central Home department
-
ఢిల్లీ ఎల్జీకి ఫుల్ పవర్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు కేంద్రం తాజాగా మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. రాష్ట్ర పరిధిలో ఎలాంటి బోర్డు, కమిషన్, అథారిటీ తదితర చట్టబద్ధమైన సంస్థలనైనా ఏర్పాటు చేసే అధికారాలు కల్పించింది. అంతేగాక ఆయా సంస్థల్లో అధికారులను కూడా ఇకపై ఎల్జీయే నియమించవచ్చు. ఈ మేరకు ఆర్టికల్ 239, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత చట్టం–1991 ప్రకారం కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి వద్ద ఉండేవి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో ప్రతిష్టాత్మకమైన అంతర్గత ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మోదీ సర్కారు ఈ చర్యకు దిగడం విశేషం. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి పదేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండటం తెలిసిందే. ఢిల్లీపై ఆధిపత్యం కోసం ఇరు వర్గాల కుమ్ములాటలు తరచూ కోర్టుల దాకా వెళ్తున్నాయి. పలు కేసుల్లో తీర్పులు ఆప్కు అనుకూలంగా వచ్చినా చట్ట సవరణల ద్వారా కేంద్రం వాటిని పూర్వపక్షం చేస్తూ వస్తోంది. -
వరద నష్టంపై వివరాలివ్వరా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో భారీవర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టానికి సంబంధించిన వివరాలు అందజేయకపోవడంపై కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రకృతి వైపరీత్యాల రోజువారీ పరిస్థితిపై నివేదిక పంపేలా రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్ఈఓసీ)లోని అధికారులను ఆదేశించాలని సీఎస్ శాంతికుమారికి కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు తాజాగా సీఎస్కు కేంద్ర హోంశాఖలోని విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ ఆశిష్గవాయ్ లేఖ రాశారు. ఎస్ఈఓసీ నుంచి అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణ ఎస్ఈఓసీ నుంచి టెలిఫోన్ ద్వారా ఇటీవల కేంద్ర హోంశాఖకు అందిన సమాచారం ప్రకారం.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రొటోకాల్ ప్రకారం కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్కు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా వరదలకు సంబంధించి తాజా నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పడవలు, రక్షించే పరికరాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 7 బృందాలను మోహరించిందన్నారు. వీటితోపాటు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ కోసం వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్లను అందుబాటులో ఉంచామని పేర్కొంది.నిధులివ్వాలంటే నివేదిక పంపాలి...» 2024–25 సంవత్సరానికిగాను రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ నిర్వహణ కోసం రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి రూ.1345.15 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ నివేదించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్ర వాటాను విడుదల చేసేందుకు అవసరమైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమర్పించలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. » 2022–23 సంవత్సరానికిగాను ఎస్డీఆర్ఎఫ్కు చెందిన 2వ విడత కేంద్ర వాటా కింద రూ.188.80 కోట్లు.. 2023 జూలై 10న తెలంగాణకు విడుదలయ్యాయని కేంద్రం తెలిపింది. 2023–24కు సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ కేంద్ర వాటా రెండు వాయిదాలను ఒక్కొక్కటి రూ.198 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 13న, మార్చి 28న విడుదల చేశామని చెప్పింది. » 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ కేంద్ర వాటా మొదటి విడత మొత్తం రూ.208.40 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా విడుదల చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ 1 తర్వాత ఈ రూ.208.40 కోట్లు విడు దల కావాల్సి ఉన్నా, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యర్థన చేయలేదని లేదా ముందుగా విడుదల చేసిన నిధులు, యుటిలైజేషన్ సర్టిఫికెట్ మొదలైన వాటి జమకు సంబంధించిన సమాచారం సమర్పించలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అందువల్ల ఎస్డీఆర్ఎఫ్ నిధుల విడుదల కోసం నిర్ణీత ప్రొఫార్మాలో అవసరమైన సమాచారం/యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఆ తర్వాతే 2024–25కు సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ కేంద్ర వాటా మొదటి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. -
తెలంగాణ సీఎస్పై కేంద్రం సీరియస్
సాక్షి, ఢిల్లీ: కొద్ది రోజులుగా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లు కూలిపోయి, ఇంట్లోకి నీరు చేరడంతో బాధితులకు తీవ్ర నష్టం జరిగింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పంటలకు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వరద నష్టం వివరాలు రాష్ట్రం పంపించక పోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.తాజాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ సందర్భంగా తెలంగాణ వరద నష్టం వివరాలు కేంద్రానికి పంపక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని హోం శాఖ సూచించింది. రూ.1,345 కోట్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే, వరదల సందర్భంగా సాయం కోసం ఇప్పటికే 12 ఎన్డీఆర్ఎఫ్ దళాలు, రెండు హెలికాప్టర్లు పంపించినట్లు లేఖలో పేర్కొంది.ఇక, ఎస్డీఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధుల విడుదల కోసం తక్షణమే వివరాలు పంపాలని ఆదేశించింది. ఇదే సమయంలో జూన్లో రూ.208కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది వరకు ఖర్చు చేసిన వాటి యుటీలైజేషన్ సర్టిఫిటెక్స్, వరద నష్టం వివరాలు పంపాలని కోరింది. వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారీగా పంపించాలని లేఖలో పేర్కొంది. -
ఐపీఎస్లను వెంటనే డెప్యుటేషన్పై పంపండి
సాక్షి, అమరావతి: కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రత విభాగాల్లో విధులు నిర్వర్తించడానికి రాష్ట్రాలు డెప్యుటేషన్పై ఐపీఎస్ అధికారులను పంపకపోవడంపై కేంద్ర హోం శాఖ అసహనం వ్యక్తం చేసింది. ‘ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్పై పంపండి. ఇప్పటికే ఓసారి చెప్పాం. అయినా పంపడంలేదు. ఇది సరైన పద్ధతి కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే కోటా మేరకు ఐపీఎస్ అధికారులను పంపించడి’ అని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శు (సీఎస్)లకు లేఖలు రాసింది. కేంద్ర హోం శాఖ ఈ విధంగా రాష్ట్రాలకు లేఖ రాయడం ఈ ఏడాది ఇది రెండోసారి. కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర భద్రతా విభాగాల్లో రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారులనే డెప్యుటేషన్పై నియమిస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి నిర్దేశించిన కోటా ప్రకారం ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్పై కొంతకాలం కేంద్ర సర్వీసులకు పంపాల్సి ఉంటుంది. డెప్యుటేషన్ ముగిసి తిరిగి రాష్ట్ర సర్వీసులో చేరిన అధికారుల స్థానంలో మరికొందరిని పంపాలి. కానీ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోటా మేరకు ఐపీఎస్లను కేంద్ర సర్వీసులకు పంపడంలేదు. దీనిపై కొన్ని నెలల క్రితం కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. అయినా హిమాచల్ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఐపీఎస్ అధికారులను పంపించలేదు. దీనిపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. ఐపీఎస్ అధికారులను కేంద్రానికి పంపాలని ఇటీవల మరో లేఖ రాసింది.దాదాపు 250 పోస్టులు ఖాళీరాష్ట్రాల నుంచి ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్పై పంపించకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉండిపోయాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 3 నాటికి ఎస్పీ, ఆ పైస్థాయి అధికారుల పోస్టులు 250 వరకు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక డీజీ, అదనపు డీజీ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఎస్పీస్థాయిలో 129 పోస్టులు, డీఐజీ స్థాయిలో 81 పోస్టులు, ఐజీ స్థాయిలో 25 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.దర్యాప్తులో జాప్యం.. దేశ భద్రత విధుల్లో ఇబ్బందులుకేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో ఇంత భారీగా అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. సీబీఐ, ఎన్ఐఏలపై ఇప్పటికే పనిభారం విపరీతంగా పెరిగింది. కీలక కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోంది. బీఎస్ఎఫ్, ఐటీబీపీ విభాగాల్లో అధికారుల కొరతతో సరిహద్దుల్లో భద్రత విధుల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. సీఆర్పీఎఫ్లో అధికారుల కొరత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో తెలిపింది. విభాగాల వారీగా ఖాళీలు» కేంద్ర దర్యాప్తు సంస్థలో 63 డీఐజీ పోస్టుల్లో 30 పోస్టులు దీర్ఘకాలంగా భర్తీ కావడంలేదు. రెండు ప్రత్యేక డైరెక్టర్ జనరల్, 8 అదనపు డైరెక్టర్ జనరల్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.» కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో 73 ఎస్పీ స్థాయి పోస్టులకుగాను 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి» ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో 36 ఎస్పీ స్థాయి పోస్టులలో 13 భర్తీ చేయాల్సి ఉంది.» కేంద్ర నిఘా విభాగం (ఐబీ)లో 83 ఎస్పీ పోస్టుల్లో 50 ఖాళీగా ఉన్నాయి.» భారత్–చైనా సరిహద్దుల్లో భద్రత విధులు నిర్వర్తించే ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగంలో 11 డీఐజీ పోస్టుల్లో 5 ఖాళీగా ఉన్నాయి. » సరిహద్దు భద్రతా విభాగం (బీఎస్ఎఫ్) లో ఒక అదనపు డీజీ పోస్టు, 26 డీఐజీ పోస్టుల్లో 10 పోస్టులు, 21 ఐజీ పోస్టులకుగాను ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.» కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు (సీఆర్పీఎఫ్)లో 7 డీఐజీ పోస్టులు, 5 ఐజీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. -
బాబు పాలన గంజాయి ఖజానా
చంద్రబాబు అక్రమాలను కడుపులో పెట్టుకుని దాచుకోవడంలో రామోజీ సిద్ధహస్తుడు. బాబు ఓటమి రామోజీ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తుంటే...ఆ మనోవేదనలో చిత్తచాంచల్యపు రాతలతో జగన్ ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారు. చంద్రబాబు పాలనలో గంజాయి దందాను సాక్షాత్తూ టీడీపీ నేతలే సాగించినా, ఆ సమయంలో ఏ రోజునా ఈ అక్రమాల గురించి రామోజీ రాయలేదు. నర్సీపట్నం కేంద్రంగా బాబుకు సన్నిహితులైన టీడీపీ నేతలు బరితెగించి, అంతర్ రాష్ట్ర సిండికేట్ నడిపారు. బాబు హయాంలో అక్రమాలను రాయడానికి రామోజీ లేని చత్వారాన్ని, బధిరత్వాన్ని అరువు తెచ్చుకుని, పెన్ను మూసుక్కూర్చున్నారు...వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి దందాలపై ఉక్కు పాదం మోపుతోంది. అన్ని మార్గాల్లోనూ గంజాయి దందాలకు చెక్ పెట్టి, దాని ఆనవాళ్లు లేకుండా చేయాలని నిరంతరం దాడులు చేస్తుంటే ఆ నేరనిరోధ చర్యలు రామోజీకి నచ్చడం లేదు... పనిలో పనిగా గంజాయి సాగును అరికట్టే క్రమంలో సంస్కరణలు సైతం చేపట్టింది. ఆపరేషన్ పరివర్తన్ కింద గంజాయి సాగును ధ్వంసం చేయడంతోపాటు గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా ఆపరేషన్ నవోదయం పథకాన్ని తీసుకొచ్చింది. ఇలా సంస్కరణలనే ఆయుధంగా చేసుకుని, గిరిజన జీవితాల్లో వెలుగురేఖలు నింపుతోంది. సాక్షి, అమరావతి: రాబోయే ఎన్నికల్లో టీడీపికి మరోసారి ఓటమి ఖాయమన్న స్పష్టమైన సంకేతాలు ఈనాడు రామోజీరావుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీ కొండపైన అక్రమంగా కట్టుకున్న కోటవంటి భవంతిలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న రామోజీలో పైత్యం పరిపరి విధాలుగా ప్రకోపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి దందా అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని పిచ్చపిచ్చగా పచ్చ రాతలతో విరుచుకుపడుతున్నారు. ఏదో విధంగా రోజూ ఈనాడు పత్రిక నిండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేయందే రామోజీకి తిన్న ఆ కాస్త ముద్ద అరిగేలా అనిపించడం లేదు. ఆ పైత్యపు రాతలతో రామోజీ కడుపు మంట తీరుతుందేమోగానీ, అవాస్తవాలను వాస్తవం అంటూ ప్రజల్ని మోసం చేయలేరు. చంద్రబాబు హయాంలో విశృంఖలంగా నడిచిన గంజాయి మాఫియాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి సాగును ధ్వంసం చేసిన ఆపరేషన్ పరివర్తన్ విజయవంతం కావడాన్నీ గుర్తించారు. మీ ఒక్కరే వీటిని గుర్తించనట్లు నటిస్తున్నారు రామోజీ... మీ నిద్రలేమి సమస్యకు... కడుపు మంటకు ఏదైనా డాక్టర్ను సంప్రదిస్తే మంచిది.... కట్టుకథలతో ఈనాడు పత్రికను నింపేస్తే చిరిగేది మీ చాటేనని చెప్పేందుకే ఈ ఫ్యాక్ట్ చెక్... చంద్రబాబు హయాంలోనే గంజాయి మాఫియా... చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో గంజాయి మాఫియా రాజ్యమేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ... 2014లో విభజన అనంతరం 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న కాలంలోనే రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్చగా సాగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గంజాయి దందాకు ఏపీ కేంద్ర బిందువుగా మారింది. అంటే అదంతా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా అంతర్రాష్ట్రస్థాయిలో గంజాయి సిండికేట్ను నిర్వహించారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల అండతో ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో భారీ ఎత్తున గంజాయి సాగు చేయించారు. 2014 తరువాత అప్పట్లో ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారిగా నియమితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడి సమీప బంధువే ఈ దందాకు సూత్రధారిగా వ్యవహరించారు. గంజాయి సాగు కోసం విశాఖ ఏజెన్సీలో ఓ వ్యవస్థను సృష్టించారు. సాగును ధ్వంసం చేస్తే గిరిజనులు మావోయిస్టులకు సన్నిహితమయ్యే ప్రమాదముందని ఓ కట్టుకథను అధికారికంగా తెరపైకి తెచ్చారు. ఆ సాకుతో సాగును చూసీచూడనట్టు వదిలేయాలని టీడీపీ ప్రభుత్వం అధికారికంగా విధాన నిర్ణయం తీసుకుంది. ఇదే అదనుగా టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోయింది. వేలాది ఎకరాల్లో దర్జాగా సాగు చేస్తూ... నర్సీపట్నం గుండా అటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు, ఇటు చెన్నై–కోల్కతా జాతీయ రహదారి మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా స్మగ్లింగ్ చేస్తూ బరితెగించి మరీ అక్రమాలకు పాల్పడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా ద్వారా చంద్రబాబు కోటరీ వేల కోట్ల రూపాయలు ఆర్జించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే నవోదయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో డ్రగ్స్ దందాను నిర్మూలించేందుకు విప్లవాత్మక విధాన నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది గంజాయి సాగును ధ్వంసం చేయడం. రాష్ట్రంలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన గంజాయి సాగును అడ్డుకోలేమని పలువురు అభిప్రాయపడినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అన్నారు. యువత భవిష్యత్ను నాశనం చేస్తున్న ఈ మత్తు పంటను తుదముట్టించాల్సిందేనని విస్పష్టంగా ప్రకటించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా దందాను సమూలంగా తుడిచిపెట్టడానికి ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి, ఈ బ్యూరోకు విస్తృత అధికారాలు కల్పించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ‘సెబ్’ గంజాయి సాగును నిర్మూలించేందుకు ‘ఆపరేషన్ పరివర్తన్’ కార్యక్రమాన్ని రెండు దశల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అందుకోసం గిరిజనుల్లో చైతన్యం కలిగించి వారి సహకారం తీసుకోవడం వ్యూహాత్మకంగా సత్ఫలితాలనిచ్చింది. గంజాయి సాగు వల్ల అనర్థాల గురించి ప్రభుత్వం ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించింది. పోలీసు, రెవెన్యూ, సెబ్, గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ పంట సాగు నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. శాటిలైట్ ఫొటోలతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంత్రాన్ని జియో మ్యాపింగ్ చేశారు. అనంతరం ప్రత్యేక యంత్రాలతో రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు. ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి సాగు లేనేలేదు. ఆ విషయాన్ని స్వయంగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగును నిర్మూలించినప్పటికీ సరిహద్దు అవతల ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సాగు కొనసాగుతోంది. ఆ రాష్ట్రాల్లో పండించిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగుతున్న అక్రమ రవాణానూ అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాదీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 2,950 వాహనాలను జప్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’కు జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి. గంజాయి సాగును సమర్థంగా అడ్డుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడుతున్న గిరిజనుల జీవితాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించింది. అందుకోసం రూ.144 కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశెనగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఉచితంగా విత్తనాలను సరఫరా చేయడంతో పాటు ఈ–క్రాపింగ్ ద్వారా అన్నిరకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పిస్తూ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసింది. -
ఇప్పటికైనా గ్రహిస్తారా?!
