర్యటన తొలి రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కాగా, రెండోరోజు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్పింగ్ తొలిసారి భేటీ అయ్యారు.ఇదీ చదవండి: రష్యాకు ‘కిమ్’ బలగాలు.. ‘సియోల్’ ఆగ్రహం -
ఐదేళ్ల తర్వాత భేటీ కానున్న మోదీ, జిన్పింగ్
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో భేటీ కానున్నారు. ఇవాళ ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఇరువురు నేతలు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భేటీ కానుండటం గమనార్హం. మరోవైపు.. ఇరుదేశాల మధ్య సరిహద్దు గస్తీకి సంబంధించి కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో మోదీ, జిన్ పింగ్ మధ్య తాజాగా భేటీ జరగనుండటంపై ఆసక్తి నెలకొంది. గత నాలుగున్నరేళ్లుగా సరిహద్దుల్లో భారత్, చైనాల దేశాల మధ్య ఉద్రిక్తతలు, గల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య ఘర్షణతో తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.అదీకాక నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు కూడా సాగలేదు. ఇక.. గల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ, జిన్పింగ్లు 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సమయంలో మొదటిసారి అక్కడ కలిశారు. అనంతరం ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. ఇక.. అప్పటినుంచి ప్రత్యకంగా ఇరు దేశాధినేతల మధ్య భేటీ జరగకపోవటం గమనార్హం. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రష్యాలోని కజాన్ నగరం చేరుకున్నారు. గత మూడు నెలల్లో మోదీ రష్యా వెళ్లడం ఇది రెండోసారి. కజాన్ చేరిన కాసేపటికే ఆయన పుతిన్తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి...అన్నివిధాలా సహకరిస్తాం: మోదీ -
మరోసారి రష్యాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఈనెల 22, 23 తేదీల్లో ఆ దేశంలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్లో మోదీ పాల్గొననున్నారు.‘గ్లోబల్ డెవలప్మెంట్, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం’ అనే థీమ్తో జరిగే ఈ సమ్మిట్ లో పలు కీలక ప్రపంచ సమస్యలపై చర్చించనున్నారు. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడంతోపాటు.. భవిష్యత్ సహకారంకోసం శిఖరాగ్ర సమావేశం ఉపయోగపడుందని విదేశాంగశాఖ పేర్కొంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని వెల్లడించింది.గడిచిన నాలుగు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తరువాత తొలిసారి మాస్కోలో ఈ ఏడాది జులై నెలలో మోదీ పర్యటించారు. ఆ సమయంలో 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా రష్యాలోని భారత సంతతి ప్రజలతో కూడా భేటీ అయ్యారు.2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి. -
జగనన్న వల్లే నాకు ఈ అవకాశం
-
వైఎస్ఆర్ సీపీ మేయర్ కు అరుదైన గౌరవం
-
Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్చిన్లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్ ప్రకటించుకోవడం విచిత్రం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్ మాత్రం మ్యాప్ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్బర్గ్లో ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు. మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్చిన్ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ను ‘జంగ్నాన్’ (దక్షిణ టిబెట్) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్మోహన్ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్ ‘వన్ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం. ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్పింగ్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్ ప్రతీక. అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్ వరకు తీసుకుంటే చంద్రయాన్–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్ సంక్షోభం, 2020లో గల్వాన్ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. ఇప్పటికే లద్దాఖ్లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి. జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి. -
ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకలు వారి మనసుల్ని దోచుకున్నాయి. భారతీయ సాంస్కృతిక వైవిధ్యం, ఘనమైన వారసత్వం ఉట్టిపడే కళారూపాలు, సంప్రదాయ వస్తువుల్ని కానుకగా ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు మన తెలంగాణలో తయారైన కళాకృతులైన కూజా ఆకారంలో ఉండే రెండు పింగాణి పాత్రలను (సురాహి) కానుకగా ఇచ్చారు. కర్ణాటకకు చెందిన బిద్రీ అనే లోహకళతో రూపొందించే ఈ పాత్రలపై వెండితో నగిషీలు చెక్కారు. సిరిల్ సతీమణికి నాగాలాండ్లో ఆదివాసీలు తయారు చేసిన శాలువాను బహుమానంగా ఇచ్చారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లాలూ డా సిల్వాకు మధ్యప్రదేశ్కు చెందిన గోండ్ పెయింటింగ్స్ను కానుకగా ఇచ్చారు. గ్రీసు ప్రధాని కరియాకోస్కు ఛత్తీస్గఢ్ కళాకృతులైన ఇత్తడితో తయారు చేసిన డోక్రాను, ఆయన సతీమణికి మేఘాలయలో తయారైన శాలువాను కానుకగా ఇచ్చారు. -
నవభారత జయధ్వానం
చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన రష్యాకు చెందిన లూనా–25 విఫలమై, కొన్ని రోజుల క్రితం పేలిపోయిన సమయంలోనే చంద్రయాన్–3 విజయవంతమైంది. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న శక్తిగా భావిస్తున్న అంతర్జాతీయ అవగాహనను ఇది బలపరుస్తుంది. చంద్రయాన్–3 విజయం భారతదేశ ప్రతిష్ఠతో పాటు, బ్రిక్స్ భాగస్వాముల మధ్య మన దేశ స్థితిని మెరుగుపరుస్తుంది. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు లేకుండానే భారతదేశం అగ్రగామి శక్తిగా నటిస్తున్నట్లు చైనా భావిస్తుంటుంది. భారత శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శనలను– అవి అణు, అంతరిక్ష రంగాలైనా, ఐటీ విజయాలైనా చైనా ఆశ్చర్యంతోనే స్వీకరించింది. ఇతర దేశాల నుండి ‘అరువు’ తెచ్చుకున్నవిగా వాటిని కొట్టిపారేసింది. చంద్రయాన్–3 సాధించిన అత్యుత్తమ విజయాన్ని కూడా ఇదే పద్ధతిలో కొట్టివేయడం కష్టం. ఉత్కంఠ వీడిపోయింది. నిర్దేశించిన రోజు, సమయం, ప్రదేశంలో చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయిన చంద్రయాన్–3 సాధించిన మహాద్భుతమైన విజయం పట్ల భారతదేశం సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ నాయకత్వ చిహ్నాలలో సాంకే తిక పురోగతి ఒకటి. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్–3 ల్యాండ్ అయింది. అన్వేషణ కోసం ప్రత్యేకంగా సవాలు విసిరేటటువంటి, పెద్దగా అర్థం చేసుకోని స్థలాన్ని ఎంచు కున్న ఏకైక అంతరిక్ష దేశం భారత్. చంద్రుని అసలైన తత్వం ఇప్పటికీ కలిగి ఉన్నది దాని ధ్రువ ప్రాంతాలు మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని ఉపరితలం చాలా వరకు పెద్ద, చిన్న గ్రహ శకలాల శిథిలాలతో కప్పబడి ఉంది. ఈ శకలాలు వెయ్యేళ్లపాటు చంద్రునిపై పెనుదాడి చేసి, దానిపై పొరలు పొరలుగా పేరుకు పోయాయి. చంద్రుడి లోపలి నీటి కోసం వెతకడంతో సహా ‘ప్రజ్ఞాన్ రోవర్’ చేయబోయే ప్రయోగాలు, మనకు సమీపంలోని ఖగోళ పొరుగు గురించిన కొత్త జ్ఞానాన్ని వెల్లడిస్తాయి. సున్నితంగా ఉన్న మన సొంత భూగ్రహం చరిత్ర, తయారీలపై మన అవగాహనకు కూడా ఇది సాయపడుతుంది. ఎదుగుతున్న శక్తి ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలోని జోహ న్నెస్బర్గ్లో ఉన్నప్పుడు, యాదృచ్ఛికంగా అంతరిక్ష పరిశోధనలో ఈ గొప్ప విజయం లభించింది. చంద్రయాన్–3 విజయం భారతదేశ ప్రతిష్ఠతో పాటు, బ్రిక్స్ భాగస్వాముల మధ్య మన దేశ స్థితిని మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికంగా, సాంకేతికంగా సామర్థ్యం ఉన్న దేశాల సమూహంగా మొత్తం బ్రిక్స్ ప్రభావాన్ని కూడా ఇది ఇతోధికంగా పెంచుతుంది. చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన రష్యాకు చెందిన లూనా–25 విఫలమై, కొన్ని రోజుల క్రితం పేలిపోయిన సమయంలోనే చంద్రయాన్–3 విజయవంతమైంది. ఇప్పటికే అంతరిక్ష ప్రయో గాల్లో అనుభవజ్ఞ దేశంగా ఉన్న రష్యా తన మూన్ ల్యాండింగ్ ప్రాజెక్ట్ను భారతదేశం ప్రారంభించిన కొన్ని రోజులకే ప్రారంభించడం యాదృచ్ఛికమే కావొచ్చు. అయినా రష్యా వైఫల్యం, భారత్ విజయాలను పక్కపక్కనే అంచనా వేయడం జరుగుతుంది. వనరుల పరంగా, అధునాతన అంతరిక్ష శక్తిగా దాని హోదాను కొనసాగించడంలో రష్యా వైఫల్యాన్ని దాని క్షీణత, అసమర్థతా లక్షణాలుగా చూస్తున్నారు. అంతరిక్ష ప్రయోగం అనేది అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన అన్వేషణ. 2019 సెప్టెంబరులో చంద్రయాన్–2 చంద్రుని ఉపరితలంపై కూలిపోయినప్పుడు భారతదేశం కూడా నిరాశకు గురైంది. ఇప్పుడు రష్యా తన ఎదురుదెబ్బను అధిగమించి అంతరిక్ష రంగంలో మళ్లీ తన శక్తి పుంజుకోదని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. అయినా దృక్కోణాలు ముఖ్యమవుతాయి. భారతదేశాన్ని అభి వృద్ధి చెందుతున్న శక్తిగా, రష్యాను క్షీణిస్తున్న శక్తిగా భావిస్తున్న అంత ర్జాతీయ అవగాహనను ఇది బలపరుస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన సమానమైన ర్యాంక్లో తాను లేనందున, ఉక్రెయిన్ యుద్ధం ఆ స్థానాన్ని ఏ విధంగానూ దెబ్బతీయలేదనే భావ నను ఎదుర్కోవడానికి రష్యా ఈ ప్రాజెక్ట్ను చేపట్టినట్లయితే, అది తన ప్రయత్నంలో విఫలమైంది. రష్యన్ మీడియాలో కూడా, విఫలమైన మూన్ మిషన్ అందుకున్న పరిమితమైన కవరేజీని చూసినట్లయితే, దాని రాజకీయ, మానసిక తిరోగమనం చాలా స్పష్టంగా తెలుస్తోంది. చైనా వైఖరి మారేనా? ప్రపంచ ఆర్థిక, సాంకేతిక శక్తిగా చైనా ఎప్పుడూ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తోంది. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు లేకుండానే భారతదేశం అగ్రగామి శక్తిగా నటిస్తున్నట్లు చైనా భావిస్తుంటుంది. భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శ నలను– అవి అణు, అంతరిక్ష రంగాలైనా, ఐటీ విజయాలైనా చైనా ఆశ్చర్యంతోనే స్వీకరించింది. ఇతర దేశాల నుండి ‘అరువు’ తెచ్చు కున్నవిగా వాటిని చైనా కొట్టిపారేసింది. అయితే చంద్రయాన్–3 సాధించిన అత్యుత్తమ విజయాన్ని కూడా చైనా ఇదే పద్ధతిలో కొట్టివేయడం కష్టం. బహుశా భారత్ సాధించిన ఈ విజయంతో చైనా తన అహంకారాన్ని తొలగించుకుని, నమ్రతతో కాకపోయినా మర్యాద పూర్వకంగా వ్యవహరించాల్సిన దేశంగా భారత్ను పరిగణించవచ్చు. ఒకరినొకరు సమానంగా చూసుకుంటేనే ఇరు దేశాలు తమ సంబంధాలను మరింత మెరుగుపరుచుకోగలవు. చంద్రయాన్–3 విజయా నికి చైనా ఎలా స్పందిస్తుందనేది, తూర్పు లదాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద హింసాత్మక ఘర్షణల తర్వాత భారతదేశం పట్ల దాని వైఖరిలో ఏమైనా మార్పు ఉందా అనేది సూచిక అవుతుంది. చంద్రయాన్–3 ప్రాజెక్టులో విజయం రాబోయే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్య దేశంగా భారత్ హోదాను పెంచుతుంది. శిఖరాగ్ర సమావేశానికి ఇప్పటికే లభిస్తున్న విస్తృత ప్రచారం నేపథ్యంలో, చంద్రయాన్–3 భారత్ కీర్తి ప్రతిష్ఠలకు మరో పార్శా్వన్ని జోడిస్తుందనడంలో సందేహం లేదు. శిఖరాగ్ర సదస్సు చర్చల సమ యంలో, భారతదేశ స్వరం ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తుంది. దాని వివిధ కార్యక్రమాలు గౌరవప్రదంగా పరిగణించబడతాయి. అయితే ఇవన్నీ తదనంతర చర్యలలో ప్రతిఫలిస్తాయో, లేదో చూడాలి. దూరదృష్టి ఫలితం భారతదేశం కోసం, దాని అభివృద్ధి వ్యూహం కోసం తగిన పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రయాన్–3 సాధించినదంతా కూడా దేశం పేదగా ఉండి, అభివృద్ధి చెందుతున్నదైనప్పటికీ... అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే శ్రేష్ఠమైన సంస్థలను స్థాపించాలనే తొలితరం నాయకుల దూరదృష్టి ఫలితమే. భారతదేశ అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసిన అటామిక్ ఎనర్జీ కమిషన్ను 1948లోనే తొలి ప్రధాన మంత్రి నెహ్రూ ఛైర్మన్గా ఏర్పాటైంది. అప్పటి రాజకీయ నాయకత్వం ఈ అధునాతన శాస్త్రీయ సాధనకు ఇచ్చిన అధిక ప్రాముఖ్యతను ఇది ప్రతిబింబిస్తుంది. వాస్తవానికి, అంతరిక్ష పరిశోధనను సుప్రసిద్ధ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయి నేతృత్వంలో 1961లో ఏర్పాటు చేసిన ఇండియన్ నేష నల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని పిలిచే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీకి అప్పగించారు. దీని తర్వాత 1972లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఏర్పాటైంది. ఆటమిక్ ఎనర్జీ కమిషన్ నమూనాలో ఇండియన్ స్పేస్ కమిషన్ ను ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిషన్లు భారతదేశ అధునాతన శాస్త్ర, సాంకేతికతకు మూలస్థంభాలుగా నిలిచి, గణనీయమైన స్వయంప్రతిపత్తిని అనుభవిస్తున్నాయి. అంతేకాకుండా వీటికి బాగా నిధులు సమకూరుస్తున్నారు కూడా. ఈ ముందస్తు, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు, భారతీయ శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగ కార్మికుల కృషి వల్ల ఇప్పుడు భారతదేశం చేపట్టిన తాజా అంత రిక్ష యాత్ర విజయవంతమైంది. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి -
భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్పింగ్
న్యూఢిల్లీ: భారత్ అభ్యర్ధన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ శాఖ తెలిపిన దాంట్లో వాస్తవం లేదని.. వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల గురించి అభ్యర్ధించింది చైనాయేనని అది ఇంకా పెండింగ్లోనే ఉందని తెలిపింది భారత విదేశాంగ శాఖ. జోహన్నెస్బెర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొద్దిసేపు మాట్లాడుతూ కనిపించారు. అది కూడా వేదిక నుండి కిందకు దిగుతున్న వేళ చిన్నగా అడుగులేస్తూ క్లుప్తంగా సంభాషించారు. ఇదే వేదికపై మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక సమేవేశంలో పాల్గొంటారని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ సమావేశాల్లో ఇరు దేశాల నేతలు ఎక్కడా ప్రత్యేక చర్చల్లో పాల్గొనలేదు. అనధికారికంగా మాత్రం కొద్దిసేపు సంభాషిచారు. భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు మధ్య జరిగిన అనధికారిక సంభాషణలో ఇరువురు వాస్తవాధీన రేఖ వద్ద బలగాలను తొలగించి ఉద్రిక్తతను తొలగించే విషయమైన చర్చించినట్లు తెలిపారు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా. జూన్ 2020లో తూర్పు లడఖ్లోని గాల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని సరిహద్దు వెంబడి పరిష్కారం కాని అనేక సమస్యల ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక ద్వైపాక్షిక చర్చల ప్రస్తావన తీసుకొచ్చింది చైనాయేనని భారత్ ఇంకా ఆ విషయమై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా చైనా విదేశాంగ శాఖ మాత్రం భారత్ అభ్యర్ధన మేరకే చైనా అధ్యక్షుడు భారత ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారని.. ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచే అంశమై మాట్లాడినట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పితేనే ప్రపంచాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా సాధ్యమవుతుందన్నారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: ట్రంప్ మగ్ షాట్:మస్క్ రియాక్షన్ అదిరిపోయింది! -
బ్రిక్స్లోకి మరో ఆరు దేశాలు
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన గురువారం మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిక్స్ బలం అయిదు నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. ‘సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టాం. మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తాం’అని రమఫోసా చెప్పారు. బ్రిక్స్ విస్తరణ, ఆధునీకరణ.. ప్రపంచంలోని అన్ని సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘బ్రిక్స్ విస్తరణకు భారత్ మొదట్నుంచీ మద్దతుగా నిలిచింది. కొత్తగా సభ్య దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ మరింత బలోపేతమవుతుంది. ఉమ్మడి ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమతపై విశ్వాసం పెంచుతుంది’అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వర్చువల్ ప్రసంగంలో బ్రిక్స్ తాజా విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో సహకారానికి కొత్త అధ్యాయం మొదలైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశం నమూనా, కూటమిలో చేరాలనుకునే దేశాల జాబితాను ఏడాది జరిగే శిఖరాగ్ర సమ్మేళనం నాటికి సిద్ధం చేసే బాధ్యతను విదేశాంగ మంత్రులకు అప్పగించినట్లు రమఫోసా చెప్పారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాల్సిందిగా బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సూచించేందుకు అంగీకారానికి వచి్చనట్లు ఆయన వివరించారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్గా రూపాంతరం చెందింది. బ్రిక్స్లో చేరేందుకు 40 వరకు దేశాలు ఆసక్తి చూపుతుండగా వీటిలో 23 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత కూటమి ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ జీడీపీలో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వరకు వాటా కలిగి ఉంది. పశి్చమదేశాల కూటమికి బ్రిక్స్ను ప్రధాన పోటీ దారుగా భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ బ్రిక్స్ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఇరాన్ అధ్యక్షుడు ౖఇబ్రహీం రైసీ సహా పలు దేశాల నేతలతో సమావేశమయ్యారు. రైసీతో చర్చల సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, ఉగ్రవాదం, అఫ్గానిస్తాన్ వంటి ద్వైపాక్షిక అంశాలతో చాబహర్ పోర్టు అభివృద్ధిపైనా చర్చించారు. బ్రిక్స్లో ఇరాన్ చేరికకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి రైసీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రయాన్–3 విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలియజేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ప్రధాని మోదీ ఇథియోపియా అధ్యక్షుడు అబీ అహ్మద్ అలీ, సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ తదితరులతో జరిగిన భేటీలో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారని బాగ్చీ వివరించారు. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రం అనంతరం ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జొహన్నెస్బర్గ్ నుంచి గ్రీస్కు బయలుదేరారు. ఆఫ్రికాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి ‘ఎజెండా 2063’సాధనలో ఆఫ్రికాకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్కు భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. బ్రిక్స్, ఆఫ్రికా దేశాల ముఖ్య నేతలతో గురువారం జొహన్నెస్బర్గ్లో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా యూనియన్ శక్తివంతంగా రూపుదిద్దుకునేందుకు వచ్చే 50 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై 2013లో తయారు చేసిన ఆర్థికాభివృద్ధి నమూనాయే ‘అజెండా 2063’. ప్రపంచమే ఒక కుటుంబమనే భావనను భారత్ వేల ఏళ్లుగా విశ్వసిస్తోందని ప్రధాని చెప్పారు. ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం, పెట్టుబడుల్లో భారత్ నాలుగు, అయిదో స్థానాల్లో ఉందన్నారు. ఎల్ఏసీని గౌరవిస్తేనే సాధారణ సంబంధాలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో వాస్తవ«దీన రేఖ(ఎల్ఏసీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఉద్దేశాలు, అభిప్రాయాలు చైనా అధినేత షీ జిన్పింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో గురువారం జిన్పింగ్తో మోదీ మాట్లాడారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్నేహభావం నెలకొనాలని, ఎల్ఏసీని గౌరవించాలని మోదీ తేలి్చచెప్పారు. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించే చర్యలను వేగవంతం చేసేలా తమ అధికారులను ఆదేశించాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్లో భారత్, చైనా సైనికుల మధ్య త్రీవస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. -
బ్రిక్స్కు కొత్త బలం!
