debut
-
ఆఫ్స్పిన్ను పక్కనపెట్టి... పేస్ ఆల్రౌండర్గా
అచ్చొచ్చిన సొంత మైదానంలో స్టీవ్ స్మిత్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... టీమిండియాపై దంచి కొట్టే హెడ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు! టీనేజ్ కుర్రాడు కొన్స్టాస్ మెరుపులు 3 బౌండరీలకే పరిమితం కాగా... మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా వైఫల్యాన్ని కొనసాగించాడు! ఆదుకుంటాడనుకున్న లబుషేన్ ఆరంభంలోనే చేతులెత్తేయగా... అలెక్స్ కేరీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు!అయినా ఆ్రస్టేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది అంటే అదంతా అరంగేట్ర ఆటగాడు బ్యూ వెబ్స్టర్ చలవే. అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న మిషెల్ మార్ష్ ను తప్పించి... చివరి టెస్టులో వెబ్స్టర్కు అవకాశం ఇవ్వగా... అతడు భారత జట్టుకు ప్రధాన అడ్డంకిగా నిలిచి భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. ఆఫ్స్పిన్నర్గా కెరీర్ ఆరంభించి... ఆ తర్వాత పేస్ ఆల్రౌండర్గా మారిన ఆ్రస్టేలియా నయా తార వెబ్స్టర్పై ప్రత్యేక కథనం... – సాక్షి, క్రీడావిభాగం సుదీర్ఘ దేశవాళీ అనుభవం... వేలకొద్దీ ఫస్ట్క్లాస్ పరుగులు... బౌలింగ్లోనూ తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉన్నా... ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయిన వెబ్స్టర్... ఎట్టకేలకు జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ప్రధాన ఆటగాళ్లే నిలవలేకపోతున్న చోట... చక్కటి సంయమనంతో ఆడుతూ విలువైన పరుగులు చేశాడు. గత మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్యామ్ కొన్స్టాస్ తన బ్యాటింగ్ విన్యాసాలతో పాటు నోటి దురుసుతో వార్తల్లోకెక్కగా... వెబ్స్టర్ మాత్రం నింపాదిగా ఆడి తనదైన ముద్ర వేశాడు. తొలి ఇన్నింగ్స్లో 13 ఓవర్లపాటు బౌలింగ్ చేసిన అతడు... 2.23 ఎకానమీతో 29 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. బౌలింగ్లో వికెట్ తీయలేకపోయినా... స్టార్క్, కమిన్స్ వంటి స్టార్ బౌలర్ల కంటే తక్కువ పరుగులు ఇచ్చుకొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ జట్టు 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులో అడుగుపెట్టిన వెబ్స్టర్... తనలో మంచి బ్యాటర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. మరో ఎండ్లో స్టీవ్ స్మిత్ ఉండటంతో ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ అతడికే ఎక్కువ స్ట్రయిక్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఐదో వికెట్కు 57 పరుగులు జోడించిన అనంతరం స్మిత్ అవుట్ కాగా... ఆ తర్వాత ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యత భూజానెత్తుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నది తొలి మ్యాచే అయినా... దేశవాళీల్లో వందల మ్యాచ్ల అనుభవం ఉండటంతో లోయర్ ఆర్డర్తో కలిసి జట్టును నడిపించాడు. అతడు ఒక్కో పరుగు జోడిస్తుంటే... టీమిండియా ఆధిక్యం కరుగుతూ పోయింది. ఆరో వికెట్కు అలెక్స్ కెరీతో 41 పరుగులు, ఏడో వికెట్కు కెపె్టన్ కమిన్స్తో కలిసి 25 పరుగులు జోడించాడు. ఇక కింది వరుస బ్యాటర్ల అండతో పరుగులు చేయడం కష్టమని భావించి భారీ షాట్లకు యత్నించిన వెబ్స్టర్... చివరకు తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. గత నాలుగు టెస్టుల్లో పేస్ ఆల్రౌండర్గా జట్టులో చోటు దక్కించుకున్న మిషెల్ మార్‡్ష ఒక్క మ్యాచ్లోనూ అటు బ్యాట్తో కానీ, ఇటు బంతితో కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... తొలి మ్యాచ్లోనే వెబ్స్టర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనూహ్య బౌన్స్, అస్థిర పేస్ కనిపించిన సిడ్నీ పిచ్పై వెబ్స్టర్ గొప్ప సంయమనం చూపాడు. తొలి ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లు ఒక్కరు కూడా 40 పరుగులు దాటి చేయలేకపోయిన చోట ఈ మ్యాచ్లో తొలి అర్ధ శతకం నమోదు చేసిన వెబ్స్టర్... ఆ తర్వాత బంతితోనూ ఆకట్టుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 ఓవర్లు వేసిన వెబ్స్టర్ అందులో కీలకమైన శుబ్మన్ గిల్ వికెట్ పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టాడు. కామెరూన్ గ్రీన్ వంటి ప్రధాన ఆల్రౌండర్ అందుబాటులో లేకపోవడంతో మిషెల్ మార్ష్ జట్టులోకి రాగా... ఇప్పుడు వెబ్స్టర్ ప్రదర్శన చూస్తుంటే ఇక మార్ష్ జట్టులో చోటుపై ఆశలు వదులుకోవడమే మేలనిపిస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం... స్పిన్నర్గా కెరీర్ ఆరంభించిన 31 ఏళ్ల వెబ్స్టర్... ఆ తర్వాత పేస్ ఆల్రౌండర్గా ఎదిగాడు. 6 అడుగుల 7 అంగుళాలున్న వెబ్స్టర్కు బంతిని స్పిన్ చేయడం కంటే... వేగంగా విసరడం సులువు అని కోచ్లు సూచించడంతో తన దిశ మార్చుకున్నాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్ నుంచే నిలకడ కొనసాగించిన వెబ్స్టర్... 2014లో తన 20 ఏళ్ల వయసులో ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ భారీగా పరుగులు రాబట్టినా... జాతీయ జట్టులో పోటీ కారణంగా అతడికి ఆసీస్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా దేశవాళీల్లో రాణించిన వెబ్స్టర్ ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా ‘ఎ’ తరఫున బరిలోకి దిగి అటు బంతితో ఇటు బ్యాట్తో రాణించాడు. 2023–24 షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెబ్స్టర్ విశ్వరూపం ప్రదర్శించాడు. సీజన్ ఆసాంతం ఒకే తీవ్రత కొనసాగించిన అతడు... 58.62 సగటుతో 938 పరుగులు చేయడంతో పాటు... 30.80 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ చరిత్రలో గ్యారీ సోబర్స్ తర్వాత ఒకే సీజన్లో రెండు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాకిస్తాన్తో జరిగిన ప్రైమ్మినిస్టర్స్ ఎలెవన్ జట్టుకు ఎంపిక చేశారు. అక్కడ కూడా రాణించిన వెబ్స్టర్ తనను పక్కన పెట్టలేని పరిస్థితి కల్పించాడు. కెరీర్లో ఇప్పటి వరకు 93 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన వెబ్స్టర్ 5297 పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు, 24 హాఫ్సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 148 వికెట్లు పడగొట్టాడు. -
పారిస్ ఫ్యాషన్ వీక్లో మత్స్య కన్యలా జాన్వీ స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
తమిళ నటుడు అజిత్ ఇప్పుడు ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందు విడాముయర్చి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది.ఇదిలా ఉండగా.. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని చిత్రంతో సూపర్హిట్ కొట్టిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు జంటగా నటి శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే నటి శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల సైలెంట్గా ఎలాంటి హంగామా లేకుండా హైదరాబాద్లో ప్రారంభమైంది. అంతేకాదు శుక్రవారంతో తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంటుందని అజిత్ సన్నిహితుడు తెలిపారు. హైదరాబాద్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అజిత్ పాల్గొనే ఇంట్రో పాటను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.కాగా అజిత్ తదపరి విడాముయర్చి చిత్రం షూటింగ్లో పాల్గొననున్నారని.. జూన్ రెండు లేదా మూడో వారంలో ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇదే ఈ చిత్రం చివరి షెడ్యూల్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం షూటింగ్లో పాల్గొంటారని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి ముందు విడాముయర్చి చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
-
అది చూసి అడల్ట్ స్టార్ అన్నారు: హీరో పోస్ట్ వైరల్!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అభయ్ డియోల్ 'సోచా న తా' అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో అయేషా టాకియా, అపూర్వ జా హీరోయిన్లుగా నటించారు. ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా 2005లో రిలీజైంది. ఈ రోజుకు సినిమా విడుదలైన 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో అభయ్ డియోల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ అదేంటో మీరు ఓ లుక్కేయండి. అభయ్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఇప్పటికీ కూడా ఈ సినిమా నిన్ననే చేసినట్లు అనిపిస్తోంది. ఆ చిత్రంలో మేము చాలా అమాయకంగా కనిపించాం. ఎందుకంటే అది మాకు ఇంకా నేర్చుకునే సమయం. కానీ ఇప్పటికీ 19 ఏళ్ల తర్వాత కూడా సినిమాలు చేస్తున్నాను. నేను చేసిన సినిమాల ద్వారానే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నా. అంతే కానీ పీఆర్ టీమ్ ద్వారా నేను ఫేమ్ తెచ్చుకోలేదు. నేను ఎంచుకున్న సినిమాల్లో విజయాలు, వైఫల్యాలను స్వయంగా చూశా. నన్ను నేను అనుసరించడం చాలా విలువైన పాఠాలు నేర్పింది. నేను ఎప్పటికీ నాలాగే ఉంటా. ఎందుకంటే నేను ఈ రోజు వ్యక్తిని కాను. సినిమా కోసం నా సొంత స్టైలిస్ను పొందాలని కోరుకుంటా. కానీ కొందరు మాత్రం ఆ సినిమాలో నా సైడ్ బర్న్స్ (కణతలు) చూసి 1970ల్లో పోర్న్ స్టార్లా ఉన్నారంటూ కామెంట్ చేశారు' అని పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ సోచా న తా సూపర్ హిట్ మూవీ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Abhay Deol (@abhaydeol) -
IND vs ENG: కల నేరవేరింది.. ఎట్టకేలకు అరంగేట్రం! ఎవరీ ఆకాష్ దీప్?
టీమిండియా తరపున అరంగేట్రం చేయాలన్న బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్ కల ఎట్టకేలకు నేరవేరింది. రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టుతో ఆకాష్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. నాలుగో టెస్టుకు స్టార్ పేసర్ బుమ్రా దూరం కావడంతో ఆకాష్ దీప్కు తుది జట్టులో చోటు దక్కింది. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదగా ఆకాష్ తన తొలి టెస్టు క్యాప్ను అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 313వ ఆటగాడిగా ఆకాష్ నిలిచాడు. కాగా ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో ఆకాష్ దీప్కు చోటు దక్కలేదు. అయితే దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆకాష్ ఇప్పుడు ఏకంగా భారత జెర్సీలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఆకాష్ ఈ సిరీస్కు ముందు ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన అనాధికార టెస్టు సిరీస్లో కూడా ఆకాష్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన దీప్ 13 వికెట్లు పడగొట్టి.. భారత్-ఏ జట్టు తరపున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎవరీ ఆకాష్ దీప్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ ఆకాష్ దీప్..? 27 ఏళ్ల ఆకాష్ ఆకాష్ దీప్ బీహార్లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. ఆకాష్ది మధ్యతరగతి కుటంబం. అతడు తన చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ. క్రికెట్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో దీప్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మరణించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడి సోదురుడు కూడా తుదిశ్వాస విడిచాడు. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆకాష్ మాత్రం దృడ సంకల్పంతో తన కెరీర్ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్బెంగాల్కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక అసన్సోల్లోని ఓ క్రికెట్ ఆకాడమీలో దీప్ చేరాడు. ఆ తర్వాత అసన్సోల్లోని ఖేప్ క్రికెట్' టెన్నిస్ బాల్ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఆకాష్ దుమ్మురేపాడు. ఆ తర్వాత బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ డివిజన్ మ్యాచ్ల్లో ఆడే ఛాన్స్ లభించింది. ఓ సారి కోల్కతాలోని రేంజర్స్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అప్పటి బెంగాల్ సీనియర్ టీమ్ డైరెక్టర్ జోయ్దీప్ ముఖర్జీ దృష్టిలో ఆకాష్ దీప్ పడ్డాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కీపర్ స్టంప్ల వెనుక 10 గజాల దూరంలో నిల్చోడం చూసి జోయ్దీప్ ముఖర్జీ ఆశ్చర్యపోయారు. వెంటనే అండర్-23 కోచ్ సౌరాశిష్ను పిలిపించి ఆకాష్ దీప్ గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు దీప్ను ముఖర్జీ రిఫర్ చేశాడు. ఇదే అతడి కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు షార్ట్లిస్ట్ చేసిన జాబితాలో ఆకాష్కు చోటు దక్కింది. దీంతో బెంగాల్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్లో ఆకాష్ పాల్గొనున్నాడు. ఆ తర్వాత 2019లో బెంగాల్ తరపున ఆకాష్ దీప్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఫస్ట్క్లాస్ క్రికెట్, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. Say hello to #TeamIndia newest Test debutant - Akash Deep 👋 A moment to cherish for him as he receives his Test cap from Head Coach Rahul Dravid 👏 👏 Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/P8A0L5RpPM — BCCI (@BCCI) February 23, 2024 ఓవరాల్గా క్రికెట్లో ఇప్పటివరకు 29 మ్యాచ్లు ఆడిన ఆకాష్ 103 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. కనీస ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. -
ఒకేరోజు ఎనిమిది మంది క్రికెటర్ల ఎంట్రీ!