సదుద్దేశమే ఉండొచ్చు... సత్సంకల్పమే కావొచ్చు... బాధిత వర్గాలకు బాసటగా నిలవాలన్నదే ధ్యేయం కావొచ్చు. కానీ చట్టాల రూపకల్పనలో, విధాన నిర్ణయాల్లో సంబంధిత వర్గాలను సంప్రదించటం అవసరమని మరోసారి రుజువైంది. ఎవరు పిలుపునిచ్చారో, వారి డిమాండ్లేమిటో స్పష్టత లేదు. కానీ చెదురుమదురుగా మొదలైన ట్రక్కు ఆపరేటర్ల మూడురోజుల సమ్మె 48 గంటలు గడవకుండానే దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సృష్టించింది. నిత్యావసరాలకు కొరత ఏర్పడి జనం అల్లాడారు. పలు రాష్ట్రాల్లో చేంతాడంత క్యూలు పుట్టుకొచ్చాయి. చివరకు ట్రక్కు ఆపరేటర్ల సంఘాలతో మాట్లాడాకే చట్టం అమలు చేస్తామని కేంద్ర హోమ్ శాఖ హామీ ఇవ్వటంతో మంగళవారం సాయంత్రానికి సమ్మె విరమించారు. వలసపాలనలోని చట్టాలన్నిటినీ ప్రక్షాళన చేసి, కొత్త చట్టాలు తీసుకొస్తున్నామని ఆ మధ్య కేంద్రం ప్రకటించింది. మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో వాటి తాలూకు బిల్లులు ఆమోదం పొందాయి. తాజాగా జరిగిన ట్రక్కు ఆపరేటర్ల మెరుపు సమ్మె భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నిబంధనలపైనే! గతంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామంటూ కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలపై దాదాపు ఏడాదిన్నరపాటు రైతులు సాగించిన ఉద్యమంతో చివరకు ఆ చట్టాలను వెనక్కు తీసుకోకతప్పలేదు. దాన్నుంచి తెలుసుకున్న గుణపాఠాలేమిటో గానీ... పాత నేర చట్టాలకు పాతరేస్తున్నామంటూ తీసు కొచ్చిన కొత్త చట్టాల పైన కూడా అలాంటి వివాదమే బయల్దేరింది. తమ వాదనేమిటో తెలుసు కోకుండా ఈ నిబంధనలు పెట్టారని ట్రక్కు ఆపరేటర్లు అంటున్నారు. పార్లమెంటులో ఆ చట్టాలపై చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో భిన్నస్వరం వినిపించగలిగిన విపక్షంలో అత్యధికులు సస్పెండయ్యారు. చట్టసభల్లో వుండే మెజారిటీతో అధికారపక్షాలు ఎలాంటి బిల్లులనైనా సులభంగా దాటించవచ్చు. కానీ అమలు సమయంలో సమస్యలు తలెత్తుతాయని గ్రహించలేనంత అమాయ కత్వంలో పాలకులుంటే ఎలా? మన రహదారులు తరచు రక్తసిక్తమవుతున్నాయి. ట్రక్కు ఆపరేటర్ల నిర్లక్ష్యమో, అజాగ్రత్తో కానీ ఏటా వేలాదిమంది ప్రాణాలు బలవుతున్నాయి. గత నెలలో విడుదలైన 2022 నాటి జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆ సంవత్సరం దేశంలో 47,806 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అంటే సగటున రోజుకు 140 మంది, గంటకు ఆరుగురు చనిపోయారు. కేంద్రం విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక గణాంకాలు మరోలా వున్నాయి. దానిప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 67,387 మంది మరణించారు. అంటే సగటున రోజుకు 85 మంది,గంటకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలకు అందని దుర్మరణాలు మరెన్ని వున్నాయో చెప్పలేం. వీటిని అరికట్టడం కోసం కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రం చాన్నాళ్లుగా అనుకుంటోంది. 2019లో అందుకోసం మోటారు వాహనాల చట్టాన్ని సవరించారు కూడా! కానీ భారీ జరిమానాలు వసూలు చేయటం మొదలెట్టిన కొద్దిరోజులకే వెల్లువెత్తిన వ్యతిరేకత కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆ చట్టాన్ని అటకెక్కించాయి. ఈసారి బీఎన్ఎస్ వంతు వచ్చింది. వాస్తవానికి అదింకా అమల్లోకి రాలేదు. కానీ అది అమలైతే వాహనాల డ్రైవర్లకు కఠిన శిక్షలుంటాయి. ప్రస్తుతం అమల్లోవున్న ఐపీసీలోని 304ఏ ప్రకారం ప్రమాదకారకులై, పరారీ అయిన డ్రైవర్లకు గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష, జరిమానా విధిస్తున్నారు. కానీ బీఎన్ఎస్లోని 106/2 ప్రకారం అలాంటి డ్రైవర్లకు పదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా ఉంటుంది. పరారీ కావటానికి ట్రక్కు ఆప రేటర్లు చెబుతున్న కారణాలు వేరే వున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు తప్పు ఎవరిదైనా స్థానికులు తమనే బాధ్యుల్ని చేసి కొట్టి చంపడానికి, వాహనాన్ని తగలబెట్టడానికి లేదా లూటీ చేయటానికి ప్రయత్నిస్తారని అందువల్లే అక్కడి నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నిస్తామని వారి వాదన. అందుకే ట్రక్కు ఆపరేటర్లు సమ్మెకు దిగారు. ఒక బలమైన వర్గం దేన్నయినా వ్యతిరేకిస్తే ఏ చట్టమైనా ఆగి పోవాల్సిందేనని ఈ అనుభవం నిరూపిస్తోంది. బీఎన్ఎస్ ఇంకా అమల్లోకి రాలేదని, రోడ్డు ప్రమాదాల నిబంధనలపై అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్తో చర్చించాకే అమలు చేస్తామని తాజాగా కేంద్రం చెబుతోంది. వలసపాలకులు తెచ్చిన చట్టాల స్థానంలో ‘మనవైన’ చట్టాలుండాలని ఉబలాటపడటం మంచిదే! అందుకోసం సంబంధిత వర్గాలతో ముందే చర్చించివుంటే, కనీసం విపక్షాలతో సహా అందరూ తమ అభిప్రాయాలు తెలియజేసేవరకూ బిల్లుల ఆమోదాన్ని ఆపివుంటే వ్యవహారం వేరేగా ఉండేది. నిజానికి రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వుండటం లేదని సాధారణ ప్రజానీకం భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకో, ఇతరేతర ప్రలోభాలకో లొంగి పోలీసులు ప్రమాద కారకుల్ని తప్పిస్తున్న ఉదంతాలు సరే, నిబంధనలు కూడా సరిగా లేవని నిపుణుల వాదన. కనుక బీఎన్ఎస్లో నిర్దేశించిన శిక్షలు, జరిమానాలు సరైనవేనని వారి వాదన. కానీ చట్ట రూపకల్పన ప్రక్రియ సరిగా సాగకపోవటం వల్ల సమస్య తలెత్తింది. అమల్లోకి రాకముందే సవరణలు చేయక తప్పని స్థితి ఏర్పడింది. రహదారులు మన ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. అవి ఆరు లేన్లు, ఎనిమిది లేన్లుగా విస్తరించాయి. కానీ వాటి నిర్మాణం, నిర్వహణ, వాహనాల అదుపు సక్రమంగా లేకపోతే ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఇందుకు ట్రక్కు ఆపరేటర్లను మాత్రమే బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకునే కంటే మెరుగైన పరిష్కారాలు వెదకటం ఉత్తమం. -
పాత మూస... కొత్త చట్టం
మారుతున్న కాలానికీ, అవసరాలకూ తగ్గట్టు అన్నీ మారాల్సిందే. ఆ దృష్టితో చూసినప్పుడు బ్రిటిషు కాలపు పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు నేర సంబంధ చట్టాలను తీసుకురావడం అభిలషణీయమే. అయితే, ప్రతిపక్షాలకు చెందిన 140 మందికి పైగా సభ్యులను వివిధ కారణాలతో సస్పెండ్ చేసిన అనంతరం పెద్దగా చర్చ లేకుండానే గత వారం పార్లమెంట్ ఈ కొత్త చట్టాలను ఆమోదించడంపై సహజంగానే విమర్శలు వచ్చాయి. ఎవరేమన్నా కొత్త చట్టాలకు భారత రాష్ట్రపతి ఈ సోమవారం ఆమోదముద్ర వేయడంతో ఒక తతంగం ముగిసింది. కేంద్ర హోమ్ శాఖ ప్రభుత్వ రాజపత్రంలో నోటిఫై కూడా చేయడంతో, ఇక ఈ సరికొత్త నేర శిక్షాస్మతులు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో ప్రకటించడమే లాంఛనంగా మిగిలింది. వెరసి, బ్రిటీషు కాలం నాటి ‘ఇండియన్ పీనల్ కోడ్’, ‘కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్’, ‘ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872’ స్థానంలో కొత్తగా ‘భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య చట్టం’ ప్రవేశించాయి. తెచ్చిన మార్పులేమిటి, వీటి ప్రభావం ఎలాంటిదన్నదే ఇప్పుడిక ప్రజాక్షేత్రంలో వివిధ వర్గాలలో చర్చగా మారింది. భారతీయుల కొరకు, భారతీయుల చేత, భారతీయ పార్లమెంట్ తెచ్చిన చట్టాలంటూ హోమ్ మంత్రి ప్రకటించారు. బ్రిటిషు వలసవాద అవశేషాలను తొలగించే చర్యగా అధికార పక్షం వీటిని అభివర్ణించింది. అయితే, పేరుకు ఇవి కొత్త క్రిమినల్ చట్టాలే కానీ, బ్రిటిషు కాలపు పాత చట్టాలలోని భాష, అంశాలే ఎక్కువగా వీటిలో ఉన్నాయని నిపుణులు పెదవి విరుస్తున్నారు. పాత చట్టాల్లోని సెక్షన్లనే వరుస మార్చడం తప్ప ఈ కొత్త వాటిల్లో చేసినది తక్కువనే విమర్శలూ ఉన్నాయి. అంతే కాక, అరెస్టు, పోలీస్ కస్టడీలకు సంబంధించి కొత్త చట్టాల్లోని అంశాల పట్ల అభ్యంతరాలూ వినిపిస్తున్నాయి. కొత్త చట్టాల ఫలితంగా కస్టడీని 60 నుంచి 90 రోజుల దాకా పొడిగించే వీలుండడం లాంటివి అందుకు కారణం. ఇలాంటి అంశాలు పౌరహక్కులకు భంగకరంగా పరిణమించే ప్రమాదం ఉంది. నిజానికి, కొత్త చట్టాలు పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలన తర్వాతే సభ ముందుకొచ్చాయి. అయితే, శతకోటి భారతీయుల జీవితాలను శాసించే చట్టాలు గనక వీటిపై సభ క్షుణ్ణంగా చర్చించడం విధాయకం. అది లేకుండానే అవి చట్టం కావడం విషాదం. అలాగని ఈ చట్టాల్లో అసలంటూ ఆహ్వానించదగినవి ఏమీ లేవనలేం. వివాహ వ్యవస్థను దెబ్బ తీస్తుందనే మిషతో వ్యభిచారాన్ని మళ్ళీ శిక్షార్హంగా మార్చాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసినా, ప్రభుత్వం అందుకు తలూపలేదు. లింగమనే నిర్వచనంలో ట్రాన్స్జెండర్లను కూడా చేర్చడమూ మంచి నిర్ణయమే. మూకదాడి హత్యలను మరణశిక్షకు అర్హమైనవిగా చేర్చడమూ మంచి పనే. అయితే, 2017 తర్వాత మూకదాడి హత్యల డేటాను క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రచురించడం మానేసింది. అలాంటి దాడుల లెక్కలే లేకుండా కొత్త చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? ప్రయోజనం ఏమిట నేది సందేహం. ఇక, రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. వాస్తవంలో పేరు మార్చారే తప్ప, అది మరింత కర్కశంగా మారిందని నిపుణుల ఆందోళన. దేశ సార్వభౌమాధికారం, సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తించినట్టు భావిస్తే చాలు, సెక్షన్ 150 కింద యావజ్జీవ కారాగారవాస శిక్ష వేసే వీలుండడం భయపెడుతోంది. కొత్త చట్టాల్లో అసలు సిసలు మార్పులు కేవలం 20 శాతమేనని ఒక అంచనా. అదే గనక నిజమైతే, ఈ మొత్తం ప్రక్రియ ప్రచారానికే తప్ప, ప్రయోజనకరం అనిపించుకోదు. అలాగే, ప్రభుత్వానికీ, పోలీసులకూ మరిన్ని అధికారాలు కట్టబెడుతున్న ఈ చట్టాల్లో జవాబుదారీతనం ఆ మేరకు కనిపించట్లేదు. ప్రజాస్వామ్యంలో అది సమర్థనీయం కాదు. వలసవాద చట్టాల్లో లాగానే ఇప్పుడూ ఉంటే జనాన్ని ఏమార్చడమే తప్ప ఏం మార్చినట్టు అన్నది ప్రశ్న. క్రిమినల్ చట్టాల్లో సంస్కరణలంటే ఆశించేది ఇది కాదు. నిజానికి, సమాజంలోనూ, సాంకేతికంగానూ అనేక మార్పులు వస్తున్నవేళ... నేర చట్టాలను సవరించడం, నవీకరించడం చట్టబద్ధ పాలన అందించే ఏ దేశానికైనా తప్పనిసరి. అయితే, ఆ మార్పులు నిర్దేశిత సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చడం కీలకం. అలాగే, ఆ సవరించిన చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్టుండడం అత్యవసరం. 150 ఏళ్ళ పాత వలసవాద చట్టాలను వదిలించుకుంటున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పుడు, ఆపాటి ఆశలు, చర్చ ముఖ్యమైనవి. కానీ, వాస్తవంలో కొత్త చట్టాలు అలా లేవంటే నిరాశ మిగులుతుంది. చట్టాల్లో అవసరమైన అనేక ప్రాథమిక సవరణలు చేసే చరిత్రాత్మక అవకాశం చేజారిపోయింది. ఐపీసీ స్థానంలో తెచ్చిన బీఎన్ఎస్ లాంటివి శిక్షలతో భయపెట్టేదిగా కాక, సంస్కరించేదిగా ఉండాలి. 1975 నుంచి 2013 మధ్యకాలంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దాదాపు 33 ప్రభుత్వ పథకాలనే ప్రస్తుత పాలకులు కొత్త పేర్లతో తమవిగా చెప్పుకుంటున్నారనీ, కొత్త పేర్లతో కొత్త నేర చట్టాలు కూడా ఆ కోవలోవే అనీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిందారోపణల మాటెలా ఉన్నా, ఇప్పటికీ మించి పోయింది లేదు. ప్రతిపక్షాలు, పౌరసమాజం తాలూకు భయాందోళలను పోగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. అన్ని వర్గాల అనుమానాలనూ నివృత్తి చేయాలి. చట్టాలు తేవడంలో లేకున్నా, కనీసం అమలులోనైనా సర్వజనామోద వైఖరి శోభనిస్తుంది. అవసరమైతే ప్రజాభిప్రాయానికి తగ్గట్టు సరికొత్త చట్టాల్లోనూ ఎప్పటికప్పుడు సవరణలు చేయాల్సిందే. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య మూలమే అది. ఒక్కమాటలో... కొత్త చట్టాలతో దేశంలోని 17.5 వేల పోలీస్ స్టేషన్లు బలోపేత మవడం సరే కానీ, 140 కోట్ల జనాభా నిస్సహాయులుగా మారిపోతేనే కష్టం. -
ఏపీ విధానాలు నచ్చాయి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పాలనా విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని అంతర్ రాష్ట్ర మండలి ప్రశంసించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారని కితాబిచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నారని, రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్ను గ్రామాల్లోనే అందుబాటులోకి తెచ్చారని కొనియాడింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో భూ యజమానులకు కచ్చితమైన భూ హక్కు పత్రాలను అందజేస్తున్నారని..ఇదొక మంచి విధానమని (గుడ్ ప్రాక్టీస్) పేర్కొంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న గుడ్ ప్రాక్టీసెస్పై అంతర్ రాష్ట్ర మండలి ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. అందులో మన రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయాలతో పాలనా వికేంద్రీకరణ ♦ ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన పాలనా వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తద్వారా వివిధ సంక్షేమ పథకాలతోపాటు పలు ప్రభుత్వ సేవలను పౌరుల ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అవసరాలను తీర్చడంలో ఈ వ్యవస్థ వన్స్టాప్ సొల్యూషన్గా నిలిచింది. ♦ గ్రామాల్లో 50 ఇళ్లకు.. పట్టణాల్లో 70–100 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 10 మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు తమ పరిధిలోని ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. ఆరు అంచెల్లో ట్రాక్ చేయడం ద్వారా పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా చెబుతూ దరఖాస్తు తిరస్కరిస్తున్నారు. సమగ్ర సర్వేతో భూ రికార్డుల శుద్ధీకరణ ♦ దశల వారీగా సమగ్ర భూ సర్వేను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. డ్రోన్స్ ద్వారా ఏరియల్ ఫ్లయింగ్తో సర్వే చేయడంతో పాటు గ్రౌండ్ ట్రూథింగ్, రికార్డుల తయారీ, క్షేత్ర స్థాయిలో ధృవీకరణ, రికార్డుల అప్డేషన్, సరిహద్దు వివాదాలపై అప్పీల్స్, సెక్షన్–13 నోటిఫికేషన్ ప్రచురణ, ఫైనల్ రికార్డ్ ఆఫ్ రైట్స్, స్టోన్ ప్లాంటేషన్, సబ్ డివిజన్స్.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లను క్రమానుగతంగా అమలు చేస్తున్నారు. ♦ సరిహద్దుల ఆన్లైన్ పర్యవేక్షణ, జోనల్, నిబంధనలు, భూమిపై భౌతిక మార్పులతో సహా సమగ్ర భూసర్వే చేపట్టారు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా కచ్చితమైన భూ హక్కు పత్రాలను భూ యజమానులకు పంపిణీ చేస్తున్నారు. తద్వారా భూ రికార్డులు క్లీన్ అవుతాయి. ఇది చాలా మంచి విధానం. ‘ఫ్యామిలీ డాక్టర్’తో ప్రజల్లో నిశ్చింత ♦ డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టం చేసింది. ఇందులో భాగంగా రోగుల ఇంటి వద్దే వైద్య సేవలను అందిస్తోంది. తద్వారా చిన్న చిన్న జబ్బులకు పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం తప్పిందని ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమం. ♦ ఆయుష్మాన్ భారత్ హెల్త్–వెల్నెస్ సెంటర్ల ఏకీకరణ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. ♦ గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పన డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. ♦ ప్రతి విలేజ్ క్లినిక్లో ఒక కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ముగ్గురు నలుగురు ఆశా వర్కర్లను నియమించారు. ♦ విలేజ్ క్లినిక్స్ భవనాలను 932 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వార్టర్తో సహా నిరి్మంచారు. వీటిల్లో 105 రకాల మందులు, 14 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ♦ ప్రతీ పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రతీ పీహెచ్సీకి విలేజ్ క్లినిక్స్ను అనుసంధానించారు. ♦ 104 మెబైల్ మెడికల్ యూనిట్తో సహా ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందిస్తున్నారు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఓపీ సేవలను అందిస్తే.. మరో డాక్టర్ విలేజ్ క్లినిక్స్కు హాజరవుతున్నారు. ♦ ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సాధారణ ఓపీలతో పాటు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నిర్వహణ, యాంటినేటల్ కేర్.. తల్లులు, నవజాత శిశువులకు పోస్ట్నేటల్ కేర్, అంగన్వాడీలు, పాఠశాలల సందర్శన, రక్తహీనత పరీక్షలు, పర్యవేక్షణ, మంచానికే పరిమితమైన రోగుల ఇళ్ల సందర్శన, పంచాయతీల సమన్వయంతో గ్రామ పారిశుధ్య పర్యవేక్షణ జరుగుతోంది. ♦ ఈ ఏడాది మే 3 నాటికి గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలను 97,11,224 మంది ప్రజలు వినియోగించుకున్నారు. రైతులకు అండగా ఆర్బీకేలు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి విధానమని, తద్వారా ప్రభుత్వం రైతుల సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్ను ఉంటున్న ఊళ్లలోనే పొందే అవకాశం కల్పిందని అంతర్రాష్ట్ర మండలి నివేదిక పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వారికి పనికొచ్చే ఇతర సేవలనూ ఆర్బీకేలు అందిస్తున్నాయని తెలిపింది. అన్ని పంటలను ఈ–క్రాప్ ద్వారా నమోదు చేస్తూ, వాస్తవ సాగుదారు సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకుంటోందని.. తద్వారా నిజమైన సాగుదారులకు వైఎస్సార్ సున్నా వడ్డీ, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలను అందిస్తోందని ప్రశంసించింది. రైతుల నుంచి పంటల కొనుగోలు కూడా ఆర్బీకేల్లోనే చేపడుతోందని తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదాతలను అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తోందని కొనియాడింది. -
‘డీప్’గా పసిగట్టి..‘ఫేక్’ పనిపట్టండి
సాక్షి, హైదరాబాద్: డీప్ఫేక్పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆన్లైన్లో ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో మోసాలకు పాల్పడటం, వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తుండటంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్ కట్టడికి కఠిన నిబంధనలు విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, డీప్ఫేక్తో మోసాలకు గురికాకుండా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు పాటించాలని కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. వీటిని పరిశీలించకుండా వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. వాటిల్లో కొన్ని సూచనలు కింది విధంగా ఉన్నాయి. ► ఫొటోలు, వీడియోలలో ఉన్న లైటింగ్, నీడలను నిశితంగా పరిశీలించాలి. అందులో ఏవైనా తేడాలు గమనిస్తే అది ఫేక్ అని ప్రాథమిక అంచనాకు రావొచ్చు. ► అసహజ ముఖకవళికలు ఉన్నట్టు గమనిస్తే దానిని డీప్ఫేక్తో తయారు చేసిన వీడియోగా భావించవచ్చు. ► ఆడియోలలో అసమానతలు, ఆడియో అస్పష్టంగా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► ఫొటోలు, వీడియోల బ్యాక్గ్రౌండ్లో అసమానతలు, ఏవైనా వస్తువులు సాధారణానికి భిన్నంగా ఉన్నట్టు గమనించినా అది డీప్ఫేక్ అయి ఉండొచ్చు. ► ఫొటోల్లో, వీడియోల్లో వ్యక్తులు నిలబడిన, నడుస్తున్న ప్లాట్ఫారమ్లు అసాధారణంగా ఉన్నాయా? కదలికలు నిశితంగా పరిశీలిస్తే ఏవైనా అనుమానాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► డీప్ఫేక్ డిటెక్షన్ టూల్స్ వాడి కూడా అవి నిజమైనవా..లేదా? గుర్తించవచ్చు. -
Central Vigilance Commission: ఆ శాఖల అధికారులపైనే అత్యధిక ఫిర్యాదులు
న్యూఢిల్లీ: దేశంలో 2022లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా కేంద్ర హోంశాఖ అధికారులపైనే వచ్చాయి. ఆ తర్వాత రైల్వే శాఖ, బ్యాంకు అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన అన్ని కేటగిరీల అధికారులు, ఇతర సిబ్బంది విషయంలో మొత్తం 1,15,203 ఫిర్యాదులు అందాయని తెలియజేసింది. వీటిలో 85,437 కేసులను పరిష్కరించామని, మిగిలినవి పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా హోంశాఖ అధికారులపై 46,643, రైల్వే శాఖ అధికారులపై 10,580, బ్యాంకుల అధికారులపై 8,129 ఫిర్యాదులు తమకు అందాయని సీవీసీ స్పష్టం చేసింది. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ’ ప్రభుత్వ అధికారులపై 7,370 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేసేవారిపై 987, ఉక్కుశాఖలో పనిచేసేవారిపై 923 కంప్లైంట్లు వచ్చినట్లు వెల్లడించింది. -
ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1–ఆగస్ట్ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది. -
మహిళల మిస్సింగ్ కేసుల్లో ఆ రాష్ట్రమే టాప్.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం
ఢిల్లీ: దేశంలో మహిళల మిస్సింగ్పై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. దేశంలో మహిళల మిస్సింగ్ కేసుల్లో మహారాష్ట్ర టాప్ ఉందని రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గణాంకాలను లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2021 లో మహారాష్ట్రలో 56,498 మంది మహిళలు అదృశ్యం అవ్వగా, మిస్సింగ్ కేసుల్లో టాప్ 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, అస్సాం ఉన్నాయి. తెలంగాణలో 2021లో 12834 మంది మహిళలు అదృశ్యం కాగా, 2021లో ఏపీలో 8969 మహిళలు అదృశ్యం అయినట్లు కేంద్రం పేర్కొంది. -
ఢిల్లీ: నేడు ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం
సాక్షి, ఢిల్లీ: నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం జరుగనుంది. బుధవారం సాయంత్రం సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ విభజనపై మూడు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. అయితే, తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్దతిలో గదుల విభజన, నిర్వహణ జరుగుతోంది. కాగా, ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యానథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానుండగా.. తెలంగాణ సర్కార్ తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరవనున్నారు. ఇక, ఏపీ భవన్ విభజనపై తొమ్మిదేళ్లుగా సమావేశాలు జరుగుతూనే ఉన్నా కొలిక్కి రాకపోవడం గమనార్హం. -
ప్రాంతీయభాషల్లోనూ సీఏపీఎఫ్ పరీక్ష
న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లిష్తో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతినిచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లిష్తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒరియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుందని ట్వీట్ చేశారు. ‘‘మన దేశ యువత ఆకాంక్షలు నెరవేరేలా ఈ నిర్ణయం ఉంది. ఎవరైనా తాము కన్న కలలు సాకారం చేసుకోవడానికి భాష అడ్డంకిగా మారకూడదన్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ నిర్ణయమే ఒక నిదర్శనం.’’ అని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరిధిలోకి సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) వస్తాయి. సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే పరీక్షల్లో తమిళం కూడా చేర్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. -
ఏ దేవుడూ హర్షించడు!
