died heart attack
-
తల్లి చితికి నిప్పంటిస్తూ.. గుండెపోటుతో కుమారుని మృతి
ఒక్కోసారి మృతికి సంబంధించిన కొన్ని ఘటనలు రెండింతల విషాదాన్ని పంచుతాయి. ఒకేసమయంలో కుటుంబసభ్యులిద్దరు మృతి చెందడాన్ని ఎవరూ తట్టుకోలేరు. కన్నీరు పెట్టుకుంటారు. ఇటువంటి ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. తన తల్లి చితికి నిప్పుపెడుతున్న ఒక కుమారుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ, ఉన్నట్టుండి కింద పడిపోయాడు. చుట్టూ ఉన్నవారు అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే అతను మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన హర్యానాలోని గురుగ్రామ్లోగల సోహ్నాలో చోటుచేసుకుంది. తల్లీ కొడుకులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందడం స్థానికులకు త్రీవ విషాదాన్ని పంచింది. ఈ ఘటనల అనంతరం బంధువులు తొలుత తల్లికి ఆ తర్వాత కుమారునికి అంత్యక్రియలు నిర్వహించారు.సోహ్నా పఠాన్ వాడా నివాసి ధరమ్ దేవి (92) వయోభారంతో మృతి చెందారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమె కుమారుడు సతీష్ (69) తల్లి చితికి నిప్పు పెడుతున్న సమయంలో ఛాతీ నొప్పికి లోనయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సతీష్ను పరిశీలించి, మృతిచెందినట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే ధరమ్ దేవి భర్త మరణించారు. తల్లీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇది కూడా చదవండి: మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్గా ఉంటూ.. -
పంట చేనులో అయ్యప్ప మాలధారుడి మృతి
భైంసాటౌన్(నిర్మల్): పంట చేనులో పనిచేస్తుండగా ఓ అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి అనుకోకుండా అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా కుప్పకూలాడు. అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. సాయినాథ్ (38) అనే వ్యక్తి ఇటీవల అయ్యప్ప మాల వేయగా, శనివారం గ్రామంలోని పంట చేనులో పనిచేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా చేనులోనే కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
వనపర్తి: జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన గ్రా మస్థాయి సీఎం క్రీడా పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థి వాలీబాల్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పామిరెడ్డిపల్లి ముందరితండాకు చెందిన సాయి పునీత్ (15) బలిజపల్లి జెడ్పీ హైసూ్కల్లో చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి ఉదయం నుంచి క్రీడాపోటీల్లో పాల్గొన్నాడు.పాఠశాల ఆవరణలో ఉదయం ఒకసారి కళ్లుతిరిగి పడిపోగా.. నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తల్లి నీలమ్మ అక్కడికి చేరుకుంది. అయితే తనకు ఏమీ కాలేదని.. తల్లిని ఇంటికి వెళ్లమని పునీత్ చెప్పటంతో ఆమె ఇంటికి వెళ్లిపోయింది. మళ్లీ క్రీడల్లో పాల్గొన్న పునీత్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.నిర్వాహకులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. కాగా.. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు జిల్లా కేంద్రంతో పాటు బలిజపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు. -
స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
సాక్షి,కర్నూల్ : పచ్చని పందిట్లో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు స్నేహితుడి పెళ్లిలో సంతోషంగా గడిపిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తుండగా గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న వంశీ .. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో తన స్నేహితుడి పెళ్లికి వచ్చాడు. స్నేహితుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులకు కానుక ఇచ్చేందుకు పెళ్లి వేదికపైకి ఎక్కాడు. తన స్నేహితులతో కలిసి ఓ గిఫ్ట్ను వధూవరులకు అందించి పక్కనే నిలబడ్డాడు. స్నేహితుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ ప్యాక్ను వధూవరులు ఓపెన్ చేస్తుండగా..వంశీ అస్వస్థతకు గురయ్యాడు.వెంటనే అతన్ని పక్కకి తీసుకెళ్లే లోపే స్టేజిపైనే కుప్పకూలాడు.దీంతో అప్రమత్తమైన తోటి స్నేహితులు అత్యవసర చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీని పరీక్షించిన వైద్యులు అతడి అప్పటికే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి వివాహా వేడుకలో గుండెపోటుతో యువకుడు మృతికర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు గురైన వంశీ అనే యువకుడు.వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తోటి స్నేహితులు.. కానీ అప్పటికే గుండెపోటుతో… pic.twitter.com/Ve1Epmf1fI— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
ఆడే వయసులో ఆగిన గుండె
చెన్నూర్: ఆడుతూ పాడుతూ తిరుగుతున్న ఆ బాలికను అకస్మాత్తుగా మృత్యువు కబళించింది. గుండెపోటు రూపంలో ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనగర్ కాలనీకి చెందిన కస్తూరి శ్రీనివాస్, రమాదేవి దంపతులకు ఓ కూతురు, కుమారుడు. కూతురు నివృతి (12) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో కుటుంబ సభ్యులు ఆ సందడిలో ఉన్నారు. నివృతి ఆలయానికి వెళ్లేందుకు సి ద్ధం అవుతోన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెపోటుతో మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ‘కార్తీక దీపాలు వెలిగించే ఇంట్లో దీపం లేకుండా చేశావా తల్లీ’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
గుండెపోటుతో కుంభకర్ణ పాత్రధారి మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నేపధ్యంలో అక్కడక్కడా విషాదకర ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.దేశ రాజధానిలోని చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో వేదికపై రామలీలను ప్రదర్శిస్తుండగా విషాదం చోటుచేసుకుంది. రావణుని సోదరుడు కుంభకర్ణుని పాత్రను పోషిస్తున్న 60 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు.ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ నివాసి విక్రమ్ తనేజా రామ్లీలలో కుంభకర్ణుడి పాత్రను పోషిస్తున్నాడు. వేదికపై ఆయన తన పాత్ర పోషిస్తుండగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే అతనిని పీఎస్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తనేజా మృతి చెందినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి -
వేదికపై గుండెపోటుతో ‘రామలీల’ రాముడు మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్తరాదిన నవరాత్రి వేడుకల్లో ‘రామలీల’ను ప్రదర్శిస్తుంటారు. రాజధాని ఢిల్లీలోని ఒక ప్రాంతంలో ‘రామలీల’ ప్రదర్శిస్తుండగా వేదికపై విషాదం చోటుచేసుకుంది.ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని విశ్వకర్మ నగర్లో వేదికపై రామలీల ప్రదర్శిస్తుండగా రాముడి పాత్ర పోషిస్తున్న ఓ కళాకారుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. రాముని పాత్ర పోషిస్తున్న నటుని పేరు సుశీల్ కౌశిక్(45) ఆయన స్టేజ్పై రాముని పాత్రలో డైలాగులు చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో, అతనితో పాటు ఇతర కళాకారులు కూడా వేదికపై ఉండటాన్ని చూడవచ్చు. ఇంతలో అకస్మాత్తుగా సుశీల్ తన గుండెపై చేయి వేసుకుని స్టేజి వెనుక వైపు వెళ్లడం కనిపిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేదికపై రాముని పాత్రధారి సుశీల్కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుశీల్ మృతిచెందాడు. సుశీల్ కౌశిక్ వృత్తిరీత్యా ప్రాపర్టీ డీలర్ అని తెలుస్తోంది. दिल्ली: शाहदरा में रामलीला में राम का किरदार निभाने वाले शख्स की हार्ट अटैक से मौत । सुशील कुमार रामलीला में राम का किरदार निभा रहे थे, प्रोग्राम के दौरान ही हार्ट अटैक आया और मौत हो गई। उनकी उम्र करीब 45 साल है।सुशील कौशिक एक प्रॉपर्टी डीलर थे#HeartAttack @hyderabaddoctor pic.twitter.com/nQIwBXkAF9— Shalu Awasthi شالو اوستھی (@Shalu_official) October 6, 2024ఇది కూడా చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..! -
ఆఫీసుల్లోనే ఆగిపోతున్న గుండెలు.. మరో టెకీ మృతి
మహారాష్ట్రలోని నాగ్పూర్లోని ప్రముఖ ఐటీ కంపెనీ కార్యాలయంలోని వాష్రూమ్లో ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని, మృతుడిని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ (40) గా గుర్తించామని పోలీసులు తెలిపారు.శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని వాష్రూమ్కి వెళ్లిన మైఖేల్ ఎంతకీ బయటకు రాలేదని, సోనెగావ్ పోలీస్ స్టేషన్కు చెందిన అధికారి తెలిపారు. అతని సహచరులు వెంటనే అతనిని నాగ్పూర్లోని ఎయిమ్స్కు తరలించగా పరశీలించిన వైద్యులు అతను మృతిచెందినట్లు ప్రకటించారు.సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక శవపరీక్షలో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మైఖేల్కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసింది.ఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లక్నోలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వక్ఫ్ బోర్డును రద్దు చేయాలంటూ ర్యాలీ
హమీర్పూర్: హిమాచల్ ప్రదేశ్లోని సంజౌలీలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని కోరుతూ దేవభూమి సంఘర్ష్ సమితి హమీర్పూర్లో నిరసన ర్యాలీ చేపట్టింది. దీనిలో పాల్గొన్న 46 ఏళ్ల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సభ్యుడొకరు గుండెపోటుతో కన్నుమూశారు. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. దేవభూమి సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సిమ్లా, హమీర్పూర్, మండీ, చంబా, నహాన్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. హమీర్పూర్లో ఆందోళనకారులు అధికారులకు మెమోరాండం సమర్పించడానికి వెళ్తుండగా, వీహెచ్పీ కార్యకర్త వరిందర్ పర్మార్ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని వెంటనే పోలీసు వాహనంలో హమీర్పూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతను మృతిచెందాడని తెలిపారు.నిరసన ప్రదర్శనలో పాల్గొన్న దేవభూమి సంఘర్ష్ సమితి కమిటీ కో-కన్వీనర్ మదన్ ఠాకూర్ మాట్లాడుతూ, వివాదాస్పద మసీదుపై అక్టోబర్ ఐదు వరకూ కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తామని, ఆ తరువాత భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామన్నారు. అక్టోబర్ ఐదు తర్వాత జైల్ భరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తమపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన ఏఐఎంఐఎం నేత షోయబ్ జమైపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి -
గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి
ఉత్తరప్రదేశ్ లక్నోలో విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో 19 ఏళ్ల విద్యార్థిని మరణించింది. అనికా రస్తోగి రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థిని. హాస్టల్లో ఉండి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హాస్టల్ రూమ్లో గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఉదయం హాస్టల్ రూంలో నిద్రిస్తున్న అనికాతో మాట్లాడేందుకు ఆమె స్నేహితురాలు వెళ్లింది. అయితే ఆపస్మారక స్థితిలో ఉండడం గమనించింది. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు పోటీసులు ప్రకటించారు.మూడవ సంవత్సరం బీఏ ఎల్ఎల్బీ చదువుతున్న రస్తోగి తండ్రి మహారాష్ట్ర కేడర్కు చెందిన 1998 ఐపీఎస్ అధికారి సంజయ్ రస్తోగి. ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణించినట్లు సంజయ్ రస్తోగికి పోలీసులు సమాచారం అందించారు. -