క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివిధ ఫార్మాట్లలో ఇవాళ (2024, ఫిబ్రవరి 2న) ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ముందుగా విశాఖ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్తో భారత ఆటగాడు రజత్ పాటిదార్, ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశారు. వెస్టిండీస్తో ఇవాళ జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే అరంగేట్రం చేశారు. శ్రీలంకతో ఇవాళే మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. మొత్తంగా ఇవాళ ఎనిమిది మంది ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. క్రికెట్ చరిత్రలో ఇంతమంది ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఇవాళ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల వివరాలు.. రజత్ పాటిదార్ (భారత్) షోయబ్ బషీర్ (ఇంగ్లండ్) జేవియర్ బార్ట్లెట్ (ఆస్ట్రేలియా) లాన్స్ మోరిస్ (ఆస్ట్రేలియా) నూర్ అలీ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) నవీద్ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ (ఆఫ్ఘనిస్తాన్) మొహమ్మద్ సలీం (ఆఫ్ఘనిస్తాన్) ఇవాళ జరుగుతున్న మ్యాచ్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (125 నాటౌట్) కెరీర్లో మూడో సెంచరీతో కదంతొక్కగా.. అతనికి జతగా అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ (25) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో అరంగేట్రం ఆటగాళ్లు రజత్ పాటిదార్, షోయబ్ బషీర్ పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ తొలి వన్డే విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయానికి చేరువలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 48.4 ఓవరల్లో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 34 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 208 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. గ్రీన్ (68), స్టీవ్ స్మిత్ (65) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ గెలుపుకు మరో 24 పరుగులు మాత్రమే అవసరం ఉంది. అరంగేట్రం ఆటగాళ్లు జేవియర్ బార్ట్లెట్ (9-1-17-4) అద్భుత గణాంకాలతో విజృంభించగా.. లాన్స్ మోరిస్ (10-2-59-0) పర్వాలేదనిపించాడు. ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తొలి రోజు మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు (53 ఓవర్లు) చేసింది. కైస్ అహ్మద్ (16), జియా ఉర్ రెహ్మాన్ (0) క్రీజ్లో ఉన్నారు. అరంగేట్రం ఆటగాళ్లలో నూర జద్రాన్ (31) కాస్త పర్వాలేదనించాడు. -
మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే. శనివారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 182 పరుగుల భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది. అభిషేక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఎస్ఆర్హెచ్ను ముంచగా.. మిగతా బౌలర్లు కూడా అంతగా రాణించలేకపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ భారీ ఓటమిని మూటగట్టుకుంది. అయితే మ్యాచ్కు ముందు మార్క్రమ్ చేసిన తప్పిదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీ మ్యాచ్కు ముందు ఇచ్చే తుది జట్టు షీట్ను మార్క్రమ్ తప్పుగా ఇచ్చాడు. టాస్ సమయంలో చెప్పిన ఆటగాడి పేరు తుది జట్టులో లేకపోగా.. కనీసం సబ్స్టిట్యూట్గా కూడా లేకపోవడం గమనార్హం. విషయంలోకి వెళితే.. వాస్తవానికి లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ ద్వారా యంగ్ బౌలర్ సన్విర్ సింగ్ అరంగేట్రం చేయాల్సింది. మార్క్రమ్ కూడా టాస్ సమయంలో సన్విర్ సింగ్ ఐపీఎల్తో పాటు ఎస్ఆర్హెచ్ తరపున డెబ్యూ చేయనున్నట్లు పేర్కొన్నాడు. కానీ సన్వర్ సింగ్ పేరు ఆ తర్వాత తుది జట్టులో కనిపించలేదు. పొరపాటున అలా జరిగి ఉంటుందిలే అనుకుంటే.. అసలు ఫీల్డింగ్.. బ్యాటింగ్ ఇలా రెండు సమయాల్లోనూ అతను కనిపించలేదు. ఇక వివ్రాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్లో ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. మాజీ క్రికెటర్.. ప్రస్తుతం ఐపీఎల్లో కామెంటేటర్గా పనిచేస్తున్న స్కాట్ స్టైరిస్ ఈ తప్పిదాన్ని గుర్తించాడు. మార్క్రమ్ ఇచ్చిన తప్పుడు షీట్ను కెమెరా ముందు పెట్టాడు. ఆ షీట్లో సన్వర్ సింగ్ పేరు క్రాస్ చేసి నటరాజన్ పేరును పెట్టారు. ''ఒక ఆటగాడికి అరంగేట్రం అని చెప్పి ఇప్పుడు అతని పేరు కనిపించకపోవడం అనేది తప్పు. మ్యాచ్ అరంగేట్రం చేస్తున్నానన్న సంతోషం కాసేపు కూడా లేకుండా చేశారు. దీనికి మార్క్రమ్ బాధ్యత వహించాలి.'' అని పేర్కొన్నాడు. మరో విశేషమేమిటంటే.. సన్వర్ సింగ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎస్ఆర్హెచ్ క్యాప్ అందుకున్నాడు. కానీ తుదిజట్టు సహా ఇంపాక్ట్ ప్లేయర్లలో ఎక్కడా అతని పేరు కనిపించలేదు. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సమయంలో నటరాజన్ను సన్వర్ సింగ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా పంపించినట్లు తెలిసింది. అయితే గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సన్వర్ సింగ్ ఎస్ఆర్హెచ్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. These Clowns had submitted wrong teamsheet lmao 😭 pic.twitter.com/sti6OnBX2r — . (@manisayzz) May 14, 2023 చదవండి: ఔటైతే బాధపడతారు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ -
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో.. పోస్టర్ రిలీజ్
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాన్నునారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు హీరోలుగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నందమూరి వారసుడు కూడా హీరోగా టాలీవుడ్కు పరిచయం కానున్నారు.నందమూరి జయకృష్ణ కొడుకు అయిన నందమూరి చైతన్య కృష్ణ వెండితెరకు పరిచయం కానున్నారు. బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన హీరోగా డెబ్యూ ఇస్తున్నారు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు టైటిల్ను మార్చి 5న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. Production No.1 from @BTRCreations 💥 Brace Yourselves for the Title Launch on March 5th 🤩 🌟ing #NandamuriChaitanyaKrishna 🤩 A film by @VKrishnaakella 🎬 𝙀𝙫𝙚𝙧𝙮 𝙨𝙞𝙣𝙣𝙚𝙧 𝙣𝙚𝙚𝙙𝙨 𝙩𝙧𝙚𝙖𝙩𝙢𝙚𝙣𝙩 pic.twitter.com/1IvnIv8Djk — Basavatarakarama Creations (@BTRcreations) March 3, 2023 -
ఆ హీరో మేనల్లుడితో స్టార్ హీరోయిన్ కుమార్తె ఎంట్రీ..!
రవీనా టాండన్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించకున్న నటి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించింది రవీనా టాండన్. తాజాగా ఆమె కూతురు రాషా తడాని సైతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. (ఇది చదవండి: అందరి కళ్లు దీపికా పదుకొణె వైపే.. ఆ శారీ అన్ని లక్షలా?) అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్కు జంటగా బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సెట్స్పైకి వెళ్లనున్న చిత్రానికి రాషా ఇప్పటికే సంతకం చేశారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్గణ్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్నారు. అయితే బాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టి రాషా పైనే ఉంది. రవీనా టాండన్ కూతురిగా సినిమాల్లో ఎలా రాణిస్తుందనే దానిపై చర్చ నడుస్తోంది. నిర్మాత అభిషేక్ కపూర్ గురించి ఓ వ్యక్తి మాట్లాడుతూ.. 'గత 15 ఏళ్లుగా భారతీయ సినిమాకి అభిషేక్ అందించిన సహకారం ప్రశంసనీయం. అతను సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఫర్హాన్ అక్తర్, రాజ్కుమార్ రావు, సారా అలీ ఖాన్ లాంటి కొత్త వ్యక్తులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రతి సినిమాలో వారి పాత్రలను అందించాడు. ఆ సినిమాలు మనతో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ పాత్రలు ఈ నటీనటుల జీవితాల్లో అద్భుతాలుగా నిలిచాయి. భారతీయ సినిమాకు, ఆయన ప్రగతిశీల ఆలోచనకు ఇది సంకేతం.' అని అన్నారు. -
హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎంజీఆర్ మనువడు.. రిలీజ్కు రెడీ
తమిళసినిమా: ఎంజీఆర్ మనవడు జూనియర్ ఎంజీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇరుంబన్. నటి ఐశ్వర్య దత్తా నాయకిగా నటించిన ఇందులో నటుడు యోగిబాబు, సెండ్రాయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కీరా దర్శకత్వంలో తమిళ్ బాలా, ఆర్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక కేకేనగర్లోని శాంతి మెట్రిక్యులేషన్ స్కూల్లో నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ చిత్ర ఆడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరంభ దశలో నటుడు విజయ్కు ఆయన తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ సపోర్ట్ చేశారని, అయితే విజయ్ సూపర్స్టార్గా ఎదగడానికి ఆయన కఠిన శ్రమే కారణమన్నారు. ఇప్పుడు డాన్స్లో ఇండియాలోనే విజయ్ను మించిన వారు లేరన్నారు. నటుడు ధనుష్కు కూడా మొదట్లో ఆయన తండ్రి అండగా ఉన్నారని, తన ప్రతిభతోనే అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎంజీఆర్ మనవడిగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న జూనియన్ ఎంజీఆర్ కూడా కష్టపడితేనే తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఇరుంబన్ చిత్ర పాటలు, ట్రైలర్ బాగున్నాయని సీమాన్ అన్నారు. చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత కొడుకు.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందంలోనూ హీరోయిన్స్కి ఏమాత్రం తీసిపోదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్కి సమానమైన క్రేజ్ను సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. ఇదిలా ఉండగా త్వరలోనే ఆమె కొడుకు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగానే సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే.. తమ పిల్లలను హీరో, హీరోయిన్స్గా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ఇప్పటికే కూతురు శ్రియాను సింగర్గా పరిచయం చేసిన సునీత కొడుకును మాత్రం హీరోగా వెండితెరపై చూడాలని కలలు కంటుందట. ఇదే విషయాన్ని సునీత కూడా కన్ఫర్మ్ చేసేసింది. ఆకాష్ బర్త్డే సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపిన సునీత.. నిన్ను మంచి నటుడిగా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్ను షేర్ చేసింది. దీంతో ఆకాష్కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మరి ఆకాష్ ఏ సినిమాలో నటిస్తున్నారు? డైరెక్టర్ ఎవరన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కుమారుడు
సాధారణంగా స్టార్ హీరోల వారసుడు అంటే హీరోగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారు ఆర్యన్ ఖాన్ మాత్రం రచయితగా అరంగేట్రం చేయబోతండటం విశేషం. తనకు హీరోగా నటించాలని లేదని, తెరవెనుక తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు నటన గురించి ఆలోచిస్తానని ఆర్యన్ ఇదివరకే చాలాసార్లు చెప్పాడు. తాజాగా ఆయన ఓ కామెడీ వెబ్సిరీస్ కోసం కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ కథ ఉంటుందట. కాగా గతంలో డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ జైలు జీవితాన్ని గడిపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ‘ది అర్చీస్’ అనే వెబ్సిరీస్లో ఆమె నటిస్తుంది. -
మూవీ ఎంట్రీపై మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య క్లారిటీ!
