Comprehensive family survey
-
సర్వే గణాంకాలతోనే సంక్షేమ పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకానికి సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలే ప్రామాణికమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల మంజూరు మొదలు.. ప్రతి పథకానికి ఈ గణాంకాల ఆధారంగానే లబ్ధి కల్పించే విధంగా ప్రభు త్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియంతా పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే క్షేత్రస్థాయిలో సర్వే గణాంకాలు సేకరించామని వివరించారు. సర్వేపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందేహాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్కుమార్రెడ్డి పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి సందేహాలను నివృత్తి చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమగ్ర సర్వే జరిగినతీరు, నిబంధనలు పాటించిన విధానం వంటి అంశాలను సభ్యులకు వివరించినట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఈ సర్వే పూర్తిగా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. కేంద్రంలో జనగణన విభాగం అనుసరించే విధానంలోనే రాష్ట్రంలో ప్రణాళిక శాఖ సర్వే చేసిందన్నారు. ఈ సర్వే సారాన్ని వెయ్యి పేజీల్లో పొందుపరిచారని, ఈ సమాచారాన్ని ఒకటి, రెండు రోజుల్లో పబ్లిక్ డొమైన్లో కులాలు, ఉపకులాలు, జిల్లాల వారీగా అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పొరపాట్లకు తావివ్వకండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న సామా జిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహ రించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ దశలో డేటా ఎంట్రీ చాలా ముఖ్యమైనదని, ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉన్న ఆయన అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు మిగిలిన ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. సర్వే జరిగిన క్రమంలో పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల డోర్లాక్ ఉండటం, ఇంటివద్ద అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు వచ్చాయని, వారి వివరాలను ఫోన్ ద్వారా.. లేదంటే నేరుగా కలిసి సేకరించాలని కోరారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వెళ్లిన వారి వివరాలను కూడా జాగ్రత్తగా క్రమబద్ధీకరించాలని సూచించారు. -
Telangana: సర్వే ‘సమగ్ర’మేనా?
రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తగిన ఫలితం ఇస్తుందా? దాని ఆధారంగా సర్కారు ముందుకు వెళుతుందా? ఆ వివరాలతో సంక్షేమ పథకాల అమలు కుదురుతుందా? అసలు ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందా?.. ఇలా ఎన్నో సందేహాలు ముసురుకుంటున్నాయి. సర్వేలో చాలా ప్రశ్నలకు అరకొర సమాచారమే వస్తుండటం.. ముఖ్యమైన ప్రశ్నలకు ప్రజలు ఎదురుప్రశ్నలు వేయడం.. పైగా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం.. ఎన్యుమరేటర్లు చేసేదేమీ లేక ఆ వివరాల కాలమ్లను ఖాళీగా వదిలేస్తుండటంతో సర్వేకు ‘సమగ్రత’ చేకూరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాల సేకరణే ప్రధానంగా చేపట్టిన ఈ సర్వేపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఎన్యుమరేటర్లతో కలసి వెళ్లి... సర్వేలో ప్రజల స్పందన ఎలా ఉందన్నది స్వయంగా పరిశీలించింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామంలోని ఏడవ వార్డులో ఎన్యుమరేటర్ శనివారం సర్వే నిర్వహించాడు. భద్రయ్య కుటుంబాన్ని సర్వే చేస్తుండగా.. బ్యాంకు ఖాతా, టీవీ, కూలర్ ఉన్నాయా అన్న ప్రశ్నలకు అతడు తడబడ్డాడు. జీరో బిల్లుకు ఏమైనా సమస్య వస్తుందా అనే సందేహంతో తడబడినట్లు తెలిపారు. అతనికి కొడుకు, కోడలు, మనుమరాళ్లు ఉండగా వారి వివరాలను తెలపడానికీ ససేమిరా అన్నాడు. తమ ఇల్లు ఇరుకుగా ఉందని, కొడుకుకు రేషన్ కార్డు ఉన్నందున సర్వేను వేరుగా రాస్తే వారికి ప్రభుత్వం నుంచి ఇల్లు, ఇతర పథకాలు వస్తాయని చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో ఓ వృద్ధురాలిని వివరాలు అడుగుతూ ఇల్లు ఉందా అని ప్రశ్నించగా, తనకు రేకుల ఇల్లు ఉందని మీరు రాసుకున్నంత మాత్రాన తనకు ఇల్లు వస్తదన్న నమ్మకం లేదని.. ఇంతకుముందు కూడా ఇలాగే రాసుకొని వెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో మెజారిటీ ప్రశ్నలకు ప్రజల నుంచి స్పందన రావడం లేదు. 75 ప్రశ్నలతో సర్వే ఫారాన్ని తయారు చేస్తే.. అందులో 40 వరకు ప్రశ్నలకు ప్రజల నుంచి వివరాలు అందడం లేదు. సాధారణంగా ఏదైనా సర్వే నిర్వహించేటపుడు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి. అప్పుడే ఆ సర్వే లక్ష్యం నెరవేరుతుంది. కానీ ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి సర్వేలో మెజారిటీ ప్రశ్నలకు, అందులోనూ కీలకమైన వాటికి ప్రజల నుంచి స్పందన లేకపోవడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సమగ్ర సర్వే 90 శాతానికిపైగా పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. సర్వే ఫారాల కంప్యూటరీకరణ కూడా సాగుతోంది. 40 ప్రశ్నలకు అరకొర జవాబులు.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు ఉన్నాయి. అందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు. మొత్తం ప్రశ్నావళి రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతుల అంశాలు ఉన్నాయి. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, రేషన్ కార్డు, నివాస గృహానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో చాలా ప్రశ్నలకు ప్రజలు సమాచారం ఇవ్వడం లేదని ఎన్యుమరేటర్లు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త మెరుగ్గా ఉన్నా.. పట్టణ ప్రాంతాల్లో స్పందన అంతంతగానే ఉందంటున్నారు. 56 ప్రధాన ప్రశ్నల్లో సుమారు 40 ప్రశ్నలకు సరైన విధంగా జవాబులు రావడం లేదని పేర్కొంటున్నారు. ⇒ సర్వే ఫారం మొదటి విభాగంలో 1 నుంచి 10వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు జనం ఎలాంటి ఇబ్బందిపడటం లేదు. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు, లింగం, మతం, సామాజికవర్గం, కులం, వయసు తదితర ప్రశ్నలున్నాయి. 11, 12వ ప్రశ్నలు ఆధార్, ఫోన్ నంబర్లకు సంబంధించినవి. ఇవి ఐచ్ఛికమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వివరాలను చెప్పేందుకు గ్రామీణ ప్రాంతాల వారు ముందుకొస్తున్నా.. పట్టణ ప్రాంతాల్లో చెప్పేందుకు ఇష్టపడటం లేదు. ⇒ ఇక కాలమ్ 13 నుంచి 19 వరకు ప్రశ్నలు భౌతిక, వివాహ స్థితి, పాఠశాల, విద్యార్హతలు, మాధ్యమం, డ్రాపౌట్ తదితర వివరాలకు సమాధానాలు వస్తున్నాయి. ⇒ కాలమ్ 20 నుంచి 56 వరకు ఉన్న ప్రశ్నలకు సమాచారం చెప్పడంలో జనం వెనక్కి తగ్గుతున్నారు. అందులో చాలావరకు వ్యక్తిగత వివరాలు ఉన్నాయని.. అవి వెల్లడించలేమని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ⇒ 20వ కాలమ్ నుంచి ఉన్న ప్రశ్నల్లో ఎక్కువగా వ్యక్తిగత అంశాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలే ఉన్నాయి. వృత్తి, వ్యాపారం, వేతనం, కులవృత్తి, వ్యాధులు, వార్షికాదాయం, పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతాలు, వ్యవసాయ భూములు, ధరణి పాస్బుక్ వివరాలు, భూమి రకం, నీటిపారుదల వనరులు, కౌలు, రిజర్వేషన్ల ద్వారా పొందిన విద్యావకాశాలు, ఉద్యోగ ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి, ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం, నామినేటెడ్ పోస్టులు, వలసలు, అందుకు కారణాలు, బ్యాంకు లేదా ఇతర సంస్థల నుంచి రుణాలు, వాటి చెల్లింపులు, పశుసంపద, స్థిర, చరాస్తి వివరాలు, రేషన్ కార్డు, నివాసగృహం, ఇంటికి సంబంధించిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు రావడం లేదని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. ‘అసలు’వివరాలే రావట్లే! సమగ్ర కుటుంబ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాల సేకరణే కీలకం. కానీ ఉద్యోగం, వృత్తి, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకపోతుండటంతో ఎన్యుమరేటర్లు సైతం చేతులెత్తేస్తున్నారు. వివరాలు చెప్పాలని మళ్లీ మళ్లీ అడిగితే... ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఇచ్చిన వివరాలు నమోదు చేసుకుంటూ ఇతర కాలమ్స్ను వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల గట్టిగా ఎదురు ప్రశ్నిస్తుండటంతో చాలామంది ఎన్యుమరేటర్లు తర్వాత అడగడమే మానేశారు. అయితే నిర్దేశించిన ప్రశ్నల్లో సగానికి పైగా సమాధానాలు రాకపోతే సర్వే లక్ష్యం నెరవేరే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల ఎన్యుమరేటర్లు పెన్సిల్తో సర్వే ఫారం పూరిస్తున్నారు. తర్వాత వాటిని పెన్నుతో రాస్తామని చెప్తున్నారు. తప్పులు దొర్లకుండా ఈ విధానం అనుసరిస్తున్నట్టు ఎన్యుమరేటర్లు చెప్తున్నా... పెన్నుతో రాసే సమయంలో ఇతర వివరాలు నమోదు చేస్తారేమోనని జనంలో ఆందోళన కనిపిస్తున్న పరిస్థితి. ఎన్నో అపోహలు.. మరెన్నో అనుమానాలు! సమగ్ర సర్వేపై ఎన్నో అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని నివృత్తి చేయడంలో అధికార యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతోనే... సర్వేలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన సమాచారాన్ని చాలా మంది వెల్లడించడం లేదు. ఒకవేళ ఆస్తుల లెక్కలు చెబితే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కోత పడుతుందనే ఆందోళన కనిపిస్తోంది. ఈ కారణంగానే ఆధార్ వివరాలను కూడా ఈ కారణంగానే బహిర్గతం చేయడం లేదని అంటున్నారు. వాహనాలు, ఇళ్లు, స్థిర, చరాస్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎక్కువ మంది చెప్పడం లేదు. ప్రధానంగా పింఛన్లు, ఉచిత కరెంటు, రేషన్కార్డు, ఉచిత నల్లా కనెక్షన్, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్íÙప్ తదితర పథకాలు ఆగిపోతాయేమోనన్న కారణంతో వాస్తవాలను దాచేస్తున్న పరిస్థితి. స్టిక్కర్లు వేయని ఇళ్ల మాటేంటి? పట్టణ ప్రాంతాల్లో చాలా ఇళ్లకు ఇప్పటికీ స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు, నాలుగైదు అంతస్తుల భవనాల్లోని చాలా ఇళ్లకు స్టిక్కర్లు వేయలేదని అంటున్నారు. పూర్తిస్థాయి సర్వేలో ఇలాంటి ఇళ్లను గుర్తించి, వివరాలు నమోదు చేసే అవకాశం లేకుండా పోయిందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. సర్వే సమయంలో అలాంటి ఇళ్లను కూడా గుర్తించాలని అధికారులు సూచిస్తున్నా.. ఎన్యుమరేటర్లు వచ్చే సమయం తెలియక ఇబ్బందిగా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. సర్వేతో ఒరిగేదేమిటి.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేశారు. వెంకటేశ్వరకాలనీ 4బీ రోడ్లో నివాసం ఉంటున్న మంద సతీష్ రెడ్డి ఇంటికి రాగా.. సర్వేతో తమకు ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుందని.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సర్వే చేసింది.. అప్పుడు అన్ని చెప్పాం.. మళ్లీ కొత్తగా చెప్పేది ఏముంటుందని ప్రశ్నించారు. దీంతో ఎన్యుమరేటర్ నచ్చజెప్పి వివరాలను నమోదు చేశారు. కుల వృత్తికి సంబంధించి ప్రశ్న అడగ్గా.. రెడ్డిలకు ఏ కుల వృత్తి ఉంటుందని ఎదురు ప్రశ్నించారు. అలాగే, ఆదాయ వివరాలు ఎందుకు చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. తాము అప్పులు చేసి కొన్న ఫ్రిజ్, టీవీ, ఏసీ, వాహనం వంటి వివరాలు అడగడం తగదన్నారు. రుణమాఫీ, రైతుబంధు, రేషన్కార్డు, పింఛన్లు ఇవ్వకుండా సర్వే చేయడం అనవసరమని చెప్పారు. -
67.72 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఇప్పటివరకు 58.3 శాతం పూర్తయింది. ఈ నెల 6వ తేదీన సర్వే ప్రారంభం కాగా... తొలి మూడు రోజులు ఇళ్ల గుర్తింపు, స్టికర్లు అంటించే కార్యక్రమం నిర్వహించారు. 9వ తేదీ నుంచి కుటుంబాల వివరాలు సేకరించి నమోదుచేసే ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,16,14,349 ఇళ్లను గుర్తించగా, ఆదివారం సాయంత్రానికి 67,72,246 ఇళ్లలో సర్వే ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సర్వేలో 87,807 మంది ఎన్యుమరేటర్లు, 8,788 మంది పర్యవేక్షకులు పాల్గొంటున్నారు. సర్వేలో కీలకాంశాలు.. ⇒ సర్వేలో భాగంగా గుర్తించిన మొత్తం ఇళ్లు: 1,16,14,349. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 64,41,183, పట్టణ ప్రాంతంలో 51,73,166 ఇళ్లు ఉన్నాయి. ⇒ రాష్ట్రాన్ని 92,901 బ్లాకులుగా విభజించారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 52,493, పట్టణ ప్రాంతంలో 40,408 బ్లాకులున్నాయి. ⇒ సర్వేలో 87,807 మంది ఎన్యుమరేటర్లు పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో 47,561 మంది, పట్టణ ప్రాంతంలో 40,246 మంది ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. ⇒ సర్వే తీరును సమన్వయం చేసేందుకు 8,788 మంది పర్యవేక్షకులను ప్రభుత్వం నియమించింది. ఇందులో 4,947 మంది గ్రామాల్లో, 3,841 మంది పట్టణ ప్రాంతంలో ఉన్నారు. ⇒ ఆదివారం నాటికి ములుగు జిల్లాలో అత్యధికంగా 87.1 శాతం సర్వే పూర్తయింది. ఆ తర్వాత స్థానంలో నల్లగొండ జిల్లా 81.4 శాతం, జనగామ 77.6 శాతం, మంచిర్యాల 74.8 శాతం, పెద్దపల్లి జిల్లాలో 74.3 శాతం సర్వే పూర్తయింది. అత్యధిక జనసాంద్రత ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఇప్పటివరకు 38.3 శాతం మాత్రమే పూర్తయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
కులరహిత వ్యవస్థకు తొలి అడుగు
కులగణనపై అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తూ తమ అసలు రూపం ప్రకటిస్తున్నారు. కులగణన చాలామందికి గొంతు దిగని పచ్చివెలక్కాయలా మారిందనిపిస్తుంది. తెలంగాణలో కులగణన, సమగ్ర కుటుంబ సర్వే ప్రశ్నాపత్రంపై కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. కనీస సదుపాయాల లభ్యత పరంగా వివిధ సముదాయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలియాలంటే సమగ్ర కుటుంబ సర్వే అవసరం. అసెంబ్లీ, పార్లమెంటులు కాదు, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్నడూ ప్రాతినిధ్యం లభించని కొన్ని సముదాయాలున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం ఏ వర్గానికి, ఏ సముదాయానికి ఎంత ఉందో తెలుసుకోకుండా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి రాజకీయ అనే పదం గురించిన అభ్యంతరాలు అర్థం లేనివి.కుటుంబ సర్వేలో ఆస్తుల వివరాలు ఎందుకు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. ఇదేదో వ్యక్తిగత హక్కులకు భంగమైనట్లు వాదిస్తున్నారు. సంపాదన వివరాలు తెలియజేసి ఆదాయపన్ను చెల్లించడం పౌరుల బాధ్యత కాదా? వివిధ సముదాయాల ఆర్థిక స్థితి గతులు తెలుసుకోవడం కూడా సర్వే ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి పక్కా ఇంట్లో ఉంటున్నారా? పూరిగుడిసెలో ఉంటున్నారా అనే ప్రశ్నలు అడగవలసినవే. ఆస్తులే మున్నాయి? అసలున్నాయా? ఇల్లు ఉందా లేదా? ఎక్కడ తలదాచు కుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ అవసరమైనవే. ఈ ప్రశ్నలకు జవాబుల్లోనే ఏ సముదాయం ప్రజలకు ఆదాయవనరులు అందుబాటులో లేవు, ఎవరికి విద్యావసతి అందుబాటులో లేదు వంటి వివరాలు తెలుస్తాయి. రాజ్యంగం ప్రకారం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించాలి. అవసరమైన గణాంకాలు లేకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఎలా సాధించగలం?ఉండవలసిన ప్రశ్నలుఇది ప్రాచీన దేశం. వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఉనికిలోకి వచ్చాయి. విభిన్న సముదాయాల స్థితిగతుల్లో చాలా తేడా కనిపిస్తుంది. అర్ధసంచార జాతులు, సంచార జాతులు, డినోటిఫైడ్ ట్రైబ్స్ అనేకం ఉన్నాయి. వారికి సంబంధించిన గణాంకాలు లేకపోతే, ప్రభుత్వం ప్రణాళికా రచన ఎలా చేయగలదు? అందువల్లనే రాహుల్ గాంధీ తన న్యాయ్ యాత్రలో ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పారు. డాటా లేకపోతే వెనుకబాటును నిర్ధారించి రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యం? వెనుకబడిన వర్గాలన్నీ పేదవర్గాలు కాకపోవచ్చు. వారందరికీ రిజర్వేషన్లు అవసరం లేకపోవచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాలంటే డాటా కావాలి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాల్లో ఏ సముదాయం ఎంత శాతం కలిగి ఉంది? రాజ్యంగంలోని అధికరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం అందరికీ ఉండాలి. రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం కాని, సామాజిక, ఆర్థిక సంక్షేమ చర్యలు చేప ట్టడం కాని ఏది చేయాలన్నా డాటా అవసరం. రాజ్యాంగంలోని అధి కరణ 17 ప్రకారం అంటరానితనం నేరం. సమాజంలో ఏదో ఒక రూపంలో అంటరానితనం ఉంది కాబట్టి ఈ సర్వేలో దానికి సంబంధించి ఒక ప్రశ్న ఉండవలసింది. విద్యాహక్కు అందరికీ ఉంది. కానీ ఎంతమందికి విద్య అందు బాటులో లేదు? అధికరణ 23 హ్యూమన్ ట్రాఫికింగ్ను నిషేధిస్తుంది. వెట్టిచాకిరిని నిషేధిస్తుంది. సర్వే జరగకపోతే ఎంత మంది వెట్టిచాకిరిలో ఉన్నారు? అనే వివరాలు ఎలా తెలుస్తాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న కూడా ప్రస్తుత సర్వేలో లేదు. మహానగరాల రెడ్ లైట్ ఏరియాల్లో, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎంతమంది మగ్గిపోతున్నారు? వెట్టిచాకిరి, హ్యూమన్ ట్రాఫికింగ్, బాలకార్మికులు వంటి సమస్యలు పరిష్కరించాలంటే డాటా కావాలి. సంపద కొందరి చేతుల్లోనే పోగుపడరాదు. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవాలంటే, సంపదకు సంబంధించిన డాటా ఉండాలి. ఎవరు ఎంత భూమి కలిగి ఉన్నారు? ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు? ఏ కులం పరిస్థితి ఎలా ఉంది? ఎవరి బ్యాంకు ఎక్కౌంట్లు ఎలా ఉన్నాయి?వంటి ప్రశ్నలకు సమాధానాలు వస్తేనే ఎవరు సంపన్నులు, ఎవరు బాగా బతుకుతున్నారు? ఎవరు ఇతరుల వాటాను కబళిస్తున్నారు? వంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అందుకే దోపిడీ శక్తులు కులగణనను వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకిస్తున్న వారంతా అగ్రవర్ణాలకు చెందినవారే అన్నది గమనించాలి. దురదృష్టవశాత్తు కొందరు అభివృద్ధి చెందిన వెనుకబడిన కులాలవారు, అభివృద్ధి సాధించిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగల వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కూడాను. ఎందుకు అవసరం?ఇందిరా సాహ్ని కేసుతో సహా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయమై స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చింది. 1966లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు కోర్టులు ఈ ప్రతిపాదనను డాటా లేనందువల్ల కొట్టేశాయి. సర్వేలు ఏవీ జరగ లేదు. మురళీధర్ కమిషన్ విషయంలోనూ ఇదే జరిగింది. మురళీధర్ కమిషన్ ఈ సర్వే నిర్వహించలేదు. డాటా లేదన్న కారణంతో కోర్టులు కమిషన్ సిఫారసులను కొట్టేశాయి. భారతదేశంలో ఇప్పుడు లభి స్తున్న రిజర్వేషన్లకు కారణం బ్రిటిషు వారి కాలంలో, 1931లో చేసిన కులగణన. దీని ఆధారంగానే మండల్ కమిషన్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. మండల్ కమిషన్ రిపోర్టులో బీసీ జనాభా 52 శాతంగా నిర్ధారించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ కులగణన చేయించలేదు. కులగణన అనేది రాజ్యాంగబద్ధమైన అవసరం.అధికరణ 38 ప్రకారం ప్రభుత్వం సోషల్ ఆర్డర్ను కాపాడటం ద్వారా ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలి. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ న్యాయాలు సాధించాలి. ఇందులో రాజకీయ న్యాయాన్ని కూడా మరిచిపోరాదు. పురుషులు, మహిళలకు సమానంగా తగిన జీవనోపాధి హక్కు, భౌతిక వనరుల యాజమాన్యం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారి తీయకుండా చూడటం, సమాన పనికి సమాన వేతనం గురించి ప్రభుత్వాలకు నిర్దేశాలున్నాయి. గణాంకాలతోనే సామాజిక న్యాయంస్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అదే అధికరణ 243 డి 6. ఈ అధికరణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది. 1992లో ఈ అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు పంచాయితీల్లో, చైర్పర్సన్ల ఎన్నికల్లో తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందే హక్కు ఉంది. అయితే వెనుకబడిన వర్గాలు రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన రిజ ర్వేషన్లు పొందగలరు. అందువల్లనే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో పంచా యత్ రాజ్ చట్టం 1994 తీసుకువచ్చారు. ఆ విధంగా స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లు 1994 నుంచి గత ఎన్నికలకు ముందు వరకు లభిస్తూ వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు క్యాప్ 50 శాతం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థానాల లభ్యతను బట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే కుల సముదాయాల డాటా అందుబాటులో లేకపోవడం వల్లనే. అందు వల్లనే కులగణన అవసరం.సమగ్ర కుటుంబసర్వేలో కానీ, కులగణనలో కానీ ఉన్న ప్రశ్నలు పాతవే. 2011లో జరిగిన సర్వేలో ఉన్న ప్రశ్నలే ఇప్పుడూ అడుగు తున్నారు. అప్పుడు ఎవ్వరు అభ్యంతరాలు చెప్పలేదు. నిజానికి, గణాంకాల చట్టం ఉంది. అధికరణ 342 ఏ (3) ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. శ్రీశ్రీశ్రీ రవిశంకర్ దేశంలో కులగణన జరిగితే తిరుగుబాట్లు జరుగుతాయని మాట్లాడారు. కులగణన జరగకపోతేనే అణగారిన వర్గాలు తిరగబడి అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. కులరహిత వ్యవస్థ ఏర్పడాలంటే కులగణన తప్పనిసరి అవసరం. బడుగు బలహీనవర్గాలు సామాజికంగా కాస్త పైస్థాయికి చేరుకున్న ప్పుడే కులాంతర వివాహాలు జరుగుతాయి. ఆ విధంగా కులనిర్మూ లన జరుగుతుంది. అందువల్ల అందరూ కులగణనకు సహకరించా లని కోరుతున్నాను. కులగణన సమగ్ర ప్రగతి వికాసాలకు తోడ్పడే మొదటి అడుగు.జస్టిస్ వి.ఈశ్వరయ్య వ్యాసకర్త జాతీయ బీసీ కమీషన్ మాజీ చైర్మన్ -
సమగ్ర కుటుంబ సర్వే.. ఎందుకీ ఆలస్యం?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్వేలో వివరాలు వెల్లడించేందుకు చాలామంది నిరాకస్తున్నారు. వివరాలు గోప్యంగానే ఉంటాయని ప్రభుత్వం భరోసాస్తున్నప్పటికీ ప్రజలు ఎన్యుమరేటర్లకు సహకరించడం లేదు. దీనికి తోడు.. ఫామ్లో మార్పుల వల్ల ఒకరోజు ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్లో నిన్నటి వరకు స్టిక్కరింగ్ కార్యక్రమం కొనసాగింది. ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల ఇళ్లలో ఎన్యుమరేటర్లు సర్వే చేశారు. సర్వే కోసం ఒక్కో ఇంటివద్ద 20 నుంచి 35 నిమిషాల సమయం తీసుకున్నారు. చాలాచోట్ల.. ఇంటి యజమానులు ఎన్నికల హామీలపై నిలదీస్తుండడంతో ఎన్యుమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సర్వే సాఫీగా సాగుతుందనే ధీమాతో ఉంది.చదవండి: కులగణనపై కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి: పొన్నం -
అనుమానాలొద్దు.. సలహాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ఇంటింటి సర్వే చేస్తూనే బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ఆ వర్గానికి సంబంధించిన కుల గణన చేయటానికి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంలో తమ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలు శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పాలితులను పాలకులను చేయడానికే తమ తపన అని వ్యాఖ్యానించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి చేపట్టిన చర్యల తరహాలోనే రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడే గొప్ప నిర్ణయమైనందున దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై చర్చలో భాగంగా బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన సందేహాలపై సీఎం వివరణ ఇచ్చారు. అండగా ఉండాలంటే లెక్కలు తెలియాలని సుప్రీం చెప్పింది ‘ఈ తీర్మానంపై సలహాలు సూచనలు ఇవ్వటం కంటే అనుమానాలు లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించటంతో పాటు ప్రజల్లో సందేహాలు రేకెత్తించేలా ప్రధాన ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారు. యూపీఏ–1 హయాంలో మైనారిటీల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టాలని నిర్ణయించి జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ వేశారు. దాని సిఫారసుల ఫలితంగా ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పుడు బీసీల సమగ్ర అభ్యున్నతి కోసం, వారికి ప్రభుత్వం అండగా నిలవాలన్న రాహుల్గాంధీ ఆలోచన మేరకు మా ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రజలకు వెల్లడించలేదు. పదేళ్లయినా అది ఓ రహస్య నివేదికగానే ఉండిపోయింది. ఒకే ఒక కుటుంబం ఆ వివరాలను అవసరమైనప్పుడు చూసుకుని, ఎన్నికల సమయంలో దాన్ని వాడుకుంది. మాకు అలాంటి ఉద్దేశం లేదు. ఈ తీర్మానం అత్యంత కీలకమైంది. బలహీనవర్గాలకు అండగా నిలబడాలంటే ఆ వర్గం లెక్కలేంటో తెలియాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని అమలు చేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉందనే అనుమానాలు ఏవైనా ప్రతిపక్షానికి ఉంటే వాటిని వెల్లడిస్తూ మంచి సూచనలు చేయాలి..’అని సీఎం కోరారు. అర శాతం ఉన్నోళ్లకు బాధగానే ఉంటుంది.. ‘అర శాతం ఉన్నోళ్లకు కచి్చతంగా బాధ ఉంటుంది. రాష్ట్రాన్ని గుప్పిట్లో ఉంచుకున్నోళ్లకు.. ఇప్పుడు లెక్కలన్నీ బయటకు వచ్చి 50 శాతం ఉన్నోళ్లకు రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న బాధ ఉండొచ్చు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి అభిప్రాయం చెప్పాలి. లేదా వారు బాధ్యత అప్పగించిన వారైనా చెప్పాలి. నకలుæ చిట్టీలు అందించినట్టు కడియం శ్రీహరి పక్కన చేరి వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై మాకు సందేహం లేదు. కానీ, పక్కన కూర్చున్నవారి సావాస దోషం ఆయనను తప్పుదోవ పట్టిస్తోంది. మేనిఫెస్టో, ఎన్నికల హామీలపై చర్చ కావాలంటే ప్రత్యేకంగా పెట్టుకుందాం. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష పార్టీ ఏం హామీ ఇచ్చింది, వాటిని ఎంతమేర అమలు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన హామీలు, ఈ 70 రోజుల్లో అమలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దాం..’అని రేవంత్ అన్నారు. కేవలం బీసీల కులగణనతో వారికే నష్టం: గంగుల కమలాకర్ బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, అయితే దీనిపై కొన్ని సందేహాలున్నాయని అన్నారు. తీర్మానం కాకుండా బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం బీసీ కుల గణన చేస్తే చివరికి బీసీలే నష్టపోతారని పేర్కొన్నారు. సర్వే ఎప్పట్లోగా చేసి వివరాలు వెల్లడిస్తారో కూడా చెప్పాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారని, వచ్చే జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో దాన్ని అమలు చేయాలని కోరారు. బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్ప్లాన్ తెస్తామని చెప్పినా బడ్జెట్లో వాటి ఊసు లేదన్నారు. తీర్మానంలో స్పష్టత లేదు: కడియం శ్రీహరి తీర్మానంలో స్పష్టత లోపించిందని, సమగ్ర కుటుంబ సర్వే అని, బీసీ కుల గణన అని ఉందని, ఇందులో ఏది చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని తీర్మానంలో పూర్తి స్పష్టత ఉందని, అన్ని వర్గాలు, అన్ని కులాల ఆర్థిక, సామాజిక ఇతర అంశాల పూర్తి వివరాలను సర్వే ద్వారా సేకరించనున్నట్టు చెప్పారు. బీసీ కులగణన కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు. విపక్షం ఒకవేళ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్టైతే ఆ విషయం బహిరంగంగా చెప్పాలని అన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా కులగణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (కులగణన) పేరుతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిపేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతులతోపాటు ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాల అభ్యున్నతికి చేపట్టాల్సిన ప్రణాళికలను రూపొందించేందుకు ఉద్దేశించిన ఈ తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం సభ ముందుంచారు. సీఎం ఎ.రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, గంగుల కమలాకర్, కడియం శ్రీహరి, కాలేరు వెంకటేశ్, కాంగ్రెస్ సభ్యులు వాకాటి శ్రీహరి, శంకరయ్య, ఆది శ్రీనివాస్, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చర్చలో పాల్గొన్నారు. చట్టం అవసరం లేదు: పొన్నం ప్రభాకర్ జనాభా దామాషా పద్ధతిలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణన ఎలా చేయాలనే దానిపై అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామని, ఇందుకు సంబంధించిన విధివిధానా లు రూపొందిస్తామని చెప్పారు. కులగణన తీర్మానంపై సభలో జరిగిన చర్చకు ఆయన బదులిచ్చారు. కులగణనకు ఎలాంటి చట్టం అవసరం లేదని, 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎలాంటి చట్టం లేకుండానే చేపట్టిందని తెలిపారు. అయితే తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టడంతో పదేళ్లుగా వెనక్కు పోయిందని అన్నారు. 2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పటికీ బయట పెట్టలేదని విమర్శించారు. తాజాగా చేపట్టనున్న సర్వే అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజలు రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2014 నుంచి 2023 వరకు అప్పటి ప్రభుత్వం బీసీల కోసం రూ.23 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. ఎంబీసీలకు వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. న్యాయపరమైన సలహాల మేరకే ముందుకు: భట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రంలో కులగణనకు అంకురార్పణ చేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. ‘ఎవరెంత ఉంటారో వారికి అంత చెందాలి’అని రాహుల్గాంధీ చెప్పారని, అందుకు అనుగుణంగానే ఈ నెల 4న కేబినెట్లో చర్చించి కులగణన చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. బీసీలకు సబ్ప్లాన్ కూడా తీసుకొస్తామని, సర్వే అనంతరం బీసీల శాతాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పారు. చట్టబద్ధత కల్పిస్తేనే మంచిది: కేటీఆర్ రాష్ట్రంలో కులగణనను బీఆర్ఎస్ సంపూర్ణంగా స్వాగతిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చట్టబద్ధత కల్పిస్తేనే ఫలవంతమవుతుందని చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ మొదటి నుంచి పనిచేస్తోందన్నారు. 2004లోనే కేసీఆర్.. ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్ రావుతో కలసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కలసి ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. 2014 తర్వాత శాసనసభలో రెండుసార్లు ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలి: అక్బరుద్దీన్ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు వీలుగా కులగణన చేపట్టేందుకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలతోపాటు మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధనలను తొలగించాలన్నారు. కూనంనేని మాట్లాడుతూ.. కులగణనకు సంబంధించిన విధివిధానాలు ఏమిటో తెలపాలని విజ్ఞప్తి చేశారు. బిల్లు రూపంలో తీసుకొస్తే చట్టబద్ధత ఉంటుందని సూచించారు. -
రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరపాలి
లక్డీకాపూల్ (హైదరాబాద్): రాష్ట్రప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపించాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజలకు గణన విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ జనగణనకు ఏర్పాటు చేసిన ఐక్య సదస్సు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ డేటా తన దగ్గర ఉంచుకుని కులం ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఎస్సీ, బీసీ కులాలకు చెందిన అధికారులను ఎంతమందిని పెట్టుకున్నారో పరిశీలిస్తే.. ప్రభుత్వ వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. చివరికి కాళేశ్వరంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు ఎవ్వరూ లేరని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రవీణ్ కుమార్ అంటే అందరి వాడని, కొందరి వాడు కాదన్నారు. గ్రామాల్లో ప్రతి ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ జన గణన కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు అనిల్, శారద, కృçష్ణుడు, రియాజ్, నాగరాజు పాల్గొన్నారు. -
సర్వేనే దిక్సూచి!