కాలం అందరికీ... వ్యక్తులకైనా, సంస్థలకైనా అన్నీ నేర్పుతుంది. పదిహేనేళ్ల క్రితం అప్పట్లో ఆర్థికంగా జవసత్వాలు పుంజుకుంటున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో బ్రిక్గా ఏర్పడిన సహకార కూటమి అనంతరకాలంలో దక్షిణాఫ్రికాను కూడా కలుపుకొని బ్రిక్స్గా రూపాంతరం చెందింది. జోహన్నెస్బర్గ్లో మూడు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసే సమయానికి మరో ఆరు దేశాలకు– సౌదీ అరేబియా, యూఏఈ, అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్, ఈజిప్టులకు ఈ సారి సభ్యత్వం లభించింది. ఈ దేశాల భాగస్వామ్యం వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇకపై దీన్ని బ్రిక్స్–11గా వ్యవహరిస్తారు. ఆరంభంలో ఆ కూటమి వైపు పెద్దగా దృష్టి సారించని దేశాలు అందులో భాగస్వాములై ఎదగాలని ఇప్పుడు తహతహలాడటం అనివార్య పరిణామం. కరోనా మహమ్మారితో, ఉక్రెయిన్ యుద్ధంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు విధానాలు ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పశ్చి మార్ధ గోళ దేశాల ఆధిపత్యాన్ని, ముఖ్యంగా అమెరికా పెత్తనాన్ని బలహీన పరచాలని చూస్తున్న రష్యా, చైనాలకు ఈ పరిణామం సహజంగానే బలాన్నిస్తోంది. అయితే ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పీకల్లోతు కూరుకుపోయి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అభిశంసనకు గురయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాలేని నిస్సహాయస్థితిలో పడ్డారు. ఆ కోర్టులో దక్షిణాఫ్రికా సభ్యదేశంగా ఉండటం వల్ల అది పుతిన్పై జారీచేసిన అరెస్టు వారెంట్ను అమలుపరచక తప్పదు. నిజంగా దక్షిణాఫ్రికా ఆ పని చేస్తుందా లేదా అన్న సంగతి అటుంచితే ఈ స్థితిలో హాజరు కావటం పుతిన్కే అవమానకరమవుతుంది. దాంతో ఆయన శిఖరాగ్ర సదస్సును ద్దేశించి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అయితే ఇప్పటికిప్పుడు బ్రిక్స్ దేశాలు అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసే స్థితి లేదు. మన దేశం, బ్రెజిల్ అమె రికాకూ, ఇతర పాశ్చాత్య దేశా లకూ సన్నిహితంగా ఉంటున్నాయి. ఆ మాటకొస్తే చైనా సైతం వివిధ అంశాల్లో అమెరికాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, దానితో బాహాటంగా ఘర్షణకు దిగాలనుకోవటం లేదు. రణరంగంలో నిలిచిన రష్యా ఒక్కటే ఇందుకు మినహాయింపు. సదస్సు ప్రారంభంలోనే ఈ ధోరణి కనబడింది. బ్రిక్స్ దేశాధినేతల్లో ఇతరులు సమానత్వం ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలుండాలని మాట్లా డితే... పుతిన్ మాత్రం ఏ రకమైన పెత్తందారీ పోకడలకైనా తాము బద్ధ విరోధులమని కుండ బద్దలు కొట్టారు. తన శత్రువులు నయా వలసవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆరోపించారు. పనిలో పనిగా ఉక్రెయిన్లో వర్తమాన సంక్షోభానికి పాశ్చాత్య దేశాల పెత్తందారీతనమే కారణమన్నారు. కూటమి విస్తరణ, దాని అమరిక ఎప్పుడూ ఒకేలా ఉండదు. సాధారణ పరిస్థితుల్లో ఉన్న కూటమి సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు చెల్లాచెదురు కావొచ్చు. కొత్త దేశాలొచ్చి అందులో చేరవచ్చు కూడా. తన ప్రయోజనాలకు అనుగుణంగా బ్రిక్స్ విస్తరణ ఉండాలని చైనా ఏడాదిగా ప్రయత్నిస్తోంది. మన దేశం కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. నిరుడు బీజింగ్లో జరిగిన సదస్సులోనే విస్తరణపై ఆలోచన బయల్దేరింది. సభ్యత్వానికి అర్హతలు, కూటమిలో చేరాక ఆ దేశాలు అనుసరించాల్సిన విధానాలు వగైరాలకు ఈ ఏడాదికాలంలో తుది రూపం ఇచ్చారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలు, మెరుగైన వృద్ధి రేటు ఉండేవాటినే సభ్యదేశాలుగా చేర్చుకోవాలని బ్రిక్స్ మూలవిరాట్టు లైన అయిదు దేశాలూ ఏకాభిప్రాయానికొచ్చాయి. అలాగే ఇకపై కూడా అయిదు దేశాలూ ఏకాభి ప్రాయానికొస్తే తప్ప ఏ దేశానికీ సభ్యత్వం ఇవ్వరాదన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు అంగీకారం లభించింది. బహుళత్వం, సుస్థిర, శాంతియుత అభివృద్ధి, పరస్పర సహకారంతో ఎదుగుదల, సంస్థాగత అభివృద్ధి, బ్రిక్స్ దేశాల ప్రజానీకం మధ్య సంబంధాలు నెలకొల్పటం వగైరాల సాధనకు కృషి చేయాలన్న జోహన్నెస్బర్గ్ డిక్లరేషన్ సంకల్పం నెరవేరే దిశగా అడుగులు పడితే సంస్థ భవిష్యత్తులో మరింత బలపడుతుంది. ఎప్పటిలాగే ఘర్షణల విషయం వచ్చేసరికి డిక్లరేషన్ ఆచితూచి వ్యవహరించిందనాలి. నిర్మాణాత్మక చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చి ఊరుకుంది. అంతేతప్ప ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించలేదు. బ్రిక్స్ స్వభావరీత్యా స్వేచ్ఛా వాణిజ్య కూటమి వంటిది కాదు. దేశాల మధ్య సమన్వయం సాధించి, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఎదగాలన్నది ఈ కూటమి ప్రధాన ధ్యేయం. బ్రిక్స్ కరెన్సీ అంటూ ప్రత్యేకించి లేకపోయినా ఆయా దేశాల కరెన్సీలు బలపడేందుకు అవసరమైన సాయాన్ని అందించటం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. ఈసారి శిఖరాగ్ర సదస్సులో ఉమ్మడి కరెన్సీ గురించిన ఆలోచన చేస్తారని వినబడినా అదేం జరగలేదు. అయితే 2015లో కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవెలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సమర్థవంతంగానే పనిచేస్తోంది. కూటమిలో కొంత వెనకబడిన దేశాలకు ఈ సంస్థ ద్వారానే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికైతే బ్రిక్స్లో చేరడానికి దక్షిణార్ధ గోళ దేశాల ఉత్సాహాన్ని సంపన్న దేశాలు ఒక హెచ్చరికగా పరిగణించక తప్పదు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న దేశాల ఆకాంక్షలను గుర్తించి తగినవిధంగా వ్యవహరించకుంటే బ్రిక్స్ మాత్రమే కాదు... భవిష్యత్తులో మరిన్ని కూటములు ఉనికిలోకొస్తాయి. ఒకటైతే నిజం – ఆవిర్భవించి పదిహేనేళ్లయినా బ్రిక్స్ సంస్థాగత స్వభావాన్ని సంతరించుకోలేదు. ఆ దేశాలమధ్య పరస్పర ఐక్యతగానీ, ఉమ్మడి లక్ష్యాలుగానీ లేవు. ఆ లోపాన్ని సవరించుకుంటే బ్రిక్స్ మరింత పటిష్టవంతమైన కూటమిగా రూపుదిద్దుకోవటం ఖాయం. -
BRICS summit 2023: బ్రిక్స్ విస్తరణకు భారత్ మద్దతు
జోహెన్నెస్బర్గ్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్)ల దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిని విస్తరించాలన్న ప్రతిపాదనతో భారత్ ముందుకు వచ్చింది. అయితే ఈ విస్తరణ ఏకాభిప్రాయంతో జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్బర్గ్లో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో బుధవారం నాడు ప్రధాని మోదీ ప్రసంగించారు. అద్భుతమైన భవిష్యత్కు బ్రిక్స్ సంసిద్ధంగా ఉండాలంటే మనం మన సమాజాలను భవిష్యత్కు సిద్ధం చేయాలని ప్రధాని మోదీ చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్కు జీ20లో శాశ్వత సభ్యత్వాన్ని తాము ప్రతిపాదిస్తున్నట్టుగా చెప్పారు. ‘‘జీ 20 సదస్సును భారత్లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్నాం. బ్రిక్స్ దేశాలన్నీ అందులో శాశ్వత సభ్యులే. ఆఫ్రికన్ యూనియన్కు కూడా జీ–20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మేము ప్రతిపాదిస్తున్నాం. బ్రిక్స్ భాగస్వామ్య పక్షాలన్నీ ఇందుకు అంగీకరిస్తాయని భావిస్తున్నాం’’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సౌత్ దేశాలకు బ్రిక్స్ సదస్సులో ప్రాధాన్యం కల్పించడాన్ని ప్రధాని స్వాగతించారు. జీ–20 సదస్సులో భారత్ కూడా గ్లోబల్ సౌత్ దేశాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాల్లో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారంతో అత్యంత అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించాయని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధిలో బ్రిక్స్కు చెందిన న్యూ డెవలెప్మెంట్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రైల్వే రీసెర్చ్ నెట్వర్క్, స్టార్టప్ రంగాల్లో భారత్ చేసిన సూచనలతో అపారమైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. పశ్చిమ దేశాల వల్లే ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్ బ్రిక్స్ సదస్సులో వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధం పశ్చిమ దేశాల పాపమేనని ఆరోపించారు. డాన్బాస్ ప్రాంతంలో నివసించే ప్రజలకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో యుద్దానికి దిగుతున్నాయని నిందించారు. యుద్ధాన్ని నిలిపివేయడమే రష్యా మిలటరీ లక్ష్యమని పుతిన్ అన్నారు. దక్షిణాఫ్రికాకు వస్తే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్లు మేరకు తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నట్టు చెప్పారు. -
Chandrayaan 3: భూమిపై సంకల్పం.. జాబిల్లిపై సాకారం
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి అభినందనలు తెలియజేశారు. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు చంద్రుడిపై భారత్ అడుగుపెట్టిందని అన్నారు. ఇది కేవలం భారత్ విజయం కాదని చెప్పారు. ఈ ఘనత ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వెళ్లిన మోదీ బుధవారం సాయంత్రం చంద్రయాన్–3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు. ల్యాండింగ్ సకెŠస్స్ అయిన వెంటనే ఇస్రో సైంటిస్టులను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు. బ్రిక్స్ సదస్సు కోసం ప్రస్తుతం తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ తన మనసు, ఆత్మ మొత్తం భారత్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని బలమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహిస్తున్న ఈ శుభసందర్భంలో చంద్రయాన్–3 ప్రయోగం సఫలం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. భూగోళంపై మనం తీసుకున్న సంకల్పం చందమామపై నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం చిరస్మరణీయమని తెలిపారు. ఈ అద్భుత క్షణం శాశ్వతంగా మదిలో నిలిచిపోతుందని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న భారత్కు ఇది ప్రతీక అని చెప్పారు. కొత్త చరిత్రను భారత్ లిఖించిందని వెల్లడించారు. నవ భారతదేశంలో నూతన శిఖరాలకు చేరుకుంటున్నామని, అందుకు మనమంతా సాకు‡్ష్యలమని వివరించారు. శాస్త్రవేత్తల అంకితభావం వల్లే.. అమృతకాలంలో ఇది మొదటి విజయమని అన్నారు. ఇది అమృత వర్షమని అభివర్ణించారు. ఆకాశమే హద్దు కాదని భారత్ పదేపదే నిరూపిస్తోందని ప్రధాని మోదీ చమత్కరించారు. ఇప్పటిదాకా ఎవరూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువానికి భారత్ చేరుకుందని ఉద్ఘాటించారు. మన శాస్త్రవేత్తల అంకితభావం, నైపుణ్యం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. చందమామకు సంబంధించిన మన ఊహాగానాలు, ప్రచారంలో ఉన్న కథలు ఇక మారుతాయని, సామెతలు కొత్త తరం కోసం కొత్త అర్థాలను వెతుక్కుంటాయని వ్యాఖ్యానించారు. భూమిని తల్లిగా, చంద్రుడిని మామగా మనం భావిస్తామని చెప్పారు. ‘చందమామ దూర్ కే’ అంటుంటామని, ఇకపై ‘చందమామ ఏక్ టూర్ కే’ అనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వివరించారు. తద్వారా జాబిల్లిపై పర్యటనలు త్వరలో ప్రారంభమవుతాయని పరోక్షంగా స్పష్టం చేశారు. సూర్యుడిపై పరిశోధనల కోసం ‘ఆదిత్య–ఎల్1’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోందని చెప్పారు. శుక్రగ్రహంపైనా అధ్యయనం చేసే ప్రణాళిక ఉందన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్తో మాట్లాడారు. అభినందనలు తెలిపారు. -
Brics Summit 2023: ప్రపంచానికి ‘గ్రోత్ ఇంజిన్’ భారత్
జోహన్నెస్బర్గ్: రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారత్ ‘గ్రోత్ ఇంజిన్’గా మారబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్లో సంస్కరణలను మిషన్ మోడ్లో అమలు చేస్తున్నామని, సులభతర వాణిజ్యంలో వేగం పుంజుకుందని చెప్పారు. మంగళవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత్ త్వరలోనే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్లో ఉందన్నారు. 100కుపైగా యూనికార్న్ కంపెనీలు పని చేస్తున్నాయని వెల్లడించారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి అనువైన రంగాలను గుర్తించడంలో 15వ బ్రిక్స్ సదస్సు సఫలమవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన దక్షిణాఫ్రికా చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం విషయమై అంతర్జాతీయ నేర న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన వర్చువల్గా పాల్గొననున్నారు. -
BRICS 2023: జోహన్నెస్బెర్గ్కు పయనమైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జోహన్నెస్బెర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్-2023 సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా ప్రయాణమయ్యారు. అంతా సజావుగా సాగితే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చించే అవకాశముందంటున్నాయి పీఎంవో కార్యాలయ వర్గాలు. జోహన్నెస్బెర్గ్లో జరగనున్న 15వ బ్రిక్స్ సమావేశాల్లో బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలతో కలిసి పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా బయలుదేరారు. చివరిసారిగా ఈ సమావేశాలు 2019లో జరగగా కోవిడ్-19 కారణంగా ఈ సమావేశాలు వర్చువల్గా జరుగుతూ వచ్చాయి. ఈ సమావేశాల్లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఏమైనా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశముందా అన్న ప్రశ్నకు విదేశీ కార్యదర్శి వినయ్ ఖ్వత్రా మేము కూడా ఆ విషయంపై సానుకూలంగానే ఉన్నాము. మా ప్రయత్నాలైతే మేము చేస్తున్నామని అన్నారు. అదే అజరిగితే మే 2020 తర్వాత చైనాతో భారత్ ముఖాముఖి వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. చివరిసారిగా వీరిద్దరూ గతేడాది నవంబర్లో బాలి వేదికగా జరిగిన జీ20 సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందులో కలిసి పాల్గొన్నారు కానీ ఏమీ చర్చించలేదు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద భారత్ చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశాల్లో అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది. బ్రిక్స్ సమావేశాలకు ముందు సన్నాహకంగా భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజోత్ దోవల్ గత నెల చిన్నా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. అప్పుడే ఈ రెండు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై సానుకూల, నిర్ణయాత్మక, లోతైన చర్చలు జరిగాయి. 2020లో గాల్వాన్ లోయలోనూ, పాంగాంగ్ నదీ తీరంలోనూ, గోగ్రా ప్రాంతంలోనూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహారించి ఉద్రిక్తతకు తెరతీసింది. ఈ సమావేశాల్లో ఇరుదేశాల మధ్య సంధి కుదిరి సత్సంబంధాలు నెలకొంటాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. బ్రిక్స్-2023 సమావేశాల్లో ప్రధానంగా దక్షిణదేశాల సంబంధాలపైనా భవిష్యత్తు కార్యాచరణపైనా దృష్టి సారించనున్నాయి ఈ ఐదు దేశాలు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చాబర్ బహర్ నౌకాశ్రయాన్ని పూర్తి స్థాయిలో కనెక్టివిటీ హబ్గా మార్చడం సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు వారు పునరుద్ఘాటించారు. బ్రిక్స్ విస్తరణ వంటి అంతర్జాతీయ వేదికలపై సహకారంపైనా వారు చర్చించారు. దక్షిణాఫ్రికాలో త్వరలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. -
BRICS SUMMIT: సార్వభౌమత్వాన్ని గౌరవించుకుందాం
న్యూఢిల్లీ: అన్ని దేశాలు సార్వభౌమత్వాన్ని, సమగ్రతను గౌరవించుకోవాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) పిలుపునిచ్చాయి. ఉక్రెయిన్ సంక్షోభం, అఫ్గానిస్తాన్లో పరిస్థితులు తదితర అంశాలను చర్చించిన బ్రిక్స్ దేశాల నేతలు ఆయా సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని నొక్కిచెప్పారు. చైనా అధ్యక్షతన జరిగిన ఐదు దేశాల వర్చువల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. యుద్ధం కారణంగా తలెత్తిన మానవీయ సంక్షోభానికి రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలే పరిష్కారమంది. ఈ విషయంలో ఐరాస, రెడ్ క్రాస్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. సీమాంతర ఉగ్రవాదం సహా అన్ని రకాలైన ఉగ్రవాదంపై పోరాటానికి కట్టుబడి ఉంటామని తీర్మానించింది. అంతకుముందు ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఇంకా తొలిగిపోలేదని, దీని నుంచి బయటపడేందుకు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం సహాయకారిగా ఉంటుందని చెప్పారు. ‘‘కరోనా మహమ్మారి నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ వరుసగా మూడో ఏడాది మనం సమావేశమయ్యాం. ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ముప్పు తగ్గినప్పటికీ, దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక రంగంపై ఇప్పటికీ కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక రంగం విషయంలో బ్రిక్స్ సభ్య దేశాలు ఒకే రకమైన వైఖరి కలిగి ఉన్నాయి. ఆర్థికంగా తిరిగి పుంజుకునేందుకు మనం పరస్పరం సహకరించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది’’అని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. బ్రిక్స్ను కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రసంగించారు. ఏకపకంగా కొందరు విధించే ఆంక్షలను, చిన్న కూటముల ఏర్పాటుకు సాగే ప్రయత్నాలను వ్యతిరేంచాలని పిలుపునిచ్చారు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి విధానాలు, ఆధిపత్య ధోరణులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘కొన్ని దేశాలు సైనిక కూటములను విస్తరించుకునేందుకు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆధిపత్యం సాధించుకునే క్రమంలో ఇతర దేశాల హక్కులు, ప్రయోజనాలను కాలరాస్తున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిని ఉపేక్షిస్తే మరింత అస్థిర పరిస్థితులు ఏర్పడతాయి’’అని పరోక్షంగా ఆయన అమెరికా, ఈయూలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా, ఈయూల నాటో విస్తరణ కాంక్షే ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మూల కారణమన్నారు. భేటీలో మోదీ, జిన్పింగ్లతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో 41%, జీడీపీలో 24%, వాణిజ్యంలో 16% బ్రిక్స్లోని ఐదు దేశాలదే. -
3వ బ్రిక్స్ సమావేశం: అఫ్గాన్ను ఉగ్ర అడ్డాగా మార్చొద్దు