ఉత్సాహంగా జరుపుకోవాల్సిన సందర్భం ఉద్రిక్తతలకు దారి తీస్తే? ఎవరూ హర్షించరు. కానీ, ఇలాంటి పరిణామాలు ఎక్కువవుతున్నాయి. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా గత వారం రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన ఘర్షణలే అందుకు సాక్ష్యం. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన పండుగ,శాంతియుతంగా సాగాల్సిన శోభాయాత్రలు కొన్నేళ్ళుగా శత్రుత్వానికీ, అరెస్టులకూ, అభాగ్యుల మర ణాలకూ దారితీయడం శోచనీయం. ఈసారీ బిహార్, బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీల్లో రెండు మతాల ఘర్షణగా నవమి ఉత్సవం మారిపోయింది. అటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఇటు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ హింసాకాండ చెలరేగింది. ప్రధానంగా ప్రతిపక్షాల హయాంలోని పశ్చిమ బెంగాల్, బిహార్లలో భారీ విధ్వంసం రేగిన తీరు ఆందోళనకరం. నిరుటి లాగే ఈసారీ రాళ్ళు రువ్వడం, నినాదాలు చేయడం, గృహదహనాలు, లూటీలు! సోకాల్డ్ భక్తుల చేతుల్లో కత్తులు, తుపాకీలు. వెరసి, పవిత్ర రామనవమి, రంజాన్ మాసం కలిసొచ్చే సమయం దేశంలో కొత్త తరహా హింసాత్మక ధోరణికి అనువైన సందర్భంగా మారిపోవడం ఓ విషాదం. బెంగాల్లో హౌరా జిల్లాలో వరుసగా రెండురోజులు, సోమవారం రాత్రి హుగ్లీ దగ్గర రిష్రాలో మరోసారి ఘర్షణలు రేగాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి. బిహార్లో సాసారామ్, నలందా జిల్లాల్లో హింసకు పలువురు గాయపడ్డారు. నలందా వద్ద 110 ఏళ్ళ చరిత్ర కలిగిన మదరసాలో వేలకొద్దీ అరుదైన పుస్తకాలకు నిలయమైన గ్రంథాలయం దుండగుల చేతిలో బూడిదైన ఘటన కదిలించేస్తుంది. రెచ్చగొట్టే ధోరణి వల్ల సామరస్యం దెబ్బతింటుందే తప్ప సమాజానికి మేలు చేకూరదు. ఇప్పుడు జరుగుతున్నదదే. వార్తల్ని గమనిస్తే – మథురలో జామా మసీదు పక్కనే కాషాయ జెండాలు కట్టారు. మరో రాష్ట్రంలో మసీదులో ప్రార్థనల వేళ పెద్దగా నినాదాలు చేస్తూ, లౌడ్ స్పీకర్లు హోరెత్తించారు. బెంగాల్లో అనుమతించిన మార్గంలో కాక రెండు వర్గాలూ ఉండే సున్నితమైన ప్రాంతం మీదుగా కత్తులతో ఊరేగింపు జరిపారు. నిరుటి ఉద్రిక్తతల రీత్యా ఢిల్లీలో ఓ పార్కులో నవమి యాత్ర, నమాజు – రెంటినీ పోలీసులు నిషేధించారు. అయినా కొన్ని మతవాద సంస్థలు అక్కడే యాత్ర, పూజ చేయడాన్ని ఏమనాలి? అదే సమయంలో రెండు చేతులూ కలవనిదే చప్పుడు రాదంటూ రెండోవర్గపు తప్పులు చెబుతున్నవారినీ కొట్టిపారేయలేం. ఈ హింసాకాండ రాజకీయ నిందలకు దారి తీస్తోంది. ఈ ఘర్షణలకు తమ పాలనలోని లోపాలు, ఉదాసీనతలు కారణమని అంగీకరించడానికి మమత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహజంగానే సిద్ధంగా లేరు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన గూండాలతో బీజేపీ ఈ ఘర్షణలకు పాల్పడుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ. బెంగాల్ పోలీసులు ఒక వర్గానికే కొమ్ముకాస్తూ, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని బెంగాల్ బీజేపీ ఛీఫ్ నింద. ఇక, ఆ రాష్ట్ర గవర్నర్ సైతం బాధితప్రాంతాల్లో పర్యటించి గట్టిగానే గళం విప్పారు. ఘర్షణలపై కేంద్ర హోమ్శాఖ నివేదిక కోరే పరిస్థితి వచ్చింది. శ్రీరామనవమి ఘర్షణలతో గురువారం నాటి హనుమాన్ జయంతికి అప్రమత్తత అవసరమైంది. ఈసారి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగరూకతతో వ్యవహరించాల్సిందిగా వివిధ రాష్ట్రాలకు హోమ్ శాఖ బుధవారం సలహా ఇవ్వాల్సి వచ్చింది. కలకత్తా హైకోర్ట్ ఆదేశంతో హనుమాన్ జయంతికి బెంగాల్ సర్కార్ 3 జిల్లాల్లో పారా మిలటరీ దళాలను బరిలోకి దింపాల్సొచ్చింది. ఈ ఘటనలన్నీ ధార్మిక ఉత్సవాలు అతి సున్నితంగా మారిన పరిస్థితులకు దర్పణం. నిజానికి, ఇలాంటివన్నీ నివారించదగ్గ విపరిణామాలు. ధార్మిక ఉత్సవాలు భారత సమాజంలో ఒక అంతర్భాగం. కానీ, వాటిని ఆసరాగా చేసుకొని, వివిధ మతాల మధ్య విషబీజాలను నాటాలనీ, రాజకీయ లబ్ధి పొందాలనీ చూస్తే అంతకన్నా నేరం, ఘోరం ఉండవు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్ప టికీ ప్రజలు స్వేచ్ఛగా తమ మత విశ్వాసాలను అనుసరించేలా రక్షణ కల్పించాలి. వారి ధార్మిక యాత్రలకు భద్రతనివ్వాలి. అది ఆయా ప్రభుత్వాల, అధికార యంత్రాంగాల బాధ్యత. అదే సమయంలో రెచ్చగొట్టే చర్యలు, నినాదాలు, పుకార్ల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లక్ష్మణరేఖ దాటిన దోషులపై కఠినంగా వ్యవహరించాలి. ప్రతి ఎన్నికలో అధికారపీఠంపై పార్టీలు మారవచ్చేమో కానీ, మారకుండా ప్రజాసేవలోనే ఉండేది పోలీసు యంత్రాంగం. కాబట్టి, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు ఏర్పాట్లలో లోపాలను సవరించాలి. విభిన్న వర్గాల మధ్య అపనమ్మకం పెంచే దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలి. కలసిమెలసి బతకాల్సిన సమాజంలో విషబీజాలను విత్తితే అది యావత్ దేశానికే నష్టం. రాజ కీయ లబ్ధి కోసం అంగలారుస్తున్నవారు అది గ్రహించాలి. మరో ఏడాదిలో లోక్సభ ఎన్నికలు ఉన్నందున మతాల మధ్య చిచ్చుపెట్టి, ఓటర్లను వర్గాలుగా చీల్చాలనే ప్రయత్నాలు పెరిగితే ఆశ్చర్యం లేదు. ఇలాంటి నీచ రాజకీయ వ్యూహాల ఉచ్చులో పడకుండా, జనం అప్రమత్తంగా ఉండాలి. రాజ కీయ వర్గాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు రాజ్యాంగ విహితంగా వ్యవహరిస్తూ, మారణకాండకూ, మనుషుల్లో చీలికకూ చెక్ పెట్టాలి. ఒక్కమాటలో – సహనం, శాంతి, క్షమ పాటించిన ఆ రాముడైనా, అల్లా అయినా పొరుగువాడిని ద్వేషించమనలేదు. తమ ధర్మం గొప్పదని చాటుకోవడా నికి పరధర్మాన్ని తక్కువ చేయమని ఏ సమాజమూ, ఏ దేవుడూ చెప్పలేదు. అంతర్యామి సైతం హర్షించని ఘర్షణలతో మానవతా ధర్మాన్ని సైతం మర్చిపోతే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏ ధర్మంలోనూ లేదు. పాపఫలం మాత్రం ఇక్కడే, ఇప్పుడే మనమందరం అనుభవించాల్సి వస్తుంది. -
27న విభజన సమస్యలపై సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై కేంద్ర హోం శాఖలో కదలిక వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయినా పలు సమస్యలు అపరిష్కృతంగా ఉండటంపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా తన వాణిని వినిపించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై త్వరగా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ నెల 27న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ సీఎస్లతో పాటు అయా అంశాలకు చెందిన కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగే సమావేశం అజెండాలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన ద్వైపాక్షిక సమస్యలు, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన పన్ను రాయితీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలున్నాయి. అజెండాలోని అంశాలు ఇవీ.. ద్వైపాక్షిక సమస్యలు ► విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ► షెడ్యూల్ 10లోని రాష్ట్ర సంస్థల విభజన ► విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థల విభజన ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ) విభజన ► సింగరేణి కాలరీస్, ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన ► ఉమ్మడి సంస్థల్లోని కేంద్ర ప్రాయోజిత పథకాలకు చెందిన బ్యాంకుల్లోని నగదు నిల్వలు విభజన. విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల రుణాల విభజన ► బియ్యం సబ్సిడీకి సంబంధించి తెలంగాణ పౌర సరఫరాల సంస్థ నుంచి ఏపీ పౌర సరఫరాల సంస్థకు నగదు క్రెడిట్ విడుదల ఇతర సమస్యలు ► ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక పన్ను రాయితీలు ► ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ఉమ్మడి ఏడు జిల్లాల అభివృద్ధి గ్రాంటు ► రెవెన్యూ లోటు ► పన్నుల సమస్యలు ► విద్యా సంస్థల ఏర్పాటు ► నూతన రాజధానికి కేంద్ర మద్దతు ► నూతన రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ -
‘పద్మ’ నామినేషన్లకు ఆఖరు తేదీ 15
న్యూఢిల్లీ: పద్మ అవార్డులు–2023కు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, సిఫారసుల స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులకు ఆన్లైన్ పోర్టల్ https:// awards.gov.in ద్వారా మాత్రమే సిఫారసులు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. విశిష్ట సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలను కేంద్రం ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తుంది. ప్రతిపాదనలను, నామినేషన్లను ఇతరుల గురించి, లేదా తమకు తాముగా 800 పదాల్లో వివరిస్తూ పంపుకోవచ్చునని హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్ ఇన్ ఫారెస్ట్రీ–2022కు, నేషనల్ గోపాలరత్న–2022కు, నేషనల్ వాటర్ అవార్డ్స్కు సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ అని తెలిపింది. నారీశక్తి పురస్కార్–2023కి అక్టోబర్ 31 చివరి తేదీ అని వివరించింది. -
35 వాట్సాప్ గ్రూప్లపై నిషేధం విధించిన కేంద్రం
అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని.. ప్లాన్స్ సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్ గ్రూప్లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో, 35 వాట్సాప్ గ్రూప్లను నిషేధించినట్లు కేంద్ర సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినవారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించినవారిని గుర్తించేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే, నిషేధం విధించిన వాట్సాప్ గ్రూపుల వివరాలను మాత్రం కేంద్రం గోప్యంగా ఉంచింది. ఇక, ఈ వాట్సాప్ గ్రూపులకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడుల నుంచి మొదలు కొని బీహార్లో ఈ నెల 17న ఉప ముఖ్యమంత్రి దాడి, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఈ దాడులకు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారనే నివేదికలపై చర్యలు చేపట్టింది. ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఆస్తికి నష్టం కలిగించే ఉద్దేశంతో పుకార్లను వ్యాప్తి చేసేందుకు అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. Centre bans 35 WhatsApp groups for spreading misinformation on Agnipath scheme, 10 arrested for fake news#AgnipathScheme pic.twitter.com/Fqv0N8DF2n — Pandurang Dhond (@PandurangDhond7) June 20, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి!
న్యూఢిల్లీ/చండీగఢ్: భారీ భద్రతా వైఫల్యం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. బుధవారం ప్రధాని కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గాన్ని కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో ఆయన సుమారు 20 నిమిషాలు ఒక ఫ్లైఓవర్పై నిలిచిపోయారు. దీనిపై మండిపడిన కేంద్ర హోంశాఖ ఘటనపై తక్షణ వివరణ ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన మోహరింపులు చేయలేదని అభిప్రాయపడింది. మోదీ కాన్వాయ్ను ఆపి పైరియాణా సమీపంలో ఆందోళనకు దిగిన రైతులు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సహించరానిదని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి అమిత్షా చెప్పారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రధానిపై భౌతికదాడికి కాంగ్రెస్ యత్నించిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ ర్యాలీకి జనాలు తగినంతగా హాజరుకాలేదనే ప్రధాని వెనుదిరిగారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటన కారణంగా ముందుగా నిర్ణయించిన ఫిరోజ్పూర్ ర్యాలీని ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనలో మోదీ దాదాపు రూ. 42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఏం జరిగింది? హోంశాఖ కథనం ప్రకారం హుసేనీవాలా జాతీయ అమరవీరుల స్మారకం సందర్శన కోసం బుధ వారం ఉదయం ప్రధాని మోదీ పంజాబ్లోని భ టిండా చేరుకున్నారు. అక్కడినుంచి స్మారకచిహ్నం వద్దకు ఆయన హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. అయితే అనుకోకుండా వర్షం పడి వాతావరణం ప్రతికూలంగా మారింది. వాతావరణం అనుకూలంగా మారుతుందేమోనని ప్రధాని దాదాపు 20 నిమిషాలు వేచిచూశారు. కానీ వాతావరణంలో మార్పు కనిపించకపోవడంతో రోడ్డు మార్గంలో జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రెండు గంటల సమయం పడుతుంది. ప్రధాని రోడ్డుమార్గం ద్వారా ప్రయాణమయ్యే విషయాన్ని అధికారులు రాష్ట్ర డీజీపీకి తెలియజేసి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. పోలీసుల నుంచి తగిన ధ్రువీకరణ అందిన తర్వాత ప్రధాని కాన్వాయ్ హుసేనీవాలాకు బయలుదేరింది. గమ్యానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ప్రధాని కాన్వాయ్ పైరియాణా గ్రామ సమీప ఫ్లైఓవర్ను చేరుకుంది. అక్కడ కొందరు రైతులు నిరసనకు దిగి రోడ్డును దిగ్భంధించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రధాని తన కాన్వాయ్తో ఫ్లైఓవర్పై దాదాపు 15–20 నిమిషాలు నిలిచిపోవాల్సి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే దేశ నాయకుడు నడిరోడ్డుపై నిలిచిపోవడాన్ని చూసి దేశం నిర్ఘాంతపోయింది. సుమారు 200 మంది రైతులు అకస్మాత్తుగా రోడ్డును నిర్భంధించారని పంజాబ్ డీఐజీ ఇందర్బీర్ సింగ్ చెప్పారు. క్రమం గా ఫ్లైఓవర్కు అవతల నిరసనకారులు భారీగా గుమిగూడుతుండడంతో రక్షణకు రిస్కు ఏర్పడుతుందని భావించి ప్రధాని కాన్వాయ్ను తిరిగి భటిండాకు మరలించాలని నిర్ణయించామన్నారు. ఆ ముగ్గురూ ఎందుకు లేరు! దేశ ప్రధాని ఒక రాష్ట్ర రాజధానికి వస్తే గవర్నర్, సీఎం, ఇతర ఉన్నతాధికారులు తప్పక ఆహ్వానం పలకాలి. అదే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పర్యటనకు వస్తే ప్రభుత్వం తరఫున సీఎం లేదా ఒక మంత్రితో పాటు ఉన్నతాధికారులు హాజరవుతారు. కలకలం రేపుతున్న ప్రధాని పంజాబ్ పర్యటనలో ఆయనకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రమే స్వాగతం పలికారు. సీఎం, సీఎస్, డీజీపీ స్వాగతించేందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి స్వాగతం పలికినా, కేంద్ర సర్వీసులకు చెందిన డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఎందుకు రాలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. తన సిబ్బందిలో కొందరికి కరోనా సోకడం వల్ల తాను వెళ్లలేదని సీఎం చన్నీ చెప్పారు. ఐదు ప్రశ్నలు 1. ప్రధాని ప్రయాణించే మార్గాన్ని క్లియర్ చేయడంలో పంజాబ్ పోలీసులు ఎందుకు విఫలమయ్యారు? 2. నిరసనకారులకు ప్రధాని మోదీ రోడ్డు మార్గాన వెళుతున్నట్లు, ఫలానా రోడ్డులోనే వెళుతున్నట్లు ఎలా తెలుసు? ఎవరు ఉప్పందించారు? 3. ప్రధాని భద్రతా సిబ్బందికి రైతులు రోడ్డును దిగ్భందించారని తెలుసా? 4. ప్రధాని ప్రయాణిస్తున్న మార్గాన్ని మార్చినట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ– మోదీ భద్రత చూస్తుంది) పంజాబ్ పోలీసులకు తెలిపిందా? 5. జరగబోయేదేమిటో పంజాబ్ అధికార యంత్రాంగానికి ముందే తెలుసా? ప్రాణాలతో ఎయిర్పోర్ట్కు చేరుకున్నా.. మీ సీఎంకు థ్యాంక్స్! మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి. కనీసం నేను భటిండా విమానాశ్రయం వరకు ప్రాణాలతో వచ్చాను కదా!’’ అని ప్రధాని మోదీ పంజాబ్ అధికారులతో వ్యాఖ్యానించారు. హుసేనీవాలా అమరవీరుల స్మారకం వద్దకు బయలుదేరిన ప్రధాని, భద్రతా వైఫల్యం కారణంగా వెనుదిరిగి భటిండాకు చేరుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే ఆయన తనను కనీసం ప్రాణాలతో ఉంచారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రధాని వ్యాఖ్యల విషయం తనకు తెలియదని పంజాబ్ సీఎం చన్నీ చెప్పారు. ఒకవేళ ప్రధాని కోపంతోనో, రాజకీయ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్య లు చేసి ఉంటే తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. సీఎం కనీసం అందుబాటులో లేరు! ఒకపక్క మార్గం క్లియర్గా ఉందని ప్రధాని భద్రతా దళాని (ఎస్పీజీ)కి పంజాబ్ డీజీపీ, సీఎస్ హామీ ఇచ్చారు, మరోపక్క అదే మార్గంలో నిరసనకారులకు అనుమతినిచ్చారు. పరిస్థితిని ఇంకా త్రీవం చేసేందుకు సీఎం చన్నీ కనీసం ఫోనులో అందుబాటులోకి రాలేదు, ఈ సమస్యను పరిష్కరించే యత్నాలు చేపట్టలేదు. ప్రజాస్వామ్య సూత్రాలను నమ్మే ఎవరికైనా పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు బాధను కలిగిస్తాయి. మోదీ ర్యాలీకి హాజరుకాకుండా ప్రజలను అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. నిరసనకారులతో కలిసి భారీగా బస్సులను ఆపేశారు. ఇలాంటి చర్యలతో భగత్ సింగ్ తదితర దేశభక్తులకు ప్రధాని నివాళి అర్పించకుండా అడ్డుకున్నారు. వీరికి స్వాతంత్య్ర సమరయోధులపై ఎలాంటి గౌరవం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ ఇలాంటి పనులు చేస్తోంది. పంజాబ్లో ప్రధాని ఆరంభించాల్సిన వేలాది కోట్ల రూపాయల అభివృద్ది పనులు వీరివల్ల ఆగిపోయాయి. కానీ మేము వీరిలాగా చౌకబారుతనంతో వ్యవహరించము. ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధికే పాటుపడతాం.’’ – బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వివరాలు ఎవరు లీక్ చేశారు? ప్రధాని మార్గాన్ని అడ్డుకున్న వ్యక్తులకు పంజాబ్ ప్రభుత్వంలో ఎవరు సమాచారమందించారు? ప్రధాని పర్యటనకు తప్పుడు క్లియరెన్స్ ఎందుకిచ్చారు? రక్షణ వైఫల్యం జరిగిందన్న సమాచారం తర్వాత ఎందుకు ఎవరూ స్పందించలేదు? ప్రధాని మృత్యు అంచుకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందానిస్తోందా? దేశ ప్రధానిని ప్రమాదకరమైన మార్గంలో తీసుకువచ్చేలా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యత్నించడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పంజాబ్ పుణ్యభూమిపై హత్యాకాండ జరపాలని యత్నించి కాంగ్రెస్ విఫలమైంది. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. – స్మృతీ ఇరానీ, కేంద్ర మంత్రి జరిగిన దానికి చింతిస్తున్నాం! మార్గమధ్యంలో అడ్డంకుల వల్ల ప్రధాని వెనుతిరగడంపై విచారిస్తున్నాం. ఆయన దేశానికి ప్రధాని, మేమంతా గౌరవిస్తాం. భద్రతా లోపం ఉందని చెప్పడం సరికాదు. భటిండా నుంచి పీఎం రోడ్డు మార్గంలో వెళ్తారన్న ప్రణాళికేమీ లేదు. కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రాగా ప్రధాని కాన్వాయ్ని మరో మార్గం ద్వారా లేదా హెలికాప్టర్ ద్వారా వెళ్లమని సూచించాం. కానీ ఆయన వెనుదిరిగారు. ఇది బాధాకరం. గతరాత్రి రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులను తొలగించాం. అయినాకానీ అనుకోకుండా కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రావడమనేది హానికరమేమీ కాదు. రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేశారు కానీ ఎవరికీ హాని చేయలేదు. అలాంటి వారిపై లాఠీలు ఝళిపించమని చెప్పలేను. ఫిరోజ్పూర్లో బీజేపీ ర్యాలీ కోసం 70 వేల కుర్చీలు ఏర్పాటు చేస్తే 700 మంది వచ్చారు. దీనికి నేనేమీ చేయలేను. హోంశాఖ కోరినట్లు మొత్తం çఘటనపై విచారణ చేస్తాం. రోడ్డు మార్గంలో వెళ్లాలనేది పోలీసు, ఎస్పీజీ ఇతర ఏజెన్సీల ఉమ్మడి నిర్ణయం. ఈ నిర్ణయాల్లో పోలీసుల పాత్ర చాలా పరిమితం. ఎస్పీజీ, ఐబీ తదితర కేంద్ర ఏజెన్సీలు వీటిని నిర్వహిస్తాయి. ఈ మొత్తం ఘటనను అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే అతిధిపై దాడి చేయడం కన్నా చావడానికే ఒక పంజాబీ ప్రాధాన్యమిస్తాడు. – చరణ్జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ సీఎం -
మదర్ థెరిసా సంస్థ బ్యాంకు ఖాతాల స్తంభన
కోల్కతా/న్యూఢిల్లీ: సెయింట్ మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’కి చెందిన భారత్లో ఉన్న బ్యాంకు ఖాతాలన్నింటికీ కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. ‘మదర్ థెరిసా నెలకొల్పిన సంస్థ... మిషనరీస్ ఆఫ్ చారిటీ (ఎంఓసీ)కు భారత్లో ఉన్న బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని తెలిసి షాక్ గురయ్యా! 22 వేల మంది రోగులు, ఉద్యోగులకు మందులు, ఆహారం అందకుండా పోయింది. చట్టమే సర్వోన్నతమైనది... కాకపోతే మానవతాసాయం విషయంలో రాజీపడకూడదు’ అని మమత ట్వీట్ చేయడం ప్రకంపనలు సృష్టించింది. ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యుల వైద్యం, సంక్షేమం కోసం పనిచేస్తున్న మిషనరీస్ ఆఫ్ చారిటీ ఖాతాలను స్తంభింపజేశారనే వార్త తీవ్ర కలకలం రేపింది. టీఎంసీతో పాటు సీపీఎం తదితర విపక్షాలు కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి. దాంతో హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు వీలుగా... ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ)–2011 కింద రిజిస్ట్రేషన్ను రెన్యూవల్ చేయాలని మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును ఈనెల 25న తిరస్కరించామని తెలిపింది. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్కు అర్హమైన నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ సంతృప్తిపరచడం లేదని, పైగా ఈ సంస్థపై తమకు రాతపూర్వకంగా కొంత ప్రతికూల సమాచారం అందిందని పేర్కొంది. తాము బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని వివరణ ఇచ్చింది. అయితే ఈ ప్రతికూల సమాచారమేమిటి? ఏయే నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ ఉల్లంఘించదనే వివరాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బయటపెట్టలేదు. ‘ఎప్సీఆర్ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది అక్టోబరు 31తోనే ముగిసింది. దరఖాస్తులు పెండింగ్లో ఉన్న ఇతర సంస్థలతో పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీకి కూడా గడువును డిసెంబరు 31 దాకా పొడిగించాం’ అవి హోంశాఖ వివరించింది. ఎంఓసీయే తమ విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేయాలని కోరినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమకు తెలిపిందని పేర్కొంది. ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ నిరాకరణ నిర్ణయంపై పునఃపరిశీలన కోసం ఎంఓసీ నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని హోంశాఖ తెలిపింది. మేమే లావాదేవీలు నిలిపివేశాం: ఎంఓసీ విదేశీ నిధుల జమయ్యే బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని దేశంలోని తమ ప్రాంతీయ కేంద్రాలను కోరినట్లు మిషనరీస్ ఆప్ చారిటీ సోమవారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అంశం పరిష్కారమయ్యే వరకు ఆ ఖాతాలను వాడొద్దని చెప్పామని తెలిపింది. ‘ఎఫ్సీఆర్ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం, సస్పెండ్ చేయడం గాని జరగలేదని మేము స్పష్టం చేయదలచుకున్నాం. మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని హోంశాఖ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ దరఖాస్తుకు ఆమోదం లభించలేదని మాత్రమే మాకు సమాచారమిచ్చింది. మావైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగకూడదనే ఉద్దేశంతో సమస్య పరిష్కారమయ్యే వరకు విదేశీ నిధులు జమయ్యే ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని మా కేంద్రాలను కోరాం’ అని ఎంఓసీ సూపీరియర్ జనరల్ సిస్టర్ ఎం.ప్రేమ సంతకంతో విడుదలైన ప్రకటన తెలిపింది. అయితే హోంశాఖ చెప్పినట్లుగా ఖాతాలను స్తంభింపజేయాలని ఎంఓసీయే ఎస్బీఐని కోరిందనే అంశంపై... ఈ ప్రకటనలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరిసా కోల్కతా కేంద్రంగా 1950లో స్థాపించారు. రోమన్ క్యాథలిక్ మతాధిపతుల శాశ్వత కమిటీయే ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ. దీని తరఫున దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆసుపత్రులు, శరణాలయాలు నడుస్తున్నాయి. -
శభాష్.. పోలీస్
సాక్షి, అమరావతి: నేర పరిశోధనలో ఏపీ పోలీసుల సామర్థ్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల దర్యాప్తులో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో చార్జిషీట్లు దాఖలు చేయడంలో మన రాష్ట్ర పోలీసులు అద్వితీయమైన పనితీరు కనబరిచారు. ఏకంగా 93.80 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేసి ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి దోషులను గుర్తించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తోంది. కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ ల్యాబ్లతోపాటు వివిధ సంస్థల నుంచి రావల్సిన నివేదికలను సకాలంలో తెప్పించేందుకు అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. దర్యాప్తు అధికారిని ఎస్ఎంఎస్ల ద్వారా అప్రమత్తం చేస్తూ నిర్ణీత గడువులోగా కేసు దర్యాప్తు పూర్తి చేయడంతోపాటు చార్జిషీట్ దాఖలు చేసేలా పర్యవేక్షిస్తోంది. కేసు దర్యాప్తు ప్రగతిని వివిధ దశల్లో బాధితులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తోంది. పటిష్టంగా ఐసీజేఎస్ విధానం క్రిమినల్ జస్టిస్ విధానంలోని అన్ని ప్రధాన విభాగాలకు కేసుల వివరాలను ఆన్లైన్ ద్వారా సమన్వయపరిచేందుకు ‘ఇంటర్ ఆపరేటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్)ను పోలీసు శాఖ సమర్థంగా నిర్వహిస్తోంది. దాంతో దర్యాప్తును సకాలంలో పూర్తి చేసి ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడం ద్వారా దోషులకు సత్వర శిక్షలు పడేలా చేస్తోంది. ఐసీజేఎస్ విధానం ద్వారా పౌరులకు సేవలందించడంలో గతంలో రెండోస్థానంలో ఉన్న రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పుడు మొదటి స్థానానికి చేరింది. సీఎం, కేంద్ర హోం మంత్రి అభినందనలు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో సకాలంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు భరోసా ఇవ్వడంలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం రాష్ట్ర పోలీస్ శాఖను అభినందించారు. కాగా, సమగ్ర దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సకాలంలో అందిస్తున్న పోలీసు టెక్నికల్ సర్వీసెస్ విభాగాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. డీఐజీ ( పోలీస్ టెక్నికల్ సర్వీసెస్) పాలరాజు, ఇతర సాంకేతిక అధికారుల బృందాన్ని ఆయన ప్రశంసించారు. -
వెయ్యి బస్సుల కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి బస్సుల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపణలపై సీబీఐతో ప్రాథమికంగా దర్యాప్తు చేయించాలని హోం శాఖ సిఫారసు చేసింది. ఢిల్లీ రవాణా శాఖ బస్సుల కొనుగోలు, వార్షిక నిర్వహణ కాంటాక్టు (ఏఎంసీ)ల్లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపించగా, దీనిపై విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజాల్ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఏఎంసీలో విధానపరమైన లోపాలున్నాయని, దానిని రద్దు చేయాలంటూ ఆ కమిటీ సిఫారసు చేసింది. దాంతో దీనిపై సీబీఐతో విచారణకు హోంశాఖ ఆదేశించింది. -