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె నటిగా రాణించింది. ఇక పెళ్లి అనంతరం ప్రొడ్యూసర్గా మారిపోయింది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్, సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆమె భర్త గురించి ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా పెళ్లి అనంతరం నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య సినిమాల్లోకి రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్? హింట్ ఇచ్చిన అనన్య పాండే దీంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడంటూ అందరు చర్చించుకున్నారు. చైతన్య హైట్, పర్సనాలిటి కూడా హీరోకు ఏమాత్రం తీసిపోకుండ ఉండటంతో అంతా అతడి ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తన మూవీ డెబ్యూ చైతన్య సన్నిహితుల నుంచి ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా చైతన్యకు సినిమాలు, నటన అంటే పెద్ద ఆసక్తి లేదని, అతడి వ్యాపారం అంటనే ఇష్టమని చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: రష్మికపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు నిహారికి పెళ్లి అనంతరం ఎక్కడికి వెళ్లిన చైతన్యకు తన సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురవుతున్నాయట. వాటికి విసిగిపోయిన చైతన్య తనకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదని, ప్రస్తుతం తాను చేస్తున్న వ్యాపారం పట్ల సంతృప్తిగా ఉన్నానని కుండలు బద్ధలు కొట్టినట్లు సన్నిహితుల నుంచి సమాచారం. కాగా నిహారిక-చైతన్యలు 2020 లాక్డౌన్లో డిసెంబర్ 9న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. -
సమ్మోహనం... లహరి కూచిపూడి అరంగేట్రం
వాషింగ్టన్: తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి ఆరంగేట్రం స్థానిక అమెరికన్లతో పాటు అహూతులైన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. అట్లాంటాలో పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్న వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవి దంపతుల కుమార్తె లహరి 8వ ఏట నుంచే అభ్యాసం ప్రారంభించి ఆదివారం నాడు తొలి అరంగేట్రం ప్రదర్శనతో అందరినీ అలరించింది. కూచిపూడిలోని అత్యంత కఠినమైన 100 రకాలు పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి ప్రశంసలు పొందింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన నాట్య ప్రదర్శన నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగింది. చదవండి👉🏻అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు తల్లిదండ్రులు వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవిలతో.. లహరి వేణు స్వగ్రామం నల్లొండ జిల్లాలోని అల్వాల గ్రామం. 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. చదవండి👉🏻మొసలిని పెళ్లాడిన మేయర్.. దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫోటోకు పోజులు -
15 ఏళ్ల కెరీర్ పూర్తి.. రోహిత్ శర్మ ఎమోషనల్
23 జూన్.. ఈ తేదీ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం. ఇదే రోజున టీమిండియా ధోని సారధ్యంలో 2013లో ఇంగ్లండ్పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి ఐసీసీ చాంపియన్స్ ట్రోపీని గెలుచుకుంది. అయితే ఇదే రోజుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోజు కూడా ఇదే. 2007, జూన్ 23న బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా హిట్మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తాజాగా నేటితో 15 ఏళ్ల క్రికెట్ కెరీర్ పూర్తి చేసుకున్న రోహిత్ ఈ విషయాన్ని ట్విటర్లో పంచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ''ఈ రోజుతో 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను పూర్తి చేసుకున్నా. ఇన్నేళ్ల నా ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధురానుభూతులు.. ఒడిదుడుకులు, చీకటి రోజులు ఉంటాయి. కానీ వాటిన్నింటిని అదిగమిస్తూ ఈస్థాయికి చేరుకున్నానంటే దానికి మీ అందరి సపోర్ట్ ఒక కారణం. అందుకే నా ప్రయాణంలో మద్దుతగా నిలిచిన క్రికెట్ లవర్స్, అభిమానులు, విమర్శలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.'' అంటూ ముగించాడు. 𝟭𝟱 𝘆𝗲𝗮𝗿𝘀 in my favourite jersey 👕 pic.twitter.com/ctT3ZJzbPc — Rohit Sharma (@ImRo45) June 23, 2022 క్రికెట్లో రోహిత్ శర్మ ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా మిడిలార్డర్లో వచ్చిన రోహిత్ శర్మ సరైన ఫామ్ కనబరచలేక జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. సెహ్వాగ్, సచిన్ల రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్గా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వన్డేల్లో భారీ ఇన్నింగ్స్లకు పెట్టింది పేరుగా రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కలిగిన రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది. 2014, నవంబర్ 13న ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 264 పరుగులు బాదాడు. ఆ తర్వాత 2019 అక్టోబర్ 5న సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు బాదాడు. టెస్టుల్లో ఓపెనర్గా ఆడుతున్న తొలి మ్యాచ్లోనే అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇక కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా వైదొలగడంతో సారధ్య బాధ్యతలు ఎత్తుకున్న రోహిత్కు ఇంగ్లండ్ పర్యటన ఒక సవాల్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విదేశాల్లో ఇదే తొలి సిరీస్ అని చెప్పొచ్చు. ఇక రోహిత్ శర్మ టీమిండియా తరపున 228 వన్డేల్లో 9283 పరుగులు.. 44 టెస్టుల్లో 3076 పరుగులు, 124 టి20ల్లో 3,308 పరుగులు సాధించాడు. రోహిత్ ఖాతాలో వన్డేల్లో 29 సెంచరీలు, 8 టెస్టు సెంచరీలు, 4 టి20 సెంచరీలు ఉన్నాయి. చదవండి: 'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్ నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు -
వెండితెరపైకి స్టార్ కిడ్స్.. హీరో, హీరోయిన్, డైరెక్టర్గా
Paloma Dhillon Rajveer Deol Debut In Rajshri Productions: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. ఇటీవలే బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ వారసులు అగస్త్యా నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (బోనీ కపూర్-దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్ (షారుక్ ఖాన్ కుమార్తె) నటిస్తున్న తొలి వెబ్ ఫిల్మ్ ‘ద ఆర్చీస్’ పోస్టర్ విడుదలైంది. తాజాగా మరో స్టార్ హీరో తనయుడు, నటి కుమార్తె వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కుమారుడు రాజ్వీర్ డియోల్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్గా ప్రముఖ నటి పూనమ్ దిల్లాన్, నిర్మాత అశోక్ థకేరియా కుమార్తె పలోమా దిల్లాన్ తెరంగేట్రం చేయనుంది. వీరిద్దరికి ఇదే డెబ్యూ మూవీ కానుంది. అంతేకాకుండా ఈ చిత్రంతో డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా కుమారుడు అవినీష్ ఎస్ బర్జాత్యా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రాజశ్రీ ప్రొడక్షన్లో 59వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జులైలో ప్రారంభం కానుంది. కాగా మోడ్రన్ సంబంధాలను చూపిస్తూ లావిష్ డెస్టినేషన్ వెడ్డింగ్ కథతో రానుంది ఈ మూవీ. చదవండి: బాలీవుడ్ బిగ్ స్టార్స్ వారసులంతా ఒకే ఫ్రేమ్లో.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టెన్షన్గా ఉంది.. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినట్లుంది : ఆలియా భట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. గంగూభాయ్, ఆర్ఆర్ఆర్ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత ఆలియా చేసే తర్వాతి ప్రాజెక్ట్స్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఆలియా భట్ త్వరలోనే హాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’అనే చిత్రం ద్వారా హాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆలియా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'హాలీవుడ్ మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు బయలుదేరాను. ఇండస్ట్రీలోకి మళ్లీ కొత్తగా ఎంట్రీ ఇచ్చినట్లుంది. నెర్వస్గా ఫీలవుతున్నా' అంటూ తనలోని టెన్షన్ని బయటపెట్టింది. ఇక ఆలియా పోస్ట్ని చూసిన నెటిజన్లు డోంట్ వర్రీ ఆలియా. ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
ఆరోజు యాక్టింగ్ను వదిలేస్తా : హీరో సిద్దార్థ్
లవర్ బాయ్ ఇమేజ్తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్. చాలాకాలం తర్వాత మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. తాజాగా ఎస్కేప్ లైవ్ అనే హిందీవెబ్సిరీస్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్ (Disney + Hotstar)లో మే 20 నుంచి ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'ఈ సిరీస్లో నాది రెగ్యులర్ రోల్ కాదు. ఈ పాత్రలో నన్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. మంచి ఆఫర్లు వస్తే మళ్లీ బాలీవుడ్కు తిరిగొస్తా. ఢిపరెంట్ రోల్స్ వచ్చే వరకు యాక్టింగ్ చేస్తా. లేదంటే వేరే ఉద్యోగం చూసుకుంటా' అని సిద్దార్థ్ పేర్కొన్నాడు. -
ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..
Siddharth OTT Debut Escaype Live Will Streaming On Disney Plus Hotstar: టాలీవుడ్లో లవర్ బాయ్గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. బొమ్మరిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఇటీవల మహాసముద్రం సినిమాతో అలరించాడు. ఈ హీరో తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్పెషల్స్ నిర్మించిన 'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్తో సందడి చేయనున్నాడు. ఈ వెబ్ సిరీస్కు సిద్ధార్థ్ కుమార్ తివారి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ డిస్లీ ప్లస్ హాట్స్టార్లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. 'పోటీ చేస్తున్న అమ్మాయిలకు వజ్రాలు బెస్ట్ ఫ్రెండ్స్. మరీ ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు ?' అని ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్, డైరెక్టర్ గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ 'కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్పై పని చేస్తున్నాను. తివారితో కలిసి పనిచేయడం నటుడిగా అద్భుతమైన అనుభవం. ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తూ ప్రేరణ పొందాను. తివారితో స్క్రిప్ట్, పాత్రల అభివృద్ధి గురించి జరిపిన చర్చలు నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. నేను ఏం చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను. ఆయన ఆశించిన దానికి నేను ఇంకా ఏం ఇవ్వాలి అని నేను అనుకునేవాన్ని. నేను అనుకున్నదంతా చేయగలనని తివారి నన్ను నమ్మారు.' అని చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ ఒక యాప్లో నిర్వహించే పోటీ ఆధారంగా తెరకెక్కించిన కల్పిత కథ అని సమాచారం. చదవండి: భయపెట్టేందుకు వచ్చేస్తున్న మహారాష్ట్ర జాంబీలు.. చూసేందుకు సిద్ధమా ! Diamonds are a g̶i̶r̶l̶'̶s̶ contestant's best friend! 💎💎 Who do you think will win?#HotstarSpecials #EscaypeLive all episodes streaming from May 20. Created and directed by Siddharth Kumar Tewary @sktorigins pic.twitter.com/vC2JZsuS88 — Disney+ Hotstar (@DisneyPlusHS) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోయిన్గా ఆమని మేనకోడలు.. పోస్టర్ విడుదల
Aamani Niece Hrithika Nari Nari Naduma Murari Poster Released: సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా హీరో, హీరోయిన్లు కావడం సర్వసాధరణమే. కొంచెం టాలెంట్ ఉండి, వారసత్వం తోడేతే చిత్ర పరిశ్రమలో త్వరగా నిలుదొక్కుకోవచ్చు. ఇదే తరహాలో మరో బ్యూటీ వెండితెరకు పరిచయం కానుంది. హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆమని. శుభలగ్నం, మావి చిగురు, మిస్టర్ పెళ్లాం వంటి తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తోంది. ఆమని నట వారసురాలిగా ఆమె మేనకోడలు హృతిక వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది. బాల నటిగా 3 సినిమాల్లో నటించిన హృతిక హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అభిలాష్ భండారి హీరోగా, హృతిక హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. జీవీకే దర్శకత్వంలో చక్ర ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై వెంకటరత్నం నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవీకే మాట్లాడుతూ.. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి యానాం, అమలాపురం, వైజాగ్, లంబసింగి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్లో షూటింగ్ ప్లాన్ చేశాం. సింధు కే ప్రసాద్ సంగీతం, జే. ప్రభాకర్రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. చదవండి: చరణ్ నటన నాకు కొత్తగా అనిపించలేదు: చిరంజీవి కానిస్టేబుల్గా కీర్తి సురేష్.. 24 హత్యలు.. ఆసక్తిగా 'చిన్ని' ట్రైలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ కొడుకు?
టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు స్టార్ హీరోగా సత్తా చాటుతున్న రవితేజకు మహాధన్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్లో మహాధన్ కనిపించాడు. ఇక అప్పటి నుంచి హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ అంటూ వార్తలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇదివరకే స్పందించిన రవితేజ అతని చదువు పూర్తవగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కాలేజీ నేపథ్యంలో సాగే ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ని మహాధన్తో తీయడానికి రవితేజను సంప్రదించగా ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజా ది గ్రేట్ సినిమాతో రవితేజకు హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. -
బాలీవుడ్ను భయపెట్టనున్న అవికా గోర్..
Avika Gor Bollywood Debut With Vikram Bhatt 1920 Horrors of Heart: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నార్త్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్గా బుల్లితెరపై కెరీర్ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్లోకి గ్రాండ్గా అడుగు పెట్టనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన హార్రర్ మూవీ '1920'. 2008లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ చిత్రంలో అవికా గోర్ను లీడ్ రోల్కు ఎంపికి చేసినట్లు విక్రమ్ భట్ ప్రకటించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు మహేశ్ భట్ కథ అందిస్తున్నారు. కాగా అవికా గోర్ ఇదివరకు 'రాజుగారి గది 3'లో దెయ్యంగా భయటపెట్టిన విషయం తెలిసిందే. మరీ ఈ హిందీ చిత్రంలో ఏమేరకు భయపెడుతుందో చూడాలి. అలాగే ఈ సిరీస్లో 2012లో వచ్చిన '1920 ది ఈవిల్ రిటర్న్స్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. చదవండి: అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్ View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోగా పరిచయం అవుతున్న బిగ్ బి మనవడు
బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో అగస్త్య హీరోగా ది ఆర్చీస్ అనే చిత్రం తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గ్రాండ్గా లాంచ్ అయ్యింది. అమెరికన్ కామిక్ సిరీస్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. రీమా కాగ్టీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్నాళ్లుగా అగస్త్య ఎంట్రీపై బీటౌన్లో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అగస్త్య ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ సందర్భంగా అమితాబ్ మనువడికి ఆల్ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. “నీ జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలయ్యింది. ఇంతకంటే ఆనందం మాకు వేరేముంది? నా ఆశీస్సులు, ప్రేమ సదా తోడై ఉంటాయి” అంటూ బిగ్ బి ట్వీట్ చేశారు. కాగా ఇదే సినిమాతో షారుక్ ఖాన్ కూతురు సుహానా, బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా వెండితెరకు పరిచయం కానున్నారు. ఒకే ప్రాజెక్టుతో ముగ్గురు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
అమెజాన్ ప్రైమ్లో 'ఓ మై డాగ్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాస్టర్ ఆర్ణవ్కు అవార్డు రావడం ఖాయమని దర్శకుడు సరోవ్ షణ్ముగం అన్నారు. ఈయన దర్శకత్వం వహించిన 'ఓ మై డాగ్' చిత్రాన్ని నటి జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా ద్వారా నటుడు అరుణ్విజయ్ కొడుకు ఆర్ణవ్ బాలనటుడిగా ప్రధాన పాత్రలో పరిచయం అయ్యాడు. ఇందులో అరుణ్విజయ్, ఆయన తండ్రి సీనియర్ నటుడు విజయ్కుమార్ ముఖ్యపాత్రలు పోషించగా, మహిమ నంబియార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కుక్కపిల్ల కీలకపాత్రలో నటించడం మరో విశేషం. నివాస్ కే.ప్రసన్న సంగీతం, గోపీనాథ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈ నెల 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ టైంలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిన తన కొడుకు సూర్య నటుడిగా, నిర్మాతగా ఈస్థాయికి ఎదగడం గర్వంగా ఉందన్నారు. తన కొడుకు, మనవడితో కలిసి ఈ చిత్రంలో నటించడం మధురమైన అనుభవం అని నటుడు విజయ్కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో నటనకు మాస్టర్ ఆర్ణవ్కు అవార్డు రావడం ఖాయమని దర్శకుడు సరోవ్ షణ్ముగం తెలిపారు. Witness the epic and un-fur-gettable tale of Arjun & Simba in 5 Days! 🐾 Watch #OhMyDogOnPrime, April 21 @PrimeVideoIN@Suriya_offl #Jyotika @SarovShanmugam @2D_ENTPVTLTD #VijayaKumar #ArnavVijay #VinayRai #MahimaNambiar @gopinath_dop @nivaskprasanna @rajsekarpandian #MichealRaj pic.twitter.com/1DjIbjbNTr — ArunVijay (@arunvijayno1) April 16, 2022 -
హీరోగా కాదు.. అలా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కొడుకు
Aryan Khan Bollywood Debut As Director To A Web Series: బాలీవుడ్ బాద్షా కుమారుడు ఆర్యన్ ఖాన్ వెండితెరకు పరిచయం కానున్నాడు. ఆర్యన్ హీరోగా ఏదో ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడని ఇప్పటివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆర్యన్ హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. బాలీవుడ్కు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడని ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. ఆర్యన్ ఖాన్ ఒక వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేయనున్నాడట. దానికి కథను కూడా ఆర్యన్ ఖాన్ అందించాడని సమాచారం. ఈ వెబ్ సిరీస్ షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన టెస్ట్ షూట్ను ముంబైలోని ఓ స్టూడియోలో జరిపినట్లు తెలుస్తోంది. ఈ టెస్ట్ షూట్కు ఆర్యన్ ఖాన్ పూర్తి బాధ్యతను తీసుకున్నాడట. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందే ప్రతి ఒక్కరికీ ఈ ప్రాజెక్ట్పై అవగాహన ఉండాలనేది ఆర్యన్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ముందుగా ఏప్రిల్ 8, 9 తేదిల్లో టెస్ట్ షూట్ నిర్వహించారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి ఆర్యన్ ఖాన్కు తనలా హీరో కావాలనే ఆలోచిన లేదని, సినిమా నిర్మాణంలోని వివిధ అంశాలు తనకు నచ్చేవని ఇదివరకూ పలుమార్లు షారుఖ్ ఖాన్ తెలిపాడు. ఇక షారుఖ్ ఖాన్ రెండో సంతానం, కుమార్తె సుహానా ఖాన్ ఓ వెబ్ సిరీస్తో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యే ఈ వెబ్ సిరీస్కు జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అర్చీస్ కామిక్ ఆధారంగా తెరకెక్కనుంది. చదవండి: కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు -
వెబ్ సిరీస్లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే..
ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు వినోదాన్ని అందించే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ ఓటీటీల ద్వారా వినోదమే కాకుండా మంచి మార్కెటింగ్, బిజినెస్ కూడా ఏర్పడుతోంది. దీంతో చిన్న హీరోలు, నటులే కాకుండా పెద్ద హీరోలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. సూర్య, నాని వంటి తదితర హీరోల సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లతో కూడా అలరించారు కొందరు స్టార్ హీరోలు. విభిన్నమైన కథలను వెబ్ సిరీస్ల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అవకాశం ఓటీటీలకు ఉండటంతో సై అంటున్నారు కథానాయకులు. మనోజ్ భాయ్పాయ్, కెకె మీనన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పంకజ్ త్రిపాఠి వంటి పాపులర్ యాక్టర్స్కు పోటీ ఇస్తున్నారు ఈ పెద్ద హీరోలు. 1. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన అభిషేక్ బచ్చన్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండేళ్లలో అభిషేక్ సినిమాలన్నీ నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. 2020లో వచ్చిన 'బ్రీత్: ఇన్టు ది షాడోస్' వెబ్ సిరీస్తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు అభిషేక్ బచ్చన్. 2. సైఫ్ అలీఖాన్ వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతిపెద్ద బాలీవుడ్ స్టార్లలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. తన హ్యాండ్సమ్ లుక్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను, అభిమానులను ఎంతో అలరించాడు. 2018లో రిలీజైన 'సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కోల్కీ కొచ్చి వంటి భారీ తారాగణం నటించింది. తర్వాత 2020లో ఈ వెబ్ సిరీస్కు సీక్వెల్ కూడా వచ్చింది. 3. అజయ్ దేవగణ్ 'ఆర్ఆర్ఆర్'లో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అజయ్ దేవగణ్ తాజాగా వెబ్ సిరీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సైకాలాజికల్, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' అనే వెబ్ సిరీస్లో అజయ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా అలరించాడు. మార్చి 4, 2022న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్లో టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్గా నటించడం విశేషం. 4. వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ 'ప్రిన్స్'గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్గా పేరొందిన ఈ హీరో రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నెగెటివ్ పాత్రలు పోషిస్తున్న వివేక్ 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' అనే వెబ్ సిరీస్తో ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కాడు. క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇప్పటికీ 3 సీజన్లు రిలీజ్ చేసింది. 5. మాధవన్ విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మాధవన్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకున్న మాధవన్ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. ఈ 51 ఏళ్ల హీరో ఇటీవల 'డీకపుల్డ్' వెబ్ సిరీస్తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 2018లో విడుదలైన 'బ్రీత్' వెబ్ సిరీస్తో ఓటీటీలోకు ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. -
బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన డైరెక్టర్ తేజ!
టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్లలతో తేజ కూడా ఒకరు. చిత్రం సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తిన తేజ తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ హిట్టు సాధించాడు. కానీ కొంతకాలంగా ఆయనకు సాలిడ్ హిట్టు మాత్రం దొరకడం లేదు. గత పదిహేనేళ్లలో ‘నేనే రాజు నేనే మంత్రి’ తప్పితే మరో హిట్టు లేదు. ప్రస్తుతం ఆయన రానా తమ్ముడు అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తేజ బాలీవుడ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. ‘జఖ్మీ’ అనే సినిమాతో పాటు,‘తస్కరి’ అనే వెబ్ సిరీస్ని కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. టైమ్ ఫిల్మ్స్, ఎన్.హెచ్. స్టూడియోస్, ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్ సంస్థలు వీటిని నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. -
కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న వినోద్కుమార్
సాధారణంగా వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా కామన్. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు తమ వారసుల్ని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇప్పుడు మరో సీనియర్ నటుడు వినోద్ కుమార్ తన కొడుకును పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. 'మౌన పోరాటం' సినిమాతో హీరోగా పరిచయం అయిన వినోద్కుమార్ అతి తక్కువ సమయంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'సీతారత్నంగారి అబ్బాయి', 'మామగారు' వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్కు బాగా చేరువయ్యాడు. తాజాగా తన పెద్ద కొడుకు టాలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త్వరలోనే అతడు తెరంగేట్రం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే యాక్టింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిల్లో శిక్షణ తీసుకుంటున్నాడని, కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తున్నప్పటికీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారని చెప్పారు. మంచి కథ దొరికితే అతి త్వరలో అతడి ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చారు. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కూతురు!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానున్నట్లు బీటౌన్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ జోయా అక్తర్ దర్శకత్వంలో డెబ్యూ సినిమాతో బాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా ఆ సినిమాకు సంబంధించి చర్చలు జరిపేందుకు సుహానా జోయా ఆఫీస్ను సందర్శించడం మీడియా కంట పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో సుహానా బాలీవుడ్ ఎంట్రీపై బీటౌన్లో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇక గతంలోనే తన కూతురు హీరోయిన్గా కనిపించాలనుకుంటుందని షారుక్ స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. -
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు!
సింగర్ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందం, అభినయం, అంతకు మించి తన స్వీట్ వాయిస్తో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు సునీత. ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ మీడియా, సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే సునీత రెండో పెళ్లి అనంతరం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. చదవండి: 'నాకే కాదు, నా భర్తకు కూడా సమంత హాట్గా కనిపించింది' ఏడాది క్రితం రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఇటూ మీడియాలో, అటూ సోషల్ మీడియాలో తరచూ దర్శనం ఇస్తున్నారు. ఇటీవల తన భర్త రామ్ ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆమె కుమారుడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కాగా సునీత తనయుడు ఆకాశ్ త్వరలో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. చదవండి: నల్లగా ఉంది.. కలర్ తక్కువ అని చాలా మాటలు అన్నారు : హీరోయిన్ అయితే సునీత కూతురు ఓ షోలో పాడి సింగర్గా బుల్లితెరకు పరిచమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్తలు వినిపించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. కాగా సునీత 19 ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని తొలి వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు ఆకాశ్, కూతురు శ్రేయాలు జన్మించారు. ఈ క్రమంలో భర్త కిరణ్ కుమార్తో విభేధాలు తలెత్తడంతో అతడికి సునీత విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2020లో మ్యాంగ్ మీడియా అధినేత, వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని సునీత రెండవ వివాహం చేసుకుని సెటిలైపోయారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ శంకర్ కొడుకు..
Director Shankar Son Arjith To Debut As Hero: ప్రముఖ డైరెక్టర్ శంకర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్లో తీర్చిదిద్ది విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తారు. ఇక కమల్, రజనీ, విక్రమ్ సహా ఎంతోమందికి తమ కెరీర్లో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన డైరెక్టర్ ఆయన. ఇప్పుడు శంకర్ తన కొడుకు తనయుడు అర్జిత్ను హీరోగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే అర్జిత్ యాక్టింగ్, డైరెక్షన్లో శిక్షణ ఇప్పించినట్లు తెలుస్తుంది. 2004లో శంకర్ నిర్మించిన కాదల్ చిత్రం సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ప్రేమిస్తే పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి ఇక్కడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆ చిత్రం సీక్వెల్తో అర్జిత్ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాను సైతం శంకర్ స్వయంగా నిర్మించనున్నారు. ఇక ఇప్పటికే శంకర్ చిన్న కూతురు అదితి కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. -
స్టార్ డైరెక్టర్ ఆఫర్.. హీరోగా సిద్ శ్రీరామ్ ఎంట్రీ!
Is Singer Sid Sriram Will Become A hero In The Movie: సింగర్ సిద్ శ్రీరామ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో యూత్లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సింగర్ ఆయన. సిద్ శ్రీరామ్ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు లేవనడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నా ఆయన పాట మాత్రం సూపర్ హిట్ అవుతోంది. కొన్నిసార్లు అయితే సిద్ శ్రీరామ్ పాడిన పాటలతోనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. యూత్లోనూ సిద్ శ్రీరామ్కు మాంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా సిద్ శ్రీరామ్ గురించి ఇప్పుడో వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో సిద్ శ్రీరామ్ వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో హీరోగా చేయడానికి సిద్ శ్రీరామ్ కూడా అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. -
బిగ్బాస్ : సంతోషంలో మునిగిపోయిన జెస్సీ.. పోస్టు వైరల్
Bigg Boss 5 Telugu: Jessie Gets Movie Offer: బిగ్బాస్ ఐదో సీజన్లో 8వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన మోడల్ జెస్సీ ఫ్యాన్స్కి గుడ్న్యూస్ చెప్పాడు. బిగ్బాస్తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించిన జెస్సీ ఇప్పుడు వెండితెరపై కూడా సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా జెస్సీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. తన ఫస్ట్ మూవీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. సందీప్ మైత్రేయ దర్శకత్వంలో తాను డెబ్యూ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. మైత్రేయ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఫస్ట్లుక్ సైతం త్వరలోనే షేర్ చేస్తాను అంటూ జెస్సీ తన ఇన్స్టా స్టోరీలో చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పటివరకు ఈ సీజన్లో బయటకు వచ్చిన కంటెస్టెంట్లలో జెస్సీ ముందుగా మూవీ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. దీంతో జెస్సీకి బెస్ట్ విషెస్ చెబుతూ పలువురు నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
Sarath Babu: శరత్బాబు నట వారసుడు హీరోగా ఎంట్రీ
Actor Sarath Babu Nephew Introduced As Hero With Daksha Movie : ప్రముఖ నటుడు శరత్బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. ఈ చిత్రంలో అను, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను తనికెళ్ల భరణి, శరత్కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల మాట్లాడుతూ – ‘‘దక్ష’ అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడని అర్థం. అతడే మా తల్లాడి సాయికృష్ణ. చిన్న స్థాయి నుంచి వచ్చిన సాయికృష్ణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆయుష్ నాక్కూడా కొడుకులాంటివాడే. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు శరత్బాబు. ‘‘హీరో అవ్వాలన్న నా కల ఈ చిత్రంతో నేరవేరింది. ఈ థ్రిల్లర్ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అన్నారు ఆయుష్. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత తల్లాడ సాయికృష్ణ. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి చెల్లెలు
Sai Pallavi Sister Puja Kannan Debut In Kollywood As Heroine: హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ షోతో కాకుండా కేవలం నటనతోనే ఎంతోమంది అభిమానులకు దగ్గరైంది ఈ మలయాళీ బ్యూటీ. తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే పూజా తెరంగేట్రం గురించి పలు వార్తలు వచ్చినా తాజాగా వాటిని నిజం చేస్తూ తన సినిమాకు సంబంధించిన అప్డేట్ను రివీల్ చేసింది. తమిళ స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకత్వంలో చిత్తారాయి సెవ్వనం అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా నటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రముఖ నటుడు సముద్రఖని సైతం ఉన్నారు. ఇక ఈ సినిమాను థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి అక్క సాయిపల్లవిలా పూజా కన్నన్ హీరోయిన్గా ఏ మేరకు మెప్పిస్తుందనే చూడాల్సి ఉంది. -