న్యూఢిల్లీ: ఇతరదేశాలపై ఉగ్రదాడులు చేసేందుకు అఫ్గాన్ భూభాగం ఉపయోగపడకుండా నిరోధించాలని బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాలపై పోరాడాలని పిలుపునిచ్చాయి. ఆన్లైన్లో భారత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 13వ బ్రిక్స్ సమావేశం జరిగింది. అఫ్గాన్లో పరిస్థితులతో పాటు ఇతర కీలక పరిణామాలపై సభ్యదేశాలు విస్తృత చర్చలు జరిపాయి. సమావేశంలో రష్యా అధిపతి పుతిన్, చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమఫోసా, బ్రెజిల్ అధినేత బోల్సనారో ఆన్లైన్లో పాల్గొన్నారు. సదస్సు చివరలో అన్ని దేశాలు కలిసి ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశాయి. అఫ్గాన్లో పరిస్థితులు శాంతియుతంగా ముగియాలని డిక్లరేషన్లో కోరాయి. అఫ్గాన్లోని అన్ని వర్గాల మధ్య సామరస్య చర్చలు సాగాలని, తద్వారా దేశంలో శాంతి, స్థిరత్వం రావాలని ఆకాక్షించాయి. ఇటీవల కాబూల్ ఎయిర్పోర్టు వద్ద జరిగిన దాడులను బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ఏవిధమైన ఉగ్రకార్యకలాపాలకు అఫ్గాన్ స్థావరంగా మారకూడదని కోరాయి. టెర్రరిజం ఏరూపంలో ఉన్నా గట్టిగా ఎదుర్కోవాలన్నదే తమ అభిమతమని చెప్పాయి. బ్రిక్స్ దేశాల భద్రతా సంస్థలు రూపొందించిన కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ను ఆమోదించాయి. టెర్రరిజానికి మతం, జాతీయత, వర్గం రంగు పులమకూడదని బ్రిక్స్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణిని వ్యతిరేకిస్తామని, ఐరాస నిబంధనల మేరకు రూపొందించి సీసీఐటీ అమలు చేయాలని బ్రిక్స్దేశాలు తమ డిక్లరేషన్లో కోరాయి. కౌంటర్ టెర్రరిజం ప్లాన్ బ్రిక్స్ దేశాలు రూపొందించుకున్న కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్కు ఆమోదం లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. బ్రిక్స్ చైర్మన్గా భారత్ ప్రస్తుతం వ్యవహరిస్తోంది. తమ పాలనా కాలంలో ఇతర నాలుగు దేశాలు మంచి సహకారం అందించాయని ప్రధాని ప్రశంసించారు. ‘ప్రపంచంలోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ప్రభావశీల గళంగా మారాము. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు ప్రాధాన్యమివ్వడానికి బ్రిక్స్ ఉపయోగపడుతోంది’’అని మోదీ చెప్పారు. బ్రిక్స్ సాధించిన పలు విజయాలను ఆయన వివరించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, కంటింజన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్, ఎనర్జీ రిసెర్చ్ కోఆపరేషన్ ప్లాట్ఫామ్లాంటి బలమైన సంస్థలను బ్రిక్స్ దేశాలు ఏర్పరుచుకున్నాయన్నారు. వచ్చే 15ఏళ్లలో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాజా సమావేశం బ్రిక్స్ చరిత్రలో తొలి డిజిటల్ సదస్సని గుర్తు చేశారు. నవంబర్లో బ్రిక్స్ దేశాల జలవనరుల మంత్రుల తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు. ఐదు దేశాల కస్టమ్స్ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం సులభతరంమవుతోందన్నారు. గ్రీన్ టూరిజం, ఆన్లైన్ టీకా ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటువంటి వాటిపై బ్రిక్స్ దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు. ఎవరేమన్నారంటే..: బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వేదికపై గణనీయమైన శక్తిగా మారాయని చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ కొనియాడారు. సభ్యదేశాల మధ్య మరింత లోతైన సహకారం అవసరమని, అప్పుడే ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనే పటిష్టమైన భాగస్వాములుగా మారతామని చెప్పారు. ప్రజారోగ్యాలను బలోపేతం చేయడంలో సహకారం, టీకాలపై అంతర్జాతీయ సహకారం, ఆర్థిక సహకారం, రాజకీయ, రక్షణ సహకారం, ప్రజా సంబంధాలు పెంపొందించడమనే ప్రతిపాదనలతో బ్రిక్స్ బలపడుతుందని వివరించారు. అఫ్గాన్లో నూతన సంక్షోభానికి అమెరికా, దాని మిత్రదేశాలు కారణమయ్యాయని రష్యా అధిపతి పుతిన్ విమర్శించారు. బ్రిక్స్ దేశాలు అఫ్గాన్పై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలని, ఉగ్రకార్యక్రమాలకు, డ్రగ్స్కు ఆదేశం అడ్డాగా మారకుండా చూడాలని కోరారు. కోవిడ్ కట్టడి విషయంలో సమష్టి స్పందనను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా కొనియాడారు. బ్రెజిల్, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బాగుందని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో చెప్పారు. బ్రిక్స్ విశేషాలు ► ఈ సంవత్సరం బ్రిక్స్ థీమ్ ‘‘ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యుటీ, కన్సాలిడేషన్, కన్సెస్’’. ► ప్రపంచ జనాభాలో 41 శాతం వాటా, ప్రపంచ జీడీపీలో 24 శాతం భాగస్వామ్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో 16 శాతం వాటా బ్రిక్స్ దేశాలదే. ► 2006లో తొలిసారి బ్రిక్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది. ► 2009లో తొలి బ్రిక్ సమావేశం రష్యాలో జరిగింది. ► బ్రిక్ అనే పదం రూపకల్పన రూపా పురుషోత్తమన్ చేశారు. కానీ క్రెడిట్ మాత్రం జిమ్ ఓ నీల్కు వచ్చింది. ► బ్రిక్స్ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంగైలో ఉంది. ► 14వ బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షత వహించనుంది. ► ఏటా ఒక దేశం బ్రిక్స్కు చైర్మన్గా వ్యవహరిస్తుంది. 2016లో మోదీ బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించారు. -
బ్రిక్స్ సదస్సుకు మోదీ అధ్యక్షత
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల వార్షిక సదస్సుకు ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. 9న వర్చువల్ విధానంలో జరగనున్న ఈ సదస్సులో భారత్ నుంచి ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో పాల్గొననున్నారు. ‘అంతర్గత సహకారం’ అనే అంశం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో అఫ్గానిస్తాన్ వ్యవహారం కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని భారత్లో రష్యా రాయబారి నికోలే కుదాషెవ్ వ్యాఖ్యానించారు. -
ఉగ్రవాదమే పెను ముప్పు
న్యూఢిల్లీ/మాస్కో/బీజింగ్ : ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఉగ్రవాదమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పొరుగుదేశం పాకిస్తాన్ను నేరుగా ప్రస్తావించకుండా.. ఉగ్రవాదానికి సాయమందిస్తూ మద్దతిస్తున్న దేశాలను దోషులుగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాద మహమ్మారిపై ఉమ్మడిగా, వ్యూహాత్మకంగా పోరు సాగించాలన్నారు. రష్యా అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ కొరియా) 12వ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమాఫొసా పాల్గొన్నారు. ‘రష్యా నేతృత్వంలో బ్రిక్స్ ఉగ్రవాద వ్యతిరేక వ్యూహం సిద్ధమైనందుకు సంతోషంగా ఉంది. ఇది గొప్ప విజయం. తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్న భారత్.. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘బ్రిక్స్ నూతన ఉగ్రవాద వ్యతిరేక వ్యూహం’ను ఈ సదస్సులో సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ వ్యూహం కార్యాచరణకు సంబంధించి సభ్య దేశాల జాతీయ భద్రత సలహాదారు చర్చలు జరపాలని మోదీ సూచించారు. ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు పుతిన్ సమర్థించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను కుటుంబంలోని ‘విశ్వాసఘాతకులు’గా పుతిన్ అభివర్ణించారు. బ్రిక్స్ ప్రపంచంలోని ఐదు ప్రధాన దేశాల కూటమి. 360 కోట్ల జనాభాకు ఈ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ జనాభాలో ఇది దాదాపు సగం. ఈ ఐదు దేశాల మొత్తం జీడీపీ 16.6 లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. సదస్సు అనంతరం సభ్యదేశాలు ఉమ్మడి ప్రకటనను వెలువరించాయి. అన్ని విధాలైన ఉగ్రవాద కార్యక్రమాలను బ్రిక్స్ గట్టిగా ఖండిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మతం, వర్గం, జాతితో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు ఒక సమగ్ర, సమతుల కార్యాచరణను రూపొందించాలన్నారు. సంస్కరణలు అవసరం బహుళత్వ విధానం, అంతర్జాతీయ ఐక్యత ప్రస్తుతం సంక్షోభంలో పడ్డాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రత మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ), ఐఎంఎఫ్, డబ్ల్యూహెచ్ఓ తదితర అంతర్జాతీయ సంస్థల్లో సత్వరమే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని నొక్కిచెప్పారు. ‘ఈ సంస్థల పనితీరు, విశ్వసనీయతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం.. కాలానుగుణంగా, అంతర్జాతీయ అవసరాలు ప్రాతిపదికగా ఈ సంస్థలు మార్పు చెందకపోవడమే’ అని ప్రధాని మోదీ విమర్శించారు. ‘ఐరాస భద్రత మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ బలంగా విశ్వసిస్తోంది. ఈ విషయంలో బ్రిక్స్ సభ్య దేశాలు భారత్కు మద్దతిస్తారని ఆశిస్తున్నా’నన్నారు. కోవిడ్–19.. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పునరుజ్జీవనంలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషించాలని మోదీ పిలుపునిచ్చారు. కరోనా టీకా ఉత్పత్తి, సరఫరాలో మొత్తం మానవాళి సంక్షేమాన్ని భారత్ దృష్టిలో పెట్టుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరిగేందుకు ఇంకా ఎంతో అవకాశముందన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, కంటింజెంట్ రిజర్వ్ అరెంజ్మెంట్ తదితర ఉమ్మడి వ్యవస్థల ద్వారా బ్రిక్స్ దేశాలు ప్రయోజనం పొందడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక రంగ పునరుజ్జీవానికి కూడా అవకాశం లభిస్తుందన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరేందుకు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ చర్యలు చేపట్టాలని సూచించారు. కోవిడ్ టీకాలు, చికిత్సా విధానాలను అంతర్జాతీయ మేథో హక్కుల ఒప్పందాల నుంచి మినహాయించాలంటూ భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. దీనికి బ్రిక్స్ దేశాలు మద్దతివ్వాలన్నారు. స్వయం సమృద్ధ భారత్.. స్వయం సమృద్ధ భారత్ లక్ష్యంగా ఒక సమగ్ర సంస్కరణల విధానాన్ని భారత్లో ప్రారంభించామని ప్రధాని బ్రిక్స్ సభ్య దేశాలకు వివరించారు. ‘‘కోవిడ్–19 అనంతరం అంతర్జాతీయ అర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు సముచిత ప్రయోజనం చేకూర్చగల శక్తి స్వయం సమృద్ధ, ఉత్సాహపూరిత భారత్కు ఉందన్న విశ్వాసంతోనే ఈ ‘స్వావలంబ భారత్’ ప్రచారాన్ని ప్రారంభించాం’’ అని వివరించారు. కరోనా విజృంభణ సమయంలో దాదాపు 150 దేశాలకు అత్యవసర ఔషధాలను భారత్ పంపించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించిన తరువాత డిజిటల్ హెల్త్, సంప్రదాయ వైద్యం రంగాల్లో సభ్య దేశాలతో సమన్వయం పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. భారత్కు సహకరిస్తాం: జిన్పింగ్ కరోనా వైరస్కు టీకాలను తయారు చేయడంలో భారత్ సహా బ్రిక్స్ దేశాలకు సహకరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొన్నారు. కోవిడ్–19 చికిత్స, నివారణల్లో బ్రిక్స్ దేశాల్లోని సంప్రదాయ వైద్యం ప్రాధాన్యాన్ని వివరించేలా ఒక సదస్సును ఏర్పాటు చేయాలని సూచించారు. ‘కరోనా టీకాల క్లినికల్ ట్రయల్స్లో రష్యా, బ్రెజిల్ దేశాల్లోని తమ భాగస్వామ్యులతో కలిసి చైనా ఫార్మా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ విషయంలో భారత్, దక్షిణాఫ్రికాలతో కూడా కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాం’ అన్నారు. బ్రిక్స్ దేశాలకు అవసరమైతే, టీకాను సరఫరా చేస్తామన్నారు. భారత్, చైనాల్లో స్పుత్నిక్ వీ టీకా కరోనా వైరస్కు టీకాను తయారు చేసే ప్రక్రియలో బ్రిక్స్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి రూపొందించిన తమ స్పుత్నిక్ వీ టీకాను భారత్, చైనాల్లోనూ ఉత్పత్తి చేయనున్నారన్నారు. ‘బ్రిక్స్ దేశాలు వ్యాక్సిన్ల రూపకల్పనలో సహకరించుకోవాలి. టీకాల పరిశోధన, అభివృద్ధి కోసం ఉమ్మడి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని రెండేళ్ల క్రితమే ఒక అంగీకారానికి వచ్చాం’ అని పుతిన్ గుర్తు చేశారు. స్పుత్నిక్ వీ టీకా క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి బ్రెజిల్, భారత్ల్లోని భాగస్వాములతో ఒప్పందాలు కుదిరాయన్నారు. టీకా ఉత్పత్తికి సంబంధించి భారత్, చైనాల్లోని ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదిరిందన్నారు. స్పుత్నిక్ వీ పేరుతో ప్రపంచంలోనే తొలిసారి కరోనా వైరస్కు టీకాను రష్యా ఈ ఆగస్ట్లో రిజిస్టర్ చేసింది. -
బ్రిక్స్ సదస్సులో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని మోదీ
-
ఉగ్రవాదంతో ట్రిలియన్ డాలర్ల నష్టం
బ్రసీలియా: ఉగ్రవాదం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం కారణంగా నెలకొన్న పరిస్థితులు వాణిజ్య, వ్యాపార రంగాలను పరోక్షంగానైనా, లోతుగా దెబ్బతీశాయన్నారు. 11వ బ్రిక్స్ సదస్సులో భాగంగా జరిగిన ప్లీనరీ సమావేశంలో గురువారం మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో బ్రిక్స్ దేశాల సహకారాన్ని మోదీ ప్రశంసించారు. బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని ప్రఖ్యాత తమారటి ప్యాలెస్లో జరిగిన సమావేశంలో ఇతర సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతల సమక్షంలో మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధికి, శాంతి, సౌభాగ్యాలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందన్నారు. ‘ఒక అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధి ఉగ్రవాదం కారణంగా 1.5% తగ్గింది. గత పదేళ్లలో ఉగ్రవాదం కారణంగా 2.25 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు’ అని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, జల నిర్వహణ సవాలుగా మారాయని, బ్రిక్స్ దేశాల తొలి జలవనరుల మంత్రుల సమావేశాన్ని భారత్లో నిర్వహించాలని అనుకుంటున్నామని మోదీ తెలిపారు. ‘ఇటీవలే భారత్లో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాం. ఫిట్నెస్, ఆరోగ్యం విషయాల్లో సభ్య దేశాల సంప్రదింపులు మరింత పెరగాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య జరిగే వాణిజ్యం వాటా కేవలం 15 శాతమే. కానీ ఈ ఐదు దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 40% పైగా ఉంది. అందువల్ల వాణిజ్యం, పెట్టుబడుల్లో ద్వైపాక్షిక సహకారంపై బ్రిక్స్ దేశాలు దృష్టి పెట్టాల్సి ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో బ్రిక్స్ దిశ ఎలా ఉండాలో చర్చించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ‘సృజనాత్మక భవితకు ఆర్థికాభివృద్ధి’ అనే థీమ్ సరైనదని మోదీ అభిప్రాయపడ్డారు. గణతంత్రానికి బ్రెజిల్ అధ్యక్షుడు 2020లో భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ పాల్గొననున్నారు. ఈ మేరకు మోదీ ఆహ్వానానికి ఆయన సంతోషంగా ఆమోదం తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారొతో బుధవారం మోదీ సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి. జిన్పింగ్, పుతిన్లతో చర్చలు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో మోదీ విడిగా మాట్లాడారు. రష్యాలో వచ్చే సంవత్సరం మేలో జరిగే ‘విక్టరీ డే’వేడుకలకు మోదీని పుతిన్ ఆహ్వానించారు. రైల్వేలో ద్వైపాక్షిక సహకారంపై, ముఖ్యంగా నాగపూర్, సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడంపై సమీక్ష జరిపారు. -
ప్రధాని మోదీ ఆకాంక్ష
బ్రసీలియా: తాజా బ్రిక్స్ సదస్సుతో సభ్యదేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రెండు రోజుల పాటు జరగనున్న 11వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సదస్సులో పాల్గొనేందుకు మోదీ బుధవారం బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాకు చేరుకున్నారు. ‘బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్కు వచ్చాను. ఈ పర్యటన సందర్భంగా పలువురు ప్రపంచ దేశాధినేతలతో సమావేశమవుతున్నాను’ అని మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొనడం ఇది ఆరో సారి కానుంది. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల్లో ప్రస్తుతం బ్రెజిల్ ఉంది. ప్రస్తుత బ్రిక్స్ సదస్సును ‘సృజనాత్మక భవిష్యత్తు కోసం ఆర్థిక అభివృద్ధి’ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. మోదీకి పుతిన్ ఆహ్వానం బ్రిక్స్ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ భేటీ అయ్యారు. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయడంపై ఇద్దరు చర్చించారు. తరచుగా నిర్వహించే సమావేశాల వల్ల మన సంబంధాలు మరింత పటిష్టమవుతాయని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మోదీని పుతిన్ రష్యాకు ఆహ్వానించారు. వచ్చే ఏడాది మే 9న మాస్కోలో నిర్వహించే విక్టరీ డే ఉత్సవాలకు హాజరుకావాలని మోదీని కోరారు. ఇరుదేశాల వాణిజ్యంలో 17 శాతం వృద్ధి నమోదైందన్నారు. -
‘బ్రిక్స్’ కోసం బ్రెజిల్కు మోదీ
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల 11వ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మంగళవారం బ్రెజిల్ వెళ్లారు. ఈ సమావేశాలు బుధ, గురువారాల్లో జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక చర్యలను బలోపేతం చేయడం, ఆ దిశగా సహకారం అందించుకోవడం, డిజిటల్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో సంబంధాలను పటిష్టం చేయడం వంటి పలు అంశాలపై ఈసారి బ్రిక్స్ సమావేశాలు దృష్టి సారించాయని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సరికొత్త భవిష్యత్ కోసం ఆర్థిక అభివృద్ధి’ అనే అంశంపై వివిధ దేశాల అధినేతలతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ను ఉద్దేశించి ప్రసంగిస్తానని.. బ్రిక్స్ బిజినెస్, న్యూడెవలప్మెంట్ బ్యాంకులతో చర్చలు జరుపుతానని వెల్లడించారు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ వేర్వేరుగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రెజిల్తో సంబంధాలు మెరుగుపరిచేందుకు తన పర్యటన దోహదపడుతుందని మోదీ పేర్కొన్నారు. కాగా, 2014 నుంచి మోదీ బ్రిక్స్ సదస్సుల్లో పాల్గొనడం ఇది ఆరోసారి. -
ఆఫ్రికా ఔట్రీ కార్యక్రమంలొ పాల్గొన్న ప్రధాని మోదీ
-
రష్యా అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటి
-
‘మా స్నేహం బలమైనది’
జోహన్నెస్బర్గ్ : రష్యాతో తమ బంధం ఎంతో విలువైనదని, భారత్-రష్యా దేశాలు బహుళ రంగాల్లో కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో తెలిపారు. బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పర్యటనకు మోదీ బుధవారం దక్షిణాఫ్రికా వెళ్లిన విషయం తెలిసిందే. సమావేశంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో శుక్రవారం భేటి అయ్యారు. ‘రష్యాతో మాకు మంచి అనుబంధం ఉంది. విభిన్న రంగాల్లో మా స్నేహం కొనసాగుతుంది. బహుళ రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాము’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల నేతల ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లు విదేశాంగ ప్రతినిధి రావీష్ కూమార్ ట్విటర్లో తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, శక్తి, రక్షణ మరియు పర్యాటక రంగం వంటి అంశాలపై లోతుగా చర్చించినట్లు పేర్కొన్నారు. గత మేలో సోచిలో భేటి అయిన ఇద్దరు నేతలు రష్యా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచ జనాభాలో 40 శాతం ఉన్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పరస్పర సహాకారం కొరకు 2009లో బ్రిక్స్ గా ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రిక్స్ పదో శిఖరాగ్ర సమావేశాలకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నగరం ఆతిథ్యం ఇస్తోంది. Wide-ranging and productive talks with President Putin. India’s friendship with Russia is deep-rooted and our countries will continue working together in multiple sectors. @KremlinRussia pic.twitter.com/xMl1k6XWX9 — Narendra Modi (@narendramodi) July 26, 2018 -
సాంకేతికతతో కొత్త ప్రపంచం
జోహన్నెస్బర్గ్: సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, బహుముఖ సహకారంతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించొచ్చని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న నూతన పారిశ్రామిక సాంకేతికత, డిజిటల్ విధానాల జోక్యం అవకాశాలు సృష్టించడమే కాకుండా సవాళ్లు విసురుతాయన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల పదో శిఖరాగ్ర భేటీ ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం బ్రిక్స్ దేశాలతో కలసిపనిచేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోందని అన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో మూలధనం కన్నా ప్రతిభే ముఖ్యమని నొక్కిచెప్పారు. ఈ తరంలో ‘అత్యుత్తమ నైపుణ్యం–కొద్ది పని’ కొత్త విధానంగా మారిందని వ్యాఖ్యానించారు. పారిశ్రామిక తయారీ, డిజైన్, ఉత్పాదకతల్లో నాలుగో పారిశ్రామిక విప్లవం మౌలిక మార్పులు తీసుకొస్తుందని పేర్కొన్నారు. బహుళత్వ విధానాలు, అంతర్జాతీయ వాణిజ్యానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఉగ్రపోరుకు సమగ్ర విధానం: బ్రిక్స్ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాడటానికి సమగ్ర విధానం అవలంబించాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. బ్రిక్స్ దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడులను సదస్సు డిక్లరేషన్ ఖండించింది. అవినీతి కూడా ప్రపంచానికి అతిపెద్ద సమస్యగా మారిందని పేర్కొంది. జిన్పింగ్తో మోదీ భేటీ.. బిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. తమ భేటీ ఇరు దేశాల సంబంధాలకు, సహకారానికి కొత్త శక్తినిస్తుందని మోదీ అన్నారు. మరోవైపు, ఆతిథ్య దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో కూడా వేరుగా సమావేశమైన మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. -
పదేళ్ల ప్రస్థానం...!