27 మందికి పోలీస్ పతకాలు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సేవా పతకాలు తెలంగాణకు చెందిన 27 మంది పోలీసు అధికారులకు దక్కాయి. మరో ముగ్గురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ఈ పతకాలను అందించనుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకాలు (పీపీఎంజీ), 628 మందికి పోలీస్ శౌర్య పతకాలు (పీఎంజీ), 88 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 662 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ పతకాలు అందుకోనున్నారు. కాగా, పతకాలను అందుకోనున్న పోలీసులకు డీజీపీ మహేందర్రెడ్డి అభినందనలు తెలిపారు. పోలీస్ సేవా పతకాలు... ఇంటెలిజెన్స్ డీఐజీ శివకుమార్, మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్, వరంగల్ ఏసీపీ ఎం.జితేందర్రెడ్డి, మాదాపూర్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, పీటీసీ డీఎస్పీ ఎం.పిచ్చయ్య, టీఎస్ఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ కె. సంపత్కుమార్ రెడ్డి, ఎస్ఐబీ ఏఎస్ఐలు ఆనంద్కుమార్, డి. చంద్రశేఖర్ రావు, గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ ఆరిఫ్ అలీ, కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ ఎం. అనిల్గౌడ్కు సేవా పతకాలకు ఎంపికయ్యారు. పీఎంజీ విభాగంలో... గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తూ ఛత్తీస్గఢ్, గడ్చిరోలి జిల్లాల్లో 2016, 2017, 2018లలో జరిగిన ఎన్కౌంటర్లలో పాల్గొని ధైర్యసాహసాలు ప్రదర్శించిన 14 మందికి పోలీస్ శౌర్య పతకాలను ప్రకటించారు. వీరిలో ఆర్ఎస్ఐ, కానిస్టేబుళ్లతో పాటు ఓ ఎస్ఐ కూడా ఉన్నారు. శౌర్యపతకాలు పొందిన వారిలో ఆర్ఎస్ఐ పి.కె.ఎస్. రమేష్, కానిస్టేబుళ్లు ఎన్.లయ, ఎం.పాపారావు, ఎం. భాస్కర్రావు, జి. ప్రతాప్సింగ్, కె. వెంకన్న, మాలోత్ రాములు, బి. మరియాదాస్, కె. పరుశురాం, అబ్దుల్ అజీమ్, కె.తిరుపతయ్య, పి.సత్యనారాయణ, వి.రమేష్తో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్ ఉన్నారు. జైళ్ల విభాగంలో ముగ్గురికి... జైళ్ల విభాగంలో దేశ వ్యాప్తంగా 41 మందికి విశిష్ట సేవా పతకాలను ప్రకటించారు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురికి పతకాలు దక్కాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ మ హేంద్ర కృష్ణమూర్తి, చీఫ్ హెడ్వార్డర్ బి.నారాయణ, హెడ్ వార్డర్ వేముల జంగయ్య పతకాలను అందుకోనున్నారు. -
ఏపీ పోలీస్ అధికారులకు కేంద్ర పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ప్రతిభా పురస్కారాలు లభించాయి. 2021కి గానూ దర్యాప్తులో అత్యంత ప్రతిభ చూపినందుకు కేంద్ర హోం శాఖ గురువారం వీటిని ప్రకటించింది. ఈ పురస్కారం దక్కిన వారిలో 15 మంది సీబీఐకి చెందిన వారున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి 11 మంది చొప్పున, కేరళ, రాజస్థాన్ నుంచి 9 మంది చొప్పున, ఉత్తరప్రదేశ్ (10), తమిళనాడు (8), బిహార్ (7), తెలంగాణ (5), గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ నుంచి ఆరుగురు ఉన్నారు. పురస్కారాలు లభించినవారిలో 28 మంది మహిళా అధికారులుండటం విశేషం. -
టీకా సర్టిఫికేట్లతో షో చేయోద్దు - కేంద్రం
న్యూఢిల్లీ: కొవిడ్ టీకా తీసుకున్నట్టుగా ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్లు సోషల్ మీడియాలో షేర్ చేయోద్దంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం, షేర్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కుతుందంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కితే ప్రమాదంలో పడేందుకు ఆస్కారం ఉందంటూ కేంద్రం సూచించింది. కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సైబర్ దోస్త్ ట్విట్టర్ పేజీలో ఈ వివరాలు ఉంచింది. సైబర్ సేఫ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ధృవీకరణ పత్రాలను కోవిన్ యాప్ ద్వారా కేంద్రం జారీ చేస్తోంది. ఇందులో పేరు, వయస్సు తదితర వ్యక్తిగత వివరాలు ఉంటున్నాయి. విదేశీ ప్రయాణాలు చేసేప్పుడు వ్యాక్సినేటెడ్ సర్టిఫికేట్లు తప్పనిసరి చేశాయి పలు దేశాలు. దీంతో ఇటీవల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది తాము వ్యాక్సిన్ తీసుకున్నామంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం పలు సూచనలు చేసింది. -
హోం ఐసోలేషన్లో ఉన్నారా? ఈ గైడ్లైన్స్ తెలుసుకోండి
న్యూఢిల్లీ: కరోనా స్వల్ప లక్షణాలు కనిపించేవారు లేదా ఎసింప్టమాటిక్ (కోవిడ్ పాజిటివ్ వచ్చినా, ఎలాంటి లక్షణాలు చూపనివారు) పేషెంట్ల హోం ఐసోలేషన్కు సంబంధించి కేంద్ర హోం శాఖ సవరించిన గైడ్లైన్స్ను విడుదల చేసింది. ఇంట్లో ఐసోలేషన్ గడుపుతున్నవారు రెమ్డేసివిర్ తీసుకోవద్దని, ఈ ఇంజక్షన్ను ఆస్పత్రుల్లోనే ఇవ్వాలంది. సిస్టమిక్ ఓరల్ స్టిరాయిడ్స్ను స్వల్ప లక్షణాలున్న కేసుల్లో వాడవద్దని, లక్షణాలు ఏడు రోజులకు మించి ఉంటేనే డాక్టర్ సూచన మేరకు తీసుకోవాలని వెల్లడించింది. సవరించిన నిబంధనలివే.. ► 60 సంవత్సరాలు పైబడిన లేదా బీపీ, షుగర్, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడే పేషెంట్లను మెడికల్ అధికారి పరిశీలించాకే హోం ఐసోలేషన్కు అనుమతిస్తారు. ► హోం ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గినా, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తినా డాక్టర్ను సంప్రదించి వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. ► గృహ స్వీయ నిర్భంధంలో ఉన్న పేషెంట్లు రోజుకు రెండుసార్లు ఉప్పునీళ్లతో పుక్కిలించడం, రెండుమార్లు ఆవిరి పట్టడం చేయాలి. ► రోజుకు నాలుగుమార్లు 650 ఎంజీ పారాసిటమాల్ మాత్రలు ఇచ్చినా జ్వరం తగ్గకుంటే వైద్యుడిని సంప్రదించి నాన్ స్టిరాయిడల్ యాంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్ని వాడవచ్చు. ► ఐవర్మెక్టిన్ మాత్రను పరిగడుపున 3–5 రోజుల పాటు వాడే విషయాన్ని పరిగణించవచ్చు. ► ఆక్సిజన్ స్థాయిలు 94 శాతం పైన ఉండి, ఎలాంటి లక్షణాలు చూపకపోయినా, టెస్టుల్లో పాజిటివ్ వచ్చినవారిని ఎసింప్టమాటిక్ అని, స్వల్ప లక్షణాలు చూపుతూ, ఆక్సిజన్ స్థాయిలు 94 శాతంపైచిలుకు ఉన్నవారిని స్వల్పలక్షణాలున్నవారని గుర్తిస్తారు. ► వ్యాధిగ్రస్తుడి కేర్టేకర్లు హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ను డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎన్–95 మాస్క్ను ధరించాలి ► ఐసోలేషన్ గదిలోకి గాలి వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకొని, ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్కును ధరిస్తూ ఉండాలి. 8 గంటల తర్వాత మాస్కు మారుస్తుండాలి. ► రోగనిరోధకత తక్కువగా ఉన్న పేషెంట్లకు హోం ఐసోలేషన్ పనికిరాదు. ► సుమారు పదిరోజులు పైబడి ఐసోలేషన్లో ఉన్నవారు లక్షణాలు తగ్గగానే(మూడురోజుల పాటు జ్వరం రాకుండా ఉండడం లాంటివి) డిశ్చార్జ్ కావచ్చు. హోం ఐసోలేషన్ పూర్తి చేసుకొని, లక్షణాలు కనిపించని వారు తిరిగి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అధిక కేసులున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు రాష్ట్రాలకు సూచించిన హోం శాఖ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న జిల్లాల్లో కంటైన్మెంట్ ఆంక్షలను కఠినతరం చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ గురువారం సూచించింది. కోవిడ్ పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు, గత వారం రోజుల్లో 60శాతానికిపైగా పడకల ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాలో కొత్త కంటైన్మెంట్ ఆంక్షలను అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదలచేసింది. మే నెలలో దేశంలో కోవిడ్ తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ పెట్టేదీ లేనిదీ తాజా మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదు. -
ఏఓబీలో హైఅలర్ట్
సాక్షి, అమరావతి: ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల ఘటనతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఏపీ పోలీస్ యంత్రాంగం హైఅలర్డ్ ప్రకటించింది. దండకారణ్యంలో పథకం ప్రకారం మూడు వైపులా చుట్టుముట్టిన మావోయిస్టులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో 24 మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో రాష్ట్రంలోని విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణలు ఉన్నారు. మరోవైపు.. కోబ్రా యూనిట్కు చెందిన రాకేశ్వర్సింగ్ను బందీగా పట్టుకున్నట్లు మావోయిస్టులు సోమవారం ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్గా స్పందించింది. కేంద్ర నిఘా వర్గాలు సైతం రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో.. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఎన్కౌంటర్ జరిగిన బీజాపూర్–సుక్మా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలమైన ఏటపాక సరిహద్దుకు ఘటన ప్రాంతం దగ్గర కావడంతో ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు జల్లెడపడుతున్నాయి. అప్రమత్తం చేశాం ఛత్తీస్ఘఢ్ ఘటన అనంతరం కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాల ఆదేశాలతో ఆంధ్ర–ఒడిశా బోర్డర్ (ఏఓబీ) ప్రాంతంలోని ఏజెన్సీ మండలాల్లో పోలీసులను అప్రమత్తం చేశాం. ఘటన జరిగిన ప్రాంతం మన రాష్ట్రంలోని విలీన మండలానికి సరిహద్దు ప్రాంతం. ఇక్కడ మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదు. అయినప్పటికీ ఏఓబీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశాం. పరిషత్ ఎన్నికల నేపథ్యంలోను ఏజన్సీ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం. మన గ్రేహౌండ్స్ బలగాలు, నిఘా వర్గాలు పటిష్ట వ్యూహంతో వ్యవహరిస్తున్నాయి. – డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ -
రాష్ట్రానికి రెండు శౌర్య పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం మెడల్స్ ప్రకటించింది. ఏపీకి రెండు పోలీస్ శౌర్య పతకాలు, ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకంతో పాటు 15 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఏఏసీ ర్యాంకు అధికారి గొంగటి గిరీష్ కుమార్, జేసీ ర్యాంకు అధికారి కూడుపూడి హరికృష్ణకు పోలీసు శౌర్య పతకాలు వచ్చాయి. విజయవాడ ఏసీబీ అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ మాథుర్తి శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం దక్కింది. 15 పోలీస్ మెడల్స్.. పీహెచ్డీ రామకృష్ణ(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్, విజయవాడ), మల్లూర్ కుప్పుస్వామి రాధాకృష్ణ(అడిషనల్ ఎస్పీ, కర్నూలు), రావెల విజయపాల్(అడిషనల్ ఎస్పీ, సీఐడీ), గంటా వెంకటరమణమూర్తి (సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, నందిగామ), సదాశివుని వరదరాజు(విజిలెన్స్ ఎస్పీ, ఏలూరు), ఆలపాటి వెంకటేశ్వరరావు (అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, ఏపీఎస్పీ 6వ బెటాలియన్, మంగళగిరి), నంబూరు నారాయణ మూర్తి (జేఆర్ పురం ఔట్పోస్ట్ ఎస్ఐ, శ్రీకాకుళం), జొన్నల విశ్వనాథం(ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ, విజయవాడ), సోమ శ్రీనివాసులు (ఏసీబీ ఎస్ఐ, తిరుపతి), యెండ్లూరు శ్యామ సుందరం(ఇన్స్పెక్టర్, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, కళ్యాణి డ్యామ్), జమ్మలమడుగు నూర్ అహ్మద్ బాషా (ఏఎస్ఐ, వన్టౌన్, మదనపల్లి), ఎర్రబోలు నాగేశ్వరరెడ్డి (ఆర్మ్డ్ రిజర్వ్డ్ హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్ యూనిట్, విజయవాడ), మడియ జనార్ధన్ (హెడ్ కానిస్టేబుల్, ఆక్టోపస్), దాచూరు సురేష్బాబు (ఏఎస్ఐ, స్పెషల్ బ్రాంచ్, నెల్లూరు), ఎన్ని శశిభూషణ్రావు (రిజర్వ్ ఎస్ఐ, ఏపీఎస్పీ 5వ బెటాలియన్, విజయనగరం)లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీస్ ప్రతిభా పతకాలకు ఎంపిక చేసింది. అలాగే ఢిల్లీ పోలీసు విభాగంలో ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన అధికారి డాక్టర్ జి.రాంగోపాల్నాయక్కు కూడా పోలీస్ శౌర్య పతకం వరించింది. ఇతర బలగాల్లో పనిచేస్తున్న అధికారులకు.. రాష్ట్రానికి సంబంధించి ఇతర బలగాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులకు కూడా పురస్కారాలు లభించాయి. సతీష్ కుమార్(కమాండెంట్, సీఆర్పీఎఫ్ 42వ బెటాలియన్, రాజమండ్రి), ఆదిగర్ల లక్ష్మణమూర్తి(అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, వైజాగ్ స్టీల్ ప్రాజెక్ట్ యూనిట్, సీఐఎస్ఎఫ్), లవ్కుమార్ (సెకండ్ ఇన్ కమాండ్, 10వ బెటాలియన్ గుంటూరు, ఎన్డీఆర్ఎఫ్)లకు పోలీస్ ప్రతిభా పురస్కారాలు వచ్చాయి. అలాగే జైళ్ల శాఖలో పనిచేస్తున్న ఎం.అరుణ్కుమార్ (చీఫ్ వార్డర్, ఏపీ), అరిగెల రత్నరాజు (హెడ్ వార్డర్, ఏపీ)లకు ఖైదీల ప్రవర్తన దిద్దుబాటుకు గానూ అత్యుత్తమ సేవా పురస్కారాలు లభించాయి. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతోనే.. ప్రస్తుతం ఏసీబీలో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసరావు ఇప్పటివరకు 50 నగదు అవార్డులు, 11 పురస్కారాలు, 49 కమాండేషన్స్, 9 అభినందన పత్రాలు అందుకున్నారు. 2014 రిపబ్లిక్ డే సందర్భంలో పోలీస్ మెడల్ అందుకున్నారు. తాజాగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. ‘రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం నా బాధ్యతను మరింత పెంచింది. దీనికి నన్ను ఎంపిక చేసిన కేంద్రానికి, ప్రోత్సహించిన సీఎం వైఎస్ జగన్, డీజీపీ సవాంగ్, ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు తదితరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అని శ్రీనివాసరావు తన సంతోషం వ్యక్తం చేశారు. -
‘తూర్పు’న వరద నష్టం రూ.2,442 కోట్లు
సాక్షి, కాకినాడ, సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారీ వర్షాలు, వరదల వల్ల తూర్పు గోదావరి జిల్లాలో వివిధ రంగాలకు రూ.2,442 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్రాయ్ నేతృత్వంలోని బృందం మంగళవారం జిల్లాలో పర్యటించి పంట నష్టం, రహదారుల పరిస్థితిని పరిశీలించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ కమిషనర్ ఆయుష్ పునియా, రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ ఎస్ఈ శ్రావణ్కుమార్ సింగ్, కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం కన్సల్టెంట్ ఆర్.బి.కౌల్లతో కూడిన బృందం పర్యటనలో పాల్గొంది. బృందం తొలుత రావులపాలెం, పొడగట్లపల్లి, జోన్నాడ తదితర ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించి రైతులను కలుసుకుంది. పంట పైకి పచ్చగా కనిపిస్తున్నా 21 రోజుల పాటు నీళ్లలో ఉన్నందున వేర్లు కుళ్లిపోయాయని, గెల వేసే పరిస్థితి లేదని ఓ అరటి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టరేట్లో ఫొటో ఎగ్జిబిషన్ను బృందం పరిశీలించింది. నష్టం వివరాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వర్షాలు, వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.422.60 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.2,019.43 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొమరాజు లంకలో దెబ్బతిన్న అరటిని కేంద్ర బృందానికి చూపిస్తున్న రైతు. చిత్రంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పోలవరం నక్లెస్బండ్ పరిశీలన.. ► పశ్చిమ గోదావరి జిల్లాలో దెబ్బతిన్న వరి చేలు, కూరగాయలు, అరటి తోటలను కేంద్ర బృందం సభ్యులు ఇంధన శాఖ సంచాలకులు ఓపీ సుమన్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు పొన్నుసామి, జలశక్తి శాఖ సంచాలకులు పి.దేవేందర్రావు పరిశీలించారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరుకు చేరుకుని ఎర్రకాలువ వరద ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నందమూరు అక్విడెక్ట్ వద్ద నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కేంద్ర బృందానికి ఎర్ర కాలువ కింద సాగు వివరాలను తెలియచేశారు. పోలవరంలో కోతకు గురైన నక్లెస్బండ్ ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. కలెక్టర్ ముత్యాలరాజు జిల్లాలో జరిగిన నష్టాన్ని బృందానికి వివరించారు. నేడు సీఎం జగన్తో కేంద్ర బృందం సమావేశం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల వివిధ రంగాలకు జరిగిన నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర బృందం బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్రాయ్ నేతృత్వంలోని కేంద్ర బృందం రెండు రోజుల పాటు అనంతపురం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి నష్టాలను పరిశీలించిన విషయం తెలిసిందే. -
ఇకపై కశ్మీర్లో భూములు కొనొచ్చు..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఇకపై ఎవరైనా భూములను కొనొచ్చు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేసింది. జమ్మూకశ్మీర్లోని పలు చట్టాలకు చేసిన సవరణల్లో ఈ మార్పులను తీసుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కేవలం ఆ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు మాత్రమే భూములు కొనే హక్కును కలిగి ఉండేవారు. సెక్షన్ 17లోని ఆ హక్కును కేంద్రం తొలగించడంతో, ఇప్పుడు ఎవరైనా జమ్మూకశ్మీర్లో భూములను కొనొచ్చు. అయితే వ్యవసాయ భూములను, వ్యవసాయేతరులకు అమ్మేందుకు ఈ సవరణ అంగీకరించలేదని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు. అయితే వ్యవసాయ భూములను విద్య, వైద్యానికి సంబంధించిన లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు. ఈ చర్యను పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) వ్యతిరేకించింది. ఈ సవరణలు ఆమోదనీయం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ను అమ్మకానికి పెట్టారని అన్నారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని రద్దు చేశాక, ఇప్పుడు జమ్మూకశ్మీర్ను అమ్మకానికి పెట్టారని, తమ సహజవనరులను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
అత్యాచార కేసుల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, అమరావతి: మహిళలు, ఆడపిల్లలపై రోజురోజుకీ పెరిగిపోతున్న దారుణాలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన హాథ్రస్ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాలను అనుసరించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. ► మహిళలపై నేరాలు.. ప్రధానంగా అత్యాచారం వంటి కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. లైంగిక దాడి వంటి ఘటనల్లో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఒకవేళ నేరం బాధితురాలుండే పోలీస్స్టేషన్ పరిధి వెలుపల జరిగితే.. ఎక్కడైనా సరే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందే. లేకపోతే సదరు పోలీస్ అధికారి శిక్షార్హుడు. ► లైంగిక దాడి గురించి సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. న్యాయాధికారి ముందు రికార్డు చేయనప్పటికీ.. బాధితురాలి మరణ వాంగ్మూలం పరిగణనలోకి తీసుకోవాలి. ► లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్ అసెల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్లను ఉపయోగించాలి. అత్యాచార కేసుల్లో పోలీసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తి చేయాలి. ► దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’ ఆన్లైన్ పోర్టల్ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్గదర్శకాలు పాటించని పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయి. ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు, ఆడపిల్లల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో జరిగిన ‘దిశ’ ఘటన నేపథ్యంలో.. ఏపీలోని ఆడబిడ్డలెవరికీ అలాంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేకంగా ‘దిశ’ యాక్ట్ తెచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, సైంటిఫిక్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ఫలితంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్మార్గులకు 21 రోజుల్లోనే శిక్షలు పడేలా కృషి చేస్తోంది. ఏపీలోని దిశ యాక్ట్ తరహాలోనే ప్రత్యేక చట్టం తెచ్చేందుకు మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలు ఏపీలో అధ్యయనం కూడా చేశాయి. అన్యాయానికి గురైన మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా 2019 డిసెంబర్ 5 నుంచే రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ను అమలులోకి తెచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 341 జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో తీసుకొచ్చిన దిశ యాక్ట్, జీరో ఎఫ్ఐఆర్ తదితరాలు మహిళలు, చిన్నారుల రక్షణలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఏపీ పోలీస్ శాఖ టెక్నికల్ చీఫ్ పాల్రాజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
15 నుంచి తెరుచుకోనున్న థియేటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ తాజాగా అన్లాక్–5 మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా బుధవారం అన్లాక్–5 మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యా, శిక్షణ సంస్థలు తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, మల్టీప్లెక్స్లకు అనుమతిచ్చింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను యథాతథంగా కొనసాగించింది. అక్టోబర్ 15 నుంచి అనుమతించేవి.. ► 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్లు తెరుచుకోవచ్చు. దీనికోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియమావళి జారీ చేస్తుంది. ► వాణిజ్య శాఖ జారీ చేసే ప్రత్యేక నియమావళి ఆధారంగా వాణిజ్య సంస్థలు (బిజినెస్ టు బిజినెస్) ఎగ్జిబిషన్లు తెరుచుకోవచ్చు. ► క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్కు అనుమతి. దీనిపై క్రీడల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రామాణిక నియమావళి జారీ చేస్తుంది. ► ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఈ తరహా సంస్థలు తెరుచుకోవచ్చు. విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు.. ► అక్టోబర్ 15 తర్వాత పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలను దశల వారీగా ప్రారంభించుకునే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు విడిచిపెట్టింది. అయితే ఆయా సంస్థలు కేంద్రం విధించిన షరతులను పాటించాలి. ► ఆన్లైన్ విద్య, దూరవిద్య కొనసాగాలి. హాజరు నిబంధనలు అమలు చేయరాదు. ► విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఆన్లైన్ తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడితే అందుకు వారిని అనుమతించాలి. ► తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో మాత్రమే పాఠశాలలు, శిక్షణ సంస్థలకు విద్యార్థులు హాజరుకావచ్చు. ► పాఠశాలలు, శిక్షణ సంస్థలను తెరిచేందుకు కేంద్ర విద్యా శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి నియమావళి తయారు చేసుకోవాలి. ► రాష్ట్రాల ప్రామాణిక నియమావళిని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి. ► కరోనా పరిస్థితిని అంచనా వేసి కేంద్ర హోం శాఖతో సంప్రదించి కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభించవచ్చు. ► సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్లోని పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ విషయంలో కేంద్ర నిధులతో పనిచేసే ఉన్నత విద్యా సంస్థల అధిపతి ఈ అవసరాన్ని గుర్తిస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ వర్సిటీలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం. 50 శాతం భర్తీకి అనుమతి.. ► సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ వేడుకలు, ఇతర సమ్మేళనాలకు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం 100 మంది వరకు అనుమతించారు. అక్టోబర్ 15 తర్వాత కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మందికి మించి ఇలాంటి సమావేశాల నిర్వహించే అనుమతిని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ఇందుకు ఈ నియమాలు పాటించాలి. ► హాల్ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం భర్తీకి అనుమతిస్తారు. గరిష్టంగా 200 మందికి మించకూడదు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరి. అంతర్జాతీయ ఆంక్షలు యథాతథం.. ► హోం శాఖ అనుమతించిన ప్రయాణాలు మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి. ► కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ► కంటైన్మెంట్ జోన్ల వెలుపల రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదించకుండా లాక్డౌన్ విధించరాదు. -
అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే
-
అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే: కేంద్రం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని మరోసారి కేంద్రం స్పష్టీకరించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదని పేర్కొంది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందని,హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని కేంద్రం తెలిపింది. (చదవండి: అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జగన్) -
రికార్డు స్థాయిలో కొత్త కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. శుక్రవారం తాజాగా మరో 77,266 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,057 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 61,529కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 25,83,948కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,42,023గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.90గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసులు 18 లక్షలకు పైగా అధికంగా ఉన్నాయి. అంతేగాక యాక్టివ్ కేసుల కంటే 3.5 రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి ఇది 76.28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.82 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 27 వరకు 3,94,77,848 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 9,01,338 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు పది లక్షల పరీక్షలు జరిపే దిశగా దేశం పయనిస్తోందని తెలిపింది. గత రెండు వారాల్లోనే ఏకంగా కోటికి పైగా పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది. ప్రతి పది లక్షల మందిలో 28,607 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. -
అక్రమంగా అడుగిడుతూ.. ఇక్కడే స్థిరపడుతూ..