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
యువ సంగీత దర్శకుడు అమ్రేష్ తాజాగా బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఈయన ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత కలైమామణి జయచిత్ర కుమారుడన్న విషయం తెలిసిందే. తొలుత నటుడిగా రంగప్రవేశం చేసిన అమ్రేష్ ఆ తర్వాత సంగీత దర్శకుడిగా స్థిరపడిపోయారు. మొట్టశివ కెట్టశివ, భాస్కర్ ఒరురాస్కెల్, చార్టీ చాప్లిన్-2, శత్రు, గర్జన వంటి సినిమాలకు సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్కి అడుగుపెడుతున్నారు. మల్లికా షెరావత్ కథానాయికగా నటిస్తున్న నాగమతి చిత్రానికి అమ్రేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలె పూజా కకార్యక్రమాలతో ప్రారంభమైంది. పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని అమ్రేష్ ముంబైలో రూపొందిస్తున్నారు. -
భర్త విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న కాజల్
Kajal Agarwal Shocking Decision About her Husband: హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్త విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆమె భర్త గౌతమ్ కిచ్లును సినిమాల్లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చందమామ ప్రయత్నాలు మొదలుపెట్టిందట. గతేడాది గౌతమ్ను పెళ్లి చేసుకున్న కాజల్ త్వరలోనే భర్తను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకొంటుందట. తాను సైన్ చేసిన సినిమాల్లో గౌతమ్కి కూడా ఏదైనా రోల్ ఇప్పించమని మేకర్స్ను కోరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.చదవండి: పుష్ప: హాట్ టాపిక్గా మారిన సమంత రెమ్యునరేషన్ అంతేకాకుండా పాత్ర చిన్నదైనా పర్వాలేదని, కానీ కీలకంగా ఉండాలని కండీషన్లు సైతం పెడుతుందట. గతంలో వీరిద్దరూ కలిసి తమ బిజినెస్ కోసం ఓ యాడ్ షూట్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భర్తతో కలిసి బిగ్ స్క్రీన్ను షేర్ చేసుకోవాలని కాజల్ తాపత్రయపడుతుందట. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. చదవండి: అలా వెళ్తేనే ఆఫర్లు వస్తాయా?..భూమిక షాకింగ్ కామెంట్స్ బాక్సింగ్ లెజెండ్తో లైగర్ విజయ్..ఫోటో వైరల్ -
హీరోగా హరనాథ్ వారసుడు
దివంగత ప్రముఖ నటులు హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ హీరోగా పరిచయం కానున్నారు. విరాట్ రాజ్ హీరోగా నటించనున్న సినిమాకు ‘సీతా మనోహర శ్రీరాఘవ’ టైటిల్ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేశారు. దుర్గా శ్రీ వత్సస. కె దర్శకత్వంలో ఈ సినిమాను వందన మూవీస్ పతాకంపై టి. సుధాకర్ నిర్మించనున్నారు. సెప్టెంబరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.‘కేజీఎఫ్ 2’, ‘సలార్’ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ‘‘తాత వెంకట సుబ్బరాజు, పెదతాత హరనాథ్ల స్ఫూర్తితో హీరోగా పరిచయం అవుతున్నాను’’ అన్నారు విరాట్. చదవండి : తండ్రైన నటుడు.. బెస్ట్ ఫీలింగ్ అన్న స్టార్ హీరో ఆదిపురుష్ షూటింగ్లో ప్రభాస్ పాల్గొనడం లేదు! ఎందుకోసం..! -
బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్.. లాంఛ్ చేసిన రాజమౌళి
అల్లుడు శీను సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్లో బెల్లంకొండ నటించనున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ అవుతున్నాయి. 2005లో తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఛత్రపతి హిట్తో మాస్ ఆడియెన్స్కు బాగా దగ్గరయ్యాడు. దాదాపు 16 ఏళ్ల అనంతరం ఈ సినిమా హిందీ రేమేక్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమయ్యాడు బెల్లంకొండ. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Allu Arha : బిగ్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అయిన అల్లు అర్హ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన ముద్దు ముద్ద మాటలు, అల్లరి చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తన క్యూట్నెస్తో ఇప్పటికే అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకుంది. అర్హకు సంబంధించి ఫోటోలు, వీడియోలను స్నేహరెడ్డి, బన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. దీంతో నాలుగేళ్ల వయసులోనే అర్హ బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంది. త్వరలోనే ఈ చిన్నారి సిల్వర్ స్క్రీన్పై కనిపించనున్నట్లు సమాచారం. దిల్రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్హ ప్రధాన పాత్రలో కనిపించనుందట. ఈ కథకు అర్హ అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావించారట. దీంతో అల్లు ఫ్యామిలీని దిల్రాజు ఇప్పటికే సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అర్హ టాలీవుడ్కు పరిచయం అవబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
బాయ్ఫ్రెండ్ను హీరోగా చేసేందుకు పాయల్ ప్రయత్నాలు
పాయల్ రాజ్పుత్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో ఓవర్నైట్ స్టార్డమ్ను సంపాదించుకుంది. తొలి సినిమాతోనే నెగిటివ్ షేడ్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక గ్లామర్ డోస్తో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పాయల్ కొంతకాలంగా పంజాబి నటుడు .. గాయకుడు అయిన సౌరభ్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేది. తాజాగా తనకున్న పరిచయాలతో సౌరభ్ను తెలుగులో హీరోగా చేసేందుకు పాయల్ ప్రయత్నాలు మొదలు పెట్టిందట. తనకున్న పరిచయాలతో ఇప్పటికే ఓ సినిమాలో ప్రియుడు సౌరభ్ను హీరోగా సెట్ చేసిందని ఫిల్మ్నగర్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. ఇక పాయల్ ప్రస్తుతం సాయికుమార్ సరసన ‘కిరాతక’అనే మూవీలో నటిస్తుంది. జన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్తో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. -
రెమ్యునరేషన్ను అమాంతం పెంచేసిన నయన్
ఇప్పటివరకు దక్షిణాది చిత్రాలకే పరిమితమైప నయనతార తొలిసారిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమాలో జోడీ కట్టేందుకు రెడీ అవుతుంది ఈ లేడీ సూపర్ స్టార్. డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గత పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్లో సౌత్లో టాప్ హీరోయిన్గా దూసుకెళ్తున్న నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అంతేకాకుండా రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది ఈ భామ. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకునే నయనతార ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ కోసం రెమ్యునరేషన్ను అమాంతం పెంచేసింది. బాలీవుడ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని రూ.6-8 కోట్ల రెమ్యునరేషన్ను డిమాండ్ చేసిందట. కథలో దక్షిణాది నేపథ్యం ఉండటతో నయన్ తీసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ మారేసరికి నయన్ రేటు పెంచడంతో నిర్మాతలు షాక్ అయ్యారట. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయన్ పేరు ముందుంటుంది. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ అనగానే పారితోషికాన్ని డబుల్ చేయడంతో ఇక చేసేదేం లేక అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. చదవండి : నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ -
త్వరలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ!
అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తుంది. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. విదేశాలలో ఇటీవలే చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషీ కపూర్ ఇప్పుడు సినిమాల్లో రాణించాలని భావిస్తోందట. తండ్రి బోనీకపూర్ కూడా ఆమెను వెండితెరకి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మొదట బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని భావించినా తండ్రి బోనీ కపూర్ మాత్రం తెలుగు సినిమాతో అరంగేట్రం చేయించాలని చూస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఖుషీ కపూర్ యాక్టింగ్లో శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇంతకుముందే జాన్వీ కపూర్ సైతం టాలీవుడ్లో నటించనుందనే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్- మహేష్బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇవి కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఇప్పటికే ఆ సినిమాలో పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ ఎవరు అన్న దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. చదవండి : శ్రీదేవి నాకు రోల్మోడల్ : ప్రియంక చోప్రా బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్ -
హీరోగా పరిచయం అవుతున్న 'సై' ఫేం శ్రవణ్
‘సై, దూకుడు, శ్రీమంతుడు, బిందాస్, మగధీర, ఏక్ నిరంజన్’ తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఎదురీత’. బాలమురుగన్ దర్శకత్వం వహించారు. లియోనా లిషోయ్ హీరోయిన్గా నటించారు. బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘40 ఏళ్ల మధ్యతరగతి తండ్రికి కుమారుడిపై ఉన్న ప్రేమ ఎన్ని సమస్యలు తీసుకువచ్చింది అనేది మా సినిమా కథాంశం. ప్రతి తండ్రి, ప్రతి కుమారుడి హృదయాన్ని హత్తుకునేలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా సెన్సార్ పూర్తయింది. త్వరలో పాటలు విడుదల చేసి, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. -
అచ్చం సాయిపల్లవిలా ఉంది కదూ..
పూజా కణ్ణన్.. అచ్చంగా అక్కలానే ఉంటారు. అక్కలానే మంచి డ్యాన్సర్ కూడా. ఇక్కడున్న ఫొటోని చూస్తుంటే అక్క ఎవరో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును.. సాయిపల్లవిలా చెల్లెలిలా ఉంది కదూ! నిజమే. అక్క బాటలో చెల్లెలు కూడా కథానాయిక కానుందని సమాచారం. ‘యమదొంగ’, ‘ఏ మాయ చేశావె’, ‘2.0’, ‘మాస్టర్’... ఇలా పలు చిత్రాలకు స్టంట్ మాస్టర్గా చేసిన స్టంట్ శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ద్వారా పూజా కణ్ణన్ కథానాయికగా పరిచయం కానున్నారని సమాచారం. శివకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ఇందులో ఆయన ఓ కీలక పాత్ర కూడా చేయనున్నారు. సముద్రఖని మరో కీలక పాత్రధారి. దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి కథ–స్క్రీన్ప్లే సమకూరుస్తున్నారు. ఆయన దర్శకత్వంలో సాయిపల్లవి ‘కరు’ (తెలుగులో ‘కణం’) అనే సినిమాలో నటించారు. అలాగే ఏఎల్ విజయ్ దగ్గర అసిస్టెంట్గా డైరెక్టర్గా చేశారు పూజా కణ్ణన్. ఐదేళ్ల క్రితం ‘కారా’ అనే షార్ట్ ఫిలింలో నటించారు పూజ. మరి పూజా కణ్ణన్ వెండితెర అరంగేట్రం షురూ అవుతుందా? వేచి చూద్దాం. చదవండి: అవార్డు వేడుకలో వేదికపై పూర్తి నగ్నంగా నటి -
తండ్రి మృతి..అప్పులు తీర్చలేక కొడుకు ఆత్మహత్య
భిక్కనూరు నిజామాబాద్ : ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో మండలంలోని భాగిర్తిపల్లికి చెందిన గంగయ్యగారి నర్సింలు(33) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నవీన్కుమార్ తెలిపిన వివరాలు.. నర్సింలు తండ్రి లక్ష్మయ్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయంలో జరిగిన ఖర్చుకు అప్పులు చేశారు. అప్పులు చెల్లింపు విషయంలో కుటుంబంలో తగాదాలు ఏర్పడ్డాయి. అప్పులు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన నర్సింలు తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘‘నా చావుకు ఎవరు కారణం కాదు. అందరిని బాధపెట్టాను. తండ్రి మాట నిలబెట్టుకోలేకపోయా. జై కేసీఆర్.. టీహెచ్ఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు జై.. జై తెలంగాణ’’ అని రాసిన సూసైడ్ నోట్ లభించింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. కాగా నర్సింలుకు ఆరు నెలల క్రితం వివాహామైనట్లు సమాచారం. చదవండి : (కులాంతర వివాహం..మనస్తాపంతో ఆత్మహత్య!) (డెత్నోట్ రాసి.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య) -
‘మిషన్ మజ్ను’ షూటింగ్ ప్రారంభం
అతి తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీని దక్కించుకున్న రష్మిక మందన్నా..వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్లో సెన్సేషనల్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. లక్నోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో హీరో, హీరోయిన్ల ఫస్ట్లుక్ ఫోటోని చిత్రబృందం విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్ల మధ్య ఓ మిషన్ విజయవంతం చేసే రా ఏజెంట్గా సిద్ధార్థ్ కనిపించనుండగా, రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. (దుమ్మురేపుతున్న రష్మిక ‘టాప్ టక్కర్’ టీజర్) 1970 నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శాంతను బాగ్చీ దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్రూ వాలా, అమర్ బుటాల, గరిమ మెహత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తైన తర్వాత అమితాబ్ బచ్చన్ సినిమాలోనూ రష్మిక కనిపించనుంది. వికాస్ బాల్ దర్శకత్వంలో వస్తున్న ‘డాడీ’ సినిమాలో అమితాబ్ కుమార్తె పాత్రలో రష్మిక కనిపించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలోనూ రష్మికనే హీరోయిన్. పాన్ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పొగరు, ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి చిత్రాల్లోనూ రష్మిక నటించనుంది. (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
రష్మిక దూకుడు : ఫ్యాన్స్కు పండగే!