భారత్, చైనా, రష్యాలతో సహా వివిధ దేశాలపై అమెరికా ఆంక్షల రూపంలో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్న ప్రస్తుత సందర్భంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల శిఖరాగ్ర సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మూడురోజుల పాటు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో బ్రిక్స్ పదవ వార్షిక సమావేశం జరగనుంది. బ్రిక్స్ దేశాల అధినేతలు, ఉన్నత స్థాయి బృందాల మేధోమథనంలో ప్రధానంగా సభ్య దేశాల మధ్య రాజకీయ, సామాజికఆర్థిక సమన్వయం, వ్యాపార,వాణిజ్య అవకాశాలు, ఏయే రంగాల్లో సహకారం అవసరమన్న అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, రాజకీయాలపై చారిత్రక, వ్యూహాత్మక దృష్టికోణంతో బ్రిక్స్ తనదైన ముద్ర వేసింది. అమెరికా ప్రయోజనాల పరిరక్షణ పేరిట ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు చర్యల ప్రభావం తమపై ఏ మేరకు పడుతుంది ? వాటి వల్ల జరిగే హాని, బయటపడే మార్గం ఏమిటన్న దానిపై ఈ దేశాలు కూలంకశంగా చర్చించవచ్చునని తెలుస్తోంది. భారత్లో సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ప్రోత్సహించడాన్ని గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పదేళ్ల ప్రస్థానం... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా 2009 జూన్లో రష్యాలోని యెకటెరిన్బర్గ్లో బ్రిక్స్ మొదటి శిఖరాగ్ర సమావేశం ( 2010లో దక్షిణాఫ్రికా చేరింది) జరిగింది. ఒక్కో సంవత్సరం ఒక్కో సభ్యదేశంలో ఈ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. మనదేశంలో 2012 మార్చిలో ఢిల్లీలో, 2016 అక్టోబర్లో గోవాలో ఈ భేటీ జరిగింది. 2010లో బ్రెజిల్లో, 2011లో చైనాలో, 2013లో దక్షిణాఫ్రికాలో, 2014లో బ్రెజిల్లో, 2015లో రష్యాలో, 2017లో చైనాలో ఈ సమావేశాలు జరిగాయి. 2014లో సభ్యదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని వ్యవస్థీకరించే ఉద్ధేశ్యంతో న్యూడెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)తో పాటు కాంటింజెంట్ రిజర్వ్ అరెంజ్మెంట్ (సీఆర్ఏ) సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకోవడం గొప్ప విజయంగా చెబుతున్నారు. గతేడాది చైనాలో జరిగిన భేటీలో విలువలు, ఆకాంక్షలకు అనుగుణంగా సభ్యదేశాలు పునరంకితం కావాలని తీర్మానించాయి.ఎన్డీబీ ద్వారా ఆశించిన పురోగతి సాధ్యమైందని, ఈ బ్యాంక్ ద్వారా చేపట్టిన 11 ప్రాజెక్టులలో స్థిరమైన మౌలికవనరుల అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారు. 2017-18కు సంబంధించి ఈ బ్యాంకు ఆధ్వర్యంలో పరస్పర సహకారంలో భాగంగా చేపట్టిన మొత్తం 23 ప్రాజెక్టులు (600 కోట్ల అమెరికన్ డాలర్లు) వివిధ దశల్లో ఉన్నాయి. -సభ్యదేశాల మధ్య మెరుగైన ఆర్థిక సంబంధాలు సాధించే దిశలో పురోగమనం సాధించడంలో బ్రిక్స్ సఫలమైందనే అభిప్రాయంతో నిపుణులున్నారు. ఈ ఐదు దేశాల్లోని లక్షలాది మంది ప్రజలకు స్థిరమైన ప్రయోజనాలు కలిగించిందని దర్భన్లోని చైనా కౌన్సల్జనరల్ వాంగ్ జియాంగ్జౌ తెలిపారు.పదేళ్లలో బ్రిక్స్ జీడీపీ 179 శాతం వృద్ధి చెందిందని ,, వాణిజ్యం 94 శాతం పెరిగిందని ఆయన చెబుతున్నారు. బ్రిక్స్ ఆర్థికాభివృద్ధి రేటు 8 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని, అదే సమయంలో ప్రపంచ సగటు మాత్రం కేవలం ఒక శాతమే ఉందని దక్షిణాఫ్రికా స్టాండర్డ్బ్యాంక్ ఆర్థికవేత్త జెర్మీ స్టీవెన్స్ తెలిపారు. చర్చించే అంశాలివే... అంతర్జాతీయ శాంతి, భద్రత, వాణిజ్యపరమైన అంశాలతో పాటు ఈ భేటీలో ఆరోగ్య పరిరక్షణ-వ్యాక్సిన్లు, మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత, శాంతి పరిరక్షణ, సైన్స్, సాంకేతిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిరంగాల్లో సహకారం, స్థిరమైన అభివృద్ధి, సమ్మిళిక పురోగతి, గ్లోబల్ గవర్నెన్స్ తదితర అంశాలు చర్చనీయాంశం కానున్నాయి. బ్రిక్స్ చరిత్ర ఇదీ... 2001లో బ్రిక్ అనే పదాన్ని (ప్రపంచ ఆర్థికశక్తులు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు ఎదుగుతున్న క్రమంలో) బ్రిటన్ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ ప్రతిపాదించారు. 2006 నుంచి ఈ నాలుగుదేశాలు క్రమం తప్పకుండా సమావేశమవుతున్నాయి. న్యూయార్క్లో ఐరాస వార్షిక జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఈ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు.అదే ఏడాది జీ-8 నాయకులు తమ భేటీకి హాజరుకావాలని భారత్, బ్రెజిల్, చైనా దేశాల అధ్యక్షులను ఆహ్వానించారు. 2009లో మొదటి బ్రిక్స్ సమావేశానికి రష్యా వేదికైంది. ప్రపంచ రాజకీయ,ఆర్థికరంగానికి సంబంధించిన సంస్థ రూపాన్ని 2010లో బ్రిక్స్ సంతరించుకుంది. 2010 డిసెంబర్లో ఆఫ్రికా ఖండం నుంచి ఏకైక ప్రతినిధిగా దక్షిణాప్రికా ఈ సభ్యదేశాల్లో ఒకటిగా చేరింది. పేరు బ్రిక్స్గా మారింది. -
రువాండాలో పర్యటించిన తొలి ప్రధానిగా..
కిగాలి, రువాండా : ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి రువాండా చేరుకున్నారు. రువాండా అధ్యక్షుడు పాల్ కగామే ఎయిర్పోర్టుకు వచ్చి మోదీకి సాదర స్వాగతం పలికినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడే దిశగా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. పాల్ కగామేతో భేటీ సందర్భంగా రువాండాకు 2 వందల మిలియన్ డాలర్ల రుణాన్ని అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. రువాండాలో భారత హై కమిషన్ను ప్రారంభించడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచుకోవచ్చని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, రక్షణ, వ్యాపారం తదితర రంగాల్లో పరస్పర సహకారానికై రువాండాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మోదీ తెలిపారు. జిన్పింగ్ తర్వాత మోదీ.. తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా అభివృద్థి చెందుతోంది. ఆసియా దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రువాండాలో పర్యటించారు. ప్రస్తుతం మోదీ కూడా ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొదటగా రువాండా చేరుకున్నారు. భారత్ రుణంగా అందించిన 2 వందల మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లు ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణం కోసం, మరో వంద మిలియన్ డాలర్లు వ్యవసాయం కోసం ఖర్చు చేయనున్నట్లు రువాండా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా పేద కుటుంబాల ఉపాధి కోసం రువాండా ప్రభుత్వం చేపట్టిన ‘గిరింకా’ (కుటుంబానికి ఒక ఆవు చొప్పున అందించే కార్యక్రమం)లో పాల్ కగామేతో కలిసి మోదీ కూడా పాల్గొననున్నారు. ఈ సందర్బంగా భారత్ తరపున 200 ఆవులను మోదీ రువాండా ప్రజలకు కానుకగా ఇవ్వనున్నారు. కాగా రువాండాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో బుధవారం బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్నారు. -
బ్రిక్స్ సదస్సులో తెలంగాణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఢిల్లీ: బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సదస్సుకు దాదాపు 20 దేశాలల నుంచి ప్రతినిథులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పారిశ్రిమిక రంగంలో తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్, రైతు బంధు పథకం గురించి ప్రత్యేక ప్రతినిథి వేణుగోపాలచారి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరామని, 24 గంటల విద్యుత్, నీరు, మౌళిక సదుపాయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిని వారు స్వాగతించారని తెలిపారు. బ్రిక్స్ సమావేశంలో దాదాపు 45 నిమిషాల పాటు తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వేణుగోపాల చారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రభుత్య సిబ్బంది, ఉద్యోగులకు ప్రత్యేకంగా క్రీడలను నిర్వహిస్తున్నామని, తెలంగాణ బజారును ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆట, పాట ప్రత్యేక ఆకర్షణగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. -
బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి తోడ్పడాలి
బిజినెస్ కౌన్సిల్, ఎన్డీబీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సూచన జియామెన్ (చైనా): బ్రిక్స్ కూటమి దేశాల మధ్య పరస్పర సహకారం మరింతగా పెంపొందేలా బిజినెస్ కౌన్సిల్, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) కృషి చేయాలని చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ సూచించారు. తొమ్మిదో బ్రిక్స్ సదస్సు సందర్భంగా.. కౌన్సిల్, ఎన్డీబీ విజయాలను ప్రశంసించారు. ఈ–కామర్స్, సాంకేతికాభివృద్ధి, ప్రమాణాలు నెలకొల్పడం మొదలైన అంశాల్లో బిజినెస్ కొన్సిల్ ఎంతగానో కృషి చేసిందని పేర్కొన్నారు. మరోవైపు ఆఫ్రికాలో ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించడం ద్వారా ఎన్డీబీ కొత్త ప్రాజెక్టులు చేపట్టినట్లు జిన్పింగ్ వివరించారు. రాబోయే ‘స్వర్ణ దశాబ్ది’లో పరస్పర సహకారం మరింతగా పెంచుకోవాలని బ్రిక్స్ దేశాధినేతలు తీర్మానించిన నేపథ్యంలో బిజినెస్ కౌన్సిల్, ఎన్డీబీ ఈ దిశగా తోడ్పాటు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్డీబీ ప్రెసిడెంట్ కేవీ కామత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బ్రిక్స్ తీర్మానంపై పాక్లో ప్రకంపనలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కొనసాగిస్తున్న పోరులో భారత్కు మరో భారీ దౌత్య విజయం దక్కగా దాయాది మాత్రం దీనిపై బుసలు కొడుతోంది. ఆసియా ప్రాంతంలో హింసకు పాల్పడుతున్న తాలిబాన్, ఐసిస్, అల్కాయిదాతోపాటుగా హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థల ఆగడాలను అరికట్టాలని బ్రిక్స్ సదస్సులో సోమవారం మోదీ ఇచ్చిన పిలుపు పాక్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. శాంతికి విఘాతం కల్పిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాద సంస్థలపై సమైక్యంగా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల అధ్యక్షులు జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్, మైకెల్ టెమర్, జాకబ్ జుమాలు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని తమ దేశం ప్రోత్సహించడని, తమపై ఆ ఐదు దేశాల అధినేతలు చేసినవి తప్పుడు ఆరోపణలంటూ పాక్ కొట్టిపారేసింది. పాక్ రక్షణమంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ.. బ్రిక్స్లో మోదీ సహా ఐదుగురు నేతలు చెప్పినట్లుగా తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదన్నారు. ఉగ్రమూకలను పాక్ ఏరిపారేస్తుందని, దానిపై ప్రత్యేక నిఘా ఉందని చెప్పారు. ఉగ్రవాదులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ స్వర్గధామం కాదని మరోసారి మంత్రి ఖుర్రం హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఏ దేశం హర్షించదని తమకు తెలుసునని, పాక్లోనూ ఉగ్రమూకలకు కష్టాలు తప్పవన్నారు. ఉగ్రవాదుల నిమాయకం, ఉగ్ర కదలికలు, విదేశీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం, డ్రగ్స్ అక్రమ రవాణాతోపాటుగా ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయాన్ని అడ్డుకోవటం, ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేయటం, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్టవేయటం ద్వారా ఉగ్రవాదంపై పోరాటం చేయాలని బ్రిక్స్ డిక్లరేషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై భద్రతామండలి తీర్మానాలు, ఎఫ్ఏటీఎఫ్ అంతర్జాతీయ ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని అభిప్రాయపడింది. పాక్ మాత్రం తమను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని, అందులో వాస్తవం లేదని పాక్ చెప్పడం గమనార్హం. -
మయన్మార్ చేరుకున్న ప్రధాని మోదీ
మయన్మార్: చైనా పర్యటన ముగించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మయన్మార్ చేరుకున్నారు. దేశ రాజధాని నెపిడా చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. నెపిడాలో కాలు పెట్టడంతో తన మయన్మార్ పర్యటన ప్రారంభమైందని ప్రధాని ఈ సందర్భంగా ట్విట్ చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆయన చర్చలు జరపనున్నారు. మయన్మార్లో మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు హ్యూటిన్ జా తో భేటీ కానున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు, మయన్మార్ పశ్చిమ ప్రాంతమైన రఖీనే రాష్ట్రంలో పెరుగుతున్న హింసాకాండపై ప్రధాని చర్చించనున్నారు. అలాగే మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీతో భేటీ అవుతారు. కాగా బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరయ్యేందుకు మోదీ ఆదివారం చైనా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీ, జిన్పింగ్ భేటీ
ప్రధాని మోదీ, జిన్పింగ్ భేటీ భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల చర్చ జియామెన్: బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మంగళవారం సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన డోక్లాం సరిహద్దు వివాదం అనంతరం ప్రధాని మోదీ, జిన్పింగ్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల సంబంధాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపిన ఇరునేతలు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు జిన్పింగ్ను ప్రధాని మోదీ అభినందించారు. 1954లో భారత్-చైనా కుదుర్చుకున్న పంచశీల ఒప్పందం అమలులో భారత్తో కలిసి పనిచేసేందుకు, భారత్ మార్గదర్శకత్వాన్ని కోరేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్పింగ్ చెప్పారు. భారత్-చైనాలు పరస్పరం అగ్ర పొరుగుదేశాలని, ప్రపంచశక్తులుగా ఆవిర్భవిస్తున్న అతిపెద్ద దేశాలని, ఇరుదేశాల నడుమ ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరమని జిన్పింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 73 రోజుల డోక్లాం సైనిక ప్రతిష్టంభనకు తెరపడిన నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. బ్రిక్స్ దేశాల కూటమి మరింత బలోపేతం కావాలని, ప్రపంచాన్ని అస్థిరత్వం నుంచి సుస్థిరత దిశగా నడుపాలని సూచించిన సంగతి తెలిసిందే. -
పాక్ ఉగ్రమూకలకు బ్రిక్స్ వార్నింగ్!