గుండెపోటుతో బ్యాంక్లోనే కుప్పకూలిన ఉద్యోగి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సడెన్ హార్ట్ ఎటాక్లు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మరణాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా మరో 30 ఏళ్ల యువకుడు ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగుచూసింది.మహోబాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో 30 ఏళ్ల అగి జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తన ల్యాప్ టాప్లో పనిచేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన కుర్చీపై కుప్పకూలిపోయాడు. పక్కన కూర్చున్న అతని సహచరులు ఇతరులను అప్రమత్తం చేసి, అతన్ని అతని డెస్క్ నుండి బహిరంగ ప్రదేశంలోకి మార్చారు. వారు అతని ముఖం మీద నీరు చల్లి, మేల్కొలిపే ప్రయత్నం చేశారు. యువకుడికి సీపీఆర్ ఇచ్చేందుకు సైతం యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే యువకుడు బ్యాంక్లో కుప్పకూలిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.खौफनाक...लैपटॉप पर काम करते करते कुर्सी पर ही HDFC Bank मैनेजर की मौत हो गई।38 साल उम्र थी। कुछ सेकंड पहले तक कीबोर्ड पर हाथ चला रहे थे। अगले पल कुर्सी पर ही जान निकल गई।यूपी के महोबा ब्रांच में थे।#mahoba#covidvaccines #covid #heartattack #hdfc #uttarpradesh pic.twitter.com/xXuw9Ndhnu— Sunil Yadav B+ (@sunilyadav21) June 26, 2024 -
చోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ మృతి
అండర్ వరల్డ్ డాన్ ఛోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ అలియాస్ ఆరిఫ్ భాయిజాన్ ముంబైలో గుండెపోటుతో మృతి చెందాడు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయిన ఆరిఫ్ షేక్.. ఛోటా షకీల్కు బావ వరుస అవుతాడు.ప్రస్తుతం ఆరిఫ్ ఆర్థర్ రోడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ముంబైలోని జెజె ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరీఫ్ మృతి చెందాడు.అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరుడు ఛోటా షకీల్కు ఆరిఫ్ సహాయం అందించాడనే ఆరోపణలున్నాయి. 61 ఏళ్ల ఆరిఫ్ షేక్ను 2022 మేలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గత రెండేళ్లుగా ఆర్థర్ రోడ్ జైలులో ఆరిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి కారణంగా ఆరిఫ్ షేక్ను జూన్ 21న ఆస్పత్రికి తరలించారు. ఆరీఫ్కు ఇద్దరు సంతానం అని తెలుస్తోంది. -
ప్రముఖుల దిగ్భ్రాంతి
రామోజీరావు మరణంతో దేశం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన ఈనాడు దినపత్రిక, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను నెలకొల్పిన వినూత్న వ్యాపారవేత్త. సమాజ హితంపై ఆయనకు ఉన్న దృష్టి కారణంగా పద్మ విభూషణ్ వరించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి ప్రకటిస్తున్నాను. – ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి⇒ రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రామోజీరావు కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. –నరేంద్ర మోదీ, ప్రధాని⇒ భారతీయ మీడియా పరిశ్రమలో అగ్రగామిగా నిలిచిన పద్మవిభూషణ్ రామోజీరావు మృతికి నా సంతాపం. జర్నలిజం, సినిమా, వినోదానికి ఆయన చేసిన కృషి మీడియా ల్యాండ్స్కేప్ను మార్చింది. – రాహుల్గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత⇒ మీడియా, వినోద రంగాల్లో ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. –ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ⇒ భారతీయ మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన దిగ్గజం రామోజీరావు. తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు, నిజాయితీని పెంపొందించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తీరని లోటు: రేవంత్రెడ్డి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని పేర్కొన్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో జరిగిన సమావేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.తెలుగు వారి కీర్తిని చాటిన వ్యక్తి: చంద్రబాబురామోజీ మరణవార్త తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి ఫిలింసిటీకి వెళ్లి రామోజీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో బాబు మాట్లాడుతూ, రామోజీరావును యుగపురుషుడిగా అభివర్ణించారు. నిత్యం సమాజహితం కోసం, తెలుగుజాతి కోసం పనిచేసిన వ్యక్తి రామోజీ అని, సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణ వ్యక్తిగా ఎదిగారని, తెలుగువారి కీర్తిని దశదిశలా చాటారని అన్నారు. కేసీఆర్ సంతాపం...రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్రెడ్డిలతో కలిసి ఫిలింసిటీలో రామోజీరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.⇒ రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారు. నేను మాత్రం ఆయనలో చిన్న పిల్లాడిని చూశాను. ఆయనకు పెన్నులంటే ఇష్టం. ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఒక పెన్ను బహూకరిస్తే దాన్ని చూసి ఆయన మురిసిపోయారు. – చిరంజీవి⇒ ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నా. కానీ, ఇంతలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి. – పవన్ కళ్యాణ్ప్రముఖుల సంతాపం..రామోజీకి నివాళులు అర్పించిన వారిలో బీజేపీ అగ్రనేతలు రాజ్నాథ్సింగ్, అమిత్షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రులు హరీశ్రావు, కడియం శ్రీహరి, పువ్వాడ అజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వరరెడ్డి, సినీనటులు నాగార్జున, వెంకటేశ్, మోహన్బాబు, రాజేంద్రప్రసాద్, కళ్యాణ్రామ్, నరేష్, కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్, బోయపాటి శ్రీను, రాజమౌళి, కీరవాణి, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఇళయరాజా, మంచు విష్ణు, విజయేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్ -
పెదపారుపూడి టు ఫిలింసిటీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. పరస్పరం భిన్నమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధించారు. యాడ్ ఏజెన్సీలో పనిచేయడం మొదలుపెట్టి.. ఎరువుల వ్యాపారం, చిట్ఫండ్స్, పచ్చళ్లు, మీడియా వంటి ఎన్నో రంగాలకు విస్తరించారు. రామోజీరావు ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16న జని్మంచారు. ఆయన తండ్రి వెంకట సుబ్బారావు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. పెదపారుపూడి, గుడివాడలలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ) గుడివాడలోనే పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో రామోజీరావుకు వివాహం జరిగింది. మొదట యాడ్ ఏజెన్సీలో చేరి..: బీఎస్సీ పూర్తిచేసిన రామోజీరావు.. తన కుటుంబం చేసే వ్యవసాయానికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అడ్వర్టైజింగ్ రంగం వైపు ఆసక్తి కలగడంతో.. ఢిల్లీ వెళ్లి ఓ అడ్వరై్టజింగ్ ఏజెన్సీలో చేరారు. అక్కడ మూడేళ్లు పనిచేశాక హైదరాబాద్కు వచ్చారు. 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థను, 1965లో కిరణ్ యాడ్స్ పేరిట అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. తర్వాత ఇతర వ్యాపారాలవైపు దృష్టి సారించారు. 1967–1969 మధ్య వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే వ్యవసాయ సమాచారంతో కూడిన అన్నదాత పత్రికను ప్రారంభించారు.1970లో ఇమేజెస్ ఔట్డోర్ యాడ్ ఏజెన్సీని, విశాఖలో డాలి్ఫన్ హోటల్ను ప్రారంభించారు. అప్పటికే పత్రికారంగంపై ఆసక్తి ఉన్న ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికకు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్తలకు ప్రాధాన్యమివ్వటం, గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వేగంగా పంపిణీ చేయడం ద్వారా పత్రికను పాఠకులకు చేరువ చేశారు. ఎల్రక్టానిక్ మీడియాతోనూ..: పాత్రికేయ రంగంలో మార్పులను ముందుగానే గుర్తించిన రామోజీరావు.. మొదట్లో వినోదం ప్రధానాంశంగా ఈటీవీ చానల్ను ప్రారంభించారు. తర్వాత పూర్తి న్యూస్ చానల్ ఈటీవీ2ను ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ, తెలంగాణలకు విడివిడి న్యూస్ చానళ్లను ఏర్పాటు చేశారు. ఇక ‘ప్రియ’పేరిట రామోజీ ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం కూడా సక్సెస్ అయింది. వివిధ రంగాల్లో రామోజీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్తో సత్కరించింది. రామయ్య నుంచి రామోజీగా మార్చుకుని..: రామోజీరావు తాత పేరు రామయ్య. ఆయన వ్యవసాయం చేసేవారు. రామోజీ జని్మంచడానికి కొన్నిరోజుల ముందు రామయ్య మరణించారు. దీంతో తాత పేరే మనవడికి పెట్టారు. కానీ రామయ్య అనే పేరు పాతదిగా అనిపించడంతో.. ఆయన తన పేరును రామోజీగా మార్చుకున్నారని చెబుతారు. తెల్ల వ్రస్తాలంటే మక్కువ..: రామోజీరావు ఎప్పుడు చూసినా తెలుపు రంగు వస్త్రధారణతోనే కనిపిస్తారు. ఆయనకు తెలుపు రంగు వ్రస్తాలంటే ప్రత్యేక మక్కువే దీనికి కారణమని చెబుతారు. వదులుగా ఉండే తెలుపు రంగు హాఫ్హ్యాండ్స్ షర్టు, అదే రంగు ప్యాంటు, మ్యాచింగ్గా తెలుపు రంగు షూస్ ధరించేవారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడూ తెలుపు వస్త్రధారణతో ఉండేవారు.పత్రికారంగానికి ఎనలేని సేవలందించారురామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందివైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ‘తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో శనివారం పోస్టు చేశారు. -
రామోజీ కన్నుమూత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త, రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీని కుటుంబ సభ్యులు నానక్రాంగూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. గుండె పనితీరు దెబ్బతిన్నదని, బీపీ పడిపోయిందని గుర్తించిన వైద్యులు.. ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. యాంజియోగ్రామ్ చేసి గుండె నాళాల్లో స్టంట్ వేశారు. అయినా ఆయన కోలుకోలేదు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించి.. శనివారం తెల్లవారుజామున 4.51గంట లకు తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 7.45 గంటలకు రామోజీ ఫిలింసిటీకి తెచ్చారు. రామోజీ మరణ వార్త తెలిసి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఫిలింసిటీలో రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిలింసిటీలోని నాగన్పల్లి–అనాజ్పూర్ గ్రామాల మధ్యలో ప్రత్యేకంగా నిర్మించిన స్మృతివనంలో రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఫోన్లో మాట్లాడి ఈ మేరకు సూచనలు చేశారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. బతికుండగానే రామోజీ స్మృతివనం ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీరావు తాను బతికి ఉండగానే ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లి–అనాజ్పూర్ మధ్యలో ప్రత్యేక స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆయన అంత్యక్రియలను ఈ స్మృతివనంలోనే నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి శనివారం స్మృతి వనాన్ని పరిశీలించి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేయించారు. -
వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేక ఆగిన మరో గుండె
ఎస్.రాయవరం (అనకాపల్లి జిల్లా): వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ఓటమిని తట్టుకోలేక అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం వెంకటాపురానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రమణ(49) మనస్తాపంతో నిద్రాహారాలు మానివేశాడు.అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటివద్ద గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతదేహాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
క్రికెట్ ఆడుతూ.. యువకుడి విషాదం!