సాక్షి, ముంబై: టాలీవుడ్లో సెన్సేషనల్ హీరోయిన్గా దూసుకుపోతున్నరష్మిక మందన్నా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. సౌత్లో వరుసగా సూపర్ స్టార్స్తో సినిమాలు సైన్ చేసిన ఈ చార్మింగ్ బ్యూటీ తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సరసన హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక లీడ్ రోల్ పోషించనుంది. ఆర్ఎస్వీపీ మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. శాంతను బాగ్చి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. మరోవైపు బాలీవుడ్ మూవీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ రష్మిక ట్వీట్ చేశారు. (మరో ‘మెగా’ చాన్స్ కొట్టేసిన రష్మిక!) ఈ మూవీ వచ్చే యేడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అమర్ బుటాలా, గరిమా మెహతా నిర్మాతలు. చిత్రానికి పర్వీజ్ షేక్, అసీమ్ అరోరా, సుమిత్లు కథను అందిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ సినిమాపై స్పందిస్తూ..‘‘మిషన్ మజ్ను’మనదేశానికి చెందిన పౌరులను రక్షించడానికి వెళ్లిన గూఢచార్ల నిజమైన సాహసవీరులనుంచి ప్రేరణ పొందిన దేశభక్తి కథ అని వివరించారు. ఇండియా, పాకిస్థాన్ల మధ్య ఓ మిషన్ విజయవంతం చేసే రా ఏజెంట్గా నటిస్తున్నానని తెలిపారు. బాలీవుడ్ ఎంట్రీపై రష్మిక మాట్లాడుతూ అన్నీ భాషల్లో ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం అదృష్టంగా భావిస్తున్నాననీ ‘మిస్టర్ మజ్ను’లో నటిస్తుండంటం చాలా సంతోషమంటూ చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. (రజనీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్) కాగా ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కన్నడ భామ రష్మిక ఇటీవల కాలంలో వరుసగా హిట్లతో వరుస అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలోనూ రష్మికనే హీరోయిన్. ఇదే కాకుండా పొగరు, ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి చిత్రాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram 💥 https://t.co/y4yQGs9224 — Rashmika Mandanna (@iamRashmika) December 23, 2020 A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
ఐఆర్సీటీసీ బంపర్ లిస్టింగ్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) బంపర్ లిస్టింగ్ సాధించింది. అక్టోబర్ 3తో ముగిసిన మూడు రోజుల ప్రారంభ పబ్లిక్ ఆఫర్లో ఐఆర్సీటీసీ షేర్లకు భారీ డిమాండ్ను సాధించింది. ఇష్యూ ధర రూ. 320 కాగా రెట్టింపునకుపైగా లాభాలతో కొనసాగుతుండటం విశేషం. బీఎస్ఈలో 103 శాతం ప్రీమియంతో రూ. 651 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. వెరసి రూ. 331 వద్ద లాభంతో లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు ఆసక్తితో 111 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ సాధించింది. ఎన్ఎస్ఈలో 118 శాతం పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయికి రూ. 698 ని తాకింది. ప్రభుత్వం 12.6 శాతం వాటాకు సమానమైన 2.01 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 225 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలైన సంగతి తెలిసిందే రూ. 645 కోట్ల ఇష్యూలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ధరలో రూ. 10 డిస్కౌంట్ను కంపెనీ ప్రకటించింది. 2018 నుంచి రైల్వే రంగ కంపెనీలలో రైట్స్, రైల్ వికాస్ నిగమ్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఇప్పటికే లిస్టయ్యాయి. ఈ బాటలో ఐఆర్సీటీసీ నాలుగో కంపెనీగా నిలవనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ(సీపీఎస్ఈ) ఐఆర్సీటీసీ రైల్వే శాఖ నిర్వహణలో నడుస్తోంది. ఇష్యూకి ముందు ప్రభుత్వం 100 శాతం వాటాను కలిగి ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్న కంపెనీగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ నిలిచింది. 2019 ఆగస్టు 31 తో ముగిసిన ఐదు నెలల కాలంలో నెలకు సగటున 25-28 మిలియన్ లావాదేవీలు నమోదవుతున్నాయి. -
విండీస్ టూర్: వీరికి అవకాశం దక్కేనా?
హైదరాబాద్: ప్రపంచకప్లో టీమిండియా ఓటమికి అనేక కారణాలు. బలహీన మిడిలార్డర్, నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్మన్ లేకపోవడం వంటి కారణాలను క్రీడా విశ్లేషకులు వెతుకుతున్నారు. అయితే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ అనంతరం వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో అందరి దృష్టి భారత జట్టు ఎంపికపై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తుండటంతో పలువురు ఆటగాళ్లు తెరపైకి వస్తున్నారు. మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, ఖలీల్ అహ్మద్, సిరాజ్ వంటి వారిపైనే కాకుండా మరికొంత మంది యువ కిశోరాలపై సెలక్టర్ల కన్ను పడింది. గతకొంత కాలంగా దేశవాళీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్, నవదీపై సైనీ, రాహుల్ చహర్, కేఎస్ భరత్ వంటి యువ ఆటగాళ్లు విండీస్ పర్యటనలో టీమిండియా తరుపున అరంగేట్రం చేసే అవకాశం ఉందని జోరుగా వార్తలు వస్తున్నాయి. టీమిండియా యువ కిశోరం పృథ్వీ షా గాయం తర్వాత ఫిట్నెస్ నిరూపించుకోలేదు. సెలక్టర్ల సమావేశంలోపు పృథ్వీ షా తన ఫిట్నెస్ నిరూపించుకంటేనే జట్టులో ఉంటాడు లేకుంటే అంతే సంగతులు. ఇక టెస్టులకు సీనియర్ ఆటగాళ్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్లను పూర్తిగా పక్కకు పెట్టే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారు. దీంతో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్తో పాటు మూడో ఓపెనర్గా గుజరాత్ సారథి ప్రియాంక్ పంచల్కు అవకాశం దక్కవచ్చు. గుజరాత్ సారథిగా, ఓపెనర్గా ప్రియాంక్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో ప్రియాంక్కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మరోవైపు బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ప్రియాంక్కు పోటీ ఇస్తున్నాడు. లిస్టు ఏ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, శ్రీలంకలపై పరుగుల ప్రవాహం సృష్టించిన ఈశ్వరన్ విండీస్ పర్యటనకు ఎంపిక చేస్తారనే ఆశాభావంతో ఉన్నాడు. కీపర్గా ఎంఎస్ ధోని వారసుడిగా రిషభ్ పంత్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారు. అయితే టెస్టుల విషయానికి వస్తే వృద్దిమాన్ సాహా గాయం నుంచి కోలుకోవడంతో సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపవచ్చు. అయితే పంత్, సాహాల తర్వాత కేఎస్ భరత్వైపు సెలక్టర్ల దృష్టి ఉంది. భారత్ ఏ మ్యాచ్ల్లో విశేష ప్రతిభతో సెలక్టర్లును ఆకట్టుకున్నాడు. భరత్ చివరి 11 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, రెండు అర్దసెంచరీల సహాయంతో 686 పరుగులు సాధించాడు. అంతేకాకుండా కీపింగ్లో 41 క్యాచ్లు, 6 స్టంపింగ్స్ చేశాడు. దీంతో టెస్టులకు రెగ్యులర్ కీపర్కు బ్యాకప్గా భరత్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. సెలక్టర్లు పంత్, సాహాలను కాదని భరత్ను ఎంపిక చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడి ప్రతిభ అలాంటిది. ఇప్పటికిప్పుడు టీమిండియా తరుపున ఆడే సత్తా, అనుభవం, ప్రతిభ గల బౌలర్ నవదీప్ సైనీ. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కంటే వేగంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం.. వికెట్లు తీయగల నైపుణ్యం అతడి సొంతం. ఇప్పటికే కోహ్లి సేనతో పాటు విదేశీ పర్యటనలకు వెళుతూ.. నెట్స్లో బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేస్తూ వారి ప్రాక్టీస్కు దోహదపడుతున్నాడు. ఇక ఐపీఎల్, లిస్ట్ ఏ మ్యాచ్ల్లో వికెట్లు పడగొడుతున్న సైనీ అతి త్వరలోనే టీమిండియా జెర్సీ వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ప్రస్తుత క్రికెట్లో మణికట్టు స్పిన్నర్లు జోరు నడుస్తోంది. టీమిండియా స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు తమ మాయాజాలంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతున్నారు. అయితే ప్రపంచకప్లో వారు విఫలమవ్వడంతో వారికి ప్రత్యామ్నాయంగా రాహుల్ చహర్ తెరపైకి వచ్చాడు. టీమిండియా- ఏ తరుపున తనదైన శైలిలో రాణిస్తున్న ఈ స్టైలీష్ స్పిన్నర్పై సెలక్టర్ల కన్నుపడింది. బౌలింగ్లో వేగం.. అంతకుమించి వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకుంటున్న చహర్ కనీసం టీ20లకైనా సెలక్ట్ అవుతాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మయాంక్ అరంగేట్రం.. జడేజా డౌటే?
లీడ్స్: బంగ్లాదేశ్పై గెలిచి సగర్వంగా ప్రపంచకప్లో సెమీస్కు దూసుకెళ్లిన టీమిండియా.. లీగ్లో భాగంగా శనివారం శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్లో కోహ్లి సేన పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కీలక సెమీఫైనల్కు ముందు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వకపోవడమే మంచిదని మేనేజ్మెంట్ భావిస్తొంది. అయితే అనూహ్యంగా జట్టులోకి వచ్చిన కర్ణాటక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శ్రీలంక మ్యాచ్లో ప్రపంచకప్లోనే వన్డే అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో అంతగా ఆకట్టుకోని దినేశ్ కార్తీక్పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ను ఓపెనర్గా పంపించి కేఎల్ రాహుల్ను నాలుగో స్థానంలో ఆడించాలని జట్టు ఆలోచిస్తోంది. రిషభ్ పంత్ ఐదు లేక ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే మయాంక్ ఏకంగా ప్రపంచకప్లోనే అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటివరకు సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా టీమిండియాకు సేవలందించిన రవీంద్ర జడేజాకు శ్రీలంక మ్యాచ్లోనూ నిరాశ తప్పకపోవచ్చు. ఒకవేళ కోహ్లి శ్రీలంక మ్యాచ్లో ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే జడేజా తుదిజట్టులో ఉంటాడు. శ్రీలంక మ్యాచ్ కోసం మేనేజ్మెంట్ ప్రత్యేకంగా మిడిలార్డర్పై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో మిడిలార్డర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. టాపార్డర్ రాణింపుతోనే నెట్టుకు రాగలిగింది. అయితే సెమీఫైనల్, ఫైనల్ వంటి మ్యాచ్ల్లో మిడిలార్డర్ కీలకం కానుంది. దీంతో మిడిలార్డర్ రాణించాలని మేనేజ్మెంట్తో సహా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక సెమీఫైనల్లో వివిధ టీమ్ల ప్రస్తుత ఫామ్ ఆధారంగా ఇంగ్లండ్తోనే టీమిండియా తలపడే అవకాశం కనిపిస్తోందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. -
దినేశ్ కార్తీక్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..