-
పాక్ ఉగ్రమూకలకు బ్రిక్స్ వార్నింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్ కూటమి తొలిసారి పాకిస్థాన్ ఉగ్రమూకలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ పాక్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్వర్క్ తదితర ఉగ్రవాద గ్రూపుల పేర్లను తొలిసారి ప్రస్తావించింది. ఉగ్రవాదం విషయంలో ఇన్నాళ్లు పాకిస్థాన్ను చైనా గుడ్డిగా వెనకేసుకొస్తున్న నేపథ్యంలో బ్రిక్స్ కూటమి నేరుగా పాక్లోని ఉగ్రమూకలను పేరు ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 'అమాయకులైన ఆఫ్గన్ ప్రజల మృతికి కారణమైన ఉగ్రవాద దాడులను మేం ఖండిస్తున్నాం. ఇదే విషయమై ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై, తాలిబన్, ఐసిస్/డాషే, అల్కాయిదా, వాటి అనుబంధ సంస్థలైన తూర్పు టర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్, ఉజ్బెకిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్, హక్కాని నెట్వర్క్, లష్కరే తోయిబా, జైష్ ఎ మొహమ్మద్, టీటీపీ, హిజ్బ్ ఉట్-తాహిర్ వాటి వల్ల తలెత్తుతున్న హింసపై, ఆందోళన వ్యక్తం చేస్తున్నాం' అని బ్రిక్స్ దేశాధినేతల ఉమ్మడి డిక్లరేషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉత్తర కొరియా అణుపరీక్ష నిర్వహించడాన్ని బ్రిక్స్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం చైనా జియామెన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. -
బ్రిక్స్ వార్షిక సదస్సు ప్రారంభం
ప్రధాని మోదీకి స్వయంగా స్వాగతం పలికి.. కరచాలనం చేసిన జిన్పింగ్ సాక్షి, జియామెన్: ప్రతిష్టాత్మక బ్రిక్స్ తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు సోమవారం ఉదయం చైనాలోని జియామెన్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బ్రిక్ దేశాల అధినేతల కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అంతకుముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్నేహపూర్వక వైఖరిని కనబరుస్తూ కరచాలనం చేశారు. రెడ్ కార్పెట్పై ప్రధాని మోదీతో సహా బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాధినేతలను జిన్పింగ్ స్వయంగా సదస్సుకు ఆహ్వానించారు. బ్రిక్స్ సదస్సు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్న మూడో నేత ప్రధాని మోదీ. ఆయన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేరుకున్నారు. ప్రధాని మోదీ మంగళవారం జిన్పింగ్తో భేటీ అయి భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. డోక్లాం సరిహద్దు వివాదం నేపథ్యంలో జరుగుతున్న తొలి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఇది కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిక్ సదస్సు, ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో డోక్లాం కొండప్రాంతం నుంచి ఇరుదేశాల బలగాలు ఉపసంహరించుకునేందుకు అంగీకరించి.. వివాదానికి తెరదించిన సంగతి తెలిసిందే. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి అయిన బ్రిక్స్ సదస్సులో శాంతియుతంగా చర్చలు చేపట్టాలని, స్నేహపూర్వక వైఖరికి పెద్దపీట వేయాలని అధినేతలు భావిస్తున్నారు. వివాదాస్పద అంశాల పరిష్కారానికి బ్రిక్స్ దేశాలు దౌత్యమార్గాన్ని కొనసాగించాలని జిన్పింగ్ ఇప్పటికే పిలుపునిచ్చారు. భారత్తో ఇటీవలి డోక్లాం వివాదం ప్రస్తావన లేకుండా.. విభేదాల పరిష్కారానికి శాంతి, అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని, ప్రపంచం యుద్ధ, ఘర్షణ పూరిత వాతావరణం కోరుకోవడం లేదని స్నేహపూర్వక ధోరణిలో ఆయన మాట్లాడారు. -
బ్రిక్స్ వార్షిక సదస్సు ప్రారంభం
-
చైనీస్ రిపోర్టర్ నోట బాలీవుడ్ సాంగ్
-
చైనీస్ రిపోర్టర్ నోట బాలీవుడ్ సాంగ్
సాక్షి, బీజింగ్: జియామెన్ నగరంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇదిలా ఉంటే బ్రిక్స్ సమ్మిట్ను కవరేజీ చేయటానికి వెళ్లిన మన మీడియాకు ఊహించని అనుభవం ఎదురైంది. చైనా రేడియోలో పని చేసే ఓ మహిళా రిపోర్టర్ హిందీలో పాట పాడి ఆకట్టుకుంది. తంగ్ యువాంగై అనే ఉద్యోగిణి బాలీవుడ్ క్లాసిక్ మూవీ నూరీ(1979) లోని ఆజా రే ఓ దిల్ మేరే దిల్బర్ ఆజా అంటూ గొంతు విప్పి... చిన్నపాటి సర్ప్రైజ్ నే అందించింది. ఆ వీడియోను మీరూ చూడండి. ఇదిలా ఉంటే రెండు నెలలపాటు కొనసాగిన డొక్లామ్ వివాదం అనంతరం ఇరు దేశాల నేతలు భేటీ అవుతుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సరిహద్దు అంశంతోపాటు ద్వైపాక్షిక ఒప్పందాల అంశం జింగ్పింగ్-మోదీ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
‘బ్రిక్స్’లో మోదీ జిన్పింగ్ భేటీ!
బీజింగ్: ఈ నెల 3 నుంచి 5 వరకూ జరగ నున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్లు భేటీ అయ్యే వీలుంది. చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చున్యింగ్ గురువారం మీడియాకు తెలిపారు. ‘భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సమావే శాలకు సమయం వస్తే అందుకు చైనా తప్పనిసరిగా ఏర్పాట్లు చేస్తుంద’న్నారు. బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదంపై పాకిస్తాన్ సాగిస్తున్న పోరు అంశాన్ని చర్చించేందుకు చైనా విముఖంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేసింది. బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదంపై పాక్ పోరు తమకు ప్రాధాన్య అంశం కాదంది.‘ ఉగ్రవాదంపై పోరులో పాక్ ముందంజలో ఉంది. ఉగ్రవాదంపై పాక్ పోరును అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. ఈ అంశంలో పాక్సహా ఇతర దేశాలతో కలసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉంది’ అని హు అన్నారు. -
ఔను, ప్రధాని మోదీ చైనా వెళుతున్నారు
డోక్లాం వివాదం పరిష్కారం నేపథ్యంలో బ్రిక్స్ సదస్సుకు హాజరుకాబోతున్న నరేంద్రమోదీ అధికారికంగా ప్రకటించిన విదేశాంగ శాఖ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్లబోతున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు చైనాలోని జియామెన్ నగరంలో జరిగే బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరవుతారని విదేశాంగశాఖ మంగళవారం వెల్లడించింది. భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన 73 రోజుల డోక్లాం సరిహద్దు వివాదం పరిష్కారమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఫుజియన్ ప్రావిన్స్లోని జియామెన్ నగరంలో జరిగే 9వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు' అని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల్లో ప్రపంచంలోని 42శాతం జనాభా నివసిస్తోంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో ఈ దేశాల మొత్తం వాటా 23శాతం. చైనా పర్యటన ముగిసిన అనంతరం మయన్మార్లో ప్రధాని మోదీ సెప్టెంబర్ ఐదు నుంచి ఏడో తేదీ వరకు పర్యటిస్తారు. మయన్మార్లో మోదీ ద్వైపాకిక్ష దౌత్య పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. -
ఎస్సార్ ఆయిల్, రోస్నెఫ్ట్ డీల్ పూర్తి
సాక్షి, ముంబై : దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ ఎస్సార్ ఆయిల్తో, రష్యన్ ప్రభుత్వ ఆధీన సంస్థ రోస్నెఫ్ట్, దాని భాగస్వామ్య సంస్థలు కుదుర్చుకున్న డీల్ ముగిసింది. ఎస్సార్ ఆయిల్ తన భారత ఆస్తులను పూర్తిగా రోస్నెఫ్ట్కు, దాని భాగస్వామ్య సంస్థలకు అమ్మేసింది. ఈ డీల్ విలువ రూ.12.9 బిలియన్ డాలర్లు(రూ.82,605 కోట్లు). గతేడాది అక్టోబర్ 15న గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. డీల్ ప్రకటించిన 10 నెలల అనంతరం ఈ రెండు సంస్థలు డీల్ను ముగించాయి. రూ.45వేల కోట్లకు పైనున్న రుణాలపై స్పష్టత ఇవ్వాలని బ్యాంకులు కోరడంతో, ఇన్నిరోజులు ఈ లావాదేవీ కొంత ఆలస్యమైంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎస్సార్-రోస్నెఫ్ట్ డీలే. రోస్నెఫ్ట్ ఈ డీల్కు కన్సోర్టియంగా నిర్వహిస్తోంది. ఈ డీల్లోనే గుజరాత్లోని వదినార్లో వద్దనున్న 20 మిలియన్ టన్ను రిఫైనరీ అమ్మకం కూడా ఉంది. 3500 పైగా పెట్రోల్ పంపుల అమ్మకం కూడా డీల్లో భాగమే. ఈ డీల్ ముగిసిన నేపథ్యంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, స్టాన్ఛార్ట్ వంటి లెండర్లకు రూ.70వేల కోట్లను సంస్థ చెల్లించనుంది. దేశంలో అత్యంత రుణ భారం మోస్తున్న కంపెనీల్లో ఒకటైన ఎస్సార్ గ్రూప్నకు ఈ డీల్ ముగింపుతో కొంత ఊరట కలిగింది. దీంతో ఎస్సార్ గ్రూప్ రుణ భారం 60 శాతం మేర తగ్గిపోనుంది. -
విశాఖ సేఫ్ కాదట!
►ఇది తుపాన్ల ప్రభావిత నగరమట.. ►అందుకే రాజధానిగా ఎంపిక చేయలేదట ►జాతీయ హరిత ట్రిబ్యునల్లో సర్కారు వితండవాదం ►అమరావతి ఎంపికను సమర్థించు కునేందుకు విశాఖపై అభాండం ►తుపాన్ల ముప్పున్నప్పుడు అంతర్జాతీయ నగరంగా ఎలా చేస్తామన్నారు ►సదస్సులు, సంబరాలకు ఎందుకు దీన్నే వేదిక చేస్తున్నారు ►విశాఖ ఇమేజ్ దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారంటూ స్థానికుల ఆగ్రహం విశాఖ నగరం తుపాను ప్రభావిత ప్రాంతం.. హుద్హుద్లో దారుణంగా నష్టపోయింది.. అందుకనే రాజధాని ప్రాంతంగా దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.. –జాతీయ హరిత ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వ వాదన ప్రకృతి ప్రసాదించిన వరం.. విశాఖ నగరం.. అందుకే దీని మీద ఫోకస్ చేస్తున్నాం.. అంతర్జాతీయ నగరంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తున్నాం.. – పలు వేదికలపై సీఎం చంద్రబాబు విశాఖకు ఇచ్చిన కితాబు రెండింటిలో ఎందుకింత వైరుధ్యం.. ఏమిటీ వితండవాదం.. తుపాన్ల నగరమని అభాండం ఎందుకు?! అంతర్జాతీయ సదస్సులు.. సంబరాల నిర్వహణకు.. లెక్కకు మిక్కిలి హబ్బుల ప్రకటనలకు అడ్డురాని తుఫాన్లు.. రాజధాని చేయడానికే అడ్డొస్తున్నాయా?? వాస్తవానికి విశాఖ నగరం ఎంతో సురక్షితమైనది.. తుపాన్లు ఇక్కడ తీరం దాటడం చాలా అరుదన్నది నిపుణుల మాట. తరచూ తుపాన్ల ముప్పు ఎదుర్కొనే చెన్నై నగరం తమిళనాడు రాజధానిగా దశాబ్దాలుగా కొనసాగుతోంది.. వీటన్నింటినీ విస్మరించి తుపాన్ల విశాఖను రాజధానిగా ఎంపిక చేయలేమని ట్రిబ్యునల్ను తప్పుదారి పట్టించడం.. విశాఖను చిన్నచూపు చూడటమే.. విశాఖపట్నం: ‘రాజధాని నిర్మాణం కా(లే)ని నవ్యాంధ్రప్రదేశ్లో ఆర్థిక రాజధాని, సహజ సౌందర్య నగరి విశాఖపట్నం మీదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫోకస్ ఉంది. అందుకే ప్రతిష్టాత్మక ఐఎఫ్ఆర్ విశాఖలోనే నిర్వహించాం.. సీఐఐలు వరుసగా రెండేళ్లు ఇక్కడే పెట్టాం.. ఐదు దేశాల ప్రతినిధులు పాల్గొన్న బ్రిక్స్ సదస్సుకు ఇదే నగరాన్ని వేదిక చేశాం.. విశాఖ నగరానికి మేము ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం’.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు నగరానికి వచ్చినప్పుడుల్లా చేసే వ్యాఖ్యలివి. సదస్సులు, సమావేశాల నిర్వహణే అభివృద్ధికి సూచికలు.. అన్న రీతిలో మాట్లాడే పాలకులు ఇప్పటి వరకు విశాఖ సమగ్రాభివృద్ధికి పక్కాగా ప్రణాళికలే రూపొందించలేదు. ఈ సంగతి అటుంచితే రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనల్లో తుపాన్ల విశాఖను రాజధానికి ఎలా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్లో వాదించడం వివాదాస్పదమవుతోంది. హుద్హుద్ లాంటి విలయాలను కూడా తట్టుకుని నిలిచిన విశాఖను తుపానుల నగరంగా తేలిగ్గా తీసిపారేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ట్రిబ్యునల్ వద్ద వ్యాఖ్యలు చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రిబ్యునల్లో ప్రభుత్వ వాదన ఇదీ.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. రాజధాని ఎంపిక విషయంలో ఇతర ప్రాంతాలను పరిగణించారాః? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ.. రాజధానిగా విశాఖ నగరాన్ని కూడా పరిశీలించామని.. ఇది అధిక వర్షపాతం ఉన్న సైక్లోన్ ప్రభావిత ప్రాంతమని, హుద్హుద్ వల్ల సుమారు రూ.25వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాజధానిగా విశాఖను పరిశీలించిదెప్పుడు? ఇక రాజధానిగా విశాఖ నగరాన్ని పరిశీలించామని ప్రభుత్వ న్యాయవాది ట్రిబ్యునల్కు నివేదించారు. కానీ వాస్తవానికి ప్రభుత్వం ఎప్పుడూ విశాఖను క్యాపిటల్గా పరిశీలించిన దాఖలాలే లేవు. సమైక్యాంధ్ర విభజన సమయంలో ఏర్పాటైన జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పర్యటన మినహా రాజధాని ఎంపిక పరిశీలన నిమిత్తం ఎప్పుడూ.. ఎవ్వరూ.. పర్యటించలేదు. తప్పుడు వాదనలపై అభ్యంతరాలు వాస్తవానికి హుద్హుద్ విలయం 2014 అక్టోబర్లో సంభవించింది. అప్పటికే రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కూడా చేసేసింది. కానీ విశాఖను రాజధానిగా ఎంపిక చేయకపోవడానికి హుద్హుద్ తుపానునే సాకుగా చూపించడం వివాదాస్పదమవుతోంది. వాస్తవానికి హుద్హుద్ను తట్టుకుని నిలబడిన నగరంగా విశాఖ చరిత్రకెక్కింది. ఇక అధిక వర్షపాతం ఉన్న సైక్లోన్ ప్రభావిత ప్రాంతంగా విశాఖను పేర్కొనడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క హుద్హుద్ మినహా ఇప్పటివరకు తుపాన్లు విశాఖను తీవ్రంగా ప్రభావితం చేసిన దాఖలాలే లేవు. రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదయ్యే నగరంగా కూడా విశాఖ ఇంతవరకు రికార్డులకెక్కలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ట్రిబ్యునల్లో విశాఖ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించందంటూ విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలు, ఎండల ముప్పు తీవ్రంగా ఉన్న అమరావతిపై ఉన్న మోజు, రహస్య లావాదేవీల కారణంగానే దాని ఎంపికను సమర్థించుకునేందుకు విశాఖపై బురద జల్లుతున్నారని విమర్శిస్తున్నారు. విశాఖపై తుఫానుల ప్రభావం తక్కువ ఆంధ్రప్రదేశ్లో ఇంతటి అందమైన నగరం మరొకటి లేదనేని వాస్తవం. వాతావరణ పరంగా విశాఖ ఎంతో అనుకూలం. తుఫానులు అధికంగా నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడల్లో తీరాన్ని తాకుతుంటాయి. విశాఖ ప్రాంతంలో తీరం తాకడం చాలా అరుదు. హుద్హుద్ మినహా పెద్ద తుఫానులు విశాఖపై ప్రభావం చూసిన సందర్భాలు లేవు. గోదావరి జలాలను విశాఖకు తరలించడం సులభం. అదే విధంగా విశాఖ నగరాన్ని మూడు వైపుల విస్తరించుకుంటూ వెళ్లే అవకాశం ఉంది. డైవెర్సిఫైడ్ ఆలోచనతో పనిచేస్తే శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు రాజధాని అనుబంధంగా నగరాలు, కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు అధికం. విశాఖ రాజధాని అయితే వ్యవసాయ భూములు నష్టపోకుండా రాజధాని నిర్మాణం జరిగేది. – ఆచార్య ఓ.ఎస్.ఆర్ భాను కుమార్, విశ్రాంత ఆచార్యులు, మెట్రాలజీ, ఓషనోగ్రఫీ విభాగం ఎంతో సురక్షితం పర్యావరణ పరంగా.. వాతావరణ పరంగా పరిశీలిస్తే విశాఖ నగరం ఎంతో సురక్షితమైనది. భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తుపాను ప్రభావం అన్ని ప్రాంతాలకూ ఉంటుంది. హుద్హుద్ను సాకుగా చూపుతూ విశాఖ రాజధానిగా సరిపడదు అని భావించడం తగదు. పోర్టు కూడా ఉంది కాబట్టి అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచేది. ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంతంలో ఎండలు అధికంగా ఉంటాయి. దాంతో పోల్చితే వాతావరణ పరంగా విశాఖ ఎంతో అనుకూలం. తమిళనాడు రాజధాని చెన్నై, ఒడిశా రాజధాని భువనేశ్వర్లు తీర ప్రాంతంలో ఉన్నవే. మరి వాటికి లేని ముప్పు విశాఖకు ఎలా ఉంటుంది. –ఆచార్య ఎస్.ఎస్.వి.ఎస్ రామకృష్ణ, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ విభాగం, ఏయూ -