నిజామాబాద్: క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు ఆట మధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలిన ఘటన నగరంలోని వినాయక్నగర్లో ఉన్న అమ్మవెంచర్లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.నగరంలోని గౌతమ్నగర్కు చెందిన విజయ్(30) తన స్నేహితులతో కలిసి అమ్మవెంచర్లో ఉన్న క్రికెట్ మైదానానికి వచ్చాడు. అక్కడ క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్నేహితులు వెంటనే జీజీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.విజయ్ మృతితో కుటుంబీకులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ విషయమై నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్కు వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.ఇవి చదవండి: Low blood pressure : ఈ చిట్కాలను పాటిస్తే మేలు! -
మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
కైకలూరు: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి (74) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్లో ఉంటున్న ఆమె సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరు ఆమె స్వగ్రామం. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 1983లో టీడీపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన పిన్నమనేని కోటేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి ముదినేపల్లి నుంచి 1985లో కోనేరు రంగారావుపై విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 19 89లో ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం కల్పించారు.ఆ సమయంలో పరీక్ష పేపర్ లీక్ అంశం వివాదాస్పదమైంది. యెర్నేని సీతాదేవి మంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఇన్స్టెంట్, బెటర్మెంట్ పరీక్షలు ప్రవేశపెట్టారు. 1994లో పిన్నమనేని కోటేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వరరావుపై పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత జిల్లా ల పునరి్వభజనలో భాగంగా ముదినేపల్లి నియోజకవర్గం రద్దయి.. కైకలూరు నియోజకవర్గంలో కలి సింది.సీతాదేవి టీటీడీ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. 2013లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహి ళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా బా ధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయ మిల్క్ డెయిరీ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. సీతాదేవి భర్త యెర్నేని నాగేంద్రనాథ్ (చిట్టిబాబు) రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గతేడాది అనారోగ్యంతో మరణించారు. సీతాదేవి పార్థివదేహాన్ని సొంతూ రు కొండూరుకు తీసుకొచ్చారు.పలువురు నేతలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. -
బీజేపీ ఎంపీ మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్వీర్ డైలర్ బుధవారం(ఏప్రిల్24)గుండె పోటుతో మరణించారు. డైలర్కు ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు.2017లో ఎమ్మెల్యేగా గెలిచిన డైలర్ తర్వాత 2019లో ఎంపీగా గెలిచి పార్లమెంట్కు వెళ్లారు. డైలర్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. -
శాంతి స్వరూప్ కన్నుమూత
రామంతాపూర్, సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రచార సాధనమైన దూర దర్శన్ చానల్లో తొలి తెలుగు యాంకర్గా ప్రసి ద్ధులు, తెలుగు ప్రజలకు తన కంచు కంఠంతో వార్తలు చెప్పిన జయంత్ శాంతి స్వరూప్ (74) కన్నుమూశారు. శుక్రవా రం ఉదయం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ దూరదర్శన్ సీనియర్ యాంకర్ రోజా రాణిని వివాహమాడారు. ఆమె కొన్ని సంవత్స రాల క్రితమే చనిపోయారు. శాంతి స్వరూప్కు ఇద్దరు కుమారులు మేగాన్‡్ష, అగ్నేయ. 1978లో దూరదర్శన్ కేంద్రంలో యాంకర్గా చేరిన ఆయన 1983 నుంచి తెలుగులో వార్తలు చదవ డం మొదలుపెట్టారు. 2011లో పదవీ విరమణ చేశారు. టెలిప్రాంప్టర్ర్ లేని రోజుల్లోనే వార్తలను ముందుగానే మననం చేసుకుని తెర ముందు పొల్లు పోకుండా తప్పులు లేకుండా అనర్గళంగా చదివి తెలుగు ప్రజలకు వార్తలు అందించారు. శాంతి స్వరూప్కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవా ర్డుతో పాటు పలు సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. భూపాల్ గ్యాస్ దుర్ఘటన కవ రేజ్ను వీక్షకులకు కళ్ళకు కట్టినట్లుగా అందించిన ఆయన రాతి మేఘం, క్రికెట్ మీద క్రేజ్, అర్ధాగ్ని అనే నవలలు కూడా రాశారు. ఆయన పార్ధివ దేహాన్ని రామంతాపూర్ టీవీ కాలనీలోని స్వగృహానికి తరలించి అక్కడి నుంచి అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంచుకంఠం మూగబోయిందనీ, తొలితరం న్యూస్ రీడర్గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మృతి బాధాకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంతాపాన్ని ప్రకటించారు. శాంతి స్వరూప్ సేవలు చిరస్మరణీయం తెలుగులో వార్తలు చదివిన తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సంతాపం ప్రకటించా రు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడి యా రంగంలో చిరస్మరణీయమని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థించారు. శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యూస్రీడర్గా తనదైన ముద్ర శాంతి స్వరూప్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్త లను చదివే తొలితరం న్యూస్ రీడర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన శాంతి స్వరూప్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వర్రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఎ.రామలింగేశ్వర్రావు గుండె పోటు తో కన్ను మూశారు. జర్మనీలో ఉన్న కూతురును చూడడానికి వెళ్లగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రామలింగేశ్వర్రావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1956, మే 21న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు. ఉస్మానియా నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఆయన 1982లో న్యాయవాదిగా నమోదు చేసుకు న్నారు. 1984లో జస్టిస్ ఏ.వెంకట్రామిరెడ్డి వద్ద జూనియర్గా చేరి 1987లో స్వతంత్ర న్యాయ వాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే ఉస్మానియాలో పార్ట్టైమ్ లెక్చరర్గా పీజీ విద్యార్థులకు ఇంటర్నేషనల్ లా పాఠాలు చెప్పారు. 2013లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే వరకు సామాజిక న్యాయం, పర్యావరణంతోపాటు పలు విభాగాల్లో సమర్థవంతమైన న్యాయవాదిగా వాదనలు వినిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అడవుల రక్షణకు వాదించిన కేసు దేశమంతటా ‘సమత’ కేసుగా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ న్యాయవాదిగా, టీటీడీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తదితరాలకు న్యాయవాదిగా పనిచేశారు. సాహిత్యం, కళలపై ఆయనకు మక్కువ ఎక్కువ. విపరీతంగా పుస్తకాలు చదవడంతో పాటు రాయడం అలవాటు. న్యాయమూర్తిగా దాదాపు 13 వేల తీర్పులు ఇచ్చారు. వీటిలో 100కు పైగా లా జర్నల్లో ప్రచురితం కావడం విశేషం. 2018లో న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. అనంతరం ఏపీ ప్రభుత్వం ఆయన్ను స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్గా నియమించింది. -
PAK: 26/11 దాడులు.. ప్రధాన సూత్రధారి మృతి
ఇస్లామాబాద్: భారత్కు పీడకలగా మిగిలిపోయిన 2008 ముంబై దాడుల(26/11) ప్రధాన సూత్రధారి, లష్కర్ ఏ తాయిబా సీనియర్ కమాండర్ అజమ్ ఛీమా గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్లోని ఫైసలాబాద్లో ఛీమా మరణించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇతడి అంత్యక్రియలు ఫైసలాబాద్లోని మల్కన్వాలాలో పూర్తయ్యాయి. కేవలం 26/11 దాడులే కాకుండా 2006లో ముంబైలోనే 188 మంది మృతికి కారణమైన రైళ్లలో బాంబు పేలుళ్ల వెనుక ప్రధాన కుట్రదారుడు ఛీమాయేనని అప్పట్లో తేల్చారు. ఈ పేలుళ్లలో 800 మంది దాకా గాయపడ్డారు. అజమ్ ఛీమా అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోనూ ఉన్నాడు. కాగా, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో మొత్తం 10 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు పాల్గొన్నారు. వీరు సముద్ర మార్గం ద్వారా అక్రమంగా దక్షిణ ముంబైలోకి ప్రవేశించి తాజజ్ మహల్ ప్యాలెస్ హోటల్తో పాటు నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది పోలీసులతో పాటు మొత్తం 166 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఆరుగురు అమెరికన్లు ఉండటంతో ఛీమా పేరను అమెరికా తన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. ఇదీ చదవండి.. అమెరికాలో మరో భారతీయుడి దారుణ హత్య -
Russia: జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి
మాస్కో: పుతిన్ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నావల్ని గతంలో రష్యా ఇన్ ద ఫ్యూచర్ ప్రతిపక్ష పార్టీని లీడ్ చేయడంంతో పాటు పుతిన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై పోరాడేందుకు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ స్థాపించారు. నావాల్ని మరణంపై పుతిన్కు సమాచారమందినట్లు రష్యా మీడియా కథనాలు ప్రచురించింది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నావల్ని మరణం వివాదాస్పదమవుతోంది. ‘ఫిబ్రవరి 16న కరక్షనల్ కాలనీ(జైలు) నెంబర్ 3లో కొంత సేపు నడక తర్వాత నావాల్ని కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఆ వెంటనే ఆయన స్పృహ కోల్పోయారు. తర్వాత వైద్యులు వచ్చి నావల్నీకి అత్యవసర చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం డాక్టర్లు నావల్నీ మృతి చెందినట్లు ధృవీకరించారు’ అని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ కార్యాలయం వెల్లడించింది. ఇదీ చదవండి.. భారతీయుల వరుస హత్యలు.. స్పందించిన అమెరికా -
Mumbai Airport: వీల్ చైర్ లేక గుండెపోటుతో వృద్ధుడి మృతి
ముంబై : నగరంలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో రద్దీ కారణంగా చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్లైన్స్ సిబ్బందిని ఓ వీల్చైర్ అడిగాడు. వీల్చైర్లకు భారీ డిమాండ్ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్లైన్స్ సిబ్బంది కోరారు. దీంతో ఆలస్యమవుతుందని భావించిన ఆ వృద్ధుడు నడుస్తూ వెళ్లి ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ‘వీల్ చైర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అవి అందుబాటులో లేవు. ఇందుకే 80 ఏళ్ల వృద్ధుడిని కొద్దిసేపే వేచి ఉండాలని మేం కోరాం. అయినా అతడు ఆయన భార్యతో కలిసి నడిచి వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అతడు ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాం. అప్పటికే అతడు మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే వీల్ చైర్ ఇవ్వాలని మా సంస్థకు ఒక పాలసీ ఉంది’ అని ఎయిర్లైన్స్ కంపెనీ ఎయిర్ ఇండియా తెలిపింది. ఇదీ చదవండి.. 11 మంది సజీవ దహనం -
పొలంలో వరినాట్లు వేస్తుండగా హఠాత్తుగా..