మనదేశంలో ఎంతమంది విదేశీయులు అక్రమంగా ఉంటున్నారన్న ప్రశ్నకు కేంద్ర హోం శాఖ వద్ద సమాచారం లేదు.’ తెలంగాణలో ఎందరు రోహింగ్యాలు పాస్పోర్టు, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారన్న విషయంపై ఆర్టీఐ దరఖాస్తుకు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఇంకా సమాధానం వెల్లడించలేదు. సాక్షి,హైదరాబాద్: విజిటింగ్ వీసాల పేరిట భారత్లోకి వస్తున్న విదేశీయులు ఏం చేస్తున్నారు? వారిపై నిఘా ఉందా? మొన్న తబ్లిగీ జమాత్ కోసం వచ్చిన ఇండోనేషియన్లు విజిటింగ్ వీసాను దుర్వినియోగం చేయడం, వారివల్ల దేశంలో కరోనా వ్యాపించడంపై ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వీసాలు రద్దు చేసి, వారిపై వీసా ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశాయి. అయితే ఇప్పటికే భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ వల్ల దేశంలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో అక్రమ వలసలకు తోడు విజిటింగ్ వీసాల మీద వచ్చిన వారిపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్లోని పలు ముఠాలు భారత్లో మానవ అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణా, దొంగనోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రదాడులకూ ప్రణాళికలు రచిస్తున్నాయి. వాటిలో దొంగనోట్లు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ.. దేశంలో విధ్వంసాలకు కారణంగా మారుతోంది. 9 లక్షలకు పైగానే.. తబ్లిగీ జమాత్ ఉదంతం నేపథ్యంలో ఆగస్టు 2019 నుంచి మార్చి 2020 వరకు దేశంలోకి ఎందరు విజిటింగ్ వీసాలపై వచ్చారన్న సమాచారం ‘సాక్షి’ సేకరించింది. దీనిపై బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్న భారత ఎంబసీకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఆగస్టు నుంచి మార్చి వరకు 9.6 లక్షల మంది బంగ్లాదేశీయులు విజిటింగ్ వీసాలపై భారత్లోకి వచ్చారు. అలాగే వియత్నాం నుంచి 1,126 మంది, కౌలాలంపూర్లోని 1,405 మంది ఇండోనేషియన్లకు భారత్లో పర్యటించేందుకు వీసాలు ఇచ్చామని వాళ్లెవరికీ మతపరమైన వీసాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. తెలంగాణలోనూ అధికంగా..! వివిధ దేశాల నుంచి విజిటింగ్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు వీసా గడువు ముగిసినా వెనక్కి వెళ్లట్లేదు. ఇలాంటి వారిలో కొందరు తెలంగాణలోనూ స్థిరపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్లో కలిపి 10 వేల మందికిపైగానే రోహింగ్యాలు, ఇతర విదేశీయులు అక్రమంగా ఉంటున్నారని సమాచారం. వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం కల్పిస్తుండగా మిగిలిన వారు భూములను కబ్జా చేసి స్థిర నివాసం ఏర్పరుచు కుంటున్నారు. ఆధార్, పాస్పోర్ట్, పా¯Œ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసె¯Œ ్స వంటి గుర్తింపు పత్రాలను సులువుగా సంపాదిస్తున్నారు. -
వైరస్పై యుద్ధం.. ఇలా చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై పోరాటం చేయాలంటే జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే సరిపోదు. మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించిన మందు మరేదీ లేదు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటించాలని, జనం సమూహాలుగా ఏర్పడరాదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ క్రమంలో అత్యవసర పనులపై బయటకు వచ్చి.. తిరిగి ఇళ్లకు చేరుకునే విషయంలో, సరుకుల కొనుగోలు, ఇతర సమయాల్లో ప్రజలు అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీచేసింది. ఈ సలహా సూచనలను కుటుంబంలోని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అనుసరించాలని స్పష్టంచేసింది. పోషకాహారం.. యోగాసనాలు కరోనా వైరస్ కట్టడికి ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో చికిత్స అందించి రోగం తీవ్రతను తగ్గిస్తున్నప్పటికీ సరైన మందులు అందుబాటులో లేవు. అందువల్ల సరైన ఆహారం తీసుకుంటూ శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా కరోనాను జయించవచ్చు. రోజూ కనీసం 30నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం వంటివి ఆచరించాలి. మాస్క్, శానిటైజర్, భౌతికదూరం.. ► ఇంటి బయటకు వెళ్లేముందు ట్రిపుల్ లేయర్ లేదా ఎన్–95 లేదా సర్జికల్ మాస్క్ తప్పక ధరించాలి. కాలికి ప్లాస్టిక్ స్లిప్పర్లు వేసుకోవాలి. ► సరుకుల కోసం సంచి లేదా ప్లాస్టిక్ బాస్కెట్ తీసుకెళ్లాలి. మార్కెట్లో/బయట వివిధ ఉపరితలాలను తాకకుండా జాగ్రత్త పడాలి. ► దుకాణాదారు లేదా ఇతరులకు కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి. మార్కెట్కు వెళ్లేవారు వెంట హ్యాండ్ శానిటైజర్ను తీసుకెళ్లాలి. ► అత్యవసరమైతేనే మార్కెట్కు వెళ్లాలి. వారంలో రెండుసార్లకు మించి వెళ్లకపోవడం మంచిది. ► ఏటీఎంలో నగదు డ్రా చేయాలంటే ముందు మిషన్ కీబోర్డును శానిటైజ్ చేయాలి. కార్డు వినియోగించాక కూడా శానిటైజర్తో శుభ్రంచేయాలి. ► ఇంట్లో ఉన్నప్పుడు కరోనా లక్షణాలు లేని వారు మాస్కు వాడనవసరం లేదు. లిఫ్ట్ వద్దు.. మెట్లే ముద్దు ► ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇతర భవనాల్లో లిఫ్ట్ వాడకాన్ని తగ్గించాలి. ఎక్కువ మంది దీన్ని విని యోగించడం, తక్కువ విస్తీర్ణం గల వీటిలో భౌతికదూరం పాటించడం కష్టం కాబట్టి.. మెట్లు వాడాలి. ూ ► వాడటం తప్పనిసరైతే పేపర్ ముక్కల ద్వారా బటన్లు నొక్కి.. ఆపై వాటిని డస్ట్బిన్ లో పారేయాలి. ూ ఇంట్లోకి వెళ్లే ముందు ఎక్కడా, ఎలాంటి ఉపరితలాలను తాకకూడదు. నేరుగా బాత్రూమ్కు వెళ్లి బట్టలు వదిలేసి స్నానం చేయాలి (ఎక్కువ మందిని తక్కువ దూ రంతో తాకినట్టు భావిస్తే). లేదంటే చేతులు, ము ఖాన్ని సబ్బు/హ్యాండ్వాష్తో శుభ్రం చేసుకోవాలి. ► చెప్పులను కూడా శుభ్రం చేసుకోవాలి. ► ఇంట్లోకి బయటి వ్యక్తులను అనుమతించేటప్పుడు వారి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాలి. సమస్య లేకుంటే, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే వారిని లోనికి అనుమతించాలి. ఇంటి పరిశుభ్రత ఇలా... ► ఇళ్లను రోజూ డిటర్జెంట్ ఉన్న ద్రావణంతో శుభ్రం చేయాలి. ముఖద్వారంతో పాటు కాలింగ్బెల్ను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. ► సబ్బు లేదా హ్యాండ్వాష్తో చేతులను 20 సెకన్లపాటు రుద్ది కడుక్కోవాలి. ► మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు, పాలప్యాకెట్లను ఉప్పు/బేకింగ్ సోడాలో 2శాతం డిటర్జెంట్ ద్రావణంతో కలిపి కడిగి శుభ్రం చేయాలి. ► ఇంట్లోకి తెచ్చిన ఇతర వస్తువులను.. 72 గంటల అనంతరం వినియోగించడం మంచిది. అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయొద్దు. వైరస్ ఏ ఉపరితలంపై ఎంతకాలం ఉంటుందంటే.. అల్యూమినియం: 2–8 గంటలు చెక్క: 4 రోజులు ప్లాస్టిక్: 2–5 రోజులు మెటల్: 5 రోజులు సెరామిక్: 5 రోజులు స్టీల్: 2–28 రోజులు గ్లాస్: 4–5 రోజులు -
ఒక్కరోజులో 1,074 మంది రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో గత 24 గంటల్లో 1,074 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. ఇప్పటిదాకా ఒక్కరోజులో కోలుకున్న వారిలో ఇదే అత్యధికం. రికవరీ రేటు ప్రస్తుతం 27.52 శాతానికి పెరిగిందన్నారు. ఇప్పటికే 11,706 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా నిర్ధారణకు టెస్టింగ్ కిట్ల కొరత లేదన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యం పెంచుతున్నామన్నారు. దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో 83 మంది కరోనా కాటుతో ప్రాణాలు విడిచారు. అలాగే కొత్తగా 2,573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం. దీంతో మొత్తం మరణాలు 1,389కు, పాజిటివ్ కేసులు 42,836కు చేరాయి. సరుకు రవాణాలో సమస్యలుండొద్దు్ద దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య సరుకు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉత్పన్నతమైతే ట్రక్కు డ్రైవర్లు కంట్రోల్ రూమ్ నంబర్ ‘1930’కు ఫోన్ చేయాలని పేర్కొంది. ఈ కంట్రోల్ రూమ్ రోజంతా పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ సోమవారం చెప్పారు. డ్రైవర్లు ‘1930’కు ఫోన్ చేసి సాయం పొందవచ్చు. -
వలస కూలీలు రాష్ట్రం దాటరాదు
సాక్షి, అమరావతి: వలస కూలీల విషయంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు సూచనలు చేసింది. రాష్ట్ర పరిధిలోని వలస కూలీలు అదే రాష్ట్రంలోని వేరే ప్రాంతంలో ఉంటే.. వారికి స్క్రీనింగ్ చేసి సొంతూళ్లకు పంపవచ్చని కేంద్రం పేర్కొంది. అలాగే స్వరాష్ట్రంలోని పనిచేసే ప్రాంతాలకు కూడా అనుమతించవచ్చని తెలిపింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతాలకు వలస కూలీలను అనుమతించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివారం లేఖ రాశారు. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. కంటైన్మెంట్ జోన్ల అవతల సోమవారం నుంచి పనిచేసే పరిశ్రమలు, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, నిర్మాణ పనులు, వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనుల్లో పనిచేసే కూలీలు, వర్కర్లను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ► కూలీలను సొంతూళ్లకు లేదా పనిచేసే ప్రాంతాలకు పంపించే సమయంలో బస్సుల్లో తగిన భౌతిక దూరం పాటించాలి. కూలీలను తరలించే బాధ్యత స్థానిక అధికార యంత్రాంగం తీసుకోవాలి. బస్సు ప్రయాణ సమయంలో కూలీలకు స్థానిక అధికార యంత్రాంగం ఆహారం, నీటి సౌకర్యం కల్పించాలి. ► ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు ఎక్కడ ఉంటే అక్కడనే ఉండాలి. రాష్ట్రాల మధ్య వలస కూలీల రవాణాకు అనుమతించరాదు. ► ప్రస్తుతం సహాయ శిబిరాలు, షెల్టర్లలో ఉన్న వలస కూలీల వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం నమోదు చేసుకోవాలి. కూలీల పని నైపుణ్యాలు తెలుసుకుని అక్కడే తగిన పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. -
ఆ రోహింగ్యాలు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ తబ్లిగీ జమాత్కు సంబంధించి రోజుకో ఉదంతం బయటపడుతోంది. మొన్న ఢిల్లీ ప్రార్థనలు, నిన్న యూపీలోని దేవ్బంద్కు తబ్లిగీ జమాత్కు లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని నిజాముద్దీన్, హరియాణాలోని మేవాట్లో జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు మన దేశంలో అక్రమంగా వలస ఉంటున్న రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిలో చాలామంది క్యాంపులకు చేరుకోలేదని సమాచారం. దీంతో ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటోన్న రోహింగ్యాల ఆచూకీని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. దీంతో ఇప్పటికే మర్కజ్ వెళ్లినవారిని, తరువాత దేవ్బంద్కు వెళ్లిన వారిని గుర్తించేందుకు నానాతిప్పలు పడ్డ పోలీసులు.. ఇప్పుడు రోహింగ్యాల వేటలో పడ్డారు. అందుకే వెళ్లారా..? ఢిల్లీలో జరిగే తబ్లిగీ మత ప్రార్థనలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పలువురు హాజరవుతారు. ఈ ప్రార్థనలకు హైదరాబాద్, తెలంగాణలో ఉంటున్న రోహింగ్యాలు కూడా వెళ్తుంటారు. మొన్న మార్చి రెండో వారంలో జరిగిన మత ప్రార్థనలకు వీరు సైతం హాజరయ్యారు. రోహింగ్యాలు అధికంగా ఉండే నగర శివార్లలోని పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఢిల్లీలో జరిగే మత ప్రార్థనలకు రోహింగ్యాలు హాజరవడంలో వింతేమీ లేదన్నారు. అయితే, తెలంగాణ నుంచి వెళ్లిన రోహింగ్యాలంతా హరియాణాలోని మేవాట్లో జరిగిన జమాత్లో పాల్గొన్నారని సమాచారం. రోహింగ్యాలు వలస జీవులు. చాలా కుటుంబాలు పేదరికంలో ఉంటాయి. రంజాన్ సమీపిస్తోన్న నేపథ్యంలో మేవాట్కు వచ్చే భక్తుల నుంచి విరాళాలు ఆశించి వీరంతా వెళ్లి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీరు మేవాట్తోపాటు, నిజాముద్దీన్లో జరిగిన ప్రార్థనలకు సైతం హాజరయ్యారని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. మేవాట్కు నిజాముద్దీన్కు మధ్య దూరం కేవలం 90 కిలోమీటర్లే కావడంతో రెండు చోట్లా వీరు ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకవేళ వీరికి కరోనా సోకి ఉంటే వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో వారిని గుర్తించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. దక్షిణాదిన తెలంగాణలోనే అధికం మనదేశంలో దాదాపు 40,000 మంది రోహింగ్యాలు ఉన్నారని ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి. కానీ, అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా అధికంగానే ఉంటుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వీరు అధికంగా మన దేశంలోని అస్సాం, బెంగాల్, ఢిల్లీ, కశ్మీర్, దక్షిణాదిన తెలంగాణలో ఆశ్రయం పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో కొంతమంది మాత్రమే క్యాంపుల్లో ఉంటున్నారు. వీరిని గుర్తించడం సులువే. కానీ, చాలామంది పాతబస్తీ, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఆక్రమించి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటివారిలో ఎవరెవరు వెళ్లారన్న విషయం గుర్తించడం చాలా కష్టం. ఇప్పటివరకు అందిన సమా చారం మేరకు నల్లగొండలో 14 మంది, హైదరాబాద్ క్యాంపుల్లో ఉంటున్న ఐదుగురి ఆచూకీ తెలియలేదు. ఈ సంఖ్య మరింత అధికంగానే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ ఓ రోహింగ్యా క్యాంపు నడుస్తోంది. అందులో కూడా ఎవరైనా మిస్సయ్యారా? అన్న విషయంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం. -
‘జూమ్’ సేఫ్ కాదు
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం వ్యక్తులు, సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్న ‘జూమ్’ప్లాట్ఫామ్ అంత సురక్షితమైనది కాదని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు అధికారిక సమావేశాల కోసం దీన్ని వినియోగించవద్దని కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) హెచ్చరికను సైబర్ కోఆర్డినేషన్ కేంద్రం గురువారం నిర్ధారించింది. అధికారిక సమావేశాల కోసం అధికారులు ఈ ప్లాట్ఫామ్ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. అలాగే, జూమ్ను వినియోగించే ప్రైవేటు సంస్థ లు, వ్యక్తుల కోసం కొన్ని సూచనలు చేసింది. అవి.. 1. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కాగానే, అడ్మినిస్ట్రేటర్ ‘లాక్ మీటింగ్’ఆప్షన్ను ఆన్ చేయాలి. 2. ప్రతీ మీటింగ్కు కొత్తగా యూజర్ ఐడీని, పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాలి. 3. అడ్మినిస్ట్రేటర్ అనుమతితోనే కొత్త సభ్యులు మీటింగ్లో పాల్గొనేలా ‘వెయిటింగ్ రూమ్’ఆప్షన్ను ఎనేబుల్ చేయాలి -
మర్కజ్ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల పర్యవసానాలు దేశం, రాష్ట్రంపై తీవ్రంగా ప్రభావం చూపిన నేపథ్యంలో వారిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. మర్కజ్ ప్రార్థనల కోసం వచ్చిన విదేశీయులు పలువురు విజిటింగ్ వీసాతో దేశానికి రావడమే కాకుండా, కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతున్నా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి స్థానికులకు కూడా వైరస్ ను వ్యాపింపజేశారు. దీంతో సోమవారమే కేసుల నమోదు ప్రారంభించిన తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి 146 మంది విదేశీయులపై వీసా ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు. వీటిలో హైదరాబాద్లో 84 మంది విదేశీయులపై 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో విదేశీయులకు ఆశ్రయమిచ్చిన వారిపైనా పోలీసులు కేసులు పెట్టారు. విదేశాల నుంచి రాష్రానికి వచ్చిన వారిలో ఇండోనేసియా, కిర్గిస్తాన్, మలేషియా, వియత్నాం, మయన్మార్కు చెందిన వారు ఉన్నారు. వీరందరిలో అత్యధికంగా నల్లగొండలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మంది మయన్మార్, వియత్నాంకు చెందిన 14 మంది ఉన్నారు. వీరికి ఆశ్రయమిచ్చిన వారిపైనా కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో పర్యటించిన 14 మంది ఇండోనేసియన్లతో పాటు, వారికి ఆశ్రయమిచ్చినవారిపైనా కేసులు పెట్టారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో.. విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేగింది. దీనిపై విచారణ ప్రారంభించిన కేంద్ర హోం శాఖ వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. వీరంతా విజిటింగ్ వీసాలపై భారత్కు వచ్చినట్లు గుర్తించిన హోం శాఖ.. వారంతా ఎక్కడెక్కడున్నా రో వెంటనే గుర్తించి, వారి వీసాలు పరిశీ లించాలని ఆదేశించింది. అందులో వీసా, లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలు ఉంటే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మార్చి 16న కరీంనగర్కు వచ్చిన 14 మంది సభ్యులున్న ఇండొనేసియావాసుల వల్ల కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మర్కజ్లో అసలేం జరుగుతోందో తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి విన్నవించింది. -
కీచక జాబితా @ ఐటీఎస్ఎస్ఓ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు నిరోధించే చర్యల్లో భాగంగా కేంద్రం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అలాంటి దారుణాలకు పాల్పడే కీచక జాబితా సిద్ధం చేసి ప్రత్యేక డేటాబేస్ ద్వారా అన్ని రాష్ట్రాలు, ఏజెన్సీలకు అందుబాటులోకి తీసుకొచ్చే పనిలోపడింది. దీనికోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్)కి భిన్నంగా ‘ఇన్వెస్టిగేటింగ్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’(ఐటీఎస్ఎస్ఓ)కు రూపమిస్తోంది. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా ఆ జాబితాలను అప్డేట్ చేసి అందజేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ పరిధిలో నడిచే సీసీటీఎన్ఎస్ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పాత నేరగాళ్ల గత చరిత్రను పోలీసులు తెలుసుకుంటున్నారు. కీచక నేరస్థులు మళ్లీ నేరం చేసి దొరికినపుడు వారి గత చరిత్రను ఎఫ్ఐఆర్, చార్జిషీట్లలో పేర్కొనాలని యోచిస్తోంది. దీనికోసమే ఐటీఎస్ఎస్ఓ అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘దిశ’ ఘటన నేపథ్యంలో.. ‘దిశ’ఘటన నేపథ్యంలో కేంద్రం మహిళలపై అకృత్యాలకు పాల్పడే నిందితులందరికీ ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐటీఎస్ఎస్ఓ పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. హైదరాబాద్ శివారులో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశపై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రంగా ఆగ్రహావేశాలు చెలరేగాయి. తరువాత డిసెంబర్ 6న జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లలో దిశ కేసులో నిందితులు నలుగురు చనిపోయారు. నిందితులు నలుగురు వృత్తిరీత్యా లారీ డ్రైవర్లు, క్లీనర్లు కావడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఎవరైనా మహిళలపై అలాంటి ఘటనలకు పాల్పడ్డారా? అన్న అనుమానాలను సీపీ సజ్జనార్ సైతం వ్యక్తం చేశారు. గతంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు జరగడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరేలా చేసింది. వారి డీఎన్ఏ శాంపిళ్లను కర్ణాటకతోపాటు, ఏపీ తదితర రాష్ట్రాలకు పంపుతామని సైబరాబాద్ పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఐటీఎస్ఎస్ఓనే ఆధారం.. ఈ డేటాబేస్లో ఆడవారిపై అనుచితంగా ప్రవర్తించేవారు, అఘాయిత్యాలకు పాల్పడేవారు, ట్రాఫికింగ్, వ్యభిచారం, కిడ్నాపులు, ఆన్లైన్ వేధింపులకు పాల్పడేవారి జాబితాను పొందుపరుస్తారు. ఇందులో నేరగాళ్ల వేలిముద్రలు, బ్లడ్గ్రూప్, డీఎన్ఏ, పాత నేరాలు, నేర స్వభావం, నేరం చేసే విధానం తదితర విషయాలు రికార్డు చేస్తారు. దేశంలో ఎక్కడ మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా ఘటనాస్థలంలో దొరికిన శాంపిల్స్ను ఇకపై ఐటీఎస్ఎస్ఓకు పంపుతారు. ఒకవేళ నేరస్తుడిని ముందే గుర్తించినా అతని వేలిముద్రలను ఐటీఎస్ఎస్ఓతో పోల్చి చూస్తారు. ఒకవేళ గతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి ఉంటే.. అవి కూడా దర్యాప్తు అధికారికి తెలుస్తాయి. ఫలితంగా దర్యాప్తు వేగంగా పూర్తవుతుంది. పాత నేరస్తుడి గత చరిత్రను చార్జిషీటుతో పాటు కలిపి న్యాయస్థానానికి సమర్పించడంతో నిందితుడికి తక్కువ సమయంలో కఠిన శిక్షలు పడేలా చూడాలన్నది కేంద్రం యోచన. ప్రస్తుతం తెలంగాణ పోలీసుల వద్ద దాదాపుగా 5 లక్షల మందికిపైగా నేరస్తుల వేలిముద్రలు, నేర చరిత్ర వివరాలున్నాయి. వీటిలో రేపిస్టులు, మహిళలను వేధించేవారి వివరాలను వేరు చేసి త్వరలోనే కేంద్రానికి పంపనున్నారు. -