సాక్షి, హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే టీఆర్ఎస్కు ఎన్నికల ఆయుధమైంది. సర్వే వివరాల ఆధారంగానే ఆయా వర్గాలకు పలు రకాల హామీలిస్తోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ పార్టీ గెలుస్తుందన్న చర్చ ఊపందుకుంది. ఇదే సమయంలో తమ విజయావకాశాలపై టీఆర్ఎస్ ధీమాగా ఉంది. స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారం కైవసం చేసుకుంటామని కారు పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఒక కారణమైతే.. తన చేతిలో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే మరో కారణమని తెలుస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్దినెలలకే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రం లోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వైవిధ్యతపై స్పష్టత కోసం ఈ సర్వే చేపట్టారు. దీనిపై చాలా ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ సర్వే తరువాత కారు పార్టీ ప్రతి ఎన్నికలోనూ విజయం సాధిస్తూ టాప్గేర్లో దూసుకుపోయింది. మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికతో మొదలు 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానంతోపాటు మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి రెండుచోట్లా విజయం సాధించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో మెదక్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సరిగ్గా మెదక్ ఉపఎన్నికకు ముందు కేసీఆర్ సమగ్ర కుటుంబసర్వే చేపట్టారు. దీని ఆధారంగా భవిష్యత్తులో వివిధ సంక్షేమ పథకాలు చేపడతానని అప్పట్లో ప్రకటించారు. మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. 2015లో కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 150 డివిజన్లలో 99 స్థానాలు కైవస ం చేసుకుంది. తరువాత నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్రెడ్డి ఆకస్మిక మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు భూపాల్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇలా అన్ని పురపాలక, నగరపాలికల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగిస్తూ వస్తోంది. సర్వేనే ఆయుధమా? వాస్తవానికి నారాయణఖేడ్, పాలేరులో కాంగ్రెస్కు బలం ఎక్కువ. పైగా సానుభూతి కలసి వస్తుందనుకున్న కాంగ్రెస్కు రెండు సందర్భాల్లోనూ పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సమగ్ర కుటుంబ సర్వేపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో ఏ ఏ వర్గాల వారు నివసిస్తున్నారు... వారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు, ఆ ప్రాంత భౌగోళిక స్థితులు, అవసరాలేమిటి... వంటి వాటిని గ్రహించి టీఆర్ఎస్ తన వ్యూహాలను రచిస్తోంది. ఆ మేరకు ప్రచార ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎక్కడ ఎవరు ప్రచారం చేయాలి? ఏ ఏ విషయాలు మాట్లాడాలన్న దానిలోనూ సర్వేనే ఆధారం. టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లేందుకు కారణం కూడా ఇదేనని విశ్వసనీయ సమాచారం. సంక్షేమ పథకాలతోపాటు సమగ్ర కుటుంబసర్వే ఈ ఎన్నికల్లో తమను గట్టెక్కిస్తుందని కేసీఆర్ ధీమాతో ఉన్నట్లు తెలిసింది. -
భూముల లెక్క తేలుద్దాం!
♦ రాష్ట్రంలో అన్ని భూముల పూర్తి వివరాల నమోదుకు సర్కారు నిర్ణయం ♦ సమగ్ర కుటుంబ సర్వే తరహాలో భారీ సర్వేకు కసరత్తు ♦ వేలాది మంది ఉద్యోగులు, సిబ్బందితో మూడు రోజుల పాటు నిర్వహణ ♦ ఆగస్టు చివరి వారంలో సర్వే చేపట్టాలని సీఎం యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని భూము ల వివరాలను పక్కాగా రికార్డు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ తరహా భూములు, వాటి విస్తీర్ణం, యజమానులు తదితర అన్ని అంశాలనూ నమోదు చేయనుంది. ఇందుకోసం సమగ్ర కుటుంబ సర్వే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా మరో భారీ సర్వేకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే 3 రోజుల పాటు రాష్ట్రమంతటా సమగ్ర భూముల సర్వే చేయిం చాలని సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయిం చారు. పల్లెల నుంచి పట్నం వరకు ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది, ఎవరెవరి పేరట ఉంది, విస్తీర్ణం ఎంత, సాగు భూములెన్ని, హక్కుదా రులెవరు.. ఇలా ప్రతి అంగుళం భూమి వివరాలన్నీ సేకరించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ సర్వే నిర్వహించనున్నారు. ఇక వివాదాలకు చెక్.. ఈ సర్వే సందర్భంగా భూముల వివాదాలను పరిష్కరించి.. వాస్తవ యజమానులెవరో గుర్తించి, ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే సీఎం ఇప్పటికే ఈ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం కావడంతో ఆగస్టు 15 వరకు హరితహారం కార్యక్రమంపై దృష్టి సారించాలని... ఆ నెల చివరి వారంలో భూముల సమ గ్ర సర్వే చేపట్టాలని అధికారులకు సూచించారు. సర్వే నిర్వహణకు ఉద్యోగులు సరిపోకపోతే.. 15 వేల మంది వరకు నిరుద్యోగ యువకులను వినియోగించుకోవాలని ఆదేశించారు. పెట్టుబడి పథకానికి ముందస్తు వ్యూహం! వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాదాపు రూ.11 వేల కోట్ల భారీ వ్యయంతో కూడిన పథకం కావటంతో.. అవకతవకలకు తావు లేకుండా, పక్కాగా అమలు చేసేందుకు సర్కారు ముందస్తు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో సాగు భూముల సర్వే చేయించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ సర్వేలో దాదాపు 1.26 కోట్ల ఎకరాల సాగు భూములున్నట్లు తేలింది. అయితే తమ భూముల వివరాలు ఇంకా నమోదు కాలేదని, మరో అవకాశం ఇవ్వాలంటూ రైతుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. అంతేగాకుండా వివాదాలు, కోర్టు కేసుల్లో ఉండడం వంటి కారణాలతో మరో 12 శాతం భూముల వివరాల నమోదు పెండింగ్లో పడింది. ఈ నేపథ్యంలోనే సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం మొగ్గు చూపింది. యూనిక్ కోడ్తో టైటిల్ డీడ్ భూమి లెక్కలు తేలిన తర్వాత కొత్తగా టైటిల్ డీడ్ కమ్ పాస్ పుస్తకాలు ఇస్తారు. ప్రతి రైతుకు, పాస్ పుస్తకానికి ప్రత్యేక (యూనిక్) కోడ్ ఇస్తారు. భూరికార్డులన్నీ సరిచేసిన తర్వాత రూపొందించిన జాబితానే ప్రభుత్వం అనుసరిస్తుంది. అందులోని వివరాల ఆధారంగా.. ఏ రైతు వద్ద ఎంత భూమి ఉందనే దాని ప్రకారం పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తుంది. ఇక రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాలు, వారసత్వ బదిలీ, పేరు మార్పిడి విధానాలన్నీ అక్టోబర్ నెలాఖరులోగా సరళంగా, పారదర్శకంగా అమలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. మ్యుటేషన్, పాస్ పుస్తకాల జారీ వంటివి నిర్ధారిత సమయంలోగా చేయకుంటే సంబంధిత అధికారికి జరిమానా విధించేలా కొత్త విధానాన్ని రూపొందించనున్నారు. రెవెన్యూ రికార్డుల సవరణ.. ప్రచురణ నిజాం కాలంలో అమల్లోకి వచ్చిన రెవెన్యూ విలేజ్ విధానంలో నిర్ణయించిన గ్రామ శివార్లు, అప్పటి సర్వే నంబర్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం రెవె న్యూ శాఖ వద్ద, వ్యవసాయాధికారుల వద్ద భూమి రికార్డులున్నాయి. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోవటంతో భూవివాదాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వే ద్వారా వివాదాలను పరిష్కరించనున్నారు. మొత్తం వ్యవసాయ భూముల రికార్డులన్నీ సర్వే వివరాలతో సరి పోల్చి, అవసరమైన సవరణలు చేస్తారు. అనంతరం ఆయా గ్రామాల వారీగా భూముల వివరాలు, వాటి యజమానులు, సర్వే నంబర్లు, సర్వే సందర్భంగా సవరించిన రికార్డుల వివరాలన్నీ ఓటర్ల జాబితాల తరహాలో అందరికీ అందుబాటులో ఉండేలా గ్రామాల్లో ప్రదర్శిస్తారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి, విచారణ జరుపుతారు. అవసరమైన సవరణలు, మార్పులు చేర్పులతో భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ తుది భూముల రికార్డుల్లోనూ ఏవైనా అభ్యంతరాలుంటే.. పరిశీలించి, సరిదిద్దుతారు. -
తగ్గిన ముస్లింలు.. పెరిగిన హిందువులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో హిందువుల సంఖ్య రెండుశాతం పెరగగా, ముస్లింల సంఖ్య ఒక శాతానికి పైగా తగ్గింది. కేంద్ర జనగణన విభాగం చేపట్టిన 2011 జనాభా లెక్కలతో నిరుడు తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ఒకరోజు సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే మతాల వారీగా జనాభాలో హెచ్చుతగ్గులిలా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని పది జిల్లాల్లో మొత్తం జనాభా 3.51 కోట్లు. గతేడాది ఆగస్టు 19న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో మొత్తం 3.63 కోట్ల మంది జనాభా ఉన్నట్లు లెక్కతేలింది. అదే సర్వేలో మతాల వారీగా కుటుంబాల వివరాలను సైతం ప్రభుత్వం సేకరించింది. కుటుంబాలకు, జనాభాకు స్వల్ప వ్యత్యాసమే ఉంటుందని.. ఇంచుమించుగా ఇదే ఫలితాలు ప్రతిబింబిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 87.17 శాతం హిందువుల కుటుంబాలున్నాయి. 2011 లెక్కల ప్రకారం హిందువులు 85.09 శాతం మంది ఉండడం గమనార్హం. దీంతో నాలుగేళ్లలో హిందువులు 2.08 శాతం పెరిగినట్లు అర్థమవుతోంది. ముస్లింలు 2011లో 12.65 శాతం ఉండగా, సమగ్ర సర్వే ప్రకారం 11.01 శాతం ఉన్నారు. అంటే 1.64 శాతం తగ్గినట్లు స్పష్టమవుతోంది. క్రిస్టియన్ల సంఖ్యలో మార్పేమీ లేకపోవడం గమనార్హం. 2011 లెక్కల ప్రకారం 1.27 శాతం క్రిస్టియను ఉన్నారు. సిక్కులు 0.15 శాతం, జైనులు 0.06 శాతం, బుద్ధులు 0.05 శాతం ఉన్నట్లు తేలింది. 2011తో పోలిస్తే ఈ మూడు మతాల జనాభా స్వల్పంగా పెరిగింది. -
జీవనభృతికి మళ్లీ మెలిక
మారిన నిబంధనలు.. పీఎఫ్ తప్పనిసరి.. యాభై ఏళ్ల లోపు వారికే.. కోరుట్ల: బీడీ కార్మికుల జీవన భృతికి సర్కారు మరో మెలిక పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికురాలిగా నమోదు కాని కారణంగా భృతిని పొందలేకపోయిన వారి కోసం మరోసారి సర్వేకు సిద్ధమవుతున్న తరుణంలోనే నిబంధనలు మార్చింది. గతంలో బీడీ కార్మిక భృతికి ఎంపిక నిబంధనలను మారుస్తూ కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బీడీ కార్మికులకు తప్పని సరిగా పీఎఫ్ ఉండడంతో పాటు, యాభై ఏళ్లలోపు వయస్సు ఉండాలని నిర్దేశించింది. తాజా దరఖాస్తులు 1.20 లక్షలు సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మొదటి విడత బీడీ కార్మిక భృతి కోసం అర్హులను ఎంపిక చేశారు. అయితే, పీఎఫ్ ఉండి.. అన్ని అర్హతలున్నా, సమగ్ర సర్వేలో నమోదు కాని కారణంగా తమకు బీడీ కార్మిక భృతి అందలేదని ఆందోళన వ్యక్తమైంది. దీంతో బీడీ కార్మికులు భృతి కోసం మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో బీడీ కార్మిక భృతి కోసం కరీంనగర్ జిల్లాలో 44 వేలు, ఆదిలాబాద్లో 8 వేలు, మెదక్లో 13 వేలు, నిజామాబాద్లో 48 వేలు, వరంగల్లో 6 వేల మంది దరఖాస్తులు వచ్చినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇలా దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించిన సర్వే.. ఎంపిక కోసం ఈనెల 7న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో ఎంఎస్ 38 ద్వారా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పీఎఫ్తో పాటు యాభై ఏళ్లలోపు వారైతేనే గతంలో బీడీ కార్మికుల పీఎఫ్తో సంబంధం లేకుండా.. బీడీ కార్మికురాలిగా నమోదై.. సర్వేలో బీడీలు చుడుతున్నట్లు తేలిన వారికి భృతి మంజూరు చేశారు. ఈసారి మాత్రం బీడీ కార్మిక భృతి కోసం పీఎఫ్ తప్పనిసరి చేశారు. 28 ఫిబ్రవరి 2014లోపు బీడీ కార్మికురాలు పీఎఫ్ నమోదు చేసుకుని ఉండాలి. దీంతో పాటు యాభై ఏళ్ల లోపు వయసున్న వారికే బీడీ కార్మిక భృతి మంజూరు చేయనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మొదటి విడతలో పీఎఫ్ లేని వారికి బీడీ కార్మిక భృతి ఇవ్వడంతో చాలా మంది పీఎఫ్ లేని బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా బీడీ కార్మిక భృతి మంజూరు చేశారు. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో తమకు రెండో విడత సర్వేలోనూ బీడీ కార్మిక భృతి అందని ద్రాక్షే అవుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. -
జనాభా ప్రాతిపదికన బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులలోని ఆయా కులాల్లో జనాభాను బట్టి బీసీ సహకార ఫెడరేషన్లకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరుపనుంది. గతేడాది ఆగస్టు 19న సమగ్ర కుటుంబసర్వేలో ఆయా బీసీ కులాలకు సంబంధించి లెక్కలకు అనుగుణంగా ఆయా ఫెడరేషన్లకు 2015-16 బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన సమాచారం ప్రకారం రాష్ర్టంలో విశ్వబ్రాహ్మణ, అనుబంధకులాలు కలుపుకుని 9.5 లక్షల మంది, రజకుల సంఖ్య 8.5 లక్షలుగా తేలింది. ఇక ఇతర వెనుకబడిన కులాల వివరాల విషయానికి వస్తే వడ్డెరలు 3.75 లక్షలు, కుమ్మరి, శాలివాహన 3.70 లక్షలు, నాయి బ్రాహ్మణులు 3 లక్షలు, వాల్మీకి/బోయలు దాదాపు 3 లక్షలు, సగర (ఉప్పర) 1.20 లక్షలు, మేదర 91 వేలు, కృష్ణ బలిజ/పూసల 38 వేలు, భట్రాజ్లు 17 వేలు ఉన్నట్టు స్పష్టమైంది. ఈ పది కులాలకు సంబంధించిన సహకార ఫెడరేషన్లకు వచ్చే బడ్జెట్లో కేటాయింపులపై గతంలోనే కొంత కసరత్తు జరిగింది. ఆయా ఫెడరేషన్లకు బడ్జెట్ ప్రతిపాదనలు దాదాపు సిద్ధం చేశారు. అయితే ఆ తర్వాత సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన వివరాలకు అనుగుణంగా ఆయా కులాల లెక్కలు తీసి బడ్జెట్ ప్రతిపాదలను తాజాగా రూపొందించారు. మొత్తంగా చూస్తే ఈ కులాలకు సంబంధించిన పది సహకార ఫెడరేషన్లకు దాదాపు రూ.160-170 కోట్ల వర కు ప్రతిపాదించి ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. ఆయా శాఖలవారీగా బడ్జెట్ కసరత్తు ముగిశాక, ఈ ప్రతిపాదనలకు కూడా తుదిరూపం ఇచ్చి వార్షిక బడ్జెట్లో పెట్టనున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. -
30 ఏళ్లలోపు పెళ్లికాని యువతులు 8వేల మంది
పోరాటాల పురిటిగడ్డగా కీర్తికెక్కిన నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత కలిగి ఉందని చెబుతున్నాయి సమగ్రకుటుంబ సర్వే గణాంకాలు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాల కోవకు వచ్చే కరీంనగర్, వరంగల్తో పాటు పేదజిల్లాగా, వలసలకు అడ్డాగా గుర్తింపు పొందిన మహబూబ్నగర్తోనూ పోటీపడగలదని తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు19న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లావాసులు ఏం చెప్పారో... ఆ లెక్కలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవాలంటే మధ్యపేజీల్లోకి వెళ్లాల్సిందే.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సమగ్ర కుటుంబ సర్వేతో జిల్లా ముఖచిత్రం ఆవిష్కృతమైంది. అన్నింటా మన జిల్లా ప్రత్యేకత చాటుకుంది. ఇంటి స్థలం లేని వారి నుంచి ఆరెకరాల భూమి ఉన్న వారి వరకు.. సొంత ఇంటి నుంచి ఆద్దె ఇళ్లలో ఉంటున్న వారి వరకు... అనాథలు, ఒంటరి మహిళలు, వికలాంగులు, రోగాలతో బాధపడుతున్న వారు.... ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, బ్యాంకు ఖాతాలు, స్వయం సహాయక సంఘాల్లో ప్రాతినిధ్యం.... ఇలా అన్ని రంగాల్లోనూ జిల్లా వాసులు పోటీపడుతూనే ఉన్నారు. అన్నింటిలోనూ మొదటి మూడు, నాలుగు స్థానాల్లోనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు 19న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేనిర్వహించిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన ఈ లెక్కలను శాస్త్రీయంగా పరిగణించలేం. కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే సర్వేలో ప్రజలు పూర్తి వివరాలను కచ్చితంగా చెప్పారన్నదానికి ఆధారం లేదు. సర్వేలో ప్రజలు తమ ఇష్టపూర్వకంగా ఇచ్చిన సమాచారం ప్రకారం రూపొందించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. ‘భూమి’పుత్రులకు నెలవు సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడయిన అంశాలను పరిశీలిస్తే జిల్లాలో ‘భూమి’ ఉన్నవారు సగానికిపైగానే ఉన్నారు. మొత్తం 11,01,439 మంది ఇచ్చిన వివరాల ప్రకారం జిల్లాలో సొంతస్థలం ఉన్నవారి సంఖ్య 4,58,911 మంది. తెలంగాణలో మహబూబ్నగర్ తర్వాత మన జిల్లాలోనే ఈ సంఖ్య ఎక్కువ. ఇక, అసలు స్థలం కూడా లేని వారు కూడా ఎక్కువేనండోయ్. వారి సంఖ్య 6,42,528. ఇక పొలం విషయానికి వస్తే ఎకరం కంటే తక్కువ ఉన్న వారు జిల్లాలో 10శాతం మంది ఉన్నారు. మొత్తం 1,25,260 మందికి ఎకరం కంటే తక్కువ భూమి ఉందని సర్వే లెక్కలు చెబుతుండగా, తెలంగాణలో ఇది మూడోస్థానం. మనకన్నా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎకరం కన్నా తక్కువ ఉన్న వారు ఎక్కువ ఉన్నారు. ఇక, ఎకరం నుంచి రెండకరాలున్నవారు 96,007 మంది, రెండు నుంచి మూడెకరాలున్నవారు 81,266 మంది, మూడు నుంచి నాలుగెకరాలు ఉన్నవారు 53,349 మంది, నాలుగు నుంచి ఐదెకరాలున్నవారు 45,516 మంది, ఐదు కన్నా ఎక్కువ ఎకరాలున్న వారు 98,989 మంది ఉన్నారు. అంటే ఎకరం కంటే ఎక్కువ ఉన్న వారికన్నా, ఐదు కన్నా ఎక్కువ ఎకరాలున్న వారున్న కుటుంబాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే, పేద జిల్లాగా పేరుపడ్డ మహబూబ్నగర్లో ఐదుకన్నా ఎక్కువ ఎకరాలున్న వారు మన జిల్లా కన్నా ఎక్కువ ఉండడం గమనార్హం. 30 ఏళ్లలోపు పెళ్లికాని మహిళలు 8వే ల మంది ఇక వర్గాల వారీగా పరిశీలిస్తే... జిల్లా అనాథలు, వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో అనాథలు 507 మంది ఉండగా, వికలాంగులు 68,218 మంది ఉన్నారు. అనాథల్లో రంగారెడ్డి తర్వాత, వికలాంగుల్లో కరీంనగర్ తర్వాత జిల్లానే మూడోస్థానంలో ఉంది. కనీసం ఇల్లు లేని సంచారజాతులు 1,25,001 మంది ఉంటే, ఇల్లున్న సంచార జాతుల వారు 1,024 మంది మాత్రమే. జిల్లాలో 30 ఏళ్లలోపు పెళ్లికాని మహిళల సంఖ్య 8,021 కాగా, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, భర్తలు వదిలిపెట్టిన మహిళలు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు. జిల్లాలో సఫాయి కార్మికులు కూడా 1,332 మంది ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చెబుతున్నాయి. రోగాలూ ఎక్కువే సర్వే లెక్కల ప్రకారం.. జిల్లాలో అనారోగ్యం బారిన పడుతున్న వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇందులో తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు 1,19,999 మంది ఉన్నారు. వరంగల్, కరీంనగర్ తర్వాత జిల్లాలోనే ఈ సంఖ్య ఎక్కువ. ఇక, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కరీంనగర్ జిల్లా తర్వాత జిల్లాలోనే ఎక్కువగా 4,762 మంది ఉన్నారు. హృద్రోగాలున్నవారు 17,211 మంది కాగా, క్షయ వ్యాధి 4,590 మందికి, కుష్టు వ్యాధి 921 మందికి ఉంది. పక్షవాతంతో బాధపడుతున్నవారు 8,212 మంది, ఆస్తమా వ్యాధిగ్రస్తులు 11,862 మంది ఉన్నారు. ఇక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు రాష్ట్రంలోనే అత్యధికంగా 1,711 మంది ఉన్నార ని సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదాయపు పన్ను కడుతున్న వారు తక్కువే.. తెలంగాణవ్యాప్తంగా పరిశీలిస్తే జిల్లాలో ఆదాయపు పన్ను కడుతున్న వారి సంఖ్య తక్కువేనని సమగ్ర సర్వే లెక్కలంటున్నాయి. జిల్లాలో మొత్తం 30,268 మంది ఆదాయపు పన్ను కడుతున్నారని సర్వేలో చెప్పగా, నిజామాబాద్ జిల్లాలోనే మన కన్నా తక్కువ మంది ఆదాయపు పన్ను ఖాతాలు కలిగి ఉన్నారు. ఇక, బ్యాంకు ఖాతాల విషయంలో మనం ముందంజలో ఉన్నామని, జిల్లాలో 8,68,237 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయని సర్వేలో తేలింది. పోస్టాఫీసు ఖాతాల విషయంలో అయితే మనం తెలంగాణలోనే టాప్లో ఉన్నాం. మొత్తం 3,94,648 మందికి పోస్టాఫీసు ఖాతాలుండగా, స్వయం సహాయక సంఘాల సభ్యత్వం ఉన్నవారు కూడా జిల్లాలో ఎక్కువగానే ఉన్నారు. కరీంనగర్ తర్వాత మన జిల్లాలోనే ఎక్కువగా 5,26,915 మందికి ఎస్హెచ్జీల్లో సభ్యత్వం ఉంది. ఇక చరాస్తుల విషయానికి వస్తే జిల్లాలో 2,22,358 ద్విచక్రవాహనాలు, 17,133 నాలుగు చక్రాల వాహనాలున్నాయి. ట్రాక్టర్లు, వ్యవసాయ సామాగ్రి వాహనాల సంఖ్య తెలంగాణలోనే జిల్లాలో అధికంగా ఉంది. మొత్తం 18,156 ట్రాక్టర్లు, వ్యవసాయ సామగ్రి వాహనాలున్నాయని సర్వే లెక్కలు చెబుతున్నాయి. చిన్నకుటుంబాలే ఎక్కువ.. సభ్యుల వారీగా కుటుంబాలను పరిశీలిస్తే జిల్లాలో చిన్నకుటుంబాల వారే ఎక్కువగా ఉన్నారు. అంటే చిన్నకుటుంబం - చింతలేని కుటుంబం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు జిల్లావాసులు. మొత్తం 11,01,439 కుటుంబాలిచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో ఒక్క మహిళ ఉన్న కుటుంబాలు 1,18,224. ఇది తెలంగాణలోనే ఎక్కువ. అచ్చం మహిళలే ఉన్న కుటుంబాలు 1,94,454. ఇది కూడా రంగారెడ్డి జిల్లా తర్వాత మన జిల్లాలోనే ఎక్కువ. అంటే జిల్లాలో మహిళలు పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబాలు బాగానే ఉన్నాయన్నమాట. ఇక, ఒకే పురుషుడున్న కుటుంబాలు కూడా జిల్లాలో 1,21,085 ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక, ఇద్దరు మాత్రమే ఉన్న కుటుంబాలు 2,37,167 కాగా, ముగ్గురున్న కుటుంబాలు 2,18,835, నలుగురున్న కుటుంబాలు 3,48,428 ఉన్నాయి. అంటే ఇద్దరు నుంచి నలుగురున్న కుటుంబాలు మొత్తం కుటుంబాల్లో 70శాతానికి పైగా ఉన్నాయన్నమాట. ఇక, పెద్ద కుటుంబాల విషయానికి వస్తే ఐదుగురుండే కుటుంబాలు 1,29,512 కాగా, ఆరుగురుండేవి 32,683, ఆరుగురు కన్నా ఎక్కువ ఉన్నవి 13,729 మాత్రమే. పెద్ద కుటుంబాలు కరీంనగర్, ఖమ్మం తర్వాత మన జిల్లాలోనే తక్కువ. అంటే లెక్కల ప్రకారం.. చివరి నుంచి మూడోస్థానంలో ఉన్నాం. విద్యుత్ లేని ఇళ్లలో మూడో స్థానం జిల్లాలోని ఇళ్లను పరిశీలిస్తే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సొంత ఇల్లున్న కుటుంబాలు 2,95,171 మంది. అంటే మొత్తం కుటుంబాల్లో ఇది 15శాతంపైమాటే. ఇక, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు జిల్లాలో 1,90,529 కుటుంబాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల తర్వాత అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారి సంఖ్య జిల్లాలోనే ఎక్కువ కావడం గమనార్హం. ఇక, ప్లాస్టిక్ కప్పులున్న ఇళ్లు 49,362, పూరిగుడిసెలు 49,310 (వరంగల్ తర్వాత మన దగ్గరే ఎక్కువ.), రాతికప్పులున్నవి 81,053 ఉన్నాయి. మొత్తం ఇళ్లలో 40శాతం ఇళ్లు కాంక్రీట్ శ్లాబ్ ఇళ్లేనని లెక్కలు చెబుతున్నాయి. కాంక్రీట్ కప్పులున్న ఇళ్లు జిల్లాలో 4,36,097 కాగా, మొత్తం ఇళ్లలో మరుగుదొడ్లు లేనివి 5.62లక్షలు. ఇక, విద్యుత్ సౌకర్యం కూడా లేని ఇళ్లు జిల్లాలో 1,84,439 ఉన్నాయని, ఆదిలాబాద్, మహబూబ్నగర్ల తర్వాత మన జిల్లాలోనే ఎక్కువని గణాంకాలు చెపుతున్నాయి. ఇక, ఒకే గదిలో నివసిస్తున్నవారు జిల్లాలో 5,10,044 మంది కాగా, రెండు గదుల్లో ఉండేవారు 4,01,302 మంది. అంటే మొత్తం కుటుంబాల్లో దాదాపు 90శాతం మంది రెండుగదుల్లోపే ఉంటున్నారు. ఇక, మూడు గదుల ఇళ్లు 1,05,260 కాగా, నాలుగు గదులున్న ఇళ్లు 61వేలేనని సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఉద్యోగ వర్గం.. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 31,192 మందికాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు 9,510 అని తేలింది. ఇక, వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు 25,103 మంది, ప్రభుత్వ రంగ సంస్థల్లో చేస్తున్న వారు 6,963 మంది ఉన్నారు. ఇక, నెలసరి వేతనం పొందే ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య 47,200 మంది. మతాలు, కులాల లెక్కలివి... సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో హిందూ మతస్తులు 10,33,702, ముస్లింలు 56,821, క్రిస్టియన్లు 9,178, సిక్కులు 737, జైనులు 40, బౌద్ధులు 21, ఇతరులు 940 మంది ఉన్నారని సర్వేలో పాల్గొన్న ప్రజలు చెప్పారు. ఇక, సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే జిల్లాలో బీసీల సంఖ్యే ఎక్కువ. మొత్తం జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలున్నారు. -
ఎన్నాళ్లు బాంచెన్!