బర్మింగ్హామ్ : ప్రపంచకప్ ఆడాలనేది ప్రతీ ఒక్క క్రికెటర్ కల. అయితే క్రికెట్ విశ్వసమరంలో ఆడే అవకాశం కొందరికి కెరీర్ ఆరంభంలోనే దొరికితే.. మరికొందరికి ఏళ్ల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఏకంగా 15 ఏళ్ల పాటు నిరీక్షణ అనంతరం టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్కు ప్రపంచకప్లో అరంగేట్రం చేశాడు. మంగళవారం ఎడ్జ్బాస్టన్ వేదికగా బంగ్లాదేశ్ మ్యాచ్లో కార్తీక్ ప్రపంచకప్లో ఆడే అవకాశం వచ్చింది. ప్రపంచకప్లో ఇప్పటివరకు అంతగా ఆకట్టుకోని కేదార్ జాదవ్ స్థానంలో కార్తీక్ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో కార్తీక్ అంతగా ఆకట్టుకోలేదు. కేవలం ఎనిమిది పరుగులే సాధించి ముస్తాఫిజుర్ బౌలింగ్లో వెనుదిరిగి నిరుత్సాహపరిచాడు. 2004లోనే కార్తీక్ టీమిండియా జెర్సీ ధరించాడు. నిలకడలేమి ఆటతో పలుమార్లు జట్టుకు దూరమయ్యాడు. అయితే అప్పటిపరిస్థితుల్లో మరో స్ట్రాంగ్ వికెట్ కీపర్ లేకపోవడంతో కార్తీక్కు సెలక్టర్లు పదేపదే అవకాశాలు ఇచ్చారు. అనంతరం ఎంఎస్ ధోని జట్టులో సుస్థిరం స్థానం ఏర్పరుచుకోవడంతో కార్తీక్ను పూర్తిగా పక్కకు పెట్టేశారు. అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నా అంతగా ఆకట్టుకోలేదు. అయితే నిదహాస్ ట్రోఫీలో రాణించడంతో కార్తీక్ను ధోనితో పాటు జట్టులో కొనసాగిస్తున్నారు. ఇక వెస్టిండీస్ వేదికగా జరిగిన 2007 ప్రపంచకప్లో టీమిండియా తరుపున కార్తీక్ పాల్గొన్నప్పటికీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. (చదవండి: ‘తొలి అడుగు టీమిండియా సిరీస్తోనే’) చదవండి: షమీ మతాన్ని ప్రస్తావించిన రజాక్ -
అజిత్ జోగి కోడలి విజయం ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కోడలు రిచా జోగి విజయం సాధించడం నల్లేరు మీద నడకేనని అకల్తారా అసెంబ్లీ నియోజక వర్గం ప్రజలు భావిస్తున్నారు. అజిత్ జోగి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆయన ఈసారి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. ఈ కారణంగా ఆయన తన కోడలును బీఎస్పీ తరఫున ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో 45 శాతం మంది దళితులు, ఆదివాసీలు ఉండడమే కాకుండా బీఎస్పీకీ మంచి ప్రాబల్యం ఉండడమే అందుకు కారణం కావచ్చు. జాంజ్గిర్–చంపా జిల్లాలోని అకల్తారా నియోజక వర్గంలో 35 దళిత, ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. వారంత ఈసారి అజిత్ జోగికే ఓటు వేయాలని ప్రతిజ్ఞ కూడా చేశారట. ఆ గ్రామాల గ్రామాల ప్రజలు రిచా జోగి ప్రత్యర్థులెవరిని తమ గ్రామాల్లో ప్రచారానికి అనుమతించడం లేదు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో గెలిచిన ప్రస్తుత కాంగ్రెస్ శాసన సభ్యుడు చున్నీలాల్ సాహు ఐదేళ్ల నుంచి తమ గ్రామాలకే రావడం లేదని, అక్కడక్కడ ఆయన పోస్టర్లు తప్ప ఆయన జాడ కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. అకల్తార పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఓ టాయ్లెట్ నిర్మంచమంటే కూడా ఆయన నిర్మించలేక పోయారని, అలాంటి వ్యక్తికి ఈసారి ఓటు ఎలా వేయగలమని చెబుతున్నారు. నియోజకవర్గంలోని ముర్లిది గ్రామంలో 1800 మంది ఓటర్ల ఉండగా 1600 మంది ఓటర్లు రిచా జోగికే ఓటు వేస్తున్నట్లు చెప్పారు. మిగతా 200 మంది ఓటర్లు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సౌరభ్ సింగ్కు ఓటు వేస్తున్నట్లు చెప్పారు. ఈసారి ఈ నియోజకవర్గంలో బీజేపీ, బీఎస్పీకి మధ్యనే పోటీ ఉంటుందని, అయితే రిచా జోగిదే విజయమని చెబుతున్నారు. అకల్తారాలో మెజారిటీ ఇళ్లపై బీఎస్పీ జెండాలే కనిపిస్తోంది. ఆఖరికి చున్నీలాల్ సాహుకు మద్దతిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ పుణేశ్వర్ కుమార్ ఆనంద్ ఇంటిపై కూడా బీఎస్పీ జెండా ఎగరడం అందుకు నిదర్శనం. ఈ విషయమై ఆయన్నే ప్రశ్నించగా తన 10, 12 ఏళ్ల కొడుకులు తెలియక ఆ జెండాను ఎగరేశారని చెప్పుకున్నారు. -
దిగ్గజాలకు దడ: మరో చైనా కంపెనీ ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు హవా అంతా ఇంకా కాదు. తాజాగా షావోమి, వివో, ఒప్పో లాంటి టాప్ బ్రాండ్ల గుండెల్లో దడ పుట్టిస్తూ ఈ మార్కెట్లోకి మరో చైనా మొబైల్ మేకర్ వోటో ఎంట్రీ ఇస్తోంది. కనీసం రెండు శాతం వాటా లక్ష్యంగా తొలిసారి ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెడుతున్నామని వోటో మొబైల్స్ శనివారం ప్రకటించింది. రూ. 10వేల విలువైన సెగ్మెంట్లో త్వరలోనే మూడు స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నామని వోటో ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి లక్షకుపైగా యూనిట్లను విక్రయించాలని భావిస్తున్నామని తెలిపింది. సరసమైన ధరల్లో అత్యంత విలువైన స్మార్ట్పోన్లతో ప్రముఖంగా నిలవాలనేది లక్ష్యమని వోటో ఇండియా సేల్స్ హెడ్ సంతోష్ సింగ్ చెప్పారు. అలాగే ఎయిర్టెల్, వోడాఫోన్ఐడియా, రిలయన్స్ జియో లాంటి టెలికాం మేజర్లతో భాగస్వామ్యాలను కుదర్చుకోవాలని కూడా యోచిస్తున్నట్టు చెప్పారు. -
ఇప్పుడు మేకప్ మచ్చీ
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అంటూ ఆర్టిస్టులతో యాక్ట్ చేయించే గౌతమ్ మీనన్ ఫర్ ఎ చేంజ్ మేకప్ వేసుకుంటున్నారు. స్టార్ట్ కెమెరా అనగానే కెమెరా ముందు నిలబడి డైలాగ్స్ చెప్పడానికి రెడీ అయ్యారు. దర్శకుడిగా గౌతమ్ ఇచ్చిన ‘ఘర్షణ, ఏ మాయ చేశావె, సాహసం శ్వాసగా సాగిపో’ ఇలా.. యాక్షన్ కమ్ లవ్ స్టోరీస్ను అద్భుతంగా చూపించారు గౌతమ్. ముఖ్యంగా ప్రేమ కథలకు సున్నితమైన భావోద్వేగాలతో క్లాసిక్ టచ్ ఇస్తూ తెరకెక్కించగలరనే పేరు ఉంది. నటుడిగా మాత్రం యాక్షన్ మూవీలో కనిపించనున్నారు. తాను దర్శకత్వం వహించే చిత్రాల్లో జస్ట్ ఒక్క సీన్లో అయినా కనిపించడం గౌతమ్ అలవాటు. ఆ మధ్య ‘గోలీసోడా 2’ చిత్రంలో పోలీసాఫీసర్గా కీలక పాత్ర చేశారు. ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారట. ‘జై’ అనే కొత్త దర్శకుడు ఇటీవల గౌతమ్ మీనన్ని కలిసి ఓ కథ వినిపించారట. ఆ కథ బాగా నచ్చడంతో హీరోగా నటించడానికి ఒప్పుకున్నారని కోలీవుడ్ టాక్. ‘నాచ్చియార్’ ఫేమ్ నాయిక ఇవానా ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించనున్నారట. ఈ నెల 15న ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారని సమాచారం. ఈ వార్త వినగానే గౌతమ్ ఫ్యాన్స్ ‘ఇప్ప మేకప్ మచ్చీ’ అనుకుంటున్నారు. అంటే.. ఇప్పుడు మేకప్ బావా అని అర్థం. -
అర్జున్ రెడ్డి తమ్ముడ్ని చూశారా?
టాలీవుడ్లో అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ సెట్ చేసిన మార్క్ అంతా ఇంతా కాదు. ఒక్క సినిమాతో లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించేసుకున్నాడు. ప్రస్తుతం సౌత్లో విజయ్ వన్ ఆఫ్ ది క్రేజీ స్టార్. అలాంటి విజయ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడన్న వార్త ఒకటి వైరల్ అవుతోంది. అదెవరో కాదు విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ. ప్రస్తుతం ఫిలిం క్రాఫ్ట్స్లో అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడన్నది ఆ కథనం సారాంశం. విజయ్కు బాగా క్లోజ్ అయిన ఓ బడా నిర్మాణ సంస్థ.. ఆనంద్ అరంగేట్రానికి సంబంధించిన బాధ్యతలను తీసుకుందంట. ప్రస్తుతం ఆనంద్ ఫిజికల్ ఫిట్నెస్ పనిలో పడ్డాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్లో కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ‘ఆనంద్ కూడా విజయ్లా రెబల్గా ఉంటాడా? లేదా అంతకన్నా వైల్డ్ గా ఉంటాడా? అతను సినిమాల్లోకి వచ్చే వార్త నిజమేనా?.. వస్తే అర్జున్ రెడ్డి తమ్ముడిగా ఆ అంచనాలను ఏ మేర అందుకుంటాడు?... ప్రస్తుతం ఆనంద్ను చూపిస్తూ విజయ్ ఫ్యామిలీ ఫోటో పాతది ఒకటి చక్కర్లు కొడుతోంది. -
అరంగేట్రంలో పృథ్వీ షా రికార్డు
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సోమవారం అరంగేట్రం చేసిన భారత్ అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీ షా అరుదైన రికార్డును నెలకొల్పారు. ఐపీఎల్లో ఓపెనర్గా అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కారు. సోమవారం నాటికి పృథ్వీ షా వయసు 18 సంవత్సరాల 165 రోజులు. అంతకుముందు రిషబ్ పంత్ (18 ఏళ్ల 212 రోజులు) ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున 2017లో ఐపీఎల్లో ఓపెనర్గా అరంగేట్రం చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో సోమవారం ఆడిన మ్యాచ్లో పృథ్వీ షా 10 బంతుల్లో 22 పరుగులు చేశారు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. -
లెమన్ ట్రీ డెబ్యూ అదిరింది
సాక్షి, ముంబై: ఆతిథ్య రంగ సంస్థ లెమన్ ట్రీ హోటల్స్ మొట్టమొదటి ట్రేడింగ్లో అదరగొట్టింది. మొట్టమొదటి ట్రేడింగ్లోనే లాభాల మోతమోగించింది. లిస్టింగ్లో 10 శాతం ప్రీమియాన్ని సాధించిన లెమన్ ట్రీ హోటల్స్ స్టాక్ ట్రేడింగ్ ఆద్యంతం జోరుగా సాగింది. ఇష్యూ ధర రూ. 56కాగా ఆరంభంలోనే 10శాతం దూసుకెళ్లింది. అనంతరం దాదాపు 32శాతానికి పైగా ఎగిసింది. చివరికి 28 శాతం లాభంతో 73.90వద్ద ముగిసింది. గత నెలాఖరున ఐపీవోకి వచ్చిన కంపెనీ దాదాపు రూ. 1039 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 311 కోట్లను సమీకరించింది. అయితే ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి అంతంత మాత్ర స్పందనే కనిపించింది. ఇష్యూకి 1.2 రెట్లు అధికంగా మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా లెమన్ ట్రీ 12.98 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 15.47 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్) కోటా 3.88 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్కాగా.. సంపన్న వర్గాలు, రిటైల్ విభాగాల నుంచి నామమాత్రంగా 0.12 శాతమే దరఖాస్తులు లభించాయి. కాగా మిడ్ రేంజ్లో దేశీయంగా అతిపెద్ద సంస్థ అయిన లెమన్ ట్రీ హోటల్స్ 28 పట్టణాలలో 45 హోటళ్లను నిర్వహిస్తోంది. లెమన్ ట్రీ ప్రీమియం, లెమన్ ట్రీ, రెడ్ ఫాక్స్ బ్రాండ్లతో ప్రీమియం, మధ్యస్థాయి, ఎకానమీ విభాగాల్లో మొత్తంగా 4,700 రూములను ఆఫర్ చేస్తోంది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 15శాతం నష్టం
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిస్టింగ్లో నష్టాలను మూటగట్టుకుంది. బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో లిస్టయ్యింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఇది 17 శాతం(రూ. 89) నష్టపోయి రూ. 431వద్ద ప్రారంభమైంది. చివరికి 15 శాతం నష్టంతో ముగిసింది. అయితే దీని ఈక్వీటీ షేరు ఇష్యూ ధర రూ. 520. కాగా ఇష్యూకి 78 శాతమే సబ్స్క్రిప్షన్ లభించింది. యాంకర్ విభాగంతో కలుపుకుంటే ఇష్యూ 88 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. యాంకర్ పోర్షన్తో కలిపి ఇష్యూ ద్వారా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ. 3500 కోట్లను సమీకరించింది. వెరసి ఇష్యూ పరిమాణాన్ని రూ. 4017 కోట్ల నుంచి రూ. 3500కు తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి పూర్తిస్థాయిలో(1 శాతం) బిడ్స్ దాఖలుకాగా.. సంపన్న వర్గాల కోటాలో స్వల్పంగా 33 శాతమే స్పందన కనిపించింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 88 శాతం దరఖాస్తులు లభించాయి. కంపెనీ 4.42 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 3.46 కోట్ల షేర్ల కోసం మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో 3.3 కోట్ల షేర్లను 28 సంస్థలకు కేటాయించింది. షేరుకి రూ. 520 ధరలో వీటిని జారీ చేయడం ద్వారా రూ. 1717 కోట్లను సమీకరించింది. -
అక్క కోసం మహేష్ మరో సాయం
సాక్షి, సినిమా : సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి డైరెక్టర్గా మారిన మంజుల ఘట్టమనేనికి టాలీవుడ్ ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ఆ వరుసలో ముందున్న సోదరుడు మహేష్ బాబు తన వంతుగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరై ‘అక్క.. సక్సెస్ కొట్టాలి’ అంటూ కోరుకున్నాడు. అయితే మహేష్ తన సాయాన్ని ఇక్కడితోనే సరిపెట్టలేదు. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్కు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. ‘ఐ లవ్ యూ టూ.. ఇప్పుడే కాదు. ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాను. నన్ను ప్రేమ అనోచ్చు.. ప్రకృతి అని కూడా అనొచ్చు. నువ్వు నన్ను ఎలాగైనా పిలవొచ్చు. ఎందుకంటే నీ చుట్టూ ఎటు చూసినా నేనే. ఆఖరికి నువ్వు కూడా నేనే. నువ్వు-నేనూ వేరు కాదు. నువ్వు ప్రేమ, నేనూ ప్రేమే. నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా నన్ను ఫీలవ్వటమే. నిన్ను నిద్ర లేపే పక్షి గొంతులో నేనున్నాను. చెట్టు పూల రంగులో నేనున్నాను. నువ్వు పీల్చే గాలిలో నీ ఊపిరినై నేనున్నాను. నీ ప్రతీ శ్వాస నేనే. ఐ యామ్ ఫీల్ యువర్ లవ్’ అంటూ మహేష్ వాయిస్ ఓవర్ ను అందించాడు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆనందీ ఆర్ట్స్, మంజుల సొంత బ్యానర్ ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాధన్ సంగీతం సమకూర్చాడు. ఫిబ్రవరి 16న మనసుకు నచ్చింది ప్రేక్షకుల ముందుకు రానుంది. #ManasukuNachindi #TrailerWithATwist @urstrulyMahesh https://t.co/seFdtwg60d — Manjula Ghattamaneni (@ManjulaOfficial) February 15, 2018 -
ముందు కోలీవుడ్కే వస్తా!