హిమాచల్ గవర్నర్గా దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్ 27వ గవర్నర్గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 10.30కి సిమ్లాలోని రాజ్భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. అంతకుముందు హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా దత్తాత్రేయను నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నతాధికారి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఫైలుపై సంతకం చేసి దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ నూతన గవర్నర్ దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దత్తాత్రేయ కుటుంబసభ్యులతోపాటు, హిమాచల్ప్రదేశ్ మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, జితేందర్రెడ్డి, డీకే అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొని దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. దత్తన్నకు బీజేపీ నేతల అభినందనలు సాక్షి, హైదరాబాద్: సిమ్లాలో హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన దత్తాత్రేయ కు రాష్ట్ర బీజేపీ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, జి.వివేక్, టి.రాజేశ్వరరావు, ధర్మారా వు, సంకినేని వెంకటేశ్వరరావు, కాసం వెంకటేశ్వ ర్లు, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్రెడ్డి, మనోహర్రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. జీవితంలో కొత్త అధ్యాయం: దత్తాత్రేయ హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం తన జీవితంలో కొత్త అధ్యాయంగా భావిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 35 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న తాను ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేశానని, ఇప్పుడు దక్కిన ఈ రాజ్యాంగబద్ధమైన పదవి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. దైవభూమిగా పేరుగాంచిన హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసే అవ కాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
తెరపై మరోసారి చెన్నమనేని పౌరసత్వ వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మరోసారి సమీక్ష చేయాలని చేయాలని జూలై 10న హైకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఈ అంశాన్ని తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ మరోసారి కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని హోశాఖలో అప్పీల్ చేశారు. (చదవండి : చెన్నమనేని రమేశ్కు హైకోర్టు ఊరట) -
‘ప్రత్యేక హోదా’ను ఆర్థిక సంఘానికి నివేదించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వర్తింపచేయాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 26, 2019న కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని, దీన్ని 15వ ఆర్థిక సంఘం పరిశీలనకు పంపామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ అంశం ముగిసిన అధ్యాయమని చెబుతూ వచ్చిన కేంద్రం తాజాగా ఈ అంశాన్ని 15వ ఆర్థిక సంఘానికి నివేదించామని చెప్పడం కీలకమలుపుగా భావించవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అడిగిన పలు ప్రశ్నలకు మంగళవారం కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. తాజాగా మే 26న ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నుంచి వచ్చిన అభ్యర్థనను 15వ ఆర్థిక సంఘం పరిశీలనకు పంపాం..’ అని పేర్కొన్నారు. సమాధానాన్ని కొనసాగిస్తూ.. ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాలకు మధ్య 14వ ఆర్థిక సంఘం వ్యత్యాసం చూపలేదని, తద్వారా ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని పేర్కొన్నారు. అయితే నీతిఆయోగ్ సిఫారసుల మేరకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తున్నట్టు తెలిపారు. -
అల్లర్లకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: అధికారాంతమున తెలుగుదేశం పార్టీ బరి తెగిస్తోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు, అలజడులు రేపేందుకు పన్నాగం పన్నుతోంది. శాంతిభద్రతల సమస్యలు సృష్టించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడాలన్నదే ఆ పార్టీ లక్ష్యం. టీడీపీ కుట్రను కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో అసలు బండారం బట్టబయలైంది. ఈ మేరకు టీడీపీ కుతంత్రంపై కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ) కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేసింది. దాంతో ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఐబీ వర్గాల సమాచారం ప్రకారం.. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు టీడీపీ పక్కాగా పన్నాగం పన్నింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని అధికారులు, సిబ్బందితో టీడీపీ ఏజెంట్లు కుమ్మక్కయ్యేందుకు వ్యూహం పన్నారని ఐబీ గుర్తించింది. తద్వారా వీవీ ప్యాట్లోని స్లిప్పులను గల్లంతు చేయడం టీడీపీ ఏజెంట్ల అసలు ఉద్దేశం. అందుకోసం అవసరమైతే వీవీ ప్యాట్ స్లిప్పులను నమిలి మింగేయాలని కూడా టీడీపీ అధిష్టానం తమ ఏజెంట్లకు నిర్దేశించినట్లు సమాచారం. అనంతరం ఈవీఎంలోని ఓట్లకు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులకు మధ్య తేడా ఉందని టీడీపీ ఏజెంట్లే లెక్కింపు కేంద్రాల్లో ఆందోళనకు దిగుతారు. అప్పటికే బయట ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంటనే ఆందోళనలను ఉధృతం చేస్తారు. ఆ వెనువెంటనే దాడులకు దిగుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద భయోత్పాతాన్ని సృష్టిస్తారు. తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కల్పించి ఏకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను అడ్డుకోవడమే వారి లక్ష్యం. ఇక టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందన్న అంచనా ఉన్న నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాల వద్దకు వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించకూడదని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. అందుకోసం కొందరు రిటర్నింగ్ అధికారులతో టీడీపీ కుమ్మక్కైంది. వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఓడిపోతుందని స్పష్టమవుతున్న నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్ద మరింతగా బరి తెగించాలని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. ఆ కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఎంతకైనా తెగించాలని తమ శ్రేణులకు టీడీపీ నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకోవాలన్నది టీడీపీ కుతంత్రం. అందుకోసం పెద్దఎత్తున దాడులకు తెగబడేందుకు టీడీపీ సంఘ విద్రోహ శక్తులను ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ముందస్తుగానే మోహరిస్తోందని ఐబీ నివేదించింది. సున్నిత నియోజకవర్గాలివీ... టీడీపీ అల్లర్లు, అలజడులు సృష్టించే అవకాశాలున్న నియోజకవర్గాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఐబీ నివేదించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అల్లర్లకు ఆస్కారం ఉన్న నియోజకవర్గాలు ఇవీ... అనంతపురం: తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ, పెనుకొండ, హిందూపూర్ కర్నూలు: ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆదోని, డోన్, పత్తికొండ వైఎస్సార్: జమ్మలమడుగు, మైదుకూరు, రైల్వే కోడూరు, కమలాపురం, కడప చిత్తూరు: తంబళ్లపల్లె, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి నెల్లూరు: నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కొవ్వూరు, ప్రకాశం: చీరాల, అద్దంకి, కొండేపి, కనిగిరి గుంటూరు: పెదకూరపాడు, సత్తెనపల్లి, మంగళగిరి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట కృష్ణా: మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, గన్నవరం, గుడివాడ పశ్చిమ గోదావరి: దెందులూరు, ఏలూరు, తణుకు, ఆచంట తూర్పు గోదావరి: కొత్తపేట, రామచంద్రాపురం, కాకినాడ రూరల్, అమలాపురం విశాఖపట్నం: భీమిలి, గాజువాక, పెందుర్తి విజయనగరం: బొబ్బిలి, చీపురుపల్లి శ్రీకాకుళం: నరసన్నపేట, ఆమదాలవలస అప్రమత్తంగా ఉండండి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును మొదట పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈవీఎంలను సురక్షితంగా మళ్లీ భద్రపర్చాలని సూచించింది. ఆ తరువాతే వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. అసాంఘిక, అనధికార వ్యక్తులు ఎవరూ లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా టీడీపీ అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నిందన్న నిఘా వర్గాల సమాచారం అధికార వర్గాలను ఆందోళన పరుస్తోంది. -
విభజన చట్టం అమలుపై కేంద్రం సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చ ట్టంలోని నిబంధనల అమలుపై కేంద్రహోంశాఖ సమీక్షించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్ చౌహాన్ అధ్యక్షతన జరిగి న సమావేశంలో వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాలొ ్గన్నారు. తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి కె.రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్(ఎఫ్ఏసీ) వేదాంతంగిరి హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్కుమార్ప్రసాద్, పురపాలన శాఖ ముఖ్య కార్య దర్శి ఆర్.కరికాల వళవన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పునర్ వ్యవస్థీకరణ వ్యవహారా ల ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమ్చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ పాల్గొన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం పరిధిలో ఏపీ, తెలంగాణ కేంద్రం అమలు చేయాల్సిన అంశా లపై రెండు రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చిం చారు. చట్టంలో 13వ షెడ్యూల్లో పొందుపరిచిన మౌలిక వసతుల నిబంధనల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు తమ రాష్ట్రానికి సంబంధించి ఆరు అంశాలను హోంశాఖ దృష్టికి తీసుకొచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన గిరిజన యూనివ ర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే ఉద్యానవన విశ్వవిద్యాల య స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాలను అనుసం ధానిస్తూ రహదారుల నిర్మాణం చేపట్టాలని నివేదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చర్చించిన అంశాలు పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13లో పొందుపరిచిన అంశాల్లో జాతీయస్థాయి సంస్థల సత్వర నిర్మాణానికి వేగవంతంగా నిధులు విడుదల చేయాలని, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్రం చొరవ చూపాలని, విశాఖప ట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ స్థాపన అంశంలో పురోగతి లేదని ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు నివేదిం చారు. తిరుపతి విమానాశ్రయ ఆధునీకరణ పనులు, విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవం తంగా సాగడం లేదని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకొచ్చారు. -
నగరంపై ఎన్ఐఏ నిఘా
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్పై భారత వాయుసేన సర్జికల్ దాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా కీలక, సున్నిత ప్రాంతమైన తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్లో పోలీసులు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచారు. మంగళవారం పలు ప్రాంతాల్లో కార్డన్సెర్చ్ నిర్వహించిన పోలీసులు.. బుధవారం మాత్రం కేవలం తనిఖీలకే పరిమితమయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామంటున్న పోలీసులు.. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లోని 3 కమిషనరేట్లతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరో 6 కమిషనరేట్లలోనూ ఎప్పటికపుడు నివేదికలు డీజీపీ కార్యాలయానికి, ఐబీకి అందజేస్తున్నారు. అనుమానితుల కోసమే..: కేంద్ర నిఘా వర్గాలు తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో.. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు నగరంలో సంచరిస్తున్నారు. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో వీరి నిఘా పెరిగింది. స్లీపర్ సెల్స్పై పూర్తి సమాచారం లేకున్నా.. నగరంలోని కొందరు ఉగ్రమూకలకు ఆర్థికసాయం చేస్తున్నారన్న విషయం వెలుగుచూడటంతో ఎన్ఐఏ రంగంలోకి దిగినట్లు సమాచారం. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూనే వారి పనివారు చేసుకెళ్తున్నారు. నగరంలో ఉగ్రసానుభూతిపరులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎన్ఐఏ నిఘా వేసినట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు డీజీపీ కార్యాలయంతో అనుసంధానమై పనిచేస్తున్నారు. తనిఖీ చేశాకే అనుమతి నగరంలోని పలు ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. పౌర, సైనిక విమానాశ్రయాల వద్ద భద్రత రెట్టింపు చేశారు. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. బాంబు స్క్వాడ్లను అందుబాటులో ఉంచారు. మంగళవారం రాత్రి పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక నగరంతోపాటు ఉత్తర తెలంగాణలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో వాహన తనిఖీలు, రాత్రిపూట గస్తీని ముమ్మురం చేశారు. గురువారం కూడా కార్డన్ సెర్చ్లు, వాహన తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. -
మత ఘర్షణల్లో 1,605 మంది మృతి
నోయిడా: భారత్లో 2004 నుంచి 2017 వరకు జరిగిన 10,399 మత ఘర్షణల్లో ఏకంగా 1,605 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,723 మంది గాయాలపాలయ్యారు. సమాచార హక్కు చట్టం కింద నోయిడాకు చెందిన ఐటీ ఉద్యోగి, ఆర్టీఐ కార్యకర్త అమిత్ గుప్తా అభ్యర్థించిన మేరకు కేంద్ర హోంశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఒక్క 2008లోనే అత్యధికంగా 943 మతసంబంద కేసులు నమోదయ్యాయని, ఆ ఏడాదిలోనే అధికంగా 167 మంది చనిపోయారని కేంద్రం పేర్కొంది. అత్యంత తక్కువ మత కేసులు 2011లో నమోదయ్యాయి. ఆ ఏడాదిలో 91 మంది మరణించారని, 1,899 మంది గాయపడ్డారని తెలిపింది. 2017లో 822 కేసులు నమోదవగా, ఆ ఏడాది ఘర్షణల్లో 111 మంది చనిపోయారు. -
అనుమతి తీసుకున్నాకే పౌరులపై నిఘా
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకున్నాకే పౌరుల కంప్యూటర్లపై నిఘా పెట్టాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో ఏ విచారణ సంస్థకూ సంపూర్ణ అధికారాలు అప్పగించలేదన్నారు. 2009లో తెచ్చిన నిబంధనల మేరకే ఈ నిఘా కొనసాగుతోందనీ, వీటిలో చిన్నమార్పు కూడా చేయలేదన్నారు. పౌరుల కంప్యూటర్లలోని సమాచారంపై నిఘాతో పాటు డీక్రిప్ట్ చేసే అధికారాన్ని 10 ప్రభుత్వ సంస్థలకు అప్పగించడంపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. -
ఒకే చోట.. నేరస్తుల డేటా
సాక్షి, హైదరాబాద్: క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో ఇక కేంద్ర దర్యాప్తు బృందాలు కూడా భాగం కానున్నాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)తోపాటు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసే అధికారం ఉన్న ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు తమ వద్ద ఉన్న నేరస్తుల సమాచారాన్ని సీసీటీఎన్ఎస్లో పొందుపర్చనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ.. ఎవరు.. ఏ నేరం చేసినా.. వాటి వివరాలు, ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు అన్నీ సీసీటీఎన్ఎస్లో అందుబాటులో ఉండనున్నాయి. నేర సమాచారాన్ని ఒకే వ్యవస్థ కింద మార్పిడి చేసుకునేలా సీసీటీఎన్ఎస్ వేదికను ఈ–గవర్నెన్స్ ద్వారా 2009లో కేంద్రం రూపొందించింది. ఇప్పటివరకు సీసీటీఎన్ఎస్లో రాష్ట్రాల పోలీస్ శాఖలు మాత్రమే స్టేక్ హోల్డర్లుగా ఉంటూ వచ్చాయి. తాజాగా ప్రత్యేక దర్యాప్తు సంస్థలను కూడా సీసీటీఎన్ఎస్లో డేటా అప్లోడ్ చేసేలా ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవడంతో నేరస్తుల సమాచారం మొత్తం ఒకే చోట లభించనుంది. సమస్తం.. సీసీటీఎన్ఎస్లోకి.. సీబీఐ, ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కేసులు, నేరస్తుల సమస్త సమాచారాన్ని సీసీటీఎన్ఎస్లోకి అప్లోడ్ చేయనున్నాయి. అలాగే రాష్ట్రాల్లోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఫారెస్ట్ విభాగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లాంటి ప్రత్యేక యూనిట్లు సైతం కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ డ్యాష్బోర్డులో పొందుపర్చాల్సి ఉంటుంది. సీసీటీఎన్ఎస్ ద్వారా మొత్తం 18 రకాల నివేదికలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎఫ్ఐఆర్, కేసు డైరీ, చార్జిషీట్, కోర్టు తీర్పులు, కోర్టు కొట్టివేత కేసులు, నిందితుల హిస్టరీ షీట్స్తో తదితర వివరాలు ఉంటాయి. దీని ద్వారా ఎక్కడ నేరం జరిగినా సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వివరాలు డేటా బేస్లో క్షణాల్లో దొరికిపోతాయి. అదే విధంగా ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు సైతం డేటా బేస్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు అమలులో తెలంగాణ రెండో స్థానంలో కొనసాగుతూ వస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లలో అత్యాధునిక కంప్యూటర్ల ద్వారా ఎఫ్ఐఆర్, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ద్వారా తెలంగాణ పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. -
ఎనిమీ భూముల వేలం?
సాక్షి, హైదరాబాద్ : యుద్ధ సమయంలో దేశం విడిచి వెళ్లి శత్రు దేశాల్లో స్థిరపడినవారి భూముల (ఎనిమీ ప్రాపర్టీస్)ను వేలం వేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక అందజేయాలని కోరుతూ గత నెల లో రాష్ట్రానికి లేఖ రాసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రజనీ సిబల్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి రాసిన లేఖలో ఎనిమీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఆ భూముల స్థితిగతులేంటి? ఆక్రమణలున్నా యా? అసలు మొత్తం భూములెన్ని? ఖాళీగా ఉన్న భూములెన్ని? వాటి విలువ ఎంత? వంటి వివరాలతో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన వాల్యుయేషన్ కమిటీలతో నిర్ధారణ చేయించాలని కోరినట్టు సమాచారం. కేంద్రం లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ భూములు 490 ఎకరాల వరకు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 100 ఎకరాలను మెట్రో రైలుకు కేటాయించారు. కొన్ని భూములు కబ్జా అయ్యాయి. 2017 మార్చి 14న అమల్లోకి వచ్చిన ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్– 1968(సవరణ) చట్టం ప్రకారం ఎనిమీ భూములపై సర్వాధికారాలు కేంద్రానికి సంక్రమించాయి. దీంతో మియాపూర్ భూము ల్లో ఖాళీగా ఉన్న 100 ఎకరాలను సీఆర్పీఎఫ్కు కూడా కేటాయించింది. మొత్తం మీద ఈ నెలాఖరు కల్లా ఎనిమీ భూముల వివరాలతో నివేదిక పంపా లని కేంద్రం ఆదేశించడంతో రాష్ట్ర యంత్రాంగం ఆ నివేదిక తయారీలో నిమగ్నం కావడం గమనార్హం. రూ.5 వేల కోట్లపై మాటే ఎనిమీ భూములకు బహిరంగ మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఆ భూములను వేలం వేస్తే వచ్చే ఆదాయంలో రాష్ట్రా నికి కూడా వాటా ఉంటుంది. కస్టోడియన్ హోదాలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎనిమీ భూముల్లో రాష్ట్రానికి కూడా వాటా దఖలు పడుతుంది. అయితే, వీటిని వేలం వేస్తారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
రేప్ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కిట్లు
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో విచారణను త్వరితగతిన పూర్తిచేసేందుకు వీలుగా కేంద్ర హోంశాఖ లైంగికదాడి సాక్ష్యాల సేకరణ కిట్ల(ఎస్ఏఈసీకే)ను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటి సాయంతో నేరం జరిగిన చోట రక్తం, వీర్యం నమూనాలను సేకరిస్తారని వెల్లడించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా రూ.79.2 లక్షల వ్యయంతో 3,960 ఎస్ఏఈసీకే కిట్లను కొనుగోలు చేస్తారు. తొలిదశలో ఒక్కోరాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి 100 కిట్లను అందజేస్తామనీ, క్రమంగా ఒక్కో పోలీస్స్టేషన్కు మూడు కిట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
తుపాకీ లైసెన్సుదారుల డేటాబేస్
న్యూఢిల్లీ: దేశంలో తుపాకీ లైసెన్స్లు కలిగిన వారందరికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించి వారి పేర్లతో జాతీయ స్థాయిలో డేటాబేస్ను రూపొందించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వచ్చే ఏప్రిల్ కల్లా ఈ డేటాబేస్ అందుబాటులోకి వస్తుందంది. ఏప్రిల్ నుంచి అధికారులు కొత్తగా లైసెన్సులు జారీచేసేటప్పుడు లేదా పాత లైసెన్సును పునరుద్ధరించేటప్పుడు ఆయుధం యజమాని వివరాలను ఈ డేటాబేస్లో నమోదు చేయాల్సిందేనని వెల్లడించింది. -
‘సాక్ష్యం’ సురక్షితం!