పాత పింఛన్ లేక, కొత్తగా పింఛన్ అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం ఆధార్, ఎస్కేఎస్, ఆన్లైన్ తదితర కారణాలతో అనేకమందిలో గందరగోళం నెలకొంది. పింఛన్ రాదేమోననే బెంగతో డిచ్పల్లి మండలం సుద్దుపల్లి గ్రామానికి చెందిన మేకల లక్ష్మి (68) మృతి చెందింది. 30 రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాలలో ఇలా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రోజుకోచోట వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు రోడ్డెక్కుతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలో లోకేష్ అనే వికలాంగుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ అవస్థలు ఎన్నాళ్లో తెలియడం లేదు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిబంధనలు మారడం, నూతనంగా ఆసరా పథకం తెరపైకి రావడంతో పింఛన్దారులలో అయోమయం ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా రూ.1000 పిం ఛన్ అమలు కోసం చేపట్టిన సర్వే, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ప్రక్రియలు గందరగోళంగా మారాయి. దరఖాస్తు చే సుకున్నవారిలో అర్హులు చాలా మంది పింఛన్లు రాక అవస్థ పడుతున్నారు. గ తంలో పింఛన్ పొంది, కొత్త జాబితాలో పేర్లు లేనివారు విలపిస్తున్నారు. తామె లా బతికేదంటూ రోడ్డెక్కుతున్నారు. జి ల్లాలో గత నెల ఎనిమిదిన పింఛన్ల పం పిణీ ప్రారంభమైనా 61 మందికే అందజేశారు. ఆర్భాటంగా మొదలుపెట్టిన ఆసరా పథకం లబ్ధిదారులకు న్యాయం చేకూర్చలేకపోయింది. అధికారులు దర ఖాస్తుదారుల పరిశీలనలో అయోమయానికి గురవుతున్నారు. అర్హులను గుర్తించడంలో తప్పులు దొర్లుతున్నాయి. సాంకేతిక కారణాల తో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అర్హులను గుర్తించడంలో ఆలస్యం జరిగింది. మోర్తాడ్, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి ప్రాంతాలలో పరిశీలన నత్తనడకన సాగుతుంది. అక్టోబర్ 30లోగా దరఖా స్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని భావించారు. ఆచరణలో ఇది సాధ్యం కాలేదు. దీంతో ఈ తేదీని నవంబరు ఆరు వరకు పొడిగించారు. ఎనిమిద వ తేదీ నుంచి పింఛన్లు అందించాలని నిర్ణయించారు. అది కూడా సాధ్యం కాలేదు. ఇపుడు ఆ గడువును ఈనెల 15 వరకు పొడిగించారు. మండల, పట్టణ, నగర స్థాయిలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా గందరగోళం మాత్రం తొలగడం లేదు. నగర పరిధిలోనూ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పింఛన్ల పరిశీలన నేటికీ వరకు కొనసాగుతోంది. ఇక్కడ పింఛన్ల కోసం 35 వేల దరఖాస్తులు, ఆహార భద్రత కార్డుల కోసం 86 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన నేటి వరకు ముగియలేదు. కేవలం 60 శాతం పరిశీలన మాత్రమే జరిగింది. దీంతో పింఛన్ల పంపిణీ జరుగలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో 3,67,101 మంది పింఛన్దారులు ధరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అ నంతరం అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్లో కంప్యూటరీకరించా ల్సి ఉంది. వీటి కోసం కంప్యూటర్ కౌంటర్లు ఏర్పాటు చేసినా దరఖాస్తులు ఇంకా పూర్తిగా రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచి పోయిం ది. వృద్ధాప్య పింఛన్లలో వయసు నిర్ధార ణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో చాలా మంది అర్జీలు వయసు తక్కువ అంటూ తిరస్కారానికి గురయ్యాయి. వితంతు పింఛన్ల విషయంలో భర్త మరణ ధ్రువీక రణ పత్రం కావాలంటూ, ఆసుపత్రికి రావాలంటూ కొంతమందికి కత్తెర పెట్టారు. ఇక వికలాంగులకు సదరం ఐడి నంబర్ ఉంటేనే పింఛన్ ఇస్తామంటూ గొళ్లెం తగిలేశారు. సదరం శిబిరానికి హజరైన ఇంకా 30 శాతం మందికి ధ్రువీకరణ పత్రాలు అందాల్సి ఉంది. ఆగని ఆందోళనలు గత కొన్ని రోజులుగా జిల్లాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం పింఛన్ల కోసం గాంధారిలో వృద్ధులు ధర్నా, రాస్తారోకో చే పట్టారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందలో వృద్ధులు, వికలాం గు లు, వితంతువులు ఆందోళన నిర్వహించారు. సోమవారం దోమకొండ మండలం బీబీపేటకు చెందిన వికలాంగుడు లోకేశ్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యం లో కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. ఇంతకు ముందు ధర్పల్లి మం డ లంలో రెండుసార్లు ఎల్లారెడ్డిపల్లి, అంసాన్పల్లి గ్రామాలకు చెందిన పం డుటాకులు రాస్తారోకో నిర్వహించారు. జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామ పంచాయతీని గత నెలలో ముట్టడించారు. ఆర్మూర్లో అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎ దుట ధర్నా నిర్వహించారు. కల్లెడ, ఢీకంపల్లి గ్రామాలకు చెందిన పింఛన్దారులు మాక్లూర్ మండల కార్యాలయానికి తాళం వేసి నిజామాబాద్-నందిపేట రోడ్డుపై బైఠాయించారు. ఇదే మండలం అడవిమామి డిపల్లి లో నిరసన వ్యక్తం చేశారు. కోటగిరి మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఎల్లారెడ్డికి చెందిన పింఛన్దారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రలో రాస్తారోకో చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో నిరసనలు కొనసాగాయి. -
‘సమగ్ర’ నమోదు వివాదం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీలో టీడీపీ సభ్యుడు రేవంత్రెడ్డి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం కలిగించాయి. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఆమె నవీపేట మండలం పోతంగల్లో, హైదరాబాద్లో రెండు చోట్ల పేరు నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఆగ్రహం చెందిన తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ వర్గాలు టీడీపీ సభ్యుడు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం, బుధవారం జరిగిన చర్చలో అదే అంశాన్ని పదే పదే ప్రస్తావించడంతో అసెంబ్లీలోనూ ఉద్రిక్తతకు దారి తీసింది. అట్టుడికించిన ‘సమగ్ర సర్వే’ వివాదం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా రాష్ర్టవ్యాప్తంగా ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అనేక కష్టనష్టాలకోర్చి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల వివాదాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే క్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత నవీపేట మండలం పోతంగల్తోపాటు హైదరాబాద్లోను నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తాను పోతంగల్లోనే పేరు నమోదు చేసుకున్నానని కవిత స్పష్టం చేశారు. జిల్లా అధికారులు కూడా అదే నిజమని ఆధారాలతో సహా వెల్లడించారు. అప్పట్లో నాలుగైదు రోజులు ఈ వివాదం కొనసాగి, ఆ తర్వాత సద్దుమణిగింది. తాజాగా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్బంగా టీడీపీ సభ్యుడు రేవంత్రెడ్డి కవిత పోతంగల్, హైదరాబాద్లో రెండు చోట్ల పేరు నమోదు చేసుకున్నారని ప్రస్తావించడం, దీనిపై స్పందించిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, కొండా సురేఖ తదితరులు రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలని పట్టుపట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో లేని ఓ మహిళా నేతపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నిరసన వ్యక్తమయింది. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం సమగ్ర సర్వేలో ఎంపీ కవితనే రెండు చోట్ల పేరు నమోదు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించిన రేవంత్రెడ్డి తీరును టీడీపీ సభ్యులు సమర్థించగా, మంత్రి హరీష్రావు మాట్లాడుతూ రేవంత్రెడ్డి కవితపై వ్యాఖ్యలు చేయడం సమంజసంగా లేదని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పత్రికలలో వచ్చిన వాటిని పట్టుకొని విమర్శించడం తగదని టీడీపీ సభ్యులకు హితవు పలికారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఎంపీని అవమానిస్తారా?
* ఎంపీ కవితపై నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్రెడ్డిపై అధికారపక్షం ధ్వజం * టీడీపీ సభ్యుడుక్షమాపణలు చెప్పాలని డిమాండ్ * ముందుగా కేటీఆర్పై సభాహక్కుల నోటీసుకు చర్య తీసుకోవాలన్న టీడీపీ * రెండు పార్టీల ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: పాలక, విపక్షాల వాదోపవాదాలు, నిరసనల మధ్య శాసనసభ దద్దరిల్లింది. నిజామాబాద్ ఎంపీ కవితపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ సభ్యుల నిరసనకు, ఉద్రిక్తతకు దారితీసింది. సమగ్ర కుటుంబ సర్వేలో ఎంపీ కవిత రెండు చోట్ల తన పేరును నమోదు చేసుకున్నట్లు మంగళవారం బడ్జెట్పై చర్చ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు. దీనిపై బుధవారం అసెంబ్లీలో దుమారం రేగింది. రేవంత్రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చారని, నిజామాబాద్ ఎంపీకి, అసెంబ్లీ సభ్యులందరికీ ఆయన క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీనిపై ఏమాత్రం తొణకని టీడీపీ సభ్యులు.. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే ముందు మంత్రి తారకరామారావుపై ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పట్టుపట్టారు. దీంతో ఇరుపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికింది. రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాతే మరే అంశాన్నైనా ప్రస్తావించాలని అధికారపక్షం పట్టుబట్టడంతో రెండు గంటల పాటు సభ స్తంభించిపోయింది. రేవంత్రెడ్డి చేసిన అభియోగాలకు సంబంధించి వివిధ పార్టీల నేతల అభిప్రాయాలను స్పీకర్ కోరారు. అవి తప్పుడు అభియోగాలైతే.. భేషజానికి పోకుండా వాటిని ఉపసంహరించుకోవాలని వారంతా సూచించారు. అంతకుముందు సాధారణ బడ్జెట్పై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగం తర్వాత రేవంత్రెడ్డి ప్రసంగించాల్సి ఉంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్పై సభా ఉల్లంఘన నోటీసును ప్రస్తావించే సమయంలోనే.. టీఆర్ఎస్ సభ్యురాలు గొంగడి సునీత పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద ఎంపీ కవిత అంశాన్ని లేవనెత్తారు. తాత జాగీరా?: మంత్రి ఈటెల ఎంపీలు, ఎమ్మెల్యేలపై మాట్లాడే ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందని, అయితే నోటీస్ ఇవ్వకుండానే రేవంత్రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. దీంతో వివాదం ఒక్కసారిగా రాజుకుంది. వాగ్వాదాల మధ్య సభను పదినిమిషాల పాటు స్పీకర్ వాయిదావేశారు. కేటీఆర్పై సభా హక్కుల నోటీస్కు పట్టు సభ తిరిగి ప్రారంభం కాగానే మంత్రి కేటీఆర్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అంశాన్ని రేవంత్రెడ్డి, ఆ తర్వాత టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు ప్రస్తావించారు. సభ్యుల వ్యాఖ్యల మధ్యే సభను స్పీకర్ మరోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ మొదలుకాగానే రేవంత్రెడ్డి మాట్లాడుతూ..క్రైస్తవ మైనారిటీ సభ్యులను అసెంబ్లీకి నామినేట్ చేసినట్లు ఈ ఎమ్మెల్యేలను ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసిందని టీడీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మంగళవారం సభలో వ్యాఖ్యానించటం ప్రజలను, తమను, స్పీకర్ను అవమానపరటమేనన్నారు. సభాహక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకుని కేటీఆర్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఎంపీలపై ఆరోపణలు చేసే ముందు స్పీకర్ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో ఉన్నట్లు మంత్రి హరీశ్ చెప్పారు. అయితే తాము ఇదివరకే స్పీకర్ అనుమతి తీసుకున్నందున మంత్రి కేటీఆర్పై సభా హక్కుల ఉల్లంఘన అంశాన్ని మొదట తీసుకోవాలని రేవంత్రెడ్డి పట్టుబట్టారు. దీంతో రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ మధుసూదనాచారి గురువారానికి వాయిదా వేశారు. -
‘సర్వే’తో సాధించిందేమిటి?
సమగ్ర కుటుంబ సర్వేపై విపక్షాల ధ్వజం ప్రశ్నోత్తరాల్లోనే అధికార విపక్షాల వాగ్వివాదం హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే అంశంపై మంగళవారం శాసనసభ అట్టుడికింది. దీనిపై ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించడంతో వాడివేడిగా చర్చ జరిగింది. సమగ్ర సర్వేతో సాధించిందేమిటని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రాన్ని నిర్బంధించారు..: టీడీపీ తొలుత ఈ అంశంపై టీడీపీ సభ్యుడు రేవంత్రెడ్డి మాట్లాడుతూ... సమగ్ర సర్వే పేరిట రాష్ట్రాన్ని 12 గంటల పాటు నిర్బంధించారని వ్యాఖ్యానించారు. ‘‘సంక్షేమ పథకాలన్నింటికీ సర్వేనే ఆధారమని చెప్పడంతో వలస వెళ్లిన లక్షలాది మంది పేదలు సొంతూళ్లకు రావాల్సి వచ్చింది. రవాణా వ్యవస్థను నిలిపేసిన ప్రభుత్వం వైన్షాపులను ఎందుకు తెరిచి ఉంచింది. రూ. 20 కోట్ల ఖర్చుతో 12 గంటల్లో సర్వే చేస్తే.. వంద శాతం ఫలితాలు వస్తాయా..?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్వేలో రెండు సార్లు నమోదు చేసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారని, మరి నవీపేట మండలం పోతంగల్లో, హైదరాబాద్లోనూ నిజామాబాద్ ఎంపీ వివరాలు నమోదైతే చర్యలు తీసుకోలేదేమని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీకి అర్జీలు తీసుకుంటున్న ప్రభుత్వం.. వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఆడపడుచులను అవమానపరిచేలా ఆదేశాలు జారీ చేసిందని... మహిళలను అవమానించినందుకు ప్రభుత్వాన్ని రోడ్డుపై నిలబెట్టి రాళ్లతో కొట్టాలని అన్నారు. మీసేవ ద్వారా అవకాశమివ్వాలి: మజ్లిస్ హైదరాబాద్లో 25 శాతం మంది సర్వే పరిధిలోకి రాలేదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. వారిని మళ్లీ ఎప్పుడు సర్వే చేస్తారని ప్రశ్నించారు. ‘‘ప్రజలు తమ సమాచార నమోదు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలు లేదా వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించాలి. సర్వే ఆధారంగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారికి సంక్షేమ పథకాలు నిరాకరిస్తే ఒప్పుకోబోం. సర్వే వివరాలను ప్రభుత్వం సభ ముందు పెట్టాలి..’’ అని అక్బరుద్దీన్ కోరారు. విద్యుత్పై తీర్మానం కాపీని ఉర్దూలో అందించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఉర్దూలో ప్రతులను అందజేస్తామన్నారు. కాగా.. సర్వేలో దొర్లిన తప్పులను ఎలా సరి చేస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రశ్నించారు. ఇదే ప్రామాణికం కాదు: ఈటెల విపక్ష సభ్యులు ప్రశ్నలకు మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిస్తూ.. సర్వేకు ప్రభుత్వం రూ. 20 కోట్లు ఖర్చు చేసిందని, 1.27 కోట్ల కుటుంబాల వివరాలు సేకరించామని చెప్పారు. సర్వేలో మిగిలిపోయిన కుటుంబాల వివరాలను తిరిగి నమోదు చేస్తామన్నారు. ‘‘తెలంగాణలో ఆర్థిక,సామాజిక,విద్య,వైద్య ఉపాధి, స్థితిగతులు తెలుసుకునేందుకే సర్వే చేశాం. ఒక్క రోజులో చేపట్టిన ఈ సర్వేతో ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఇది ఎలా సాధ్యమైందని ప్రధాని మోదీ కూడా కేసీఆర్ను మెచ్చుకున్నారు. చాలా మందికి సొంత గ్రామాలతో పాటు నగరాల్లో ఓటరు కార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయి. వీటన్నింటిని సరిచేయాలనే సర్వే చేశాం. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకుంటాం. కానీ అది ప్రామాణికం కాదు..’’ అని ఈటెల పేర్కొన్నారు. కాగా.. సర్వే ప్రకారం ఏయే వర్గాల జనాభా ఎంతో చెప్పాలని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ పట్టుబట్టడంతో ఈటెల వివరాలు వెల్లడించారు. సర్వే ప్రకారం తెలంగాణలో ఎస్సీ జనాభా 17.5%, ఎస్టీ జనాభా 9.91%, బీసీలు 51.09%, ఓసీలు 21.5% ఉన్నట్లు చెప్పారు. అన్నివర్గాల్లో కలపి మైనారిటీలు 14.46 శాతంగా ఉన్నారని తెలిపారు. -
జనాభాలో మహిళలే అధికం
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో 27,90,069 మంది జనాభా ఉన్నట్లుగా లెక్క తేలింది. ప్రభుత్వం ఆగస్టు 19న నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో 25,27,849 మంది వివరాలు ‘కుటుంబ సర్వే వెబ్సైట్లో నిక్షిప్తం అయ్యాయి. మిగతా 2,62,220 మంది వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం కావాల్సి ఉంది. 25,27,849 మంది జనాభాలో పురుషులు 12,51,672 మంది ఉండగా, స్త్రీలు 12,66,498 మంది ఉన్నారు. దీని ప్రకారం చూసుకుంటే జనాభాలో పురుషుల కంటే స్త్రీలు అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. జిల్లా వ్యాప్తంగా 21,62,982 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. మిగతా వారికి లేవు. జిల్లా వ్యాప్తంగా 8,28,042 ఇళ్లు సర్వేలో వెల్లడి కాగా, 7,58,678 ఇళ్లు కంప్యూటర్లో నిక్షిప్తం అయ్యాయి. జిల్లా జనాభా ఇలా.. కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలోని ఐదు డివిజన్లు ఉండగా, మంచిర్యాల, నిర్మల్ డివిజన్లలోని జనాభాలో మహిళలే అధికంగా ఉన్నారు. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో 5,46,427 మంది జనాభా ఉండగా, ఇందులో 2,78,053 మంది పురుషులు, 2,68,374 మంది స్త్రీలు ఉన్నట్లు తేలింది. డివిజన్లో మొత్తం 1,60,196 ఇళ్లకు గాను 5,46,427 మంది జనాభా ఉన్నట్లు లెక్కతేలింది. ►ఉట్నూర్ డివిజన్ పరిధిలో 3,14,974 మంది జనాభా ఉన్నారు. ఇందులో 1,57,672 మంది పురుషులు, 1,57,302 మంది స్త్రీలు ఉన్నారు. డివిజన్లో 72,551 ఇళ్లు ఉన్నాయి. ►ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మొత్తం 4,11,626 మంది జనాభా ఉండగా, ఇందులో 2,06,733 పురుషులు, 2,04,893 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం 1,21,534 ఇళ్లు ఉన్నట్లు లెక్కతేలింది. ►నిర్మల్ డివిజన్ పరిధిలో 5,34,285 మంది జనాభాకు 2,61,550 పురుషులు, 2,72,735 మంది స్త్రీలు ఉన్నారు. కాగా, డివిజన్లో 1,66,777 ఇల్లు ఉన్నాయి. ►మంచిర్యాల డివిజన్ పరిధిలో 7,20,537 మంది జనాభా ఉండగా, 3,57,343 మంది పురుషులు, 3,63,194 మంది స్త్రీలు ఉన్నారు. డివిజన్లో మొత్తం 2,37,623 ఇల్లు ఉన్నట్లుగా లెక్క తేలింది. 3,64,867 మంది ఆధార్ కార్డులు లేవు ►జిల్లాలో సుమారు లక్ష మందికిపైగా ఆధార్ కార్డులు లేవు. కంప్యూటర్లో నమోదైన సర్వే వివరాల ప్రకారంగా 99,743 మందికి ఆధార్ కార్డులు లేవు. ►ఆదిలాబాద్ డివిజన్లో మొత్తం 5,46,427 మంది జనాభాలో 4,36,680 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. 1,09,747 మంది కార్డులు లేవు. ►ఉట్నూర్ డివిజన్లో మొత్తం 3,14,974 మంది జనాభా ఉండగా, 2,69,827 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇంకా 45,147 మంది కార్డులు లేనట్లుగా లెక్కతేలింది. ►ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మొత్తం 4,11,626 మంది జనాభా ఉండగా, 3,55,929 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇంకా 55,697 మంది కార్డులు లేవు. ►నిర్మల్ డివిజన్ పరిధిలో 5,34,285 మంది జనాభా ఉండగా, 4,55,769 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. మిగతా 78,516 మందికి ఆధార్ కార్డులు లేవు. ►మంచిర్యాల డివిజన్లో 7,20,537 మంది జనాభా ఉండగా, 6,44,777 మందికి ఆధార్ కార్డులు ఉన్నట్లు, ఇంకా 75,760 మంది ఆధార్ కార్డులు లేనట్లుగా లెక్క తేలింది. -
సర్వేలో నిరాధార్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తయింది. కుటుంబాల సమగ్ర సమాచారాన్ని కంప్యూటరీకరించే ప్రక్రియను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. శనివారం నాటికి ఈ ప్రక్రియను కొలిక్కి తెచ్చిన యంత్రాంగం.. సర్వే రోజున మిగిలిపోయిన (ప్రి విజిట్లో ఇంటి నంబర్లు ఇవ్వని) కుటుంబాల వివరాలను కూడా నమోదు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో సర్వే ఫారాల కొరత కారణంగా జిరాక్స్ కాపీల్లో నమోదు చేసిన వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీచేయడంతో అధికారయంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సర్వే కంప్యూటరీకరణలో ఆధార్ విషయమై ఆసక్తికర విషయం వెలుగు చూసింది. దాదాపు 7.89 లక్షల మంది తమ ఆధార్ వివరాలను ఇవ్వలేదు. గత నెల 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంట్లో కేవలం గ్రేటర్ పరిధి మినహా మిగతా ప్రాంతంలో సర్వే నిర్వహణ బాధ్యతలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఈ సర్వేలో జిల్లావ్యాప్తంగా 8.41 లక్షల కుటుంబాలు వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించారు. ఈ డేటాను గత వారం రోజులుగా కంప్యూటరీకరిస్తున్న ఆపరేటర్లు.. శనివారం ఈ ప్రక్రియకు ముగింపు పలికారు. తొలినాళ్లలో రోజుకు 50వేల కుటుంబాల వివరాలు మాత్రమే నిక్షిప్తం చేసిన సిబ్బంది.. దీన్ని లక్షకు చేర్చారు. దీంతో కంప్యూటరీకరణ మూడు రోజుల ముందుగానే ముగిసింది. ఇదిలావుండగా, అనివార్య పరిస్థితుల్లో సర్వే రోజున అందుబాటులో లేని (డోర్లాక్) కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాయి. లెక్కతప్పిన ఆధార్ ఆధార్ కార్డుల జారీలో రాష్ర్టంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 110 శాతం ఆధార్ కార్డులు ఇవ్వడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయితే, సమగ్ర సర్వేలో ఆధార్ వివరాలు మాత్రం లెక్క తప్పాయి. కుటుంబ సభ్యుల సంఖ్యకు ఆధార్ కార్డుల జారీకి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. శనివారం సాయంత్రం 7 గంటల వరకు జిల్లాలో 27,77,742 మంది వివరాలను కంప్యూటరీకరించగా, దీంట్లో 7,89,868 మంది తమ ఆధార్ వివరాలను సర్వేలో పొందుపరచలేదు. ఆధార్ సమాచారం సర్వేలో నమోదు కాకపోవడానికి జిల్లా యంత్రాంగం.. పలు రకాలుగా విశ్లేషిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 52.96 లక్షలు. అయితే, ఆధార్ కార్డులు మాత్రం దీనికి పది లక్షల మేర అదనంగా జారీ అయ్యాయి. దీంట్లో నాలుగు లక్షల కార్డులను యూఐడీఐ తిరస్కరించింది. కాగా, తాజాగా నిర్వహించిన సమగ్ర సర్వేలో ఆధార్ యూఐడీ నంబర్ను విధిగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఒకవేళ ఆధార్ కార్డు అందకపోతే మాత్రం ఈఐడీ నంబర్ను పొందుపరచవద్దని స్పష్టం చేసింది. ఇది కూడా సర్వేలో ఆధార్ సంఖ్య తక్కువ నమోదు కావడానికి ఒక కారణంగా యంత్రాంగం చెబుతోంది. గ్రామీణ మండలాల్లో కార్డులను పోగొట్టుకున్నా, ఎక్కడ భద్రపరుచుకున్నా, సమయానికి దొరకకపోయినా విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కాకపోవచ్చని అంటోంది. అదే సమయంలో ఆధార్ కార్డు(యూఐడీ) జారీలో జరిగిన జాప్యం కూడా సర్వేపై ప్రభావం చూపే అవకాశంలేకపోలేదని పేర్కొంటోంది. ఈ కారణాల వల్లే కుటుంబసభ్యుల సంఖ్యకు ఆధార్ కార్డుల వివరాల నమోదుకు భారీ తేడా కనిపిస్తోందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
8లోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ: సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను ఈ నెల 8లోగా కంప్యూటర్లో ఎంట్రీ చేయాలని జాయింట్ కలెక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సంబంధిత అధికారుల సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడుతూ, జిల్లాలోని 46 మండలాలకు గాను జహీరాబాద్, కల్హేర్, కోహీర్, నారాయణఖేడ్, న్యాల్కల్ మండలాల్లో డాటా ఎంట్రీ మందకొడిగా సాగుతుండటం పట్ల జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ తేదీలోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే డాటా ఎంట్రీ ఆపరేటర్లను పెంచుకోవడంతో పాటు అధిక సమయాన్ని కేటాయించి పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ మధుకర్రెడ్డి, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషాతో పాటు వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు పాల్గొన్నారు. డాటా ఎంట్రీని పరిశీలించిన జేసీ సంగారెడ్డి రూరల్: కంది శివారులోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శరత్ శుక్రవారం పరిశీలించారు. జిల్లాలో 8 లక్షల 65 వేల నివాసాల్లో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సర్వే వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయాలని ఆదేశించారు. సర్వే వివరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవని, అందుకు డాటా ఎంట్రీలో అప్రమత్తత అవసరమని సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు భోజన సౌకర్యం కల్పించాలన్నారు. జేసీతోపాటు తహశీల్దార్ రాధాబాయి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. -