ముందుగా కోలీవుడ్కే వస్తానంటోంది రాజశేఖర్- జీవితల వారసురాలు శివానీ. ఈ అమ్మడు తల్లిదండ్రుల బాటలోనే నడవడానికి సిద్ధం అయ్యిందట. రాజశేఖర్, జీవిత తమ సినీ జీవితాన్ని కోలీవుడ్లో ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్లో రాణించారన్నది తెలిసిందే. వారి వారసురాలు శివానీ కూడా తన సినీ జీవితాన్ని కోలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించింది. రాజశేఖర్, జీవితలకు శివాని, శివాద్మి కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు శివాని. తల్లి జీవిత పలుకులను పుణికిపుచ్చుకున్న ఈ బ్యూటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అమ్మ, నాన్న సినిమాకు చెందిన వారు కావడంతో నాకూ సినిమా, నటన చిన్నతనం నుంచి పరిచయమే. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ పొందాను. సంగీతం అంటే చాలా ఆసక్తి. కీబోర్డ్, గిటార్, వీణ వాయిద్యాల్లో పరిచయం ఉంది. చెల్లెలు శివాద్మితో కలిసి యూట్యూబ్లో పాటలు పాడటం మాకు కాలక్షేపం. కిక్బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఇక ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. దానికి నేను అడిక్షన్ అనే చెప్పాలి. పుట్టింది తమిళనాడులో, పెరిగింది హైదరాబాద్లో బంధువులందరూ చెన్నైలోనే ఉన్నారు. వారితో తమిళంలోనే మాట్లాడతాను. ఎక్కువగా తమిళ చిత్రాలు చూస్తుంటాను. నటుడు ధనుష్ అంటే ఎంతిష్టమో. ఆయన నటించిన 3 చిత్రం చూసి ఎమోషన్తో ఏడ్చేశాను. నటుడు విశాల్ అంటే చాలా ఇష్టం.ఆయన చాలా మ్యాన్లీమెన్. ఇక విజయ్ సేతుపతి భలే యాక్టర్. అయినా నాకెప్పటికీ నాన్నే హీరో. ఎంబీబీఎస్ మూడో సంవత్సం చదువుతున్నాను. డాక్టర్ అయిన తరువాతే యాక్టర్ అవ్వమని అమ్మ, నాన్న అన్నారు.’ అంటూ శివాని చెప్పిన సంగతులు ఇవీ. -
పిట్ట కొంచెం..ఆట ఘనం
నేడు కూచిపూడి అరంగేట్రం చేయనున్న ఎనిమిదేళ్ల లక్ష్మీశృతి వయసు ఎనిమిదేళ్లు..ప్రదర్శనలు 45 రాజమహేంద్రవరం కల్చరల్ : ‘అచట పుట్టిన చిరుకొమ్మైన చేవ’...మహిష్మతీపురాన్ని గురించి అల్లసాని పెద్దన చేసిన వర్ణన పూర్తిగా రాజమహేంద్రవరానికి అన్వయిస్తుంది. 2008 ఫిబ్రవరి 25న జన్మించిన బేతాళ శ్రీసాయి ముత్యలక్ష్మీశృతి ఇప్పటి వరకు 45 నృత్య ప్రదర్శనలలో పాల్గొంది. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం రివర్బే హోటల్లో యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుమర్తి శేషుబాబు, కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, కళారత్న హంస అవార్డు గ్రహీత డి.రాజకుమార్ ఉడయార్, తదితర అతిరథ, మహారథుల మధ్య కూచిపూడి అరంగేట్రానికి ఈ చిన్నారి సిద్ధమవుతోంది. ఎల్కేజీలో చూసిన డాన్స్ ప్రేరణ ఇచ్చింది ఎల్కేజీ చదువుతుండగా ఆనం కళాకేంద్రంలో చూసిన ‘డాన్స్’పేరిట జరిగిన నృత్యప్రదర్శన చూసాక, నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తి లక్ష్మీశృతిలో చిగురించింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రలో కూచిపూడి నాట్యం నేర్చుకోసాగింది. తొలిసారిగా ఆనం కళాకేంద్రంలో ‘సంగీత నాట్యామృత సంభవం’ నృత్యరూపకంలో శ్రీకృష్ణునిగా నటించి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. విజయవాడ, హైదరాబాద్, కొత్తపేట తదితర నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. గోదావరి పుష్కరాల్లో నక్షత్రమాలికాచరిత్రం, శంకరవైభవం నృత్య రూపకాల్లో చక్కని అభినయనాన్ని ప్రదర్శించింది. అన్ని అంశాలలోను శిక్షణ పొందాక, ఆదివారం పూర్తిస్థాయి కూచిపూడి అరంగేట్రానికి లక్ష్మీశృతి సిద్ధమవుతోంది. ఎన్నో పురస్కారాలు..ప్రశంసలు శ్రీసద్గురు సన్నిధి, విశ్వం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీజ్ఞాన సరస్వతీ పీఠం, డ్రీమ్స్ కాన్సెప్ట్ స్కూల్ వేదికలపై లక్ష్మీశృతి నర్తించి, అవార్డులను అందుకుంది. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలు పోటీల్లో సైతం బహుమతులను గెలుచుకుంది. వృత్తిరీత్యా డాక్టరు కావాలని, ప్రవృత్తి రీత్యా కూచిపూడి నర్తకిగా ఎదగాలని ఈ చిన్నారి కోరుకొంటోంది. -
పేదలకు పూర్తిగా వైద్య సేవలు అందించాలి
-
జీఎన్ఏ యాక్సెల్స్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ
ముంబై: పంజాబ్ కు చెందిన జీఎన్ఏ యాక్సెల్స్ సోమవారం నాటి మార్కెట్లో దూసుకుపోతోంది. ఇటీవలి పబ్లిక్ ఇష్యూను ఘనంగా పూర్తిచేసుకున్న ఈ ఆటో విడిభాగాల సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలలో బ్లాక్ బ్లస్టర్ ఎంట్రీ ఇచ్చింది. 26 శాతం లాభాలతో మదుపర్లను ఆకట్టుకుంటోంది. దాదాపు 20 శాతం ప్రీమియంతో లిస్టయిన సంస్థ ఇష్యూ ధర రూ. 207. అయితే ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో రూ. 260 పైగా ఎగిసింది. జీఎన్ఏ యాక్సెల్స్ ఐపీవో లో 55 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ కావడంతో రూ. 130 కోట్లను సమీకరించింది. కంపెనీ ఆఫర్ చేసిన 44.7 లక్షల షేర్లకుగాను 24.53 కోట్ల బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్) విభాగంలో 17.18 రెట్లు, సంపన్నవర్గాల కోటాలో 217 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ విభాగంలో సైతం దాదాపు 12 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. మరోవైపు ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కూడా దాదాపు రూ. 38 కోట్లను సమీకరించింది. ప్రధానంగా ఫోర్ వీలర్స్ కు వెనుక భాగంలో బిగించే(రియర్) యాక్సిల్ షాఫ్ట్లను తయారు చేస్తుంది. కాగా ఈ ఐపీవో ద్వారా సమకూరిన ఆదాయాన్ని ప్లాంట్, యంత్రాల కొనుగోలుకు, వర్కింగ్ క్యాపిటల్, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం సంస్థ వినియోగించనుంది. -
తొలి టెస్ట్మ్యాచ్కు వైఎస్ఆర్ స్టేడియం రెడీ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం సిద్ధమౌతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని హంగులతో స్టేడియం సిద్ధమెనా నేటికి ఆ కల నేరవేరనుంది. నవంబర్ 15వ తేదీన ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఆతి«థ్యజట్టు భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఈ స్టేడియంలో ఆడేందుకు విశాఖ చేరుకోనున్నాయి. సిరీస్లో భాగంగా భారత్ పర్యటిస్తున్న ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ను ఇక్కడ ఆడనుంది. నవంబర్ 17నుంచి ఐదు రోజుల పాటు ఈ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15 ఉదయం ప్రత్యేక విమానంలో ఇరుజట్ల ఆటగాళ్లు విశాఖ చేరుకోనుండగా...సాయంత్రం స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు. జాతీయ జట్టులో ఆర్హత సాధించేందుకు ఎంపికగా జరిగే డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్లతో పాటు ఐపిఎల్, టీ20, వన్డే అంతర్జాతీయ మ్యాచ్లకు వైఎస్ఆర్ స్టేడియం ఇప్పటికే వేదికగా నిలిచి... మ్యాచ్లను విజయవంతంగా ముగించింది. ఒక్క టెస్ట్ మ్యాచూ జరగలేదనే విశాఖ క్రీడాభిమానుల చింతను దూరం చేస్తూ ఆహ్వానజట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి బందం విశాఖలోని స్టేడియాన్ని శుక్రవారం పరిశీలించింది. స్టేడియంలో పిచ్లను నిశితంగా పరిశీలించింది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లకు టెస్ట్ మ్యాచ్ భిన్నం. పిచ్లు సయితం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి. వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని బందంలోని సభ్యులు జాన్ డొనాల్డ్, ఆంధోని ఈథర్, రినాల్డ్ కై ్లడ్ నిశితంగా పరిశీలించారు. ఔట్ ఫీల్డ్, డ్రై నేజీ వ్యవçస్థలతో పాటు ప్రాక్టీస్ చేసుకునే నెట్స్ను పరిశీలించారు. అటగాళ్లకు భద్రతా విషయాలను ఏసిఏ ప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు. ఏసిఏ అధ్యక్షుడు సోమయాజులు, ఉపాధ్యక్షుడు జిజెజె రాజు, సంయుక్త కార్యదర్శి అరుణ్కుమార్, ఏసిఏ మీడియా మేనేజర్ మోహన్ తదితరులు ఇంగ్లాండ్ బందానికి స్టేడియంలోని వసతుల్ని వివరించారు. -
బాలీవుడ్ ఎంట్రీకి మహేష్ రెడీ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలో దీనిపై మహేష్ భార్య నమ్రత మాట్లాడుతూ.. బాలీవుడ్లో అడుగుబెట్టడానికి మహేష్ సిద్ధంగా ఉన్నారని మంచి కథ కుదిరితే త్వరలోనే హిందీలో నటిస్తారని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే మహేష్ మాట్లాడే హిందీ కూడా బాగుంటుందని నమ్రత కితాబిచ్చింది. ఇటీవల మహేష్ బాబు ముంబైలో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతని మిత్రులతో కలిసి ఏర్పాటుచేసిన వెంచర్లో రూ. 25 కోట్లతో మహేష్ ఈ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ ఎంట్రీని దృష్టిలో ఉంచుకొనే మహేష్ ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారని, త్వరలోనే మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఉండొచ్చని ఫిల్మ్నగర్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఇప్పట్లో ఆ ఆలోచన లేదు
తన కూతురు జాహ్నవి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందంటూ వస్తున్న వార్తలను సీనియర్ నటి శ్రీదేవి ఖండించింది. కొద్ది రోజులుగా జాహ్నవి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో జాహ్నవి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని, ఆ సినిమాను బాహుబలి, భజరంగీ భాయ్జాన్ సినిమాల కథా రచయిత విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేయనున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను శ్రీదేవి ఖండించింది. ఇటీవల గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన జాహ్నవి, ప్రస్తుతానికి చదువు మీదే దృష్టిపెట్టిందని ఇప్పట్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని తెలిపింది. ఇప్పటి వరకు తన కూతుళ్ల ఎంట్రీ పై ఆలోచన చేయలేదన్న శ్రీదేవి, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంది. శ్రీదేవి లీడ్ రోల్ లో నటించిన సౌత్ సినిమా పులి అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు. -
హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బన్నీ..?
-
మరో హీరో కొడుకు ఎంట్రీ...
తెలుగు తెరకు మరో నట వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ ప్రిన్స్ మహేష్ బాబు, నాన్న హీరో సుధీర్ బాబు నుంచి నట వారసత్వాన్ని అంది పుచ్చుకుని ఈ బుల్లి నటుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో సుధీర్ బాబు తన పెద్ద కొడుకు చరిత్ మానస్ను వెండితెరకు పరిచయం చేశారు. తన తాజా చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రంలో ఓ చిన్న పాత్రలో చరిత్ నటించినట్లు హీరో సుధీర్ బాబు వెల్లడించారు. క్రైమ్, కామోడీతో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే చరిత్ నటించిన విషయాన్ని సుధీర్ బాబు సినిమా రిలీజ్ అయ్యేవరకూ గోప్యంగా ఉంచటం విశేషం. 'చరిత్ మాసన్కు సినిమాలంటే చాలా ఇంట్రస్ట్, మావాడు చేసే జిమ్నాస్టిక్స్లో కొన్నింటిని నేను కూడా చేయలేను. మామయ్య మహేష్ బాబు సినిమాలో సాంగ్స్కు మూడు, నాలుగు గంటల పాటు అలిసిపోకుండా డాన్స్ కూడా చేస్తారు. ఇక స్కూల్లో అన్నింటిలోనూ ఫస్టే' అని కొడుకు గురించి చెబుతూ సుధీర్ బాబు మురిసిపోతున్నారు. లక్ష్మీనరసింహా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందిన మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో సుధీర్ బాబుకు జంటగా నందిని నటించింది. కాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. -
అమల క్లాప్, నాగ్ స్విచ్ఛాన్..అఖిల్ ఎంట్రీ..
హైదరాబాద్ : తెలుగు చిత్రసీమకు మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అఖిల్ సోలో హీరోగా ఎంట్రీ ఎప్పుడా అని గతకొద్ది రోజులుగా అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే . 'సిసింద్రీ'గా... ప్రేక్షకులకు పరిచయం అయిన అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అక్కినేని అమల క్లాప్ ఇవ్వగా...నాగార్జున స్విచ్ ఆన్ చేశారు. అయితే ఈ కార్యక్రమం కేవలం కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఖిల్ బుధవారం ట్విట్ చేశాడు. హీరో నితిన్, తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి శ్రీ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే టైటన్ వాచెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అఖిల్ పెప్సికో కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైనా 'మౌంటైన్ డ్యూ' డ్రింక్ కోసం తాజాగా యాడ్ చేశాడు. దాంతో సినిమాల్లోకి రాకముందే అఖిల్ తన మార్క్ చూపించుకుంటున్నాడు. ఈ చిత్రంపై దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ...'అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సినిమా స్క్రిప్టును పూజలో ఉంచాం. ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాథోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం. అభిమానులు కోరుకునే మాస్, మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి. అఖిల్లో మంచి నటుడు ఉన్నాడు' అని అన్నారు. -
అమల క్లాప్, నాగ్ స్విచ్ఛాన్..అఖిల్ ఎంట్రీ.
-
అఖిల్కు తల్లిగా నటించనున్న నదియా?