రాజన్న, సిరిసిల్ల: తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన సుద్దాల వెంకటేశంగౌడ్ (40) ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశంకు భార్య స్రవంతి, ఇద్దరు కూతుళ్లు ఉండగా కొన్నేళ్లుగా అతడికి దూరంగా ఉంటున్నారు. మృతుడికి తల్లిదండ్రులు బాలయ్య, బాలలక్ష్మి, అక్క, తమ్ముడు ఉన్నారు. పొలంవద్దే ఆగిన రైతు గుండె.. పొలం పనులు చేస్తుండగా గుండెపోటుతో రైతు మృతిచెందిన ఘటన ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన నంద్యాడపు బుచ్చి మల్లయ్య (68) పొలంలో వరినాట్లు వేయిస్తున్నాడు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందాడు. అప్పటి వరకు పొలం పనులు చేస్తూ కళ్లేదుటే బుచ్చిమల్లయ్య మృతిచెదండంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య నర్సవ్వ, కొడుకు తిరుపతి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇవి చదవండి: తల్లీకూతుళ్లు రోడ్డు దాటుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు! -
గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలిన ఐఐటీ ప్రొఫెసర్
లక్నో: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ వేదికపైనే కుప్పకూలారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఐఐటీ కాన్పూర్కు చెందిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి వ్యవహారాల డీన్గా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న సమీర్ ఖండేకర్(53)ని ఆహ్వానించారు. ఈ వేడుకలో ప్రసంగించే క్రమంలోనే ఆయన వేదికపై కుప్పకూలారని ఇన్స్టిట్యూట్ అధికారులు తెలిపారు. అత్యుత్తమ పరిశోధకుడిగా పేరుగాంచిన సమీర్ ఖండేకర్ ఆకస్మిక మరణం పట్ల ఐఐటి కాన్పూర్ మాజీ డైరెక్టర్ అభయ్ కరాండికర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖండేకర్కు ఐదు సంవత్సరాల క్రితం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఒక ప్రొఫెసర్ చెప్పారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోనే ఆయన మృతదేహాన్ని ఉంచినట్లు పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న ఖండేకర్ ఏకైక కుమారుడు ప్రవాహ ఖండేకర్ వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే మృతి
పాకిస్తాన్లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే(72) మృతి చెందాడు. ఆయన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్(కేఎల్ఎఫ్)తో పాటు ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్కు చీఫ్. లఖ్బీర్ గుండెపోటుతో మృతి చెందాడు. లఖ్బీర్ సింగ్ రోడే.. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మేనల్లుడు. భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు, అకల్ తఖ్త్ మాజీ నేత జస్బీర్ సింగ్ రోడే.. లఖ్బీర్ మరణాన్ని ధృవీకరించారు. లఖ్బీర్ సింగ్ రోడేకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వారు కెనడాలో నివసిస్తున్నారు. లఖ్బీర్ సింగ్ రోడే భారతదేశంలోని పంజాబ్లోని మోగా జిల్లాలోని రోడే గ్రామంలో ఉండేవాడు. భారతదేశం నుండి దుబాయ్కి పారిపోయాడు. తరువాత దుబాయ్ నుండి పాకిస్తాన్కు చేరుకున్నాడు. తన కుటుంబాన్ని కెనడాలో ఉంచాడు. 2002లో 20 మంది టెర్రరిస్టులను భారత్కు అప్పగించేందుకు పాక్కు భారత్ ఒక జాబితాను అందజేసింది. అందులో లఖ్బీర్ సింగ్ రోడే పేరు కూడా ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం లఖ్బీర్ సింగ్ రోడే తన అంతర్జాతీయ సిక్కు యూత్ ఫెడరేషన్ శాఖలను బ్రిటన్, జర్మనీ, కెనడా,అమెరికాతో సహా అనేక ప్రాంతాలలో ప్రారంభించాడు. భారత్కు అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పంపినట్లు రోడేపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? -
సైనికున్ని రక్షించేందుకు.. తూటాలకు ఎదురునిలిచి..
ఢిల్లీ: విధినిర్వహణలో ప్రాణాలను అర్పించింది ఓ సైనిక జాగిలం. సైనికుని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను పనంగా పెట్టింది. ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి వీర మరణం పొందింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు-సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కెంట్ అనే సైనిక జాగిలం ప్రాణాలను కోల్పోయినట్లు ఆర్మీ తెలిపింది. 'ఆపరేషన్ సుజలిగల'లో భాగంగా జమ్మూ రాజౌరీ జిల్లాలోని నార్లా ప్రాంతంలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపడుతోంది. వారికి తోడుగా 21వ ఆర్మీ డాగ్ యూనిట్కు చెందిన ఆరేళ్ల కెంట్ అనే కుక్కను తీసుకువెళ్లారు. సైనికులందరూ కెంట్ను అనుసరిస్తున్నారు. ఉగ్రవాదుల జాడను పసిగట్టిన కెంట్.. సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. #WATCH | Indian Army dog Kent, a six-year-old female labrador of the 21 Army Dog Unit laid down her life while shielding its handler during the ongoing Rajouri encounter operation in J&K. Kent was leading a column of soldiers on the trail of fleeing terrorists. It came down under… pic.twitter.com/ZQADe50sWK — ANI (@ANI) September 13, 2023 కాల్పుల్లో ఉగ్రవాదులు ఓ సైనికున్ని చుట్టుముట్టారు. అతన్ని రక్షించడం కోసం కెంట్ ఉగ్రవాదులకు ఎదురునిలిచింది. ఈ క్రమంలో తూటాలు తగిలి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది, ఒక ఆర్మీ జవాన్ మరణించారని వెల్లడించారు. Army dog Kent laid down her life while shielding its handler during operation in Rajouri, J&K Kent was leading column of soldiers on the trail of fleeing terrorists. It came down under heavy hostile fire Till now, 1 terrorist killed Thank you Kent for serving nation. Om Shanti pic.twitter.com/BeeVjktB8K — Anshul Saxena (@AskAnshul) September 12, 2023 ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
గుండెపోటుతో అన్న మృతి.. కడసారి రాఖీ కట్టి..
సాక్షి, పెద్దపల్లి జిల్లా: సంతోషంగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన సోదరి షాక్కు గురైంది. కళ్ల ముందు అన్న విగతజీవిగా ఉండడాన్ని చూసి ఆమె గుండెలు అవిసెలా రోదించింది. అంత దుఖంలో అన్న మృతదేహానికి ఆమె రాఖీ కట్టి తన రక్తసంబంధాన్ని ప్రదర్శించింది. ఈ హృదయ విదారకమైన దృశ్యం చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కనకయ్యకి.. రాఖీ పండగ సందర్బంగా రాఖీ కట్టడానికి ఆయన చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. సంతోషంగా వచ్చిన ఆమెకు అన్న కనకయ్య గుండెపోటుతో మృతి చెందాడని తెలిసి సొమ్మసిల్లిపడిపోయింది. అన్న మృతిని తట్టుకోలేకోపోయిన గౌరమ్మ బోరున విలపించింది. పుట్టెడు దుఃఖంలోనూ కడసారిగా అన్న మృతదేహానికి చెల్లెలు గౌరమ్మ రాఖీ కట్టి సాగనంపింది. చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం -
'వండర్లా'లో అపశ్రుతి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి..
రంగారెడ్డి: వండర్లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. రైడ్స్ చేస్తుండగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ సంఘటన రావిర్యాల్ సమీపంలోని వండర్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా కాశీంకోట మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన గుమ్మడి మనోజ్కుమార్(26) కూకట్పల్లిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులు దుర్గప్రాసాద్, వరప్రసాద్, గణేశ్, శ్రీకాంత్, ప్రశాంత్తో కలిసి వండర్లాకు వెళ్లారు. జాయింట్ వీల్ పూర్తి చేసి రోలర్ క్యాస్టు రైడ్ చేస్తుండగా మనోజ్కుమార్కు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే వండర్లాలోని ఫస్ట్ ఎయిడ్ సెంటకు తీసుకెళ్లగా ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టారు. అప్పటికే పల్స్ రేట్ తగ్గిపోయి చల్లబడిపోయాడు. హార్ట్ బీట్ సరిగా లేదని స్నేహితులు గమనించే సరికి అంబులెన్స్లో యంజాల్ సమీపంలోని మహోనియా అస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో గాంధీకి తరలించారు. అప్పటికే మనోజ్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు విచారణ చేస్తున్నారు. మనోజ్కుమార్ మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విషాదం: రైలు పట్టాలు దాటుతూ దంపతులు మృతి..
శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో విషాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు దంపతులు మృతి చెందారు. పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితులను శ్రీరాములు (60), రాములమ్మ (55)గా గుర్తించారు పోలీసులు. శ్రీరాములు(60), రాములమ్మ(55)లు పట్టాలు దాటుతున్న క్రమంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రైలు రాకను గమనించకుండా పట్టాలపైకి వెళ్లారని పేర్కొన్నారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైలు బాధితులను ఢీకొట్టిందని వెల్లడించారు. అయితే.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇదీ చదవండి: Heart Attack: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి -
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
రాయచూరు రూరల్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జిల్లాలోని మస్కిలో చోటు చేసుకుంది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని అగోలికి చెందిన మల్లనగౌడ(34) మస్కి పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రక్తపోటు, చక్కెర వ్యాధులతో బాధపడుతున్న ఇతను శుక్రవారం రాత్రి నిద్రలో ఉండగానే మరణించినట్లు తెలిసింది. -
అందరూ చూస్తుండగానే ..గుండెపోటుతో ఈకామర్స్ సంస్థ సీఈవో హఠాన్మరణం
అప్పటి వరకు నవ్వుతూ, సరదాగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అందరితో కలివిడిగా ఉన్న వారు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా, ప్రముఖ ఫర్నీచర్,హోమ్ డెకార్ ఈకామర్స్ సంస్థ పెప్పర్ ఫ్రై కో-ఫౌండర్ అంబరీష్ మూర్తి గుండె పోటుతో కన్నుమూశారు. అంబరీష్కు రైడింగ్ అంటే మహా ఇష్టం. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ నుంచి లేహ్కు బైక్ రైడ్ చేస్తుండేవారు. ఈ క్రమంలో ఎప్పటిలాగా లేహ్కు వెళ్లిన ఆయన అక్కడ అందరు చూస్తుండగానే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హార్ట్ అటాక్తో ఆయన కన్నుమూసినట్లు పెప్పర్ ఫ్రై మరో కో-ఫౌండర్ ఆశిష్ ట్వీట్ చేశారు. Extremely devastated to inform that my friend, mentor, brother, soulmate @AmbareeshMurty is no more. Lost him yesterday night to a cardiac arrest at Leh. Please pray for him and for strength to his family and near ones. 🙏 — Ashish Shah (@TweetShah) August 8, 2023 2012లో అంబరీష్ మూర్తి, అశిష్తో కలిసి పెప్పర్ఫ్రైను స్థాపించారు. 2020 నాటికి ఆ సంస్థ విలువ 500 మిలియన్లుగా ఉంది. అదే ఏడాది 8 రౌండ్లలో 244 మిలియన్ల పెట్టుబడులన్ని సంపాదించింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో గోల్డ్మన్ సాచ్స్, బెర్టెల్స్మాన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. క్రంచ్ బేస్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. ఐఐటీ కోల్కత్తా పూర్వ విద్యార్ధి. గ్రాడ్యుయేషన్ సమయం నుంచి ఎంట్రప్రెన్యూషిప్లో మెళుకువలు సంపాదించారు. కాలేజీకి వెళ్లే సమయంలో ఇంట్లో ట్యూషన్లు చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో పాఠశాల విద్యార్ధులకు టూటర్లను అనుసంధానం చేస్తూ ట్యూటర్స్ బ్యూరో అనే సంస్థను ప్రారంభించారు. రెండేళ్ల పాటు ఆ వ్యాపారాన్ని నిర్వహించారు. ఇదీ చదవండి : ఆనంద్ మహీంద్రాకు వేలకోట్లు అలా కలిసొచ్చాయ్! -
16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి
గుండెపోటుతో మరణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వయస్సుతో సంబంధం లేకుండా దీని భారిన పడుతున్నారు. అయితే.. గుజరాత్కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డా. గౌరవ్ గాంధీ కూడా గుండెపోటుతో మరణించడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన డా. గౌరవ్ గాంధీ అంటే ఆ ప్రాంతంలో తెలియనివారుండరు. ఆయన చేతితో ఎన్నో గుండె ఆపరేషన్లు చేశారు. ఎందరి ప్రాణాలనో రక్షించారు. గుండెకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. గుండె ఆరోగ్యంగా ఉండడానికి అనేక సూచనలు చేసేవారు. కేవలం నాలుగు పదుల వయస్సులోనే సుప్రసిద్ధ కార్డియాలజిస్టుగా పేరుగాంచారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనే గుండెపోటుతో మరణించారు. సుమారు 16 వేల ఆపరేషన్లు ఆయన ఇప్పటివరకు చేశారు. సోమవారం రాత్రి ఎప్పటిలానే ఆస్పత్రి పనులు ముగించుకుని ప్యాలెస్ రోడ్డులోని ఇంటికి చేరారు. రోజూలానే భోజనం పూర్తి చేసుకుని నిద్రకు వెళ్లారు. ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. సృహలో లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటే కారణమని స్పష్టం చేశారు. రాత్రి నిద్రకు వెళ్లే సమయంలో ఎలాంటి అసౌకర్యంగా ఆయన కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలుపారు. ఆయన మంచి ఆహారాన్నే తీసుకున్నారని వెల్లడించారు. డా. గాంధీ మృతిపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి:కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. వారి ఐదు డిమాండ్లు ఇవే..! -
మహిళా న్యాయవాది హఠాన్మరణం
తిరువొత్తియూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కన్నవరానికి చెందిన విమల్ కుమార్(50), భార్య భాగ్యలక్ష్మి (47) ఇద్దరూ న్యాయవాదులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబం సహా రామేశ్వరం ఆలయానికి వెళ్లేందుకు చైన్నె వచ్చి భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం రామేశ్వరం ఎక్స్ప్రెస్ రైలులో వెళుతున్నారు. రైలు కడలూరు జిల్లా పన్రుటికి రాగానే భాగ్యలక్ష్మికి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చిందని తెలిసింది. వెంటనే విమల్ కుమార్ ఈ విషయాన్ని రైలులోని టిక్కెట్ ఇన్న్స్పెక్టర్కు చెప్పాడు. తదనంతరం రాత్రి 10.30 గంటలకు, రామేశ్వరం ఎక్స్ప్రెస్ తిరుపాదిరి పులియూర్ రైల్వే స్టేషన్లో ఆగింది (అక్కడ స్టాప్ లేదు). రైలు నుంచి దిగిన వెంటనే భాగ్యలక్ష్మిని అంబులెనన్స్లో కడలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే భాగ్యలక్ష్మి మృతి చెందినట్లు తెలిపారు. భాగ్యలక్ష్మి గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని వైద్యులు తెలిపారు. -
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
ఆయనను చంపేశారు.. బాలీవుడ్ నటుడి మృతిపై సంచలన ఆరోపణలు!
రెండు రోజుల క్రితమే బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై రోజు రోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆయన మరణంపై సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త కౌశిక్ను హత్య చేశారని తాజాగా ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా మహిళ వ్యాఖ్యలతో ఈ కేసు మరిన్నీ మలుపులు తిరగనుంది. కాగా.. హోలీ వేడుకల్లో సతీష్ కౌశిక్ గుండెపోటుకు గురయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నా భర్తే చంపేశారు: మహిళ ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చింది ఆ మహిళ. అయితే ఆ మహిళ ఓ బిజినెస్ మ్యాన్ భార్య. తన భర్తకు సతీశ్ కౌశిక్ రూ.15 కోట్లు ఇచ్చారని ఫిర్యాదులో తెలిపింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకే ప్లాన్ చేసి చంపేశారంటూ మహిళ ఆరోపిస్తోంది. సతీష్ కౌశిక్ను చంపేందుకు తన భర్త కొన్ని ట్యాబ్లెట్స్ ఏర్పాటు చేశారని కూడా తెలిపింది. ఇప్పటికే సతీష్ కౌశిక్ మరణించిన ఫామ్ హౌజ్లో పోలీసులకు నిషేధ ఉత్ప్రేరక డ్రగ్స్ లభ్యమైన సంగతి తెలిసిందే. కాగా.. సతీష్ కౌశిక్ అదే వ్యాపారవేత్త ఫామ్హౌస్లో హోలీ పార్టీకి హాజరైన తర్వాతే మరణించాడు. ఫామ్హౌస్లో హోలీ పార్టీకి వచ్చిన అతిథుల జాబితాను కూడా పోలీసులు సిద్ధం చేశారు. మొత్తం 10 నుంచి 12 మంది పార్టీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ సతీష్ కౌశిక్ స్నేహితుడు వికాస్ మాలూది కాగా.. అక్కడ లభ్యమైన ఔషధాలు ఎవరికోసం, ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా మహిళ ఫిర్యాదుతో సతీష్ కౌశిక్ మరణంపై అనుమానాలను మరింత పెరుగుతున్నాయి. అలాంటిదేం లేదు: సతీశ్ కౌశిక్ భార్య ఈ ఆరోపణలపై సతీష్ కౌశిక్ భార్య శశి కౌశిక్ స్పందించింది. తన భర్త హోలీ పార్టీకి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చారని.. కానీ ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తను సమర్థిస్తూ సతీష్ కౌశిక్ మంచి స్నేహితులని అన్నారు. వ్యాపారవేత్త ధనవంతుడని..తన భర్త నుంచి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది. ఆయన శాంపిల్స్లో మందులు లేవని పోస్ట్మార్టం నివేదిక నిర్ధారించిందని శశి కౌశిక్ తెలిపారు. మహిళను ఉద్దేశి శశి న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ తన భర్తను హత్య చేసినట్లు ఎందుకు చెబుతుందో నాకర్థం కావడం లేదని తెలిపింది.నా భర్త చనిపోయిన తర్వాత ఆమె పరువు తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదు. ఆమెకు తన భర్త నుంచి డబ్బు రాబట్టడం కోసం సతీష్ కౌశిక్ను లాగుతోందని శశి ఆరోపిస్తున్నారు. కాగా.. సతీష్ కౌశిక్ హరియాణాలోని మహేంద్రఘడ్లో 1956లో జన్మించారు. 1983లో వచ్చిన 'మాసూమ్'తో నటుడుగా కెరీర్ ప్రారంభించిన ఆయన అనుపమ్ ఖేర్తో కలిసి పలు సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. సుమారు 15 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన తీసిన చివరి సినిమా 'కాగజ్'. -
ఖమ్మం: సడన్ హార్ట్ ఎటాక్.. కుప్పకూలిన ఇంటర్ విద్యార్థి
సాక్షి, ఖమ్మం: చిన్న వయసులోనే గుండెపోటు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మరణించాడు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మరీదు రాకేష్ మధిరలోని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపు రాకేష్ మృతి చెందాడు. కాగా, అతి చిన్నవయసులో గుండెపోట్లు కనిపించడానికి కొన్ని అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ దోహదపడుతున్నట్లు వెల్లడైంది. కుటుంబ చరిత్రలోనే చిన్నవయసులో గుండెపోటు సంఘటనలు ఉండటం. గుండె నిర్మాణంలోనే పుట్టుకతో తేడాలు ఉండటం. గుండెలో లయబద్ధంగా కొట్టుకోడానికి నిత్యం ఒకే రీతిలో విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ కావాలి. అది సయనో ఏట్రియల్ నోడ్ అనే గుండెలోని ఓ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ కరెంటు వెలువడటంలోని తేడాలు (అబ్నార్మాలిటీస్) కూడా ఇలా యువత అకస్మాత్తు మరణాలకు ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది. చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు? -
గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం
సాక్షి, అన్నానగర్: గుండెపోటుతో నవ వరుడు మృతిచెందిన ఘటన ఈరోడ్లో జరిగింది. నసియానూర్ కన్నవేలం పాళయానికి చెందిన ప్రకాష్ (36)కు ఈ నెల 23వ తేదీ వివాహం జరిగింది. శనివారం అత్తగారి ఇంటికి వెళ్లిన ప్రకాష్ మటన్ తిన్నాడు. తన భార్యతో అమ్మగారి ఇంటికి వచ్చాడు. రాత్రి మరోసారి మటన్ తిని పడుకున్నాడు. ఆదివారం వేకువజామున 2 గంటలకు శరీరమంతా దురద పుడుతోందని చెప్పాడు. కొద్ది సేపటికే గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన పెరుందురై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాంజీకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: లంక నావికాదళం ఓవరాక్షన్.. సీఎం స్టాలిన్ ఫైర్) -
కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇంట విషాదం..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు జీవన్రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్లోని సైదాబాద్ వినయ్నగర్లో కిషన్రెడ్డి అక్క బావ లక్ష్మీ, నర్సింహారెడ్డి నివాసం ఉంటారు. వాళ్ల కుమారుడే జీవన్రెడ్డి. జీవన్రెడ్డి గురువారం సాయంత్రం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుటుంబసభ్యులు కంచన్బాగ్లోని డీఆర్డీఏ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవన్రెడ్డి మృతిచెందారు. జీవన్రెడ్డి అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
కన్నడ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు కన్నుమూశారు. మన్దీప్ రాయ్ (74) బెంగళూరులో గుండెపోటుతో మరణించారు. దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్దీప్ రాయ్ ఆదివారం మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ విషయం కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణంపై ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు వెంకట్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. మన్దీప్ రాయ్ బెంగాలీ అయినప్పటికీ బెంగళూరులో స్థిరపడి కన్నడ చిత్ర పరిశ్రమలో నటించారని తెలిపారు. కన్నడ పరిశ్రమతో గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. మన్దీప్ రాయ్ నటించిన చిత్రాలు వరుసగా 'మించిన ఓట', 'పుష్పక విమానం', 'దేవర ఆట', 'నాగరహావు', 'ఆప్త రక్షక', 'అమృతధారే', 'కురిగాలు సార్ కురిపాలు' వంటి సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. Mandeep Roy | Originally Bengali, Settled and Acted in Kannada Film Industry, Closely Connected to #Kannada #People He is Unforgettable in #Pushpaka Vimana #RIP #MandeepRoy #KFI #Kannada pic.twitter.com/TcP5EBNsFg — Venkat Bharadwaj (@csvenkat) January 29, 2023 -
గుండెపోటుతో డ్రైవర్ మృతి.. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
-
విచిత్ర విధి.. ఒకటి కాదు రెండు ప్రాణాలు బలి!