సాక్షి, హైదరాబాద్: నేరం చేసిన వారికి శిక్షపడాలి.. ఇది న్యాయసూత్రం. కానీ చాలా మంది నేరస్తులకు తగిన శిక్షలు పడటం లేదు. ఆయా కేసుల్లో సరైన ఆధారాలు సేకరించలేకపోవడంతోపాటు ప్రత్యక్ష సాక్షులు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు కూడా. నేరస్తులు ఏమైనా చేస్తారోనన్న భయం, వారి బెదిరింపులు వంటివాటితో సాక్షులు సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో కీలక కేసుల్లో సాక్షుల రక్షణ కోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు నల్సార్ యూనివర్సిటీ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంయుక్తంగా ‘విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్’పేరిట దీనికి రూపకల్పన చేస్తున్నాయి. సాక్షులకు భద్రత కల్పించడం, అవసరమైతే ఇతర ప్రాంతాలకు తరలించడం, బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం, భద్రతకు, తగిన ఏర్పాట్ల కోసం నిధులు కేటాయించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. సాక్ష్యం చెప్పడం హక్కుగా, సాక్షిని కాపాడుకోవడం, గౌరవం కల్పించడం బాధ్యతగా, వారు దర్యాప్తుకు సహకరించేలా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని ఈ చట్టం ముసాయిదాలో పేర్కొన్నారు. మూడురకాలుగా గుర్తిస్తారు తీవ్రమైన నేరాల్లో సాక్షులకు భద్రత, వారికి అందజేయాల్సిన సహాయ సహకారాలను మూడు కేటగిరీలుగా పర్యవేక్షించాల్సి ఉంటుందని ‘ప్రొటెక్షన్ స్కీమ్’లో పేర్కొన్నారు. కేటగిరీ–ఏ కింద ఏదైనా కేసులో సాక్ష్యం చెబుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబంలో జీవితాంతం ప్రమాదం ఉన్నవారు ఉంటారు. కేటగిరీ–బీలో కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో హాని ఉండే సాక్షులను చేరుస్తారు. కేటగిరీ–సీ కింద పోలీసుల దర్యాప్తు దశలో ఉన్నప్పుడే బెదిరింపులు రావడం, హాని కలిగించడం, సమాజంలో తిరగనీయకుండా చేయడం వంటివి ఎదుర్కొన్న సాక్షులను చేరుస్తారు. సాక్షులకు ఈ కేటగిరీలను బట్టి భద్రత కల్పిస్తారు. నిధుల కోసం ప్రత్యేక ఫండ్ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో కొన్ని నిధులను కేటాయించడం, స్వచ్చంద సంస్థల నుంచి నిధులు సేకరించడం, కోర్టుల్లో డిపాజిట్ రూపంలో వచ్చే నిధి నుంచి కొంత మొత్తాన్ని ఈ ఫండ్కు జమచేయడం వంటివి చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ ఏడాది నుంచే అమలు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం రూపొందిస్తున్న ఈ చట్టాన్ని ఈ ఏడాదే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ ముసాయిదాలో పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని అంశాలను జత చేయడం లేదా అనవసరమైన వాటిని తొలగించడం పూర్తి చేసి.. తుదిరూపు దిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చేపట్టనున్న భద్రతా చర్యలివీ.. - కేసు దర్యాప్తు లేదా కోర్టు విచారణ సమయంలో నిందితులకు, సాక్షులు నేరుగా (ఫేస్ టు ఫేస్) కనిపించకుండా ఏర్పాట్లు చేయడం. - సాక్షులతోపాటు నేరస్తుల మెయిల్స్, ఫోన్ కాల్స్ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం. - సాక్షికి సంబంధించిన ఫోన్ నంబర్లు మార్చడంతోపాటు సంబంధిత టెలికం సంస్థకు తీవ్రత వివరించి నంబర్ను అన్లిస్ట్ చేయడం. - సాక్షి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, సెక్యూరిటీ డోర్స్, అలారం, ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేయడం. - వారి గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు మరో పేరుతో బయట తిరిగేలా ఏర్పాట్లు. - సాక్షుల నివాసం పరిసరాల్లో 24 గంటలూ పెట్రోలింగ్ చేపట్టి భద్రత కల్పించడం. - అవసరమైతే సాక్షులను వారి దూరపు బంధువుల ఇంటికి లేదా మరో రక్షణ గృహానికి తాత్కాలికంగా తరలించడం. - కోర్టులో వాంగ్మూలం లేదా విచారణ ఉన్న సమయంలో పోలీసు భద్రత నడుమ ప్రత్యేక వాహనంలో చేర్చడం. - సాక్షులను కోర్టు వరకు తీసుకువచ్చి, తిరిగి సురక్షిత ప్రదేశానికి తరలించడం ప్రమాదకరమని భావిస్తే... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేలా ఏర్పాట్లు. - ఇన్కెమెరా ట్రయల్స్కు సిఫారసు చేయడం. - తీవ్రత ఎక్కువ కల్గిన నేరాలపై రోజువారీగా త్వరితగతిన దర్యాప్తు, విచారణ చేపట్టడం. - సాక్షుల జీవన ప్రమాణాలకు ఇబ్బంది కలిగినప్పుడు వారికి ఆర్థిక సహాయం లేదా మరో వృత్తిలో నిలదొక్కుకునేలా నిధులను ఇప్పించడం. - ‘విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్’ను అక్రమ మార్గానికిగానీ, ఎలాంటి హానీ లేకున్నా భద్రత కోసం దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే.. వారికోసం చేసిన ఖర్చును తిరిగి వసూలు చేస్తారు. లీగల్ సెల్ అథారిటీ నేతృత్వంలో.. ఏదైనా కేసులో సాక్ష్యం చెబితే తనకు ప్రమాదకరమని భావించిన వ్యక్తులు జిల్లాస్థాయిల్లోని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీలను, రాష్ట్ర స్థాయిలో అయితే స్టేట్ లీగల్ సెల్ అథారిటీలను సంప్రదించి.. రక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అథారిటీలు ఈ దరఖాస్తులను పోలీస్ కమిషనర్లు/జిల్లా ఎస్పీలకు సిఫార్సు చేస్తాయి. సంబంధిత కేసుల్లో బెదిరింపులు, సాక్షులకు హాని కలిగించే అంశాలపై నివేదిక తెప్పించుకుని.. పోలీసు–లీగల్ సెల్ సంయుక్తంగా చర్యలు చేపడతాయి. సాక్షులకు భద్రత కల్పించేలా అథారిటీలు మానిటరింగ్ చేస్తాయి. ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చేందుకు విట్నెస్ ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేయనున్నారు. -
ప్రధాని భద్రతపై రాజ్నాథ్ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై హత్యకు కుట్ర జరుగుతోందన్న సమాచారంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం హోం శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రికి కల్పిస్తున్న భద్రత ప్రమాణాలు, పెంచాల్సిన ఆవశ్యకతను అధికారులతో చర్చించారు. భీమా-కోరేగావ్ ఘటనలో నిందితులైన వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న లేఖల్లో మోదీ హత్యకు కుట్ర జరుగుతోందన్న విషయాలను పోలీసులు బయటపెట్టారు. కాగా భీమా-కోరేగావ్లో దళితులకు, హిందూత్వవాదులకు మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఒకరు మరణించగా చాలా మంది గాయపడ్డారు. భీమా-కోరేగావ్ ఘటనలో ప్రధాన నిందితుడై మిలింద్ ఎక్బోతేను గత నెలలో పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లు చెలరేగడంలో కారణమైన దళిత నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిలో రోనా విల్సన్ వద్ద దొరికిన లేఖల్లో ప్రధాని మోదీ హత్యకు సంబంధించి కుట్ర బయటపడిన విషయం తెలిసిందే. -
చెన్నమనేని పౌరసత్వ రద్దుపై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ శాసనసభ్యు డు చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం చెల్లదన్న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను నిలిపేస్తూ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను జూన్ 8 వరకు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామ మూర్తి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. చెన్నమనేని పౌరసత్వం చెల్లదని గత ఆగస్టు 31న కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నందున నిర్ణయం వెలువడే వరకూ అమలు నిలిపేయాలని డిసెంబర్ 13న హైకోర్టును చెన్నమనేని ఆశ్రయించగా కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కాగా, తాను తప్పుడు పద్ధతుల్లో పౌర సత్వం పొందినట్లు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారని చెన్నమనేని తన వ్యాజ్యం లో ఆరోపించారు. దాని ఆధారంగా తనను కేసులో ప్రతివాది చేయాలని శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాస్ను ప్రతివాదుల జాబితాలో చేర్చాల ని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. ఖర్చుల నిమిత్తం రూ.3 వేలు చెల్లించాలని చెన్నమనేనిని ఆదేశించారు. విచారణ జూన్కు వాయిదా పడింది. -
అసెంబ్లీ సీట్ల పెంపుపై ఈసీ కొర్రీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం కొర్రీలు వేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారంలో స్పష్టత లేదంటూ పలు అంశాలను లేవనెత్తింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి సుమిత్ ముఖర్జీ రెండు నెలల క్రితమే కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల పరిధిపై స్పష్టత ఇచ్చేందుకు సరిపడే సమాచారం లేదని లేఖలో ఈసీ ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలంటూ కేంద్రం గతంలో ఈసీకి వర్కింగ్ పేపర్లను పంపింది. రాష్ట్రంలో 119 స్థానాలను 153కు, ఏపీలో 175 స్థానాలను 225కు పెంచాలని విభజన చట్టంలో పొందుపరిచారు. తదనుగుణంగా ఏపీ రీ ఆర్గనైజేషన్ (రిమూవల్ ఆఫ్ డిఫీకల్టీస్) ఆర్డర్–2015ను కేంద్ర హోం శాఖ ప్రచురించింది. అందులో ప్రస్తావించిన ప్రతిపాదనలను ఈసీ తప్పుబట్టింది. పెరిగే అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాల సంఖ్యను నిర్ణయించాల్సి ఉంటుందని ప్రస్తావించింది. ‘‘అలా ఎస్సీ, ఎస్టీ స్థానాలను నిర్దేశించేందుకు అసెంబ్లీ పరిధి అత్యంత కీలకం. ప్రభుత్వం నుంచి అందిన సమాచారంలో మరింత స్పష్టత కావాలి’’అంటూ పలు అంశాలను ఉటంకించింది. విభజన సమయంలో రంపచోడవరం, పోలవరం, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు తెలంగాణ, ఏపీ మధ్య అటువిటుగా చెల్లాచెదురయ్యాయి. కొన్ని రెండు రాష్ట్రాల పరిధిలో విస్తరించటం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో నాలుగు అంశాలను ఈసీ ప్రధానంగా లేఖలో ప్రస్తావించింది. ఏపీలోని రంపచోడవరంలో నెల్లిపాక మండలం ఉన్నట్టుగా ప్రతిపాదనలు అందాయని, పునర్విభజనతో నెల్లిపాక మండలం ప్రభావితమైనట్లు చట్టంలో లేదంటూ ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కారణంగా రంపచోడవరంలో ఏయే ప్రాంతాలుండాలో కచ్చితంగా నిర్ణయించలేని పరిస్థితి నెలకొందని రిమార్కు రాసింది. ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు మండలం ఉమ్మడి రాష్ట్రంలో పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. విభజన నేపథ్యంలో ఈ మండలంలోని ఆరు గ్రామాలు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. కానీ వాటిని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చాలనేది హోం శాఖ ప్రచురించిన ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదని ఈసీ అభ్యంతరం వెలిబుచ్చింది. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో భద్రాచలం మండలంలోని కొన్ని ప్రాంతాలు విభజన సందర్భంగా ఏపీలో చేరాయి. వాటిని కొత్తగా ఏ అసెంబ్లీ స్థానం పరిధిలో చేర్చాలో కూడా హోం శాఖ ఉత్తర్వుల్లో పేర్కొనలేదంది. ఇన్ని సందిగ్థతలున్నందున ఎస్టీ స్థానాలు, వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలను స్పష్టంగా నిర్ధారించలేని పరిస్థితి ఉందని ఈసీ అభిప్రాయపడింది. అందుకే మరింత స్పష్టతతో వెంటనే సమాచారమివ్వాలంటూ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ రెండు నెలల కింద లేఖలు రాసింది. తాజాగా ఏప్రిల్ 19న ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మరో లేఖ కూడా రాసింది. -
పోస్టింగ్ ఇవ్వక.. జీతం అందక..
సాక్షి, హైదరాబాద్: వారు సీనియర్ ఐపీఎస్లు.. సీనియర్ ఎస్పీ నుంచి అదనపు డీజీపీ హోదా వరకు పనిచేస్తున్నారు. కానీ ఏం లాభం 5 నెలలుగా జీతాల్లేకుండా ఖాళీగా ఉన్నారు. అదేం టని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజం. రాష్ట్ర క్యాడర్కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు గత అక్టోబర్లో కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చి రిపోర్ట్ చేశారు. సాధారణంగా రిపోర్టు చేసిన వారం, పది రోజుల్లో పోస్టింగ్ కల్పిస్తారు. కానీ ప్రభుత్వం వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. 5 నెలలు గడిచిపోయాయి. ఏం చేయాలో తెలియదు? ఎక్కడ కూర్చో వాలో తెలియదు? జీతం రాదు.. మరి ఏం చేసేది. చివరికి ఆ అధికారులు డీజీపీ కార్యాలయానికి రావడమే మానేశారు. అప్పుడు.. ఇప్పుడు బదిలీలు అంటూ వచ్చే వార్తలతో డీజీపీ కార్యాలయానికి రావడం.. తోటి బ్యాచ్ అధికారుల గదిలో కొద్దిసేపు కూర్చుని వెళ్లిపోవడం.. ఇది పరిస్థితి. మరోవైపు ఆదిలాబాద్ ఉట్నూర్ ఘటనలో కరీంనగర్ డీఐజీ, ఆదిలాబాద్ ఎస్పీ.. డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేశారు. వీరు కూడా 2 నెలలుగా వెయిటింగ్లోనే ఉన్నారు. వీరికి జీతాల్లేవు. పోస్టింగ్ లేదు.. ఆఫీస్ లేదు. ఇక శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ముగ్గురు ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులకూ పోస్టింగ్స్లు లేవు. వీరి పరిస్థితీ అంతే. ఎందుకింత నిర్లక్ష్యం కొత్త రాష్ట్రం, పైగా టెక్నాలజీ, ఆధునీకరణ కార్యక్రమాలు, ఇతరత్రా పనులను సవాలుగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ప్రతీ అధికారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోగలగాలి. కానీ ఇలా ఐపీఎస్ అధికారులను వెయిటింగ్లో పెట్టడం ఏంటని మిగతా ఐపీఎస్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఐపీఎస్ అధికారులు తక్కువగా ఉన్నారని, మరికొంత మందిని కేటాయించాలని కేంద్ర హోంశాఖను కోరిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇంతమందిని వెయిటింగ్లో పెట్టడం ఏంటని ఐపీఎస్లకు ఆక్రోశాన్ని కలిగిస్తోంది. పోనీ అధికారులకు సరిపడా పోస్టులు లేవా అంటే అదీ కారణం కాదు. ప్రస్తుతం ఒక్కో సీనియర్ ఐపీఎస్ అధికారి 2 బాధ్యతలను అదనంగా నిర్వహిస్తున్నారు. వెయిటింగ్లో ఉన్న వారిని అక్కడ నియమించి పనిభారం తగ్గించవచ్చు. కానీ ఆ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో పోస్టింగ్ ఇవ్వని వ్యవహారంపై ఐపీఎస్ల్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. -
కువైట్.. స్వదేశానికి రైట్ రైట్!
సాక్షి, హైదరాబాద్: కువైట్లోని అక్రమ నివాసితుల కోసం అక్కడి ప్రభుత్వం సరికొత్త అవకాశం కల్పించింది. ఎలాంటి జరిమానాలు లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా జరిమానా చెల్లించి వీసా గడువు పొడిగించుకునే వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ఆ దేశ హోం శాఖ అమ్నెస్టీ డిక్రీ 64/2018ని జనవరి 23న విడుదల చేసింది. ఇది జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఈ డిక్రీ ఆధారంగా అక్కడ అక్రమంగా నివసిస్తున్న వారు సురక్షితంగా దేశం విడిచి వెళ్లొచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. కువైట్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అక్కడ ఉంటున్న భారతీయులు ఉపయోగించుకోవచ్చు. జరిమానా కట్టి తమ నివాసాన్ని చట్టబద్ధం చేసుకోవడమో లేదా తిరిగి స్వదేశం రావడమో చేయొచ్చు. ఇందుకోసం భారత రాయబార కార్యాలయం లేదా తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగంలోని ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను సంప్రదించవచ్చని తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ వ్యవహారాలు చూసే ఓ అధికారి మీడియాకు తెలిపారు. జరిమానా లేకుండానే.. - కువైట్లో అక్రమ నివాసితులు, వీసా ముగిశాక ఉంటున్న వారు ఎలాంటి అనుమతి, జరిమానా లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్లవచ్చు. ఇలాంటి వారు మళ్లీ సరైన పత్రాలతో, అన్ని అనుమతులతో తిరిగి కువైట్కు వెళ్లొచ్చు. అక్రమ నివాసితులు, వీసా ముగిశాక ఉంటున్న వారు కావాలనుకుంటే తగిన జరిమానా చెల్లించి వీసా పొడిగించుకుని అక్కడే ఉండిపోవచ్చు. - రెసిడెన్సీ నిబంధనలు ఉల్లఘించి నిషేధానికి గురైన వారు, కోర్టు కేసులున్న వారు ఇప్పుడు రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తమకు వీసా వచ్చే అవకాశం ఉందేమో చర్చించుకోవాల్సి ఉంటుంది. - క్షమాభిక్ష కాలం ముగిశాక మాత్రం ఈ ఉత్తర్వులు చెల్లవు. క్షమాభిక్ష సమయంలో దొరికిన వారిని వెంటనే ఆయా దేశాలకు తరలిస్తారు. ఈ సమయంలో దేశం విడిచి పెట్టని వారిపై జరిమానా విధిస్తారు. వారికి వీసా ఇవ్వకుండా, స్వదేశం పంపించేస్తారు. వారు తిరిగి కువైట్ రాకుండా నిషేధిస్తారు. నిబంధనలు తెలీక జైలు పాలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణం. అక్కడ ఇళ్లల్లో సహాయకులుగా, వివిధ కంపెనీల్లో కార్మికులుగా, పశువుల కాపర్లుగా, నిర్మాణ రంగంలో పని చేయడానికి పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. అయితే సరైన వీసా లేకపోవడం, యాజమాన్యంతో విబేధాలొచ్చి బయటకు వచ్చే వాళ్ల సంఖ్యా ఎక్కువే. కువైట్ వెళ్లే వారికి వివిధ పనుల కోసం భిన్నరకాల వీసాలు ఇస్తుంటారు. వాటిని కాదని వేరే పనులకు వెళ్లకూడదు. అంటే ఇంట్లో సహాయకులుగా పని చేయడానికి వెళ్లిన వారు, అక్కడ ఇబ్బంది ఎదురై ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే వారిని నేరుగా వేరే పనిలో పెట్టుకోకూడదు. కానీ చాలా మందికి దీనిపై అవగాహన లేక పొరపాట్లు చేస్తుంటారు. తెలిసో తెలియకో కొందరు వీసా నిబంధనలు ఉల్లంఘిస్తారు. ఇంకొందరి విషయంలో యాజమాన్యాలు పాస్పోర్టు, వీసా తమ దగ్గర ఉంచేసుకుని వారికి తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాయి. దీనికితోడు పాస్పోర్టు, వీసా కాల పరిమితి ముగిసిపోవడం మరో సమస్య. దాక్కున్న వారిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటుంది. చట్ట వ్యతిరేకంగా ఉంటున్న వారు, చిన్న తప్పులకు జైలు పాలైన వారికి సాధారణంగా రంజాన్ మాసంలో అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష పెడుతుంది. ఇది రెండేళ్లకోసారి జరిగే ప్రక్రియ. కానీ కొన్నేళ్లుగా కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడం లేదు. దీంతో పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు. అవకాశాన్ని వినియోగించుకోండి కువైట్లో చిక్కుకుపోయిన విదేశీయులు ఆ దేశం ప్రకటించిన క్షమాభిక్షను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వేర్వేరు కారణాలతో చట్ట వ్యతిరేకంగా అక్కడ ఉంటున్న విదేశీయులకు ఎలాంటి శిక్ష, జరిమానా లేకుండా తిరిగి స్వదేశానికి వెళ్లే అవకాశం కల్పించిందని పేర్కొంది. అందరికీ తెలియాలి 22 ఏళ్లుగా కువైట్లో ఉంటున్నాను. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చిన్న తప్పులతోనే జైలు పాలైన వారు, పాస్పోర్టు కాలపరిమితి ముగిసిన వారు, అక్రమ నివాసితులు దాదాపు 30 వేల మంది కువైట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వారు డబ్బులుంటే స్వదేశానికి తిరిగి వెళ్లవచ్చు. కొందరికి ఎంబసీ, స్వచ్ఛంద సంస్థలు స్వదేశానికి వెళ్లడానికి టికెట్ ఖర్చులు ఇస్తాయి. ఏడేళ్లుగా కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష ఇవ్వలేదు. వీసాతోపాటు ఇక్కడ పని చేసేందుకు ఇచ్చే అనుమతిని ‘అకామా’అంటారు. అది కచ్చితంగా ఉండాలి. మేం ఇప్పటికే దీని గురించి ప్రచారం ప్రారంభించాం. ఇలాంటి నిబంధన వచ్చిందని చాలా మందికి తెలియదు. దీని గురించి అందరికీ చెప్పాలనేదే మా ప్రయత్నం. –కొల్లాబత్తుల రాజు, కువైట్లో ఉంటున్న తెలంగాణ వాసి -
వేరే రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలు వద్దు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి సమాచారం లేకుండా వేరే రాష్ట్రాల్లో అకస్మాత్తుగా పర్యటిస్తుండటంపై కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పర్యటనల వల్ల సదరు సీఎంలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులందరికీ తెలియజేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ముందుగా సమాచారం ఇస్తే ఆతిథ్య సీఎంకు తగిన భద్రత కల్పించడం వీలవుతుందని తెలిపింది. సీఎంలకు జెడ్(22 మందితో), జెడ్ ప్లస్(55 మందితో) భద్రత కల్పిస్తారు. -
బ్యాంక్ ఖాతాలు తెరవండి
న్యూఢిల్లీ: విదేశీ విరాళాలు స్వీకరించే ఎన్జీవోలు, వ్యాపార సంస్థలు, వ్యక్తులు నెలలోగా ప్రభుత్వం నిర్దేశించిన 32 బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పారదర్శకత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలను ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (పీఎఫ్ఎంఎస్)తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) 2010 ప్రకారం విదేశీ విరాళాలను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు వాడకూడదని తెలిపింది. కేంద్రం నిర్దేశించిన బ్యాంకుల్లో ఎస్బీఐ, విజయ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 10వేల ఎఫ్ఆర్సీఏ గుర్తింపు పొందిన ఎన్జీవోలు ఉన్నాయి. -
కన్ఫర్డ్ ఐపీఎస్ల బ్యాచ్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ వన్ డీఎస్పీలుగా పోలీస్ శాఖలో చేరి కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి పొందిన పలువురు ఐపీఎస్ అధికారుల సీనియారిటీ పునఃసమీక్షిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీరి సీనియారి టీని తప్పులతడకగా రూపొందించిన డీవోపీటీపై బాధిత అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీనియారిటీ వ్యవహారంలో మూడేళ్ల క్రితం రూల్స్ సవరించారని, ఆ సవరణలకు ముందే తాము కన్ఫర్డ్ ఐపీఎస్లుగా పదోన్నతి పొందామని 1996, 1998, 2001 బ్యాచ్ గ్రూప్–1 అధికారులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. డీవోపీటీ రూపొందించిన సీనియారిటీతో తాము రెండేళ్ల సర్వీసు కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేయడంతో పాత రూల్స్ ప్రకారం కన్ఫర్డ్ రూల్స్ వర్తింపజేయాలని డీవోపీటీని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు డీవోపీటీ ఐపీఎస్ల బ్యాచ్లను సవరించి కేంద్ర హోంశాఖకు జాబితా అందించింది. కేంద్ర హోంశాఖ సవరించిన కన్ఫర్డ్ ఐపీఎస్ బ్యాచ్లను అధికారికంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు పంపించింది. ఈ ప్రకారమే పదోన్నతులు, సీనియారిటీ స్కేలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