సిబ్బంది లేరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లా యంత్రాంగానికి మరో తలనొప్పి వచ్చిపడింది. సర్వే ప్రక్రియలో సిబ్బంది కొరతతో సతమతమైన యంత్రాంగం.. చివరకు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులను వినియోగించుకుని పరిస్థితిని గట్టెక్కించింది. తాజాగా ఈ సర్వే వివరాల కంప్యూటరీకరణకు కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్లు కరువయ్యారు. వివరాల నమోదు ప్రక్రియ మొదలుపెట్టి ఐదురోజులు కావస్తున్నా.. ఇప్పటివరకు కేవలం 50వేల కుటుంబాలకు సంబంధించి మాత్రమే నమోదు పూర్తయింది. మరోవైపు సర్కారు విధించిన గడువు ముంచుకొస్తుండగా.. నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం తో జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆరు శాతమే! జిల్లాలోని గ్రామీణ ప్రాంతాన్ని మాత్రమే యంత్రాంగం సర్వే చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్లోని జిల్లా పరిధినంతా జీహెచ్ఎంసీ అధికారులు సర్వే చేశారు. అయితే గ్రామీణ ప్రాంతంలో దాదాపు ఎనిమిది లక్షల కుటుంబాలను సర్వే చేయగా.. వాటిని ప్రస్తుతం కంప్యూటర్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకుగాను శివార్లలోని ఇంజినీరింగ్ కళాశాలలను నమోదు కేంద్రాలుగా ఎంపిక చేశారు. అక్కడ కంప్యూటర్లు అందుబాటులో ఉండడంతో ప్రక్రియ సులభతరమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల నమోదుకు రెండువేల కంప్యూటర్లు వినియోగించేలా ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు అధికారులు విజయవంతంగా ప్రక్రియను పూర్తిచేశారు. కానీ అసలు చిక్కంతా డాటా ఎంట్రీ ఆపరేటర్ల అంశంలో వచ్చిపడింది. రెండువేల మంది ఆపరేటర్లను వినియోగించుకుని రెండువేల కంప్యూటర్ల ద్వారా నమోదు చేయాలని అధికారుల భావించినా.. కేవలం తొమ్మిది వందల మంది ఆపరేటర్లు మాత్రమే లభించారు. అందుబాటులో ఉన్న ఆపరేటర్లతో నమోదు ప్రక్రియ చేపట్టగా.. ఇప్పటివరకు కేవలం 50వేల కుటుంబాల వివరాలు మాత్రమే నమోదు చేశారు. నిర్దేశిత లక్ష్యంలో కేవలం ఆరుశాతం మాత్రమే పూర్తిచేయడంతో అధికారగణం ఆందోళన చెందుతోంది. గడువులోగా కష్టమే.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియంతా సెప్టెంబర్ రెండోతేదీ నాటికి పూర్తిచేయాలని సర్కారు స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో ఈనెల 22 నుంచి నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించింది. అయితే జిల్లాలో మాత్రం కంప్యూటర్ల నిర్వహణలో సమస్య తలెత్తడంతో కొంత జాప్యం జరిగింది. ఫలితంగా మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో నమోదు ప్రక్రియ ప్రారంభించగా.. ఇప్పటివరకు 50వేల ఫారాలను కంప్యూటరీకరించారు. సగటున రోజుకు 25వేల దరఖాస్తులు పూర్తవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సర్కారు విధించిన గడువు నాటికి కేవలం 25శాతం మాత్రమే పూర్తవుతుందని తె లుస్తోంది. మరోవైపు డాటాఎంట్రీ ఆపరేటర్ల సంఖ్య పెంచేందుకు యంత్రాంగం ప్రత్యేక తాయిలాలు ప్రకటిస్తోంది. ప్రస్తుతం డాటా ఎంట్రీ చేస్తున్న ప్రభుత్వం సంబంధిత ఉద్యోగులకు ఒక్కో దరఖాస్తుకు రూ.5 చెల్లిస్తుండగా.. ప్రైవేటు సిబ్బందికి రూ.10వరకు చెల్లిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆపరేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్ పదో తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
పరిశీలించి ఆన్లైన్లో పొందుపర్చాలి
కామారెడ్డిటౌన్ : ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని కంపూట్యర్ ఆపరేటర్లు నిశితంగా పరిశీలించి ఆన్లైన్లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్రాస్ సూచించారు. స్థానిక ఆర్కే డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కామారెడ్డి డివిజన్ సమగ్ర సర్వే ఆన్లైన్ నమోదును సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఎటువంటి తప్పులు జరుగకుండా కచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలని, లేని పక్షంలో అర్హ్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కోల్పోతారని అన్నారు. సర్వే విజయవంతం కావాలంటే ఈ ఘట్టమే ప్రధానమన్నారు. అధికారులు దగ్గరుండి నమోదు చేయించాలని ఆయన ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న సమాచారాన్ని స్థానిక అధికారుల ద్వారా సేకరించాలన్నారు. ఆపరేటర్లు తమ సొంత నిర్ణయం తీసుకోకుండా సూపర్వైజర్లు, వీఆర్వోల సహకారం తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల 32 వేల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో కొత్తగా 40వేల కుటుంబాలు నమోదు చేసుకున్నారని, ఇంకా సు మారు 10 వేల కుటుంబాలు నమోదు కావాల్సి ఉం దని తెలిపారు. నమోదు కాని కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు చేపడుతామన్నారు. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలున్నాయని వాటిని వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆపరేటర్ల వివరాల రిజిష్టర్లను పరిశీలించారు. శిక్షణ పొందుతున్న కంప్యూటర్ ఆపరేటర్లతో కాసేపు ముచ్చటించారు. జాగ్రత్తగా సర్వే వివరాలను నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జయదేవ్ ఆచార్య , తహశీల్దార్ గఫర్మియా, వీఆర్వోలు తదితరులున్నారు. -
ఫోన్ చేస్తారు..సమాచారం సేకరిస్తారు
సాక్షి, మంచిర్యాల :తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైన నేపథ్యంలో తదుపరి దశల్లోనూ సర్కారు అదే స్పష్టతతో ముందుకెళ్తోంది. ఒక్కరోజే సర్వే చేయడం ద్వారా అక్రమాలకు తావు లేని విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా సర్వే ఫారాల క ంప్యూటరీకరణకు ముందు సైతం వివరాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టార్ మార్కుతో ఉన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు ఓ అధికారి వివరించారు. నోడల్ అధికారులుగా సర్వే బాధ్యతలు నిర్వర్తించిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు, అగ్రికల్చర్ అధికారులు, ఎంఈవోలపై ఈ గురుతర బాధ్యత పెట ్టనున్నట్లు సమాచారం. ఈ నోడల్ అధికారులు సర్వే నమూనాలో నింపకుండా వదిలివేసిన వివరాలను లబ్ధిదారులు ఇచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా సేకరించనున్నారు. స్టార్.. స్టార్.. గ్యాస్ కనెక్షన్, విద్యుత్ మీటరు కనెక్షన్ నంబరు వంటి ‘స్టార్’ గుర్తు గల విషయాలను ప్రాధాన్య అంశాలుగా తీసుకోనున్నారు. స్టార్ గుర్తున్న వివరాలు పూర్తి చేయని పక్షంలో సర్వే ఫామ్లో పేర్కొన్న సెల్ఫోన్కు కాల్ చేసి వాటిని తెలుసుకొని పెన్సిల్ ద్వారా పూర్తి చేయనున్నారు. ఈ విధంగా సర్వే జరిగిన అన్ని కుటుంబాల వివరాల విషయమై నోడల్ అధికారి పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఫామ్లోని అన్ని వివరాలు సమగ్రంగా ఉంటేనే ఆ కుటుంబ వివరాలను అప్డేట్ చేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు. ఈ వివరాలను కంప్యూటరీకరణ చేసిన తర్వాత సైతం థర్డ్పార్టీ తనిఖీ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జిల్లాస్థాయి అధికారి ఒకరు వివరించారు. ఈ క్రమంలోనే సర్వే ఫామ్లోని వివరాలను క్షేత్రస్థాయి తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ఫామ్ల కంప్యూటరీకరణ ప్రక్రియను సైతం పరిశీలించే అవకాశాలున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. -
తెలంగాణ సర్వే దెబ్బకు ‘పవర్లూమ్’ అతలాకుతలం
సాక్షి, ముంబై: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే భివండీ పవర్లూమ్ పరిశ్రమలను అతలాకుతలం చేసింది. వేలమంది తెలంగాణ కార్మికులు భివండీలోని పవర్లూమ్ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. సర్వే కారణంగా కార్మికులంతా తెలంగాణలోని సొంతగ్రామాలకు వెళ్లిపోయారు. ఇంకా కార్మికులు పరిశ్రమలకు చేరుకోకపోవడంతో పవర్లూమ్ పరిశ్రమలు వెలవెలబోయాయి. సర్వేకు పట్టణంలోని సుమారు 50 వేల మంది ప్రజలు తరలి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిపై ఆధారపడి ఉన్న పరిశ్రమలు, తదితర వ్యాపారాలపై భారీ ప్రభావం పడుతోంది. కేసీఆర్ తెలంగాణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించినట్లయితే భివండీలో స్థిరపడ్డ గుజరాతి, ముస్లిం, మార్వాడీ, మరాఠీ వ్యాపారాలు దెబ్బతింటాయని పలువురు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భివంఢీ నుంచి తెలంగాణ బాట భారతదేశ మాంచస్టర్గా పేరు గాంచిన భివండీ పట్టణంలో భారీ సంఖ్యలో పవర్లూమ్ పరిశ్రమలు మూతపడ్డాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం నుంచి తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్ వివిధ జిల్లాల ప్రజలు ఉపాధి కోసం భివండీ వచ్చి స్థిరపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇక్కడ స్థిరపడ్డ ప్రజలతో పాటు ఒంటరిగా వచ్చిన కార్మికులు కూడా ఈ నెల 15 నుంచి తెలంగాణ బాట పట్టారు. ఈ నెల 29న వినాయక చవితి పండుగ ఉండడంతో కొందరు కార్మికులు తమ కుటుంబ సభ్యులతో అక్కడే ఆగిపోయారు. ఇప్పటికే పట్టణంలోని సుమారు 20 వేలకు పైగా పవర్లూమ్ యంత్రాలు నిలిచిపోయాయి. నిత్యం లక్ష రూపాయల నష్టపోతున్నామని వ్యాపారస్తులు వాపోతున్నారు. -
భూకంపం వదంతులు
భైంసా రూరల్ : నిజామాబాద్ జిల్లాలో అప్పుడే పుట్టిన శిశువు భూ కంపం వస్తుందని చెప్పి కన్నుమూసిందని, మహారాష్ట్రలో భూకంపం వచ్చిందని, ఇక్కడ కూడా రాబోతోందనే వదంతులతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోయారు. మంగళవారం ఉదయం నుంచి సమగ్ర కుటుంబ సర్వేలో బిజీగా గడిపిన ప్రజలు ఈ వదంతులతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి వేళ ఫోన్కాల్స్ ఏమిటని లిఫ్ట్ చేసిన ప్రజలు భూకంపం రానుందని అవతలి వ్యక్తి చెప్పిన మాటలు విని షాక్కు గురయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలైన ఈ వదంతులు వివిధ మండలాలకు క్షణాల్లో దా వానంలా వ్యాపించాయి. సమాచారం అందడమే ఆలస్యం అన్నట్లుగా.. అనేక మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. జాగారం.. సర్వే పుణ్యమా అని స్థానికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సంతోషంగా గడిపారు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వ్యాపించిన భూకంప వదంతులు అందరినీ భయకంపితులను చేశాయి. ఒంటి గంటకు ప్రారంభమైన ఈ పుకార్లు నాలుగు గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అధికశాతం ప్రజలు రోడ్లపైకి వచ్చి జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంతోపాటు గ్రామాల్లోనూ ప్రజలు వేకువజాము వరకు జాగారం చేశారు. మరికొందరు ఆలయాల్లో పూజలు చేసి కాపాడాలని ఇష్టదైవాన్ని వేడుకున్నారు. వాడవాడలా ప్రజలు గుంపులుగా ఏర్పడి చర్చించుకున్నారు. ఫోన్లలో సమాచారం చేరవేత.. భూకంపం వచ్చిందనే వదంతులు వివిధ ప్రాంతాలకు వ్యా పించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా ప్రతిఒక్కరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర, నిజామాబాద్, ఇతర జిల్లాల్లో ఉన్న బంధువులను సైతం ఆరా తీశారు. మరికొందరు సమాచారం తెలుసుకునేందుకు వేకువజాము వరకు టీవీలకు అతుక్కుపోయారు. అయితే ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెల్లారేసరికి ఆ వార్త పుకారేనని తెలిసిన జనం అజ్ఞాత వ్యక్తిని తిట్టుకుంటూ ఇళ్లలోకి వెళ్లారు. గతంలోనూ... గతంలోనూ ఇలాంటి వదంతులు నిర్మల్ వాసులను తీవ్ర కలవరపెట్టాయి. మహారాష్ట్ర ప్రాంతంలోని ఓ గుడిలో పూజా రి పూజలు చేస్తూ మృతిచెందాడని, అంతకుముందు భూకం పం వస్తుందని చెప్పాడంటూ వచ్చిన పుకార్లు ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేసింది. చివరకు అవన్నీ వదంతులేనని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
సర్వే సమగ్రం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే లక్ష్యాన్ని మించింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సర్వే అర్ధరాత్రి వరకు సాగింది. జిల్లావ్యాప్తంగా 7,89,206 కుటుంబాలను సర్వే చేయాలని అంచనా వేయగా.. ఇది కాస్తా 8,33,592కు చేరింది. నగర శివార్లలో ఇబ్బడిముబ్బడిగా కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సగటున ఒక్కొక్కరికి 30 గృహాలనే కేటాయిస్తున్నట్లు అధికారయంత్రాంగం పేర్కొన్నా.. క్షేత్రస్థాయిలో వాటి సంఖ్య వందకుపైగా ఉండడంతో రాత్రి పొద్దుపోయేవరకు సర్వే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఇళ్లకు అంటించిన స్టిక్కర్ల ఆధారంగా కుటుంబాల సంఖ్య నమోదు చేసినప్పటికీ.. చివరిరోజు కొత్త కుటుంబాల సంఖ్య పుట్టుకురావడం యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. కొన్నిచోట్ల సర్వే ఫారాలు కొరత ఏర్పడడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. దాదాపు ప్రతి మండలంలోనూ కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రీ విజట్లో రికార్డుచేసిన ఇళ్లకంటే దాదాపు పది శాతం అధికంగా నమోదు కావడం విశేషం. మరోవైపు ఎన్యూమరేటర్లకు తగిన రవాణా, భోజన వసతి కల్పించకపోవడంతో చాలాచోట్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కీసర, శామీర్పేట, ఇబ్రహీంపట్నం, పరిగి తదితర ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లు.. ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల విద్యార్థులు, ఉపాధ్యాయులు కనీస వసతులు కల్పించలేదని ఆందోళన చేశారు. ఇదిలావుండగా సర్వే ఆవశ్యకతపై విస్తృతంగా ప్రచారం చేయడంతోనే జిల్లాలో సమగ్ర సర్వే విజయవంతమైందని కలెక్టర్ ఎన్ .శ్రీధర్ అన్నారు. ఇక సమగ్ర కుటుంబ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాల సర్వే విషయంలో ప్రభుత్వం మరో వారంలో నిర్ణయం తీసుకుంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. -
సర్వే.. సక్సెస్
సాక్షిప్రతినిధి, నల్లగొండ: కుటుంబ సమగ్ర సర్వే జిల్లాలో సక్సెస్ అయింది. ఉదయం మందకొడిగా మొదలైన సర్వే, రాత్రిదాకా కొనసాగింది. కలెక్టర్ చిరంజీవులు నల్లగొండ మున్సిపాలిటీలోని 6వ వార్డు, పద్మావతి కాలనీతోపాటు నార్కట్పల్లి మండలంలో పర్యటించి సర్వే తీరును పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా సూర్యాపేట మున్సిపాలిటీ, కోదాడ, నడిగూడెం, మునగాల మండలాల్లో పర్యటించారు. సర్వే సందర్భంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఇదే పరిస్థితి కనిపించింది. సర్వే సందర్భంగా అన్ని చోట్లా దాదాపు ఒకేరకమైన సమస్యలు తలెత్తాయి. ఎన్యుమరేటర్లకు సరైన శిక్షణ లేకపోవడం కొంత ప్రభావం చూపించింది. కుటుంబాల సంఖ్యకు తగిన రీతిలో ఎన్యుమరేటర్ల సంఖ్య కూడా లేదు. చాలాచోట్ల ఇళ్లకు నంబర్లు కేటాయించడంలో జరిగిన పొరపాట్లు సర్వేను ప్రభావితం చేశాయి. గ్రామాల్లో ఎన్యుమరేటర్లతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. నంబర్లు కేటాయించని కారణంగా చాలా కుటుంబాలు సర్వేలో తమ వివరాలను నమోదు చేయించుకోలేకపోయారు. నల్లగొండ పట్టణంలో సాయంత్రం వరకు ఎన్యుమనేటర్ల కోసం ఎదురు చూశారు. దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వచ్చిన వారి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లతో ఆందోళనకు దిగి నంబర్లు వేయించుకోవాల్సి వచ్చింది. దాంతో ఒక్కో ఎన్యుమనేటర్కు కేటాయించిన కుటుంబాల సంఖ్య పెరిగింది. నల్లగొండ పట్టణంలో ఇంటి నంబర్లు వేయలేదని గాంధీనగర్కు చెందిన 20 మంది మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. కాగా, కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్రావు, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ పూల రవీందర్ నల్లగొండ పట్టణంలోనే సర్వే ఫారాలు నింపారు. నల్లగొండ మండలంలోని అన్నేపర్తి, రాములబండ, అప్పాజిపేట, నర్సింగ్భట్ల గ్రామాలలో హైదరాబాద్కు వలస వెళ్లిన వారి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యుమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. దాంతో బై నంబర్లు వేసి సర్వేలో నమోదు చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలోని కొన్ని ఏరియాలలో ఇంటి నంబర్లు వేయకపోవడంతో ఆలస్యంగా 12 గంటలకు సర్వే ప్రారంభమైంది. పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం, మాడ్గులపల్లి గ్రామాలలో 50 చొప్పున ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో స్థానికులు ఆందోళన చేశారు. నోడల్ అధికారులు అదనపు సర్వే ఫారాలను తెప్పించి సర్వే నిర్వహించారు. కనగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇంటి నంబర్లు కోసం ఆందోళనలు జరిగాయి. నోడల్ అధికారలు స్పందించి బై నంబర్లు ఇవ్వడంతో సర్వే కొనసాగింది. కనగల్ మండలంలో ఎన్యుమనేటర్లు కాకుండా వారి బంధువులు సర్వే చేయడం వల్ల తప్పలు దొర్లినట్లు పలువురు పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు సర్వేకోసం గ్రామాలకు చేరుకునే సరికి వారి ఇళ్లకు నంబర్లు లేవన్న సాకుతో ఎన్యుమరేటర్లు కుటుంబాల వివరాలు సేకరించ లేదు. భువనగిరి మున్సిపాలిటీ, భువనగరి మండలం, బీబీనగర్, పోచపల్లి, వలిగొండ మండలాల్లో సర్వే సందర్భంగా పెద్ద ఎత్తున కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇక ఎన్యుమరేటర్ల కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లల్లోంచి బయటకు వెళ్లకుండా వేచి ఉన్నారు. వీధుల్లో జనసంచారం ఎక్కడా కనిపించలేదు. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి, చందంపేట వంటి మండలాల్లో సర్వే నిర్వహణకు ఎన్యుమరేటర్లకు ట్రైనింగ్ ఇచ్చినా చివరికి సిబ్బంది సరిపోక అధికారులు అప్పటికప్పుడు ఏమాత్రం శిక్షణ తీసుకోని విద్యార్థులకు, ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఎన్యుమరేటర్ బాధ్యతలు అప్పగించారు. ఇంటి నంబర్లు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోని వైనం సర్వే సందర్భంగా బయట పడింది. చాలా కుటుంబాలకు ఇంటి నంబర్లు వేయలేదు. దీంతో ఎన్యుమరేటర్లకు పరిమితి సంఖ్యలో సర్వే ఫారాలు ఇవ్వగా అవి సరిపోక, చాలా కుటుంబాలు తమ పేర్లను నమోదు చేయించుకోలేకపోయాయి. పట్టణాలలో బతుకు దెరువుకు వెళ్లిన పలువురు సర్వే కారణంగా గ్రామాలకు, తండాలకు చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా సౌకర్యాలు లేక చాలా మంది సర్వేకు అందుకోలేకపోయారు. తప్పనిసరిగా ఆధార్కార్డు నంబరు వేయాలని సూచించడం, చాలా మందికి ఆధార్ కార్డులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్యుమరేటర్లు ఆధార్ను తప్పనిసరిగా చూపించాలనడంతో కొన్ని గ్రామాల్లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలోని నాగార్జునసాగర్ ఆయకట్టులో వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నా పనులకు వెళ్లకుండా సర్వేలో పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనేందుకు దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారు హుజూర్నగర్ నియోజకవర్గంలోని తమసొంత గ్రామాలకు చేరుకున్నారు. అయితే సర్వే నిర్వహణకు ముందుగా ఒక్కొక్క ఇంటికి ఒక నంబర్ మాత్రమే కేటాయించారు. ఒకే ఇంటిలో రెండు, మూడు కుటుంబాలు నివసిస్తుండటంతో తమను కూడా సర్వేలో భాగస్వాములు చేయాలని మిగిలినవారు కోరారు. దీంతో ఎన్యుమరేటర్లు తమ జాబితాలో పేరు లేదని నిరాకరించడంతో దాదాపు అన్ని గ్రామాల్లో వివాదం చెలరేగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఆయా గ్రామాలకు చేరుకొని వారికి కూడా సర్వేలో భాగస్వాములు చేస్తామని హామీలు ఇచ్చారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన జాబితా కుటుంబాల వారిని మాత్రమే సర్వే చేస్తామని అదనపు కుటుంబాలకు సర్వే నిర్వహించమంటూ అన్ని గ్రామాల్లో నిరాకరించారు. హుజూర్నగర్ పట్టణంలోని 19, 20 వార్డుల్లో ఎన్యుమరేటర్లకు కేటాయించిన ఇళ్లు ఒకేచోట లేక సర్వే నిర్వహణకు ఇబ్బందులు పడ్డారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, విద్యార్థులను ఎన్యుమరేటర్లుగా నియమించడంతో సర్వే పత్రాలు నింపడానికి వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో కొన్ని గ్రామాల్లో ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉండగా ఒకే నంబరు వేయడంతో మిగితా కుటుంబాలను సర్వే చేయకపోవడంతో ఎన్యుమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అధికారులు అన్ని కుటుంబాలను సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్యుమరేటర్లకు ఉదయం టిఫిన్ , మధ్యాహ్న భోజనం సమయానికి అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రశాంతంగా ముగిసింది. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో చాలా చోట్ల కుటుంబాలు ఎక్కువగా ఉండి ఫారాలు సరిపోను అందక సర్వే ఆలస్యమైంది. శాలిగౌరారం మండలం వల్లాల, చిత్తలూరు గ్రామాల్లో ఇళ్లకు నంబర్లు కేటాయించలేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వచ్చి ప్రజలను సముదాయించారు. మోత్కూరు మండలంలో సర్వే ఫారాలు సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్యుమరేటర్లకు సమయానికి భోజనం అందించలేక పోయారు. రాత్రి వరకు సర్వే కొనసాగింది. ప్రతి గ్రామంలో సర్వే ఫారాల కొరత ఏర్పడింది. సూర్యాపేట నియోజకవర్గంలో సమగ్ర సర్వే చిన్నచిన్న సమస్యల నడుమ కొనసాగింది. దూర ప్రాంతంలో ఉన్న వారు సైతం సొంతూళ్లకు రావడంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. సూర్యాపేట, పెన్పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో సర్వే రాత్రి వరకు కొనసాగింది. సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామంతో పాటు పలు గ్రామాలకు వచ్చిన ఎన్యుమరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో సర్వే కొంత ఆలస్యంగా మొదలైంది. కొన్ని గ్రామాల్లో తాళం వేసిన ఇళ్లకు డోర్ నంబర్లు వేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెన్పహాడ్ మండలం అనంతారం, గాజులమల్కాపురం గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సర్వే ఫారాలు నింపడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో విద్యావంతులు, యువకుల సాయంతో కూడా సర్వే ఫారాలను నింపిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో సర్వేను జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కోదాడ నియోజకవర్గంలో సమగ్ర సర్వే ప్రశాంతంగా సాగింది. కోదాడ పట్టణంతో పాటు గ్రామాల్లో ఎన్యుమరేటర్లు ఉదయం ఏడు గంటలకే సర్వే ప్రారంభించారు. ముందుగా వేసిన ఇంటినంబర్ల ఆధారంగా సర్వే నిర్వహించారు. పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులనే నియమించడంతో ప్రశాంతంగా సాగింది. సర్వే జరుగుతున్న తీరును కోదాడ మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. కోదాడ పట్టణంతో పాటు గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వీధులన్ని నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. గ్రామాల్లో సర్వే వివరాలు చెప్పడానికి పలువురు తటపటాయిస్తుండటంతో ఒక్కొక్క ఇంటివద్ద 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకున్నారు. చౌటుప్పల్లో అద్దెకున్న వారి వివరాలను చాలా చోట్ల నమోదు చేయలేదు. ఇంటి యజమాని వివరాలను తీసుకున్న ఎన్యుమరేటర్లు, ఆ ఇంటిలో అద్దెకున్న వారికి బై నంబర్లు వేసి వివరాలు తీసుకోవాలి. కానీ, అలా తీసుకోలేదు. ఇతర ప్రాంతాల్లో నివాసముండే వారు అక్కడ వివరాలు ఇవ్వకుండా, స్వగ్రామంలోనే సర్వేలో పాల్గొంటామని వచ్చారు. అలాంటి వారి వివరాలను కూడా ఎన్యుమరేటర్లు నమోదు చేయలేదు. ఒక కుటుంబంలో తండ్రి, ఇద్దరు కొడుకులు ఉంటే, వారికి వివాహమైతే, మూడు కుటుంబాలుగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లను కోరారు. అందుకు వారు ఒకే ఇంట్లో ఉంటున్నందున ఒకే కుటుంబంగా పరిగణిస్తామని చెప్పారు. డి.నాగారం గ్రామంలో గ్రామస్తులు ఈ విధంగానే వీఆర్వోను నిలదీశారు. పోలీసులు వచ్చి గ్రామస్తులను పంపించి వేశారు. మునుగోడు, ఊకొండిలలో ఎన్యుమరేటర్లు అవగాహన లోపంతో వివరాల నమోదులో కోడ్లకు బదులుగా వివరాలు రాశారు. చండూరులో సర్వే ఫామ్స్ లేక గంటన్నర ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉంటే వారి వివరాలను నమోదు చేయలేదు. ఆలేరు నియోజకవర్గంలో సమగ్ర సర్వే సందర్భంగా పెద్దఎత్తున కుటుంబాలు అదనంగా నమోదయ్యాయి. ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, గుండాల, ఆత్మకూరు (ఎం), తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో పలువురు ఆందోళన చెందారు. ఆలేరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లు అదనపు కుటుంబాల వివరాలు సేకరించకుండానే పోయారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సర్వే సమయంలో గంటల తరబడి ఒక్కోకుటుంబం వివరాలు సేకరించారు. ఇళ్లకు నంబర్లు వేయలేదని వాటిని వదిలిపెట్టడంతో ఆయా కుటుంబాల వారు అధికారుల చుట్టూ తిరిగారు. ఆలేరు, తుర్కపల్లి మండలాల్లో ఈ పరిస్థితి కన్పించింది. నాలుగు ఇళ్లు ఉంటే ఒక్కటే నంబరు వేశారు. దీంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందాయి. బొమ్మలరామారం మండలం మర్యాలలో సర్వే కోసం వచ్చిన ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. భక్తులు లేక యాదగిరికొండ వెలవెలబోయింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సర్వే అస్తవ్యస్తంగా జరిగింది. హాలియా, పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం, గుర్రంపోడు మండలాల్లో పెద్ద ఎత్తున కొత్త కుటుంబాలు నమోదయ్యాయి. ఆయా మండలాల్లో ఒక ఇంటికి ఒకటే నంబర్ ఇవ్వడం, అందులో నివాసం ఉండే ఇతర కుటుంబాలకు బై నంబర్లు ఇవ్వకపోవడంతో పలువురు ఆందోళన చెందారు. ఎన్యుమరేటర్లు తమకు ఇచ్చిన ఇంటి నంబర్లను మాత్రమే సర్వే చేశారు. హాలియా మండలంలో ఎన్యుమరేటర్లు తమకు ఇచ్చిన ఇళ్లనే సర్వే చేసి అదనపు ఇళ్లను సర్వే చేయకుండానే వెళ్లిపోయారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్లకు నంబర్లు వేయలేదని వాటిని వదిలిపెట్టడంతో ఆ కుటుంబాల వారు అధికారుల చుట్టూ తిరిగారు. హాలియా, త్రిపురారం, నిడమనూరు, నాగార్జునాగర్లలో ఈ పరిస్థితి కనిపించింది. నకిరేకల్ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో కుటుంబాల సంఖ్య ఎక్కువగా కావడం, ఇంటినంబర్లు తక్కువ వేయడంతో సర్వే ఫారాల కొరత ఏర్పడింది. దీంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. చందుపట్ల గ్రామంలో కుటుంబాలు ఎక్కువగా ఉండడం, సరిపడా పత్రాలను ఇవ్వకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కట్టంగూర్ మండలం ఈదులూరు, పరడ, కట్టంగూర్, కల్మెర గ్రామస్తుల నుంచి నిరసన వ్యక్తమైంది. చిట్యాలలో దుకాణాల వెనుక నివాసం ఉంటున్న కుటుంబాలకు నంబర్లు కేటాయించలేదు. -