బెంగళూరు: దేశ వ్యాప్తంగా జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో.. ఎన్నో విషాదాలు జరిగి ఉండొచ్చు. వందల నుంచి వేల మంది ప్రాణాలు పోయి ఉండొచ్చు. కానీ, కర్ణాటక శివమొగ్గలో జరిగిన ఘటన మాత్రం విధి ఎంత విచిత్రమైందో అని అనిపించేలా ఉంది. శివమొగ్గ విద్యానగర్లో జరిగిన కొత్త సంవత్సరం వేడుక.. ఇద్దరి ప్రాణాలు బలిగొంది. వేడుకలో ఓ పెద్దాయన అతి ప్రదర్శనకు దిగబోయాడు. ఈ క్రమంలో ఆ వ్యాపారవేత్త ఓ రీసెర్చ్ స్కాలర్ను బలి తీసుకోవడంతో పాటు తన ప్రాణం పొగొట్టుకున్నాడు కూడా. బిజ్మన్ మంజునాథ్ ఒలేకార్(67) అనే వ్యాపారవేత్త విద్యానగర్ 4వ క్రాస్లో కొత్త సంవత్సరం వేడుకను నిర్వహించాడు. ఆ ఈవెంట్కు కుటుంబంతో పాటు స్నేహితులను 50 మంది దాకా ఆహ్వానించాడు. అంతా పార్టీలో మునిగి తేలాక.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు తన డబుల్ బ్యారెల్ గన్ను పేల్చడానికి సిద్ధం అయ్యారు. సరిగ్గా 12 గంటల సమయంలో తూటా అమర్చి పేల్చే యత్నం చేశాడు. అయితే.. అది పొరపాటున పేలి తన పక్కనే ఉన్న వినయ్(34) అనే యువకుడిలోకి తూటా దూసుకెళ్లింది. వెంటనే వినయ్ని ఆస్పత్రికి తరలించారు అక్కడున్నవాళ్లు. అయితే ఆ ఘటనతో ఒలేకార్ షాక్ తిన్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న వినయ్కి ఏమైందోనని భయాందోళనకు గురయ్యాడు. ఆ క్రమంలో ఊపిరి ఆడక.. అక్కడికక్కడే కుప్పకూలాడు. షాక్లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు వినయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశాడు. ఒలేకర్ కొడుకు స్నేహితుడైన వినయ్.. పీహెచ్డీ స్కాలర్. అతని తండ్రి పీడబ్ల్యూడీ ఇంజినీర్. మంజునాథ్ ఒలేకార్ కాల్చింది లైసెన్స్డ్ రివాల్వర్ అవునా? కాదా? అనే తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. గతంలోనూ ఆయన ఇలా బహిరంగంగా తుపాకినీ గాల్లోకి కాల్చాడని స్థానికులు కొందరు చెప్తున్నారు. -
మంత్రి కేటీఆర్ మామ మృతి
-
గుండెపోటుతో మంత్రి కేటీఆర్ మామ మృతి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇంట విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ మామ పాకాల హరినాథరావు(72) గుండెపోటుతో మృతి చెందారు. హరినాథరావుకు మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 8.30 నిమిషాలకు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హరినాథరావు మృతితో మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన పార్ధివదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో ఉన్న నివాసానికి తరలించారు. హరినాథరావు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వియ్యంకుడికి నివాళులు అర్పించేందుకు సీఎం కేసీఆర్ ఆయన నివాసానికి చేరుకున్నారు. చదవండి: చంపేస్తామని బెదిరిస్తున్నారు.. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై ఆరోపణ -
వైరల్ వీడియో: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
-
షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
లఖ్నవూ: అప్పటి వరకు అందిరితో సంతోషంగా గడిపిన వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తోన్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అలాంటి సంఘటనే ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో వెలుగు చూసింది. ఓ పెళ్లి వేడుకలో 40 ఏళ్ల వ్యక్తి నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఆ వ్యక్తి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బాధితుడు మనోజ్ విశ్వకర్మగా గుర్తించారు. పిల్పాని కాత్రా ప్రాంతంలో వివాహ వేడుకలో పాల్గొన్నాడు మనోజ్. తన కుటుంబ సభ్యులతో కలిసి నృత్యం చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించటంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. मातम में बदलीं खुशियां! डांस करते हुए अचानक शख्स गिर पड़ा। हार्ट अटैक से मौत हो गई। पिछले कुछ समय से अक्सर अचानक हार्ट अटैक की वजह से मौत की खबरें देखने को मिल रही हैं।#viralvideo #Kashi #Varanasi pic.twitter.com/u2pgatY2mc — Chandani Sahu (@Chandanijk) November 29, 2022 ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోమ్ తెచ్చిన తంటా!..ఆఖరికి పెళ్లి పీటలపై కూడా -
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ యువనటి మృతి
ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ కన్నుమూశారు. 24 ఏళ్ల నటి ఇప్పటికే చాలాసార్లు గుండెపోటుకు గురయ్యారు. కోల్కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నవంబర్ 1న ఆమె ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఇప్పటికే ఇంట్రాక్రానియల్ హెమరేజ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఆమె సర్జరీ చేయాల్సి వచ్చింది. నవంబర్ 14న పలుమార్లు ఆమె గుండెపోటు రావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఒకరోజు ముందే అండ్రిలా శర్మ బాయ్ఫ్రెండ్ సబ్యసాచి చౌదరి ఆమె బతకాలని ప్రార్థించమని సోషల్ మీడియాలో అభిమానులను కోరారు. పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్లో ఆండ్రిలా పుట్టి పెరిగారు. ఆమె జుమూర్తో టెలివిజన్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మహాపీఠ్ తారాపీఠ్, జిబోన్ జ్యోతి, జియోన్ కతి వంటి షోలలో నటించింది. ఆండ్రిలా అమీ దీదీ నంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లో కూడా భాగమైంది. -
తీవ్ర విషాదం: గుండెపోటుతో మూడోతరగతి విద్యార్థి మృతి
సాక్షి, రాజన్న సిరిసిల్ల: దీపావళి పండుగను సంబరంగా జరుపుకొని మరునాడు పాఠశాలకు వెళ్లిన ఓ చిన్నారి గుండె అకస్మాత్తుగా ఆగింది. అప్పటిదాకా తోటి విద్యార్థులతో ఆడిపాడిన బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలి కన్నుమూశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వెంకట్రావుపల్లికి చెందిన బుర్ర కుషిత– సతీశ్ దంపతులకు కొడుకు కౌశిక్(9), కుమార్తె మేఘన ఉన్నారు. కౌశిక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో క్యూలైన్లో నిలుచుని ఉన్న కౌశిక్ హఠాత్తుగా కిందపడిపోయాడు. గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయుడి వాహనంలోనే కరీంనగర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కౌశిక్ అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. బాలుడు కొంతకాలంగా ఫిట్స్, గుండె సంబంధిత(హార్ట్ వీక్) వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కౌశిక్ మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చదవండి: డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు -
తరగతి గదిలో ఒక్కసారిగా కుప్పకూలిన ఏడో తరగతి విద్యార్థిని
-
నెల్లూరులో విషాదం.. క్లాస్రూంలో కుప్పకూలి విద్యార్థిని మృతి
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని వింజమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పెనువిషాదం చోటు చేసుకుంది. పదమూడేళ్ల షేక్ సాజీదా అనే విద్యార్థిని.. తరగతి గదిలోనే ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది. చిన్నవయసులోనే చిన్నారి కన్నుమూయడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఏడో తరగతి చదువుతున్న సాజీదా.. క్లాస్ రూంలో టీచర్ ప్రశ్నలు అడగడంతో లేచి సమాధానాలు ఇస్తోంది. అయితే ఒక్కసారిగా ఆ చిన్నారి కుప్పకూలింది. వెంటనే స్కూల్ సిబ్బంది హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు. గుండె పోటుతో సాజీదా మృతి చెందిదని ప్రాథమికంగా చెబుతున్నా.. పూర్తిస్థాయి పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తేనే మృతికి అసలు కారణం తెలుస్తుందని వైద్యులు స్పష్టత ఇస్తున్నారు. సమాధానాలు చెబుతూ హఠాత్తుగా ఆమె కుప్పకూలిందని.. ఫిట్స్ అనుకుని తాళాలు చేతిలో పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని బయాలజీ టీచర్ చెబుతున్నాడు. ఆ వెంటనే సహోద్యోగి సాయంతో ఆస్పత్రికి తరలించామని తెలిపాడాయన. మరోవైపు సాజీదాకు ఎలాంటి గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలూ లేవని సాజీదా కుటుంబం కన్నీళ్లతో చెబుతోంది. పదమూడేళ్ల వయసుకే గుండెపోటుతో మృతి చెందిందన్న వార్త.. స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఇదీ చదవండి: మానవత్వం మరిచి.. వదినపై కర్రలతో దాడి.. -
గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి
పోర్చుగల్లోని లిస్బన్లో ప్రధాన ఆస్పత్రి శాంటా మారియాలో నియోనాటాలజీ సేవలు లేవు. దీంతో మరొక ఆస్పత్రికి అంబులెన్స్లో గర్భిణిని తరలిస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ ఘటన పోర్చుగల్ ఆరోగ్యమంత్రి మార్టా టెమిడో రాజీనామ చేసే పరిస్థితికి దారితీసింది. అత్యవసర ప్రసూతి ఆస్పత్రులను తాత్కలికంగా మూసివేయాలని ఆమె తీసుకున్న నిర్ణయమే రాజీనామ చేసేవరకు తీసుకువచ్చింది. వాస్తవానికి గత వేసవి సెలవుల్లో పలు ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో వారంతాల్లో ఉండే అ్యతవసర ప్రసూతి సేవలను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ప్రతిపక్షాలు, మున్సిపాలిటీలు గర్భిణులు ఎమర్జెన్సీ సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లలేరని, ఇది అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ దుమ్మెత్తిపోశాయి. సిబ్బంది కొరత కారణంగా గత్యంతరం లేని స్థితిలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. టెమిడో 2018లో ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అంతేకాదు కోవిడ్-19కి వ్యతిరేకంగా విజయవంతమైన వ్యాక్సిన్ ప్రచారాన్ని నిర్వహించింది కూడా. అత్యంత ప్రజాదరణ పొందిన మంత్రుల్లో ఆమె ఒకరు. ఐతే ఆమె ప్రసూతి వైద్యానికి సంబంధించిన విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం తోపాటు తాజాగా సదరు గర్భిణి మహిళ కూడా చనిపోవడం ప్రతిపక్షాల విమర్శలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ మేరకు టెమిడో ఆరోగ్య మంత్రిత్వ శాఖ్య ప్రకటనలో తాను ఇక పదవిలో కొనసాగే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదని, అందువల్ల తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణియించుకున్నట్లు వెల్లడించింది. ఐతే దీన్ని పోర్చుగల్ ప్రధాని ఆంటోనియాఓ కోస్టా.. టెమిడో రాజీనామను ఆమోదించడమే కాకుండా ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యావాదాలు కూడా తెలిపారు. (చదవండి: వాషింగ్టన్లో కాల్పులు కలకలం...ఇద్దరికి గాయాలు) -
విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మారాఠి నటుడు ప్రదీప్ పట్వర్ధన్ హఠాన్మరణం చెందారు. మంగళవారం ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. ప్రదీప్ ఆకస్మిక మరణంతో మరాఠి చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడి మృతికి మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రదీప్ పట్వార్థన్ హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. మరాఠి సినీ పరిశ్రమ ఓ లెజెండరి నటుడిని కొల్పోయింది’ అంటూ రాసుకొచ్చారు. చదవండి: ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’ అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సంతాపం ప్రకటించారు. అలాగే మరాఠి ఇండస్ట్రీకి చెందిన సినీ, టీవీ నటీనటులు సైతం ప్రదీప్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రదీప్ పట్వర్థన్ తనదైన నటనతో లెజెండరి యాక్టర్గా పేరు సంపాదించుకున్నారు. ‘ఎక్ ఫుల్ ఛార్ హాఫ్’, ‘డాన్స్ పార్టీ’, ‘మే శివాజీరాజీ భోంస్లే బోల్తె’ వంటి మరాఠి సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన అనురాగ్ కశ్యప్ ‘బాంబే వెల్వెట్’ క్రైం థ్రిల్లర్ చిత్రంలో నటించారు. వీటితో పాటు ఆయన మరాఠి టీవీ సీరియల్స్లో సైతం నటించారు. मराठी रंगभूमीवरील मोरूची मावशी, बायको असून शेजारी, लग्नाची बेडी तसेच मराठी चित्रपटसृष्टीत आपल्या सहजसुंदर अभिनयाने रसिक प्रेक्षकांच्या हृदयावर अधिराज्य गाजवणारे सदाबहार अभिनेते प्रदीप पटवर्धन यांचे दुःखद निधन झाले. त्यांच्या जाण्याने मराठी कलासृष्टीने उमद्या कलावंताला गमावले आहे. pic.twitter.com/CVjESFYCkf — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) August 9, 2022 -