స్మార్ట్ ఖాకీ
పోలీస్ అంటే ఖాకీ.. ఖాకీ అంటే పోలీస్.. ఈ రెండింటిదీ విడదీయరాని అనుబంధం. పోలీసులు ఎలా ఉంటారు అనగానే ఖాకీ డ్రెస్ మనసులో మెదులుతుంది. అలాంటి ఖాకీ యూనిఫాం ఇప్పుడు మారబోతోంది. ఈ దిశగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(బీపీఆర్అండ్డీ) విభాగం కసరత్తు చేస్తోంది. కొత్త పోలీసు యూనిఫాం ఎలా ఉండబోతోందన్న దానిపై దేశవ్యాప్తంగా లక్షలాదిమంది పోలీస్ సిబ్బంది, అధికారులతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. – సాక్షి, హైదరాబాద్ ప్రజల నుంచీ అభిప్రాయ సేకరణ.. పోలీసులపై అభిప్రాయంతో పాటు యూనిఫాం మార్పుపై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు నాలుగు ప్రశ్నల రూపంలో అభిప్రాయాలు కోరింది. 1? పోలీసులతో మీరు తరచుగా మాట్లాడతారా? వారిని కలవాల్సి వచ్చిందా? అనే ప్రశ్నపై వారిని ఎక్కువగా కదిలించింది. ఇందుకుగానూ 66 శాతం మంది చాలా అరుదుగా పోలీసులను కలవాల్సి వస్తోందని చెప్పారు. 13 శాతం మంది అసలు కలవాల్సిన పరిస్థితి లేదని, 12 శాతం మంది తరచుగా పోలీసులను కలుస్తామని చెప్పగా, 4 శాతం మంది చాలా తరచుగా కలుస్తామని జవాబిచ్చారు. 2? పోలీస్ యూనిఫాంను చూడగానే మీకు కలిగే భావం ఏంటి? అని అడిగారు. 22 శాతం మంది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని, 39 శాతం మంది యూనిఫాం చూడగానే బెదిరించినట్టుగా ఉంటోందని చెప్పారు. 7 శాతం మంది ఖాకీ యూనిఫాం చూడగానే గర్వంగా అనిపిస్తుందని, మరో 20 శాతం మంది యూనిఫాం చూస్తే గౌరవం ఇవ్వాలని అనిపిస్తుందని చెప్పగా.. 34 శాతం మంది ఎలాంటి అభిప్రాయం తెలుపలేదు. 3? ప్రస్తుతం ఉన్న పోలీస్ యూనిఫాంపై అభిప్రాయం కోరగా.. 3 శాతం మంది స్మార్ట్గా అనిపిస్తుందని, 23 శాతం మంది యూనిఫాం చూస్తే అసహ్యంగా, చిరిగిన దుస్తుల్లా కనిపిస్తాయని తెలిపారు. 50 శాతం మంది ధరించే వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని తెలుపగా, 24 శాతం మంది ఎలాంటి అభిప్రాయాలు చెప్పలేదు. 4? మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ధరించే యూనిఫాంపై అభిప్రాయం కోరగా 17 శాతం మంది యూనిఫాం స్మార్ట్గా ఉంటుందని, 46 శాతం మంది చాలా సాధారణంగా, పెద్దగా గుర్తించలేని విధంగా ఉందని తెలిపారు. 7 శాతం మంది భారత సంస్కృతికి సరిపడదని చెప్పారు. 21 శాతం మంది మహిళా సిబ్బంది యూనిఫాం ఏంటో తెలియదని చెప్పారు. బీపీఆర్అండ్డీ నేతృత్వంలో.. దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలో తీసుకురావాల్సిన మార్పులు, ఆధునీకరణపై నిరంతర అధ్యయనాలు, అభిప్రాయ సేకరణ చేసే బీపీఆర్అండ్డీ విభాగం..పోలీస్ యూనిఫాంలో తీసుకురావాల్సిన మార్పులపైనా అధ్యయనం చేసింది. గుజరాత్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థతో కలసి దేశవ్యాప్తంగా పోలీస్ యూనిఫాం మార్పు, కొత్త యూనిఫాంపై అధ్యయనం నిర్వహించింది. ఇందుకుగానూ 2012 నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పోలీస్ బలగాల యూనిట్లను పరిశీలించి నివేదికను రూపొందించింది. నేషనల్ పోలీస్ అకాడమీ, తెలంగాణ పోలీస్ అకాడమీ, తమిళనాడు, కేరళ, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. ఎవరి శైలి వారిదే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకమైన ఖాకీ దుస్తులు ఉంటున్నాయని బీపీఆర్అండ్డీ అభిప్రాయపడింది. కొన్ని రాష్ట్రాల్లో బాగా ముదురు రంగు ఖాకీ దుస్తులు వాడుతున్నారని, మరికొన్ని రాష్ట్రాల్లో లేత ఖాకీ రంగు దుస్తులు వాడుతున్నారని పేర్కొంది. అయితే ఒక రాష్ట్రంలోనే వివిధ రకాల్లో యూనిఫాంలు కుట్టించుకుంటున్నారని, కానిస్టేబుళ్లు ఒక శైలిలో, అధికారులు మరో శైలిలో యూనిఫాంలను కుట్టిస్తున్నారని, దీని వల్ల ఏకరూపత సాధ్యం కావడం లేదని అభిప్రాయపడింది. కిందిస్థాయి సిబ్బంది సొంత డబ్బులతో యూనిఫాం కుట్టించుకుంటున్నారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఖాకీ యూనిఫాం, శైలిపై పోలీస్ సిబ్బంది, అధికారుల నుంచీ అభిప్రాయ సేకరణ చేసింది. చాలా అసౌకర్యంగా ఉందని కొన్ని రాష్ట్రాల సిబ్బంది చెప్పగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. యూనిఫాంతో పాటు టోపి, షూ, బెల్ట్ తదితరాలపై అసంతృప్తి వ్యక్తమైంది. ప్రధాన రకాలు ఇవే.. : అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు అక్కడి వాతావరణం, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నామని బీపీఆర్అండ్డీ స్పçష్టం చేసింది. స్మార్ట్ పోలీసింగ్లో భాగంగా ‘స్మార్ట్ పోలీస్ యూనిఫాం’తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. ఖాకీ యూనిఫాం స్థానంలో పోలీస్ సిబ్బంది ధరించాల్సిన డ్రెస్ల మోడళ్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించింది. పోలీస్, మహిళా పోలీస్కు ఒకే యూనిఫాం రూపొందించింది. అయితే హాఫ్ షర్ట్, ఫుల్ షర్ట్ రకాల్లో తయారు చేసింది. ప్రస్తుతమున్న ముదురు రంగును కొంత తగ్గిస్తూ.. లేత ఖాకీ రంగు అనిపించేలా చొక్కా రూపొందించింది. ఖాకీతో పాటు కొంచెం పసుపు రంగు కలిసేలా చొక్కా ఉండనుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తెలిపింది. చొక్కాపై ఇండియన్ పోలీస్ బ్యాడ్జ్, దానిలోనే బ్లడ్ గ్రూప్ స్పష్టంగా కనిపించేలా ఉంటాయి. హోదాను బట్టి చొక్కాపై నీలిరంగు షోల్డర్పై స్టార్స్ను పెట్టుకోవాల్సి ఉంటుందని డిజైన్లో స్పష్టంచేసింది. స్మార్ట్గా ఉండేందుకే.. దేశవ్యాప్తంగా స్మార్ట్ పోలీసింగ్ను అందుబాటులోకి తెచ్చే యత్నంలోనే ఖాకీ యూనిఫాం, శైలిపై డిజైన్లు చేయిస్తున్నట్టు బీపీఆర్అండ్డీ స్పష్టం చేసింది. యూనిఫాం మాత్రమే కాక టోపి, బెల్ట్, నేమ్ బ్యాడ్జ్, డ్యూటీ జాకెట్, షూ, సాక్స్, రెయిన్ కోట్.. ఇలా టాప్ టూ బాటమ్.. పోలీస్ యూనిఫాం వ్యవస్థనే మార్చాలని నిర్ణయానికి వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన పలు డిజైన్లపై కేంద్ర హోంశాఖకు నివేదిక అందించనున్నట్టు బీపీఆర్అండ్డీ వర్గాలు స్పష్టం చేశాయి. -
పౌరసత్వ రద్దు నిర్ణయాన్ని కొట్టేయండి
- హైకోర్టులో చెన్నమనేని రమేశ్ పిటిషన్ - కేంద్ర హోంశాఖది ఏకపక్ష నిర్ణయమని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం మరోసారి హైకోర్టుకు చేరింది. తన పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ రమేశ్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరారు. భారత పౌరసత్వ చట్టం– 1955లోని సెక్షన్ 10(1) ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో.. ప్రతివాదులుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి/ సంయుక్త కార్యదర్శి, తెలంగాణ హోంశాఖ కార్యదర్శి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను పేర్కొన్నారు. తనకు పౌరసత్వం ఇచ్చిన తర్వాత 30 రోజుల్లో మాత్రమే అభ్యంతరాలు చెప్పాలని భారత పౌరసత్వ చట్టం చెబుతోందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్ 5(1) ప్రకారం తనకు పౌరసత్వం వచ్చిందని, అయితే తనపై వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ చాలా ఆలస్యంగా ఫిర్యాదు చేశారన్నారు. దానిపై కేంద్ర హోంశాఖ స్పందించిందని పేర్కొన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యలకు పాల్పడినప్పుడు మాత్రమే పౌరసత్వం రద్దు చేసే వీలుందని, అయినా కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆది శ్రీనివాస్ ఫిర్యాదుపై కమిటీ విచారణ నివేదిక తనకు ఇవ్వలేదన్నారు. దేశంలో పుట్టి పెరిగి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన తర్వాత 1993లో అక్కడి పౌరసత్వం తనకు వచ్చిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులైన తన తల్లిదండ్రుల ప్రజాసేవను స్ఫూర్తిగా తీసుకుని జర్మనీలో ఉంటూనే కరీంనగర్ జిల్లాలోని అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాల్ని చేపట్టానని, 2007లో తిరిగి భారత్కు వచ్చాక వాటిని కొనసా గిస్తూనే చట్టం ప్రకారం దేశ పౌరసత్వం పొందాన న్నారు. తనకు పౌరసత్వం ఇవ్వడం వల్ల ఏవిధంగా నష్టపోని, బాధితుడు కూడా కాని ఆది శ్రీనివాస్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఫిర్యాదు చేశారన్నారు. -
1 నుంచి డిపార్చర్ కార్డ్స్ విధానం రద్దు
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లే భారతీయులకు వచ్చే నెల నుంచి విమానాశ్రయాల వద్ద ప్రయాణానికి ముందు ‘డిపార్చర్ కార్డ్స్’ పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. అయితే రైలు, ఓడరేవులు, భూమార్గం ద్వారా విదేశాలకు వెళ్లేవారు మాత్రం ఈ ప్రయాణ పత్రాల్ని పూర్తి చేయాలని ఒక ఉత్తర్వులో వెల్లడించింది. జూలై 1, 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణానికి ముందు పేరు, జన్మదినం, పాస్పోర్ట్ నెంబరు, చిరునామా, విమానం నెంబర్, ప్రయాణ తేదీ తదితర వివరాలు డిపార్చర్ కార్డ్లో పూరించాలి. -
గవర్నర్ పదవీ కాలం పొడిగింపు
-
గవర్నర్ పదవీ కాలం పొడిగింపు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీకాలాన్ని కేంద్రం తాత్కాలికంగా పొడిగించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ గవర్నర్గా కొనసాగాలని కేంద్ర హోంశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారంతో ఆయన మూడో విడత పదవీకాలం ముగుస్తుండటంతో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నరసింహన్ 2009 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు గవర్నర్గాపని చేస్తున్న ఎన్.డీ. తివారీ సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు రావటంతో తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం నరసింహన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
‘ఆపరేషన్ ఛత్తీస్గఢ్’ లీడ్ చేయబోం
♦ కేంద్ర హోంశాఖ ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్రం ♦ ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల నియంత్రణపై ఢిల్లీలో కీలక భేటీ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల నియంత్రణ ఆపరేషన్కు తాము ఆధ్వర్యం వహించలేమని రాష్ట్ర పోలీసుశాఖ కేంద్రానికి స్పష్టం చేసింది. మావోయిస్టుల కదలికలు, దాడుల వ్యూహాలపై తాము సమాచారం అందించినా.. ఛత్తీస్గఢ్ పోలీసులు పట్టించుకోలేదని, దాంతో భారీ నష్టం కలిగిందని పేర్కొంది. అలాంటివారితో కలసి పనిచేసి, తమ బలగాలను బలిపశువులను చేసుకోలేమని స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్లో ఇటీవల మావోయిస్టులు మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. దాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. మావోయిస్టుల నియంత్రణ కోసం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్, ఒడిశా, మహా రాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లో వరుసగా జరుగుతున్న సీఆర్పీ ఎఫ్–మావోయిస్టు దాడులు, మావోయిస్టుల నియంత్రణ, నిఘా వైఫల్యం, పోలీసు బలగాల వ్యూహాలు తదితర అంశాలపై నాలుగు గంటల పాటు చర్చించినట్లు తెలిసింది. మీరే ఆధ్వర్యం వహించండి ప్రభావిత ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, తెలం గాణలలో ప్రస్తుతం మావోయిస్టులతో పెద్దగా సమస్యలు లేవు. తెలంగాణలో అయితే వారి ఉనికిగానీ, కార్యకలాపాలుగానీ బాగా తగ్గిపోయాయి. పేరుకు తెలంగాణ మావోయిస్టు కమిటీ ఉన్నా.. అది ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఏవోబీ(ఆంధ్రా, ఒడిషా బార్డర్) కమిటీ కొంతవరకు కార్యకలాపాలు సాగిస్తోంది. దీంతో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంలో కీలకంగా పని చేసిన గ్రేహౌండ్స్పై కేంద్ర హోంశాఖ దృష్టి పడింది. ఇక మావోయిస్టుల సమాచార సేకరణలో తెలంగాణ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో) చాలా ముందుంది కూడా. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల నియంత్రణకు రాష్ట్ర గ్రేహౌండ్స్, ఎస్ఐబీ సేవలను వాడుకునేలా కేంద్ర హోంశాఖ ప్రతిపాదన తెచ్చినట్టు తెలిసింది. అయితే దీనికి అంగీ కరించబోమని తెలంగాణ తరఫున హాజరైన ఉన్నతాధికారి తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ వైఫల్యానికి మీరే బాధ్యులు! తెలంగాణ ఎస్ఐబీ ఇచ్చిన సమాచారాన్ని పెడచెవిన పెట్టిన ఛత్తీస్గఢ్ పోలీసులపై కేంద్ర హోం మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏడాదిగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక సభ్యులు ఛత్తీస్గఢ్లోనే ఉన్నారని.. వారు భారీ దాడులకు వ్యూహం రచిస్తున్నట్లు తెలిపినా సరైన వ్యూహం లేకుండా బలగాలను మోహరించడం ఏమిటంటూ నిలదీసినట్లు తెలిసింది. ఇంతటి వైఫల్యమున్న ఛత్తీస్గఢ్తో సంయుక్తంగా కలసి రావడానికి ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ముందుకు వస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ఇక ముందు ఇలాంటి పరిణామాలు జరిగితే దానికి మొత్తం బాధ్యత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, పోలీసులదేనని పరోక్షంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. కలసివెళదామంటున్న కేంద్ర హోంశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబీలు ఇచ్చే ప్రతి సమాచారాన్ని మిగతా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు కీలకంగా భావించాలని కేంద్ర హోంశాఖ సూచించినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల నియంత్రణలో ఈ రెండు రాష్ట్రాల భాగస్వామ్యం కీలకమైనదని.. వారితో సహకరించుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. త్వరలోనే ఛత్తీస్గఢ్లో ఐదు రాష్ట్రాల డీజీపీలు భేటీ అయి యాక్షన్ ప్లాన్ రూపొం దించుకోనున్నట్లు తెలిసింది. వారితో కలసి పనిచేయలేం! ఆపరేషన్ ఛత్తీస్గఢ్ను లీడ్ చేయలేమని స్పష్టం చేసిన çరాష్ట్ర పోలీసు శాఖ ఇందుకు రెండు కారణాలను కేంద్ర హోంశాఖకు వివరించింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, దండకారణ్య కమిటీ, కేకేడబ్ల్యూ కమిటీ, టీఎస్సీ(తెలంగాణ స్టేట్ కమిటీ) అన్నీ ఛత్తీస్గఢ్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయని... సంయుక్త కార్యచరణతో ముందుకు వెళదామని ఇంతకుముందే తాము చెప్పినా ఛత్తీస్గఢ్ పోలీసులు కలసి రాలేదని తెలిపింది. ఇక మావోయిస్టుల దాడులపై తాము కీలక సమాచారాన్ని అందించినా ఛత్తీస్గఢ్ పోలీసులు పెడచెవిన పెట్టారని... అలాంటివారితో కలసి పనిచేసి, తమ బలగాలను బలి పశువుల్ని చేసుకోలేమని స్పష్టం చేసినట్లు సమాచారం. పైగా సీఆర్పీఎఫ్కు, ఛత్తీస్గఢ్ పోలీసులకు మధ్య సమాచార సేకరణ, పంపిణీ సరిగా లేదని.. అందువల్లే తగిన కార్యచరణ లేక జవాన్లు బలైపోతున్నారని తేల్చిచెప్పినట్టు తెలిసింది. -
18న కేంద్ర హోంశాఖ నేతృత్వంలో భేటీ
పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై చర్చ సాక్షి, హైదరాబాద్: పదవ షెడ్యూల్లో గల సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఈ నెల 18వ తేదీన కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రావాల్సిందిగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ బుధవారం లేఖ రాసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు సంప్రదింపుల ద్వారా దీనిపై ఒక ఒప్పందానికి రాని పక్షంలో కేంద్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇరు రాష్ట్రాలు కమిటీలను ఏర్పాటు చేశాయి. టీ సర్కారు తమ సీఎస్ రాజీవ్శర్మ, ఏజీ రామకృష్ణారెడ్డితో కమిటీని ఏర్పాటు చేయగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు గత నెల 18వ తేదీన సమావేశమైనప్పటికీ ఒక ఒప్పందానికి రాలేదు. ఇదే విషయాన్ని ఏపీ ఇటీవల కేంద్ర హోంశాఖకు లేఖ ద్వారా తెలియజేసింది. దీంతో కేంద్ర హోంశాఖ ఈ నెల 18న భేటీ ఏర్పాటుచేసింది. పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఆ వివరాలను కేంద్ర హోంశాఖకు అందజేయాలని నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేయాల్సిందిగా కోరనుంది. 9వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు రూ.50 వేల కోట్లు ఇలా ఉండగా 9వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా నమూనా పత్రాన్ని రూపొందించి సంస్థల వారీగా ఆస్తులు, అప్పుల వివరాలను సేకరించనుంది. ఆయా సంస్థల్లో ఉద్యోగుల వివరాలను ప్రాంతాల వారీగా సేకరించాలని కూడా నిర్ణయించింది. రూ.50 వేల కోట్ల వరకు ఆస్తులుంటాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సేకరించిన వివరాలను షీలా బిడే కమిటీకి సమర్పించనుంది. -
సుప్రీం తీర్పు వరకూ ఆగమనండి
పదో షెడ్యూల్ అంశాలపై కేంద్ర హోంశాఖకు ఏపీ లేఖ సాక్షి, హైదరాబాద్: పదో షెడ్యూల్లోని అన్ని సంస్థలు తమకే చెందుతాయంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు అందుకు చెందిన నిధులన్నీ తమవేనని స్పష్టం చేయడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పదో షెడ్యూల్ వ్యవహారంపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినందున అక్కడినుంచి తీర్పు వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం పదో షెడ్యూల్ సంస్థల విషయంలో ఎలాంటి చర్యలను తీసుకోరాదని అడ్వొకేట్ జనరల్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు పదో షెడ్యూల్లోని సంస్థలు, నిధులు విషయంలో యధాతథస్థితిని కొనసాగించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖను కోరింది. ఈ మేరకు ఒక లేఖ రాసింది. -
ఎఫ్డీఐలకు 3 నెలల్లోనే క్లియరెన్స్
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయటంలో భాగంగా.. ఎఫ్డీఐకి భద్రతాపరమైన ఆమోదాన్ని సాధ్యమైనంత వరకూ మూడు నెలల్లో పూర్తిచేసేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించిందని కేంద్రం వెల్లడించింది. శుక్రవారం లోక్సభలో ఓ ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి నిర్మలాసీతారామన్ జవాబు చెప్పారు. గత మూడేళ్లలో ఎఫ్డీఐ రాకలో హెచ్చుతగ్గులున్నాయని వీటికి కారణం స్థూల ఆర్థిక అవరోధాలని అన్నారు. ఎఫ్డీఐ ప్రతిపాదనలకు భద్రతాపరమైన ఆమోదంలో జాప్యానికి సంబంధించి.. వ్యూహాత్మక రంగాలైన విమానయానం, టెలికాం సహా వివిధ శాఖలు, విభాగాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయని అంగీకరించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలను తగిన జాగరూకతతో తీసుకుంటామన్నారు. -
ప్రస్తుతానికి తాత్కాలికమే!
-
ప్రస్తుతానికి తాత్కాలికమే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉద్యోగుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం క్షేత్రస్థాయిలో అధికారులు ఎక్కడివారు అక్కడే సెక్రటేరియట్ అధికారులు, హెచ్వోడీల్లో మార్పులు ఆర్డర్ టు సర్వ్ కింద ఉత్తర్వులు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖతో కమలనాథన్, సీఎస్ భేటీలో నిర్ణయం న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుతానికి తాత్కాలికంగానే ఉద్యోగుల విభజన చేపట్టాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఉద్యోగుల విభ జనకు సంబంధించి ఇరు ప్రాంతాల నుంచి వేర్వేరు డిమాండ్లు వస్తుండటం, కొద్ది రోజుల్లోనే ఏర్పడనున్న కొత్త ప్రభుత్వాలు దీనిపై తమ విధానాన్ని తెలిపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో... శాశ్వత మార్గదర్శకాల రూపకల్పనకు మరింత సమయం పట్టవచ్చని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల విభజన అంశాలను చర్చించేందుకు కేంద్ర హోంశాఖ బుధవారం నార్త్బ్లాక్లో సమావేశం నిర్వహించింది. దీనికి హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, డీవోపీటీ కార్యదర్శి శ్యామేల్కుమార్ సర్కార్, ప్రభుత్వ సీఎస్ పీకే మహంతి, ఉద్యోగ విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల కమిటీ చైర్మన్ ప్రత్యూష్సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ హాజరయ్యారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి చేసిన కసరత్తుపై రాష్ట్ర అధికారులు నివేదికలు సమర్పించారు. ఇదే సమయంలో ఉద్యోగుల తుది పంపిణీని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక చర్చించాకే పంపిణీ చేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రభుత్వాలు ఏర్పాటు కాకుండా ఉద్యోగుల తుది పంపిణీ సాధ్యం కాదని... అలా చేస్తే వచ్చేసమస్యలను పరిష్కరించడం కష్టతరమని రాష్ట్ర అధికారులు కేంద్ర హోంశాఖకు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపులు జరపాలని సూచించినట్లు సమాచారం. దీంతో విభజన అనంతరం ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులు ఎక్కడివారు అక్కడే పనిచేయాలని, దీనికోసం ప్రభుత్వం నుంచి ఆర్డర్ టు సర్వ్ కింద ఉత్తర్వులు జారీచేయాలని నిర్ణయించారు. ఇక సెక్రటేరియట్ స్థాయిలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, శాఖాధిపతుల్లో మాత్రం చిన్నపాటి మార్పులు చేర్పులతో కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత సీఎస్ మహంతి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి తాత్కాలిక కేటాయింపులుంటాయి. క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు, జేసీలు, అధికారులు ఎక్కడివారు అక్కడే పనిచేస్తారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి శాశ్వత మార్గదర్శకాలు సిద్ధం అయ్యాక శాశ్వత కేటాయింపులు ఉంటాయి’ అని తెలిపారు. ప్రతిపాదనలు చేసిన బాబు!: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు పలు ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖకు పంపినట్లు తెలిసింది. బాబుతో పాటు కొందరు ఇతర పార్టీల నేతలు సైతం ప్రతిపాదనలు పంపారు. బుధవారం నాటి సమావేశంలో వీటిపైనా చర్చ జరిగినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని శాశ్వత మార్గదర్శకాలు తయారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.