గో.. గో..గోవా
సెలవులొస్తే.. గో గో..గోవా అంటుంటారు. చిన్నా పెద్దా అందరు కలిసి గోవాకి చేక్కేస్తుంటారు. అందమైన సముద్రం.. తెల్లని ఇసుక బీచ్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం గోవా సొంతం. మనదేశం నుంచే కాకుండా, విదేశాల నుంచి సైతం పర్యాటకులు గోవా బీచ్లలో సేదతీరేందుకు వస్తుంటారు. ఇటీవల గోవాలో బ్రిక్స్ సమావేశం జరిగింది. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద దేశాల(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ఆఫ్రికా) ప్రతినిధులు ఒక్కచోట చేరి పలు విషయాలపై చర్చించారు. దీంతో ఇప్పటికే పర్యాటక స్థలంగా పేరొందిన గోవా పేరు రాజకీయ, ఆర్థిక, ఇతర విషయాల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. ఈ నేపథ్యంలో గోవా అందాలపై స్పెషల్ ఫోకస్.. బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ గోవా వెళ్లిన వారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఈ చర్చి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహాన్ని ఇక్కడ భద్రపరిచారు. ప్రతి పదేళ్లకు ఒకసారి ఈ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.1605లో నిర్మించిన ఈ చర్చిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రై స్తవులు వస్తుంటారు. యునెస్కో దీన్నీ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీంతోపాటు ఇక్కడి వైస్రాయ్ ఆర్చి, ఆసియాలో అతిపెద్ద చర్చిల్లో ఒకటైన సెయింట్ కేథరీన్ చూడదగ్గవి. కేథడ్రల్, అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ చర్చి, శాంత దుర్గ టెంపుల్, సలీమ్ అలీ బర్డ్ శాంక్చురీ, గోవా స్టేట్ మ్యూజియం, ఫట్రోడ స్టేడియంలు చూడాల్సినవి. భారత-పోర్చుగీసు శైలిలో నిర్మించిన పాతకాలపు ప్రాసాదాలెన్నో కనిపిస్తాయక్కడ. పనాజీలోని ఫాంటెన్హౌస్ అనే ప్రాంతం సాంస్కృతిక ప్రాంతంగా గుర్తించారు. గోవా జీవనానికి, నిర్మాణాలకు ప్రతిబింబం ఇది. కొన్ని హిందూ దేవాలయాలు కూడా ఈ శైలిలోనే కనిపిస్తాయి. రైలు ప్రయాణమే థ్రిల్లింగ్! గోవా రైలు ప్రయాణం భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ప్రయాణంలో పడమటి కనుముల ప్రకృతి అందాలతోపాటు, లోతైన లోయలు, సుందర జలపాతాలు మనకు దర్శనమిస్తాయి. ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలు, చీకటి గుహల మీదగా ఈ ప్రయాణం సాగుతుంది. మధ్యమధ్యలో సొరంగ మార్గాల ద్వారా రైలు వెళుతున్నప్పుడు కొన్ని క్షణాలవరకూ అది మిట్టమధ్యాహ్నమో మధ్యరాత్రో అర్థంకాదు. అంతచీకటి కమ్ముకుంది. అందాల దూధ్సాగర్.. రెళ్లో గోవాకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో ఒకటోట రెండు ఎత్తయిన కొండలు కనిపిస్తాయి. ఆ రెండు కొండల శిఖరాల మధ్య నుంచి దూధ్ సాగర్ జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దృశ్యం కన్నుల పండువల ఉంటుంది. తెల్లని నురగలతో పై నుంచి కిందకి జాలువారే ఆ జలపాతాన్ని చూస్తుంటే ఆకాశగంగ భువికి చేరుతున్నట్లుగా ఉంది. గోవా, కర్ణాటక సరిహద్దుల మధ్య పరవళ్లుతొక్కే పాల జలపాతాన్ని తప్పక చూడాల్సిందే. ఈ జలపాతం వర్షాకాలంలో రెట్టింపు అందంగా కనిపిస్తుంది. ఇది దేశంలోనే ఐదవ అతిపెద్ద జలపాతం. పసందైన విందు! గోవాలో పురాతన ఇళ్లు ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీలుగా మారారుు. కళాప్రేమికులకు ఇండియన్ పెయింటింగ్స్, యాంటిక్స్ పండగ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ ఎంపోరియాలు, ప్రైవేట్ షాప్లు ఉంటాయి. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలప్పుడు గోవా కళకళలాడుతుంటుంది. క్రిస్మ్స వేడుకలు, గోవా కార్నివాల్, వినాయక చవితి, గ్రేప్ ఫెస్టివల్, హోలీలను ఎంతో ఆర్భాటంగా జరుపుతారు. మసాలాలు, మూలికలకు గోవా ఫేమస్. స్పా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే బోలెడు మసాజ్ సెంటర్లు ఉన్నాయి. చేపలు, మసాలా దినుసులు... అబ్బో ఒకటేంటి ఒక పక్క షాపింగ్ ప్రియుల మనసుదోచి మరో పక్క భోజనప్రియులకు రుచికరమైన విందును అందిస్తుంది గోవా. సన్ బర్న్ ఫెస్టివల్.. గోవాలోని వగాటర్లో ఈ సన్బర్న్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో మ్యూజిక్ను ఎంజాయ్ చేయడంతో పాటు ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. గోవా ప్రత్యేక వంటకాలను ఎంజాయ్ చేస్తూ షాపింగ్ కూడా చేయవచ్చు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యటకులు ఈ ఫెస్టివల్కు తరలివస్తారు. భలే బీచ్లు..! పాలోలెమ్, బాగా, కాలన్ ఘాట్, అంజునా, కాండోలిమ్, మజోర్డా, మిరామర్, సింక్వేరియమ్, వగాటర్, వర్కా, కోల్వా బీచ్లు తప్పక చూడాలి. ఒక్కో బీచ్దీ ఒక్కో ప్రత్యేకత. కొబ్బరిచెట్లు కొలువుదీరింది ఒకటయితే నల్లరాళ్లతో నిండినబీచ్ మరొకటి. అడుగడుగునా రంగురంగుల చేపలతో పెద్ద అక్వేరియంను తలపించే బీచ్ ఒకటయితే ఆరు బయట వాలు కుర్చీల్లో బీర్లు తాగుతూ కూర్చునేది మరొకటి. ఓల్డ్గోవాలో ఎక్కువగా అరబ్బులు, పర్షియన్లు, యూదులు, మలబార్ వాసుల పడవలు కనిపిస్తాయి. మహవీర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.. గోవా రాజధాని పనాజీకి 60 కి.మీ. దూరంలో భగవాన్ మహావీర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. గోవాలోనే అతిపెద్దది ఇది. పశ్చిమకనుమల పాదభాగంలో సుమారు 240 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఏనుగులు, పులులు, లేళ్లు, జింకలు, పెద్దపెద్ద ఉడుతలు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సఫారీలకు జీపులు కూడా దొరుకుతాయి. ఈ అడవిలో ఉండేందుకు అతిథిగృహాలున్నాయి. ఎన్నెన్నో.. మనదేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గోవా వైశాల్యం తక్కువ..కానీ చూసి ఆస్వాదించాల్సిన ప్రాంతాలు ఎక్కువ. సీ, సాండ్, సర్ఫ్, సన్ కలిసి ఆహ్వానం పలికేచోటు ఇది! నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే గోవాలో ప్రసిద్ధి చెందిన బీచ్లు, చర్చిలు, దేవాలయాలు, ఇంకా మరెన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్గోవాలో ఆహారపు అలవాట్ల నుంచి భవన నిర్మాణాల వరకు పోర్చుగీసు సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. అందమైన బీచ్లు, పురాతన కట్టడాలు, అందమైన జలపాతాలతో పర్యాటకుల స్వర్గధామంగా విలసిల్లుతోంది. -
బ్రిక్స్ సదస్సుపై చైనీస్ మీడియా ఆశ్చర్యకర కథనం
-
బ్రిక్స్ సదస్సుపై చైనీస్ మీడియా ఆశ్చర్యకర కథనం
గోవాలో బ్రిక్స్ సదస్సు.. కేవలం ఆయా దేశాల అధినేతలతోనే కాదు.. బంగళాఖాత పరివాహక ప్రాంత సరిహద్దు దేశాలన్నింటిన్నీ భారత్ ఆహ్వానిచ్చింది. కానీ ఒక్క దాయాది దేశం పాకిస్తాన్ను మాత్రం భారత్ వెలివేసింది. బ్రిక్స్ సదస్సును బాగా వాడుకుని పాక్ను భారత్ ఒంటరిచేసినట్టు ఆ దేశ చిరకాల మిత్రుడు చైనా పేర్కొంది. ప్రాంతీయ వెలివేత పేరుతో పాకిస్తాన్ను భారత్ పూర్తిగా సమాధిచేస్తుందని చైనీస్ ప్రభుత్వ మీడియా ఓ ఆశ్చర్యకరమైన కథనాన్ని ప్రచురించింది. బ్రిక్స్ సదస్సుతో పాక్ కు భారత్ ఎత్తుకు పై ఎత్తు వేసిందని పేర్కొంది. చైనీస్ స్కాలర్ రాసిన ఈ ఆశ్చర్యకరమైన ఓపీనియన్ కాలమ్లో బ్రిక్స్ సదస్సులో భారత్ సాధించిన విజయాలను అభివర్ణించింది. ఈ సదస్సులో భారత్ గెలిచినట్టు బీజింగ్ భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ సదస్సుకు సరిహద్దు దేశాలన్నింటిన్నీ ఆహ్వనించిన భారత్, పాకిస్తాన్ను వెలివేయడంపై గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించింది. ఈ సదస్సుతో ప్రాంతీయంగా పాకిస్తాన్ను భారత్ సమాధిచేస్తున్నట్టు తెలిపింది. నవంబర్లో సార్క్ సదస్సును బహిష్కరించిన భారత్, కొద్ది వారాల్లోనే బ్రిక్స్ సదస్సు జరపడం భారత్కు లభించిన ఓ అరుదైన అవకాశంగా పేర్కొంది. ఉడి ఉగ్ర ఘటనతో 19 మంది జవాన్ల ప్రాణాలను భారత్ కోల్పోవడంతో, సార్క్ సమావేశాలను ఆ దేశం బహిష్కరించిందని ఆర్టికల్ పేర్కొంది. బ్రిక్స్ దేశాలతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్లాండ్, మయన్మార్, నేపాల్, భూటాన్ దేశాలను ఒకే వేదికగా తీసుకురావడంలో భారత్ చట్టబద్ధత పాటించి తన సత్తా చాటిందని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అయితే భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ప్రతికూల వాతావరణాలపై బ్రిక్స్ మెంబర్స్ ఎవరూ ఏ దేశంపైనా బహిరంగంగా మొగ్గుచూపలేదన్నారు. భారత్ తన వైఖరిపై సురక్షితంగా ఉందని, అదేమాదిరి పాకిస్తాన్ కూడా తన సదస్సులతో అజెండాలను నిర్మించుకుంటూ లబ్దిపొందుతున్నట్టు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అయితే సార్క్కు ప్రత్యామ్నాయంగా మరింత సమర్థవంతంగా భారత్ బ్రిక్స్-బిమ్స్టెక్ సదస్సు నిర్వహించిందని అనుకోవడం లేదని తెలిపింది. పాకిస్తాన్ను వెలివేసి ఉపఖండ దేశాల సమావేశాలు ఏర్పాటుచేయడం, చిన్న దేశాలకు భయాందోళనగా భారత్ ఆధిపత్య స్థానానికి ఎగబాకుతున్నట్టు వివరించింది. భారత్ పరంగా చూస్తే బ్రిక్స్ సదస్సు ప్రస్తుత ప్రపంచ ఆర్థికవ్యవస్థ, ఆర్థిక పాలనలో సంస్కరణలు ప్రతిపాదించడానికి ఇది ఓ అద్భుతమైన వేదికగా ఆర్టికల్ అభివర్ణించింది. -
ఉగ్రవాదాన్ని పాక్తో ముడిపెట్టొద్దు
♦ బ్రిక్స్ సదస్సు అనంతరం మాట మార్చిన చైనా ♦ పాక్ గొప్ప త్యాగాలు చేసిందంటూ ప్రశంసలు బీజింగ్: చైనా మరోసారి పాకిస్తాన్ పాటే పాడింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పోరుకు సిద్ధమంటూనే...మిత్రదేశం పాక్ విషయంలో మాత్రం మినహాయింపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క దేశంతోనే, మతంతోనే ముడిపెట్టవద్దంటూ పాక్కు బాసటగా నిలిచే ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్ పుట్టిల్లంటూ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ చెప్పిన మరుసటి రోజే.. చైనా పాక్ను వెనకేసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉగ్రవాదాన్ని పాక్తో ముడిపెట్టవద్దని, దానికి తాము వ్యతిరేకమంటూ పరోక్షంగా మనసులో మాట బయటపెట్టింది. పాక్ను అంతర్జాతీయంగా ఏకాకి చేసే ప్రయత్నాల్లో భారత్ నిమగ్నమైన వేళ... పాక్ గొప్ప త్యాగాలు చేసిందంటూ ఆ దేశానికి అండగా నిలిచే ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంతో, మతంతో ముడిపెట్టకండి: చైనా గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం విలేకరుల సమావేశంలో స్పందించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి పుట్టిల్లు అని మోదీ వ్యాఖ్యానించారని, పాకిస్తాన్కు మిత్ర దేశంగా...ఇది సరైందేనా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ... ఉగ్రవాదాన్ని ఏ దేశంతోనో, మతంతోనే ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తామంటూ సమాధానమిచ్చారు. ఓ వైపు పాక్ను వెనకేసుకొస్తూనే.. మరోవైపు ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న దేశాలు, సంస్థలపై అంతర్జాతీయ సమాజం పోరు సాగించాలని పిలుపునిచ్చారు. ‘చాలా కాలంగా ఇదే మా వైఖరి. అయితే అది ఏ రూపంలో ఉన్నా మేం వ్యతిరేకిస్తాం. ప్రపంచ దేశాల భద్రత, సుస్థిరత కోసం అంతర్జాతీయంగా ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని మేం భావిస్తున్నాం’ అని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంటే దేశం, సంస్థ, వ్యక్తులు అని చూడకుండా... ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం, జాతీయ భద్రత, అభివృద్ధి కోసం పరస్పర సహకారంతో అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్నారు. ఉగ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన గోవా డిక్లరేషన్ సారాంశాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాక్ త్యాగాల్ని ప్రపంచం గుర్తించాలి ‘భారత్, పాక్.. రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే. అయితే ఉగ్రవాదంపై పోరులో పాక్ గొప్ప త్యాగాలు చేసింది. దీన్ని ప్రపంచం గుర్తించాల్సిన అవసరముంది’ అంటూ చైనా విదేశాంగ ప్రతినిధి పేర్కొనడం పాక్పై ఎంత ప్రేమ ఉందో చాటిచెప్పింది. భారత్, పాక్ తమ పొరుగు మిత్ర దేశాలని, ఆ రెండు దేశాలు శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటాయని భావిస్తున్నట్లు హువా తెలిపారు. చర్చలతోనే సంబంధాలు మెరుగుపడతాయన్నారు. భారత్లో ‘ఉగ్ర’ ఆజ్యమే పాక్ పని చండీగఢ్: పాకిస్తాన్ వ్యవస్థ మొత్తం భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో నిమగ్నమైందని కేంద్ర హోం మ్రంతి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. దీంతో ఇతర దేశాలతో పోలిస్తే భారత్-పాక్ సరిహద్దు నిర్వహణ సవాలుగా మారిందన్నారు. చండీగఢ్లో జరుగుతున్న ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతీయ ఎడిటర్ల సదస్సులో రాజ్నాథ్ ప్రసంగించారు. పాముకు పాలు పోసి పెంచితే దాని కాటుకు బలికాక తప్పదని, పాక్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో పాకిస్తాన్ ఉద్దేశం స్పష్టమైతే... పీవోకేలో ఉగ్రవాద వ్యతిరేక ప్రచారం కోసం భారత్ సాయం చేస్తుందని రాజ్నాథ్ చెప్పారు. పాక్ పోత్సాహ ఉగ్రవాదానికే వ్యతిరేకం తప్ప పాక్ ప్రజలపై ఎలాంటి విద్వేష ప్రచారం చేయడం లేదన్నారు. ‘ఉగ్రవాదాన్ని పాక్ తమ దేశ విధానంగా మార్చుకుంది. అంతర్జాతీయంగా ఏకాకి అవుతోంది. ఎలాంటి మంచి చేయని అంశాలపై, ఆ దేశానికి కూడా ఉపయోగం లేని వాటిపై పాక్ ఎక్కువ నిమగ్నమైంది’ అని అన్నారు. ఈశాన్య ప్రాంతంలో చొరబాటు గ్రూపుల అంశాన్నీ ప్రస్తావించారు. హింస వదిలిపెట్టాలంటూ ఉగ్ర గ్రూపులతో చర్చలు జరిపామని, మొండిగా ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. -
బ్రిక్స్లో భిన్నస్వరాలు!
రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు, అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు అయ్యాక ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ‘ఇద్దరు కొత్త మిత్రుల కన్నా ఒక పాత మిత్రుడు ఉత్తమం’ అన్న రష్యా సామెతను మోదీ గుర్తుచేశారు. అయితే ఆ ప్రస్తావనలోని అంతరార్ధాన్ని రష్యాగానీ, చైనాగానీ గ్రహించలేదని బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనను చూస్తే అర్ధమవుతుంది. పుతిన్తో ద్వైపాక్షిక చర్చల సమయంలోనూ, శిఖరాగ్ర సదస్సులోనూ ఉగ్రవాదానికి దోహదపడుతున్న పాకిస్తాన్ వ్యవహార శైలి గురించి మోదీ వివరంగా మాట్లాడారు. పాకిస్తాన్కు రాజకీయ, ఆయుధ సాయాన్ని తగ్గించుకోవాలని పరోక్షంగా చైనాకు సూచించారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లకు సరైన జవాబివ్వాలని సదస్సును కోరారు. కానీ మన ఆకాంక్షలకు అనుగుణంగా సదస్సు స్పందించలేదని సంయుక్త ప్రకటన చూస్తే తెలుస్తుంది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని బ్రిక్స్ పిలుపునిచ్చిన మాట వాస్తవమే అయినా... అందులో స్పష్టత లేదు. ప్రధానంగా ఆర్ధిక సహ కారానికి సంబంధించిన అంశాలకే పరిమితమయ్యే బ్రిక్స్ సమావేశంలో ఈసారి మోదీ ఒకటికి రెండుసార్లు పాకిస్తాన్ తీరును ఎత్తిచూపిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కానీ సంయుక్త ప్రకటన ఆ విషయంలో మౌనంగా ఉండి పోయింది. పాక్ గురించి ఇన్నేళ్లుగా మనం చెబుతున్న మాటల్లో అవాస్తవమేమీ లేదని ఇటీవల అక్కడ జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఉగ్రవాద సంస్థల విషయంలో పౌర ప్రభుత్వం, సైన్యం తలపడు తున్నాయి. ‘మీరు దారికి రాకపోతే ప్రపంచం దృష్టిలో దోషిగా మారతామని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యాన్ని హెచ్చరించినట్టు అక్కడి అగ్రశ్రేణి ఆంగ్ల దినపత్రిక ‘డాన్’ బట్టబయలు చేసింది. మూడు వేర్వేరు వర్గాల నుంచి ధ్రువీకరించుకున్నాకే ఆ కథనాన్ని బయట పెట్టానని దాన్ని రాసిన పాత్రికేయుడు అంటున్నాడు. నిజానికి జరుగుతున్న దేమిటో ఆ పాత్రికేయుడికన్నా రష్యా, చైనాలకు మరింత లోతుగా తెలిసి ఉంటుంది. కానీ పాక్ చేస్తున్నది తప్పని చెప్పడంలో అవి నీళ్లు నమిలాయి. అందుకు బ్రిక్స్ సంయుక్త ప్రకటనే రుజువు. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని ‘ప్రపంచ దేశాలకు’ పిలుపునివ్వడం బాగానే ఉన్నా... పాకిస్తాన్ వైఖరిని లేదా అక్కడ వేళ్లూనుకుని మన దేశంలో ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతున్న జైషే మహమ్మద్లాంటి సంస్థలను పరోక్షంగానైనా ఖండించలేని ఇలాంటి ప్రకటనలవల్ల ఒరిగేదేమిటి? ఎందుకీ అశక్తత? ఇంతకూ ప్రపంచ దేశాలంటే ఏవి? బ్రిక్స్ దేశాలు అందులో భాగం కాదా? సంయుక్త ప్రకటన పరమ లౌక్యంగా వ్యవహరించింది. ఉగ్రవాదంపై భారత్ అభిప్రాయాలను మన్నిస్తున్నట్టు కనిపిస్తూనే నిర్దిష్టత దగ్గరకొచ్చేసరికి నీళ్లు నమిలింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్ను పేరెట్టి ప్రస్తావించి ఖండించిన బ్రిక్స్కు జైష్ సంస్థ కనబడలేదు. సిరియాలో ఉగ్రవాద ఉదంతాలకు పాల్పడుతున్న జభత్ అల్ నస్రా సంస్థను ఎత్తి చూపినవారికి పాక్లో లష్కరే తొయిబా, హక్కానీ నెట్వర్క్ వంటి సంస్థల సంగతి తెలియలేదు. ఎంత విచిత్రం! హక్కానీ నెట్ వర్క్ సంగతలా ఉంచి ఐఎస్, అల్ నస్రా సంస్థల్లాగే జైష్, లష్కరేలు కూడా ఐక్యరాజ్యసమితి నిషేధించినవేనని గుర్తుంచుకోవాలి. సిరియాలో అక్కడి సర్కారుకు దన్నుగా రంగంలోకి దిగిన రష్యాకు తలనొప్పిగా మారాయి గనుక అల్ నస్రా, ఐఎస్ సంస్థలను బ్రిక్స్ ప్రకటన ఖండించిందని... మనల్ని ఇబ్బందిపెడుతున్న సంస్థలు మాత్రం దాని కళ్లకు కనబడలేదని అనుకోవాల్సి వస్తుంది. జైష్, లష్కరే వంటి సంస్థల వల్ల కేవలం మన దేశానికి మాత్రమే నష్టం కాదు. బ్రిక్స్లో భారత్లాంటి కీలకమైన దేశం దెబ్బతింటే దాని ప్రభావం ఆ సంస్థపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంగతిని చైనా గుర్తించినట్టే కనబడింది. ప్రకృతి వైపరీత్యాలు, భూతాపం, అంటువ్యాధులు వగైరాల్లాగే ఉగ్రవాదం కూడా ఆర్ధిక ప్రగతికి అవరోధమైనదని జీ జిన్పెంగ్ తన ప్రసంగంలో అన్నారు. కానీ ఆ వెంటనే ఆయన ఉగ్రవాదానికి దోహదపడుతున్న ‘మూలకారణాల’ గురించి, ‘రాజకీయ పరిష్కారం’ గురించి మాట్లాడారు. ఇది పాకిస్తాన్ భాష! మనం అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం ఊసెత్తినప్పుడల్లా పాకిస్తాన్ అచ్చం ఇలాగే మాట్లాడుతుంది. కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా ఉండిపోవడంవల్లే ఉగ్రవాదం పుట్టుకొస్తున్నదని చెబుతుంది. కానీ ఆ ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చి, మారణాయుధాలందించి, శిక్షణనిచ్చి పంపు తున్నది తన సైన్యమేనన్న సంగతిని దాస్తుంది. ఇప్పుడు చైనా తలకెత్తుకున్నది ఆ వాదాన్నే! ఏదీ గాల్లోంచి ఊడిపడదు. ఉగ్రవాదమైనా అంతే. కానీ దానికి కొన్ని దేశాలు నారూ, నీరూ పోయడం తప్పని చెప్పాలా, వద్దా? చైనా వాదనే సరైందనుకుంటే ఐఎస్ పుట్టుకకూ కారణాలున్నాయి. అమెరికా ఇరాక్ను దురాక్రమించకపోతే, సైనిక పదఘట్టనలతో ఆ దేశాన్ని సర్వనాశనం చేయకపోతే ఐఎస్ ఉనికిలోకొచ్చేదా? సజావుగా సాగుతున్న సిరియాలో చిచ్చు పెట్టకపోతే... అందుకోసం డబ్బు, ఆయు దాలు కుమ్మరించకపోతే ఐఎస్ ఇంతగా విస్తరించేదా? అలాగని అమెరికాను తప్పు బట్టడంతో సరిపుచ్చుకుంటారా? ఐఎస్ కార్యకలాపాలను విస్మరిస్తారా? బ్రిక్స్ దేశాల్లో ఆర్ధికంగా అంతో ఇంతో పచ్చగా కనిపిస్తున్నదీ, ప్రగతి సాధిస్తున్నదీ మన దేశమే. భారత్ సాధించే ప్రగతి వల్ల మొత్తంగా బ్రిక్స్ దేశాలన్నీ లాభపడతాయి. పరస్పర సహకారంతో ప్రపంచంలో బ్రిక్స్ ఒక శక్తిగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంగతిని ఏమాత్రం గుర్తించినా చైనా, రష్యాల తీరు భిన్నంగా ఉండాలి. అయితే అలాంటి ధోరణి కనబడలేదు. జీ జిన్పింగ్ ప్రసంగం కనీసం ఉగ్రవాదాన్నయినా ప్రస్తావించింది. ద్వైపాక్షిక చర్చల సందర్భంలో ఆ విషయమై మనకు మద్దతునిచ్చినట్టు కనబడిన పుతిన్ బ్రిక్స్లో ఆ మాత్రమైనా మాట్లాడ లేక పోయారు. సమష్టి గొంతు వినిపించలేనప్పుడూ, నిక్కచ్చిగా వ్యవహరించ లేన ప్పుడూ బ్రిక్స్ లాంటి సంస్థలు సాధించేదేమిటి? -
అభివృద్ధి జరగడం లేదు: కోదండరామ్
-
పాక్ ను అడ్డంగా సమర్థించిన చైనా!
-
పాక్ ను అడ్డంగా సమర్థించిన చైనా!
ఉగ్రవాదానికి పాకిస్థాన్ పుట్టినిల్లు వంటిదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్న మరునాడే చైనా తన 'శాశ్వత మిత్రుడి'ని అడ్డంగా వెనకేసుకొచ్చింది. ఉగ్రవాదాన్ని ఏ దేశంతో ముడిపెట్టలేమంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకించింది. పాకిస్థాన్ చేసిన గొప్ప త్యాగాలను ప్రపంచం గుర్తించాలంటూ అడ్డగోలుగా వ్యాఖ్యానించింది. గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్థాన్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై .ప్రశ్నించగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ ఘాటు స్పందించారు. ఉగ్రవాదంపై చైనా వైఖరి స్థిరంగా ఉందని చెప్తూనే.. ఉగ్రవాదాన్ని ఏ ఒక దేశంతోనో, మతంతోనో ముడిపెట్టడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. 'ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మేం వ్యతిరేకిస్తాం. అంతర్జాతీయంగా నిరంతర చర్యల ద్వారా అన్ని దేశాల్లో సుస్థిర భద్రత సాధ్యపడుతుందని భావిస్తున్నాం. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క దేశంతోనో, మతంతోనో ముడిపెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తాం. మేం చాలాకాలంగా అవలంబిస్తున్న వైఖరి ఇదే. చైనా, పాకిస్థాన్ అన్ని కాలాల్లోనూ శాశ్వత మిత్రులు' అని ఆమె తేల్చిచెప్పారు. భారత్, పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధితులేనని పేర్కొన్న ఆమె.. ' ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో పాకిస్థాన్ గొప్ప త్యాగాలు చేసింది. వీటిని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి' అని తెలిపారు. భారత్, పాకిస్థాన్ తమకు పొరుగుదేశాలు కావడంతో ఈ రెండు దేశాలు తమ మధ్య ఉన్న సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. -
'ఉగ్ర' పుట్టిల్లు పాక్
-
'ఉగ్ర' పుట్టిల్లు పాక్
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ ధ్వజం ►పాక్కు రాజకీయ, ఆయుధసాయాన్ని తగ్గించుకోవాలి.. చైనాకు సూచన ► ఉగ్రవాదంపై పోరాటానికి సభ్యుల ఏకాభిప్రాయంపై హర్షం ► వివిధ రంగాల్లో సాయానికి బ్రిక్స్ దేశాల ఆమోదం ► 2020 కల్లా వాణిజ్యాన్ని రెట్టింపుచేయాలన్న మోదీ నిర్ణయానికి ఓకే బెనౌలిమ్ (గోవా): అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్తాన్ పుట్టినిల్లని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని, దీనికి పూర్తి మద్దతిస్తున్న వారిని ఎదుర్కొనేందుకు అన్నిదేశాలు సమగ్ర, సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్లాలని బ్రిక్స్ సదస్సులో కోరారు. రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్పింగ్తోపాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికాల దేశాధినేతలతో ఆదివారమిక్కడ జరిగిన బ్రిక్స్ సదస్సులో పాకిస్తాన్ పేరును ఉచ్ఛరించకుండానే.. తీవ్రవిమర్శలు చేశారు. ‘ఉగ్రవాదానికి రక్షణ కల్పిస్తూనే.. రాజకీయ అవసరాలకోసం ఉగ్రవాదానికి మద్దతివ్వటాన్ని సమర్థించుకుంటున్నారు. అందుకే ఉగ్రవాదానికి ఏ రూపంలో సాయం చేస్తున్నా వారు శిక్షార్హులే’ అని అన్నారు. ఈ ఉగ్రవాదం చేస్తున్న హెచ్చరికలను ఎదుర్కొని సరైన సమాధానం చెప్పేందుకు బ్రిక్స్ దేశాలు ముందుకురావాలన్నారు. ఉగ్రవాదంపై సభ్యదేశాలు వ్యక్తిగతంగా, సంయుక్తంగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. ‘మా ప్రాంతంలో ఉగ్రవాదం.. శాంతికి, భద్రత, అభివృద్ధికి పెనుసవాల్గా మారింది. దురదృష్టవశాత్తూ.. అది మా పొరుగు దేశమే. వారు ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా వ్యవహరిస్తున్నారు. వారు ఉగ్రవాదానికి రక్షణ కల్పించటమే కాదు.. ఉగ్రవాద శిక్షణనిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి ఆ దేశంలోనే లింకులు దొరుకుతున్నాయి’ అని మోదీ మండిపడ్డారు. ఇలాంటి మైండ్సెట్ను బ్రిక్స్ ముక్తకంఠంతో ఖండించాలని.. ఒకేతాటిపై నిలిచి దీన్ని ఎదుర్కోవాలన్నారు. ఈ దేశానికి ఆయుధ సరఫరా, రాజకీయ మద్దతు వంటివి.. క్రమంగా తగ్గించుకోవాలని చైనాకు చెప్పకనే చెప్పారు. ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం’ ముసాయిదాను వీలైనంత త్వరగా ఆమోదం తెలపటం ద్వారా ఉగ్రవాదంపై పోరును ముందుగానే మొదలుపెట్టొచ్చన్నారు. వ్యక్తిగత, కృత్రిమ కారణాలతో ఉగ్రవాదంపై విభేదాలు చూపొద్దని పరోక్షంగా చైనాకు (పఠాన్కోట్ ఘటన సూత్రధారి మసూద్ అజర్కు ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడటానని చైనా అడ్డుకోవటాన్ని దృష్టిలో ఉంచుకుని) సూచించారు. జాతీయ భద్రతా సలహాదారుల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ మానవాళికి, అభివృద్ధికి, శాంతి, భద్రతలకు ముప్పుగా మారిన ఉగ్రవాదంపై పోరుకు బ్రిక్స్ దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని ప్రధాని వెల్లడించారు. ఈ దిశగా ఈ ఐదు దేశాలు ఒకరికొకరు సహకారం అందించుకోవాలని అంగీకరించాయని.. ఇది చాలా సంతోషకరమని మోదీ తెలిపారు. పుతిన్, జిన్పింగ్తో జరిగిన ద్వైపాక్షిక భేటీలోనూ మోదీ ఉగ్రవాదం అంశాన్ని ప్రధానంగా చర్చించారు. పాక్ ప్రోత్సహిస్తున్న ఉన్మాదం వల్ల భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారంతో.. ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, సృజనాత్మక, వాణిజ్య, పర్యాటక, పర్యావరణ, శక్తి, సినిమాలు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీల రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు దోహదపడుతుందని మోదీ తెలిపారు. ‘న్యూ డెవలప్మెంట్ బ్యాంకు’, ‘కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్’ ఏర్పాటు చాలా గొప్ప పరిణామమన్న ప్రధాని.. ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరమైన సమస్యలు, ఆర్థిక అస్థిరత నెలకొంటున్న పరిస్థితుల్లో.. బ్రిక్స్ పాత్రను మరింత సమర్థవంతంగా నడపాలన్నారు. బ్రిక్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పన్ను ఎగవేత, నల్లధనంపై పోరాటం, అవినీతిపై పోరాటానికి మరింత కఠినమైన నిబంధనలను రూపొందించుకోవాలన్నారు. 2015లో బ్రిక్స్ దేశాల మధ్య 250 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగిందని.. 2020 కల్లా దీన్ని రెట్టింపు (500 బిలియన్ డాలర్లు) చేయాలని మోదీ సూచించారు. భారత్ సరళీకృత ఆర్థిక వ్యవస్థ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావం స్పష్టంగా కనబడుతోందని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బలమైన వృద్ధిరేటుతో ప్రపంచంలోనే అత్యంత సరళీకృత ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉద్భవించిందన్నారు. పాలన, వ్యాపారాన్ని సులభతరం చేస్తూ రెండేళ్లుగా తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఈ మార్పు సాధ్యమైందని బ్రిక్స్ సదస్సులో మోదీ తెలిపారు. పరోక్ష పన్నుల విధానం, జీఎస్టీ, దివాళా కోడ్ ప్రవేశపెట్టడం, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాల కారణంగా బలమైన అభివృద్ధి కనబడుతోందని.. దీన్ని కొనసాగించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. దేశీయ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతూ పోతోందని.. రక్షణ, ఇన్సూరెన్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. మౌలిక వసతులను పెంచేందుకు ట్రిలియన్ డాలర్ల అంచనాతో వచ్చే పదేళ్లలో రోడ్లు, హైవేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టామన్నారు. -
పాక్పై బ్రిక్స్ దేశాలకు మోదీ స్ట్రాంగ్ మెసేజ్!
-
పాక్పై బ్రిక్స్ దేశాలకు మోదీ స్ట్రాంగ్ మెసేజ్!
గోవా: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ విషయంలో బ్రిక్ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టి సందేశం ఇచ్చారు. ఉగ్రవాద గ్రూప్లు, ఉగ్రవాదుల విషయంలో ఉద్దేశపూరిత సంకుచిత వైఖరి ఎంతమాత్రం ప్రయోజనకరం కాదని, భవిష్యత్తులో ఇది భస్మాసుర హస్తం కాగలదని ఆయన చైనా సహా ఇతర బ్రిక్ దేశాలను హెచ్చరించారు. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా ఆ దేశం ఉగ్రవాదం విషయంలో అవలంబిస్తున్న ద్వంద్వ విధానాల్ని ప్రధాని మోదీ కడిగిపారేశారు. ఉగ్రవాదానికి మాతృత్వ దేశంగా పాకిస్థాన్ మారిపోయిందని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన బ్రిక్స్ ప్లీనరీ సదస్సులో మాట్లాడిన ప్రధాని మోదీ టాప్ వ్యాఖ్యలివే. ప్రస్తుతం మనం నివసిస్తున్న ప్రపంచంలో భద్రత, ఉగ్రవాద నిరోధం అత్యవసరంగా మారిపోయాయి. మన ప్రగతి, పురోగతి, సౌభాగ్యాలపై ఉగ్రవాదం పడగనీడ పరుచుకుంది. మన ఆర్థిక సుసంపన్నతకు ఉగ్రవాదం ఉగ్రవాదం పెనుముప్పుగా మారింది. విషాదకరంగా దీని మాతృత్వం పొరుగుదేశంలో ఉంది. ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం సమంజసమైనదేనని దృక్పథాన్ని ఆ దేశం గట్టిగా చాటుతోంది. ఉగ్రవాదులకు అందుతున్న నిధులు, ఆయుధాలు, శిక్షణ, రాజకీయ మద్దతును వ్యవస్థాగతంగా దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మన జాతీయ భద్రతా సలహాదారుల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై తొందరగా ఒక సమగ్ర తీర్మానాన్ని చేయాలి. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు దృఢమైన నిశ్చయాన్ని ప్రకటించాలి. -
భారత్పై జిన్పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గోవా: పాకిస్థాన్ విషయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు కుంటుపడుతున్న నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మనదేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ ప్లీనరీలో మాట్లాడిన జిన్పింగ్ 2014లో తాను భారత్ను సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. '2014లో నేను భారత్ వచ్చాను. ఈ గొప్ప దేశానికి చెందిన కష్టపడే ప్రజలు, రంగురంగుల సంస్కృతి నన్ను చాలా ముగ్ధున్ని చేశాయి' అని పేర్కొన్నారు. బ్రిక్స్ సహకారం ప్రారంభమై ఈ ఏడాదితో పదేళ్లు పూర్తవుతున్నదని, ఈ నేపథ్యంలో అక్టోబర్ నెల బ్రిక్స్ దేశాలకు ఫలప్రదంగా మారాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 'మనం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. బ్రిక్స్ దేశాలమైన మనం మంచి స్నేహితులుగా, సోదరులుగా, భాగస్వాములుగా ఉండి ఒకరినొకరు నిజాయితీగా గౌరవించుకోవాలి' అని జిన్పింగ్ సూచించారు. గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శనివారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల విశ్వాసాన్ని మరింతగా పాదుకోల్పాలని నిర్ణయించినట్టు ఈ భేటీ అనంతరం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో చైనా పేర్కొంది. అయితే, భారత్ కీలకంగా భావిస్తున్న ఉగ్రవాదంపై పోరులో ఐక్యత, అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత్ స్వభ్యత్వానికి మద్దతు అంశాలపై చైనా తన అధికారిక ప్రకటనలో ప్రస్తావించకపోవడం గమనార్హం. పాక్ ఉగ్రవాది మసూద్ అజార్ పై ఐరాస ఆంక్షల విషయంలోనూ మరింత సంప్రదింపులు జరిపి సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నట్టు చైనా పేర్కొంది. -
రష్యాతో భారత్ భారీ రక్షణ బంధం
-
జింగ్పింగ్తో మోదీ మంతనాలు..పాక్పై చర్చ!