అ‘టెన్షన్’
ముకరంపుర : ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ అడిగిన ప్రశ్నలకు తెలిసిన మేరకు సమాధానాలు చెప్పాలి. ఆధారం కోసం జిరాక్స్ పత్రాలు చూపితే సరిపోతుంది. ఎలాంటి పత్రాలు కూడా ఎన్యూమరేటర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వివరాలు మాత్రమే ఎన్యూమరేటర్లు రాసుకుంటారు. చెప్పిన వివరాలు రాసుకున్న తర్వాత వాటిని చదివి వినిపిస్తారు. ఆ తర్వాతే మీరు సంతకం చేయాలి. సర్వే ముగిసిన తర్వాత ఇంటి గోడపై ఇప్పటికే అతికించిన స్టిక్కర్పై సర్వే పూర్తయినట్లు ఎన్యూమరేటర్లు రాసి సంతకం చేస్తారు. కుటుంబంలో ఒకరుంటే చాలు.. ఎన్యూమరేటర్లు వచ్చినపుడు కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి యజమాని లేదా బాధ్యత కలిగిన వ్యక్తులు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇంట్లో లేనివారికి సంబంధించిన ఏమైనా రుజువులు చూపించి వారి వివరాలు నమోదు చేయించవచ్చు. వంట గది ప్రామాణికం కాదు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంట్లో ఉండే వంట గదులను ప్రామాణికంగా తీసుకోకుండా నివసిస్తున్న కుటుంబాల సంఖ్యను నమోదు చేస్తారు. ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలైతే నివసిస్తున్నాయో.. ఆ కుటుంబాలన్నింటికీ వేర్వేరుగా ఇంటి నంబర్లు వేశారు. దీంతో కుటుంబాల సంఖ్య పెరిగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కావడంతో వంట గదులను ప్రామాణికంగా తీసుకోవడం లేదు. వేసిన నంబర్ల ఆధారంగానే.. సర్వే సిబ్బంది ఇళ్లపై వేసిన నంబర్ల ఆధారంగానే వివరాలు నమోదు చేస్తారు. ఓటరు లిస్టు లేదా మరే ఇతర గుర్తింపు కార్డు ఆధారంగా చెప్పిన వివరాలను నమోదు చేయరు. అద్దెగృహాల్లో ఉండే వారికి ‘బై’ నంబర్లు.. అద్దె గృహాల్లో నివసిస్తున్న వారి వివరాలు సేకరించేందుకు అద్దెకు ఉంటున్న ఇళ్లకే ‘బై’ నంబర్లు వేశారు. బై నంబర్లు వేయకుంటే సంబంధిత వీఆర్వో, వీఆర్ఏలు లేదా తహశీల్దార్లను సంప్రదించవచ్చు. రేషన్ కార్డు రద్దు కాకూడదనుకుంటే... ఒకచోట రేషన్కార్డు.. మరోచోట స్థిర, చరాస్తులు ఉన్నట్లయితే.. రేషన్కార్డు ఉన్న చోటనే సర్వేలో నమోదు చేసుకుంటే మంచిది. అప్పుడే రేషన్కార్డు రద్దు కాదు. స్థిర, చరాస్తులు ఉన్నచోట సర్వేలో పాల్గొంటే.. అప్పుడు కచ్చితంగా రేషన్కార్డు రద్దయ్యే అవకాశముంది. సదరెం సర్టిఫికెట్ తప్పనిసరి.. వికలాంగులు సదెరం సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒకవేళ సదరెం సర్టిఫికెట్ లేకున్నా వికలాంగుల వివరాలు నమోదు చేస్తారు. కానీ వికలాంగుల పెన్షన్ పొందడానికి సదరెం సర్టిఫికెట్ తప్పనిసరి చేయనున్నారు. ఖాతా నంబరు చెబితే నష్టమేమీ లేదు.. కుటుంబ యజమాని తన బ్యాంకు అకౌంటు నంబరు చెప్పడం వల్ల ఎలాంటి ముప్పు లేదు. అకౌంట్ నంబరు చెప్పడం.. చెప్పకపోవడం యజమాని ఇష్టమే. ప్రభుత్వం నుంచి పొందే లబ్దిని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేయడానికి మాత్రమే అకౌంట్ నంబరు అడుగుతున్నారు (బ్యాంకు ఖాతా వంటి వ్యక్తిగత వివరాలు అడగరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సర్వే నమూనా పత్రాల్లో మాత్రం బ్యాంకు ఖాతా వివరాలు తెలపాలని ముద్రించారు). ఇతర ప్రాంతాలవారు రావాల్సిన పనిలేదు ఉపాధి కోసం దుబాయి, ముంబయి, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు వెళ్లినవారు సర్వే కోసం రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ సొంతగ్రామాలకు వచ్చి సర్వేలో నమోదు చేసుకుని తిరిగి వెళ్లిపోతే అధికారులు మళ్లీ విచారణ చేపట్టి వారి పేర్లను తొలగిస్తారు. ఆదాయం ఎంతో చెబితే చాలు కుటుంబ ఆదాయం ఎంతో చెబితే చాలు. ఆదాయ మార్గాల వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనాథలే.. తల్లిదండ్రులు లేని పిల్లలు తాతలు లేదా సమీప బందువుల వద్ద పెరుగుతున్నా వారిని అనాథలుగానే పరిగణిస్తారు. వీరితోపాటు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తల్లి లేదా తండ్రి వదిలేసినవారు, కొడుకులు లేదా కూతుళ్లు వదిలేసిన తల్లిదండ్రులను అనాథలుగానే పరిగణిస్తారు. సర్వే నుంచి వీరికి మినహాయింపు ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులను సర్వే నుంచి మినహాయించారు. అందుకు తగిన ఆధారాలను (అడ్మిషన్, ఫీజుల రశీదులు వగైరా) చూపిస్తే సర్వే పత్రంలో నమోదు చేస్తారు. గర్భిణులు, వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సర్వే నుంచి మినహాయించారు. ఇంటికి తాళం వేసి ఉంటే.. సర్వే జరిగే రోజు ఇంటికి తాళం వేసి ఉంటే.. పొరుగువారి నుంచి ఆ కుటుంబ యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తారు. అలాంటి ఇళ్లకు ప్రత్యేకంగా మార్కువేస్తారు. నకిలీ ఎన్యుమరేటర్లను నమ్మొద్దు.. సర్వే కోసం నియమించిన ఎన్యూమరేటర్లకు గుర్తింపుకార్డు తప్పనిసరి చేశారు. గుర్తింపుకార్డు లేకుండా సర్వేకు వచ్చామని చెప్పేవారికి ఎలాంటి వివరాలూ చెప్పొద్దు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆస్తుల వివరాలు అడిగితే సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. తప్పుడు సమాచారం చెప్పొద్దు.. సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవాలే తెలపాలి. తప్పుడు సమాచారం ఇస్తే ప్రభుత్వం నుంచి అమలయ్యే సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తించే అవకాశముంది. కుటుంబ సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సమగ్రంగా చెబితేనే రేషన్కార్డులు, ఇళ్లు పెన్షన్లకు అర్హత పొందుతారు. ఇది రహస్య సమాచారం సమగ్ర సర్వే ద్వారా సేకరించిన సమాచారం అంతా కూడా రహస్యంగా ఉంటుంది. మూడోవ్యక్తికి కుటుంబ వివరాలు చెప్పరు. సర్వే ఫారం జిరాక్స్లను బయటకు ఇవ్వడానికి వీల్లేదు (ఇంటింటి సర్వేలో పాల్గొనడం అనేది ప్రజల ఇష్టంపై (ఐచ్ఛికం) ఆధారపడి ఉంటుందని, ఎలాంటి ఒత్తిడీ చేయరాదని ఇటీవల హైకోర్టు సూచించింది). -
అన్నీ సిద్ధంగా ఉంటే అరగంటలోపే..
ప్రస్తుతం ఎక్కడ చూసినా సమగ్ర కుటుంబ సర్వే గురించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఏ ఇద్దరు కలిసినా సర్వేకు సంబంధించిన చర్చే పెడుతున్నారు. ఇదివరకు ఉద్యోగులు, సిబ్బంది ఎన్నో రకాల సర్వేలు చేసినప్పటికీ, ఒకేరోజులో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయాల్సి రావడం ఇదే మొదటిసారి. దీంతో సర్వేచేస్తు న్న ఉద్యోగుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. పైగా ప్ర జల నుంచి సేకరించాల్సిన వివరాలు అధిక సంఖ్యలో ఉండటంతో ఇప్పుడు ‘సమయం’ కీలకంగా మారనుంది. ఒక్కొక్కరికి 30 కుటుంబాలు... సర్వే చేసే సిబ్బందికి ఒక్కొక్కరికి 25 నుంచి 30 కు టుంబాలను కేటాయించారు. ఫార్మాట్లో ఉన్న ప్రకా రం నమూనా దరఖాస్తులతో ఎవరికి వారు ఎంత స మయంలో వివరాలు నమోదు చేయగలుగుతామో సి బ్బంది సొంతంగా రాసి పరీక్షించుకుంటున్నారు. ఒక రు అరగంటలో, మరొకరు 45 నిమిషాల్లో వివరాలు నమోదు పూర్తిచేశామని చెప్పుకుంటున్నారు. అయితే కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్య, అడిగిన వాటికి వారు స్పందించే తీరు, అవసరమైన ప్రతులను వారు చూపించే విధానంపై ‘సమయం’ ఆధారపడి ఉంటుం ది. విద్యావంతులు, సర్వే విధులు నిర్వహించే వ్యక్తు లు ముందుగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసి, ఎంత సమయం పడుతుందో ప్రయోగాత్మకంగా పరీక్షించుకుంటున్నారు. ఇంటర్నెట్ నుంచి సేకరించి న సర్వే నమూనా దరఖాస్తులను ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. సర్వే కోసం వచ్చే సిబ్బంది తమ దగ్గరున్న దరఖాస్తుల్లోనే (ప్రభుత్వం జారీచేసిన దరఖాస్తుకు క్రమసంఖ్య ఉంటుంది) వివరాలు నమోదు చేసుకుంటారు. అయినప్పటికీ నమూనా దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నమోదు చేసి, రుజువులకు అవసరమైన అన్ని పత్రాలను ఒక్కచోట సిద్ధంగా ఉంచుకుం టున్నారు. దీనివల్ల సర్వే కోసం వచ్చిన వారికి సౌకర్యంగా ఉంటుందని, వివరాల నమోదులో జాప్యం జరగదని ప్రజలు భావిస్తున్నారు. 12 గంటలకు పైనే.. ఒక్క ఎన్యూమరేటర్ 25 కుటుంబాలను సర్వే చేయా ల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబానికి తక్కువలో తక్కువగా అరగంట సమయం తీసుకునే అవకాశం ఉంది. అంటే 25 మందికి 12.30 గంటల సమయం పడుతుంది. ఒకవేళ కొంతవేగంగా పనిచేసేవారు, 25 నిమిషాల్లోనే ఒక కుటుంబం వివరాలు నమోదు చేసినా, 10.30 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్న భోజనం, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడానికి పట్టే సమయం, ఇలా అన్నీ లెక్కలేసుకుంటే ఎటుతిరిగి ఎంతవేగంగా పనిచేసినా 12 గంటలకు పైగానే అవుతుం దని సిబ్బంది చెబుతున్నారు. మంగళవారం నిర్వహిం చనున్న సర్వేలో తొలిసారి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు విద్యార్థులు విధులు నిర్వహిస్తున్నారు. తరుచూ వివిధ రకాలు సర్వే విధులు నిర్వర్తించే ఉపాధ్యాయుల కన్నా , ఇతర విభాగాల వారికి సర్వే వివరాల నమోదు ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రా మాలలో గ్రామసభలు నిర్వహించారు. దీంతోపాటు కరపత్రాలు పంపిణీ చేశారు. అధికారులు సైతం మీ డియా ద్వారా ప్రజలకు పలుమార్లు సర్వేపై అవగాహ న కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లాకేంద్రం లో టోల్ ఫ్రీ నెంబరును సైతం ఏర్పాటు చేశారు. అవసరమైన పత్రాలన్నీ ఒకచోట పెట్టి సర్వే ప్రతినిధులకు సహకరిస్తే, ఒక్కరోజులో సర్వే విజయవంతం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
సర్వే ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సమగ్ర కుటుంబ సర్వేకు అధికార యంత్రాం గం సర్వ సన్నద్ధమైంది. ఒకే రోజు జిల్లాలోని 6,95,205 కుటుంబాలను సర్వే చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఇప్పటికే దశలవారీగా సమీక్షలు, శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి కుటుంబం నుంచి 32 రకాల వివరాలను సేకరించనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యే సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా వివరాలు సేకరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ కార్య క్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి బి.జనార్దన్రెడ్డిని ఇన్చార్జ్గా నియమించింది. కలెక్టర్ రొనాల్డ్ రాస్ వారం రో జులుగా రెవెన్యూ డివిజన్లవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఉద్యోగులను అ ప్రమత్తం చేశారు. సర్వేను సక్సెస్ చేయాలంటూ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డితోపాటు శాసనసభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పులు లేకుండా 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 25,51,335 మంది జనాభా ఉన్నారు. 6,95,205 కు టుంబాలున్నాయి. ఈ కుటుంబాలను స ర్వే చేసేందుకు ఐకేపీ, డ్వామా, ఆర్వీఎం, మెప్మా, పీఆర్, ఐసీడీఎస్ తదితర శాఖల ఉద్యోగులు, అధికారులు 30,680 మంది ని నియమించారు. పోలీసుశాఖ 1,498 మందిని కేటాయించింది. ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం కుటుంబ సభ్యుల వివరాలు నిర్దేశించిన నమూనా పట్టికలో తప్పులు దొర్లకుండా రాయాలని ప్రత్యేక అధికారి జనార్దన్రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్రాస్ ఇదివరకే అధికారులను, ఎన్యూమరేటర్లను ఆదేశించారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగుల కోసం అల్పాహారం, మధ్యా హ్న భోజనం ఏర్పాటు చేయాలని ఆయా పంచాయతీల సర్పంచులు, మండల ప్ర త్యేకాధికారులను ఆదేశించారు. ఎన్యూమరేటర్లను 56 రిసెప్షన్ సెంటర్ల ద్వారా 979 వాహనాల్లో 718గ్రామాలకు తరలించారు. ఇబ్బంది కలిగినా సొంతూళ్లకు జిల్లాలో మొత్తం 36 మండలాలు, 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. హైదరాబాద్, మహారాష్ట్ర, బొంబాయి, భీవండి, షోలాపూర్, బీదర్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లినవారితోపాటు వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటున్నవారు సోమవా రం రాత్రికే స్వగ్రామాలకు చేరుకున్నారు. కొంత ఇబ్బంది కలిగినా, ప్రభుత్వం ఇచ్చి న పిలుపు మేరకు ఒక్కరోజు ముందే జ నం స్వస్థలాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందుకు సం బంధించిన ధ్రువీకరణ పత్రాలను కుటుం బసభ్యులకు పంపించారు. -
ఓసీ సర్వేపై సమావేశం రసాభాస
కాసిపేట :కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామంలో ఓపెన్కాస్టు(ఓసీ) సర్వేపై సోమవారం గ్రామస్తులతో అధికారులు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఓపెన్కాస్టు నిర్మాణంతో గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతుందని, ఓసీ కోసం తలపెట్టిన సర్వేలు నిలిపివేయాలని, లేనిపక్షంలో సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరిస్తామని గ్రామస్తులు ఇటీవల తీర్మాణం చేసిన విషయం తెలిసిందే. ఆర్డీవో స్వయంగా ఓసీ సర్వే నిలిపివేస్తామని హామీ ఇస్తేనే సమగ్ర కుటుంబ సర్వేకు సహకరిస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో సోమవారం గ్రామంలో మంచిర్యాల ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి ఏరియా జీఎం మల్లిఖార్జునరావు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఓపెన్కాస్టు సర్వేలు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకే ఓసీ కోసం సర్వేలు చేస్తున్నామని ఆర్డీవో, జీఎంలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఓసీ మంజూరైనందున ప్రస్తుతం సర్వేలు చేపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేతో వాదనకు దిగారు. ఎన్నికల వేళ ఓసీలకు వ్యతిరేకమని, భూగర్భ గనులకు ప్రాధాన్యం ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తి తోపులాటకు దారితీసింది. సమావేశం రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇకపై సర్వేలు ఉండవు.. : ఎమ్మెల్యే కలెక్టర్, ముఖ్యమంత్రితో మాట్లాడి ఓసీని అడ్డుకుంటామని ఎమ్మెల్యే చిన్నయ్య పేర్కొన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఓసీ సర్వేలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించినట్లు, ఇకపై సర్వేలు ఉండవని పేర్కొన్నారు. సర్వే నిలిపివేస్తున్నట్లు అధికారులతో చెప్పించారు. సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. తహశీల్దార్ కవిత, కాసిపేట సర్పంచ్ నీల రాంచందర్, ఎంపీపీ ముదం శంకరమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు రౌతు సత్తయ్య, బెల్లంపల్లి జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, వైస్ ఏంపీపీ లౌడ్య బలరాం, ఏంపీటీసీలు కొండబత్తుల సంధ్య, దాసరి శ్రీనివాస్, దుర్గం లక్ష్మి, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీధర్రావు, మండల అధ్యక్షుడు రమణారెడ్డి, యూత్కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణ, ప్రజాస్పందన వేదిక కన్వీనర్ సిలోజు మురళి, సీపీఐ నాయకులు దాగం మల్లేశ్, జాడి పోశం, కల్వల లక్ష్మణ్ ఎస్టేట్ అధికారి హిరియా పాల్గొన్నారు. -
సర్వేమయం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు.. సంక్షేమ పథకాలు అర్హులకే అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఈ సర్వేలో భాగస్వామ్యం అయ్యేందుకు జిల్లా వాసులు కూడా సంసిద్ధంగా ఉన్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలు సర్వేలో తమ కుటుంబ వివరాలు నమోదు చేయించుకునేందుకు స్వస్థలాలకు చేరుకున్నారు. సర్వే కోసం కుటుంబ సభ్యులంతా ఒకేచోటికి చేరడంతో అన్ని నివాసాల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో సోమవారం అన్ని రవాణా వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా సర్వేపైనే చర్చించుకుంటున్నారు. వివరాల నమోదు విషయంలో సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఫ్రొఫార్మాలు, ఇతర సర్వే సామగ్రీని సోమవారం పంపిణీ చేశారు. ఆయా రెవెన్యూ డివిజన్ల వారీగా ఈ పంపిణీ జరిగింది. క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించనున్న ఎన్యూమరేటర్లు సోమవారం సాయంత్రమే గ్రామాలకు బయలుదేరి వెళ్లగా, దగ్గర గ్రామాల్లో మంగళవారం ఉదయం బయలుదేరనున్నారు. సర్వే సిబ్బందిని, అధికారులను ఆయా ప్రాంతాలకు చేరవేసేందుకు జిల్లా వ్తాప్తంగా 1,797 వాహనాలను ఏర్పాటు చేశారు. సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి, వివిధ వర్గాల ప్రజలకు ఆయా డివిజన్ పరిధిలో శిక్షణ, అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొన్ని వర్గాలకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించారు. సర్వే ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.జగన్మోహన్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎ.అశోక్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 32,684 ఎన్యూమరేటర్లు.. 2,492 అధికారులు.. జిల్లాలో 7,89,613 కుటుంబాలు ఉన్నాయని గుర్తించారు. ఈ కుటుంబాలపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు 32,684 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25 ఇళ్ల చొప్పున సర్వే చేసి వివరాలు సేకరించనున్నారు. సర్వేను పర్యవేక్షించేందుకు, పకడ్బందీగా నిర్వహించేందుకు 2,492 అధికారులు, సిబ్బందిని నియమించారు. 866 గ్రామ పంచాయతీలలో సర్వే సక్రమంగా జరిగేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో విలేజ్ ప్లానింగ్ అధికారులుగా గుర్తించారు. ఒక్కో మండలానికి ఒక రిసోర్స్ పర్సన్ను, మున్సిపల్ పరిధిలో ఐదుగురు రిసోర్స్ పర్సన్ల చొప్పున నియమించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 295 మంది క్లస్టర్ అధికారులను నియమించారు. అలాగే 52 మండలాలు, ఏడు మున్సిపాలిటీలకు కలిపి ఒక్కొక్కరు చొప్పున 59 మంది అధికారులకు సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించారు. వీరితోపాటు మరో 1,213 అధికారులు, సిబ్బందిని అదనంగా నియమించారు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా ఎన్యూమరేటర్లు విధులకు హాజరు కాని పక్షంలో వారి స్థానాల్లో సర్వే చేసేందుకు కొందరు ఎన్యూమరేటర్లను రిజర్వులో ఉంచారు. సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 264 ఆర్టీసీ బస్సులు, 391 పాఠశాల బస్సులు, 296 జీపులు, 589 టాటా ఎసీ వాహనాలు, 229 ఆటోలు, 28 ట్రాక్టర్లు మొత్తం 1,797 వాహనాలు వినియోగిస్తున్నారు. ఇవీ అడుగుతారు.. కుటుంబ సర్వే చేసేందుకు ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్కు అన్ని వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఎన్యూమరేటర్ వద్ద 80 అంశాల ఫ్రొఫార్మా ఉంటుంది. ఈ ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేసి తిరిగి ప్రభుత్వానికి పంపిస్తారు. ఇందుకు గ్రామాల ప్రొఫార్మాలను కలెక్ట్ చేసేందుకు మండలాల్లో సర్వే రోజు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సర్వే ఎన్యూమరేటర్కు ఆధార్ కార్డు (ఉన్నట్లైతే), వాహన రిజిస్ట్రేషన్ కార్డు, ఇంటి పన్ను రశీదు, కరెంట్ బిల్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పుస్తకం, బ్యాంకు, పోస్టాఫీసు పాసు పుస్తకం, కులం, జనన ధ్రువీకరణపత్రం, విద్యార్థులకు చెందిన సర్టిఫికెట్లు (మెమో, టీసీ వంటివి), వికలాంగుల ధ్రువీకరణ పత్రం (సదరం సర్టిఫికెట్), పట్టాదారు పాసు పుస్తకం, ఓటర్ ఐడీ, పాన్కార్డు, పెన్షనర్ల ఐడీతోపాటు రేషన్ కార్డు, సొంత ఇళ్లు వివరాలు అడుగుతారు. సర్వేలో అందరు వివరాలు నమోదు చేసుకునేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సర్వే అనంతరం గ్రామాధికారులు, సర్పంచ్లు క్రాస్చెకింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మండల ప్రత్యేక అధికారులు కూడా క్రాస్చెకింగ్ చేస్తారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ జగన్మోహన్ సందేశం ‘‘సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. సర్వేలో పేర్కొన్న అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వండి. వివరాలు లేనట్లైతే లేనట్లుగా, ఉన్నట్లైతే ఉన్నట్లుగా మాత్రమే ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు. ఈ సర్వేతో ప్రజలకు ఎలాంటి నష్టమూ కలగదు. సర్పంచ్లతోపాటు, వీఆర్వో నుంచి జిల్లాస్థాయి అధికారులు సర్వే చేస్తున్నారు. కుటుంబంలోని సభ్యులందరి పూర్తి వివరాలు చెబితేనే బాగుంటుంది. ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా సర్వే కోసం మీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్కు మీ కుటుంబ సభ్యులందరి పూర్తి వివరాలు చెబుతారని కోరుతున్నా.’’ కంట్రోల్ రూం ఏర్పాటు సర్వేపై సమగ్ర సమాచారం కోసం, సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో దీన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వాసులు 08732-222302, 08732-222802, 08732-225529 నెంబర్లకు ఫొన్ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎన్యూమరేటర్లకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు
మోమిన్పేట: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు స్వచ్ఛందంగా వస్తున్న ఎన్యూమరేటర్లకు ఉద్యోగ సంఘాలు స్వాగతం పలుకనున్నాయి. ఈ మేరకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రత్యక్షమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేకు పలు ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండ కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగం చేస్తున్న వారు, ఆశా వర్కర్లు, సాక్షరభారత్ కో-ఆర్డినేటర్లు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొనడంపై ఉద్యోగ సంఘా లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