మంత్రి గౌతమ్ రెడ్డికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం
-
లెర్న్డ్ పొలిటిషన్ గా చెరగని ముద్ర వేశాడు
-
సొంత అన్నను కోల్పోయాం
-
ఈ సమయంలో భీమ్లా నాయక్ కరెక్ట్ కాదు
-
సీఎం జగన్ మాట, బాటలో నడిచేవారు
-
సీఎం జగన్ ని పట్టుకుని బోరుమని విలపించిన గౌతమ్ రెడ్డి తల్లి
-
ఏపీ ప్రజల పట్ల అంతులేని ప్రేమ
-
గౌతమ్ రెడ్డి నివాసనికి మంత్రి కొడాలి నాని
-
గౌతమ్ రెడ్డి భార్యను ఓదారుస్తున్న వైఎస్ విజయమ్మ
-
వార్త తెలియగానే షాక్కు గురయ్య..
-
గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లనున్న సీఎం జగన్
-
అపోలో హాస్పిటల్కు చేరుకున్న వైఎస్ విజయమ్మ
-
అపోలో హాస్పిటల్కు చేరుకున్న వైఎస్ షర్మిల
-
మేకపాటి కుటుంబం సీఎం జగన్కి ఎప్పుడూ తోడుగా ఉంది..
-
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి ►మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నాని, వలభనేని వంశీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అధికార లాంఛనాలతో మంత్రి గౌతమ్రెడ్డి అంత్యక్రియలు ► మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతి పట్ల అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు గౌతమ్రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసానికి తరలించారు. సోమవారం రాత్రికి స్వగ్రామం బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలోఉన్న కుమారుడు వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.45 నిమిషాలకు అపోలో అసుపత్రికి చేరుకోగా.. 90 నిమిషాల పాటు వైద్యులు గౌతమ్రెడ్డికి ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించారు. కాగా పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ రాజమోహన్రెడ్డి కుమారుడు గౌతమ్రెడ్డి. 1971 నవంబర్2న జన్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. చదవండి: మంత్రి గౌతమ్రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం అయితే మేకపాటి వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపి కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్పోలో పాల్గొని ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు. గత నెల 22న కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. అయితే సోమవారం ఉదయం గుండె పోటు రావడంతో అపోలో ఆస్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. గౌతమ్రెడ్డి మరణ వార్త విన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. హైదరాబాద్కు బయల్దేరారు. -
సినీ పరిశ్రమలో విషాదం.. ‘ఏం మాయ చేశావే’ నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, కమెడియన్ ప్రదీప్ కొట్టాయం(61) గుండెపోటుతో కేరళలో కన్నుమూశారు. ఆయన మృతి వార్త తెలిసి మాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖు, సహా నటీనటులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్! ఈ క్రమంలో మలయాళ నటుడు, స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ అయన మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు నివాళులు అర్పిస్తూ హీరో పధ్వీరాజ్ ట్వీట్ చేశారు. ఆయన ప్రదీప్ కేఆర్ తన కెరీర్లో 70కి పైగా చ్రితాల్లో నటించారు. తెలుగులో సైతం ఆయన పలు చిత్రాల్లో నటించారు. ఏం మాయ చేశావేలో జార్జ్ అంకుల్ ప్రదీప్ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. రాజా రాణి చిత్రంలో కూడా ఓ పాత్ర పోషించారాయన. Rest in peace! #KottayamPradeep 🙏 pic.twitter.com/zUHU2GflqH — Prithviraj Sukumaran (@PrithviOfficial) February 17, 2022 -
ఆనందంగా పండుగ జరుపుకోవాలని వచ్చి.. అంతలో విషాదం
సాక్షి,ధర్మపురి(కరీంనగర్): సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో ఆనందంగా జరుపుకోడానికి స్వగ్రామం వచ్చిన ఓ చేనేత కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం గ్రామానికి చెందిన ఆడెపు శంకరయ్య(63) చేనేత కార్మికుడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో సిరిసిల్లలో ఉంటూ పని చేస్తున్నాడు. సంక్రాంతి నేపథ్యంలో గురువారం పని ముగించుకొని, ఇంటికి వచ్చాడు. రాత్రి కటుంబసభ్యులతో ఆనందంగా గడిపాడు. శుక్రవారం బహిర్భూమికి వెళ్లి, ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. శంకరయ్య ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యలు వెతకగా బహిర్భూమి ప్రాంతంలో మృతిచెంది కనిపించాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మరో ఘటనలో.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నాగారపు బాలయ్య–రేనవ్వలకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నకొడుకు నాగారపు నరేశ్(23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికొచ్చిన నరేశ్ శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నరేశ్ బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. తంగళ్లపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నా.. నీవెంటే నేను..
సాక్షి, ఇంద్రవెల్లి(ఆదిలాబాద్): అన్నా.. నీ వెంటే నేనూ అంటూ సోదరుడు మరణించిన గంట వ్యవధిలో సోదరి కూడా మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్లో మంగళవాం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజాపూర్ గ్రామానికి చెందిన నర్వటె మారుతి(65) తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందాడు. ఆదే గ్రామంలో ఉంటున్న చెల్లెలు మస్కె రేణుక(48) అన్న మరణ వార్త విని వెంటనే సోదరుడి ఇంటికి చేరుకుంది. మారుతి మృతదేహం వద్ద రోదిస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. బంధువులు వెంటనే రేణుకను ప్రైవేటు వాహనంతో ఆదిలాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రేణుక అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అన్న చనిపోయాడన్న బాధతో రేణుక కూడా గుండెపోటుతో మృతిచెంది ఉంటుందని తెలిపారు. గంట వ్యవధిలోనే అన్నాచెల్లెలు మృతిచెందడంతో తేజాపూర్లో విషాదం నెలకొంది. నర్వెట మారుతికి భార్య రత్నాబాయి, మస్కె రేణుకాబాయికి కూతురు నిర్గున, కొడుకు గోరాక్నాథ్ ఉన్నారు. బంధువులు అన్నాచెల్లెలిద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు పూర్తిచేశారు. -
కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం.. కర్ణాటకలో హైఅలర్ట్
-
పునీత్ రాజ్కుమార్ మృతి, షాక్లో భారత సినీ పరిశ్రమ
Puneeth Rajkumar Dies: Celebrities, Fans pay Condolences: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ ఈ రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. OMG!!!!!!!! Nooooooo. This can’t be true! How can this be? My deepest condolences to the family. May your soul rest in eternal peace. Gone too soon 💔 #PuneethRajkumar — Lakshmi Manchu (@LakshmiManchu) October 29, 2021 I just can’t process this!! Such a passionate ,warm and humble human being !! this is so tragic . Deepest condolence to his family .may his soul rest in peace 💔 #PuneethRajkumar — Hansika (@ihansika) October 29, 2021 పునీత్ రాజ్కుమార్ మరణవార్త విని శాండల్వుడ్ సినీ ప్రుముఖులతో పాటు ఇతర టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. అంతేగాక భారత సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. Heartbroken 💔 Will always miss you my brother. #PuneethRajkumar — sonu sood (@SonuSood) October 29, 2021 The nicest person I've had the honor of crossing paths with... My Raajakumara 💔 — Priya Anand (@PriyaAnand) October 29, 2021 May your soul rest in peace. Gone too soon 💔 #PuneethRajkumar. When i did my first Kannada film always wanted to work with him… — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 29, 2021 Deeply shocked to know of the sudden demise of @PuneethRajkumar A powerful actor who won the hearts of people with his incredible body of work. Condolences to the family #RIP #Gonetoosoon #PuneethRajkumar pic.twitter.com/YuP08U2t8E — Boney Kapoor (@BoneyKapoor) October 29, 2021 GONE- one of our KINDEST, NICEST AND NOBLE soul. I don’ know what I am feeling . I am feeling so devastated. Brother you have left us very confused and heartbroken. The heavens are brighter today. I am still hoping this is not true . 🙏🙏🙏🙏🙏💔💔💔 pic.twitter.com/7wjXZzk0ND — Ranganathan Madhavan (@ActorMadhavan) October 29, 2021 Shocked and deeply heartbroken to hear this terrible news! We will all miss you dear Appu. You will live in our hearts forever! My condolences and prayers for the family to deal with this deep pain. #rip #PuneethRajkumar — Vivek Anand Oberoi (@vivekoberoi) October 29, 2021 I cannot process this. Cannot believe you've left us Puneeth. Kind, gifted, fearless...so much to give to the world. This is not fair brother. Heartbroken. — Siddharth (@Actor_Siddharth) October 29, 2021 💔💔💔 One of the kindest and warmest Actors/gentlemen. Praying to the almighty to give Puneeth Sirs family, friends and his ocean of fans the strength to cope with this irreplaceable loss. #RIP #PuneethRajKumar #Gentleman #actor #loss #cannotunderstand #soyoung pic.twitter.com/U8RyOJdFMu — dulquer salmaan (@dulQuer) October 29, 2021 Apart from the shocking tragedy that @PuneethRajkumar ‘s sudden death is, it is also a scary and terrifying eye opening truth that any of us can die anytime 😳😳😳 So it is best to live life on a fast forward mode , while we are still alive🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2021 Ahh Noooo .. Gone too soon my dear Appu. I’m shattered .. Heart broken .. not fair #BlackFriday #PuneethRajkumar — Prakash Raj (@prakashraaj) October 29, 2021 One of the most humble and down to earth actors I’ve come across..Rest in Peace brother. #PuneethRajkumar — RAm POthineni (@ramsayz) October 29, 2021 Sometimes we don’t value the moment, till it’s gone 😭😭😭#Appu #Puneethrajkumar #kannadafilmindustry cannot comprehend this at all. pic.twitter.com/Zasg5px1Vl — Radikaa Sarathkumar (@realradikaa) October 29, 2021 Shocked and deeply saddened by the tragic news of Puneeth Rajkumar's demise. One of the most humble people I've met and interacted with. Heartfelt condolences to his family and loved ones 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) October 29, 2021 Heartbroken! Can’t believe you have gone so soon. pic.twitter.com/55lt4r62d1 — Jr NTR (@tarak9999) October 29, 2021 My heartfelt condolences to Puneeth’s family. Such a young and humble child. I don’t understand God’s way of things sometimes. Sad day for the entire film fraternity. Praying for strength to his family. — Mohan Babu M (@themohanbabu) October 29, 2021 -
ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటలేక..