-
రష్యాతో భారీ రక్షణ బంధం
మోదీ - పుతిన్ భేటీతో సహకారం బలోపేతం - ‘ట్రయంఫ్’ క్షిపణి రక్షణ వ్యవస్థ సహా రూ. 60,000 కోట్లతో మూడు భారీ ఒప్పందాలు - 4 గ్రిగోరోవిచ్ తరగతి యుద్ధనౌకల కొనుగోలు.. 200 కమోవ్ హెలికాప్టర్ల తయారీ - ‘స్మార్ట్ సిటీ’ల్లో సహకారం, వాణిజ్యం, అంతరిక్ష రంగాల్లో మరో 13 ఒప్పందాలు - కూడంకుళం అణు ప్లాంటులో మరో రెండు రియాక్టర్ల నిర్మాణానికి పచ్చజెండా - భారత్, రష్యాల మధ్య గ్యాస్ పైప్లైన్ మార్గంపై సంయుక్తంగా అధ్యయనం - ఉగ్రవాదంపై సత్వరమే బలమైన సమగ్ర అంతర్జాతీయ చట్టం: మోదీ, పుతిన్ పిలుపు - ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను ఏమాత్రం సహించరాదని అగ్రనేతల ఉద్ఘాటన బెనౌలిమ్(గోవా): భారత్ అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ కొనుగోలుతో సహా రష్యాతో మూడు భారీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది. రూ. 60 వేల కోట్ల విలువైన మూడు భారీ రక్షణ ఒప్పందాలతో సహా 16 ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. అలాగే.. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల విషయంలో ఏమాత్రం సహనం వహించరాదని పాత మిత్రులైన ఇరు దేశాలూ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు శనివారం గోవాలో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు నిర్వహించారు. ఉడీ ఉగ్రదాడి సహా అనేక అంశాలపై చర్చించారు. తర్వాత ఇద్దరి సమక్షంలో 16 ఒప్పందాలపై ఇరు పక్షాలూ సంతకాలు చేశాయి. మొత్తం 500 కోట్ల డాలర్లతో రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘశ్రేణి వాయు రక్షణ వ్యవస్థలను కొనడంతో పాటు, అడ్మిరల్ గ్రిగోరోవిచ్ తరగతి (ప్రాజెక్ట్ 11356) నిర్దేశిత క్షిపణి రహస్య యుద్ధ నౌకల్ని నాలుగింటిని కొనడం(రూ. 20,016 కోట్లు) కమోవ్ హెలికాప్టర్ల తయారీ కోసం సంయుక్త ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.. ఈ మూడు భారీ రక్షణ రంగ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్ ఇటీవల తన సైనిక స్థావరాలను అమెరికాకు అందుబాటులోకి తెస్తూ.. ఆ దేశంతో లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ ఒప్పందం కుదుర్చుకోవడంతో.. సంప్రదాయంగా రక్షణ భాగస్వామి అయిన రష్యా నుంచి దూరంగా జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, హైడ్రోకార్బన్లు, అంతరిక్షం, స్మార్ట్ సిటీల వంటి రంగాల్లో సంబంధాల బలోపేతానికి ఇరు దేశాలూ మూడు ప్రకటనలు చేశాయి. పాత మిత్రుడు ఉత్తమం: మోదీ చర్చల అనంతరం పుతిన్తో కలసి మోదీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు కొత్త మిత్రుల కన్నా ఒక పాత మిత్రుడు ఉత్తమం’ అనే రష్యా సామెతను ఉటంకించారు. తద్వారా.. ఇటీవల పాక్తో సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహించిన రష్యాకు పరోక్షంగా అసంతృప్తిని తెలియజేశారు. సీమాంతర ఉగ్రవాదంపై పోరాటానికి భారత చర్యలను అర్థం చేసుకుని, మద్దతు ఇవ్వడం పట్ల రష్యాకు మోదీ అభినందనలు తెలిపారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల విషయంలో సహనానికి తావుండరాదని తామిద్దరం ఉద్ఘాటించినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాల మధ్యా సన్నిహిత సహకారం ఉందని పుతిన్ పేర్కొన్నారు. ఈ భేటీతో అత్యున్నత ఫలితాలు రావడం.. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యపు ప్రత్యేక, విశిష్ట స్వభావాన్ని విస్పష్టంగా చాటుతోందని మోదీ అన్నారు. ఇరు దేశాల భాగస్వాముల మధ్య సహకారాన్ని నెలకొల్పి అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతి ఏటా సైనిక పారిశ్రామిక సదస్సును నిర్వహించే అంశంపై కృషి చేయాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. రష్యాలోని చమురు, సహజవాయువు రంగంలో భారత సంస్థలు గత 4 నెలలలోనే 550 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయని మోదీ చెప్పారు. దీని విస్తరణకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. అలాగే.. ఇరు దేశాల మధ్య గ్యాస్ పైప్లైన్ మార్గంపై సంయుక్తంగా అధ్యయనం చేస్తామన్నారు. ఇరు దేశాలూ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్ను నెలకొల్పాలనీ నిర్ణయించినట్లు తెలిపారు. కూడంకుళంలో మరో రెండు రియాక్టర్ల నిర్మాణం తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలోని రెండో యూనిట్ను మోదీ, పుతిన్లు జాతికి అంకితం చేశారు. 3, 4వ యూనిట్ల శంకుస్థాపనను వీక్షించారు. పౌర అణువిద్యుత్ రంగంలో సహకారాన్ని భారత్, రష్యాలు కొనసాగిస్తూ.. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంటులో ఈ రెండు రియాక్టర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి. అయితే ఆ ప్లాంటులో 5, 6వ యూనిట్ల నిర్మాణంపై జనరల్ ఎగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ను, క్రెడిట్ ప్రొటోకాల్ను ఖరారు చేయలేకపోయాయి. వీటిని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ఇరు పక్షాలూ నిర్ణయించాయి. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్కు త్వరగా సభ్యత్వం ఇవ్వాలన్న అంశానికి రష్యా బలంగా మద్దతునిస్తోందని, ఖండాంతర క్షిపణి వ్యాప్తి, క్షిపణి సాంకేతికత నియంత్రణ విధానానికి వ్యతిరేకంగా హేగ్ కోడ్ ఆఫ్ కండక్ట్లోకి భారత్ ప్రవేశాన్ని రష్యా ఆహ్వానించినట్లు ఇరుదేశాల సంయుక్త ప్రకటన తెలిపింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దు.. సీమాంతర ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ.. ఉగ్రవాదులకు భద్రమైన స్థావరాలను నిరాకరించేందుకు చర్యలు చేపట్టాలని భారత్, రష్యాలు ఉద్ఘాటించాయి. ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర తీర్మానం (సీసీఐటీ)ని సత్వరమే పూర్తిచేయాలన్నాయి. ఇరు దేశాల సంయుక్త ప్రకటన ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ ఖండించింది. ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం సహనం లేని సూత్రం ప్రాతిపదికగా, ద్వంద్వ ప్రమాణాలను పాటించకుండా బలమైన అంతర్జాతీయ చట్ట నిబంధనలను రూపొందించాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. ‘స్మార్ట్ సిటీ’ల్లో రష్యా ఐటీ పరిష్కారాలు... భారత ‘స్మార్ట్ సిటీ’ కార్యక్రమం అమలులో రష్యా సంస్థల ఐటీ పరిష్కారాలను ఉపయోగించుకోవడం కోసం ఆ దేశంతో ఒప్పందాలు చేసుకుంది. జేఎస్సీ రూసిన్ఫామెక్సపర్ట్కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, హోం శాఖ, జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్, హరియాణా ప్రభుత్వాలకు మధ్య ఇవి జరిగాయి. ఉగ్రవాదంపై విభేదాలొద్దు - చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ - ‘బ్రిక్స్’ సందర్భంగా ప్రత్యేక భేటీ బెనౌలిమ్(గోవా): ఏ ఒక్క దేశానికీ ఉగ్రవాద నష్టం నుంచి మినహాయింపు లేదనీ.. ఈ విషయంలో విభేదాలుండజాలవని ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు తెలిపారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా శనివారం జిన్పింగ్తో చర్చల సందర్భంగా విషయాన్ని స్పష్టం చేశారు. జైషే చీఫ్ మసూద్ అజర్కు ఐక్యరాజ్యసమితి నిషేధం ముద్ర పడకుండా చైనా అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు. భారత్, చైనా దేశాలు రెండూ ఉగ్ర బాధిత దేశాలేనన్న మోదీ.. ఈ ప్రాంతంలో అస్థిరత సృష్టించే యత్నాలకు అడ్డుకట్టవేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదం విషయంలో భిన్నాభిప్రాయాలను సహించేది లేదన్నారు. ఈ సమస్యను ఎదుర్కునేందుకు భారత్-చైనా దీర్ఘకాలం పనిచేసేందుకు సంయుక్త వేదికను ఏర్పాటుచేసి ముందుకెళ్లాలని జిన్పింగ్ను కోరారు. దీనికి అంగీకరించిన జిన్పింగ్ ఇరుదేశాలు ఉగ్రవాదవ్యతిరేక కార్యక్రమాలను, భద్రతపై చర్చలు, భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నట్లు విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఇరుదేశాల జాతీయ భద్రత సలహాదారులు త్వరలో భేటీ కావాలని జిన్పింగ్ సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. ‘ఎన్ఎస్జీ’పై త్వరలో భేటీ..: అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో సభ్యత్వంపై భారత అధికారులు మరోసారి చైనా అధికారులతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జిన్పింగ్.. మోదీకి చెప్పారు. ఇది భారత్కు సహాయకరంగా ఉంటుందని జిన్పింగ్ చెప్పినట్లు స్వరూప్ తెలిపారు. భారత్కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై చైనా అంత వ్యతిరేకంగా ఏమీ లేదని.. కొన్ని విషయాల్లో ఉన్న అభిప్రాయభేదాల వల్లే ఆలస్యమైందని.. త్వరలోనే అన్నీ సర్దుకునేలా సానుకూలంగానే జిన్పింగ్ వ్యాఖ్యలున్నాయని స్వరూప్ చెప్పారు. ‘ట్రయంఫ్’తో భరోసా! రష్యాతో చేసుకున్న రక్షణ ఒప్పందాల్లో రూ.33,350 కోట్ల విలువైన ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ ఒప్పందం కీలకమైనది. 400 కి.మీ. పరిధి వరకూ దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లతో పాటు.. రహస్య విమానాలతోసహా శత్రు విమానాలనూ ధ్వంసం చేసే సామర్థ్యం గల ఈ వ్యవస్థ.. భద్రతకు మంచి భరోసానిస్తుందని రక్షణ నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి వ్యవస్థలు ఐదింటిని కొనాలని భారత్ భావిస్తోంది.వీటితో భారత్ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ అధునాత భద్రతా వ్యవస్థలను పాకిస్తాన్ సరిహద్దు వెంట మూడింటిని, చైనా సరిహద్దు వెంట రెండింటిని మోహరించాలన్నది భారత్ ప్రణాళిక. ఒక్కో ట్రయంఫ్ వ్యవస్థలో 8 లాంచర్లు, ఒక కంట్రోల్ సెంటర్, రాడార్, 16 క్షిపణులు ఉంటాయి. ఒక్కో వ్యవస్థకు 100 కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది. దీనికి 3 రకాల క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంటుంది. ఒక రక్షణ పొరను సృష్టించటం, అదే సమయంలో 36 లక్ష్యాలపై దాడి చేయగలగడం దీని ప్రత్యేకత. గంటకు 17,000 కి.మీ వేగంతో ఇది లక్ష్యాలపై దాడి చేయగలదు. ప్రపంచంలోని అన్ని విమానాల కన్నా ఇది అధిక వేగం. కాగా అడ్మిరల్ గ్రిగోరోవిచ్ యుద్ధనౌకల కొనుగోలు ఒప్పందం కింద.. రెండు నౌకలను భారత్కు రష్యా అందిస్తుంది. మరో రెండింటిని రష్యా సాయంతో భారత్లోనే నిర్మిస్తారు. కమోవ్ హెలికాప్టర్ల ఒప్పందం కింద రూ. 6,672 కోట్లతో 200 కమోవ్ 226టి హెలికాప్టర్లను రష్యా, భారత్లు కలసి భారత్లోనే తయారు చేస్తాయి. -
జింగ్పింగ్తో మోదీ మంతనాలు.. పాక్పై చర్చ!
గోవా: బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు గ్జి జింగ్పింగ్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అనంతరం జింగ్పింగ్ను మోదీ కలుసుకున్నారు. ఇటీవలికాలంలో వరుస ఉగ్రవాద దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. చైనా బహాటంగా పాకిస్థాన్కు మద్దతునిస్తోంది. అంతేకాకుండా పాకిస్థానీ ఉగ్రవాది మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత తీర్మానానికి ఐరాసలో మోకాలడ్డింది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్పింగ్తో ప్రధాని మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాదంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించవచ్చునని భావిస్తున్నారు. అణుసరఫరా దారుల గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత్ స్వభ్యత్వం అంశంపైనా జింగ్పింగ్తో మోదీ చర్చలు జరిపే అవకాశముంది. ఇరుదేశాల దౌత్య సంబంధాలు, పాకిస్థాన్ ఉగ్రవాద దాడులపై ఇద్దరు నేతలు ముఖాముఖి మాట్లాడుకోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. గోవాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ అధ్యక్షతన రెండురోజులు జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు నిన్న రాత్రే ప్రధాని నరేంద్రమోదీ గోవా వచ్చారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో శనివారం పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, రష్యా 16 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పారిశ్రామిక అభివృద్ధి, రక్షణ రంగంలో ఒప్పందాలు చేసుకున్నాయి. నాగ్పూర్- సికింద్రాబాద్ మధ్య హైస్పీడ్ రైళ్లపై రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. -
భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలు
-
గోవాకు చేరుకున్నా చైనా అధ్యక్షుడు జిన్పింగ్
-
భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలు
పణజీ: భారత్, రష్యా పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు గోవాకు వచ్చిన పుతిన్తో నరేంద్ర మోదీ శనివారం సమావేశమయ్యారు. భారత్, రష్యా 16 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పారిశ్రామిక అభివృద్ధి, రక్షణ రంగంలో ఒప్పందాలు చేసుకున్నాయి. నాగ్పూర్- సికింద్రాబాద్ మధ్య హైస్పీడ్ రైళ్లపై రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది. అనంతరం మోదీ, పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరు దేశాలు ఉజ్వల భవిష్యత్ దిశగా సాగుతున్నాయని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రష్యా అండగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఇరు దేశాలు ఒకే వైఖరి అవలంభిస్తున్నాయని చెప్పారు. ఇద్దరు కొత్త మిత్రుల కంటే పాత మిత్రుడే ఉత్తమమని అన్నారు. సైన్స్, టెక్నాలజీ కమిషన్ ఏర్పాటు చేయడానికి భారత్-రష్యా అంగీకరించాయని మోదీ తెలిపారు. పారిశ్రామిక, రక్షణ, సాంకేతి రంగాల్లో ఇరు దేశాల కంపెనీల మధ్య సహకారం పెరుగుతోందని పుతిన్ అన్నారు. -
అధ్యక్షులందరూ గోవాకు వచ్చేశారు!
పనాజీ : నేటి నుంచి గోవాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆయా దేశాల అధినేతలందరూ భారత్ కు విచ్చేశారు. భారత్ అధ్యక్షతన శని, ఆది వారాల్లో ఈ సదస్సు జరుగుతోంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. మొదట ఈ సదస్సుకు హజరయ్యేందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకుబ్ జుమా గోవాకు చేరుకోగా, అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్లు దాబోలిమ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా రాత్రి 1 గంటలకు గోవాకు రావాల్సిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆలస్యంగా ఉదయం 10 గంటల ప్రాంతంలో దాబోలిమ్ విమానశ్రయానికి వచ్చారు. అనంతరం చైనా అధ్యక్షుడు క్సి జిన్పింగ్ మధ్యాహ్నం 12 గంటల తర్వాత గోవాకు చేరుకున్నారు. కాగ, భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుండటంతో నిన్న రాత్రే ప్రధాని నరేంద్రమోదీ గోవా వెళ్లారు. ఆయా దేశాల అధినేతలకు భారత ప్రతినిధులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ సదస్సు కోసం భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేసింది. అనుకున్న మాదిరిగానే బ్రిక్స్ సదస్సు ప్రారంభమయ్యే ముందు భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిఫెన్స్, ఎనర్జీ, అగ్రికల్చర్ వంటి వ్యాపార సంబంధాలపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉగ్రవాదాన్ని కూడా ప్రధాన అజెండాగా తీసుకుని పుతిన్తో ప్రధాని చర్చించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతరం చైనా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ అవుతారు. చైనా అధ్యక్షుడి రాకతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాయని మోదీ ట్వీట్ చేశారు. -
‘బ్రిక్స్’కు సర్వం సిద్ధం
-
చైనా-బంగ్లా మధ్య 40 ఒప్పందాలు
ఢాకా: భారత్కు సన్నిహితంగా ఉన్న బంగ్లాదేశ్ను దగ్గర చేసుకునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. కీలకమైన బ్రిక్స్ సదస్సుకు ముందు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బంగ్లాదేశ్లో పర్యటించారు. షేక్ హసీనా ప్రభుత్వంతో విద్యుత్, రహదారులు, రైల్వే అనుసంధానత మొదలైన 40 కీలక అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల విలువ రూ. 1.3 లక్షల కోట్లు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బంగ్లా, చైనాలు మంచి మిత్రులని, ఉత్తమ భాగస్వాములని చర్చల అనంతరం జిన్పింగ్ అన్నారు. -
‘బ్రిక్స్’కు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/పణజీ: రేపటి(శనివారం) నుంచి గోవాలో ప్రారంభం కానున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ దాదాపు 10 ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు. రష్యా, భారత్ల వార్షిక సదస్సులో శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరుపుతారు. అదేరోజు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోనూ భేటీ అయ్యే అవకాశముంది. బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమర్తో సోమవారం సమావేశమవుతారు. బ్రిక్స్ సహ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలతో పాటు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ప్రధానులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరుపుతారు. మరోవైపు, బ్రిక్స్ సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. సదస్సు సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. -
కమోవ్ చాపర్ల తయారీకి ఒప్పందం!
న్యూఢిల్లీ: భారత్, రష్యాలు సంయుక్తంగా 200 కమోవ్ 226టి హెలికాప్టర్లను దేశీయంగా తయారు చేయడం కోసం 100 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంపై ఈ వారాంతంలో సంతకాలు చేసే అవకాశముంది. ఈ నెల 13 నుండి 16వ తేదీ వరకూ గోవాలో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం ఖరారు కావచ్చునని రాస్టెక్ స్టేట్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
‘బ్రిక్స్’లో భిన్నాభిప్రాయాలు
సాక్షి, విశాఖపట్నం: బ్రిక్స్ దేశాల మూడో పట్టణీకరణ ఫోరం సదస్సులో పట్టణాభివృద్ధిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గురువారం నాలుగు అంశాలపై ప్లీనరీ జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ప్రతినిధులు రోజంతా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెండో ప్లీనరీ ‘బ్రిక్స్ స్మార్ట్ సిటీస్ కాంక్లేవ్’ రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వలవన్ మాట్లాడుతూ పట్టణ పౌరులకు మెరుగైన సదుపాయాల కల్పనకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. దక్షిణాఫ్రికా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఫిలిప్ హారిసన్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలతో కీడే ఎక్కువ జరిగే అవకాశాలున్నాయన్నారు. దీనివల్ల పల్లెలు, నగరాల మధ్య అంతరాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూడో ప్లీనరీలో ‘ఫైనాన్సింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అంశంపై చర్చించారు. రాజధాని అమరావతికి రూ.500 కోట్ల నిధులు మంజూరవుతాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి బి.ఆనంద్ తెలిపారు. త్వరలో ప్రకటించబోయే 27 స్మార్ట్ సిటీల్లో అమరావతి ఉందన్నారు. -
భారత్ వేగంగా అభివృద్ది చెందుతోంది
-
భారత్ వేగంగా అభివృద్ది చెందుతోంది
విశాఖపట్నం: భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని, ఆర్థికాభివృద్ధి కూడ వేగంగా దూసుకెళ్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో బుధవారం బ్రిక్స్ దేశాల సదస్సులో చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తూ దేశాభావృద్ధికి కృషిచేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని కేంద్రం స్వచ్ఛభారత్ను తీసుకొచ్చిందని చెప్పారు. పట్టణాల్లో మురికివాడలను బాగు చేయడం సవాలని, పట్టణ జనాభా వేగంగా పెరుగుతోందని తెలిపారు. 2022నాటికి టాప్-3 రాష్ట్రాల్లో ఏపీ ఉండాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. -
విశాఖలో బ్రిక్స్ సదస్సు ప్రారంభం
విశాఖ : ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు విశాఖపట్నంలో బుధవారం ప్రారంభమైంది. మూడు రోజులు పాటు జరిగే ఈ సందస్సులో బ్రిక్స్ దేశాలైన బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. విదేశాలకు చెందిన 72 మంది, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 259 మంది ప్రతినిధులు, మరికొందరు ప్రముఖులతో కలసి దాదాపు 500 మంది హాజరవుతున్నారు. పట్టణీకరణ, పర్యావరణహిత నగరాలు, ప్రణాళిక, అభివృద్ధి తదితర అంశాలను సదస్సులో ప్రస్తావించనున్నారు. ఈ సదస్సుకు కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసారశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ తదితరులు హాజరవుతారు. ముగింపు రోజు పట్టణీకరణపై విశాఖ డిక్లరేషన్ ఉంటుంది. -
విశాఖలో బ్రిక్స్ సదస్సు ప్రారంభం