నేడే ‘సర్వే’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం సర్వే ప్రారంభం కానుండగా.. అధికారులు మాత్రం సోమవారం రాత్రి నుంచే పల్లెలకు చేరుకున్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతమంతా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండడంతో, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టనుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 8.10 లక్షల కుటుంబాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 25లక్షల జనాభా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహణకు జిల్లా యంత్రాంగం 28 వేల మంది ఎన్యూమరేటర్లను నియమించింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే ప్రక్రియ కొనసాగనుంది. పక్కాగా.. పకడ్బందీగా సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను పక్కా సమాచారంతో పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతాన్ని 380 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టారుకు ప్రత్యేకాధికారిని నియమించింది. ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేసింది. మొత్తం 8.10 లక్షల కుటుంబాలకు గాను 8.30 లక్షల సర్వే పత్రాలను ముద్రించి మండల కేంద్రాలకు తరలించింది. కుటుంబ సభ్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, వారి ధ్రువీకరణ ప్రతాలను చూసిన తర్వాతే వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితులు, హాస్టళ్లలో చదివేవారు మాత్రం అందుబాటులో లేనప్పటికీ ధ్రువీకరణతో నమోదు చేసుకోనున్నారు. ఉదయం 6గంటల నుంచే.. సర్వే ప్రక్రియలో భాగస్వాములయ్యే సిబ్బంది మంగళవారం ఉదయం 6గంటలకే మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్న ఉద్యోగులు అల్పాహారం పూర్తి చేసుకుని సర్వే మెటీరియల్ను తీసుకుని ఏడు గంటలకు బయలుదేరుతారు. వీరిని గ్రామాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం 1,300 బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఉదయం 8గంటలకు వివరాల సేకరణ మొదలు పెట్టిన ఉద్యోగులు.. వారికి నిర్దేశించిన కుటుంబాల నుంచి సాయంత్రం 6గంటల లోపు వివరాలు సేకరించాలి. అనంతరం వాటిని క్లోజ్ చేస్తూ సమాచారాన్ని ప్రత్యేకాధికారికి అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా రాత్రి ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలి. అలా వచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా స్థాయిలో సర్వే చేసిన సంఖ్యపై రాత్రి 9గంటలకు స్పష్టత వస్తుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా సర్వే ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. -
జిల్లాలో అన్ని సంస్థలకూ రేపు సెలవు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వేకు అంతా సిద్ధమైంది. జిల్లా అధికారులు ఈ సర్వేకు సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 8.75 లక్షల కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేయనున్నారు. దీనికి 32,204 మంది సిబ్బందిని నియమించారు. ప్రభుత్వం అధికారికంగా సర్వే చేపడుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్, విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా ఆరోజు సెలవు ప్రకటించాయి. జిల్లావ్యాప్తంగా సర్వే చేయనున్న కుటుంబాలను యంత్రాంగం అధికారికంగా గుర్తించింది. మొత్తంమీద 8,75,970 కుటుంబాలను సర్వే చేయనున్నారు. ఈ సర్వేకు సంబంధించి జిల్లాలో 758 గ్రామ పంచాయతీల పరిధిలో 778 మంది సూపర్వైజర్లు, 238 మంది జోనల్ ఆఫీసర్లను నియమించారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ను వివరాలు నమోదు చేయడానికి ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సర్వే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రారంభం కానుంది. జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కు బదలాయించబడిన, పోలవరం ముంపు మండలాలు చింతూరు, వీఆర్పురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పోలవరం ముంపులోకి వెళ్లిన గ్రామాల్లో కూడా సర్వే చేయడానికి సిబ్బంది వెళ్తున్నారు. సర్వేకు వెళ్లే ఎన్యూమరేటర్లకు ఆయా మండల కేంద్రాల్లోనే సోమవారం సర్వే ఫామ్లు అందజేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో కుటుంబాల వారీగా ప్రభుత్వ స్టిక్కర్లు అంటించడంతో ఎన్ని కుటుంబాలున్నాయో అధికారికంగా తేలింది. వీటి ఆధారంగానే సర్వేను అధికారులు పకడ్బందీగా చేయించనున్నారు. సర్వం బంద్... సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సర్వే జరిగే రోజును ప్రభుత్వం అధికారిక సెలవుదినంగా ప్రకటించింది. కుటుంబాలుగాా నమోదైన వారు తప్పనిసరిగా సర్వే రోజు తమ కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లకు వివరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటే మంచిది. ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలను ఆ కుటుంబ యజమాని ఇస్తే సరిపోతుంది. అలాగే ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న వారి వివరాలను కూడా కుటుంబ యజమాని చెప్పాల్సి ఉంటుంది. సర్వేకు ఉన్న ప్రాధాన్యతతో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పెట్రోల్బంక్లు, సినిమాహాల్స్, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆరోజు మూతపడనున్నాయి. అలాగే సింగరేణి కార్మికులకు కూడా యాజమాన్యం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది. సర్వే రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన దృష్ట్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. జిల్లా యంత్రాంగం రెడీ.. సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకు జిల్లా యంత్రాంగం రెడీ అయింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఈ సర్వేకు సంబంధించి అధికారులను సమాయత్తం చేశారు. సర్వే ఎంత పకడ్బందీగా నిర్వహించాల్సింది అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్యూమరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఖమ్మం నగరానికి సంబంధించిన సర్వే బాధ్యతలను జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సర్వే ఎలా నిర్వహించాలనే దానిపై ఎన్యూమరేటర్లకు శిక్షణను ఇచ్చారు. అధికారికంగా ఎన్ని కుటుంబాలకు సర్వే నిర్వహించాలనే దానిపై కూడా అధికారులు ఒక అవగాహనకు రావడంతో ఆ మేరకు సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
సమగ్ర కుటుంబ సర్వేలో ఏముంది?
సర్వే అధికారులకు ఈ రుజువులు చూపండి సర్వే కోసం 19న ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు కుటుంబానికి సంబంధించిన వాస్తవ వివరాలు తెలియజేయడంతో పాటు వారి అనుమానాల నివృత్తికి అందుబాటులో ఉన్న కొన్ని రుజువులు చూపాల్సి ఉంటుంది. సర్వే సమయంలో ఉన్న చిరునామా కాకుండా ఇతర ప్రాంతాల చిరునామాలతో ఆ పత్రాలు ఉన్నప్పటికీ అవసరం మేరకు చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు గత సంవత్సరం అద్దె ఇంట్లో ఉండి అదే ఇంటి నంబరుతో ఆధార్కార్డు, వాహన రిజిస్ట్రేషన్ కార్డు పొంది ఉన్న వారు తరువాత వేరే ఇంట్లోకి మారినట్లయితే ప్రస్తుతం ఉన్న చిరునామా చెప్పడంతో పాటు పాత చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు నంబరు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పవచ్చు. సర్వే అధికారులు అడిగితే చూపించాల్సిన మరికొన్ని పత్రాలు... ► ఆధార్ కార్డు ► వాహన రిజిస్ట్రేషన్ కార్డు ► ఇంటి అసెస్మెంట్, ఇంటి పన్ను రశీదు ► కరెంట్ బిల్లు ► ఎల్పీజీ కనెక్షన్ పుస్తకం ► బ్యాంక్, పోస్టాఫీసు పాసు పుస్తకం ► కులం, జనన ధ్రువీకరణ పత్రం ► విద్యార్థులు చదువుకున్న పత్రాలు(మెమో, టీసీ వంటివి) ► వికలాంగుల ధ్రువీకరణ పత్రం(సదరం సర్టిఫికెట్) ► వాహనాల రిజిస్ట్రేషన్ కాపీ కార్డు ► వ్యవసాయ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం ► ఓటర్ ఐడీకార్డు, పాన్కార్డు ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందితే ఇందిరమ్మ ఇల్లు, వంటి వాటి కేటాయింపు సర్టిఫికెట్. పెన్షనర్ల ఐడీ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. రేషన్కార్డు ప్రస్తావన లేదు ప్రభుత్వం బేస్లైన్ సర్వే చేపడుతుందనగానే రేషన్కార్డుల ఏరివేత కోసమే అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అయితే నిజానికి సర్వేలో ఎక్కడా రేషన్కార్డుకు సంబంధించిన వివరాలు అడగడం లేదు. బోగస్కార్డుల ఏరివేతకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని, సర్వేతో రేషన్కార్డుకు ఎలాంటి సంబం ధం లేదని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే బోగస్ కార్డులు ఉన్న వారు స్వచ్ఛందంగా వాటిని అధికారులకు అందజేయాలని కోరారు. లేదంటే ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్డుల ఏరివేత చేపట్టి అనర్హులుగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంటికి నంబర్.. ప్రభుత్వ స్టిక్కర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేస్లైన్ ఇంటింటి సర్వేలో ఏ ఒక్క కుటుంబం, ఇల్లు తప్పిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. సర్వే కోసం వెళ్లిన ప్రతీ ఇంట్లో సర్వే పూర్తికాగానే ఆ ఇంటికి ప్రభుత్వ చిహ్నంతో ఒక స్టిక్కర్ అతికించడంతో పాటు సర్వే సందర్భంగా కేటాయించే నంబరును గోడపై రాస్తారు. ప్రస్తుతం సర్వే ఫారంలో కేటాయించిన నంబరు ఆ కుటుంబానికి సంబంధించి శాశ్వత నంబరుగా(యూనిక్ నంబరు) కేటాయిస్తారు. మరిన్ని విషయాలు.. ఇంటివద్దే ఉండాలి : సర్వే రోజు కుటుంబ యజమాని సహా సభ్యులందరూ.. ఇంటివద్దనే అందుబాటులో ఉండి అధికారులకు పూర్తిసమాచారం అందజేసి సహకరించాలి. అవసరమైన వాటి కోసం సంబంధిత రుజువు పత్రాలు చూపిస్తే సరిపోతుంది. స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉంటే ఆ వివరాలు కూడా సర్వేలో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటి వద్ద లేనివారి కోసం : ఆస్పత్రుల్లోని ఇన్పేషెంట్లు, వారి సహాయకులు, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సర్వేలో మినహయింపు ఇచ్చారు. వారి వివరాలు కుటుంబ సభ్యులు నమోదు చేయించవచ్చు. అయితే స్థానికంగా లేని వారికి సంబంధించిన రుజువులు చూపాలి. ఉదాహరణకు ఆస్పత్రిలో చేరిన కార్డు, హాస్టల్, కళాశాల అడ్మిషన్ కార్డు వంటివి చూపించాలి. రెండు కుటుంబాలు ఉంటే : ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని ఫారాలు విడిగా పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటున్నట్లయితే వారికి సంబంధించి రెండు ఫారాలు విడివిడిగా నమోదు చేసి, ఆ కుటుంబాలకు విడివిడిగా నంబర్లు కేటాయిస్తారు. సొంత ఇంట్లో అయితే మంచిది : ప్రజలు సాధ్యమైనంత వరకు తమ సొంత గ్రామాల్లోనే వివరాలు నమోదు చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. సర్వే సందర్భంగా అధికారులకు ఇచ్చే ఆధార్, ఇతర వివరాలు వేరే చిరునామాతో నమోదు చేసుకున్నవైనా ఇబ్బంది లేదంటున్నారు. ఆ రోజున ప్రభుత్వం సెలవు దినంగా కూడ ప్రకటించినందున సాధ్యమైనంత వరకు స్వగ్రామాల్లోని సొంత ఇంట్లోనే నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. విభాగం-ఎ- గుర్తింపు వివరాలు ముందుగా ఎన్రోల్ మొంట్ బ్లాక్ నంబరు, నామమాత్రపు ఇంటి నంబరు, సర్వే ఫార్మాట్ నంబర్, జిల్లా పేరు, రెవెన్యూ గ్రామం, గ్రామ పంచాయతీ పేరు, మండలం, మునిసిపాలిటీ, ఆవాసం, వార్డు, డివిజన్ ఇంటి నంబరు, నివసిస్తున్న ప్రదేశం, వాడపేరు, కాలనీపేరు, ఇంటిలో ఉన్న కుటుంబాల సంఖ్య నమోదు చేసుకుంటారు. విభాగం-బి- కుటుంబం వివరాలు ఇందులో కుటుంబ యజమాని పేరు, ఇంటిపేరు, పూర్తి పేరు, తల్లి/తండ్రి/భర్త పేరు, కుటుంబంలోని సభ్యుల సంఖ్య, మతం, సామాజిక వర్గం, కులం, మాతృభాష, వంటగ్యాస్ కనెక్షన్ (ఉంది/లేదు), గ్యాస్ కంపెనీ పేరు, వినియోగదారుడి సంఖ్య, మొబైల్ ఫోన్ నంబరు, ఆదాయ పన్ను చెల్లించే కుటుంబమా(అవును/కాదు). అనాథలు ఉంటే వారి వివరాలు.. అనాథలు ఎక్కడ నివసిస్తున్నారు, అనాథ స్థితి, సంచార కుటుంబాలు, జాతులవారు అయితే వారికి శాశ్వత నివాసం వేరేచోట ఉందా(ఉంది/లేదు), గ్రామం, మండలం, జిల్లా పేరు, ఎంతకాలం నుంచి ప్రస్తుత చిరునామాలో ఉంటున్నారు. విభాగం-సి- నివాస స్థితి నివాస స్థితిలో ఇంటికప్పు రకం, గదుల సంఖ్య(వంటగది కాకుండా), ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉందా( ఉంది/లేదు), ఇంటి స్థలం ఎక్కడైనా ఉందా( ఉంది/లేదు), ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమంలో లబ్ధిపొందారా(అవును/కాదు), ఇంటి నిర్మాణం జరిగిన సంవత్సరం, ఇంటికి మరుగుదొడ్డి, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సదుపాయం ఉందా..? విద్యుత్ మీటరు నంబరు. విభాగం-డి - కుటుంబ సభ్యుల వివరాలు ఈ విభాగంలో కుటుంబ యజమాని మొదలుకుని కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తారు. యజమాని పేరు, సభ్యుల పేర్లు, యజమానితో గల సంబంధం, లింగము, పుట్టిన తేదీ, వయసు, వైవాహిక స్థితి, విద్యార్హతలు, విద్యార్థులైతే చదువు వివరాలు, బ్యాంక్, పోస్టాఫీస్ అకౌంట్, శాఖ పేరు, బ్యాంక్, బ్రాంచ్ పేరు, ఉద్యోగం(ఉన్నది/లేదు), ఉద్యోగం రకం, ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్దారు, సామాజిక పింఛన్ దారు, ప్రధానమైన వృత్తి, మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉందా.. ఆధార్ కార్డు ఐడీ నంబరు వంటి వివరాలు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. విభాగం- ఇ - వికలాంగుల వివరాలు ఇందులో వికలాంగుల పేరు, ఎలాంటి వైకల్యం ఉంది. సదరం సర్టిఫికెట్ ఉందా(ఉంది/లేదు), ఉన్నట్లయితే ఐడీ నంబరు, వైకల్య శాతం వంటి వివరాలు సర్వే అధికారులకు చెప్పాలి. విభాగం - ఎఫ్లో.. ఈ విభాగంలో కుటుంబంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి పేరు, వ్యాధిరకం వంటి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ వివరాలు చెబితే సరి ► ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల వివరాలు ► కులం ► కుటుంబ సభ్యుల ఆధార్కార్డుల వివరాలు, నంబరు ► వంటగ్యాస్ కనెక్షన్ వివరాలు ► మొబైల్ నంబరు ► చదువుకున్న వారైతే వయసు ధ్రువీకరణ పత్రం ► బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా నంబర్లు ► ఉద్యోగులైతే ఉద్యోగం, జీతం వివరాలు ► పింఛన్ పొందుతున్న వారైతే అందుకు సంబంధించిన వివరాలు. వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ చూపాల్సి ఉంటుంది ► విద్యుత్ కనెక్షన్ ఉంటే నంబరు తెలియజేయాలి ► కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులుంటే ఆ వివరాలు చెప్పాలి ► తాత్కాలిక సంచార కుటుంబం అయితే ఆ వివరాలు ఇవ్వాలి ► 18ఏళ్లు నిండితే ఓటరు కార్డు వివరాలు అందజేయాలి సర్వే సమయంలో భూములు, వాహనాల వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్లో వాటిని అమ్మాలనుకున్నా.. వారసులకు ఇవ్వాలనుకున్నా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అధికారులు సర్వే కోసం వచ్చినప్పుడు ఇంటి యజమాని అందుబాటులో ఉండి వాస్తవ సమాచారం ఇవ్వాలి ఇచ్చే సమాచారంలో అవాస్తవాలు ఉన్నట్లయితే తమను ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించవచ్చని, సమాచారం పూర్తిగా వాస్తవమని చెబుతూ సంతకం చేయాల్సి ఉంటుంది. ధ్రువీకరణ పత్రం సర్వే అధికారులు సర్వే ఫారంలో ‘ఎ’ నుంచి ‘ఐ’ వరకు ఉన్న ప్రొఫార్మాలో అడిగిన వివరాలకు సంబంధించి ఇంటి యజమాని/ కుటుంబ సభ్యులు అందజేసిన వివరాలన్నీ వాస్తవమేనని, ఒకవేళ తాము ఇచ్చిన సమాచారంలో తప్పులు/ అవాస్తవాలు ఉన్నట్లయితే తమను ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించవచ్చని, తమపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ధ్రువీకరిస్తూ కుటుంబ యజమాని సంతకం/వేలిముద్ర దరఖాస్తు ఫారం చివరలో చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎన్యూమరేటర్, పర్యవేక్షణాధికారి ఫారం కింది భాగంలో వివరాలను ధ్రువీకరిస్తూ సంతకాలు చేసి హోదా, ఇతర వివరాలతో పాటు మొబైల్ నంబరు వేస్తారు. -
సర్వేతో అక్రమార్కులకు చెక్ పడే అవకాశం
మంచిర్యాల రూరల్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర సర్వేతో మంచిర్యాల మండలం గుడిపేట వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితుల్లో అనర్హులు, బినామీల బండారం బయటపడే అవకాశం కన్పిస్తోంది. సర్వే సిబ్బంది పక్కాగా వ్యవహరిస్తే ముంపు గ్రామాల్లో నివాసం ఉంటున్న వారు ఎంత మంది? బినామీ పేర్లతో పరిహారం పొందిన వారు ఎవరు? అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, అధికారులు చేతివాటం చూపించడంతో, ముంపునకు గురయ్యే తొమ్మిది గ్రామాల్లో 300లకు పైగా అనర్హులు తెరపైకి వచ్చినట్లు సమాచారం. వీరిని గుర్తించేందుకు అధికారులు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా.. స్థానికంగా ఉన్న ఇబ్బందులతో అనర్హత వేటు పడలేదు. గతేడాది డిసెంబర్ వరకు పరిహారం పంపిణీ సమయంలో బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు, ఐరిష్ సేకరణను చేపట్టగా 129 మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమగ్రంగా సర్వే చేస్తే 300లకు పైగా అనర్హులను గుర్తించొచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చూసినా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. అనంతరం ఎన్నికల హడావుడి, రాష్ట్రపతి పాలన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బినామీల గుర్తింపు, వారిపై చర్యలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం అనర్హుల గుర్తింపునకు ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు. అర్హులకు నిరాశ 2006లో ముంపు గ్రామాల్లో సోషల్ ఎకనామికల్ సర్వే(ఎస్ఈఎస్) చేపట్టారు. గ్రామాల్లో ఉన్న వారి పేర్లు, వివరాలు సర్వే ద్వారా నమోదు చేసి నిర్వాసితులను గుర్తించారు. నిరక్షరాస్యత, అవగాహన లోపంతో కొందరు అర్హుల పేర్లు ఎస్ఈఎస్లో నమోదు చేయించుకోలేదు. ఆలస్యంగా మేల్కొన్న అర్హులైన వారు ఎస్ఈఎస్లో పేర్లు మిస్సయ్యాయని, తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామంలో దళారులు పుట్టుకొచ్చారు. అర్హుల పేర్లు ఎస్ఈఎస్లో నమోదు కాలేదంటూ, వారి పేర్లు అడ్డుపెట్టుకుని, ఒక్కో గ్రామం నుంచి 50కి పైగా బినామీ పేర్లు తెరపైకి తెచ్చారు. పేర్లు మిస్సయిన అర్హులు గ్రామానికి 10 నుండి 30 మంది వరకు ఉండగా, వారిని ఇంత వరకు అర్హులుగా అధికారులు గుర్తించలేదు. అధికారులకు ముడుపులు అందించిన వారి పేర్లు మాత్రమే ఎస్ఈఎస్లో నమోదు చేసి, ముడుపులు ఇవ్వని వారి పేర్లు నమోదు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. బినామీలకు కూలీ డబ్బులు, ఇంటి డబ్బులు, పునరావాస కాలనీలో ప్లాట్లు లభించాయి. దీంతో తమకు పరిహారం అందించకుండా, అనర్హులకు పరిహారం అందించారంటూ బాధితులు అప్పటి ఆర్ఆర్ కమిషనర్ చిరంజీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు పూర్తికాగా, సర్వేతో మేలు జరుగుతుందని నిర్వాసితులైన అర్హులు భావిస్తున్నారు. బినామీల్లో ఆందోళన బయోమెట్రిక్ విధానంతో ముంపు గ్రామాల్లోని 129 మంది బినామీలు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. సమగ్ర సర్వే ద్వారా ఇళ్లు, కుటుంబ సభ్యుల వివరాలు, సంక్షేమ పథకాల వివరాలు, వారికి ఉన్న ఆస్తుల వివరాలు రికార్డు కానున్నాయి. దీంతో మిగిలిన బినామీలను గుర్తించేందుకు కుటుంబ సమగ్ర సర్వేఉపయోగపడనుండడంతో బినామీల్లో గుబులు మొదలైంది. ప్రతి గ్రామంలో బినామీలు అధికంగా ఉండడం, వారిపై చర్యలు తీసుకోవాలంటే రాజకీయ నాయకులు ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు సమగ్ర సర్వే చేపట్టడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఉండే కుటుంబాలు మరోసారి గ్రామానికి వచ్చి సర్వేలో పాల్గొనే అవకాశం లేదు. ఒకవేళ సర్వేలో పాల్గొన్న గ్రామంలోని ఇతరులు గుర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం వారు ఉంటున్న ఊర్లలో సర్వేలో పాల్గొనాలో, ముంపు గ్రామాల్లో పరిహారం పొందడంతో ఇక్కడికి రావాలోననే ఆందోళన బినామీల్లో నెలకొంది. మరికొందరు రెండు గ్రామాల్లో పరిహారం పొందారు. వారిని కూడా సర్వే ద్వారా గుర్తించే వీలుంది. ప్రస్తుతం ముంపు గ్రామాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వేతో అనర్హులను గుర్తించడం, అర్హులకు న్యాయం జరుగుతుందని ముంపు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘సర్వే’ జనా..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మరో మూడు రోజులు...కేవలం 72 గంటలు.... మన కుటుంబ సమాచారాన్ని పూర్తిగా ప్రభుత్వం వద్దకు చేర్చే సమగ్ర సర్వేకు ఉన్న గడువు ఇది. ఈ గడువులోనే జిల్లా ప్రజానీకం సర్వేకు సిద్ధం కావాల్సి ఉంది. సర్వేలో చూపించాల్సిన కాగితాలు, చెప్పాల్సిన వివరాలను ముందుగానే సిద్ధం చేసుకుని ఉంటే ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు సులువుగా ఉంటుందని అధికారులు చెపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ సర్వేపై ఎవరి అభిప్రాయం... చర్చ ఎలా ఉన్నా.. అధికారులు మాత్రం జిల్లాలో ఈ సర్వే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేసుకుపోతున్నారు. కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి నేతృత్వంలోని జిల్లా అధికార యంత్రాంగం సర్వేను పకడ్బందీగా నిర్వహించేందకు సిద్ధమవుతోంది. ఎన్యూమరేటర్ల నుంచి ఇంటింటికీ స్టిక్కర్ల వరకు... సర్వే ఫార్మాట్ల నుంచి డాటా ఎంట్రీ వరకు అన్ని దశలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు చెందిన లక్షలాది ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించే బృహత్తర ప్రణాళికకు సమయం ఆసన్నమవుతున్న ఈ తరుణంలో జిల్లాలోని ప్రజలంతా సమగ్ర సర్వేకు సిద్ధంగా ఉండాలని ‘సాక్షి’ కోరుకుంటోంది. ఎవరి నోట విన్నా... ఇదే మాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో ఏ నోట విన్నా ఇదే చర్చ జరుగుతోంది. ఎక్కడ నలుగురు గుమికూడినా... ఎవరైనా కొత్తవారు వచ్చి ఇంటి తలుపు తట్టినా ఇదే చర్చ.... అసలు ఈ సర్వే ఎందుకు? ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకా? రేషన్కార్డులు తీసేసేందుకా? లేదా స్థానిక త నిర్ధారించేందుకా... ఇలా ప్రజల్లో అనేక రకాల సందేహాలకు తావిచ్చిన ఈ సర్వేపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది సర్వే జరిగి తీరాల్సిందేనని అంటుంటే మరి కొందరు సర్వే వద్దనకపోయినా తమకున్న అనుమానాలను మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సర్వే విషయంలో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత కొందరు సర్వేను నిలిపివేయాలని కోర్టుకు వెళ్లడంతో సర్వే జరుగుతుందా లేదా అనే సందేహం వచ్చినా, ఆ తర్వాత సర్వే నిలిపివేయలేమని కోర్టు చెప్పడం... సర్వేలో సమాచారం ఇవ్వడం అనేది ప్రజల ఐచ్ఛికమేనని ప్రభుత్వం చెప్పడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్వే జరుగుతుందనే నిర్ధారణకు వచ్చారు ప్రజలు. అధికారులు ఇళ్లకు వస్తే చూపించాల్సినవి ఇవే... సర్వే చేసే సమయంలో ప్రతి ఒక్కరు రేషన్, ఆధార్కార్డు, ఇంటిపన్ను రశీదు, భూమి పట్టా కాగి తం, కరెంటు బిల్లు చూపించాలి. సామాజిక లేదా ఉద్యోగ పింఛన్లు తీసుకునే వారు ఆ వివరాలు ఇవ్వాలి. ఉపాధి హామీ కూలీలు గుర్తింపు కార్డు చూపాలి. కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉంటే మంచిది. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగిపోదు. తర్వా త సర్వేలో అదనపు వివరాలు చేర్చవచ్చు... అవసరమైతే తొలగించుకోవచ్చు. ప్రభుత్వం అధికారి కంగా మూడు కేటగిరీలకు సర్వే నుంచి మినహాయింపునిచ్చింది. ఎన్యూమరేటర్లుగా పనిచేసే ప్రభుత్వ సిబ్బంది... ఆసుపత్రులలో ఉన్నవారు, హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు సర్వే సమయంలో లేకపోయినా వారి వివరాలు నమోదు చేసుకుంటారు. ఇతర జిల్లాలకు చెందిన వారు ఈ జిల్లాలో ఉంటే వారి స్వగ్రామానికైనా వెళ్లవచ్చు. లేదా ఇక్కడే నమోదు చేసుకోవచ్చు. స్టిక్కర్లొచ్చేశాయి.. సర్వే నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా సర్వే నిర్వహించేవారిని, పర్యవేక్షించేవారిని జిల్లా యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసింది. సర్వే పూర్తయిన తర్వాత డాటాఎంట్రీకి అవసరమైన సామగ్రి, సిబ్బందిని కూడా రెడీ చేసి పెట్టుకుంది. అయితే, సర్వేను పకడ్బందీగా నిర్వహించడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికీ ఓ స్టిక్కర్ను అతికిస్తున్నారు. ఈ స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ఇలంబరితి చెపుతున్నారు. జిల్లా కేంద్రం మినహా అన్ని చోట్ల స్టిక్కర్ల పంపిణీ పూర్తయిందని, ఒకవేళ మిగిలిన ప్రాంతాల్లోని ఏ ఇంటికయినా ఇప్పటికీ స్టిక్కర్ వేయకపోతే సంబంధిత తహశీల్దార్ను సంప్రదించాలని కలెక్టర్ ‘సాక్షి’తో చెప్పారు. ఖమ్మంలో మాత్రం చివరి వరకు స్టిక్కర్ల పంపిణీ జరుగుతుందని అధికారుల అంచనా. అయితే, ఈ సర్వేలో ఓ కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడమే మంచిదని, ఏదో అపోహతో సమాచారాన్ని ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ‘సాక్షి’ వంతు ప్రయత్నం ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెపుతున్న తరుణంలో జిల్లాలోని ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ‘సాక్షి’ తన వంతు ప్రయత్నం చేసింది. జిల్లాలో ఉన్న నాలుగు రెవెన్యూ డివిజన్ల అధికారులతో శుక్రవారం ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 100 మందికిపైగా ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కేవలం గంట పాటే సాగిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్డీవోలు ఓపికగా సమాధానాలు చెప్పి వారికున్న సందేహాలను తీర్చారు. -
గుబులు రేపుతున్న సర్వే..!
ఘట్కేసర్ టౌన్: సమగ్ర కుటుంబ సర్వే బడా బాబుల్లో గుండెల్లో గుబులు రేపుతోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇప్పటి వరకు దొడ్దిదారిన సంక్షేమ పథకాలను కాజేసిన వారు సర్వే పేరు వింటేనే వణికిపోతున్నారు. అక్రమంగా పొందిన సేవలన్ని సర్వే ద్వారా బహిర్గతమయ్యే అవకాశముండటం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. వ్యతిరేకిస్తున్న ఉన్నత వర్గం, ఆహ్వానిస్తున్న పేద వర్గం... కోట్ల కొలది ఆస్తులున్న తెల్ల తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ తదితర రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర సౌకర్యాలు పొందుతున్న ఉన్నత వర్గాలు సామాజిక సర్వేను వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలు పొందడానికి అన్ని అర్హతలున్నా ప్రభుత్వ రాయితీలను అందుకోలేకపోతున్న పేద వర్గం సర్వేను స్వాగతిస్తోంది. సర్వేలో ఉద్యోగ స్థితి, ఆధార్, స్థిరాస్తి, చరాస్థి, గ్యాస్, ఇంటి, కుటుంబ పరిస్థితి, పశు సంపద, పెన్షన్స్, భూములు, పాన్ కార్డు తదితర వివరాలను సర్వే సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. పాలకుల స్వార్థపూరిత పాలనలో సర్కారు ఉద్యోగమున్న వారు, భూస్వాములు వారి తల్లితండ్రులు నేడు తెలుపు కార్డులు పొంది పెన్షన్స్, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుల ద్వారా రాయితీలు పొందుతున్నారు. వైకల్యం లేకున్న పెన్షన్ పొందడం, ఇల్లు ఉండగానే స్థలాలు, ఇందిరమ్మ పథకాలను తిరిగి వినియోగించుకున్న వారికి ఇప్పుడు సర్వే అంటేనే దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. భూములు, ప్లాట్ల విక్రయాలన్ని నేడు ఆన్లైన్లో జరుగుతున్నందున ఎక్కడ తమ అక్రమ ఆస్తుల వివరాలు సర్కారుకు తెలిసిపోతాయోనని బడాబాబులు దడుసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులకు తప్పని తిప్పలు... నూతనంగా ఎన్నికలైన ప్రజా ప్రతినిధులను సర్వే తిప్పలు వదలడం లేదు. ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కినా సర్వే ద్వారా ప్రజల నమ్మకాన్ని కోల్పోయే అవకాశముందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఓటేసి గెలిపిస్తే ఉన్న సౌకర్యాల్లో కోతల విధిస్తున్నారని, ఇందుకోసమేనే మిమ్మల్ని గెలిపించామా అంటూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. మరి ఈనెల 19న జరిగే సర్వేలో అందరూ అనుకుంటున్నంటు అక్రమాలు బయటపడతాయా లేక ఇది ఓ సాధారణ సర్వేగా మిగిలిపోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. -
పారితోషికం ఇవ్వకుంటే సర్వే చేయం
ఖమ్మం : ఈనెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు పారితోషికం ఇవ్వాల్సిందేనని జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు డిమాండ్ చేశారు. లేదంటే సర్వే నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కుటుంబ సమగ్ర సర్వేకు సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు జిల్లాలో లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల సేవలను వినియోగించుకోవాలని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని మహిళా డిగ్రీ కళాశాలలో గురుఆరం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్వేలో పాల్గొంటే తమకు పారితోషికం ఎంతిస్తారని అధికారులను ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి అధికారులు స మాధానమిస్తూ ఎవరికి ఏమీ ఇచ్చేది లేదని, స్వచ్ఛందంగానే సర్వే నిర్వహించాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు శిక్షణ బహిష్కరించి బయటకు వచ్చారు. ఉన్నత చదువులు చదివిని ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి సర్వేలో పాల్గొన్న ప్రైవేట్ ఉద్యోగులకు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాబు, రవీందర్, నరేష్, శేషురాం తదితరులు పాల్గొన్నారు. -
నిర్భయంగా వివరాలివ్వండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఈనెల 19న చేపట్టే సమగ్ర కుటుంబ సర్వే కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకోసమే. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుండవు. మీ వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని నిర్భయంగా ఎన్యూమరేటర్లకు చెప్పొచ్చు.’ అని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ స్ఫూర్తిభవన్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో దాదాపు 8 లక్షల ఇళ్లనుంచి వివరాలు సేకరిస్తామని, పట్టణ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సర్వేపై ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఉన్న వివరాలే చూపించండి సర్వేలో భాగంగా ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్కు మీ వద్ద అందుబాటులో ఉన్న వివరాలు మాత్రమే చూపించండి. 19న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ప్రతిఒక్కరూ అందుబాటులో ఉంటే కచ్చితమైన వివరాలు వస్తాయి. హాస్టళ్లు, ఇతర అత్యవసర సేవలు పొందే వాళ్లు అందుబాటులో లేనప్పటికీ వారి పేర్లుకూడా సేకరిస్తాం. ఈ సర్వేలో రేషన్ కార్డుల ప్రస్తావనలేదు. ప్రతి ఎన్యూమరేటర్కు గుర్తింపు కార్డు, 30 సర్వేఫారాలు, చెక్లిస్ట్ ఇస్తాం. వివరాల సేకరణ పూర్తయిన తర్వాత ఆ ఇంటికి స్టిక్కర్ అతికిస్తారు. ఒకవేళ కుటుంబసభ్యులు అందుబాటులో లేకుంటే డోర్లాక్ స్టిక్కర్ అతికిస్తారు. ఏమైనా సందేహాలుంటే ఎన్యూమరేటర్ వద్ద ఉన్న హాండ్బుక్ ఆధారంగా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలు మాత్రమే రికార్డు చేస్తాం. అందుబాటులో వివరాలు లేకుంటే నిల్ అని రాస్తాం. ఆ మేరకు ప్రజలు సహకరించాలి. 28 వేల సిబ్బందితో.. సమగ్ర కుటుంబ సర్వేకోసం 28వేల మంది సిబ్బందిని నియమించాం. ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థలతోపాటు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బందిని కూడా ఈ సర్వేలో ఉపయోగిస్తున్నాం. ఇప్పటికే సిబ్బందికి దాదాపు శిక్షణ పూర్తయింది. నేటినుంచి సెక్టోరియల్ అధికారులకు బాధ్యతలు ఇస్తాం. వీరు రేపట్నుంచి గ్రామాల్లో పర్యటించి ముందస్తుగా అంచనాకు వస్తారు. పంచాయతీ, మండలం, మున్సిపల్ వార్డులకు ప్రత్యేకంగా అధికారులను నియమించాం. సర్వే మెటీరియల్ అంతా ఈనెల 18న ప్రత్యేకాధికారులకు అందజేస్తాం. 19 ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ సర్వే కొనసాగుతుంది. అనంతరం 9గంటల కల్లా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వివరాలు క్రోడీకరించి నివేదిక తయారుచేస్తాం. సమగ్ర పర్యవేక్షణ.. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో స్పష్టత కోసమే ఈ సర్వే. ఇందులో భాగంగా సర్వే ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా చేస్తున్నాం. ఎన్యూమరేటర్లు చేసే సర్వే ప్రక్రియను వెనువెంటనే పరిశీలిస్తా. ప్రతిచోట ప్రత్యేకాధికారులు ర్యాండమ్గా 5నుంచి10 ఇళ్లు తనిఖీ చేస్తారు. వివరాల సేకరణలో ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. గ్రామీణ ప్రాంతంలోచేసే సర్వేకు సంబంధించి ప్రశ్నావళిలో దాదాపు 90 రకాల అంశాలు ఉంటాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరిన్ని వివరాలు సేకరిస్తారు. రెండు వారాల్లో కంప్యూటరీకరణ ఈ నెల 20వ తేదీ నుంచి సర్వే వివరాలు కంప్యూటరీకరిస్తాం. ఇందుకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లతోపాటు, ఇంజినీరింగ్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న కంప్యూటర్లను వినియోగించుకుంటున్నాం. దాదాపు 1500కంప్యూటర్లు అవసరమవుతాయి. ప్రతి ఫారాన్ని స్కాన్చేసి ఆ వివరాలను సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేస్తాం. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ 2వ తేదీ కల్లా పూర్తవుతుంది. -
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో ఆందోళన
డిచ్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వే పై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయని, సర్వేను కేవలం ఒక రోజే నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వి.గంగాధర్గౌడ్ (వీజీగౌడ్) అన్నారు. బుధవారం డిచ్పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సర్వేపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వేలాది మంది తెలంగాణ ప్రజలు బతుకు దెరువు కోసం వలస వెళ్లారని, వారంతా ఇప్పుడు రాష్ట్రానికి రావడానికి ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. సర్వే ఫార్మాట్లో 96 కాలమ్స్ ఉన్నాయని ఇవన్నీ పూర్తి చేయాలంటే కనీసం 45 నిమిషాలు పడుతుందన్నారు. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి వివరాలు సర్వేలో తీసుకోవద్దని సూచించడం సమంజసం కాదన్నారు. గల్ఫ్ బాధితుల అంశం చేర్చాలని కోరారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని సర్వేను వారం రోజుల పాటు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు 600 గిరిజన తండాలు ఉన్నాయని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో డి చ్పల్లి మండలం ఇందల్వాయి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ మంజూరు కాగా దానిని జిల్లా కేంద్రానికి తరలించారని అన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురువుతుంటారని వెంటనే ఇందల్వాయి వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో విండో చైర్మన్ పూర్యానాయక్, టీడీపీ మండల అధ్యక్షుడు నందుబాబు, నాయకులు పూర్యానాయక్, కుంట నర్సారెడ్డి, విఠల్ రాథోడ్, అబ్బులు తదితరులు పాల్గొన్నారు. -
అంతటా సర్వే హడావుడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘సమగ్ర కుటుంబ సర్వే’కు సమయం దగ్గర పడుతుండడంతో యంత్రాంగంలో హడావుడి మరింత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ఈ సర్వే ఆధారంగానే రూపొందించనున్నారు. దీంతో పకడ్బందీగా సర్వే చేపట్టాలని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో మాత్రమే సర్వే చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 15.13లక్షల గృహాలున్నాయి. వీటిలో గ్రామీణ పరిధిలో ఉన్న 7.81లక్షల గృహాల్లో నివసిస్తున్న వారి వివరాలను ఎన్యూమరేటర్లు ఈనెల 19 సేకరించనున్నారు. ప్రస్తుతం ఈ గృహాలకు మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సిబ్బంది 26వేలు.. సర్వే వివరాల సేకరణకు జిల్లాలో 25,386 మంది ఎన్యూమరేటర్లు అవసరమని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈమేరకు ఇప్పటికే ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించినప్పటికీ సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డివిజన్ల వారీగా సిబ్బందికి సర్వే ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం చేవెళ్ల, వికారాబాద్ డివిజన్లోని సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో కలెక్టర్ ఎన్.శ్రీధర్ పాల్గొన్నారు. గురువారం కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తప్పులు దొర్లితే.. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వివరాలు సేకరించేందుకు యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సిబ్బందిని కూడా నియమిస్తోంది. అయితే ఈ అంశంపై పలు ఆరోపణలొస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులను నియమించడంతో వివరాల సేకరణ పారదర్శకంగా సాగుతుందా అనే సందేహం నెలకొంది. వివరాల సేకరణలో పొరపాట్లు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులైతే చర్యలు తీసుకోవచ్చని ఈనేపథ్యంలో పకడ్భందీగా సర్వే జరుగుతుందని, కానీ ప్రైవేటు సిబ్బందిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి. -
వలస జీవులకు ‘సర్వే’ దెబ్బ
కుల్కచర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కుటుంబ సమగ్ర సర్వే’ నియోజకవర్గంలోని వలస జీవులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఎక్కడున్నా సరే ఈ నెల 19న జరిగే సర్వేకు హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. వీటి ఆధారంగానే రేషన్కార్డులు, ఇళ్లు, పింఛన్ తదితర సంక్షేమ పథకాలు వర్తిస్తాయని అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉపాధి లేక పనుల కోసం ముంబయి, పూణే ,షోలాపూర్, హైదరాబాద్ తదితర నగరాలకు , దుబాయి,ఉగాండా దేశాలకు ఎంతోమంది వలసలు పోయారు. వీరందరూ తిరిగి రావాలంటే ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల,గండేడ్,దోమ,పూడూరు,పరిగి మండలాల నుంచి 40 శాతం ప్రజలు వలసలోనే ఉన్నారు. కుటుంబంలో ఒక్కరైతే రావచ్చుగాని కుటుంబమంతా అంటే చాల కష్టమని వారు వాపోతున్నారు. ఒక్క రోజు మాత్రమే సెలవు కుటుంబ సమగ్ర సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం 19న ఒక్క రోజును మాత్రమే సెలవుదినంగా ప్రకటించిం ది. అయితే పట్టణాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు 18న విధులు నిర్వహించుకొని అదే రోజు గ్రామాలకు రావాలంటే చాలా ఇబ్బంది. 19న రావాలంటే ఆ రోజు రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వమే వాడుకుంటుంది. ప్రైవేటు వాహనాలను కూడా ప్రభుత్వం వాడుకుంటుంది. దీంతో సర్వేకు రావాలనుకునేవారికి రవాణా కూడా సమస్యగానే మారనుంది. -
‘సర్వే’కు సహకరించాలి
మేడ్చల్: సమగ్ర కుటుంబ సర్వే కోసం ఈనెల 19న జిల్లాలోని ప్రజలంతా ఇళ్లలో ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. మంగళవారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వేపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ యజమానితో పాటు, కుటుంబసభ్యులు ఇంట్లో ఉండి సర్వే కోసం వచ్చే అధికారులకు సహకరించాలని సూచించారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, సర్వే విధుల్లో ఉన్నవారు, అత్యవసర కేసుల్లో ఆస్పత్రుల్లో ఉన్న వారు, ఇతర ప్రాంతాల్లో చదువుల కోసం వెళ్లినవారు మినహా అందరూ ఇళ్లకు చేరుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్, ఎంపీడీఓలు.. మండల స్థాయి, పట్టణప్రాంతాల్లో కమిషనర్లను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. గ్రామానికి స్పెషల్ ఆఫీసర్తో పాటు, సెక్టోరియల్ అధికారులను నియమించినట్లు వివరించారు. ప్రతీ 30 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సర్వేలో 80 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు, 20 శాతం ప్రైవేటు ఉద్యోగులు పాల్గొంటారని చెప్పారు. బుధవారం నాటికి వారికి శిక్షణ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నోడల్, సెక్టోరియల్, ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామాలను ముందుగానే సందర్శించి ఇళ్లకు నంబర్లు కేటాయించారా లేదా, విభజన ఎలా చేశారు, సంచార కుటుంబాలు, అనాథాశ్రమాలు ఎమైనా ఉన్నాయా లాంటి వివరాలు సమగ్రంగా సేకరించాలని సూచించారు. పూర్తి సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు 19న గ్రామాలకు చేరకముందే అందించాలన్నారు. సర్వే విధుల్లో ఉన్న ఉద్యోగులు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఉదయం 6 గంటల లోపు చేరుకోవాలన్నారు. అక్కడే అల్పాహారం ముగి ంచుకుని 8 గంటల లోపు సామగ్రితో గ్రామాలకు వెళ్లి సర్వేను ప్రారంభించాలన్నారు. సర్వే పూర్తయ్యాక పత్రాలను మండల పరిషత్ కార్యాలయంలో అందజేసి అక్కడే భోజనం చేసి వెళ్లాలన్నారు. సర్వే ఫార్మెట్ను ముందుగానే ఎన్యూమరేటర్లకు ఇచ్చి రెండు మూడుసార్లు చదువుకునేలా సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ చక్రధర్రావు, తహశీల్దార్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీడీఓ శోభ, మండల ప్రత్యేకాధికారి ఉమ తదితరులు పాల్గొన్నారు. -
అద్దె బస్సులో.. పల్లెకు చలో..
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు అనేక మంది బస్సులు, కార్లు, ఇతర వాహనాలను అద్దెకు తీసుకుని ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ మేరకు గోరేగావ్లో నివసించే కరీంనగర్ వాసి అయిన మైలారపు శంకర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము 16వ తేదీ రాత్రి లేదా 17వ తేదీ ఉదయం ఊరికి వెళ్లేందుకు ప్రైవేట్ బస్సును అద్దెకు మాట్లాడుకున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 50కిపైగా కుటుంబాలు పశ్చిమ గోరేగావ్లోని తీన్డోంగ్రీ ప్రాంతంలో స్థిరపడ్డాయని, తామంతా కలిసి ఒకేసారి ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్ కోసం యత్నిస్తే దొరకలేదని, అందుకే ఒక ఊరివారమంతా ఒకే బస్సులో వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన యశ్వంత్రావ్పేట్తోపాటు ఇతర గ్రామాలకు చెందిన వారు కూడా బస్సులను అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.. ఒక్కరు చాలు : కరీంనగర్ జేసీ సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వలసబిడ్డలందరూ ఊళ్లకు రావల్సిన అవసరంలేదని, ఒక్కరు ఉంటే చాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫ్రాజ్ అహ్మద్ తెలిపారు. సర్వేపై ముంబైతోపాటు మహారాష్ట్రలో నివసించే ప్రజల్లో నెలకొన్న అయోమయ పరిస్థితి గురించి ‘సాక్షి’ ఆయనకు ఫోన్లో వివరించింది. దీనిపై స్పందించిన ఆయన ముంబై, భివండీతోపాటు మహారాష్ట్రలో నివసించే జిల్లా ప్రజలందరూ స్వగ్రామాలకు రావల్సిన అవసరం లేదన్నారు. కుటుంబసభ్యుల అన్ని వివరాలు చెప్పగలిగే ఒక్కరు వస్తే చాలని, అయితే అక్కడి వివరాలను ఆధారాలతోపాటు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. -
సర్వేకు.. పథకాలకు సంబంధం లేదు
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధం లేదని, ఎలాంటి సందేహాలు లేకుండా కుటుంబం పూర్తి వివరాలు ఎన్యూమరేటర్కు చెప్పాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న జిల్లా ప్రజలను కోరారు. పూర్తి వివరాలు తెలిస్తేనే ఎంత మంది ప్రజలు సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారనే విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్లో జిల్లా పరిషత్ కార్యలయ సమావేశ మందిరంలో ‘సమగ్ర కుటుంబ సర్వే’పై ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లబ్ధి పొందిన వివరాలు చెబితే తమకు వచ్చే సంక్షేమ పథకాలు రాకుండా పోతాయని, సంక్షేమ పథకాల కోసం మేం పెట్టుకున్నవన్నీ రద్దు అవుతాయని ప్రజలు అనుకోవద్దని తెలిపారు. మేం వివరాలు చెబితే మాకు రుణ మాఫీ కాదేమోనని, సంక్షేమ పథకాలు వర్తించవోనని అనుకోకూడదని అన్నారు. కుటుంబ సర్వేకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కుటుంబ వివరాలతో పాటు స్థిరాస్తులు, చరాస్తులు అన్ని వివరాలు సమగ్రంగా తెలిపితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. జనాభా ఎంత ఉంది, పథకాల లబ్ధి చేకూరుతుందా లేదా తదితర వివరాలు తెలుసుకునేందుకే సర్వే చేనపడుతున్నట్లు తెలిపారు. 19న అందరు ఇంట్లోనే ఉండి వివరాలు తెలుపాలని కోరారు. సర్వేపై ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు కరపత్రాలు ముద్రించుకొని వారి నియోజకవర్గాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, ఈ సదస్సుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభారాణి హాజరుకాకపోగా, ఇతర ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం గైర్హాజరయ్యారు. కలెక్టర్ జగన్మోహన్, సీపీవో షేక్మీరా, డీపీవో పోచయ్య, ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, దివాకర్రావు, జెడ్పీటీసీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇక్కడ ‘సర్వే’ సవాలే!
మేడ్చల్: ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ ఇంట్లో ఉండి సహకరించాలని సమాయత్తం అవుతున్న నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్నగర్లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ 19న జరిగే సర్వే అధికారులకు సవాల్గా మారింది. జవహర్నగర్లో ప్రభుత్వ భూములు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇది హైదరాబాద్ శివారులో ఉండడంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఈ ప్రాంతం కబ్జాదారులకు నిలయంగా మారింది. కాస్తోకూస్తో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతంలో నేతలుగా చలామణి అవుతూ భూకబ్జాలు చేశారు. ఒక్కొక్కరు సుమారు 10 నుంచి 20 ఇళ్లను బినామీ పేర్లతో నిర్మించడమే కాకుండా ప్లాట్లను కబ్జా చేశారు. తాజాగా ప్రభుత్వం ఇంటింటికీ సమగ్ర సర్వే కార్యక్రమం చేపట్టడంతో తమ గుట్టు ఎక్కడ రట్టవుతుందోననే ఆందోళన అక్రమార్కుల్లో మొదలైంది. సర్వేలో తమ బాగో తం బయట పడకుం డా 10 రోజుల ముం దు నుంచే తమ ప్ర ణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇం దులో భాగంగా కబ్జాల్లోని ఇళ్లను, భూములను కాపాడుకోవడానికి తమ బంధుమిత్రులనో, కుటుంబ యజమానులు కానివారినో ఎంత కొంత డబ్బు ఇచ్చి జవహర్నగర్కు రప్పించే యత్నాలు చేస్తున్నారు. వారికి ముందుగానే అన్ని విషయాలు చెప్పి సర్వే రోజు అధికారులకు ఎలా సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. తమ కబ్జాలోని ఇళ్లు, స్థలాలు, బినామీ పేర్లను తమ బంధుమిత్రులకు ముందుగానే తెలియజేసి వాటికి సంబంధించిన జిరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. జవహర్నగర్ పరిధిలో ఇళ్ల రెగ్యులరైజేషన్ను గత ప్రభుత్వాలు చేయకపోవడంతో పేరుకు లక్ష జనాభా, 20 వేల కుటుంబాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా ఏ ఇల్లు ఎవరిదో.. ఏ స్థలం ఎవరిదో.. అర్థం కాని విచిత్ర పరిస్థతి నెలకొంది. దీంతో జవహర్నగర్లో కుటుంబ సమగ్ర సర్వే అధికారులకు సవాల్గా మారింది. -
ఇసీవక్త్ ఘర్ చలో..
సాక్షి, ముంబై : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందున మహారాష్ట్రకు వలస వచ్చి స్థిరపడిన వేలాది మంది స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ వైపు వెళ్లే బస్సులు, రైళ్లు దాదాపు అన్నింటిలోనూ రిజర్వేషన్లు అయిపోయాయి. మరోవైపు అనేక మంది వెళ్లలేని పరిస్థితి.. పొట్టచేతబట్టుకుని ముంబైకి వచ్చిన కూలీలు ఒక్కసారిగా సొంత గ్రామాలకు వెళ్లాలంటే అన్నీ ఇన్నీ ఇబ్బందులు కావు.. సెలవులు దొరకవు.. సమయానికి చేతిలో డబ్బులుండవు.. ఇలా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందినవారైనప్పటికీ సొంత గ్రామాలకు వెళ్లలేకపోతున్నారు. ముంబై ప్రజలకు హామీ టీ సర్కార్ హామీ ముంబైలో నివసించే లక్షలాది మంది ప్రజలు ఈ నెల 19న జరగనున్న సమగ్ర కుటుంబ సర్వే విషయంపై తీవ్ర అయోమయంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ముంబై టీఆర్ఎస్ నాయకులతోపాటు నగరంలోని అనేక సంఘాల ప్రతినిధులు ఫోన్లు, ఇతర సమాచార సాధనాల ద్వారా టీ మంత్రులకు ఇక్కడి వారి సమస్యను తెలియపరిచారు. టీ మంత్రులు కూడా ముంబై ప్రజలకు సమగ్ర కుటుంబ సర్వే విషయంపై ఆందోళన వద్దని హామీ ఇచ్చారని వీరు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరాలంటే సమగ్ర సర్వే అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు సర్వే చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో ఈ నె ల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజులో సర్వే పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ రోజు తెలంగాణవాసులంతా ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. ఆ రోజు ఇచ్చిన సమాచారం మేరకు రూపొందించిన సర్వేనే అన్ని సంక్షేమ పథకాలకు ఆధారంగా మారుతుందని తెలిపారు. దీంతో తెలంగాణ జిల్లాల నుంచి మహారాష్ట్రకు వలసపోయిన కుటుంబాల్లో కలవరం మొదలైంది. 19వ తేదీనాటికి ఇళ్లకు రావాలని వారివారి బంధువులు ఎక్కడోఉన్న వారికి సమాచారాలిస్తున్నారు. దీంతో పరాయి రాష్ట్రాలకు ఉపాధి నిమిత్తం తరలివెళ్లిన వారంతా కుటుంబాలతో ఆ రోజునాటికి ఇళ్లకు చేరుకోవాలని ఆతృత పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా అందరు ఊరిబాట పట్టడంతో రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు లభించడంలేదు. కొందరు ప్రైవేట్ వాహనాల ద్వారా తమ స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. అనేక మంది పొట్టచేతబట్టుకుని వచ్చిన కూలీలున్నారు. చిరు ఉద్యోగాలు చేసేవారున్నారు. ఇలా వీరందరికి ఒక్కసారిగా కుటుంబసమేతంగా వెళ్లాలంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించడంలేదు. ముంబై, భివండీ చుట్టుపక్కల పరిసరాల్లోనే లక్షలాది మంది ప్రజలు స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ తెలంగాణ వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైలు లేదా కనీసం తెలంగాణ వైపు వెళ్లే రైళ్లకు అదనంగా బోగీలను అమర్చాలని వీరు కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఆర్టీసీ బస్సులను కూడా నడపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఈ విషయంపై ముంబైలోని వివిధ సంఘాల ప్రతినిధులతోపాటు ముంబై టీఆర్ఎస్ నాయకులు ఇక్కడి పరిస్థితులు, ప్రజల సమస్యలను టీ మంత్రుల దృష్టికి తీసుకవెళ్లారు. దీంతో కుటుంబం మొత్తం తరలిరావాల్సిన అవసరం లేదని, కుటుంబ వివరాలు మొత్తం చెప్పగలిగే ఒకరుంటే చాలని తెలంగాణ మంత్రులు, నాయకులు సూచించినట్టు ముంబై టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్ది హేమంత్ కుమార్ తెలిపారు. -
సర్వేకు ‘సై’
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘సమగ్ర కుటుంబ సర్వే’పై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంతో పాటు మున్సిపాలిటీల పరిధిలో మాత్రమే జిల్లా యంత్రాంగం సర్వేకు ఉపక్రమించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లా ప్రాంతంలో సర్వే ప్రక్రియ అంతా జీహెచ్ఎంసీ అధికారులే చేయనున్నట్లు యంత్రాంగం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలంటే గరిష్టంగా 60 వేల మంది సిబ్బంది అవసరం. కానీ జిల్లాలో కేవలం 26 వేల సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో ఆందోళన చెందిన జిల్లా యంత్రాంగం.. సర్కారుకు పరిస్థితిని వివరించింది. దీంతో గ్రామీణ ప్రాంతంలో సర్వే చేపట్టాలని ఆదేశించడంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా అధికారులు సర్వే ఏర్పాట్లకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా పరిషత్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గృహాలు 7.38 లక్షలు జిల్లాలో 15.13 లక్షల గృహాలున్నాయి. వీటిలో గ్రామీణ పరిధితో పాటు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 7.38 లక్షల గృహాలున్నాయి. తాజాగా గ్రామీణ ప్రాంతంలో సర్వే చేపట్టనున్న నేపథ్యంలో 7.38 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు 25వేల మంది సిబ్బందిని ఎన్యుమరేటర్లుగా నియమించారు. గురువారం మండల స్థాయి అధికారులకు అవగాహన నిర్వహించిన యంత్రాంగం.. ఒకట్రెండురోజుల్లో సర్వే సిబ్బంది అందరికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. గ్రామీణ పరిధిని 379 రూట్లుగా విభజించి సర్వే చేయనున్నారు. అందరూ సహకరించాలి: కలెక్టర్ సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియకు ప్రజలంతా సహకరించాలని, దేశంలో ఇంత పెద్ద సర్వే చేయడం ఇదే ప్రథమమని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్కారు. 19వ తేదీ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి మార్కింగ్ చేస్తామని, ఆరోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించినందున తప్పకుండా ఇంటి యజమానులు, కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర, ఆరోగ్య కారణాల వల్ల సభ్యులు అందుబాటులో లేకుంటే.. అందుకు సంబంధించి యజమాని ధ్రువీకరణ సమర్పిస్తే సభ్యుడి వివరాలు నమోదు చేసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక ఎన్యుమరేటర్ 30 కుటుంబాలను సర్వే చేస్తారని, ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని కలిపి 25వేల మంది ఉద్యోగులను సర్వేలో భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు సిబ్బందికి ఈనెల 11 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ సర్వే ఆధారంగానే అమలు చేస్తామని, ఎన్యుమరేటర్కు కుటుంబ సభ్యులంతా ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డులు తదితర వివరాలన్నీ సమర్పించాల్సి ఉంటుందన్నారు. -
సర్వే సందడి 19న ఊరికి పోవాలె!
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై అటు స్వరాష్ట్రంలోనే కాకుండా ఇటు ముంబైలోనూ సందడి మొదలైంది. సర్వేరోజున కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ముంబైలోని తెలంగాణ ప్రజలకు స్వగ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. 19వ తేదీ రోజున ఇంట్లో ఉండేలా బయలుదేరి రావాలని సదరు ఫోన్ల సారాంశం. నాలుగు రాళ్ల కోసం పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చిన తెలంగాణ ప్రజలు ముంబై, ఠాణే, పుణే నగరాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఇప్పుడు తెలంగాణకు పయనమయ్యే యోచనలో ఉన్నారు. అయితే సర్వే అధికారులకు వివరాలు చెప్పేందుకు కుటుంబంలో ఒకరు ఉంటే సరిపోతుందా? లేక సభ్యులంతా ఆరోజు ఇంట్లో ఉండాల్సిందేనా? ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చినవారి పరిస్థితి ఏంటి? ఏవైనా కారణాలవల్ల ఆ రోజు సొంత ఊరికి వెళ్లలేకపోతే కుటుంబంలో వారి పేరు గల్లంతవుతుందా? ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి సెలవు దొరకకపోతే ఎలా వెళ్లేది? ఇలా సవాలక్ష సమస్యలు ప్రవాస తెలంగాణ ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నాయి. న్యూస్ చానళ్లు, దినపత్రికల్లో వస్తున్న కథనాలను చదివి మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నఫలంగా స్వగ్రామాలకు బయలుదేరాలంటే వేల రూపాయల ఖర్చు ఓ వైపు, మరోవైపు వెళ్లలేని పరిస్థితి తెలంగాణ ప్రజలకు సంకటంగా మారింది. సర్వే గురించి స్థానిక తెలంగాణ ప్రజలు ‘సాక్షి’ కార్యాలయానికి, ప్రతినిధులకు ఫోన్లు చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఊరిబాట పట్టిన జనం... ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారన్న ప్రకటనతో అనేక మంది ఊరిబాట పట్టారు. దీంతో తెలంగాణవైపు వెళ్లే బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రైళ్లతోపాటు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ తేదీల మధ్య టికెట్లు కావాలన్నా దొరకడంలేదు. దీంతో అనేక మంది ఇప్పటి నుంచే ఊరికి బయలుదేరి వెళ్తున్నారు. పరిణామంగా రైళ్లు, బస్సులలో పెద్దసంఖ్యలో తెలంగాణ ప్రజలు కనిపిస్తున్నారు. ఆధార్ తర్వాత మళ్లీ ఇప్పుడు....! ఆధార్ కార్డుల కోసం స్వగ్రామాల బాటపట్టిన తెలంగాణ ప్రజలు మళ్లీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే కారణంగా సొంత ఊరికి వెళ్తున్నారని భారత్ ట్రావెల్స్ యజమాని కె. జనార్ధన్, కుమార్ ట్రావెల్స్ యజమాని గుర్రపు నర్సింహస్వామి, ఆరెంజె ట్రావెల్స్ యజమాని మర్రి జనార్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. సర్వే ప్రకటన తర్వాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దీంతో 15వ తేదీ నుంచి దాదాపు తెలంగాణకు వెళ్లే బస్సులన్నీ ఫుల్ అయ్యాయని చెప్పారు. చాలా మంది టిక్కెట్లు కావాలంటు ఫోన్లు చేస్తున్నారని, గతంలో ఆధార్కార్డు సమయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు. వలస బిడ్డలను మరిచారా...? ఎన్నికలకు ముందు వలస బిడ్డలకు న్యాయం చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్, నేడు ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం వలసబిడ్డలను మరిచిపోయిందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఇక్కడి వలస బిడ్డలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన పోరాటాం గుర్తు లేదా? అని నిలదీస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ముంబైతోపాటు రాష్ట్రంలో నివసించే వలస బిడ్డలను తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పరాయి రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణ వలస బిడ్డల కోసం కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, ఉన్నఫలంగా బయల్దేరి రావడం కష్టమనే ఆవేధన ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలే అత్యధికం.... ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక కోటి మంది తెలుగు ప్రజలున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడే స్థిరపడిన వారున్నారు. దీంతో ఇలా స్థిరపడినవారిలో సమగ్ర కుటుంబ సర్వే విషయంపై పెద్దగా ఎలాంటి కనిపించడంలేదు. అయితే స్వగ్రామాలతో సంబందాలు కలిగి, ఉద్యోగరీత్యా ఇక్కడ ఉంటున్నవారు, తాత్కాలికం గా కూలి, ఇతర పనులపై కొన్ని మాసాలపాటు వచ్చిపోయే వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వలస కూలీల సంఖ్య లక్షల్లో ఉంటుందని, ఒక్క మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది కూలీ పనులకోసం వచ్చి, మళ్లీ స్వగ్రామాలకు వెళ్తుంటారు. -
సమగ్ర సర్వే ఎలా సాధ్యం..?
యాచారం: సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజాప్రతినిధులు సందేహాల వర్షం కురిపించారు. గ్రావూల్లో ఇప్పటికీ కొన్ని ఇళ్లకు నంబర్లు వేయులేదని, కొత్త ఇల్లు కట్టించుకున్న వారు పంచాయుతీ కార్యాలయుంలో నమోదు చేరుుంచుకోలేదని వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇంత గందరగోళం వుధ్య ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడానికి బుధవార మండల పరిషత్ కార్యాలయంలో సవూవేశం నిర్వహించారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్న ఈ సవూవేశంలో తహసీల్దార్ వసంతకువూరి సర్వే జరిగే విధానాన్ని వివరించారు. 19న ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, ఎన్యుమరేటర్లు ప్రతి కుటుంబంలోని సభ్యుల వివరాలు నమోదు చేస్తారని చెప్పారు. దీంతో పలు గ్రావూల సర్పంచ్లు లేచి గ్రామాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఉన్నా ఇళ్లకు నంబర్లున్నాయా, ఉంటే నంబర్ల మీద యజమానుల పేర్లు తదితర విషయాలపై పూర్తి సమాచారం గ్రామ పంచాయతీల్లోనే లేదు, ఇక సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. నిజానికి మండలంలో 20 గ్రామాల్లో 20 వేలకు పైగా కుటుంబాలున్నాయున్నారు. అరుుతే అధికారుల వద్ద ఉన్న రికార్డుల్లో వూత్రం కేవలం 11,490 నుంచి 12,072 వరకు కుటుంబాలు ఉన్నట్లు మాత్రమే రికార్డున్నట్లు చెప్పారు. ఉదాహరణకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు విడతల్లో వుండలంలో 9 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యూయుని, వీటిలో ఆరు వేలకు పైగా పేదలు ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అరుుతే ఈ కొత్త ఇళ్లకు అధికారులు ఇంకా నంబర్లు కేటారుుంచలేదని, వారు పాత ఇళ్ల నంబర్లతోనే పలు సంక్షేమ పథకాలు పొందుతున్నట్లు చెప్పారు. వురి సర్వే రోజు పాత ఇళ్లలో ఉండటం ఎలా కుదురుతుందని, వారంతా ఈ సర్వే కోసం కొత్త ఇళ్లను వదిలి వుళ్లీ ఇళ్లలోకి వూరాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అధికారులు ఆయా గ్రామాల రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శుల చేత రెండు రోజుల్లో ఇంటి నంబర్లు వేసేలా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటామని హామీ ఇచ్చారు. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై లబ్ధిదారుల్లో అందోళన మొదలైంది. రాజకీయ పలుకబడి ఉపయోగించి పలువురు ఒక ఇంటి మీదే రెండు, మూడు ఇళ్లు పొందారు. అర్వులు కాని పేర్ల మీద పింఛన్లు మంజూరైనాయి. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరికీ పింఛన్లు వస్తున్నారుు. సమగ్ర కుటుంబ సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నందునా వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. మాల్, మంతన్గౌరెల్లి, చౌదర్పల్లి, నక్కర్తమేడిపల్లి, గునుగల్ , గడ్డమల ్లయ్యగూడ తదితర గ్రామాల్లో ఇళ్లు నిర్మించకున్నా చాలావుంది లబ్ధిదారులకు నిధులు మంజూరయ్యూరుు. వారిలో కొంతమంది పేర్ల మీద వారికి తెలియకుండానే ఇళ్లు మంజూరైనట్లు, బిల్లులు తీసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నాయి. అంతేకాకుండా పలువురు పల్లెల్లో జీవిస్తూ పట్టణాల్లో, అలాగే పట్టణాలకు వలస వెళ్లి పల్లెల్లో లబ్ధి పొందుతున్నారు. వీరంతా ఇప్పుడు ఏంచేయూలో తెలియుని సందిగ్ధంలో పడిపోయూరు. ఇప్పటికే బోగస్ కింద మండలంలో వందలాది రేషన్ కార్డులు తొలగించిన అధికారులు మళ్లీ సమగ్ర సర్వే పేరుతో సంక్షేమ పథకాల్లో కూడా కోత పెట్టడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమావ త్ జ్యోతి నాయక్, జెడ్పీటీసీ కర్నాటి రమేష్ గౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జి. రామకృష్ణ యాదవ్, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్డీ శంకర్నాయక్ తదితరులున్నారు. -
సమగ్ర సర్వేకు ముందస్తు ‘ప్రణాళిక’
సిద్దిపేట జోన్: సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంటింటి సర్వే కోసం అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేసేందుకు సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులు కసరత్తు చేశారు. మూడు రోజులుగా పట్టణంలో మాక్ సర్వే చేస్తూ ఇళ్లకు నంబరింగ్ వేశారు. ఈ పద్ధతి సులువుగా ఉండడంతో జిల్లాలోని మిగతా చోట్ల కూడా అధికారులు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శక ఆదేశానుసారం అధికారులు ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. అందులో భాగంగా గత రెండు రోజులుగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి నేతృత్వంలో మెప్మా, టౌన్ప్లానింగ్, రెవెన్యూ, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతో మాక్ సర్వేను నిర్వహించారు. పట్టణంలోని 34 వార్డుల్లో 25, 517 కుటుంబాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు ఆ దిశగా ఇన్యూమరేటర్ల నియామకాన్ని తాత్కాలికంగా చేపట్టారు. ఒక్కొక్కరికి 25 కుటుంబాల చొప్పున గుర్తిస్తూ 19న సర్వే నిర్వహించనున్న క్రమంలో అస్తవ్యస్థంగా ఉన్న సిద్దిపేట పట్టణ ఇంటి నంబర్లను ఒక క్రమబద్ధీకరణలో రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సిద్దిపేట పట్టణంలోని ఆయా వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది గత రెండు రోజులుగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మాక్ సర్వేలో భాగంగా ఇంటి నంబర్ను ఆధారంగా చేసుకొని ఆ గృహంలో నివసిస్తున్న కుటుంబాల సంఖ్యను నంబరింగ్ విధానం ద్వారా గోడలపై రాస్తూ 19న నిర్వహించనున్న సర్వే సులభ తరానికి ప్రణాళికను రూపొందించుకున్నారు. అందులో భాగంగానే సిద్దిపేట పట్టణంలో గుర్తించిన 25,517 కుటుంబాలకు భిన్నంగా రెండు రోజుల్లోనే సుమారు 5 కుటుంబాలు ప్రస్తుత స్థితిగతులను బట్టి రికార్డుల్లోకి వచ్చినట్లు సమాచారం. దీన్ని ప్రమాణికంగా చేసుకుని మున్సిపల్ అధికారులు ముందస్తు ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన మాక్ సర్వే ఫలితాలను గుర్తించిన జిల్లా ఉన్నతాధికారులు ఆ దిశగా జిల్లాలోని మిగతా చోట్ల ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. -
ప్రజా ప్రయోజనాలకే కుటుంబ సర్వే
ప్రగతినగర్ : తెలంగాణ అభివృద్ధికి, అర్హులైన వారందరికీసంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సమగ్ర కుటుంబ సర్వేకు ఆదేశాలు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సర్వే రోజు ప్రజలందరూ ఆందుబాటులో ఉండాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి పొందే సంక్షేమ పథకాలు అందకుండా పోతాయన్నారు. మంగళవారం రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఎన్యూమరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో 6.25 లక్షల కుటుంబాల ను సర్వే చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో ఉద్యోగి సగటున 25 నుంచి 30 కుటుంబాలను సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు సహకరిం చాలని కోరారు. దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఎన్నికల తరహాలో ఉంటుందన్నారు. ఎన్యూమరేటర్లకు ఏ గ్రామంలో ఏ కుటుంబాలను సర్వే చేసే విషయాన్ని చివరి నిమిషాం వరకు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటింటికి వెళ్లి కుటుంబ సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేను నిర్వహించాలని ఆయన సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే ఫార్మట్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్, ఓటర్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్లు, మొబైల్ నెంబర్లు, విద్యార్హతలు, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, గతంలో పొందిన ప్రభుత్వ పథకాలు, ప్రస్తుతం పొందుతున్న పెన్షన్లు, ఇతర ఆదాయపన్ను వంటి అంశాలు, స్థిరాస్తులు, పశుసంపద వివరాలు పొందుపరచాలని ఆయన సూచించారు. జిల్లా కు 25 వేల మంది ఎన్యూమరేటర్లు అవసరం అవుతున్నారని కలెక్టర్ తెలిపారు. బుధవారం తహశీల్దార్లందరూ, ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మండల కేంద్రంలో కనీసం 50 కంప్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వివరాలు పొందుపరిచిన తరువాత కుటుంబ యజమాని సంతకం తీసుకోవాలని అది నిజమా లేదా అనే బాధ్యత అధికారులదేనన్నా రు. అధికారులు తప్పు చేశారని భావిస్తే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్చార్జి డీఆర్ఓ యాదిరెడ్డి, బోధన్,కామారెడ్డి ఆర్డిఓలు, పీడీలు, అన్నిశాఖల అధికారులు ఎంఆర్వోలు, ఎండీవోలు పాల్గొన్నారు. -
పల్లెలకే పరిమితం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘సమగ్ర కుటుంబ సర్వే’పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. ఒకే రోజు జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహణకు సరిపడా సిబ్బంది సమకూరే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వేను గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టాలని నిర్దేశించింది. ఈ సర్వేను ఏకకాలంలో నిర్వహించడం ద్వారా అక్రమార్కులను సులువుగా తొలగించవచ్చని భావించింది. ప్రభుత్వం సంకల్పం మంచిదే అయినా, జిల్లా విషయానికి వచ్చేసరికి ఒకే రోజు సర్వే నిర్వహణ ఆచరణసాధ్యంగా కనిపించడంలేదు. జిల్లాలో 15.12 లక్షల ఇళ్లల్లో సుమారు 60 లక్షల జనాభా వివరాలను సేకరించడం యంత్రాంగానికి కత్తిమీద సామే. ఒక ఎన్యుమరేటరు (సర్వే చేసే వ్యక్తి) సగటున 25 ఇళ్లను సర్వే చేసే అవకాశముంటుందని అంచనా. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా ఒకే రోజు సర్వే నిర్వహించాలంటే దాదాపు 60వేల సిబ్బంది అవసరమని యంత్రాంగం లెక్క గట్టింది. అందుబాటులో 22 వేలే..! ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘సమగ్ర సర్వే’కు జిల్లాలో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా తయారైంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగో తరగతి మినహా అన్ని కేట గిరిల ఉద్యోగులను ఈ విధులకు వినియోగించుకోవాలని భావించిన యంత్రాంగం.. ఉద్యోగుల వివరాలను సేకరించింది. ఈ క్రమంలో 22వేల మంది ఉద్యోగులున్నట్లు అధికారులు తేల్చారు. సర్వేకు అవసరమున్న స్థాయి లో సిబ్బంది సమకూరకపోవడంతో యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న యంత్రాంగం.. సార్వత్రిక ఎన్నికల విధుల్లో వినియోగించుకున్న సిబ్బందిని తాజా సర్వేకు వినియోగించుకోవాలని యోచిస్తోంది. అంత ఈజీ కాదు.. జిల్లాలోని ప్రైవేటు సంస్థల్లో దాదాపు 10వేల మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న మరో 10వేల మంది ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే 2 వేల ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను, బ్యాంకుల్లో పనిచేస్తున్న మరో 8వేల మంది, జంటనగరాల్లోని ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాల్లోని 3వేల మంది ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీలో పనిచేసే 2వేల మంది సిబ్బందిని ఈ సర్వే ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కార్యచరణ రచిస్తోంది. అయితే ఈ ఉద్యోగులను సర్వే ప్రక్రియలోకి దించాలంటే ఆయా శాఖల ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ, బ్యాంకు సిబ్బందిని సర్వేలోకి దించడం ఆషామాషీ వ్యవహారం కాదని అధికారవర్గాలే అంటున్నాయి. గ్రామాలకే పరిమితం చేస్తే... ప్రస్తుతం జిల్లాలో 15.12 లక్షల కుటుం బాలుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 4.12 కుటుంబాలున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆరు మున్సి పాల్టీలలో సర్వే చేసేందుకు 16వేల సిబ్బంది అవసరమని యంత్రాంగం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 19వ తేదీన ‘ఇంటింటి సర్వే’ను జీహెచ్ఎంసీ పరిధిని మినహాయించి గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లా యంత్రాంగానికి సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ సర్వేకు కేవలం 16వేల మంది సిబ్బంది మాత్రమే అవసరమని భావిస్తూ.. జీహెచ్ఎంసీ పరిధిలో మరో రోజు సర్వే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. సిబ్బంది కొరత దృష్ట్యా ఒకే రోజు జంట జిల్లాల్లో సర్వే అసాధ్యం కనుక.. మరో రోజు పొడిగించే అంశంపై కూడా చర్చలు సాగిస్తోంది. -
ఆ ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే
- అందరూ అందుబాటులో ఉండాల్సిందే.. - కుటుంబ సర్వే’ పై అధికారుల కసరత్తు - అధికారులను అప్రమత్తం చేసిన ఇన్చార్జి కలెక్టర్ ముకరంపుర : సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక్క రోజులోనే రాష్ట్రం మొత్తం సర్వే నిర్వహించాలని నిర్ణయించడంతో 19వ తేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగులంతా భాగస్వాములై ప్రతీ ఇంటిగడప తొక్కనున్నారు. ఆ రోజు అందరూ స్థానికంగా అందుబాటులో ఉంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉండేలా అందరికీ అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లను అప్రమత్తం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఎంత మంది సిబ్బంది ఉన్నారు? సర్వేకు ఎంత మంది అవసరం అనే అంశాలను యుద్ధప్రాతిపదికన నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు. కసరత్తు సర్వేకోసం ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. నాలుగో తరగతి ఉద్యోగులనుంచి ఉన్నతాధికారుల వరకు 30,878 మంది ఉద్యోగులున్నట్లు జాబితా సిద్ధం చేశారు. సగటున ఒక్కో ఉద్యోగి 26 కుటుంబాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, పురపాలక, నగరపాలక సంస్థల వారీగా క్రోడీకరించి వివరాలను ఎన్నికల బ్యాలెట్లు, ఈవీఎంల మాదిరిగా సీల్ వేసి వారం రోజుల సమయంలో డాటాను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9.70 లక్షల ఇళ్లు ఉన్నాయి. మరో 50 వేల నుంచి లక్షలోపు ఇళ్లు పెరిగే అవకాశముంది. 9.70 లక్షల కుటుంబాలకు 37,307 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా.. గతంలో జరిగిన సర్వేలో ఒక్కొక్కరు 40 కుటుంబాలు సర్వే చేసినట్లు అధికారులు చెబుతున్నా.. అవన్నీ తప్పుల తడకలేనని కొత్త ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ క్రమంలో లెక్కాపత్రం పక్కాగా ఉండాలని, పారదర్శకంగా సర్వే చేయకపోతే తగిన చర్యలకు బాధ్యులవుతారని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం 70 అంశాలతో రూపొందించిన ఫార్మాట్లోని ప్రశ్నలకు కుటుంబసభ్యులు నిజాయతీగా సమాధానమిస్తే మేలు జరిగే అవకాశముంది. కుటుంబసభ్యులు తప్పుడు సమాచారమిచ్చినా క్రిమినల్ చర్యలకు ఆస్కారముంది. ఈ సర్వే ప్రామాణికంగా తీసుకుని రేషన్కార్డులు, పింఛన్లు, గృహాలు, భూములు తదితర వాటిని లబ్ధిదారులకు మంజూరు చేస్తారు. ఉపాధి నిమిత్తం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది స్వస్థలాలనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ఎప్పుడు సర్వే చేసినా వివరాలు సక్రమంగా ఉండక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 19న అందరూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించింది. అయితే కుటుంబం మొత్తం అందుబాటులో ఉండాలా? లేక ఒక్కరు ఇంటి వద్దే ఉండి సర్వే అధికారులకు వివరాలు చెబితే సరిపోతుందా అనే విషయమై స్పష్టత లేదు. 19నాడు అత్యవసర పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేవారి వివరాలు ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. నెలల తరబడి వలస వెళ్లేవారి విషయంలో ఏం చేస్తారనేది తెలియడం లేదు. వివరాల సేకరణపై ప్రభుత్వం మరికొంత స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.