సాక్షి, ధారూరు: ఉధృతంగా ప్రవహిస్తున్న కాగ్నా నదిని దాటలేక గుండెపోటుకు గురైన ఓ వ్యక్తిని మరో మార్గంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన ధారూరు మండలంలో గురువారం రాత్రి జరిగింది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. దోర్నాల్ గ్రామానికి చెందిన దినసరి కూలీ మహ్మద్ జిలానీ(41)కి గురువారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆయనను ఓ ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. ధారూరు నుంచి వికారాబాద్ తీసుకెళ్లే క్రమంలో దోర్నాల్ సమీపంలో కాగ్నానది ఉధృతంగా ప్రవహిస్తోంది. తాత్కాలిక వంతెనపై వేసిన మట్టి పూర్తిగా కొట్టుకపోవడంతో సిమెంట్ పైపులు తేలాయి. వాటిపై నుంచి దాటే యత్నం చేయగా ప్రమాదం పొంచి ఉందని స్థానికులు హెచ్చరించారు. దీంతో చేసేది లేక ఆటోను వెనక్కి మళ్లించారు.తాండూర్లోని జిల్లా ఆస్పత్రికి జిలానీని తరలిస్తుండగా యాలల మండలం రాస్నం గ్రామ సమీపంలో ఆయన కన్నుమూశాడు. కాగ్నానది ఉధృతంగా ప్రవహించడం, ధోర్నాల్ సమీపంలో ఏళ్లు గడుస్తున్నా వంతెన పూర్తి చేయకపోవడంతో జిలానీ ప్రాణాలు గాలిలో కలిశాయని కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన జిలానీ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత ప్రభుత్వాన్ని కోరారు. -
ఇద్దరు సాక్షి ఉద్యోగుల మృతి
సాక్షి, దొండపర్తి (విశాఖదక్షిణ)/సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘సాక్షి’ దినపత్రిక ఉద్యోగులు ఇద్దరు శనివారం మృతి చెందారు. యాడ్స్ విభాగం ఏజీఎం అరుణ్కుమార్ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన పాతికేళ్లుగా ప్రధాన పత్రికల్లో యాడ్స్ విభాగంలో అనేక హోదాల్లో పనిచేశారు. సాక్షి దినపత్రిక ప్రారంభం నుంచి యాడ్స్ విభాగంలో పనిచేస్తూ ప్రస్తుతం ఏజీఎం హోదాలో ఉన్నారు. అరుణ్కుమార్ మృతి పట్ల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. అలాగే, జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ చెన్నై కార్యాలయంలో సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ మేనేజర్గా పనిచేస్తోన్న ఎస్.రాధాకృష్ణన్ (51) శనివారం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు డయాలసిస్ చేసుకోవాలని వైద్యులు సూచించారు. చెన్నైలోని ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో అది సాధ్యపడలేదు. కొందరి సహకారంతో పుదుచ్చేరి ఆసుపత్రిలో అపాయింట్మెంట్ తీసుకుని ప్రయాణానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా పరిస్థితి విషమించింది. కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూశారు. -
పాపం ప్రత్యర్ధి చేతిలో తనువు చాలించిన సుమో రెజ్లర్
టోక్యో : ప్రత్యర్థి చేతిలో గాయపడి ఓ యువ సుమో రెజ్లర్ తనువు చాలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నెలరోజుల తర్వాత మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన జపాన్లో చోటుచేసుకుంది. వివరాలు.. భారీకాయంతో ప్రేక్షకుల్ని అలరించే పురాతన క్రీడ అయిన సుమో రెజ్లింగ్లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న హిబికిర్యూ (28) మార్చి 26న చివరి గ్రాండ్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్ జరిగే సమయంలో ప్రత్యర్ధి రెజ్లర్ హిబికిర్యూని బౌట్లో మట్టికరిపించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ప్రత్యర్ధి హిబికిర్యూని కిందపడేయడంతో తల బలంగా నేలకు తాకింది. దీంతో అస్వస్థతకు గురైన అతడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. వాస్తవానికి గేమ్లో నిబంధనల మేర బౌట్లో కిందపడిన రెజ్లర్ పైకి లేసే సాంప్రదాయం ఉంది. అలాగే బౌట్లో నేలకొరిగిన హిబికిర్యూ కూడా లేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఎంతకీ పైకి లెగవలేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన మ్యాచ్ ప్రతినిధులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుమారు నెలరోజుల పాటు ట్రీట్మ్ంట్ తీసుకున్న రెజ్లర్ హిబికిర్యూ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మరణించినట్లు జపాన్ సుమో అసోసియేషన్ ప్రకటించింది. -
టీవీ నటి హీనా ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం
ముంబై : ప్రముఖ టెలివిజన్ నటి హీనా ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హీనా ఖాన్ తండ్రి గుండెపోటుతో ఏప్రిల్ 20న కన్నుమూశారు. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే కశ్మీర్లో జరుగుతున్న షూటింగ్ను రద్దు చేసుకున్న హీనా ఖాన్ వెంటనే హుటాహుటిన ముంబైకు చేరుకుంది. హీనాఖాన్ తండ్రి మరణంపై పలువురు సన్నిహితులు, స్నేహితులు ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. ఇక ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా ఖాన్. తొలి సీరియల్తోనే హీనా ఖాన్కు స్టార్ ఇమేజ్ దక్కింది. ఈ సీరియల్లో అక్షర పాత్రతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బిగ్బాస్ షోతో మరింత ప్రచారం పొందారు. బిగ్బాస్11 సీజన్లో పాల్గొని రన్నరప్ నిలిచి సత్తా చాటారు. ఇక హీనా ఖాన్ నటించిన తొలి చిత్రం లైన్స్..కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. చదవండి : ‘ముద్దు సీన్ గురించి అమ్మతో చర్చించాకే..’ ‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ -
వివేక్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
-
తమిళనాడు: ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
-
హాస్యనటుడు వివేక్ మృతి.. తమిళనాట దిగ్భ్రాంతి
చెన్నై : ప్రముఖ కోలీవుడ్ హాస్యనటుడు వివేక్ (59) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు కె. బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ కూడా ఒకరు. మొదట స్క్రిప్ట్ రైటర్గా పనిచేసిన వివేక్ 'మనదిల్ ఉరుది వేండం' సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళంలో టాప్ కమెడియన్గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఒకనొక సమయంలో ఆయన లేకుండా తమిళంలో సినిమాలు రిలీజ్ అయ్యేవి కావని, అంతటి పాపులారిటీ ఉండేదని సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయనను 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగులోనూ డబ్బింగ్ చిత్రాలతో వివేక్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాయ్స్, శివాజీ, ప్రేమికుల రోజు, అపరిచితుడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వివేక్ కొడుకు ప్రసన్నకుమార్ 13 ఏళ్ల వయసులో మొదడులో రక్తం గట్టకట్టడంతో చనిపోయాడు. అనారోగ్యం కారణంగా వివేక్ తల్లి కూడా మరణించింది. కొడుకు, తల్లి ఆకస్మిక మరణాలతో వివేక్ బాగా కృంగిపోయాడని, అప్పటినుంచి సినిమాలు చేయడం కూడా తగ్గించాడని ఆయన సన్నిహితులు తెలిపారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్ మృతి పట్ల దేవీశ్రీ ప్రసాద్, ఏఆర్. రెహమాన్, సుహాసిని, ప్రకాశ్రాజ్, రాఘవ లారెన్స్, జీవా, సమంత, ధనుష్, విజయ్, సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే పెద్ద పేరు హాస్యనటుడు వివేక్ మృతిపట్ల తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అద్భుతమైన నటనతో చిన్న కలైవానర్గా పేరుతెచ్చుకుని కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని తెలిపారు. తన తమ్ముడిలాంటి వివేక్ ఇక లేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. వివేక్ కుటుంబ సభ్యులకు సత్యరాజ్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈమేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. Shattered. Heart broken. How is this even possible vivek. Too young too smart too talented too intelligent to go so early. — Suhasini Maniratnam (@hasinimani) April 17, 2021 OMG..cant believe I woke up to this Shocking news abt Legendary @Actor_Vivek sir🙏🏻 Heartbreaking.. Greatest Comedian of our Times who always incorporated a Social Message into his COMEDY I hav always been his diehard FAN U wl live in our Hearts forever dear Sir🙏🏻💐#ripvivek pic.twitter.com/4ferfSsgDm — DEVI SRI PRASAD (@ThisIsDSP) April 17, 2021 Ahhh.. #vivek ...gone too soon dear friend ..thank you for planting thoughts n trees ...thank you for entertaining and empowering us with your wit and humour..will miss you...RIP pic.twitter.com/oyoOkx8G9q — Prakash Raj (@prakashraaj) April 17, 2021 Frozen in disbelief. Cannot digest that Vivek sir is no more.This is a dark day for all of us . I have lost a valuable friend. Tamil cinema has lost a favorite son. The country has lost a wonderful role model. Om Shanti Vivek 😟😥 pic.twitter.com/ZWvji6m2x5 — Kasturi Shankar (@KasthuriShankar) April 17, 2021 What a great loss 😔. Shocked and saddened .. #RIPVivekSir pic.twitter.com/GVDojaTTOh — Samantha Akkineni (@Samanthaprabhu2) April 17, 2021 చదవండి : ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత